కాంట్రాక్ట్‌ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి | Lecturers protest with black badges: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి

Oct 27 2025 5:21 AM | Updated on Oct 27 2025 5:21 AM

Lecturers protest with black badges: Andhra Pradesh

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు, కాంట్రాక్టు లెక్చరర్లు

నల్ల బ్యాడ్జీలతో లెక్చరర్ల నిరసన 

సాక్షి, అమరావతి: కూటమి ప్రభు­త్వ­ం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవు­తున్నా ఇప్పటి వరకు క్రమబద్ధీకర­ణను పట్టించుకోకపోవడం దు­ర్మా­ర్గ­మ­ని కాంట్రాక్ట్‌ లెక్చరర్లు మండిపడ్డా­రు. ఎ­న్ని­కల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశా­రు. రెగ్యులరైజేషన్‌ కోసం చట్టం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించా­రు.

2024, 2025 మే నెల వేతనాలు వెంటనే విడుదల చే­యా­లన్నారు. సమావేశం అనంతరం బందరు రోడ్డులోని డాక్టర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం వరకు ర్యాలీగా వెళ్లి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జీవో 114ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, డాక్టర్‌ గేయానంద్, ఉన్నత విద్యా పరిరక్షణ సమితి చైర్మన్‌ రాజగోపాల్, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement