breaking news
protest
-
రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి
సాక్షి, అనకాపల్లి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చారని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఎన్నికలకు ముందు రాజయ్యపేట గ్రామస్తులకు బల్క్ డ్రగ్ పార్కు రానివ్వబోనంటూ..మీ ఇంటి ఆడపడుచుగా మీకు మేలు చేస్తానంటూ చెప్పిన ప్రస్తుత హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. అధికారం రాగానే ఆందోళన చేస్తున్న వారిపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేయాలని కుయుక్తులు పన్నుతున్నారంటూ మండిపడ్డారు.బల్క్ డ్రగ్ పార్కును ఆపలేకపోతే ఆమె ముక్కు నేలకు రాసి రాజయ్యపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు చెప్పమంటేనే ఎన్నికలకు ముందు అలా చెప్పానని నిర్భయంగా వెల్లడించాలని హితవు ç³లికారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మత్స్యకారులకు బాసటరాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజయ్యపేట ప్రజలకు, మత్స్యకారులకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది.శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక సమన్వయకర్త కంబాల జోగులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు మత్స్యకారులను కలిసి బాసటగా నిలిచారు.వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం వారిపై చేస్తున్న వేధింపులను, వారి సమస్యలను మత్స్యకారులు వివరించారు.మాజీ సీఎం వైఎస్ జగన్తోనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి నేతలు స్పందిస్తూ ఇటీవల నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు వచ్చిన వైఎస్ జగన్ దృష్టికి బల్క్ డ్రగ్ పార్కు సమస్యను మత్స్యకారులు తీసుకువెళ్లడం వల్లే ఆయన తమను పంపారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనేమత్స్యకారులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ మాఫీ చేస్తామని భరోసానిచ్చారు.‘‘ఏ ప్రాంతానికి పరిశ్రమలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.. అయితే ఆ పరిశ్రమల ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేదిలా ఉండాలి. వారిని ఒప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే మా పార్టీ అభిమతం’’ అని చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులపై ఎదురుదాడి తగదన్నారు. రాజయ్యపేటలో 3 వేల మంది పోలీసులను మోహరించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య అని నిరసించారు. రైతులు టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. అచ్యుతాపురం సెజ్లో కూడా ప్రజలను ఒప్పించి భూసేకరణ చేశామని, రణస్థలం, బొబ్బిలి వంటిప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతాల రైతులను ఒప్పించే భూసేకరణ చేశామని పేర్కొన్నారు.మత్స్యకారులకు సమాధానం చెప్పాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని హోంమంత్రి అనిత యత్నిస్తున్నారని విమర్శించారు. అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమానికి మద్దతు తెలిపి ఇప్పుడు మరోలా మాట్లాడడం సరికాదన్నారు. మత్స్యకారుల అభ్యంతరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మత్స్యకారులు ఆందోళనకు మద్దతిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను గృహనిర్భంధం చేశారని, తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతుంటుందని చెప్పారు. -
బంగ్లాదేశ్లో మళ్లీ జనాగ్రహం
ఢాకా: బంగ్లాదేశ్లో జనం మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం రాజధాని ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీసుకొచి్చన ‘జూలై నేషనల్ చార్టర్’ను వారు వ్యతిరేకించారు. ఈ చార్టర్లో తమ సమస్యలను ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన పోరాటంలో చాలామంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. బాధితులను ఆదుకోవడంపై ‘జూలై నేషనల్ చార్టర్’ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల జనాగ్రహం వ్యక్తమైంది. శుక్రవారమే ఈ చార్టర్పై పార్లమెంట్ భవనంలో సంతకాలు జరగాల్సి ఉంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన నిరసనకారులు, వారి కుటుంబ సభ్యులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. తమను అధికారికంగా గుర్తించి, చట్టపరంగా రక్షణ కల్పించాలనిచ ఆర్థిక సాయం అందించాలని, పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని, ఈ అంశాన్ని చార్టర్లో చేర్చాలని నినదించారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఫరీ్నచర్కు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ప్రజల ఆందోళన నేపత్యంలో కొన్ని రాజకీయ పార్టీలు చార్టర్పై సంతకాల కార్యక్రమానికి హాజరు కాలేదు. కీలకమైన నేషనల్ సిటిజెన్ పార్టీ సైతం దూరంగా ఉంది. నూతన బంగ్లాదేశ్ జననం: యూనస్ జూలై నేషనల్ చార్టర్(జాయింట్ డిక్లరేషన్)పై సంతకంతో నూతన బంగ్లాదేశ్ జని్మంచిందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. చార్టర్పై వివిధ రాజకీయ పారీ్టల నేతలు సంతకాలు చేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్–ఇ–ఇస్లామ్ నేతలు సంతకాలు చేసినట్లు తెలిసింది. ‘జూలై యోధులకు’దేశం రుణపడి ఉందని మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. ఏమిటీ చార్టర్? మహమ్మద్ యూనస్ నియమించిన నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వివిధ రాజకీయ పారీ్టలతో చర్చించి ‘జూలై నేషనల్ చార్టర్’ను రూపొంచింది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పారీ్టతో మాత్రం చర్చించలేదు. 2024 జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైన నేపథ్యంలో దీనికి జూలై నేషనల్ చార్టర్ అని పేరుపెట్టారు. రాజ్యాంగ సవరణలు, చట్టపరమైన మార్పులు, తీసుకురావాల్సిన కొత్త చట్టాలు వంటి వివరాలను ఇందులో పొందుపర్చారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడి మరణించివారి కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ఇచ్చేలా చార్టర్లో ఒక సవరణ చేసినట్లు నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వెల్లడించింది. -
తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్లో విపక్ష మహాఘట్ బంధన్లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.పది మంది అభ్యర్థులకు సింబల్ పంపిణీ చేసింది కాంగ్రెస్. ఆ ఫొటోలను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేగింది.బీహార్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఖాన్లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.బీహార్లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అయితే.. विधानसभा क्षेत्र - बिक्रम सेINDIA गठबंधन समर्थित कांग्रेस उम्मीदवार श्री अनिल कुमार जी को अनंत बधाई एवं शुभकामनाएं!जीत रहा है INDIA ✊ pic.twitter.com/au4idsuiOm— Bihar Congress (@INCBihar) October 15, 2025ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్ అహ్మద్ ఖాన్ను కార్యకర్తలు రౌండప్ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.Congressmen clash at Patna airport, causing uproar over ticket dispute #Patna #Airport #Congress बिहार कांग्रेस के कार्यकर्ता पटना एयरपोर्ट पर टिकट बंटवारे से नाराज़! कृष्णा अल्लावरू, राजेश राम के सामने पहुंचे, लेकिन पप्पू यादव समर्थकों से भिड़ंत। गोली नहीं चली, यही बड़ी बात! pic.twitter.com/cpMcx35U5C— DVN TV (@dvntvnews) October 16, 2025ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్! -
మంత్రి అండ దండలతో ఖాకీ కరప్షన్
-
ఇక నేనే అధ్యక్షుడిని.. సైనిక నేత మైఖేల్ వెల్లడి
ఆంటనానారివో: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్లో(Madagascar) అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన మిలటరీ కమాండర్, కల్నల్ మైఖేల్ ర్యాండ్రియానిరినా(Randrianirina) బుధవారం తన మనసులోని మాట బయటపెట్టారు. త్వరలో దేశాధ్యక్షునిగా(Madagascar President) పగ్గాలు చేపట్టబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు.జెన్ జెడ్ యువత(Gen Z) నేతృత్వంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారడంతో ప్రాణభయంతో అధ్యక్షుడు రాజోలీనా విదేశానికి పారిపోయారు. రాజోలీనా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్ చెప్పారు. మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్శాట్ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలీనా చేతులెత్తేయడం తెలిసిందే. ‘‘నిన్ననే మేం వాస్తవానికి బాధ్యతలు తీసుకోవాల్సింది. దేశంలో అధ్యక్షుడు లేడు. సెనేట్లోనూ అధ్యక్షుడి జాడ లేదు. అసలు ప్రభుత్వమే లేదు. అందుకే త్వరలో మేం నూతన ప్రధానికి నియమిస్తాం’’అని మైఖేల్ వ్యాఖ్యానించారు.అయితే ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనే మైఖేల్ స్పష్టంచేయలేదు. సెనేట్, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్ ఇప్పటికే జాతీయ రేడియోలో ప్రకటించారు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్ల పాలిటపడింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటికొరత, విద్యుత్ సంక్షోభం, అమాంతం పెరిగిన అవినీతితో జెన్జెడ్ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది. -
‘మోదీకి మా బాధ తెలియాలి..’ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల ఆందోళన
సాక్షి, కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో వేళ.. న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో, ఫ్లకార్డుతో నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధేంటో తెలియజేసుకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వాళ్లు కోరుతున్నారు.సుగాలి ప్రీతిపై అఘత్యానికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలి(Sugali Preethi Case News). అసలు లోకేష్ రెడ్ బుక్లో వాళ్ల పేర్లు లేవా?. మా కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలి అంటూ ఫ్లకార్డలతో నినాదాలు చేశారు. మరోవైపు.. తమకు న్యాయం చేయాలని, తమ గోడను ప్రధాని మోదీకి వినిపించే అవకాశాన్ని కల్పించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వేడుకుంటున్నారు. 2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతిబాయి మృతి చెందింది. అయితే.. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ ప్రీతి కుటుంబానికి అందాయి. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఆ అంశం ముందుకు కదల్లేదు. ఈలోపు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఈ కేసు విపరీతమైన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అయితే తాజాగా బాధిత కుటుంబం కూటమి పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆందోళనకు దిగిన నేపథ్యంలో.. ప్రభుత్వం దిగి వచ్చి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఇదిలా ఉంటే.. న్యాయం చేస్తానని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేశారని పార్వతి ఆరోపిస్తున్నారు(Sugali Preethi Mother Slams Pawan Kalyan). అంతేకాదు.. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్కు మా ఉసురు తగులుతుంది’’ అని వాపోయారామె. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రేపు(అక్టోబర్ 16న) కర్నూలుకు రానున్నారు(PM Modi AP Kurnool Tour). ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ను మోదీ అప్పాయింట్మెంట్ ఇప్పించాలని పార్వతి విజ్ఞప్తి చేశారు. అయితే.. అవతలి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. ఇదీ చదవండి: న్యాయం గెలిచింది.. కూటమికి గట్టి దెబ్బ -
నారా నకిలీ మద్యంపై YSRCP ఉద్యమం
-
YSRCP రణభేరి కూటమిలో భయం.. భయం
-
బాలకృష్ణకు బిగ్ షాక్.. చుట్టుముట్టిన హిందూపురం మహిళలు
సాక్షి, చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం(hindupur) టీడీపీ(TDP) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు(nandamuri Balakrishna) నిరసన సెగ తగిలింది. ఆదివారం ఆయన చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో పర్యటించగా.. బాలకృష్ణను స్థానిక మహిళలు చుట్టుముట్టారు. తమ సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు.. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కొందరు, పింఛన్ రాలేదని మరికొందరు నిలదీశారు. బాడుగ ఇంట్లో ఉంటున్నాం. మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు. వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిన బాలకృష్ణ.. ‘ఇస్తాం’ అంటూ మాట దాటవేశారు. మహిళలు అడిగిన వాటిపై సరిగా స్పందించని బాలకృష్ణ.. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు అంటూ పథకాలను ప్రస్తావించారు. అవేవీ వినిపించుకోని మహిళలు మళ్లీ మళ్లీ అడగడంతో ఏదైనా జరుగుతుందేమోనని ఆలోచించిన టీడీపీ నేతలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తాము చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని వారు చెప్పినా మహిళలు వినకపోవడంతో చివరకు బాలకృష్ణ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఇది కూడా చదవండి: కోటా వినుత డ్రైవర్ హత్య కేసులో మరో ట్విస్ట్.. -
భగ్గుమన్న మత్స్యకారులు
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మరో కరేడుగా మారింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేయాలంటూ ఆదివారం వేలాది మంది మత్స్యకారులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. సుమారు 4 గంటల పాటు కోల్కతా–చెన్నై జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మత్స్యకారుల ఆందోళనతో సుమారు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే... నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో 2,200 ఎకరాల్లో ప్రభుత్వం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పార్క్ ఏర్పాటైతే ఇక్కడ వందలాది ప్రమాదకర రసాయన పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేస్తారని, ఫలితంగా ఈ ప్రాంతమంతా కాలుష్యమయం అవుతుందని మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ రాజయ్యపేట మత్స్యకారులు 29 రోజులుగా గ్రామంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఆందోళనకు పోలీసులు అనేక అడ్డంకులు కల్పిస్తున్నారంటూ మత్స్యకారులు ఆవేదనతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో 15 రోజుల క్రితం పనుల్ని అడ్డుకున్నారు. హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టడంతో గత నెల 30న హోంమంత్రి అనిత గ్రామంలోకి వచ్చారు. మంత్రిని కూడా అడ్డుకుని ఘెరావ్ చేశారు. మత్స్యకారుల డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని, పనులు తాత్కాలికంగా నిలిపివేయిస్తానని హామీ ఇచ్చి, అక్కడినుంచి ఆమె వచ్చేశారు. గ్రామం నుంచి 30 మంది కమిటీగా వస్తే సీఎం దగ్గరకు తీసుకెళ్తానని ప్రకటించారు. ఇది జరిగి 15 రోజులు గడుస్తున్నా హోంమంత్రి నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని ఎటువంటి స్పందన లేదు. మత్స్యకారులు గ్రామంలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ రాజకీయ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానికేతరులను గ్రామంలోకి రానివ్వడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.పోలీసుల వైఖరితో విసిగివేసారి..ఆదివారం దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణను ఉపమాకలో అడ్డుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో రగిలిపోయిన మత్స్యకారులు ఆదివారం మధ్యాహ్నం నిరాహార దీక్ష శిబిరం నుంచి 6 కిలోమీటర్ల దూరం ర్యాలీగా వెళ్లి నక్కపల్లి జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. మార్గంమధ్యలో పోలీసులు మత్స్యకారులను ట్రాక్టర్లు, ఐరన్ స్టాపర్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నప్పటికీ వాటిని «తొలగించుకుంటూ వందలాది మంది మహిళలు, మత్స్యకారులు జాతీయ రహదారిపై ఉపమాక జంక్షన్ వద్ద ధర్నాకు దిగారు.డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళనతక్షణమే బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేయాలని ఆందోళనకు దిగిన మత్స్యకారులు డిమాండ్ చేశారు. మత్స్యకారులు, నాయకులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని, రాజయ్యపేటలో అమల్లో ఉన్న 144వ సెక్షన్ ఎత్తివేయాలని, మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ పార్టీల నాయకులను అడ్డుకోవడానికి వీల్లేదని, ర్యాలీ సందర్భంగా మహిళలపై దౌర్జన్యం చేసి గాయపర్చిన ఎస్.రాయవరం సీఐ లొడ్డు రామకృçష్ణను, నక్కపల్లి ఎస్ఐ సన్నిబాబును సస్పెండ్ చేయాలని పోలీసులు అడ్డుకున్న వీసం రామకృష్ణను తక్షణమే ఆందోళన వద్దకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వందలాది మంది బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, డీఎస్పీ శ్రీనివాసరావు వచ్చి మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారెవరూ పట్టించుకోలేదు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని, అంతవరకు ధర్నా విరమించే ప్రసక్తి లేదంటూ నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. సుమారు 4గంటల పాటు జాతీయ రహదారిపైనే ధర్నా చేయడంతో రెండువైపులా సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిíచిపోయాయి. ఎట్టకేలకు సాయంత్రం 5.30 గంటలకు కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్సిన్హా ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు. బుధవారం రాజయ్యపేటలో మత్స్యకారులందరితో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. -
నకిలీ మద్యం కుంభకోణం.. ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపు
తాడేపల్లి : నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేయాలనే డిమాండ్తో ఆందోళనలకు పిలుపునిచ్చింది వైఎస్సార్సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలపీఠంపై పెట్టడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదీ చదవండి: నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..? -
మిలిటెంట్ గ్రూప్ మిలియన్ మార్చ్.. అట్టుడుకుతున్న పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ను బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, ఐఎస్ఐఎస్-ఖోరాసన్, తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్ర సంస్థలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో మిలిటెంట్ గ్రూపు తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) చేపట్టిన ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రావల్పిండిలో టీఎల్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ ఆందోళన కారణంగా పాకిస్తాన్లోని పలు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రవాణా రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్థంభించిపోయింది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సున్నిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. టీఎల్పీ నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రతి చర్యగా టీఎల్పీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాల్ని ధ్వంసం చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 65 మంది TLP కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిపై శాంతి భంగం, ప్రభుత్వ ఆస్తుల నష్టం, ప్రజల రవాణాకు అడ్డంకులు కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేశారు.ఈ ఘటనపై పాక్ పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడటం తమ ప్రాధాన్యత అని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు, TLP నాయకులు తమ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. Tehreek-e-Labbaik workers forcibly took away a Pakistani police vehicle.This shows exactly how far Pakistan has fallen. Radical mobs are now ruling cities, and the state that cultivated them is watching helplessly.Chaos has become permanent.@LtGenDPPandey @EPxInsights pic.twitter.com/4rKPpPysjm— Stuti Bhagat (@StutiBhagat_) October 11, 2025 -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట... ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
-
సచివాలయ ఉద్యోగుల ‘ఆత్మగౌరవం’ భగ్నం
నెల్లూరు (పొగతోట): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు టౌన్హాల్లో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆత్మగౌరవ రొట్టె, ఆత్మగౌరవ సమావేశం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర కార్యక్రమాలకు పోలీసుల అనుమతి కోరారు. ఆత్మగౌరవ రొట్టె, కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతించకపోవడంతో ఆత్మగౌరవ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు టౌన్హాల్కు భారీగా తరలివచ్చారు. అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు సభ నిర్వహణకు అనుమతిలేదంటూ ఉద్యోగులను బయటకు పంపించేశారు. అనంతరం టౌన్హాల్ గేట్లకు తాళాలు వేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జేఏసీ నాయకులు, ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా వీఆర్సీ మైదానం వద్దకు వెళ్లాలంటూ హుకుం జారీ చేయడంతో అక్కడికి చేరుకుని నిరసన కొనసాగించారు.మా డిమాండ్లు నెరవేర్చాలిఉభయ గోదావరి జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగింది. 1,500 మంది సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.ఐక్యవేదిక చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, వలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్తో క్యాడర్ అప్గ్రేడ్ చేయాలని కోరారు. సంఘ సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్కృష్ణ, కనీ్వనర్ షేక్ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు. -
సర్వేల పేరుతో వేధింపులు.. బాబుపై తిరగబడ్డ సచివాలయ ఉద్యోగులు
-
పాక్ దళాల కాల్పుల్లో ఎనిమిది మంది నిరసనకారులు మృతి
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా మూడవ రోజు జరిగిన హింసాత్మక నిరసనల్లో బుధవారం ఎనిమిది మంది పౌరులు మరణించారు. బాగ్ జిల్లాలోని ధిర్కోట్లో నలుగురు మృతిచెందారని, ముజఫరాబాద్లో ఇద్దరు, మీర్పూర్లో ఇద్దరు మృతిచెందారని ఎన్డీటీవీ తెలిపింది. మరణించిన నిరసనకారుల సంఖ్య 10కి చేరుకుందని అధికారవర్గాలు తెలిపాయి.‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘన’పై అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత 72 గంటలుగా భారీ నిరసనలు జరగడంతోపాటు మార్కెట్లు, దుకాణాలను పూర్తిగా మూసివేశారు. రవాణా సేవలను కూడా నిలిపివేశారు. దీంతో జనజీవనం అతలాకుతలయ్యింది. బుధవారం ఉదయం నిరసనకారులు ముజఫరాబాద్లో షిప్పింగ్ కంటైనర్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో పలువులు నిరసరకారులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని జనం అటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి జనం తిరగబడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ఉద్యమాలను అణిచివేస్తోంది. అయితే ప్రజలు మరింతగా తిరగబడుతున్నారు. ఆర్మీ, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆర్మీ వాహనాలను నదుల్లోకి విసిరేస్తున్నారు.గత రెండు రోజులుగా ప్రజలు సైన్యం-పోలీసులకు ఎదురుతిరుగుతున్నారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అల్లర్లను కవర్ చేసేందుకు అక్కడి మీడియాకు అనుమతినివ్వడం లేదు. 70 ఏళ్లుగా తమను అణిచివేసి, తమ వనరుల్ని కొల్లగొడుతున్నారని, తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని నిరసనకారులు అంటున్నారు. అక్టోబర్ 1న పీఓకేలోని ముజఫరాబాద్ వరకూ లాంగ్ మార్చ్ చేపడతామని నిరసనకారులు ప్రకటించారు. -
చంచల్ గూడ జైలులో ఖైదీల నిరాహార దీక్ష?
సాక్షి,హైదరాబాద్: చంచల్ గూడ జైలులో రాజకీయ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టినట్లు ప్రజాసంఘాలు ఆరోపించాయి. జైలు అధికారుల తీరుకు నిరసనగా మావోయిస్టు ఖైదీలు నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే.. తమ జైలులో ఏడుగురు మావోయిస్టు ఖైదీలున్నారని చంచల్గూడ్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు. రొటీన్ ప్రాసెస్లో భాగంగా సోమవారం వారి బ్యారక్లను మార్చామని, అంతకు మించి ఏమీ జరగలేదని పేర్కొన్నారు. వారికి మద్దతుగా పలు ప్రజాసంఘాలు ఈరోజు ధర్నా చేశాయని, వారి తరఫున అడ్వొకేట్లు నలుగురు జైలులో పరిస్థితిని పరిశీలించారని వివరించారు. ప్రజాసంఘాల నేతలతో మావోయిస్టు ఖైదీలకు ములాఖత్ ఏర్పాటు చేశామన్నారు. -
అనిత ‘గాలి’ మాటలు.. మళ్లీ రోడ్డెక్కిన మత్స్యకారులు
సాక్షి, అనకాపల్లి జిల్లా: బల్క్ డ్రగ్ వ్యతిరేక ఆందోళనలతో మత్స్యకారులు మరోసారి రోడ్డెక్కారు. బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన లారీని మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పనులు జరగవని హొంమంత్రి ప్రకటించిన మరుసటి రోజే లారీలో ఇసుక తీసుకుని రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్ని అడ్డగించిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న బల్క్డ్రగ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా మత్స్య కారులు ఆందోళన చేపట్టారు. అయితే, దీనిపై చర్చిచేందుకు హోంమంత్రి నిన్న (సెప్టెంబర్ 29, సోమవారం) గ్రామానికి వచ్చారు. పనులు నిలిపివేస్తున్నట్టు హోం మంత్రి ప్రకటించారు. కానీ ఇవాళ లారీలో ఇసుక రావడంతో మత్స్యకారులు మండిపడ్డారు. -
పీఓకేలో తిరుగుబాటు
ముజఫరాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. నిరంకుశ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు ప్రాథమిక హక్కులు కల్పించాలని, అణచివేత చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ జనం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఓకే రాజధాని ముజఫరాబాద్లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య ఘ ర్షణ జరిగింది.హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న సాధారణ ప్రజలపై పాక్ సైన్యంతోపాటు ఐఎస్ఎస్ అండదండలున్న ముస్లిం కాన్ఫరెన్స్ సాయుధ ముష్కరులు కిరాతకంగా కాల్పులు జరిపారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్నవారిని పొట్టనపెట్టుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 22 మందికిపైగా గాయపడ్డారు. ముజఫరాబాద్ వీధులు రణరంగాన్ని తలపించాయి. హింసాకాండ దృశ్యాలు పాకిస్తాన్ వార్తా చానళ్లలో ప్రసారమయ్యాయి. తెరపైకి 38 డిమాండ్లు ప్రాథమిక హక్కుల సాధన కోసం పీఓకేలో అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమిస్తోంది. ఆదివారం నుంచి ఆందోళనలు ఉధృతంగా మారాయి. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. బంద్ పాటించారు. సోమవారం మార్కెట్లు, దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా సేవలు నిలిచిపోయాయి. ఆందోళనకారులు మొత్తం 38 డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం వాటిని నెరవేర్చేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను పాక్ ప్రభుత్వం రిజర్వ్ చేసింది.ఈ సీట్లను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ అసెంబ్లీలో కేవలం స్థానికులకే ప్రాతినిధ్యం ఉండాలని అంటున్నారు. పీఓకేలోని మాంగ్లా డ్యామ్, నీలం–జీలం ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 60 శాతానికి పాకిస్తాన్కే సరఫరా అవుతోంది. స్థానికులకు దక్కుతున్న ప్రయోజనం స్వల్పమే. ఇదే అంశం వారిలో అసంతృప్తి కలిగిస్తోంది. పీఓకేలోని వనరులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ధరలు విపరీతంగా పెరగడం జనంలో అసహనం కలిగిస్తోంది. ఇవన్నీ ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించాయి.గత 70 ఏళ్లుగా పాక్ ప్రభుత్వం తమను క్రూరంగా అణచివేస్తోందని, కనీస హక్కులు కూడా కల్పించడం లేదని అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ఆరోపించారు. ప్రజల ఓపిక నశించిందని, అందుకే పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. తమ డిమాండ్లను ఇప్పటికైనా నెరవేర్చకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు తేల్చిచెప్పారు. అణచివేత చర్యలు ప్రారంభం పీఓకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ సర్కార్ చర్యలు చేపట్టింది. భారీ సంఖ్యలో సాయుధ బలగాలను రంగంలోకి దించింది. సమీపంలోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్కు చేరుకున్నారు. పలు పట్ణణాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. వీధుల్లోకి రావొద్దని ప్రజలను హెచ్చరించారు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం. పీఓకేలో ఆందోళన కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పీఓకేలో ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పాక్ వైమానిక దళం గతవారం ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్స్లోని ఓ మారుమూల గ్రామంపై భారీస్థాయిలో విరుచుకుపడింది. చైనా ఇచ్చిన జే–17 ఫైటర్ జెట్లతో ప్రజలపై నిప్పుల వర్షం కురిపించింది. చైనాలో తయారైన ఎల్ఎస్–6 లేజర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది. ఈ దాడిలో 30 మంది సాధారణ ప్రజలు మరణించారు. అది జరిగిన వారం రోజులకే పీఓకేలో ఆందోళనలు ప్రారంభం కావడం గమనార్హం. -
నిరసనల ఎఫెక్ట్.. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ కీలక ప్రకటన
ఖాట్మాండ్: నేపాల్(Nepal) మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) కీలక ప్రకటన చేశారు. తాను దేశం వీడి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ తాజాగా మాట్లాడుతూ.. నేను ఎవరికీ భయపడను. దేశంలోనే ఉండి రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తాను. దేశంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నాను. నేను దేశం విడిచి వెళ్లిపోతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికీ వెళ్లడం లేదు. ఎటువంటి ఆధారం లేని ఈ ప్రభుత్వానికి దేశాన్ని అప్పజెప్పి తాను పారిపోతానని అనుకుంటున్నారా? అని పార్టీ యువ విభాగాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తన భద్రత, అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజల తీర్పుతో కాకుండా.. విధ్వంసం శక్తుల ద్వారా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికి కూడా తనకు బెదిరింపు మెసేజులు వస్తున్నాయన్నారు. నిరసనకారులు తన నివాసాన్ని ధ్వంసం చేయడంతో ప్రస్తుతం గుండు ప్రాంతంలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేపాల్లో అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా ఇటీవల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా జెన్-జీ(Gen Z) ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 🚨 Nepal’s former Prime Minister and CPN-UML chairman KP Sharma Oli has denied speculation about his departure, accusing the Sushila Karki-led government of trying to remove his security and official benefits amid political tensions. pic.twitter.com/CJY9PUQ4bL— Geo Strategist (@GeoStrategistX) September 29, 2025 -
Bangladesh: గిరిజన బాలికపై సామూహిక అకృత్యం.. నిరసనల్లో ముగ్గురు మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఒక బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం తీవ్ర నిరసనలకు దారి తీసింది. గిరిజన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా జమ్ము స్టూడెంట్స్ బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఆదివాసీ గిరిజనులకు, ఇక్కడ స్థిరపడిన బెంగాలీవారికి మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించినప్పటికీ ఘర్షణలు కొనసాగి, ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లోని ఖగ్రాచారీ జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన దరిమిలా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఈ హింసాకాండలో 13 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని ఢాకాలోని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖగ్రాచారీ జిల్లా కేంద్రంలో తొలుత హింస చెలరేగింది. అక్కడి చక్మా, మర్మ అనే ఆదివాసీ తెగలకు చెందినవారు శనివారం టైర్లు కాల్చివేస్తూ, చెట్ల కొమ్మలు, ఇటుకలను అడ్డుగా పెట్టి రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులతో పాటు సైనిక, పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)దళాలు గస్తీ నిర్వహించాయి. అయినప్పటికీ హింస చెలరేగింది.బాధిత బాలిక ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఒక బెంగాలీ యువకుడిని అరెస్టు చేశారు. అతను అత్యాచారం చేసిన వారిలో ఒకడని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆ యువకుడిని విచారిస్తున్నారు. కాగా గుయిమారాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారని, వారి మృతదేహాలను ఖగ్రాచారీ ఆస్పత్రిలో ఉంచారని పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ విలేకరులకు తెలిపారు. -
పాకిస్తాన్ సర్కార్కు బిగ్ షాక్.. పీవోకేలో ఆందోళనలు.. ఇంటర్నెట్ బంద్
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(POK) ఉద్రికత్త చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలను కోరుతూ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. అవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee (AAC)) నాయకత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది పౌరులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో భారీ నిరసనలు చేపట్టారు. కాగా, అవామీ యాక్షన్ కమిటీ.. 38 పాయింట్ల నిర్మాణాత్మక సంస్కరణలను డిమాండ్లను పాక్ ప్రభుత్వానికి ఇచ్చింది. పీఓకేలో మౌలిక సంస్కరణలు (Structural Reforms) తీసుకురావాలని.. తమ 38 డిమాండ్లను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ‘‘షటర్-డౌన్.. వీల్-జామ్’’ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో ముఖ్యంగా.. పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వు చేయబడిన పీవోకే అసెంబ్లీలో 12 శాసనసభ స్థానాలను రద్దు చేయాలని, ఇది ప్రాతినిధ్య పాలనను దెబ్బతీస్తుందని తెలిపింది.#BREAKING: Thousands of civilians to launch massive protests in Pakistan Occupied Kashmir (PoK) tomorrow against Pakistani Govt under leadership of Awami Action Committee. Pak forces bring thousands of troops from Punjab to crush protest. Internet shutdown from midnight in PoK. pic.twitter.com/nfeSviJHsC— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 28, 2025ఈ సందర్బంగా అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్లో మాట్లాడుతూ..‘మా ప్రచారం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదు. గత 70 సంవత్సరాలుగా మా ప్రజలకు నిరాకరించబడిన ప్రాథమిక హక్కుల కోసమే పోరాటం. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు. ఈ క్రమంలో పీవోకేలోని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ (Protests In PoK) రోడ్ల పైకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకురావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పీవోకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. పంజాబ్ నుంచి వేల సంఖ్యలో పాక్ సైనికులు అక్కడికి చేరుకున్నట్టు పౌరులు తెలిపారు. ఇక, ఆందోళనల నేపథ్యంలో పీవీకే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. చెక్ పోస్టులు, ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. Pakistani occupational forces are committing genocide in Pakistan-occupied Kashmir. @UNHumanRights remains silent. @BBCWorld @AJEnglish ignore it because it doesn’t suit their agendas. #POK #Kashmir #HumanRights pic.twitter.com/MxC1VCG6O1— Sabharwal (@GulshanKum6415) September 28, 2025 -
‘ఎవరిది రాజకీయం?..’ లోకేష్పై ఏయూ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: తమ ఆందోళనలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వార్థంతోనే విద్యార్థులు రాజకీయం చేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ లోకేష్కు ఏయూ స్టూడెంట్స్ అల్టిమేటం జారీ చేశారు. ‘‘విద్యార్థులు రాజకీయం చేస్తున్నారా? ఎవరిది రాజకీయం?. మా ఇబ్బందులు చెప్పుకోవడం స్వార్థం అవుతుందా?. వీసీ రాజకీయ ఎజెండాతోనే వచ్చినట్లు మీ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఏయూ వీసీ.. గీతం వర్సిటీ కోసం పని చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాగే మాట్లాడితే మీ ఇంటిని ముట్టడిస్తాం. తక్షణమే మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని విద్యార్థులు హెచ్చరించారు.ఏయూ విద్యార్థుల ఆందోళనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏయూ బంద్కు విద్యార్థులు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నిరసనలు కాస్త ఆందోళనలుగా మారాయి. అయితే.. స్వార్థం కోసమే విద్యార్థులు ఆందోళనకు దిగారంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. కావాలనే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆంధ్రా వర్సిటీలో రాజకీయం చేస్తున్నాయి. మణికంఠ అనే విద్యార్థి ఫిట్స్ వచ్చి మరణించాడు. ఆంబులెన్స్లో ఉన్నప్పటికీ అతని ప్రాణాలు రక్షించలేకపోయారు. అయితే దాని వెనకాల ఏదో ఉందంటూ స్టూడెంట్స్ ఆందోళనలు చేస్తున్నారు. ఇది సరికాదు. కేవలం వాళ్ల స్వార్థం కోసం వాళ్లు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.. .. వీసీ నియామకాల్లో రాజకీయం ఏం లేదు. విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటాం. ఏయూని టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని నారా లోకేష్ అన్నారు. మరోవైపు వీసీ రాజశేఖర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. విద్యార్థుల చర్చ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఒక ఉద్దేశ పూర్వక నిరసనగానే అనిపిస్తోందని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు శుక్రవారం రెండో రోజుకి చేరాయి. వీసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆఫీస్ను శుక్రవారం ఉదయం విద్యార్థులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో వాళ్లకు అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది. తమ జుట్టు పట్టుకుని లాగి పడేసి అనుచితంగా ప్రవర్తించారంటూ ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు మీడియా ఎదుట వాపోయారు. విద్యార్థుల డిమాండ్లు..ప్రతి విద్యార్థికి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలిడిస్పెన్సరీలో సౌకర్యాలను మెరుగుపరచాలిఆక్సిజన్ సిలిండర్స్ ను అందుబాటులో ఉంచాలిచనిపోయిన మణికంఠ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలివారం రోజుల్లో హామీలపై స్పష్టత ఇవ్వాలి.. లేదంటే విసీ రాజీనామా చేయాలివిద్యార్థుల డిమాండ్లతో పాటు విద్యార్థులు సమస్యలపై త్రీ మెన్ కమిటీ ఏర్పాటుకు వీసీ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. విద్యార్థులు తమ డిమాండ్లను నిర్ణీత కాలపరిమితిలో నెరవేరుస్తామని రాసివ్వాలని కోరగా.. అందుకు వీసీ రాజశేఖర్ అంగీకరించలేదు. అలాగే పదవికి రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.గత ఏడాది కాలంగా ఏయూలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. అయినా వర్సిటీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీఈడీ స్టూడెంట్ మణికంఠ మృతి చెందడం, ఈ మరణానికి అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తుండడంతో ఆ నిరసనలు ఆందోళనల రూపం దాల్చాయి. మరో వీసీ నియామకం వెనుక రాజకీయాలు నడిచాయన్న ఆరోపణలనూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో వీసీ వైఖరి కారణంగానే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. -
లేహ్ లద్దాక్లో హైటెన్షన్.. బీజేపీ కార్యాలయానికి నిప్పు
ఢిల్లీ: లద్దాఖ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లేహ్లోని బీజేపీ కార్యాలయంతో పాటు పోలీసు వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పు అంటించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో దీంతో బాష్పవాయువు ప్రయోగించి పోలీసులు.. నిరసనకారులను చెదరగొట్టారు.నలుగురి మృతి..నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్ చేస్తున్న నిరసనకారులు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆందోళన చేస్తున్నామంటున్నారు. నగరంలో ఉద్రిక్తంగా మారిన నిరసనల నేపథ్యంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడినట్లు తెలిపారు.#WATCH | Leh, Ladakh: BJP Office in Leh set on fire during a massive protest by the people of Ladakh demanding statehoothe d and the inclusion of Ladakh under the Sixth Schedule turned into clashes with Police. https://t.co/yQTyrMUK7q pic.twitter.com/x4VqkV8tdd— ANI (@ANI) September 24, 2025జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో.. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్తో ఆందోళనకారులు లేహ్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. -
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు షాక్
-
మా ఎమ్మెల్యే ఎక్కడ?.. పవన్ పై తిరగబడ్డ ఉప్పాడ మత్స్యకారులు
-
CI బెదిరింపులు.. తగ్గేదేలే అంటున్న విద్యార్థులు
-
జార్ఖండ్లో కుర్మీల రైల్ రోకో
రాంచీ: జార్ఖండ్లో శనివారం కుర్మీలు ఇచ్చిన రైల్ రోకో పిలుపు ప్రభావం 100కు పైగా రైళ్ల రాకపోకలపై పడింది. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్, తూర్పు సెంట్రల్ రైల్వే ధన్బాద్ల పరిధిలోని వేర్వేరు స్టేషన్ల పరిధిలో కుర్మీల ఆందోళన కొనసాగుతోంది. నిషేధం ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ ఆందోళనకారులు పట్టాలపై బైటాయించారు. తమ కుర్మలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని, కుర్మీలకు షెడ్యూల్ తెగల హోదా ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి వేళ కూడా ఆందోళన కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేర్చేదాకా విరమించేది లేదని ఆదివాసీ కుర్మీ సమాజ్ నేత ఓపీ మహతో స్పష్టం చేశారు. కు ర్మీలను 1931లో ఎస్టీల జాబితా నుంచి తొలగించారని, అప్పటి నుంచి పోరాడుతున్నా డిమాండ్ నెరవేరలేదని సంఘం మరో నేత షీతల్ ఓహదార్ చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామంటూ సమర్థించుకున్నారు. వీరికి పలు రాజకీయ పా ర్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. ఆందోళనల కారణంగా తూర్పు సెంట్రల్ రైల్వే ధన్బాద్ డివిజన్ పరిధిలో 25 ప్రయాణికుల రైళ్లను రద్దు చేశామని, మరో 24 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్ పరిధిలో వందేభారత్, రాజధాని ఎక్స్ప్రెస్ సహా 12 రైళ్లను రద్దు చేసి, 11 రైళ్లను దారి మళ్లించామన్నారు. మరికొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించామన్నారు. ఆందోళనల కారణంగా రైళ్లు నిలిచిపోవడంతో వేలాదిగా ప్రయాణికులు ఎక్కడివారక్కడే చిక్కుబడిపోయారు. టాటా–పట్నా వందేభారత్ రైలులోని వందలాది మంది ప్రయాణికులు రాంచీలోని మురి స్టేషన్లో ఉండిపోయారు. ఈ రైలును అధికారులు రద్దు చేసిన విషయం తెలిసి ప్రయాణికులు గగ్గోలు మొదలుపెట్టారు. కాగా, కుర్మీల నిరసన చట్ట విరుద్ధం, అప్రజాస్వామికమంటూ వివిధ గిరిజన సంఘాలు రాంచీలోని రాజ్భవన్ ఎదుట నిరసన తెలిపాయి. అసలైన గిరిజనుల హక్కులను లాక్కునేందుకు కుర్మీలు ప్రయతి్నస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్లో జెన్జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జనాగ్రహం... చంద్రబాబు కూటమి సర్కార్ నిర్ణయంపై వెల్లువెత్తిన నిరసన
-
భయపడ్డ చంద్రబాబు.. ఇంత మంది పోలీసులా..
-
Watch Live: ఛలో మెడికల్ కాలేజ్
-
ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, వెలగపూడి: ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో ఆ శాంతియుత ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ర్యాలీని కవరేజ్ చేస్తున్న మీడియాపైనా పోలీసులు దౌర్జన్యానికి దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట
-
గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం
-
న్యాయం కోసం రోడ్డెక్కిన ‘సంగం’ మృతుల కుటుంబాలు
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నెల్లూరులోని ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద ఇద్దరి మృతదేహాలతో కుటుంబ సభ్యులు గురువారం నిరసన చేపట్టారు. పెరమన వద్ద కారును ఇసుక టిప్పర్ అతివేగంగా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇందుకూరుపేటకు చెందిన వారితోపాటు నెల్లూరులోని 16వ డివిజన్ గుర్రాలమడుగు సంగానికి చెందిన శేషం చినబాలవెంగయ్య, సారమ్మ ఉన్నారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడంతో నగరానికి చెందిన ఇద్దరి మృతదేహాలతో వారి కుటుంబసభ్యులు ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు అంత్యక్రియలు చేసేది లేదని భీషి్మంచారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సీపీఎం నగర శాఖ కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, మృతిచెందిన వారంతా నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన వారని చెప్పారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి మృతుల కుటుంబాలకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం డబ్బుల్లేవన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మృతుల కుటుంబాలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.5 లక్షలతో సరిపెట్టిన ప్రభుత్వం రోడ్డుపై మృతదేహాలతో నిరసన విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. దీంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఇదే విషయాన్ని నెల్లూరు అర్బన్ తహసీల్దార్ వచ్చి మృతుల కుటుంబాలకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన మృతుడు చినబాలగంగయ్య కుమార్తె ఎనిమిదేళ్ల అశ్విని తహసీల్దార్ను, పోలీసు అధికారులను నిలదీసింది. ఉదయం నుంచి తన తండ్రి మృతదేహాన్ని ఎండలో పెట్టుకొని బాధపడుతుంటే ఇప్పటివరకు ఏం చేస్తున్నారని అశ్విని ప్రశ్నించింది. తన తండ్రి బతికున్న సమయంలో తమ కోసం కష్టపడి ఎండలో పనిచేసేవారని, మరణించాక కూడా మృతదేహాన్ని ఎండలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో తమ చదువులు, భవిష్యత్తు బాగుపడతాయా? అని నిలదీసింది. కారు నంబర్తో టిప్పర్కు టింకరింగ్.. ఇది పోలీసుల కవరింగ్» నెల్లూరు జిల్లా టిప్పర్ ప్రమాద ఘటనలో దోషుల్ని తప్పించేందుకు యత్నం » ఏడుగుర్ని బలిగొన్న టీడీపీ నేత ఇసుక టిప్పర్.. ప్రమాదానికి గురైన కారు నంబర్ను టిప్పర్ నంబర్గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ » టిప్పర్ డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన ఎస్పీ.. పరారయ్యారంటున్న పోలీసులు.. మంత్రి ‘ఆనం’ అనుచరులకు పోలీసులు వత్తాసు సంగం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై టీడీపీ నేతకు చెందిన ఇసుక టిప్పర్ బుధవారం రాంగ్ రూట్లో వేగంగా వచ్చి కారును ఢీకొట్టి ఏడుగురిని బలిగొన్న ఘటనలో పోలీసుల తీరు విస్తుగొలుపుతోంది. ఈ కేçసును తారుమారు చేసేందుకు యతి్నస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టిప్పర్ డ్రైవర్ సంగం పోలీస్స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి లొంగిపోయాడని జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ప్రకటించారు. అయితే.. తెల్లవారేసరికి అదే టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని సంగం పోలీసులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను నిబంధనల ప్రకారం తక్షణమే వైద్య పరీక్షలకు పంపించాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు పంపితే టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే విషయం బయటపడుతుందనే భయంతో పోలీసులపై మంత్రి ఆనంరామనారాయణరెడ్డి అనుచరులు ఒత్తిడి తెచ్చి డ్రైవర్ అరెస్ట్ కాలేదంటూ నాటకమాడిస్తున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. తప్పుల తడకగా ఎఫ్ఐఆర్ ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను సైతం పోలీసులు సక్రమంగా రాయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఎఫ్ఐఆర్లో ఏ–1గా టిప్పర్ డ్రైవర్ను చూపించారు. ఇసుక టిప్పర్ నంబర్ను ఏపీ 40 హెచ్జీ 0758గా నమోదు చేశారు. నిజానికి ఈ నంబర్ టిప్పర్ది కాదు. ప్రమాదానికి గురైన కారుది. అంటే కారు నంబర్ను టిప్పర్ నంబర్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఏ–2గా టిప్పర్ యజమాని అని రాసి, అక్కడా టిప్పర్ నంబర్కు బదులుగా కారు నంబర్నే రాశారు. టిప్పర్ నంబర్ ఏపీ 39 డబ్యూహెచ్ 1695 కాగా.. ఈ నంబర్ను ఎఫ్ఐఆర్లో ఎక్కడా చూపకపోవడం గమనార్హం. కాగా, మృతుల్లో ఒకరైన తాళ్లూరు శ్రీనివాసులు సోదరుడు సాయిచైతన్య ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్, యజమాని, ఇసుక అక్రమ రవాణాదారు బుజ్జయ్యనాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
చంద్రబాబు సర్కార్పై భగ్గుమన్న ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ
సాక్షి, అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్పై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ భగ్గుమంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి నిధుల నిలిపివేతపై నిరసనకారులు మండిపడ్డారు. భారీ ర్యాలీతో కలెక్టరేట్ను ముట్టడించారు. నిరసన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థపై ఎందుకు కక్ష సాధింపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీటీ స్వచ్చంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీయేలో భాగస్వామి అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిరసన కారుల ధ్వజమెత్తారు. -
కూటమి సర్కార్కు ప్రజలే బుద్ధి చెబుతారు: స్టీల్ ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. తమ జీతాలు తక్షణమే చెల్లించాలంటూ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర నిరసనకు దిగారు. కంచాలతో భిక్షాటన చేస్తూ కార్మికులు నిరసన తెలిపారు. జీతాలు ఇవ్వకపోవడం వలన పిల్లలకు తిండి పెట్టలేక పోతున్నామని.. ఫీజులు కట్టలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ను కాపాడతామన్నారు. కార్మికులు అర్ధాకలితో ఉంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి’’ అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు హెచ్చరించారు. -
బ్రిటన్లో ఉద్రిక్తత.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
లండన్: బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్షల మంది పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలతో బ్రిటన్ నాశనం అవుతోంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.బ్రిటన్లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్బంగా వీడియోలో మాట్లాడుతూ.. ‘భారీగా, అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోంది. వలసల కారణంగా హింస పెరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుంది. ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే. మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు.. అని వారికి మద్దతు ఇచ్చారు. చివరగా.. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నాను’ అని కామెంట్స్ చేశారు.📢 Massive protests in London today! Tens of thousands at "Unite the Kingdom" rally for free speech & anti-immigration, with reports of hundreds of thousands or even 1M+ attendees. 🇬🇧 #LondonProtests #UKNews pic.twitter.com/AD0OjUZjuy— Socially Trendy (@SociallyTrendyX) September 13, 2025 ఇదిలా ఉండగా.. శనివారం సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది. ఈ సందర్భంగా ప్రజలందరూ..‘మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి వంటి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక, ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్-రైట్ కార్యకర్త టామీ రాబిన్సన్ నిర్వహించిన 'యునైట్ ది కింగ్డమ్' ర్యాలీ హింసాత్మకంగా మారింది. వలస విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనల్లో 26 మంది పోలీసు అధికారులు గాయపడగా, 25 మందిని అరెస్ట్ చేశారు.#BREAKING: Anti-immigration protesters clash with "Stand Up To Racism" counter-demonstrators in London, marching toward Westminster. Heavy police presence deployed to keep groups apart amid tense standoff in Whitehall. #LondonProtests #UKNews pic.twitter.com/ibaKsRxVF5— Uma Shankar✍️ (@umashankermedia) September 13, 2025మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో, సుమారు 1,10,000 నుంచి 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది నిరసనకారులు అదుపుతప్పి పోలీసులపై బాటిళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి వర్గాల నిరసనకారులను వేరుచేయడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. ఈ దాడుల్లో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో 'స్టాండ్ అప్ టు రేసిజం' సంస్థ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో వలసదారులకు మద్దతుగా మరో ప్రదర్శన కూడా జరిగింది. Police try to stop #UniteTheKingdom protesters going the route the police GAVE them to walk but the British heavily outnumbering the police push through the line. British men are waking up, they don't fear police. #TommyRobinson #london #reform pic.twitter.com/JEMP5pDX4K— Jamie (@Jamie69660989) September 13, 2025 -
నేపాల్ నిరసనల్లో భారతీయ మహిళ మృతి
-
ఈ నెపో కిడ్స్ విలాసాలు.. చూస్తే మతిపోవాల్సిందే!
నేపాల్లో యువత ఆందోళనలు, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. గత వారంరోజులుగా సోషల్ మీడియాలో సమాంతరంగా ఇంకో ట్రెండ్ నడుస్తోంది. అదే పొలిటికల్ నెపో కిడ్స్కు వ్యతిరేకంగా సాగుతున్న క్యాంపెయిన్. అందుకే పరిశీలకులు.. నేపాల్ ఆందోళలను కేవలం అవినీతి వ్యతిరేక పోరాటంగానే కాకుండా యువత పట్ల గద్దెదిగిన ప్రభుత్వపు నిర్లక్ష్యం, సామాజిక అసమానతలపైనా తిరుగుబాటుగానూ విశ్లేషిస్తున్నారు. నెపో కిడ్స్.. నేపాల్ జనరేషన్ జెడ్ ఉద్యమానికి కేంద్ర బిందువైందన్న విషయం ఆశ్చర్యం కలిగించేదే. ఒకవైపు దేశంలో యువత నిరుద్యోగం, ఆయా కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతుంటే.. మరోవైపు రాజకీయ నేతల పిల్లలు మాత్రం విలాసాలకు పోయారు. సోషల్ మీడియా అకౌంట్లలో.. లక్షల రూపాయల విలువైన దుస్తులు, బ్యాగులు ధరించి ఫోజులు, విదేశీ విహారాలు, విలాసవంతమైన జీవనశైలిని రీల్స్.. ఫొటోల రూపంలో ప్రదర్శించుకున్నారు. ఈ హెచ్చుతగ్గులపై నేతలను నిలదీసేందుకు యువత అదను కోసం ఎదురు చూసింది. అప్పటిదాకా అవినీతిపైనే పోరాటం చేయాలనుకున్న వాళ్లకు.. సరిగ్గా ఆ సమయంలో సోషల్ మీడియా బ్యాన్ రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది.నేపాల్ ఆందోళనలతో అక్కడి యువతకు నెపో కిడ్స్ వ్యవహారాన్ని ప్రశ్నించేందుకు సరైన సమయం దక్కింది. తొలుత అందుబాటులో ఉన్న టిక్టాక్ లాంటి కొద్ది ప్లాట్ఫారమ్లలో వాళ్ల లైఫ్స్టైల్ను ఏకిపారేశారు. బ్యాన్ ఎత్తేశాక.. ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, ఎక్స్ వంటి ప్లాట్ఫారమ్లలో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అలా.. #NepoBabiesNepal అనే హ్యాష్ట్యాగ్ మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ జాబితాలో.. మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి కుమార్తె శ్రింఖల ఖటీవాడ, సింగర్.. మాజీ ప్రధాని షేర్ బహాదూర్ డెఉబా కోడలు శివానా శ్రేష్ఠ, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ "ప్రచండ" మనవరాలు స్మితా దహాల్, గండకి ప్రావిన్స్కు మాజీ మంత్రి బిందు కుమార్ థాపా కొడుకు సౌగత్ థాపాలు.. ఇలా మరికొందరిని తెరపైకి తెచ్చారు. అక్కడి కరెన్సీ ప్రకారం.. వీళ్లు వాడే వస్తువులు అత్యంత ఖరీదైనవే కావడంతో యువతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.వాళ్ల ఒంటి మీద దుస్తుల దగ్గరి నుంచి, వాళ్లు వాడే కార్లు, బ్యాగులు, పర్ఫ్యూములు, చివరకు ఆహార విషయంలోనూ ప్రదర్శించే విలాసాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ల వాళ్ల నివాసాలపై దాడులు చేసినప్పుడు ఆ లగ్జరీ వస్తువుల్ని కొందరు ఎత్తుకెళ్లిపోయారు. మరికొందరు ఆకతాయిలు ఆ లగ్జరీ గూడ్స్ను చూపిస్తూ.. ‘‘చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటూ’’ సెటైర్లు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో కొందరు తమ అకౌంట్లను, పేజీలను క్లోజ్ చేసేశారు. మరికొందరు పోస్టులు చేయకుండా ఉండిపోయారు. దాడులు చేస్తారనే భయంతో.. ఈ తరహా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో నేతల పిల్లల ఆస్తులపైనా దర్యాప్తు జరిపించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలా మొదలై..అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత.. ముఖ్యంగా Gen Z చేపట్టిన ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది. పోలీసుల వల్ల కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇది హింసాత్మకంగా మారడంతో.. 31 మంది ఆందోళనకారులు మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామం.. జెన్జెడ్కు మరింత ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్న నినాదంతో.. కేబినెట్ మంత్రులు, మాజీ నేతల ఇళ్లపై దాడులకు దిగి తగలబెట్టారు. దొరికిన వాళ్లను దొరికినట్లు చితకబాదారు. దీంతో.. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సంక్షోభం తలెత్తినవేళ.. పరిస్థితి అదుపు తప్పకూడదనే ఉద్దేశంతో సైన్యం రంగంలోకి దిగింది. రాజధాని ఖాట్మండు సహా ప్రధాన నగరాల్లో కర్ఫ్యూలు విధించి పహారా కాస్తోంది. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఉద్యమకారుల నేతలకు మధ్య ఉండి ప్రభుత్వ ఏర్పాటు చర్చలను సైన్యమే ముందుకు తీసుకెళ్తోంది. రాజ్యాంగాన్ని తిరగరాసి సుపరిపాలన దిశగా అడుగు పడాలని, గత మూడు దశాబ్దాలుగా పాలకులు పాల్పడిన అవినీతిపై విచారణకు జరిపించాలని, అలాగే పోరాటంలో మరణించిన వాళ్లను అమరవీరులుగా గుర్తించి వాళ్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని జెన్జెడ్ యువత డిమాండ్లు చేస్తుండడం తెలిసిందే.పేదల బతుకులు చీకట్లతో తడిసిన వేళ..వెలుగుల్లో నేతల వారసులు విలాసాలు ఆరబోశారు! ఆవేదన అగ్గిలా మారి.. సమానత్వం కోసం గళం విప్పిందిఇక చాలు!" అని యువత నినదించగా.. పాలకుల పీఠాలు ఖాళీ అయ్యాయి.ఇది నేపాల్ ఉద్యమం కాదు.. అక్కడి ఒక తరం గుండె చప్పుడు -
అన్నంలో పురుగులు.. విద్యార్థినుల ఆందోళన
నార్నూర్: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం అల్పాహారంగా అందించిన పులిహోరలో పురుగులు రావడంతో విద్యార్థినులంతా తినకుండా ప్లేట్లను పక్కన పెట్టారు. పాఠశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న ఎంఈవో పవార్ అనిత అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు వినిపించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఐటీడీఏ పీవో, డీఈవో ఖుష్బుగుప్తా ఫోన్లో వారితో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని, నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమీపంలోని వేరే వసతి గృహం నుంచి సరుకులు తెచ్చి వెంటనే వండి విద్యార్థినులకు పెట్టాలని ఆమె ఎంఈవోను ఆదేశించారు. అయితే రెండోసారి ఉప్మా అందించగా.. అందులో కూడా పురుగులు రావడంతో విద్యార్థినులు మరోసారి ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం భోజనం పెట్డడం లేదని, రోజూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు తెలిపారు. సమస్యను ఎస్వో హిమబిందు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పాఠశాలను సందర్శించిన సబ్కలెక్టర్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఉట్నూర్ సబ్కలెక్టర్ యువరాజ్ మార్మట్ కేజీబీవీని సందర్శించారు. వంట గది, సరుకులను పరిశీలించారు. నాసిరకం కూరగాయలతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై ఎస్వో హిమబిందుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్తినులు శాంతించారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న ఆదివాసీ గిరిజన విద్యార్థి సంఘం, జైభారత్, రాజ్గోండ్ సేవా సమితి, తుడుందెబ్బ, బీజేపీ నాయకులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న సమయంలో జీసీడీవో ఉదయశ్రీ జోక్యం చేసుకుని వారిని లోపలికి ఎందుకు వచ్చారని అనడంతో వారంతా ఆందోళనకు దిగారు. సబ్ కలెక్టర్ వారితో మాట్లాడి నచ్చజెప్పారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
నేపాల్ సంక్షోభం నుంచి నేర్వవలసిన పాఠం!
‘కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని కొన్ని దశాబ్దాలకిందట ఆక్రోశించాడు ఓ సినీకవి. ఈ జెనరేషన్ కుర్రాళ్లంతా ఇంతే.. ఏదీ పట్టదు,, పక్కవాళ్ల గురించి పట్టించుకోరు.. సమాజం గురించి ఆలోచించారు.. తమ సొంత ప్రపంచంలోనే ముడుక్కుని ఉండిపోతుంటారు.. అని విలపించేవాళ్లు, మనకు ప్రతిరోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తుంటారు. కానీ.. యువతరం గురించి ఇలాంటి అభిప్రాయాలన్నీ అపోహలే! వారిలో చైతన్యం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సజీవంగానే ఉంది. ఉంటుంది. కాకపోతే.. దానిని జ్వాలగా రాజేసే సరైన నిప్పుకణిక ఉన్నప్పుడు.. జ్వాలలు రేగుతాయి. ప్రభుత్వాలలోనూ వేడిపుట్టిస్తాయి.‘సోషల్ మీడియా’ అనే పదం వినగానే చాలామంది ఏదో బూతు పదాన్ని విన్నట్లుగా మొహం గంటు పెట్టుకుంటారు. ఇక యువతరం విషయంలో అయితే- సోషల్ మీడియా అనేది వారిని సమూలంగా సర్వనాశనం చేస్తున్న విషపురుగు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాటల్ని ఏకపక్షంగా సమర్ధించలేం. కొట్టి పారేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వేస్తున్న వెర్రి తలలు ప్రతిరోజు వార్తల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా విశృంఖల రూపాలు వాడుక లోకి రావడం ప్రమాదకరమైన సంకేతం.అదే సమయంలో యువతరానికి సోషల్ మీడియా చేస్తున్న మేలు గురించి కూడా గమనించాలి. నేపాల్ వంటి దేశాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో యువతరం ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడడం జరుగుతూ వస్తోంది. బతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారు కూడా అనేకులు. అలాంటి వారందరికీ స్వదేశంలోని తమ సొంత వాళ్లతో కనీసం అప్పుడప్పుడు అయినా మాట్లాడుకోవడానికి, అనుబంధాలను నెమరు వేసుకోవడానికి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి వారికి దొరికే ఏకైక మార్గం సోషల్ మీడియా మాత్రమే. నేపాల్ లో మరీ దారుణంగా వాట్స్అప్ యూట్యూబ్ వంటి వాటిని కూడా నిషేధిస్తూ వచ్చిన ఉత్తర్వులు పెద్ద అగ్నిజ్వాలలనే పుట్టించాయి. యువతలో పెల్లుబికిన ఆగ్రహాన్ని అణచివేయడానికి ప్రభుత్వం మిలిటరీని ప్రయోగించడం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలితీసుకుంది. ప్రధాని ఓలి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆగ్రహజ్వాలలు సర్కారీ పెద్దల భవనాలకు అంటుకుని.. ప్రాణాలనూ బలితీసుకున్నాయి. ఇంకా చాలా చాలా జరిగాయి.స్థూలంగా గమనించినప్పుడు.. తొలుత అనుకున్న సంగతిని మనం సమీక్షించుకోవాల్సి వస్తుంది. ఇవాళ్టి యువతరం నిజంగానే నిస్తేజంగా ఉంటున్నదా? పోరాట పటిమ, ఉద్యమ స్ఫూర్తి వారిలో కొరవడిందా? అలాంటి సందేహాలకు అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే.. అవన్నీ యువతరంలో సజీవంగానే ఉన్నాయని.. సరైన సమయంలో వాటిని ప్రదర్శించడానికి యువతరం ఏమాత్రమే వెనుకాడే పరిస్థితి లేదని ఈ నేపాల్ దృష్టాంతం నిరూపిస్తోంది. పదిహేనేళ్ల కిందటి మధ్యప్రాచ్య దేశాలను కుదిపేసిన ఉద్యమం అరబ్ స్ప్రింగ్ ను ఇది గుర్తుకు తెస్తోంది. 2011లో టునీషియాలో సోషల్ మీడియా అణచివేతకు వ్యతిరేకంగా రాజుకున్న పోరాటం ఈజిప్టు నుంచి లిబియా వరకు అన్ని దేశాలను కుదిపేసింది. నేపాల్ ఇవాళ అదే పునరావృతం అయింది. జెన్ జీ యువతరం సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వాన్ని తల్లకిందులు చేసింది.యువతరంలో పోరాట స్ఫూర్తి లేదని అనుకోవడం సరికాదు. సోషల్ మీడియాకు యువత వ్యసన పరులు అయ్యారని, అందువల్లనే వారంతా ఇలాంటి తిరుగుబాటుకు ఒడిగట్టారని ఏకపక్షమైన వాదన సరికాదు. రోడ్డు మీదికి వచ్చి పోరాడిన వాళ్లు, ప్రాణాలు అర్పించిన వాళ్లు కేవలం రీల్స్ చేసుకోవడం మీదనో, చూడడం మీదనో మోజు ఉన్నవాళ్లు మాత్రమే కాదు. ఇలాంటి నిషేధాజ్ఞలతో వ్యక్తి స్వేచ్ఛను హరించేయాలని అనుకుంటున్న నియంతృత్వపు పోకడలను ఈసడించుకున్న వాళ్లు మాత్రమే అనేది గుర్తించాలి. స్వేచ్ఛ పట్ల ఇవాళ్టి యువతరంలో ఉండే మమకారాన్ని తెలుసుకోవాలి. నిజానికి నేపాల్ లో చెలరేగిన తిరుగుబాటు, విధ్వంసకాండ.. భారతదేశంలోనూ అనేక రాష్ట్రాల పాలకులకు కనువిప్పు కలిగించాలి. నిషేధాల వంటి జోలికి ఇక్కడి పాలకులు ఇంకా దృష్టి సారించడం లేదు. సోషల్ మీడియాను తాము కూడా వాడుకుంటున్నారు. కాకపోతే.. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపునకు ఈ చట్టాలను, సోషల్ మీడియా బూచిగా వాడుకుంటున్నారు. పాలకుల, ఇలాంటి దుర్మార్గపు పోకడలు కామన్ మ్యాన్ కు కూడా ఏదో ఒక రోజున ఆగ్రహం తెప్పిస్తాయి. అలాంటప్పడు.. ఆ ప్రభుత్వాలు భస్మీపటలం కాక తప్పదు. నేపాల్ తరహా తిరుగుబాటు ఇక్కడ వస్తుందని కాదు.. కానీ.. ప్రజాస్వామికంగానే ఆ పతనం నిర్దేశం అవుతుంది.:::ఎం. రాజేశ్వరి -
ఫ్రాన్స్లో ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ ఉద్యమం..200 మందికి పైగా అరెస్టు
పారిస్: ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో ఆందోళన చేస్తున్న నిరసన కారుల్ని ఫ్రాన్స్ నూతన ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను అరెస్టు చేయిస్తున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున బలగాల్ని మోహరించారు. పలు వ్యవస్థల్ని స్తంభించేందుకు ప్రయత్నిస్తున్న వందలమందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ అరెస్టులను మరింత ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రాన్స్లో సైతం నేపాల్ తరహా రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ ఆ దేశ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో దేశ ప్రజల కోసం వివిధ పథకాల్లో కేటాయించే బడ్జెట్లో 43.8 బిలియన్ డాలర్లు కోత విధించారు. దీంతో పాటు రెండు రోజుల నేషనల్ హాలిడేస్ను రద్దుచేయడం, పెన్షన్లలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని ఫ్రాంకోయి బేరౌ తీసుకున్న నిర్ణయం ఫ్రాన్స్ దేశప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చింది. ఆ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఆగస్టు నెలలో సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్లు నిర్వహించారు. ఆ తర్వాత చాపకింద నీరులా సెప్టెంబర్ నెలనుంచి బహిరంగంగా ఆందోళన బాటపట్టారు. ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో మొదలు పెట్టిన ఆందోళన తారాస్థాయికి చేరింది. రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపచేసే లక్ష్యంగా నిరసల్ని మరింత ఉదృతం చేశారు. ఫలితంగా ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని భావించిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.. ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌను పదవి నుంచి తొలగించారు. నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియమించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ లెకోర్ను.. ఆందోళనల్ని అరికట్టేందుకు ఎక్కడిక్కడే ఆందోళన కారుల్ని అరెస్టు చేస్తున్నారు. అరెస్టులు, భద్రతా చర్యలు నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించారు. పారిస్ సహా ప్రధాన నగరాల్లో పోలీసులు భారీగా మోహరించి, శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు కాగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ లెకర్నో స్పందించారు.దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకుంటామని, శాంతియుతంగా పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. -
Magazine Story: నేపాల్ ప్రధాని రాజీనామా వెనుక 36 ఏళ్ల యువకుడు
-
బాబు సర్కార్ అంతానికి ఆరంభం ఇదే..!
-
దేశ ఆర్ధిక మంత్రిని.. ఫుట్బాల్ తన్నినట్లు తన్నారు.. వీడియో వైరల్
కాఠ్మాండూ: నేపాల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఆర్థిక మంత్రి బర్షమాన్ పున్పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి పున్ను జెన్జీ ఆందోళనకారులు వెంటపడిమరీ దాడి చేశారు. ఆందోళ కారుల్లో ఓ వ్యక్తి పున్ను ఫుట్బాల్ తన్నినట్లు తన్నారు. ఆ ఊహించిన పరిణామంతో పున్ ఎగిరి అవుతలపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న బర్షమాన్ పున్ ఇటీవల ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ క్రమంలో ఆయనపై ప్రజలు తమ కోపాన్ని వ్యక్తం చేశారు.వీడియోలో మంత్రి పున్ ఒక వీధిలో నడుస్తుండగా, కొంతమంది వ్యక్తులు ఆయనను వెంబడిస్తూ తిడుతూ,దేహశుద్ధి చేశారు. భద్రతా సిబ్బంది ఆయనను రక్షించేందుకు ప్రయత్నించినా, ఆగ్రహంతో రగిలిపోతున్న ఆందోళన కారుల నుంచి రక్షించేందుకు విశ్వప్రయాత్నాలు చేశారు. చివరకు వారి చేతుల్లో బర్షమాన్ పున్ ప్రాణాలు కోల్పోకుండా కాపాడగలిగారు. ఈ ఘటనపై నేపాల్ రాజకీయ వర్గాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పిలుపు కూడా వినిపిస్తోంది. Finance minister of NEPAL got an unexpected kick from common people of Nepal.pic.twitter.com/mMZRsU9tFj— Karthik Reddy (@mbkartikreddy) September 9, 2025 -
ప్రధాని రాజీనామా.. నేపాల్లో సైనిక పాలన?
నేపాల్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. యువత(Gen Z) హింసాత్మక ఆందోళనలకు దిగొచ్చిన కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనను సురక్షితంగా దేశం దాటించాలనే షరతు మీద ఆయన సైన్యం చెప్పింది చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ యువతకు కోపం తెప్పించింది. ఇది అవినీతిని ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమేనంటూ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు దిగింది. అదే సమయంలో నేపాల్ నేతల వారసుల విలాసాలపైనా అందుబాటులో ఉన్న టిక్టాక్ లాంటి ప్లాట్ఫారమ్ల ద్వారా నిలదీసింది. ఈ క్రమంలో సోమవారం ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సైన్యాన్ని రంగంలోకి దించినా.. పరిస్థితి ఏమాత్రం చల్లారలేదు. ఖాట్మండు సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో 19 మంది మరణించారు. దీంతో.. రాత్రికి రాత్రే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే.. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసినప్పటికీ.. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా ఆందోళనకారులు తమ నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో.. ఖాట్మండులోని అధ్యక్ష భవనం శీతల్ నివాస్తో పాటు ప్రధాని ఓలీ నివాసం, కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించడంతో పాటు వాటికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో దాడి దృశ్యాలు.. నెట్టింటకు చేరాయి. అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రైవేట్ నివాసంతో పాటు నేపాల్ కాంగ్రెస్ భవనం, పలువురు నేతల ఇళ్లనూ నిరసనకారులు వదల్లేదు. అదే సమయంలో.. STORY | Nepal PM Oli resignsNepalese Prime Minister KP Sharma Oli resigned on Tuesday in the face of massive anti-government protests rocking the country, officials said.READ: https://t.co/LE58GQHabT https://t.co/dTpjUA8U6U— Press Trust of India (@PTI_News) September 9, 2025అంతేకాదు ఆయన కార్యాలయంలోకి ఆందోళనకారులు చొరబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా మంత్రులు రాజీనామా చేయడం.. హింసాత్మక ఆందోళనలు మరింత ఉధృతరం కావడం, అదే సమయంలో సైన్యం ఒత్తిడితో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. నేపాల్లో సైనిక పాలనా?.. లేకుంటే కొత్త ప్రధానిని ఎన్నుకుంటారా? అనే దానిపై సాయంత్రం లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.Nepal PM Oli resigned after hundreds of protesters entered his office: Officials.— Press Trust of India (@PTI_News) September 9, 2025 Nepal PM Oli's house attacked amid the protests!#Nepalprotest #NepalProtests #Nepal pic.twitter.com/AhS5mtupiO— The-Pulse (@ThePulseIndia) September 9, 2025తాజా పరిస్థితుల దృష్ట్యా ఖాట్మండులో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ ఆ దేశాలను ధిక్కరిస్తూ నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ సాయంత్రం ఆల్పార్టీ మీటింగ్కు పిలుపు ఇచ్చిన ప్రధాని ఓలీ..ఈలోపే అనూహ్య నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రధాని ఓలీకి వరుస దెబ్బలుఆందోళనలు కొనసాగుతున్న సమయంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి రాజకీయంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేశ్ లేఖక్ సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆపై పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి ప్రకటించారు. తాజా యువత ఆందోళనలకు మద్దతుగా నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ రాజీనామా చేశారు. అయితే ఈ వరుస రాజీనామాలను యువత పట్టించుకోలేదు. కర్ఫ్యూ, ఆంక్షలను చేధించుకుని మరీ వెళ్లి రాజీనామా చేసినవాళ్లతో పాటు ఇతర నేతల ఇళ్లకు నిప్పంటిస్తూ వస్తున్నారు. పలువురు నేతల నివాసాలతో పాటు వాళ్ల ప్రైవేట్ ఆస్తులకూ నిరసనకారులు నిప్పుపెట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భారతీయులకు అడ్వైజరీనేపాల్ ఆందోళనల దృష్ట్యా భారతీయులకు భారత విదేశాంగశాఖ ఓ అడ్వైజరీ జారీ చేసింది. ‘‘నేపాల్లో జరుగుతున్న పరిణామాలను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. ఖాట్మాండు సహా నేపాల్లోని ఇతర నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించినట్లు గమనించాం. అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. అక్కడి అధికారుల సూచనలు అనుసరిస్తూ.. నేపాల్లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలి’’ అని విదేశాంగశాఖ పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం శాంతియుత మార్గాలు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. -
Nepal: సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
ఖాట్మండు: హిమాలయ దేశం నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ, అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు చెలరేగాయి. పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని, 20మంది మృతి చెందారు. ఈ పరిణామాల నేపధ్యంలో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్తో పాటు రెడిట్, ఫేస్బుక్, ఎక్స్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లను, సైట్లను నిషేధించటంపై నేపాల్ యువత భగ్గుమంది. కాలేజీ, స్కూలు యూనిఫారాల్లో సోమవారం రోడ్లపైకి వచ్చిన యువత... దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవటంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20 మంది వరకూ మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. 1997–2012 మధ్య పుట్టిన యువత (జనరేషన్– జెడ్) మొబైల్ ఫోన్లు చేతికి వచ్చిన దగ్గర్నుంచి పెద్దగా నియంత్రణలేవీ ఎదుర్కోలేదు. వీరికి చదువుకోవటానికైనా, సంపాదనకైనా, సంభా షించుకోవటానికైనా సోషల్ మీడియాయే ఆధారమైపోయింది. జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. అలాంటిది ఒక్కసారిగా టిక్టాక్, వైబర్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లనూ నిషేధించటంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 4న నిషేధం విధించటంతో... దానికి వ్యతిరేకంగా టిక్టాక్లో చర్చ మొదలైంది. ఆ చర్చ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతివైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, బంధుప్రీతి ఎక్కువైందని, నేతల కొడుకులు, కూతుళ్లు రాజ్యమేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటి ఫలితంగా సోమవారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన యువత... ‘నిషేధించాల్సింది అవినీతిని... సోషల్ మీడియాను కాదు’అని ప్లకార్డులు చూపిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పార్లమెంటు వద్ద, మైటీఘర్ మండల వద్ద భారీగా గుమికూడారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన భద్రతా బలగాలు పలుచోట్ల కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాజధాని ఖట్మండు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కాగా ఈ నిరసనలు సోషల్ మీడియా నిషేధంపై జెన్–జెడ్ చేస్తున్నవి మాత్రమే కాదని, ప్రభుత్వ అవినీతిపై అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనల్ని నేపాల్ జాతీయ మానవహక్కుల సంఘం ఖండించింది. నిరసనకారుల మాట వినాలని, రాజకీయంగా తటస్థ వైఖరి అవసరమని పేర్కొంటూ ఖట్మండు మేయర్ బాలెన్ షా ఆందోళనకారులకు మద్దతు పలికారు. ప్రధానంగా పార్లమెంటు వద్దే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా నిరసనకారులు వాటిని తోసుకుంటూ ముందుకొచ్చారు. వారిని నిలువరించడానికి పోలీసులు భాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ గందరగోళం మధ్యలోనే కొందరు నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు. పార్లమెంటు గేట్లను ధ్వంసం చేశారు. ఈ దశలో పోలీసులు కాల్పులు జరిపారు. -
కల్లోలంగా నేపాల్.. అసలేం జరుగుతోంది? వాళ్ల డిమాండ్లేంటి??
నేపాల్లో అక్కడి జెడ్ జనరేషన్ మొదలుపెట్టిన ఉద్యమం(Gen-Z Protest) అదుపు తప్పింది. సోషల్ మీడియా నిషేధం, అవినీతి వ్యతిరేకంగా ఖాట్మాండులో కొనసాగుతున్న ఆందోళనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఇప్పటిదాకా 20 మంది మరణించగా.. వంద మందికి పైగా గాయాలయ్యాయి. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.నేపాల్ రాజధాని ఖాట్మాండులో జెడ్ జనరేషన్ యువత పెద్ద ఎత్తున అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై నిరసనకు దిగారు. అయితే ఇది కేవలం ఖాట్మాండుకే పరిమితం కాలేదు. పోఖరా, బుట్వాల్, ధరణ్, ఘోరాహీ వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఆందోళనకారులు పార్లమెంట్ వద్ద బారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో పలు చోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ భారీగా ప్రయోగించడంతో.. పలువురు మృతి చెందారు. నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రధాని కె.పి. శర్మ ఓలి స్వస్థలం ధమాక్కూ ఈ నిరసనలు విస్తరించాయి.ఆందోళన వెనుక కారణాలుకిందటి ఏడాది ఆగస్టు/సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీం కోర్టు.. అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు కావాలి అని ఆదేశించింది. స్థానిక ప్రతినిధిని నియమించాలని, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్.. కంప్లయన్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలొచ్చాయి. ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆపై ఆగస్టు 27న చివరికి.. 7 రోజుల గడువుతో అధికారిక నోటీసు ఇచ్చింది. చివరకు సెప్టెంబర్ 4న 26 అప్లికేషన్లను(యాప్లను) బ్లాక్ చేసి పడేసింది.అభ్యంతరాలు అందుకే..ప్రభుత్వ చర్యలను Gen-Z యువత సెన్సార్షిప్గా, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో నేపాల్లో కోర్టు తీర్పు ప్రకారం రిజిస్టర్ అయిన టిక్టాక్ లాంటి ప్లాట్ఫారమ్ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో.. రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. పొలిటికల్ నెపోటిజానికి తాను వ్యతిరేకమని చాటి చెబుతున్నారు. నేతల పిల్లలకేమో బంగారు భవిష్యత్తు అని.. మరి తమ పరిస్థితి ఏంటని? నిలదీస్తున్నారు. ఈ క్రమంలో.. రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొసమెరుపు ఏంటంటే.. టిక్టాక్ను కిందటి ఏడాది నేపాల్ బ్యాన్ చేసింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరించడంతో ఆ బ్యాన్ను ఎత్తేసింది. ఇప్పుడు అదే ప్లాట్ఫారమ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉవ్వెత్తున సాగేలా చేస్తోంది.ప్రభుత్వం స్పందననియమిత నమోదు లేకుండా పనిచేస్తున్న సంస్థలను నిషేధించడమే ఉద్దేశం అని ప్రభుత్వం చెబుతోంది.స్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాం అని అంటోంది. నిరసనల్లో.. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, రబ్బర్ తూటాలు ప్రయోగించారు. పలు చోట్ల కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టులు గాయపడ్డారు. ఖాట్మాండు బనేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని నివాస ప్రాంతాల వరకు విస్తరించబడింది. ఖాట్మండు పోస్ట్ కథనం ప్రకారం.. నేపాల్లో కోటి 35 లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు ఉన్నారు. 36 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. వ్యాపారాలపై కోసం చాలామంది ఆధారపడి ఉన్నారు. అలా.. బ్యాన్ నేపథ్యంలో అన్నివిధాల నిరసనలు ఊపందుకున్నాయి. Gen-Z (Generation Z) అనేది 1997 నుండి 2012 మధ్య కాలంలో జన్మించిన వ్యక్తుల తరం. జెన్ జెడ్ ఏం చెబుతోంది అంటే.. ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం కాదు, అవినీతికి వ్యతిరేకంగా మా తరం పోరాటం. ముగించాల్సింది కూడా మేమే అని ప్రకటించుకుంటోంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తేసే ఆలోచనలో నేపాల్ ప్రభుత్వం ఉన్నట్లు అక్కడి మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. -
ఇక తిరుగుబాటే..! చంద్రబాబుకు షాకిచ్చిన సచివాలయ ఉద్యోగులు..
-
మహబూబాబాద్లో ఉద్రిక్తత.. యూరియా కేంద్రంపై రాళ్ల దాడి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సూర్య థియేటర్ ఎదురుగా ఉన్న యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్లతో దాడి చేశారు. ‘మన గ్రోమోర్’ దుకాణం బోర్డు చించేసిన రైతులు.. దుకాణం ముందు కర్రలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. గోడౌన్ తాళం పగలగొట్టిన రైతులు.. యూరియా బస్తాలను బయటకు తెచ్చారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యూరియా ఇవ్వాలంటూ రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు.సూర్యాపేట జిల్లా: హుజుర్నగర్లో యూరియా కోసం క్యూలైన్లో నిలబడిన మహిళ.. స్పృహ తప్పి పడిపోయారు. ఉదయం నుంచి లైన్ లో నిలబడటంతో మహిళా రైతు దాసరి రాములమ్మ అస్వస్థతకు గురయ్యారు.రాజన్న సిరిసిల్ల జిల్లా: వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం
-
రైతులకు ఎరువులు అందేవరకు మా పోరాటం ఆగదు
-
సెక్రటేరియట్లో ఉద్యోగులు నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్యోగులు నిరసనలకు దిగారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాసేపట్లో ఉద్యోగులు సెక్రటేరియట్లోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు.. సాయంత్రం నాలుగు గంటలకు సెక్రటేరియట్లో వరదలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొననున్నారు. -
చర్చ లేకుండానే బీసీ బిల్లుకు మండలి ఆమోదం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ శాసనమండలిలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు చేరి ‘‘రాహుల్కు సీబీఐ వద్దు.. రేవంత్కు సీబీఐ ముద్దు’’ అంటూ నినాదాలు చేశారు. ఆ ఆందోళనల నడుమే బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్ 2025 బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. అయితే.. ఈ పరిణామంతో బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. కాళేశ్వరం ప్రతులను చించేసి మండలి చైర్మన్ మీదకు విసిరేశారు. దీంతో.. మంత్రి పొన్నం బీఆర్ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఫ్యూడలిస్ట్ పార్టీ. బీసీల అంశం చర్చకు వస్తె.. ఇలా అడ్డుపడటం సరికాదు. బీసీల పట్ల వాళ్లకున్న గౌరవం, వైఖరి స్పష్టమవుతోంది. సమాజం వాళ్లను గమనిస్తోంది. 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోకండి. సర్వేలో కూడా పాల్గొనలేదు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇలా అడ్డుకోవడం ఏం పద్ధతి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీ పార్టీకి బీసీ రిజర్వేషన్లు ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఇలా అడ్డుకునే కుట్ర మాత్రం దౌర్భాగ్యం అని మంత్రి పొన్నం అన్నారు. సభలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్ఎస్కు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో వాళ్ల బంధం తెగిపోయింది. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టిఆర్ఎస్కు తెలంగాణ మాట పలికే అర్హతను కోల్పోయింది అని అన్నారామె.అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగడంతో.. చర్చ లేకుండానే పంచాయతీ చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. -
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
సెక్రటేరియట్ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా
-
సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ పర్యటనకు నిరసన సెగ
-
ఎమ్మెల్యే శ్రావణి మాకొద్దు.. టీడీపీలో తిరుగుబాటు
-
చివరకి మమ్మల్ని బిచ్చగాళ్లును చేసావ్.. చంద్రబాబుని ఏకిపారేసిన ఆటో డ్రైవర్లు
-
టాలీవుడ్ లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర
-
ఎయిత్ స్టూడెంట్ చేతిలో టెన్త్ విద్యార్థి హతం.. ప్రజాగ్రహంతో స్కూలు ధ్వంసం
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఏదో వివాదంలో ఎనిమిదో తరగతి.. విద్యార్థి పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడవగా, బాధిత విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం బయటకు పొక్కినంతనే ప్రజాగ్రహం పెల్లుబికి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆగ్రహంతో రగిలిపోతూ కొందరు ఆందోళనకారులు పాఠశాలను ధ్వంసం చేశారు.మణినగర్ ఈస్ట్లోని సెవెంత్ డే అడ్వాంటేజ్ చర్చి స్కూల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థి 10వ తరగతి విద్యార్థిని కత్తితో పొడిచాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆ విద్యార్థి మరణించాడు. అనంతరం బాధిత కుటుంబంతో పాటు సింధీ వర్గానికి చెందినవారంతా ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించిన నిరసనకారులు పాఠశాల సిబ్బందిపై దాడి చేశారు. సమీపంలో పార్క్ చేసిన పాఠశాల బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులతో పాఠశాల ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులు పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పాఠశాల వెలుపల రోడ్డును దిగ్బంధించారు.మణినగర్ ఎమ్మెల్యే, డీపీపీ బల్దేవ్ దేశాయ్, ఏసీపీ పరిస్థితిని చక్కదిద్దడాని ప్రయత్నించారు. బజరంగ్ దళ్, బీహెచ్పీ, అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులు ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. -
సర్కారీ ఉద్యోగుల జంగ్ సైరన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. టీఎన్జీవో భవన్లో మంగళవారం జేఏసీ విస్తృత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మిక, పెన్షనర్లకు చెందిన 206 సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబర్ 12న లక్ష మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని జేఏసీ సమావేశం తీర్మానించింది.సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా మొదలయ్యే ఆందోళన, జిల్లాల్లో బస్సు యాత్రలు చేపట్టాలని, అంతిమంగా జంగ్ సైరన్తో చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని నిర్ణయించింది. 63 డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను జేఏసీ ఖరారు చేసింది. సమావేశ వివరాలను జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. ప్రభుత్వంపై నమ్మకం పోయింది ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలిచి్చన ప్రభుత్వం రెండేళ్లవుతున్నా ఉద్యోగుల సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని మారం జగదీశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ సబ్ కమిటీల చుట్టూ తిరిగినా ప్రయోజనం కన్పింంచలేదన్నారు. రెండేళ్లయినా పీఆర్సీ కమిటీ నివేదిక ఏమైందో తెలియదన్నారు. జేఏసీ నేతలు వెళ్లినా గుర్తుపట్టలేని స్థితిలో మంత్రులు ఉండటం దారుణమన్నారు. ప్రతి నెలా 1న వేతనం ఇవ్వడమే గొప్పగా చెబుతున్న ప్రభుత్వం, తాము కష్టపడి పనిచేస్తేనే జీతం ఇస్తున్నారనే వాస్తవాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు.ప్రభుత్వం నుంచి బకాయిలు రాక, ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితి వచి్చందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అంటే పిల్లనివ్వడానికి వెనుకాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి, ఓపిక నశించి, రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నామని జగదీశ్వర్ తెలిపారు. లక్ష్యం నెరవేరే వరకూ ఎవరికీ భయపడేది లేదన్నారు. ఉద్యోగుల వాణి విన్పింస్తాం రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ ఏకం చేస్తామని, తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోందని, తాము కూడా వారి ఆగ్రహాన్ని కట్టడి చేయలేమన్నారు. సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సును హైదరాబాద్లో చేపడతామని తెలిపారు. వచ్చేనెల 8 నుంచి జిల్లాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో పలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల, గెజిటెడ్ అధికారుల సంఘాలు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవీ..పెండింగ్లో ఉన్న 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలి. ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకం నిబంధనలు రూపొందించాలి. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు ఆదేశాలివ్వాలి. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి. గచి్చ»ౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించాలి. శాఖల్లో పదోన్నతుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి. -
MLA దగ్గుపాటి ప్రసాద్ కు వ్యతిరేకంగా NTR అభిమానుల ఆందోళన
-
చిరంజీవి వద్దకు ఫిల్మ్ ఇండస్ట్రీ పంచాయితీ
-
TDP నేతలు తనను వేధిస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రిన్సిపల్ సౌమ్య
-
బాబు చేతగానితనం.. బస్సుకోసం రోడ్డెక్కిన చిన్నారులు
-
షూటింగులు బంద్.. పెద్ది సినిమాకు ఎఫెక్ట్
-
30 శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తాం: సినీ కార్మికులు
-
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడి హేయమైన చర్య: మేయర్ డాక్టర్ శిరీష
-
పార్లమెంట్లో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని బుధవారం నిలదీశాయి. నిరసన వ్యక్తంచేశాయి. వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. లోక్సభ ఉదయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని, సభకు సహకరించాలని స్పీకర్స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దాంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు, నిరసనలు యథాతథంగా కొనసాగాయి. చేసేది లేక సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు దిలీప్ సైకియా ప్రకటించారు. అంతకుముందు లోక్సభలో మర్చంట్ షిప్పింగ్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఎస్ఐఆర్పై చర్చించే ప్రసక్తే లేదు: రిజిజు ఎస్ఐఆర్పై లోక్సభలో చర్చించే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. ఆయన బుధవారం సభలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. అందుకే సభలో చర్చించలేమని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను చర్చించేందుకు పార్లమెంట్ నియమ నిబంధనలు ఒప్పుకోవని స్పష్టంచేశారు. అలాగే స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం కార్యకలాపాల గురించి సభలో చర్చ చేపట్టడం సాధ్యం కాదని ఉద్ఘాటించారు. రాజ్యసభలోనూ అదే అలజడి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్లమెంట్ ఎగవ సభలోనూ అలజడి కొనసాగింది. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఎస్ఐఆర్పై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రూల్ 267 కింద 35 నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. సభలో నినాదాలు, నిరసనలు మిన్నంటాయి. సభను హరివంశ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు కొనసాగించారు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండగానే, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్కు సంబంధించిన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ను సభలో ప్రవేశపెట్టారు. తర్వాత ‘క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు–2025’మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో స్వల్ప చర్చ జరిగింది. మరోవైపు విపక్షాలు ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ చైర్మన్ పోడియంపైకి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా వెల్లడించారు. -
బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్, ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందన్నారు. సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలని ఆశించారు.‘సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది.కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్డేగా ప్రకటించారు. జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల ఆత్మగౌరవ పోరాటం ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు పెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి. ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.బీజేపీ కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాం. ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాం. తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు. తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం?. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి’ అని తెలిపారు -
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. అడ్డుకున్న పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా కవర్ చేయకుండా పోలీసులు.. మీడియాను అడ్డుకుంటున్నారు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం వద్ద ధర్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాగా, శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా కవర్ చేయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. -
జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కృష్ణాజిల్లా: జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాననని మోసం చేసిన ఘటనపై బాధితులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులను నిండా ముంచేసిన బాలశౌరి పీఏ గోపాల్ సింగ్.. కోటిన్నర రూపాయలు వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 60 మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేశారు గోపాల్ సింగ్.గతంలో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన ఎంపీ పీఏ గోపాల్సింగ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అపాయింట్మెంట్ లెటర్ల గడువు ముగిశాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విజయవాడలోని నోవాటెల్కు వస్తే మళ్లీ కొత్తగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తానని నమ్మించాడు గోపాల్ సింగ్.దాంతో నిన్న (శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) నోవాటెల్ హోటల్కు బాధితులు వెళ్లగా, అక్కడకు గోపాల్ సింగ్ రాలేదు. ఈ నేపథ్యంలో మోసపోయామని గుర్తించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎంపీ కార్యాలయం వద్ద ఆందోళన చేయకూడదని వారిని పోలీసులు బెదిరింపులకు దిగారు. -
పాములు, కుక్కలతో వినూత్న నిరసన
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు పాములు.. మరో వైపు కుక్కలతో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ కార్మికులు సోమవారం విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో వెటర్నరీ కారి్మకులకు కౌన్సిల్ తీర్మానం 36 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 53 మంది కార్మికులు ఏళ్ల తరబడి పాములు, కుక్కలను పట్టుకుంటున్నారని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ విశాఖ పౌరుల భద్రత కాపాడుతున్నారని, కానీ వారి జీతాలు అతి తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని, 2024 డిసెంబర్ 11న కౌన్సిల్ సమావేశంలో వారికి ఆరోగ్య అలవెన్స్ రూ.6 వేలు పెంచుతూ తీర్మానించారని తెలిపారు. ఏడు నెలలైనా వారికి పెంచిన జీతాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏడు నెలల బకాయిలతోపాటు పెంచిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రిజిస్ట్రార్ను నిలదీసిన అభిషేక్ తల్లిదండ్రులు
సాక్షి, విశాఖపట్నం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏయూ స్టూడెంట్ అభిషేక్ను పరామర్శించడానికి ఏయూ రిజిస్ట్రార్కు షాక్ తగిలింది. రిజిస్ట్రార్ను అభిషేక్ తల్లి నిలదీశారు. రిజిస్ట్రార్ కారుకి అడ్డంగా కూర్చుని అభిషేక్ తల్లిదండ్రులు నిరసన తెలిపారు. అభిషేక్ చావును చూసేందుకు వచ్చారా అంటూ అధికారులను అభిషేక్ కుటుంబ సభ్యులు కడిగి పారేశారు.‘‘ఏయూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు యత్నించాడు. అభిషేక్ను ప్రొఫెసర్ తీవ్రంగా వేధించాడు. వేధింపులకు పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించాలి’’ అని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అభిషేక్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇస్తేనే కదలనిస్తామంటూ అభిషేక్ తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో అభిషేక్ తల్లిదండ్రులపై ఆర్ట్స్ కాలేజీ హెచ్వోడీ జాలాది రవి బెదిరింపులకు దిగారు.పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్ తీసుకెళ్లినందుకు ఓ ప్రొఫెసర్ కక్షగట్టి, తన విద్యా సంవత్సరాన్ని నష్టపరిచారని ఆరోపిస్తూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విద్యార్థి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఏయూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.బాధితుడి కథనం ప్రకారం.. ఏయూలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అభిõÙక్ (22).. ఈ ఏడాది ఏప్రిల్లో మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు రాశాడు. అప్పటికే మ్యాథ్స్–2, డీఎల్డీ, డీఎస్సీ పరీక్షలను బాగా రాశానని విద్యార్థి తెలిపాడు. నాల్గోదైన ఫిజిక్స్ పరీక్ష రాస్తుండగా.. తన జేబులోని స్మార్ట్ఫోన్ కింద పడిపోయింది. అది గమనించిన ఇన్విజిలేటర్ ప్రొఫెసర్ పాల్.. తాను కాపీ కొడుతున్నానని భావించి, ఫోన్ లాక్కుని తనను బయటకు పంపించారని అభిషేక్ తెలిపాడు. ‘తెలియక చేసిన తప్పు సార్, క్షమించండి.’ అని ఎంత వేడుకున్నా ప్రొఫెసర్ కనికరించలేదన్నాడు.పరీక్ష అయిన తర్వాత సెల్ఫోన్ ఇచ్చేసి.. ‘నేనేంటో నీకు చూపిస్తా’ అంటూ బెదిరించారని వాపోయాడు. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో అభిõÙక్ రాసిన అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయినట్లు చూపించారు. అంతేకాకుండా, ‘ఈ ఏడాదికి నీకింతే.. వచ్చే ఏడాది పరీక్షలు రాసుకో’ అంటూ ఇంటికి లేఖ పంపారని అభిషేక్ కన్నీటిపర్యంతమయ్యాడు.తాను బాగా రాసిన మూడు పరీక్షలను కూడా ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి ఫెయిల్ చేయించారని, ప్రొఫెసర్ వేధింపుల వల్లే తాను విద్యా సంవత్సరం నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు అభిషేక్ తెలిపాడు. -
ధర్నా ఆపకపోతే కేసులు పెడతా..
-
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఏయూ విద్యార్ధుల నిరసన
-
ఏయూ విద్యార్థులపై రిజిస్ట్రార్ దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులపై రిజిస్ట్రార్ దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులు మీడియా ముందు సమస్యలు చెప్పుకుంటున్న సమయంలో వాళ్ల చేతుల్లోంచి మైకు లాక్కున్నారు. పూర్తిగా సమస్యలు వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారాయన. ఏయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతమైంది. పురుగుల అన్నం పెడుతున్నారని, తమ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏయూ రిజిస్ట్రార్కు నిరసన సెగ తాకింది. గత రాత్రి నుంచి ఏయూ మెయిన్గేట్ వద్ద కొనసాగిన ఆందోళన.. ఈ ఉదయం రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. పురుగుల అన్నం మాకొద్దు.. నాణ్యమైన ఆహారం అందించాలంటూ నినాదాలు చేశారు. ఆపై రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని.. లేకుంటే వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ సమయంలో పోలీసులతో విద్యార్థులకు వాగ్వాదం జరిగింది.యూనివర్సిటీలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని, అవి మారాలంటూ కొంతకాలంగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఈ క్రమంలో గత రాత్రి నుంచి అధికారులు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అయితే అర్ధరాత్రి దాటాక ఒక దశలో ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు.. వాళ్లు వినకపోవడంతో బెదిరింపులకు దిగారు. ఏసీపీ లక్ష్మణమూర్తి తమపై కేసులు పెడతామని బెదిరించినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. అయితే.. విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్నిసార్లు చెప్పిన తమ సమస్యలపై ఏయూ అధికారులు స్పందించడం లేదని, అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేదని కుండబద్ధలు కొడుతున్నారు. -
భోజనంలో పురుగులు.. విశాఖలో రోడ్డెక్కిన ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు
-
మృగాళ్లకు అండగా తృణమూల్
దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారు నిత్యం భయంభయంగా బతకాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మృగాళ్లను ఆ పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్వాకం వల్ల బెంగాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వసూళ్ల దందా చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటించారు. చమురు, గ్యాస్, విద్యుత్, రైలు, రహదారులకు సంబంధించిన రూ.5,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గాపూర్లో బహిరంగ సభలో మాట్లాడారు. కోల్కతా ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై ఘోరంగా అత్యాచారం జరిగిందని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. ఆ అత్యాచార ఘటన పట్ల దేశమంతా కలవరపాటుకు గురైందని, ఇప్పటికీ కోలుకోలేదని అన్నారు. ఆ ఘటన మర్చిపోకముందే మరో కాలేజీలో మహిళపై అత్యాచారం జరిగిందని ఆక్షేపించారు. ఈ కేసులో నిందితుడికి తృణమూల్ కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గూండా ట్యాక్స్ ‘‘బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. ప్రజలకు రక్షణ కల్పించడంలో, న్యాయం చేకూర్చడంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ముర్షీదాబాద్లో అల్లర్లు జరిగితే పోలీసులు బాధితులనే వేధించారు. బాధ్యులను వదిలేశారు. రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశలు అడుగంటాయి. వారి ప్రాణాలకే భద్రత లేకుండాపోయింది. ఇదంతా ప్రభుత్వ నిర్వాకం కాదా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల కోసం పారిశ్రామికవేత్తలను పీడిస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతికి అడ్డు తగులుతోంది. గూండా ట్యాక్స్కు భయపడి పారిశ్రామికవేత్తలు బెంగాల్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడులు రావడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం తృణమూల్ కాంగ్రెస్కు ఎంతమాత్రం ఇష్టం లేదు. బెంగాల్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మేము సంకల్పించాం. దేశ ప్రగతికి బెంగాల్ను చోదక శక్తిగా మారుస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈశాన్య భారత అభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ మోతిహరీ: ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాలన్న నిర్ణయం బిహార్ గడ్డపైనే తీసుకున్నానని, అది ఎలా విజయవంతమైందో ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య భారతదేశ సమగ్రాభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర బహుముఖ ప్రగతికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్లో పర్యటించారు. తొలుతు తూర్పు చంపారన్ జిల్లాలో రూ.7,200 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోతిహరీ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘బనాయేంగే నయా బిహార్, ఫిర్ ఏక్బార్ ఎన్డీయే సర్కార్’ అనే నూతన నినాదం ఇచ్చారు. దీవసూళ్ల దందానిపై జనం పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని, సరికొత్త బిహార్ను నిర్మించుకుందామని మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతించారు. బిహార్లో విపక్ష కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఆర్జేడీ ప్రభుత్వం పేదల భూములు బలవంతంగా లాక్కుందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. పేదలు, అణగారినవర్గాల పేరిట కాంగ్రెస్–ఆర్జేడీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బిహార్ వెనుకబాటుతనానికి ఆ రెండు పారీ్టలే కారణమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా యువత సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గత 45 రోజుల్లో 24,000 స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. మోతిహరీని ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ పోరాటానికి బిహార్లోని చంపారన్ నూతన దిశను నిర్దేశించిందని మోదీ గుర్తుచేశారు. -
మంత్రి కొల్లు ఇంటి ముందు వైఎస్సార్సీపీ మహిళా నేతల నిరసన
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి ముందు వైఎస్సార్సీపీ మహిళా నేతలు నిరసనకు దిగారు. జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై మండిపడ్డారు. చీపుర్లతో కొల్లు రవీంద్ర ఫోటోలను కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉప్పాల హారికకు కొల్లురవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ద్రోహి కొల్లు రవీంద్ర అంటూ నినాదాలు చేశారు.మహానటి కంటే ఎక్కువ అంటే మీ ఇంట్లోవాళ్లేనా?. మీ ఇంట్లో ఆడవాళ్ల గురించైతే ఇలానే మాట్లాడతారా? అంటూ నిలదీశారు. ఉప్పాల హారిక భర్త రాముపై కేసు పెట్టడం దుర్మార్గం. తక్షణమే మంత్రి కొల్లు రవీంద్ర క్షమాపణ చెప్పాలి. ఉప్పాల హారికకు క్షమాపణ చెప్పేవరకూ మా పోరాటం ఆగదు’’ వైఎస్సార్సీపీ మహిళా నేతలు హెచ్చరించారు. -
విశాఖ: వాహన మిత్ర అమలు చేయాలంటూ ఆటో డ్రైవర్ల ర్యాలీ
సాక్షి, విశాఖపట్నం: వాహన మిత్ర అమలు చేయాలని ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. వాహన మిత్ర ద్వారా రూ.15 వేలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందని.. ఏడాది పూర్తయినా కానీ.. ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోయిందంటూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు ఇచ్చిన హామీనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆటో డ్రైవర్లు అన్నారు. ‘‘డీజిల్, పెట్రోల్ ధరలు అధికంగా పెరుగుతున్నాయి. ఆర్టీఏ అధికారులు ఆటో డ్రైవర్లను కేసులతో వేధిస్తున్నారు. రోడ్లు బాగాలేక విపరీతంగా పెట్టుబడి పెరుగుతుంది. ఆటో డ్రైవర్లు కూటమి పాలనలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆటో యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. -
Odisha Bandh: విద్యార్థిని ఆత్మాహుతికి నిరసనల వెల్లువ
భువనేశ్వర్: ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విద్యార్థినికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది ప్రతిపక్ష పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ఒడిశాలో ఈరోజు(గురువారం) బంద్ నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో రాజధాని భువనేశ్వర్లోని దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు కూడా కనిపించలేదు.రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపునకు మద్దతుగా పలువురు ప్రతిపక్ష నేతలు.. ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలు, ప్లకార్డులను పట్టుకుని రోడ్లపై నిరసన తెలిపారు. బంద్ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బృందాలను మోహరించడంతో పాటు గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ బంద్ రాజకీయాల కోసం కాదని, ఇక్కడి కుమార్తెలకు అండగా నిలిచేందుకేనని అన్నారు. ఇటువంటి నిరసన లేకపోతే ప్రతీ పాఠశాల, కళాశాలలో ఇటువంటి దుస్థితి ఏర్పడుతుందన్నారు. విద్యార్థిని ఫిర్యాదుపై చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు రాష్ట్ర విద్యా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై న్యాయ విచారణకు సీపీఐ(ఎం) నేత సురేష్ పాణిగ్రాహి పిలుపునిచ్చారు. 🚨 🚨 #BreakingNews Odisha Bandh Today, Roads Empty In Protest Over Student's Self-Immolation https://t.co/txmxD08kwBThe 20-year-old student of Fakir Mohan Autonomous College in Balasore attempted self-immolation last week after allegedly facing prolonged sexual harassment b…— Instant News ™ (@InstaBharat) July 17, 2025బాలసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని తాను కళాశాల విభాగాధిపతి నుంచి దీర్ఘకాలంగా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మృతురాలి తండ్రితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ ఘటన సమాజానికి అయిన గాయంగా రాహుల్ అభివర్ణించారు. -
సమ్మె చేస్తే ఉద్యోగం పీకేస్తా.. చంద్రబాబు బెదిరింపులు
-
కొనసాగుతున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె
-
విజయనగరం జిల్లాలో జనసేన కార్యకర్తల తిరుగుబాటు
-
మహారాష్ట్రలో ఉద్రిక్తత.. పోలీసులు అదుపులో ఎంఎన్ఎస్ కార్యకర్తలు
థానే: మహారాష్ట్రలో భాషా వివాదం అంతకంతకూ ముదురుతోంది. రాష్ట్రంలోని థానేలో చోటుచేసుకున్న ఒక బాషా వివాదంపై రాజ్థాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు థానేలో నిరసన ప్రదర్శనలు చేపట్టగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎంఎన్ఎస్ పార్టీకి నిరసన తెలిపేందుకు అనుమతి ఉన్నప్పటికీ, వారు కేటాయించిన మార్గంలో కాకుండా మరో రహదారిలో నిరసన తెలుపుతున్నందున వారిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ సమయంలో నిరసనల్లో పాల్గొన్న ఎంఎస్ఎన్ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం మరాఠీ ప్రజల మార్చ్కు అనుమతించడం లేదని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఎంఎస్ఎన్కు నిరసన ప్రదర్శనలకు ఒక నిర్ధిష్ట మార్గాన్ని కేటాయించారని, అయితే అది కాదని, వారు వేరే మార్గంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారి మార్చ్ను అడ్డుకున్నారని వివరించారు.మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు దుకాణ యజమానిపై ఇటీవల ఎంఎన్ఎస్ కార్యకర్తలు చేయిచేసుకున్నారు. దీనికి నిరసనగా వ్యాపారుల నిర్వహించిన ఆందోళనను తిప్పికొట్టేందుకు ఎంఎన్ఎస్ ఈ మార్చ్కు పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఎంఎస్ఎస్ కార్యకర్తల నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ మీరా రోడ్దులో వ్యాపారులు మార్చ్ నిర్వహించారని, తమకు ఇదే ప్రాంతంలో నిరసన నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఇక్కడ తమకు మార్చ్కు అనుమతించే వరకు విశ్రమించేది లేదని ఎంఎన్ఎస్ ముంబై అధ్యక్షుడు సందీప్ దేశ్పాండే పేర్కొన్నారు.ఇటీవల మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఒక దుకాణ యజమానిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన దరిమిలా వ్యాపారులు నిరసన చేపట్టారు. దీనిని ఖండిస్తూ ఈరోజు(మంగళవారం) ఎంఎన్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే దీనికిముందు స్థానిక ఎంఎన్ఎస్ నేత అవినాష్ జాదవ్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా రాష్టంలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడవ భాషగా చేస్తూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాషా వివాదాన్ని మరింతగా పెంచాయి. ప్రతిపక్షాలతో పాటు వివిధ భాషా సంఘాల నుండి వ్యతిరేకత వచ్చిన దరిమిలా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
టెన్షన్ @ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
-
బాబు సర్కార్ కు వ్యతిరేకంగా భారీ నిరసన
-
విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం సోమవారం చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. దీంతో.. వర్సిటీ ప్రధాన ద్వారం వద్దే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో పార్టీ నేతలు, విద్యార్థులు, యువకులు గుణదల నుంచి హెల్త్ యూనివర్సిటీ దాకా భారీగా ర్యాలీకి వచ్చారు. అయితే ఈ సమాచారంతో అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ వద్దకు చేరుకోగానే వాళ్లను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విద్యార్థి నాయకులు యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భైటాయించి నిరసన తెలుపుతున్నారు. -
తల్లికి వందనం వేస్తారా లేదా? విద్యుత్ పోలెక్కి నిరసన
-
తల్లికి వందనం కోసం టవర్ ఎక్కి నిరసన
భీమవరం: తన పిల్లలకు తల్లికి వందనం సొమ్ములు వేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన కోరుపల్లి శ్యామ్ విద్యుత్ టవర్ ఎక్కి శనివారం నిరసన తెలిపాడు. శ్యామ్, సునీత దంపతుల ఇద్దరు పిల్లలకు ప్రభుత్వం తల్లికి వందనం సొమ్ములు వేయకపోవడంతో అధికారులను ప్రశ్నించాడు. డబ్బులు జూలై 5న బ్యాంక్ ఖాతాలో పడతాయని చెప్పడంతో శనివారం వరకు వేచిచూశాడు.అయినప్పటికీ సొమ్ములు రాకపోవడంతో శ్యామ్..గరగపర్రులోని హెచ్టీ విద్యుత్ టవర్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. పోలీసులు వెళ్లి శ్యామ్ను టవర్ దిగాలని కోరారు. శ్యామ్ వినకపోవడంతో అతని భార్యతో నచ్చజెప్పించి కిందకు దిగేలా చేశారు. అతడిని పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
‘ప్రభుత్వానికి ఇగో ఏంటి?.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?’
విజయవాడ: విదేశీ వైద్య విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఇగో ఏంటో అర్థం కావడం లేదని,. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉంటే తమకు ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చేది కాదని వైఎస్సార్సీపీ వైద్య విభాగం అధ్యక్షులు సీదిరి అప్పలరాజు తెలిపారు. పర్మినెంట్ రిజస్ట్రేషన్ల కోసం ధర్మాచౌక్లో ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) సైతం నిరసన చేపట్టిన వైద్య విద్యార్థుల ఆందోళనకు డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తదితరులు తమ మద్దతు తెలిపారు. విద్యార్థుల శిబిరానికి చేరుకుని వైఎస్సార్సీపీ నేతల మద్దతు తెలిపారు. దీనిలో భాగంగా సీదిరి అప్పలరాజా మాట్లాడుతూ.. ‘న్యాయమైన డిమాండ్ ను అడిగితే విద్యార్ధులను రోడ్డుకు ఈడుస్తారా?, విద్యార్ధినుల జుట్టుపట్టి కొట్టేస్తారా?, మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా ...తాలిబాన్ లో ఉన్నామా?, వైద్య విద్యార్ధులను జుట్టుపట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేస్తారా?, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది?, 13 నెలలుగా కాలయాపన చేసి చివరికి విద్యార్ధులను ఎండలో కూర్చోబెట్టారు. వైద్య విద్యార్ధుల ఏడుపు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలి. వైద్య రంగం సంపూర్ణంగా పనిచేయాలని జగన్ కృషి చేశారు. 50 వేల మందిని రిక్రూట్ చేశారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే...ఈ ప్రభుత్వం వాటిని కట్టకుండా ఆపేసింది. ఏడాదిలో లక్షా 70 వేల కోట్లు అప్పు తెచ్చారు చంద్రబాబు. ఆరువేల కోట్లతో పూర్తయ్యే మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటున్నారు. లక్ష కోట్లతో బిల్డింగ్లు ,బొలేరోలు కొనుక్కోవడానికి డబ్బులున్నాయంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖమంత్రి సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెడుతున్నారు. బ్లాకే మెయిల్ చేస్తారా అని సాక్షాత్తూ మంత్రే విద్యార్ధులను బెదిరిస్తున్నారు విద్యార్ధుల పట్ల మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదు’ అని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. ఇది ప్రభుత్వం చేతగానితనంవైద్య విద్యార్తులు రోడ్డెక్కాల్సిన రావడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనిరవాసరెడ్డి. ‘ చంద్రబాబు,లోకేష్ పరిపాలనను గాలికొదిలేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పై దృష్టిపెట్టారు. ఎవరి పై కేసులు పెట్టాలి...ఎవరిని లోపల పెట్టాలనేదే వాళ్ల ఆలోచన. విద్యార్ధుల భవిష్యత్ తో ఆటలాడుకుంటున్నారు. ఏపీలో మినహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో పర్మినెంట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తున్నారు. ఏపీలోనే ఎందుకు ఈ సమస్య వచ్చిందిమీకు ఇవ్వడం చేతకాకపోతే ఎన్ఓసి ఇవ్వండి వేరే రాష్ట్రానికి వెళ్లి తెచ్చుకుంటారు. 68 మంది విద్యార్ధుల పై కేసులు పెట్టారు. ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి తమ పిల్లలను చదివించుకున్న తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. చంద్రబాబు,లోకేష్ ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విడనాడండి. డాక్టర్లను రోడ్డు మీదకు వదిలేశారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి వైద్య విద్యార్ధుల సమస్యను పరిష్కరించాలి’ అని గోపిరెడ్డి శ్రీవినాసరెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: జుట్టు పట్టుకొని ఈడ్చేసి.. కాళ్లతో తొక్కేసి -
ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని ఎల్బీ స్టేడియంలోనిర్వహించబోయే సామాజిక న్యాయ సమర భేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అయితే, ఖర్గే పర్యటన వేళ హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ప్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. ‘జై భీం ఎస్సీ,ఎస్టీలే మా లక్ష్యం. జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు’ అనే స్లోగన్లతో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.కాగా, మల్లికార్జున ఖర్గే ఇవాళ(శుక్రవారం) వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్ల నిరసన
-
సీఎం కరకట్ట నివాసం వద్ద యోగాసనాలతో నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గురువారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన నివాసం ముందు యోగ టీచర్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. అయితే.. సీఎం కరకట్ట నివాసం వద్ద నిరసనలకు పోలీసులు యోగా టీచర్లకు అనుమతించలేదు. వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. మర్యాదగా వెళ్లిపోవాలంటూ వార్నింగ్లు ఇచ్చారు. తమ సమస్యేంటో కూడా వినకుండా పోలీసులు తమను పంపించేస్తున్నారని టీచర్లు వాపోయారు. పాఠశాలల్లో పని చేస్తున్న 1,056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ విషయమై మంత్రి లోకేష్కు గతంలో విన్నవించినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలా యోగాసనాల నిరసనలతో అయినా వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశామని చెబుతున్నారు. -
అదే జరిగితే.. రేపే కొత్త పార్టీ పెడతా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నితుడిగా, రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్ బిల్పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదొక పిచ్చి ఖర్చు అని, పన్ను చెల్లింపుదారులకు భారంగా మారుతుందని అన్నారాయన. అలాగే పార్టీ ఏర్పాటుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.వాషింగ్టన్: గతంలో ట్రంప్కు మద్దతుగా నిలిచిన మస్క్.. తన ఎక్స్ వేదికగా అదే వ్యక్తి పాలనా విధానాలను వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదిత బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై మరోసారి స్పందిస్తూ..ఈ బిల్లు సాధారణ అమెరికన్లకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుపైనా ఆయన కీలక ప్రకటన చేశారు. ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు. అమెరికా సెనేట్లో ప్రస్తుతం ఓట్ల పోరు కొనసాగుతోంది. రిపబ్లికన్లు ట్రంప్ రెండో పదవీకాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదితమైతే, ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ట్రంప్ కోసం 250 మిలియన్ డాలర్లతో మద్దతు ప్రచారం నిర్వహించిన మస్క్.. ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు అమెరికన్లకు తీవ్ర నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం తొలి నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో జరిగే పిచ్చి ఖర్చు స్పష్టంగా చూపిస్తోంది. ఇది దేశపు అప్పు పరిమితిని రికార్డు స్థాయిలో ఐదు ట్రిలియన్ డాలర్ల వరకు పెంచుతోంది. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది. అంటూ ఎక్స్ ఖతాలో పోస్ట్ చేశారాయన. తద్వారా.. మస్క్ ప్రస్తుత అమెరికా రాజకీయ వ్యవస్థపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. అమెరికా సెనేట్ ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదించిన "One Big, Beautiful Bill" పై ఓట్ల పోరులో నిమగ్నమై ఉంది. ఈ బిల్లును జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలుహౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గత నెలలో ఈ బిల్లును తక్కువ మెజారిటీతో ఆమోదించింది.ఇప్పుడు సెనేట్ తమ సవరణలతో కూడిన బిల్లును తుది రూపంలోకి తీసుకురావాల్సి ఉంది.ఆ తర్వాత హౌస్ మళ్లీ ఆ సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ బిల్లు చట్టంగా మారేందుకు అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది. ఈ బిల్లులో..సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు.అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం, ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ డాలర్ల లోటును కలిగించనుంది. -
BAN: కుమిల్లా ఘటన.. భగ్గుమన్న హిందూ సంఘాలు
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ వర్గం మరోసారి ఆందోళన బాట పట్టింది. కుమిల్లా(Comilla) జిల్లా దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. గత మూడు రోజులుగా ఉధృతంగా నిరసనలు చేస్తున్నారు. వివాహితపై స్థానిక నేత ఒకరు అత్యాచారానికి దిగడం, అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. కుమిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ అనే వ్యక్తి.. హిందూ మతానికి చెందిన ఓ వివాహితను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఘోరాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి పెరుగుతోందన్న మీడియా కథనాల నేపథ్యంలో.. ఈ ఆందోళనలు మరింత ఉదృతంగా మారాయి. అయితే ప్రజలు మాత్రం బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. Urgent protest march by Hindu students at Dhaka University after the horrific rape of a Hindu girl in Muradnagar, Comilla last night. The Islamist rapist must face justice and the harshest punishment. Silence is not an option! #StopHinduGenocideInBangladesh #JusticeForHindus pic.twitter.com/yAaGGkm82f— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) June 29, 2025ఏం జరిగిందంటే..బాధితురాలు(21) వివాహిత. ఆమె భర్త దుబాయ్లో పని చేస్తుంటాడు. హరిసేవా పండుగ కోసం ఆమె తన పిల్లలను తీసుకుని కుమిల్లా జిల్లా మురాద్నగర్ ఉపజిల్లా రామ్చంద్రాపూర్ పాచ్కిట్ట గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ.. కత్తి చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను హింసిస్తూ ఆ ఘోరాన్ని తన ఫోన్లో బంధించాడు. జూన్ 26వ తేదీ.. ఈ ఘోరం జరిగింది. జూన్ 27వ తేదీ.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణలో నిందితుడు ఫజోర్ అలీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేతగా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజకీయ దుమారం రేగింది. జూన్ 28వ తేదీ.. సోషల్ మీడియాలో లైంగిక దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.జూన్ 29 వేకువఝామున.. ప్రధాన నిందితుడు ఫజోర్ అలీని ఢాకాలోని సయేదాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురిని బాధితురాలి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మైనారిటీ సంఘాలు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళకు దిగారు. జూన్ 30.. బాధితురాలిని కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయని అక్కడి మీడియా సంస్థల్లో వరుస కథనాలు.. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేశాయి హిందూ సంఘాలుమరోవైపు.. కుమిల్లా వివాహిత అత్యాచార కేసుకు సంబంధించిన తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అత్యాచారం కాదని వివాహేతర సంబంధ వ్యవహారమని.. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని.. బాధితురాలికి సంబంధించిన వీడియోలు అంటూ ఫేక్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో పలు ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్ల అక్కడి అధికారులను సంప్రదించి అవి ఫేక్న్యూస్గా తేల్చేస్తున్నాయి. కిందటి ఏడాది మొదలై.. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం గత ఏడాది కాలంగా జరుగుతోంది. 2024 డిసెంబరులో, ఢిల్లీ, లఖ్నవూ, జైపూర్, నాగ్పూర్ వంటి నగరాల్లో హిందూ సంస్థలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. నిరసనకారులు “బంగ్లాదేశ్లో హిందువుల నరమేధాన్ని ఆపాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు నుండి అక్టోబరు మధ్య 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే అంగీకరించింది. వీటిలో ఎక్కువగా హిందువులపై దాడులే ఉన్నాయని పేర్కొంది కూడా. ఈ నేపథ్యంతో.. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన థాయ్లాండ్ బ్యాంకాక్ వేదికగా జరిగినబిమ్స్టెక్ (BIMSTEC) శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే.. బంగ్లాదేశ్ తీరు మారాల్సిందేనని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. -
‘సచివాలయ’ బదిలీల బంతాట
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు కూటమి నేతల ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఖాళీ పోస్టుల వివరాలు బహిర్గత పరచకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారసు లేఖలు ఉంటేనే ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బులు చెల్లించి లేఖలు తెచ్చుకోలేని వారికి మారుమూల ప్రాంతాలు కేటాయించేలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా బదిలీలు సాగుతున్న తీరుపై శనివారం పలు జిల్లాలో సచివాలయాల ఉద్యోగులు నిరసన తెలిపారు. విశాఖపట్నం, అన్నమయ్య తదితర జిల్లాల్లో కౌన్సిలింగ్ కేంద్రాల్లో బదిలీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడత 72 వేల మంది దాకా సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుత బదిలీల ప్రక్రియలో తప్పనిసరిగా బదిలీ అయ్యే పరిస్థితి ఉండగా.. ఆ మేరకు ఖాళీల వివరాలు తెలియ జేయకుండా, కౌన్సిలింగ్ కేంద్రాల అధికారులు మూడు ప్రాంతాల్లో ఆప్షన్లు ఇవ్వాలని సూచిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఖాళీల వివరాల సమాచారం తెలియని పరిస్థితుల్లో ఉద్యోగులు ఇచ్చిన మూడు ఆప్షన్లు ఖాళీగా లేకపోతే ఎక్కడికి బదిలీ చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి అడిగితే.. తమకు ఎమ్మెల్యే సిఫారసు ముఖ్యమని, అది లేదంటే ఇష్టమొచ్చిన చోటుకు బదిలీ చేస్తామని కౌన్సిలింగ్ నిర్వహించే అధికారులు చెబుతుండటం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీల ప్రక్రియలో కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సూచించే పేర్లకు, పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది సరికాదని మండిపడ్డారు. సీనియారిటీ అన్నది లేకుండా గ్రామ, మండల టీడీపీ నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్సెల్ షీట్ల రూపంలో సమర్పించిన పేర్లకే ప్రాధాన్యత ఇచ్చిన బదిలీల్లో పోస్టింగ్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.దీంతో, చివరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు బదిలీ సిఫార్సు లేఖల కోసం గ్రామాల్లో చిన్న చిన్న టీడీపీ నేతలను సైతం ప్రాధేయపడాల్సి వస్తోందని వాపోతున్నారు. మరోవైపు ప్రాధాన్యత ఇవ్వాల్సిన దివ్యాంగులు, ఇతర ప్రత్యేక కేటగిరీల ఉద్యోగులకు సైతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సూచించిన వారికి పోస్టింగులు ఇచ్చాకే, మిగిలిన ఖాళీల్లో నియామకాలు చేపడుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.తీవ్ర గందరగోళం ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టడం అత్యంత బాధాకరమని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తప్పు పట్టింది. బదిలీలకు సంబంధించి విడుదల చేసిన జీవోలోని పాయింట్ నెంబర్ 8లో అత్యంత పారదర్శకంగా, వివాదాలకు ఆస్కారం లేకుండా బదిలీలు నిర్వహించాలని చాలా స్పష్టంగా పేర్కొన్నారని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జానిపాషా, బత్తుల అంకమ్మరావులు ఒక ప్రకటనలో గుర్తు చేశారు. అయితే దాదాపు అన్ని జిల్లాల్లో కనీసం ఖాళీల వివరాలు సైతం ప్రదర్శించకుండా సచివాలయాల ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తూ.. బదిలీల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కొన్ని శాఖల అధికారులు మరో అడుగు ముందుకు వేసి, మీకు సిఫారసు లేఖ ఉందా.. లేదా.. అని అడుగుతున్నారని, ఒకవేళ సిఫారసు లేఖ లేని పక్షంలో సంబంధిత ఉద్యోగికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో కూడా చెప్పని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అనంతపురం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉద్యోగులు అనైతిక బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియను బాయ్కాట్ చేసి కౌన్సిలింగ్ కేంద్రాలలో నిరసన తెలిపారన్నారు. తక్షణం బదిలీల ప్రక్రియపై సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.అడ్డగోలు పనులతో ఒత్తిడి పెంచొద్దుజిల్లా కలెక్టరేట్ల ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన సాక్షి, అమరావతి: రోజూ ఉదయం ఆరు గంటలకే విధుల్లో పాల్గొనాలంటూ అడ్డగోలు పనులతో పని ఒత్తిడి పెంచేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం వారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఎక్కడికక్కడ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు పెట్టి జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. ఎక్కడికక్కడ ఉద్యోగులు ముందుకొచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ సంఘ ప్రతినిధులు వెల్లడించారు. గతంలో వలంటీర్లు చేసే చిన్న చిన్న సర్వే పనులు సైతం గ్రామ సచివాలయాల ఉద్యోగులకే అప్పగించడంతో పాటు సకాలంలో వాటిని పూర్తి చేయకపోతే ఆ సచివాలయాల కార్యదర్శులను బాధ్యులను చేస్తూ సస్పెండ్, తదితర చర్యలకు దిగుతుండడంతో.. తమకు సచివాలయాల డీడీవో బాధ్యతలు వద్దంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా విధులకు హాజరుకాని పంచాయతీ కార్యదర్శుల వివరాలు వెంటనే సమరి్పంచాలంటూ పలు చోట్ల జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో) ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. -
పంచాయతీ కార్యదర్శుల ఉద్యమబాట
సాక్షి, అమరావతి: రోజూ ఉదయం ఆరు గంటలకే గ్రామాల్లో విధులకు హాజరై ఆ రోజు దినపత్రికతో ఫొటో దిగి దానిని పంచాయతీ శాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ శాఖ ఉన్నతాధికారులు మౌఖికంగా జారీచేసిన ఆదేశాలను నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉద్యమబాట పట్టారు. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. ఇందుకోసం శనివారం రాష్ట్రంలోని అత్యధిక మండలాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. ఎంపీడీఓలకు శుక్రవారమే ఈ మేరకు వినతిపత్రాలు అందజేశారు. నిధులు నాస్తి.. పనిఒత్తిడి జాస్తి..గ్రామ పంచాయతీల కోసం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను నెలల తరబడి టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పంచాయతీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో సర్పంచులు పారిశుద్ధ్య పనులు నిర్వహించలేక చేతులెత్తేస్తున్నారు. మరోవైపు.. పంచాయతీ కార్యదర్శులపై విపరీతమైన పని ఒత్తిడి పెడుతున్నారంటూ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ సంఘ నేతలు మండిపడుతున్నారు. గతంలో వలంటీర్లు చేసిన చిన్నచిన్న సర్వే పనుల భారమంతా పంచాయతీ కార్యదర్శులపై పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే, గ్రామాల్లో పారిశుధ్ధ్య పనుల్లో పాల్గొనే ‘క్లాప్’ మిత్రలు ప్రభుత్వం ఇచ్చే వేతనం రూ.6 వేలకు పనిచేసేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితిలేదని.. పైగా ఆ మొత్తం వారికి సకాలంలో ఇచ్చేందుకు నిధుల కొరత కూడా ఉంటోందని చెబుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంగా క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలు ఇవ్వని పరిస్థితులున్నాయంటున్నారు. అంతేకాక.. తమకు జారీచేసిన ఆదేశాలు అవమానించేలా ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. పేపరు పట్టుకుని నిలబడి ఫొటోలు దిగాలనడం చూస్తుంటే తమను పని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని, తద్వారా మానసిక క్షోభకు గురవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఇలా అయితే కుటుంబాలకు దూరం..ఇక ఉదయం నుంచి రాత్రి వరకు ఇలా విపరీతమైన పనిభారంతో పంచాయతీ కార్యదర్శులు తమ కుటుంబాల్ని మరిచిపోయే పరిస్థితి వస్తోందంటున్నారు. వలంటీర్ల వ్యవస్థ అటకెక్కిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ విధుల కంటే గ్రామ, వార్డు సచివాలయాల సర్వే పనులే ఎక్కువగా చేపట్టాల్సి వస్తోందని.. పైగా, ఏదైనా పొరపాటు జరిగితే వీరినే ముందుగా బాధ్యులను చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తమ సమస్యలపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ)లు, జెడ్పీ సీఈఓలకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు వారు చెప్పారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే వారం విజయవాడలో మూడురోజుల పాటు ఆందోళన చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు పేర్కొంటున్నారు. -
అర్థించినా ఆలకించని పవన్
సాక్షి, రాజమహేంద్రవరం : ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ పలు సందర్భాల్లో ఉపన్యాసాలు ఇచి్చన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ‘తమ ఆడబిడ్డకు ఇంకా న్యాయం జరగలేదన్నా.. న్యాయం చేయండి’ అని అభ్యర్థించినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఘటన రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గురువారం చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికికి చెందిన ఓ టెన్త్ విద్యార్థిని ఆర్నెల్ల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలేమిటో నిగ్గుతేల్చాలని కుటుంబ సభ్యులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో మూడునెలల క్రితం రాజమహేంద్రవరం వచ్చిన పవన్కళ్యాణ్కు బాధితులు ఎయిర్పోర్టు వద్ద కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిoచారు. అయినా ఇప్పటివరకూ న్యాయం జరగకపోవడంతో గురువారం అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు వచ్చారు. ‘ఇంకా న్యాయం జరగలేదన్నా..’ అంటూ ఫ్లెక్సీ చూపిస్తూ నిరసన తెలిపారు. కొద్దిసేపు అక్కడే ఉన్నా వారిని పవన్ గమనించలేదు. దీంతో పోలీసులు పవన్ను కలిసే ఏర్పాటుచేస్తామని వారిని వేదిక వద్దకు తీసుకెళ్లారు. పవన్ ప్రసంగం అయిన వెంటనే మాట్లాడిస్తామని చెప్పడంతో వారు ఫ్లెక్సీ కిందకు దింపేశారు. కానీ, సభ పూర్తయిన వెంటనే పవన్ వారితో మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక బాధితులు వెనుదిరిగారు. జనసేన కార్యకర్తల వీరంగం.. సభలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పవన్కళ్యాణ్ ప్రసంగిస్తుండగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారి చిందులకు సభలోని కుర్చీలు విరిగిపోయాయి. ‘ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్’..!సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రసంగంలో ‘రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్’ అని పలికారు. దీంతో జనసేన కార్యకర్తలు అరవడం ప్రారంభించారు. పక్కనున్న వ్యక్తి డిప్యూటీ సీఎం అని చెప్పడంతో.. తిరిగి డిప్యూటీ సీఎం అని పురందేశ్వరి అన్నారు. -
కదంతొక్కిన కడలి పుత్రులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ సీ మౌత్ను తక్షణం పురుద్ధరించి వెంకట్రావుతోపాటు భాగస్వామిగా ఉన్న గుంటూరు భ్రమర ఇన్ఫ్రాకు చెందిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ మత్స్యకారులు మంగళవారం బాపట్లలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. తీరగ్రామాలకు చెందిన మత్స్యకారులు బాపట్ల చేరుకుని ర్యాలీ చేపట్టారు. పాతబస్టాండు వద్ద ధర్నా నిర్వహించి.. ఆ తర్వాత చీలురోడ్డులో మానవహారం చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్తుండగా.. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కలెక్టర్తో చర్చలు జరిపేందుకు వస్తున్నామని ఆందోళనకారులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తర్వాత 20 మందిని మాత్రమే కలెక్టర్ కార్యాలయానికి అనుమతిస్తామని చెప్పడంతో అందరినీ అనుమతించాల్సిందేనంటూ అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. కలెక్టర్తో చర్చించేందుకు 25 మందికి అనుమతి లభించడంతో పోలీసులు మత్స్యకార నాయకులతోపాటు ప్రజాసంఘాల వారిని పోలీసులు లోపలికి అనుమతించారు. 2 గంటలపాటు మత్స్యకారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో చర్చించిన కలెక్టర్ వెంకటమురళి ఈపూరుపాలెం సీమౌత్కు అడ్డుగా వేసిన రాళ్లను తొలగించి మత్స్యకారులు తక్షణం వేటకు వెళ్లేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత జిల్లా అధికారులతో కమిటీ వేసి నెల రోజుల్లో తీరంలో సీఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను తేల్చి భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కాలువ పూడికతీత పేరుతో 500 లారీల ఇసుకను అక్రమంగా తీసుకెళ్లిన వారిపైనా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారులపై పెట్టిన కేసులను సైతం తొలగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. -
Watch Live: కూటమి సర్కార్ పై YSRCP యువత పోరు
-
వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నేడు 'యువత పోరు'
-
సంగారెడ్డి BRS రైతు ధర్నాలో రప్పా రప్పా ప్లకార్డులు
-
Au క్యాంపస్ లో ఆహార సౌకర్యాలు అస్సలు బాగోలేదు
-
మద్యం షాపు తొలగించండి.. విద్యార్థుల నిరసనలు
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు వెలిశాయి. గుడి, బడి అనే తేడా లేకుండా.. మద్యం షాపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తరగతులను బహిష్కరించి.. నిరసనలు చేపట్టారు.శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం మండలం ఈదుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరసనలకు దిగారు. మద్యం షాపు ఎత్తివేయాలని తరగతులు బహిష్కరించి విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు.. మద్యం దుకాణం నిర్వాహకులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మద్యం షాప్ తొలగించేంత వరకు తమ పిల్లలను బడికి పంపమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని గత కొన్ని రోజులుగా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
రేపటి వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం వాయిదా
సాక్షి, అమరావతి: అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 241 మంది మరణించిన నేపథ్యంలో.. ఆ ఘటనకు, మృతులకు సంతాప సూచకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం (జూన్ 13వ తేదీ) తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు.టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు.. ఉద్యోగాల కల్పన లేదా నిరుద్యోగ భృతి చెల్లింపు వెంటనే అమలు చేయాలని, అలాగే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి.కాగా, అహ్మదాబాద్లో దారుణ విమాన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. -
లాస్ ఏంజెలెస్ రణరంగం
లాస్ ఏంజెలెస్: అధ్యక్షుడు ట్రంప్ తన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపడంతో మరింత పేట్రేగిపోయిన ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని ఉదృతంచేశారు. రోడ్లపై కనిపించిన కారునల్లా దహనంచేసి ఉద్యమాగి్నజ్వాలల్ని మరింత రగిలించారు. దీంతో లాస్ ఏంజెలెస్ నగర వీధులు ఒక్కసారిగా రణరంగంగా మారిపోయాయి. అక్రమవలసదారులను ఫెడరల్ ఏజెంట్లు, ఎఫ్బీఐ, పోలీసులు అరెస్ట్చేయడాన్ని వేలాది మంది ఆందోళనకారులు నిరసించడంతో మొదలైన ఉద్యమం నెమ్మదిగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఓవైపు సరైన డాక్యుమెంట్లులేని వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకుంటూ, ఆ అధికారులు, ప్రభుత్వ భవనాలకు రక్షణగా నేషనల్ గార్డ్లను ట్రంప్ సర్కార్ రంగంలోకి దింపడంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు. ఫ్రీవే మూసివేత పారామౌంట్ పట్టణంలోని ప్రధాన రహదారిని దిగ్బంధించారు. దక్షిణదిశలో వాహనాల రాకపోకలకు ఉపయోగించే 101 నంబర్ ఫ్రీవే రహదారిని మూసేశారు. అడ్డుకునేందుకు వచ్చిన కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులపైకి నిరసనకారులు చేతికొచ్చిన వస్తువుతో విరుచుకుపడ్డారు. కాంక్రీట్ ముక్కలు, రాళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ విడిభాగాలు, బాణసంచాను అధికారులపైకి విసిరేశారు. వేలాదిగా ఆందోళనకారులు గుమికూడడంతో వెంటనే అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదంటే అరెస్ట్లు తప్పవని పోలీసులు మెగాఫోన్లో ప్రకటించారు. అక్రమవలసల ఏరివేత కోసం నేషనల్ గార్డ్లను ఉపయోగించబోమని, కేవలం అధికారులు, డిటెన్షన్ సెంటర్ భవనాల రక్షణ నిమిత్తమే వాళ్లను రప్పించామని లాస్ఏంజెలెస్ పోలీస్ చీఫ్ జిమ్ మెక్డొనెల్ చెప్పారు. డజన్ల కొద్దీ ఆందోళనకారులను అరెస్ట్చేశామని తెలిపారు. పెట్రోల్ బాంబు విసిరినందుకు ఒకరిరి, అధికారులను బైక్తో ఢీకొట్టినందుకు మరొకరిని అరెస్ట్చేశారు. ఫేస్ మాస్క్ లు ధరించొద్దు ఫేస్మాస్క్ ధరించి ఆందోళనల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఫేస్మాస్క్తో ఎవరు కనిపించినా అరెస్ట్ చేయండని అధికారులకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ ద్వారా సూచించారు. ఉదయాన్నే నేషనల్ గార్డ్లు రావడంతో ఆందోళనకారుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. రాష్ట్ర పోలీసులు ఉండగా ఫెడరల్ సాయుధవిభాగమైన మీకు ఇక్కడేం పని అంటూ అందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. ‘‘ సిగ్గులేదు. ఇంటికి పొండి’’ అంటూ ఎద్దేవాచేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బలగాలు పొగబాంబులు, భాష్పవాయుగోళాలు, ఫ్లాష్బ్యాంగ్ గ్రనేడ్లను ప్రయోగించారు. దీంతో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు 101 ఫ్రీవేపై నిలిపేశారు. సాయంత్రంకల్లా రాష్ట్ర పెట్రోల్ అధికారులు వారిని చెదరగొట్టి రహదారిపై రాకపోకలను పునరుద్దరించారు. దీంతో ఆగ్రహించిన నిరననకారులు అక్కడే నిలిపి ఉంచిన నాలుగు స్వయంచోదిత(సెల్ఫ్ డ్రైవింగ్) వేమో సంస్థ కార్లకు నిప్పంటించారు. మంటలు అంతటా అంటుకోవడంతో ఆ కార్ల నుంచి పేలుడు శబ్దాలు వినిపించాయి. గూగుల్కు చెందిన ఈ కార్లు రోబోట్యాక్సీ సేవలందిస్తున్నాయి. ఉద్యమకారులు రెచ్చిపోతుండటంతో అధికారులు వెంటనే లాస్ఏంజెలెస్ డౌన్టౌన్ ప్రాంతాల్లో జనసంచారంపై నిషేధాజ్ఞలు విధించారు. గుమికూడితే అరెస్ట్చేస్తామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. సమాఖ్య విధానాన్ని కాలరాయడమే ‘‘ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉద్యమాలు వెల్లువెత్తితే సద్దుమణిగేలా చేసే బాధ్యత ఆ రాష్ట్రానిదే. మా రాష్ట్రంలో సమస్యలుంటే మేం పరిష్కరించుకుంటాం. నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపాల్సిన అవసరమేంటి?. గార్డ్లను దింపి సమాఖ్య విధానానికి ట్రంప్ సర్కార్ తూట్లుపొడుస్తోంది. ఇది రాష్ట్రాల సార్వ¿ౌమత్వానికి తీవ్ర విఘాతం కల్గించడమే. అధ్యక్షుడి నిర్ణయాన్ని నేను న్యాయస్థానంలో సవాల్ చేస్తా’’ అని డెమొక్రటిక్ పార్టీ నేత, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ నూసమ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ అనుమతి, ఆమోదంలేకుండా కాలిఫోర్నియా రాష్ట్రంలోకి నేషనల్ గార్డ్లను కేంద్రప్రభుత్వం రప్పించడం ఇటీవలి దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 1965లో నాటి దేశాధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ అలబామాలో పౌరహక్కుల ఉద్యమాన్ని అదుపులోకి తెచ్చేందుకు అమెరికాసైన్యంలో రిజర్వ్ బలగాలైన ‘నేషనల్ గార్డ్’లను రప్పించారు. ‘‘ఆందోళనకారులు శాంతించాలి. నేషనల్ గార్డ్లను తీసుకొచ్చి ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలను ట్రంప్ మరింత రాజేశారు. ప్రజలకు రక్షణగా వాళ్లను రప్పించినట్లు కనిపించట్లేదు. ట్రంప్కు మరేదో ఎజెండా ఉన్నట్లుంది’’ అని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ వ్యాఖ్యానించారు. ఆందోళనలు తొలుత లాస్ ఏంజెలెస్ డౌన్టౌన్లో మొదలు తర్వాత పారామౌంట్ పట్టణానికి పాకి ప్రస్తుతం సమీప కాంప్టన్ పట్టణంలో విస్తరిస్తున్నాయి. గత వారంతానికి 100 మందికిపైగా అక్రమవలసదారులను ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో 60 మందిని అరెస్ట్చేశారు.విదేశీ జర్నలిస్ట్లకు గాయాలు డౌన్టౌన్ లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ నుంచి వలసదారులను విడిచిపెట్టాలని ఉద్యమకారులు నినాదాలుచేశారు. అప్పుడు అక్కడ ఆ్రస్టేలియాకు చెందిన 9న్యూస్ టీవీఛానెల్ మహిళా పాత్రికేయురాలు లారెన్ థామస్ రిపోరి్టంగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉద్యమకారులను చెదరగొట్టేందుకు నగర పోలీసులు, నేషనల్ గార్డ్ బలగాలు రబ్బర్ బుల్లెట్ల గన్లను పేల్చారు. దీంతో ఒక రబ్బర్ బుల్లెట్ లారెన్కు తగిలింది. ప్రత్యక్ష ప్రసారం వేళ ఈ ఘటన జరిగింది. విలవిల్లాడుతున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బ్రిటిష్ ఫొటోజర్నలిస్ట్ నిక్ స్టెర్న్కు సైతం రబ్బర్ బుల్లెట్ తగలి ఐదు సెంటీమీటర్ల లోతు గాయమైంది. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించాక దేశవ్యాప్తంగా 1,00,000 మందిని అరెస్ట్చేసినట్లు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) విభాగం ప్రకటించింది. ట్రంప్ అధ్యక్షుడైన తొలి 100 రోజుల్లో రోజుకు 660 మంది చొప్పున అరెస్ట్చేశారు. గురువారంనాటికి డిటెన్షన్ సెంటర్లలో ఏకంగా 54,000 మంది వలసదారులున్నారు. నేషనల్ గార్డ్లను రప్పించడానికి శ్వేతసౌధం సమరి్థంచుకుంది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ అసమర్థ పాలన కారణంగా ఇమిగ్రేషన్ అధికారులకు రక్షణ కరువైంది. అందుకే గార్డ్లను అనుమతించాం’’ అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ చెప్పారు. లాస్ ఏంజెలెస్లో కొన్ని చోట్ల ఆందోళనకారులు దుకాణాలను లూటీచేశారని పోలీసులు చెప్పారు. పరిస్థితి చేయిదాటితే 500 మంది నేవీ మెరైన్లను రప్పిస్తామని యూఎస్ నార్తర్న్ కమాండ్ హెచ్చరించింది. -
మంత్రి లోకేశ్కు గురువుల నిరసన సెగ
సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు పార్వతీపురం మన్యం జిల్లాలో గురువుల నుంచి నిరసన ఎదురైంది. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు మంత్రి సోమవారం పార్వతీపురం వచ్చారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. లోకేశ్ పర్యటన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు,ఆయనను కలిసి వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలోనే బదిలీల విషయమై మంత్రిని కలిసి విన్నవించేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో రెండు బృందాలుగా టీచర్లు మంత్రి కాన్వాయ్ను అడ్డుకునేందుకు వేచి చూశారు. చివరికి మంత్రి లోకేశ్ ను ఉపాధ్యాయులు కలిశారు. తమ డిమాండ్లు వినిపించారు. -
టెంట్ పీకేసి.. ఉద్యమకారులపై కూటమి కుట్ర
-
శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, విజయవాడ: శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి , వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాతవాహన కాలేజీ భూములు కొట్టేసేందుకు రెండు ముఠాలుగా ఏర్పడ్డారని.. వైఎస్సార్, జగన్ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు.అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?. కాలేజీ కూల్చేస్తుంటే విద్యాశాఖ మంత్రికి పట్టదా?. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలి. విశాఖ, అమరావతిలో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ కళాశాల భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. మీ ఎమ్మెల్సీ జాతకం.. అర్ధరాత్రి కాలేజీని కూలగొట్టిన వారి జాతకం మీదగ్గర లేదా?’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.విద్యార్థుల పక్షాన వైఎస్సార్సీపీ: డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డిటీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా బెజవాడలో కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురవుతాయి. కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేసుకోవడానికే ఆలపాటికి ఎమ్మెల్సీ ఇచ్చారా?. పేద విద్యార్ధులు చదువుకునే కాలేజీని కూలగొట్టడం దారుణం. ప్రజలు, విద్యార్థుల పక్షాన మేం నిలుస్తాంలోకేష్.. రెడ్ బుక్ వదిలి.. పాఠ్య పుస్తకాలు అందించు: రవిచంద్రరెండు ముఠాల మధ్య ఆధిపత్యంలో భాగంగా శాతవాహన కాలేజీని కూల్చేశారు. విద్యార్ధుల సర్టిఫికెట్లు, రికార్డులు శిథిలాల కిందే ఉన్నాయి. ఆలపాటి రాజేంద్ర కిడ్నాప్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించకున్నాడు. అధికారపార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఈ కాలేజీ భూముల కోసం కొట్టుకుంటున్నారు. తక్షణమే చంద్రబాబు, లోకేష్ జోక్యం చేసుకోవాలి. లోకేష్ రెడ్ బుక్ను వదిలి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. -
కాలిఫోర్నియాలో నిరసనల టెన్షన్.. ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ వలసదారుల అరెస్ట్ల నేపథ్యంలో వందలమంది ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి.. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో నిరసన కారులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.ఈ సందర్భంగా నిరసనలపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. ఈ విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుంది. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్య వలే పరిష్కరిస్తాం. అక్రమ వలసదారులు నిరసనలు చేయడం సరైన పద్దతి కాదు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Jun 07, 2025, 8:25 PM ET )If Governor Gavin Newscum, of California, and Mayor Karen Bass, of Los Angeles, can’t do their jobs, which everyone knows they can’t, then the Federal Government will step in and solve the… pic.twitter.com/mLvzMt9OFb— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) June 8, 2025ఇదిలా ఉండగా.. అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో ఫెడరల్ అధికారులు లాస్ ఏంజెలెస్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజెలెస్లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ నిరసనలు చెలరేగాయి. సుమారు 1000 మంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం.. నిరసనకారులను చెదరగొట్టేందకు పోలీసులు.. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు.🚨🇺🇸 #BREAKING: STAND-OFF WITH ICE: MEXICAN FLAGS GO UP AS ROADS SHUT DOWNProtesters backing illegal immigrants have turned parts of L.A. into a demolition derby.News vans were smashed, roads barricaded, and tempers lit like it’s the Fourth of July. pic.twitter.com/AT5ZQdZ2tE— Md.Sakib Ali (@iamsakibali1) June 8, 2025మరోవైపు.. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్ భవనం వెలుపలకు చేరుకొని ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Pro-illegal immigrant supporters waving foreign flags celebrating their handiwork on American soil.pic.twitter.com/U8sBQINvog— The Daily Sneed™ (@Tr00peRR) June 8, 2025 -
‘వెన్నుపోటు దినం’ జయప్రదం
సూపర్ సిక్స్తో సహా అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదు. ప్రజా సంక్షేమం విస్మరించి అరాచక పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు మండిన ప్రజలు కూటమి సర్కారు వంచనపై గర్జించారు. కూటమి నేతల కుట్రలను ఛేదించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వెన్నుపోటు’ దినం కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఉప్పెనలా కదం తొక్కారు. అధికారులకు వినతిపత్రాలతో నిరసన తెలియజేశారు. అనంతపురం కార్పొరేషన్: కూటమి సర్కారు నయ వంచనను ఎండగట్టేందుకు,చంద్రబాబు సర్కార్ను మేలుకొలిపేందుకు వైఎస్సార్ సీపీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది.అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వ ర్యంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమే‹Ùగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర తదితరులు పాల్గొన్నారు. ట నార్పలలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ స్థానిక వాలీ్మకి ఆలయం నుంచి ప్రారంభమై తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, బోగాతి ప్రతాప్రెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ⇒ ఉరవకొండలో సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఉరగాద్రి ఆలయం నుంచి టవర్ క్లాక్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సూపర్సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ⇒ గుంతకల్లులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి ఆ«ధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమికి డిపాజిట్లు రావన్నారు.కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భవాని, వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి, గుంతకల్లు ఎంపీపీ మాధవి, గుత్తి పట్టణ కనీ్వనర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ⇒ రాయదుర్గంలో సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ వినాయక సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది.ఎమ్మెల్సీ శివరామి రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాలకూ చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. ⇒ కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో ముందుకెళ్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. ఏడాదిగా ఒక్క హామీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాజ్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి, నేతలు ఉమా, వెంకటేశులు, తిమ్మరాయడు పాల్గొన్నారు. ⇒ యాడికి మండల కేంద్రంలో ‘వెన్నుపోటుదినం’ నిరసన ర్యాలీ... కార్యక్రమ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆధ్వర్యంలోజరిగింది. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్ సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు హర్షవర్దన్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడలు వంచుతాం.. అనంతపురంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులతో కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్తో పాటు 143 హామీలను గుప్పించి ఇంత వరకు ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరే‹Ùకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. హంద్రీ –నీవా కాలువ సామర్థ్యాన్ని 3,800 క్యూసెక్కులకే పరిమితం చేసి భవిష్యత్తులో నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది తలెత్తేలా చేశారన్నారు. -
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు... వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలకు ఉప్పెనలా తరలివచ్చిన జనం
-
ప్రజలకే వెన్నుపోటు.. బాబును క్షమించే ప్రసక్తే లేదు (చిత్రాలు)
-
Vennupotu Dinam మళ్లీ పొడిచాడురా బాబూ.. ఎన్ఆర్ఐల నిరసన
-
పులివెందులలో దుమ్మురేపుతున్న వెన్నుపోటు దినం ర్యాలీ..
-
చెవిలో పూవ్వులతో వెన్నుపోటుదినం RK రోజా మాస్ ర్యాగింగ్
-
కూటమిపై తిరుగుబాటు.. బాబుకు కౌంట్ డౌన్
-
పవన్ కల్యాణ్.. ఇలాగేనా మహిళలతో ప్రవర్తించేది? వెన్నుపోటు దినానికి మా మద్దతు
-
Vennupotu Dinam: వెన్నుపోటుకు ఏడాది.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
-
నేడు ఏపీవ్యాప్తంగా వెన్నుపోటు నిరసనలు
-
మీరు మమ్మల్ని రద్దు చేస్తే.. మేం మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం
సాక్షి, అమరావతి: ‘‘మీరు మొబైల్ డెలివరీ యూనిట్ (ఎండీయూ) వ్యవస్థను రద్దు చేశారు. మాకు సమయం వచ్చినప్పుడు మీ ప్రభుత్వాన్ని మేం రద్దు చేస్తాం. నిండా మునిగిన మాకు చలేమిటి..? ఎండీయూలో 9,260 మంది వ్యక్తులం కాదు.. మా కుటుంబాలు, రేషన్ వాహనాల హెల్పర్ల కుటుంబాలు..1.45 కోట్ల రేషన్ లబ్ధిదారుల కుటుంబాలున్నాయి. వైఎస్ జగన్ ఎండీయూల ద్వారా మాకు జీవనోపాధి కల్పిస్తే.. కూటమి ప్రభుత్వం జీవితాలను కూల్చేస్తోంది. వరదల్లో, వానల్లో, అమరావతి శంకుస్థాపనల్లో రేయింబవళ్లు పనిచేసిన మాకు రేషన్ వాహనాల రద్దును రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చింది’’ అంటూ రేషన్ డెలివరీ వాహనాల డ్రైవర్లు మండిపడ్డారు. ఎండీయూల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా, పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో మూడు రోజుల శాంతియుత నిరసనల్లో భాగంగా నినదించారు.ప్రభుత్వ సర్వేల్లోనూ రేషన్ సరఫరా వాహనాల వ్యవస్థ ఉండాలని ప్రజలు చెప్పారని, రాజకీయ కుట్రతో రద్దు చేశారని మండిపడ్డారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే 74 శాతం మంది ప్రజలు ఎండీయూలను కోరుకుంటున్నందున తాము ఏమీ చేయలేపోతున్నామని చెప్పినా.. ఎందుకు ఎత్తివేశారని నిలదీశారు. ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. రేషన్ డెలివరీ వాహనాల వ్యవస్థ వచ్చాకే రేషన్ పంపిణీ 90 శాతానికి చేరింది. డీలర్లు ఇచ్చేటప్పుడు 64 శాతం కూడా ఉండేది కాదు. ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం వెళ్తే ప్రజలు హాయిగా తీసుకున్నారు. పంపిణీ పెరగడాన్ని కూడా అక్రమ రవాణాతో ముడిపెట్టేశారు. ఎండీయూలను రద్దు చేసి వాహనాలను ఊరికే ఇస్తున్నట్టు ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది. మేం కట్టిన 10 శాతం సొమ్మును మర్చిపోతోంది. ఇంతకాలం పనిచేసిన మేము 2027 జనవరి వరకు అగ్రిమెంట్ ప్రకారం పనిచేయలేమా? విజయవాడ వరదల్లో రోజుకు రూ.1500 ఇస్తామని చెప్పి చేతులెత్తేశారు. వరద బాధితులకు ఒక రోజు జీతం కింద రూ.56 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కు ఇస్తే.. మా సేవలు వాడుకుని బయటకు నెట్టేస్తారా. స్కూళ్లకు బియ్యం రవాణా చేసినందుకు కమీషన్లు రాలేదు. గత ప్రభుత్వం బీమా కడితే.. ఈ ప్రభుత్వం ఇవ్వబోమని చెప్పింది. 3 రోజుల్లో సానుకూల నిర్ణయం రాకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. మేం మాత్రమే కాదు.. ఉద్యోగాలు కోల్పోయిన వలంటీర్లతో పాటు ప్రతి ఒక్కరిని కలుపుకొని త్వరలో 26 జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడిస్తాం’’ అని ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ చెప్పారు. మా కడుపుపై కొట్టారు..‘నేను, నా భార్య నెలంతా కష్టపడి పనిచేస్తే తప్ప ఇల్లు గడవదు. మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. నా తల్లిదండ్రులు పెద్ద వయసు వారు కావడంతో ఏ పని చేయలేరు. ఎండీయూ వ్యవస్థను ఒక్క ప్రకటనతో ప్రభుత్వం రద్దు చేసి మమ్మల్ని రోడ్డుపైకి లాగేసింది. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసిన నేను బ్యాంక్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా. నెలలో నిర్దిష్ట సమయంలో రేషన్ పంపిణీ చేస్తూ.. ఖాళీ వేళల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నా. ఇప్పుడు జీవనోపాధితో పాటు జీవితంలో మరో మెట్టు ఎక్కే అవకాశం కూడా కోల్పోయాను. ఇక రోజంతా కూలీ పనికి వెళ్లాల్సిందే. మా అబ్బాయి స్కూల్కే ఏడాదికి రూ.25 వేలు ఫీజు కట్టాలి. నెలకు రూ.30 వేల వరకు ఇంటి ఖర్చు వస్తుంది. గత ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా రూ.10 వేలు సాయం అందించడంతో ఇన్సూరెన్స్ ఖర్చులు తగ్గాయి. కూటమి ఏడాది పాలనలో ఒక్క పథకం కూడా మా దరిచేరలేదు’ –విజయవాడ చిట్టినగర్కు చెందిన ఆర్.నవీన్ ఆవేదనబయట కూలీ పనులు కూడా దొరకట్లేదుఏ ప్రభుత్వమైనా ప్రజల పక్షాన ఆలోచించాలి. వాళ్ల జీవన ఉన్నతికి పనిచేయాలి. కూటమి సర్కారు మాత్రం మా ఉపాధిపై దెబ్బకొట్టింది. పదో తరగతి చదువుకున్న నేను గతంలో తాపీ పనులకు వెళ్లేవాడిని. ఎండీయూ వ్యవస్థ రావడంతో సొంత ఊరిలో గౌరవప్రద జీవితం పొందాను. నెలనెల ప్రభుత్వం నుంచి వేతనం వస్తుండడంతో బ్యాంకు లోన్ పెట్టుకుని అవసరమైన వసతులు సమకూర్చుకున్నాం. ఇప్పుడు నా ఉద్యోగం ఊడగొట్టారు. బయట చూస్తే పనులు కూడా సరిగా దొరకట్లేదు. నాతో పాటు నా ముగ్గురు బిడ్డల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. గతంలో అమ్మఒడి, వాహన మిత్ర, ఆసరా వంటి ఏదో ఒక పథకం మా ఇంటికి వచ్చేది. నా కష్టానికి తోడు ప్రభుత్వ ఆర్థిక సాయంతో కుటుంబాన్ని నిలబెట్టుకున్నా. గత ప్రభుత్వం మాతో ఇంటి వద్దకే రేషన్ పంపిస్తూ.. రేషనడీలర్లకు కమీషన్లు ఇవ్వలేదా? ప్రతిదీ రాజకీయ, ఆర్థిక కోణంలో చూస్తే పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోతారు. – హెచ్.నాగరాజు, వీర్లపాడు, ఎన్టీఆర్ జిల్లాజీవితాలు తల్లకిందులు..ఇద్దరు డీలర్లు చేయాల్సిన పనిని ఒక ఎండీయూ చేస్తున్నాడు. ఏజెన్సీల్లో 2 వేలమంది పైగా కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలి. ఇద్దరు హెల్పర్లను పెట్టుకోవాలి. మా చేతికొచ్చే రూ.18 వేలతోనే ఇవన్నీ చేస్తున్నాం. కానీ, ఇదంతా ఏదో మాకు ఉచితంగా ఇస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. మా కష్టాన్ని చిన్నచూపు చూస్తూ.. డీలర్కు కూర్చోపెట్టి కమీషన్ ఇచ్చి.. డీలర్ల దగ్గరే ప్రజలను క్యూలైన్లో నిలబెట్టడాన్ని గొప్పగా చెబుతోంది. డీలర్ అద్దె తప్ప ఏం ఖర్చు ఉంటుంది. అక్కడ బియ్యం తీసుకోవడంలో కష్టమంతా ప్రజలదే కదా. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఎండీయూ ఆపరేటర్గా అవకాశం వస్తే జీవితానికి భరోసా దొరికిందని భావించాను. ప్రభుత్వం మారడంతో మా జీవితాలే తల్లకిందులు అవుతాయని అనుకోలేదు. – జనార్దన్, ఇసుక తోడు గ్రామం, సీతమ్మధారగిరిజనులను కిలోమీటర్లు నడిపిస్తారా?మా గిరిజన ప్రాంతంలోని ఒక్కో రేషన్ డిపో పరిధిలో పదులకు పైగా గ్రామాలు ఉంటాయి. నా ఎండీయూ రెండు డిపోల్లో రేషన్ పంపిణీ చేస్తుంది. ఒక డిపోలో 34, మరోదాంట్లో 14 గ్రామాలున్నాయి. వెయ్యికార్డులు పైనే ఉన్నాయి. ఇవన్నీ డిపోలకు 15–20 కిలోమీటర్లు దూరం. ఎండీయూలను ఆపేయడంతో గిరిజనులు ప్రభుత్వం ఇచ్చే ఐదు కేజీల బియ్యం కోసం రోజంతా పనులు మానుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి వస్తుంది.మేమైతే ముందు రోజు గిరిజనులకు చెప్పి వాళ్లు ఉండే సమయంలోనే వెళ్లి రేషన్ ఇచ్చేవాళ్లం. ఎండీయూ వ్యవస్థ ప్రజలతో పాటు నాలాంటి అనాథలకు ఆసరాగా నిలిచింది. నేను బీఏ బీఈడీ చేశాను. ఎండీయూ నడుపుకొంటూ డీఎస్సీకి సన్నద్ధం అవుతున్నాను. నాకు ఇది ఎంతో ఆర్థిక భరోసాగా నిలిచింది. ఇప్పుడు ఉపాధి పోవడంతో మళ్లీ వ్యవసాయ పనులకు వెళ్లాల్సిందే. – జి.భగత్రామ్, దుప్పిలివాడ, అల్లూరి సీతారామరాజు జిల్లామా సత్తా చూపిస్తాం..నా పెద్ద బిడ్డ బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతుంటే మమ్మల్ని చూసిన నాథుడు లేడు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్రలో గోడు చెప్పుకొన్నాం. సాయంత్రానికి రూ.లక్ష ఆర్థిక సాయం ఇంటికి పంపించారు. మాలాంటి పేదల కోసమే అన్నట్టు.. అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్కు ఆరోగ్యశ్రీలో ఎంత ఖర్చయినా ఉచిత వైద్యాన్ని ప్రకటించారు. ఇప్పుడు నా బిడ్డ క్యాన్సర్ను జయించి.. సెంచూరియన్ వర్సిటీలో అనస్థీషియా మొదటి ఏడాది పూర్తి చేశాడు. హెవీ వెహికల్ డ్రైవర్గా పని చేసే నేను ఎండీయూ ఆపరేటర్గా సొంత వాహనానికి ఓనర్ అయ్యాను. నా కుటుంబంలో అమ్మఒడి వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ జరిగింది. ఇళ్ల పట్టా ఇచ్చారు. సొంత ఊరిలో పేదలకు మేలు చేసే పథకంలో పనిచేస్తూ హాయిగా జీవిస్తున్నా. కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా మా ఉపాధిని తొలగించింది. ఈ వయసులో నేను మళ్లీ హెవీ వెహికల్ డ్రైవర్గా దూర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి. – బి.సత్యనారాయణ, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా -
‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి. ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని ఆర్మీతో హసీనా అన్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.వివరాల ప్రకారం.. గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనాకు సూచించింది. ఆ సమయంలో వారితో హసీనా..‘నన్ను కాల్చి చంపేయండి.. ఇక్కడే ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీశాయి. బంగ్లాదేశ్లో రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. బంగ్లాలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన కారణంగా ప్రజా ఉద్యమానికి జడసి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. "Shoot me, bury me here, in Ganabhaban". These were the words of deposed Bangladeshi Prime Minister Sheikh Hasina on the fateful morning of August 5, 2024, as army officers asked her to resign amid violent student protests. Hasina eventually fled to India hours before protesters… pic.twitter.com/JzfwBtHUMp— India Today Global (@ITGGlobal) May 28, 2025 -
దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా
-
మహిళలకు కూటమి సర్కారు కుచ్చుటోపీ
అమలాపురం టౌన్: బీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీ, శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం రూ.245 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మహిళలు రోడ్డెక్కారు. కుట్టు మెషీన్లను వెంటబెట్టుకుని మరీ జిల్లా కేంద్రమైన అమలాపురం చేరుకుని నిరసన తెలిపారు. గడియారం స్తంభం సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ.. రూ.4,300 విలువైన కుట్టు మెషిన్ను కమీషన్ల కక్కుర్తితో రూ.23,500కు కూటమి ప్రభుత్వం అడ్డదారుల్లో పెంచిందని ధ్వజమెత్తారు.ఇన్నాళ్లూ బీసీ కులగణన లేకే ఇలాంటి స్కామ్లకు అవకాశం ఏర్పడుతోందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. కుట్టు మెషీన్ల పేరుతో రూ.245 కోట్ల మేర మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన కుంభకోణంపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఈ వారంలోనే రిలే నిరాహార దీక్ష, పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి దిగి వచ్చేలా చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బాటలో కూటమి ప్రభుత్వ కుట్టు మెషీన్ల స్కామ్పై కూడా పోరాటం మొదలు పెట్టామన్నారు.కూటమి ప్రభుత్వం స్కీమ్ల పేరుతో సాగించిన కుంభకోణాల దందాను జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కో–ఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ తదితరులు వివరించారు. -
ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి
సాక్షి నెట్వర్క్: ఎలాంటి సెర్చ్ వారంట్ లేకుండా గురువారం విజయవాడలో సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి నానా హడావుడి చేసి భయభ్రాంతులకు గురిచేయడం దారుణం అని, ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమని.. పత్రికా స్వేచ్ఛపై దాడి అని రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయ సంఘాల నేతలు, జర్నలిస్టులు మండిపడ్డారు. వ్యక్తి స్వేచ్ఛకు, పాత్రికేయులకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల కదంతొక్కాయి. విజయవాడలో నల్ల బ్యాడ్జిలు ధరించి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం అందజేశారు. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు, సామ్నా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కలిమి శ్రీ, ఎడిటర్స్ అసోసియేషన్, ఏపీయూడబ్ల్యూజేఎఫ్, ఏపీయూడబ్ల్యూజే, సామ్నా ప్రతినిధులు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మచిలీపట్నం, అవనిగడ్డలో ర్యాలీ నిర్వహించారు. గుంటూరులో అంబేడ్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూరి్తకి వినతిపత్రం అందజేశారు. నరసరావుపేటలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలోని అన్ని పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని కర్నూలులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఒంగోలుతో పాటు కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కంభంలో నిరనస ప్రదర్శన నిర్వహించారు. పాత్రికేయులపై కూడా రెడ్బుక్ కుట్రా?ఒకప్పటి బ్రిటిష్ పాలనకు వారసత్వపు హక్కులా ప్రస్తుత కూటమి పాలన ఉందని శ్రీకాకుళం జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. శ్రీకాకుళం, టెక్కలిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల వ్యాప్తంగా జర్నలిస్టులు ప్రభుత్వ దమననీతిని ఎండగడుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. విశాఖపట్నంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరులో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. తుని, కోటనందూరు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెదపూడి, పెద్దాపురం, అమలాపురం, కొత్తపేట, కపిలేశ్వరపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాజమహేంద్రవరం, నిడదవోలు, భీమవరం, ఆకివీడు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, పెనుగొండలో పాత్రికేయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్ట దిగజార్చుకోవద్దుసాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుచోట్ల కలెక్టరేట్ ఎదుట ధర్నాలకు దిగి కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వినతిపత్రాలు అందజేశారు. హైదరాబాద్లో సాక్షి ప్రధాన కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జిలతో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఎవరో నిందితుడిని గాలిస్తున్న క్రమంలో ఎడిటర్ ఇంటికి వచ్చినట్టు పోలీసులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వాలు, అధికార పక్షాలకు మీడియా అనుకూలంగా ఉండాలనుకోవడం పొరపాటన్నారు. ప్రభుత్వాన్ని మెప్పించే క్రమంలో పత్రికాస్వేచ్ఛపై దాడి చేయడం, ఏకంగా ఎడిటర్, జర్నలిస్టులపై ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా పొలీసు శాఖ ప్రతిష్ట మరింత దిగజారుతోందన్నారు. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు. -
ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థుల ధర్నా
-
కడపలో టీడీపీ నేతలకు నిరసన సెగ
-
ఏంటి డ్రామాలా?.. టీడీపీ నేతలకు షాక్
వైఎస్సార్ జిల్లా, సాక్షి: కడపలో తెలుగు దేశం పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన లాంగ్ మార్చ్కు మద్దతు తెలిపేందుకు వెళ్లగా.. టీడీపీ నేతలు డ్రామాలు ఆపాలంటూ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టానికి మద్దతు తెలిపి టీడీపీ ముస్లింల గొంతు కోసిందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ చేపట్టింది. అయితే ర్యాలీ ప్రారంభం కాకముందే.. టీడీపీ నేత అమీర్ బాబు కొందరు కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్లను నిర్వాహకులు అడ్డుకున్నారు. పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపి ఇక్కడ డ్రామాలు వద్దంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేశాకే ఇలాంటి ర్యాలీలకు రావాలంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. నినాదాలు హోరెత్తడంతో చేసేదేమీ లేక అమీర్బాబు తన అనుచర గణంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
ధాన్యం కొనాల్సిందే
ఏలూరు (టూటౌన్)/భీమవరం/అడ్డతీగల/ఉండ్రాజవరం: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిపి వేయడంపై రైతులు మండిపడ్డారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజనూ కొంటామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి జిల్లాల్లో రైతులు శనివారం రోడ్లెక్కి నిరసన తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ ముందు మండుటెండలో బైఠాయించి రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. లక్ష్యం పెంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనకు మద్దతుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ లక్ష్యం పూర్తయ్యిందంటూ ప్రభుత్వం రబీ ధాన్యం కొనుగోళ్లు నిలిపి వేయడం దారుణమని విమర్శించారు. దిగుబడిలో సగం మేర కూడా కొనుగోలు చేయక పోవడం అన్యాయమన్నారు. కొన్నిచోట్ల లారీలు, ట్రాక్టర్లలోకి లోడు చేసిన ధాన్యం మూడు రోజులుగా రైతు సేవా కేంద్రాల వద్ద ఉండిపోయిందని చెప్పారు.ఏలూరు, వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద లారీ, ట్రాక్టర్లోకి లోడు చేసిన ధాన్యం కొనుగోలు నిలిచి పోవడంతో బైరెడ్డి లక్ష్మణరావు అనే రైతు తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పారు. దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు తదితర మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అనంతరం పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శివరామమూర్తికి రైతు సంఘం నాయకులు, కౌలు రైతులు వినతిపత్రం అందజేశారు. దళారుల ప్రమేయం వల్లే ఇబ్బందులుధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని అరికట్టి, ప్రభుత్వమే కొనాలని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం వైఎస్సార్సీపీ నాయకులు జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేయగా, దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, ప్రభుత్వం కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించడం దారుణం అన్నారు.తేమ, నూక సాకుతో దళారులు, మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రైతు బస్తాకు దాదాపు రూ.400 వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే «పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. పార్టీ ఉండి, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్తలు పీవీఎల్ నర్సింహరాజు, గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి పాల్గొన్నారు.కొనుగోలు కేంద్రం ఏర్పాటులో ఇంత తాత్సారమా?రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో వరి రైతులు డిమాండ్ చేశారు. శనివారం వీరంతా పాపంపేట వద్ద మూడు రోడ్ల కూడలిలో బైఠాయించి ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం తెరవడంలో తాత్సారం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి పోవడం వల్ల నష్టపోతున్నామన్నారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి రైతులు శనివారం తాళాలు వేసి నిరసన తెలిపారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఎవరు కొంటారని నిలదీశారు. -
ధాన్యం రైతుల ఆందోళన
-
తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఉద్రిక్తత!
గుంటూరు, సాక్షి: తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను తెలంగాణ అధికారులు ఆపేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణ అధికారుల చర్యతో.. పల్నాడు జిల్లా తంగెడ వద్ద కృష్ణానది వారధిపై భారీ స్థాయిలో ధాన్యం లారీలు ఆగిపోయాయి. తమను అనుమతించాలంటూ బ్రిడ్జిపై అడ్డంగా లారీలు పెట్టి ఆంధ్రా లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రతిగా తెలంగాణ నుంచి వస్తున్న లారీలను సైతం వాళ్లు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో నాలుగు గంటలుకు పైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాడపల్లి బ్రిడ్జి వద్ద ఐదు లారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్ చేయడం, అందుకు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పడమే ఈ మొత్తం పర్యవసనానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతలపై ఇరు రాష్ట్రాల అధికారులు స్పందించాల్సి ఉంది. -
ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్జెండర్ ధర్నా
ఆదోని రూరల్(కర్నూలు): తనను మోసం చేశాడంటూ ఆదోని మండలం బైచిగేరికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్జెండర్ ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం ఆదోని మండలం బైచిగేరికి చెందిన గణేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు హాసినిగౌడ్ ఊరఫ్ రామకృష్ణ(24) అనే ట్రాన్స్జెండర్తో పరిచయం ఏర్పడి, సహజీవనం చేస్తూ వచ్చాడు. గతేడాది గణేష్కు పెళ్లి కుదరడంతో ట్రాన్స్జెండర్ హాసినిని వదిలేసి సొంత గ్రామానికి రావడంతో 2024 జూన్ 10న బైచిగేరి గ్రామానికి వచ్చి తనకు న్యాయం చేయాలని హాసినిగౌడ్ నిరసన తెలిపింది. ఆదోని తాలూకా పోలీసులు ఆమె నివాసముంటున్న హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ సనత్నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు హాసినిగౌడ్ అక్కడ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే మరలా బుధవారం వచ్చి బైచిగేరిలో గణేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ‘‘నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం.. నువ్వు లేనిదే నేను లేనంటూ నా వెంట పడ్డాడు. నేను ఒక ట్రాన్స్జెండర్. నాతో నీవు సావాసం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పాను. అయినా వినకుండా, తననే పెళ్లి చేసుకుంటాని వెంట బడ్డాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మా ఇంటి నుంచి రూ.5 లక్షలు తీసుకెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్లో నివాసముంటున్నామని హాసినిగౌడ్ వాపోయింది. తన డబ్బులు రూ.5 లక్షలు అయినా ఇప్పించాలని, లేకపోతే గణేష్తో కాపురం అయినా చేయించాలని డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ రామాంజనేయులు గ్రామానికి చేరుకుని విచారించారు. హాసినిగౌడ్ గణేష్పై ఇదివరకే కేసు హైదరాబాద్లో నమోదయ్యిందని, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం చేస్తామని ఎస్ఐ చెప్పడంతో వారు హాసినిగౌడ్, ఇతర ట్రాన్స్జెండర్లు ధర్నా విరమించారు. -
జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థుల నిరసన
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) అభ్యర్థులు మంగళవారం నిరసన చేపట్టారు. డీఎస్సీలో పీఈటీ పోస్టుల భర్తీ లేకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చి మోసం చేశారని, మీరైనా న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. డీఎస్సీలో ఖాళీ పీఈటీ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. కాన్వాయ్లో పవన్ కళ్యాణ్ వస్తున్న సమయంలో పెద్దగా నినాదాలు చేసినా పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
‘లోకేష్ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్!
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు నిరసన సెగ తగిలింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం సంతాప సభ జరిగింది. అయితే ఆ సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) అభ్యర్థులు ఆయన కోసం నిరసన చేపట్టారుడీఎస్సీ నుంచి పీఈటీని ఎత్తేయడంపై ఆయన్ని ప్రశ్నించారు. పాదయాత్రలో నారా లోకేష్ తమకు హామీ ఇచ్చి మోసం చేశారని.. కనీసం మీరైనా న్యాయం చేయాలని పవన్ను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ, ఫ్లకార్డులు పట్టుకున్నారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, దాని ద్వారానే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.పవన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో వాళ్లు తమ నినాదాలను పెంచారు. అయితే పవన్ వాళ్లను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వాళ్లు నిరాశ చెందారు. -
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. -
ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు.. బయటకు రావాలంటే భయమేస్తుంది
-
గుంటూరులో మహిళల ధర్నా
సాక్షి, గుంటూరు: నగరంలోని మణి హోటల్ సెంటర్లో లక్కీ వైన్స్ను తొలగించాలంటూ మహిళలు, స్థానికులు ఆందోళనకు దిగారు. మద్యం షాపు దగ్గరకు వచ్చిన ఎక్సైజ్ సీఐ లతను మహిళలు నిలదీశారు. వైన్ షాపు కారణంగా మద్యం తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సీఐ లత దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ధర్నా చేస్తున్న స్థానికులపై ఎక్సైజ్ సీఐ లత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి మద్యం షాపును తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూల్స్ ప్రకారమే ఇక్కడ షాప్ కేటాయించామని సీఐ తెలిపారు. వైన్స్ దగ్గర తాగుబోతులు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా సెక్యూరిటీ కల్పిస్తామంటూ సీఐ లత చెప్పుకొచ్చారు. దీంతో సీఐ లతపై మహిళలు ఆగ్రహించారు. దీంతో సీఐ, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్నా చేస్తున్న స్థానికులతో వైన్స్ యాజమాన్యం కూడా గొడవకు దిగింది.ఇక్కడ నుంచి వైన్స్ తీసే ప్రసక్తే లేదంటూ మహిళలపై వైన్స్ యజమాని చిందులు తొక్కారు. ప్రభుత్వమే మాకు మద్యం అమ్ముకోమని లైసెన్స్ ఇచ్చిందని.. మీరేంటి చేసేదంటూ స్థానికులపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఐదేళ్లపాటు మమ్మల్ని మీరేం చేయలేరంటూ ధర్నా చేస్తున్న వారిపై చిందులేశారు. -
మగవారి హక్కుల కోసం.. పురుష సత్యాగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా కమిషన్ మాదిరిగానే.. పురుషులకూ ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ హస్తినలో మార్మోగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్లో శనివారం ‘పురుష సత్యాగ్రహం’ చేపట్టారు. సేవ్ ఇండియా ఫ్యామిలీ సంస్థ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. పురుషులు, భర్తల హక్కుల కోసం పోరాడుతున్న దేశంలోని సుమారు 40 ఎన్జీవోల ప్రతినిధులు 1,000 మందికి పైగా హాజరయ్యారు.వారిలో.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వంద మంది సహా.. ఇటీవల భార్యల చేతుల్లో హత్యకు గురైన, భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న భర్తల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పురుషులకు ప్రత్యేక కమిషన్తోపాటు.. చట్టాల్లో లింగ వివక్షను రూపుమా పాలని, గృహహింస, లైంగిక వేధింపుల కేసులతో పెరుగుతున్న పురు షుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.∙ -
హిజ్రాకి వేధింపులు.. యువకుడి ఇంటి ముందు ధర్నా
మంచిర్యాల: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ మందమర్రి మొదటి జోన్లో ఉండే అజయ్ అనే యువకుడి ఇంటి ఎదుట శనివారం హిజ్రాలు ఆందోళన చేపట్టారు. తనను గత కొంతకాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడని, ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతున్నాడని చందన అనే హిజ్రా వాపోయింది. వీడియో కాల్ చేసి డబ్బులు కావాలని అడుగుతున్నాడని, ఇవ్వకపోతే రైలు కిందపడి చనిపోతానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొంది. అజయ్ను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతులక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్నృలక్ష్మి దంపతుల కుమారుడు రామ్చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. -
గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై పడుకొని భూమన నిరసన
-
‘ఆ టీచర్’ మాకొద్దు..
నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం విద్యార్ధులు దాదాపు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఓ విద్యార్థి స్టడీ అవర్స్కు ఆలస్యంగా వచ్చిందని ఇంగ్లిష్ టీచర్ మూడు గంటల పాటు నిలబెట్టిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి టీచర్పై చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్కుమార్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయి తే వారం రోజులు గడుస్తున్నా ఆ ఉపాధ్యాయురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంగళవారం విద్యార్థులు పాఠశాల ప్రధాన గేటు వద్ద ఎండలో దాదాపు నాలుగు గంటల పాటు భోజనం చేయకుండా ధర్నా చేశారు. సంబంధిత టీచర్ను సస్పెండ్ చేసే వరకు మేము భోజనం చేయమని నినదించారు. ఆమె మళ్లీ పాఠశాలకు వస్తే ఎవ్వరం పాఠశాలలో ఉండమని విద్యార్థినులు బీష్మించారు. తను విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషించి, మానసికంగా వేధిస్తోందని, వాష్రూంకు వెళితే ఆ ఫొటోలు, వీడియోలు తీసి వాటిని బయట లీక్ చేస్తా నని భయపెడుతుందని విద్యార్థులు వాపోయారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదిలేదని కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న డీఈఓ రమేష్కుమార్ పాఠశా లకు చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పి ఆ టీచర్ను ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఉంచబోమని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.బిడ్డల్లాగా చూసుకుంటారనుకుంటే... పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటారని అనుకుంటే.. వీళ్లే ఈ విధంగా ప్రవర్తించడం బాగా లేదు సార్. మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ టీచర్ను సస్పెండ్ చేయాలి. తమ పిల్లలకు మంచి చదువు చెప్పించండి సార్. – సత్యనారాయణ, విద్యార్థిని తండ్రి, మొలచింతపల్లి -
గుంటూరులో రోడ్డెక్కిన మిర్చి రైతులు
-
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఇప్పటివరకూ ముగ్గురు అసువులు బాసారు. నిన్న(శుక్రవారం) జరిగిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, ఈరోజు(శనివారం) జరిగిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ను చూసే అడిషనల్ డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ తెలిపారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ 118 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.కేంద్ర బలగాలను మోహరించండివక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో కోల్ కతా హైకోర్టు స్పందించింది. నిరసన ర్యాలీలను అదుపులోకి తేవడంతో పాటు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రధానంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జంగీపూర్ లో కేంద్ర బలగాలను దింపాలని ఆదేశాల్లో పేర్కొంది.శాంతించండి.. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయంనిరసన కార్యక్రమాలు తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.వక్ఫ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని నిరసన కారులకు హామీ ఇచ్చారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.Shopping malls and shops are being looted in Shamsherganj, Murshidabad, in the name of peaceful protests against Waqf Amendment Act...Bangladeshi style of loot is happening....Is West Bengal steadily transforming to West Bangladesh ! pic.twitter.com/R2NmSNpo11— Sourish Mukherjee (@me_sourish_) April 12, 2025 Anyone has the right to PEACEFULLY protest against the Wakf law if they have a problem with it : NO ONE has right to resort to arson and violence in name of religion . West Bengal govt must come down hard on ALL involved. Spare NO ONE irrespective of community. In a surcharged… pic.twitter.com/t8IWRq0UD3— Rajdeep Sardesai (@sardesairajdeep) April 12, 2025 -
Waqf act:. పశ్చిమబెంగాల్లో నిరసన సెగ.. సీఎం మమతా విన్నపం ఇదే!
కోల్ కతా: వక్ఫ్ సవరణ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిన తరుణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిరసన జ్వాలలు రాజుకున్నాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా రాష్ట్రంలో ముర్షీబాద్ తో పాటు పల్ల జిల్లాల్లో వరుసగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో శనివారం అది ఇంకా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో వంద మందిని అరెస్టు చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.সবার কাছে আবেদনসব ধর্মের সকল মানুষের কাছে আমার একান্ত আবেদন, আপনারা দয়া করে শান্ত থাকুন, সংযত থাকুন। ধর্মের নামে কোনো অ-ধার্মিক আচরণ করবেন না। প্রত্যেক মানুষের প্রাণই মূল্যবান, রাজনীতির স্বার্থে দাঙ্গা লাগাবেন না। দাঙ্গা যারা করছেন তারা সমাজের ক্ষতি করছেন।মনে রাখবেন, যে…— Mamata Banerjee (@MamataOfficial) April 12, 2025 కాగా, పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు.. చట్ట రూపం దాల్చింది.ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు..సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి., ఈ క్రమంలో.. తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్ను కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. -
జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా


