నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. బోగోలు మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో ఒక్కసారిగా తెప్ప పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడిపోయారు. సామర్థ్యానికి మించి ఒకేసారి తెప్పపైకి 80 మందికి పైగా ఎక్కడంతో ఈ ఘటన జరిగింది. తెప్ప ఒకపక్క మునిగిపోవడంతో.. స్వామివారిని చేతులతోనే మోస్తూ భక్తులు ఊరేగింపు నిర్వహించారు.


