కూటమి సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు: స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు | Workers Protest At Visakha Steel Plant | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు: స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు

Sep 15 2025 10:06 AM | Updated on Sep 15 2025 10:44 AM

Workers Protest At Visakha Steel Plant

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. తమ జీతాలు తక్షణమే చెల్లించాలంటూ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర నిరసనకు దిగారు. కంచాలతో భిక్షాటన చేస్తూ కార్మికులు నిరసన తెలిపారు. జీతాలు ఇవ్వకపోవడం వలన పిల్లలకు తిండి పెట్టలేక పోతున్నామని.. ఫీజులు కట్టలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్  స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామన్నారు. కార్మికులు అర్ధాకలితో ఉంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కనీసం స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి’’ అంటూ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు హెచ్చరించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement