breaking news
Nellore
-
నారాయణ ఫుల్ పర్మిషన్స్...దర్జాగా ఇసుకు దందా
-
‘జగన్ను రెండు నిమిషాల్లో అరెస్టు చేయగలను’
చిల్లకూరు/వరదయ్యపాళెం : ‘నేను అనుకుంటే జగన్మోహన్రెడ్డిని రెండు నిమిషాల్లో అరెస్టుచేసి జైలుకు పంపగలను’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాళెం సమీపంలో ఏర్పాటుచేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, చంద్రబాబు మరోసారి సొంత డబ్బా కొట్టుకున్నారు. ప్రజావేదికపై చంద్రబాబు మాట్లాడుతూ..‘అభివృద్ధి, సంక్షేమానికే తాను బ్రాండ్ అంబాసిడర్నని, హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని మరోసారి చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో, చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంకెన్ని రోజులు ఇలా డబ్బా కొట్టుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)
-
నడిరోడ్డుపై మహిళ బట్టలు చించి... TDP కౌన్సిలర్ దారుణం
-
మంత్రి కనుసన్నల్లో SIR.. బయటపడ్డ ఆడియో లీక్
-
గర్భిణి కళ్లెదుటే భర్తపై ‘లాఠీ’న్యం
నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో పోలీసులు లైసెన్స్డ్ రౌడీలు.. గూండాలుగా మారి సామాన్యులపై లాఠీలతో విరుచుకుపడుతున్న ఘటనలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుండగా.. సింహపురిలోనూ ఖాకీ క్రౌర్యం వెలుగుచూసింది. కొండాపురం పోలీసులు టీడీపీ నేత డైరెక్షన్లో వరికుంటపాడు మండలం గణేశ్వరపురానికి చెందిన శింగంరెడ్డి రవీంద్ర అనే యువకుడిని రెండు రోజులపాటు స్టేషన్లో ఉంచి చితకబాదిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఖాకీలు కొట్టిన లాఠీ దెబ్బలతో బాధితుడు నెల్లూరు జీజీహెచ్లో చేరి చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రవీంద్ర భార్య హెప్సిబా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్వరపురానికి చెందిన శింగంరెడ్డి రవీంద్ర మంగళవారం ఉదయం నారసింహాపురం బస్టాండ్ వద్ద ఉండగా కొండాపురం స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి స్టేషన్కు రావాలని కోరారు. నేనెందుకు రావాలని అడిగిన రవీంద్రను కానిస్టేబుళ్లిద్దరూ అక్కడే ఉన్న మంచంపై పడేసి కాళ్లు, చేతులు కట్టేసి చితక బాదారు. ఆ తరువాత ఆటోలో కొండాపురం స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి నిండు గర్భిణి అయిన అతని భార్య కూడా వెంటనే స్టేషన్కు వెళ్లింది. ఇంతలో గణేశ్వరపురానికి చెందిన టీడీపీ నాయకుడు పేరం సుధాకర్ స్టేషన్కు వచ్చి ఎస్సై శ్రీనివాసులతో మాట్లాడారు. టీడీపీ నేత అక్కడ ఉండగా అతని డైరెక్షన్లో ఎస్సై శ్రీనివాసరావు రవీంద్రను లాకప్లోకి నెట్టి నిర్ధాక్షిణ్యంగా చితక బాదారు. దెబ్బలకు తట్టుకోలేక అతడు విలవిల్లాడినా కనికరించలేదు. తన భర్తను కొట్టొద్దని రవీంద్ర భార్య హెప్సిబా ఎస్సైను ప్రాధేయపడినా దుర్భాషలాడుతూ ఒక రోజు పగలు, రాత్రి అంతా చితక బాదారు. అదే రోజు అర్ధరాత్రి టీడీపీ నేత మద్యం తాగి మరోసారి స్టేషన్కు వచ్చి కానిస్టేబుల్ మహేష్ ద్వారా మరోసారి లాఠీలతో కొట్టించారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. తన భర్త రవీంద్ర వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడంతో రాజకీయ కక్షతో టీడీపీ నేత సుధాకర్ అక్రమ కేసులు బనాయించి సస్పెక్ట్డ్ షీట్ ఓపెన్ చేయించారు. ఆ తర్వాత పోలీసులు ద్వారా అనేకసార్లు హింసించడం ప్రారంభించారు. బుధవారం సాయంత్రం వరకు స్టేషన్లోనే నడిపించి, ఆ తరువాత తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని రాత్రి 8.30 గంటల సమయంలో వదిలేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక బాధితుడు రవీంద్ర గురువారం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. తన భర్తకు, తనకు టీడీపీ నేత సుధాకర్ ద్వారా ప్రాణహాని ఉందని, పోలీసుల ద్వారా తన భర్త ప్రాణాలను తీసేందుకు టీడీపీ నేత ప్రయత్నిస్తున్నారని హెప్సిబా ఆందోళన వ్యక్తం చేసింది. స్టేషన్లో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, జిల్లా పోలీసు అధికారులు స్పందించి కొండాపురం ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకుని తన కుటుంబానికి న్యాయం చేయాలని హెప్సిబా కోరింది. -
గిరిజన మహిళను వివస్త్రను చేసి.. కాళ్లతో కొట్టి..
నెల్లూరు: టీడీపీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్తోపాటు అతని కుటుంబం కలిసి దుశ్శానపర్వానికి తెగించిన వైనం కావలి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార మదంతో టీడీపీ నేతలు బరితెగించారు. కుమారుడి ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ గిరిజన (ఎరుకుల సామాజిక వర్గం) మహిళను వివస్త్ర చేసి జుట్టు పట్టుకుని కాళ్లతో, చేతులతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన గత శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగితే.. ఈ కేసును తొక్కిపెట్టిన పోలీసులు వారం తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కేసు కావలి రెండో పట్టణ పోలీసులు క్రైం నంబర్గా 38/2026 నమోదు చేశారు. విశ్వసనీయంగా సేకరించిన సమాచారం మేరకు.. కావలి కచ్చేరిమిట్టకు చెందిన ఓ గిరిజన మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతను అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె కుమారుడు అదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువతితో ప్రేమాణయం సాగిస్తున్నాడని తెలుసుకుని ఆమే.. కొద్ది రోజుల క్రితం స్థానిక టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీంకు తెలియజేసింది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో షర్మిల, సిరాజ్, కమల్, బీబ్జాన్, మల్లికాతోపాటు మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం ఆమె ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి వివస్త్ర చేసి కాళ్లతో, చేతులతో కొట్టారు. దాదాపు అర్ధగంటకుపైగా చుట్టు పక్కల జనం చూస్తుండగానే ఈ దారుణానికి తెగించారు. ‘ఎరుకుల లం.. నిన్ను చంపేసి సూసైడ్ అయిని రాయిస్తే.. నీకు దిక్కెవరు’ అంటూ విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆమె వారి నుంచి తప్పించుకుని తన మానాన్ని కాపాడుకునేందుకు చేతులు అడ్డు పెట్టుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగిన తర్వాత సమాచారం అందుకున్న కావలి రెండో పట్టణ సీఐ గిరిబాబు, ఎస్సై గోపీనాథ్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని విచారించారు. అదే రోజు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నప్పటికీ.. కేసు నమోదు చేయలేదు. నీరుగార్చేందుకే వారం తర్వాత కేసు నమోదు అయితే ఈ ఘటనకు సంబంధించి స్థానికులు కొందరు వీడియోలు తీశారు. నిందితులు ఈ విషయం బయటకు వెల్లడిస్తే ఎవరినైనా చంపేస్తామంటూ బెదిరించారు. స్థానికులు వీడియోలు తీసినప్పటికీ బయట పెట్టేందుకు ఎవరూ సాహించలేదు. దీంతో ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించడంతో బయటకు పొక్కకుండా ఉండిపోయింది. బాధితురాలు సైతం రహస్య ప్రాంతంలో చికిత్స పొందుతోంది. అయితే ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు వారం తర్వాత కేసు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి శారీరకంగా గాయపరిచి, పరువుకు భంగం కలిగించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కలిగించారనే సెక్షన్లతో స్టేషన్ హెడ్కానిస్టేబుల్ వై. శ్యామ్కుమార్తో కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు డీఎస్పీ పరిధిలో ఉంటుంది. నిందితులు టీడీపీ నేతలు కావడంతో ఈ ఘటన జరిగిన రోజే సీఐ గిరిబాబు, ఎస్సై గోపీనాథ్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించినప్పటికీ అప్పుడే ఫిర్యాదు స్వీకరించినప్పటికీ కేసు నమోదు చేయకుండా, వారం తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించి, హెడ్కానిస్టేబుల్ పేరుతో ఆలస్యంగా కేసు నమోదు చేయడం, ఇది ఫాల్స్ కేసుగా కొట్టిపారేసేందుకు అనే వాదన పోలీస్ వర్గాల నుంచి వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా నిందితురాలు షరి్మల స్నానం చేస్తుండగా సదరు గిరిజన మహిళ కుమారుడు చూశాడంటూ అదే సమయంలో కౌంటర్ కేసును నమోదు చేయడం గమనార్హం. -
టార్గెట్ నల్లపురెడ్డి.. హద్దు దాటిన ప్రశాంతి రెడ్డి..
-
రాష్ట్రంలో రాక్షస పాలన
నెల్లూరు (వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందని, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతోందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, డీఎస్సీలో జరిగిన అవకతవకలను, ఎత్తిచూపుతున్నారనే ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థల్లో దాడులు చేయడంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 18 మంది శాసన మండలి సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు చంద్రశేఖరరెడ్డికి సంఘీభావంగా నెల్లూరుకు తరలివచ్చారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సర్కారు దమన నీతిని ఎండగట్టారు. చిల్డ్రన్స్పార్కు రోడ్డులోని చంద్రశేఖర్రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ర్యాలీగా వీఆర్సీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరంకుశ, నియంతృత్వ పోకడలు మంచివి కాదన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలను తగిన సాక్ష్యాధారాలతో ఎత్తిచూపినందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై అర్ధరాత్రి దాడులు నిర్వహించారని విమర్శించారు.ఈ జిల్లాలో నారాయణ విద్యాసంస్థలు, హాస్టళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని, వాటిపై దాడులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఎంవీ రామచంద్రారెడ్డి, కల్పలతరెడ్డి, కేఆర్జే భరత్, ఇషాక్బాషా, పి.రామసుబ్బారెడ్డి, మంగమ్మ, రమేష్ యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేరిగ మురళీధర్, తూమాటి మాధవరావు, ఎండీ రుహుల్లా, కవురు శ్రీనివాస్, వెంకటరవీంద్రనాథ్, బొమ్మి ఇజ్రాయిల్, కె హరిబాబు, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రాష్ట మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పాల్గొన్నారు. -
ఆంటీతో యువకుడి వివాహేతర సంబంధం..!
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో పట్టపగలు మహిళ దారుణ హత్యకు గురైంది. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే అనుమానంతో ఆమెను కడతేర్చాడు. అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. కనుపర్తిపాడుకు చెందిన రేవతి (35)కి సుమారు 18 సంవత్సరాల క్రితం సుమన్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విభేదాల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం రేవతి భర్త నుంచి విడిపోయింది. ఆమె పిల్లలతో కలిసి కనుపర్తిపాడులో తండ్రి వద్ద ఉంటోంది. ఈక్రమంలో అదే ప్రాంతానికి చెందిన కడప శ్రీకాంత్తో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె మరొకరితో మాట్లాడుతుందన్న అనుమానంతో శ్రీకాంత్ తరచూ గొడవ పడేవాడు. ఎలాగైనా రేవతిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.కత్తితో పొడిచి..మంగళవారం రేవతి కొండాయపాళెంలోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్న తన తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చి స్కూటీలో పెట్రోల్ పట్టించుకుని వెళ్తానని బయటకు వచ్చింది అక్కడ శ్రీకాంత్ ఆమెను కలిశాడు. ఇద్దరూ పడారుపల్లి చెరువుకట్ట రేవు వద్దకు వెళ్లారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం నిందితుడు నేరుగా వేదాయపాళెం పోలీస్స్టేషన్కు వెళ్లి తాను ఓ మహిళను హత్య చేశానని జరిగిన విషయం చెప్పాడు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి కాలికి గాయమై ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేర్పించినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. -
యాత్రికుల బస్సు ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
గల్లీ గల్లీలో కల్లు.. సాక్షి స్టింగ్ ఆపరేషన్ లో సంచలన విషయాలు
-
మా ఊరునే బ్యాంక్లో తాకట్టు పెట్టారు
దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ గ్రామం. వందల మంది నివసిస్తున్న పల్లె. ఇంటి పన్నులు చెల్లిస్తున్న ప్రజలు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఆ గ్రామమే లేదు. ఈ విస్మయకర పరిస్థితి దగదర్తి మండలం తిమ్మారెడ్డిపాళెంలో వెలుగు చూసింది. నివాసిత భూములను రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగా మార్చేసి, ఏకంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం గమనార్హం. అదే భూములపై బ్యాంకుల్లో రూ.లక్షల్లో రుణాలు పొందారు. నెల్లూరు జిల్లా: మండలంలోని చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపాళెం గత ఆరు దశాబ్దాలుగా నివాస ప్రాంతంగా కొనసాగుతోంది. సుమారు 50 కుటుంబాలు, 200 మందికి పైగా జనాభా అక్కడ స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నారు. ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారు. కానీ ఆశ్చర్యకరంగా, వెబ్ల్యాండ్ సహా రెవెన్యూ రికార్డుల్లో ఆ ప్రాంతంలో గ్రామం ఉన్నట్లుగా నమోదు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి ఇంటి స్థలాలు కావని, వ్యవసాయ భూములని వెబ్ల్యాండ్లో చూపిస్తోందని సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు చెబుతుండడంతో గ్రామస్తులు విస్తుపోయారు. భూములు ప్రజలవి.. పేర్లు బడాబాబులవి చెన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 177, 175ల్లో ఉన్న తిమ్మారెడ్డిపాళెం ప్రాంతం రికార్డుల్లో మాత్రం గ్రామస్తుల పేర్లకు బదులుగా ఇతరుల పేర్లతో నమోదై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కొందరు బడాబాబులు 2005–06 సంవత్సరాల్లో ఈ భూములను తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రెండేళ్ల క్రితం వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా చూపిస్తూ సాగులో ఉన్నామని పేర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సదరు సర్వేనంబర్ల భూముల్లో నివాసాలు ఉన్నాయి. సాగు భూములుగా చూపించి రుణాలు రికార్డుల్లో నమోదైనట్లు సాగు భూములుగా చూపించి తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి సుమారు రూ.30 లక్షల వరకు రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. ఒక వైపు గ్రామస్తులకు తమ ఇళ్లను రిజి్రస్టేషన్ చేసుకునే హక్కు లేకుండా పోతుండగా, మరో వైపు అదే భూములపై రుణాలు మంజూరు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రామాణికతపై గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుణాల భారం.. అధికారుల మౌనం రికార్డుల్లో పేర్లు ఉన్న వ్యక్తులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడం వల్లే పేర్ల తొలగింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులను ప్ర భావితం చేసి వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో ఉన్నతాధికారుల సమగ్ర విచారణలోనే తేలాల్సి ఉంది. అయితే గ్రామస్తుల అనుమానాలు మాత్రం రోజు రోజుకు మరింత బలపడుతున్నాయి. ‘విచారణ’ పేరిట రెండేళ్లుగా కాలయాపన..? సమస్యపై పలుమార్లు వినతులు ఇచ్చినా అధికారులు ‘విచారణ చేస్తున్నాం’ అనే ఒకే సమాధానంతో కాలం గడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లు గడిచినా రికార్డుల్లో మార్పులు జరగకపోవడం, ఇటీవల నిర్వహించిన రీ సర్వేలో కూడా సమస్యను పరిష్కరించకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. హక్కు కోసం ఎదురు చూపులు ఇంటి స్థలాలకు రిజి్రస్టేషన్ లేకపోవడంతో కుటుంబ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. తరతరాలుగా నివసిస్తున్న తమ గ్రామానికి అధికారిక గుర్తింపు లేకపోవడం బాధాకరమని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తిమ్మారెడ్డిపాళెంను రెవెన్యూ రికార్డుల్లో గ్రామంగా నమోదు చేయాలని, అక్రమ నమోదులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.మాది ఊరు కాదంట.. పొలాలంట మేము 50 ఏళ్లుగా ఈ గ్రామంలోనే నివాసం ఉంటున్నాం. మా ఊరును వ్యవసాయ పొలాలుగా నమోదు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో మా ఊరే లేకుండా చేశారు. మేము నివసిస్తున్న ఇల్లు స్థలం కూడా వ్యవసాయ భూమిగా ఇతరుల పేరుతో ఉంది. మాకు రిజి్రస్టేషన్ కాదంటున్నారు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెవెన్యూ రికార్డుల్లో తమ గ్రామాన్ని నమోదు చేయాలని కోరుతున్నాను. – వనిపెంట కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డిపాళెంమా ఊరునే బ్యాంక్లో తాకట్టు పెట్టారు మా ఊరు ఉన్న సర్వే నంబర్ పేరుతో కొందరు వ్యక్తులు వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక అవసరాలకు ఇల్లు రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు మా గ్రామానికి జరిగిన అన్యాయంపై స్పందించాలి. ఎవరెవరో రుణాలు తీసుకుంటే.. దానికి మేము బాధ్యత వహించాలా?. – సాన మహేంద్ర, తిమ్మారెడ్డిపాళెం -
టీడీపీ నేత జులుం.. విజిలెన్స్ సిబ్బందిపై దాడి..
-
తమ్ముడికి వెన్నుపోటు పొడిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
-
నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.ఇద్దరు మత్స్యకారులు మృతిచెందడం బాధాకరం. గల్లంతైన మరో ఇద్దరు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా.గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి.బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు. నెల్లూరు తీర ప్రాంతంలో పడవ ప్రమాదంనెల్లూరు జిల్లా బోగోలు మండలం సముద్ర తీరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన బోటు తిరగబడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. ఉదయం నాలుగు గంటలకు తెప్ప బోటులో నలుగురు కలిసి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు తిరగబడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరు మత్స్య కారుల కోసం గాలింపు చర్యలు కొసాగుతున్నాయి. మృతులు అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
-
కోవూరులో కొట్టుకున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ముందే బాహాబాహీ
-
నెల్లూరు జిల్లాలో దారుణం, శ్రీనుపై పెట్రోల్ పోసి తగలబెట్టిన టీడీపీ వర్గం
-
నెల్లూరు తీరంలో దేవర... జువ్వలదిన్నె మత్స్యకారులకు భరోసా
-
వైఎస్ జగన్ జువ్వెలదిన్నె ఏరియల్ సర్వే
-
జగన్ కు ఘన స్వాగతం పలికిన మత్స్యకారులు
-
Watch Live: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన
-
జువ్వెలదిన్నెకు బయల్దేరిన జగన్.. హెలికాప్టర్ లో మిథున్ రెడ్డి
-
సింహాల్లా పోరాడిన తండ్రి కూతురు
-
‘వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు’
నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ పూర్తిగా దిగజారిపోయారు. ఏబీఎన్ రాధాకృష్ణ చెత్త రాతలపై మహిళలు ఛీ కొడుతున్నారు. మావిగన్ ప్రతిపాదన పెట్టినప్పటి నుంచి కూటమి సర్కార్కు భయం వేస్తోంది. మహిళలను అవమానించి లబ్ధిపొందాలనుకోవడం దుర్మార్గం. జగన్ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు మొదలైంది. చంద్రబాబు అవినీతి కోట బద్ధలవుతుందని భయపడుతన్నారు’ అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జడలు విప్పి రాక్షస విన్యాసాలు..వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మావిగన్’పై ప్రజల్లో విస్తృత చర్చను చూసి కూటమి నేతల్లో వణుకు మొదలైందని కాకాణి గోవర్ధన్డ్డి అన్నారు. ‘ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎల్లో మీడియా జడలు విప్పి రాక్షస విన్యాసాలు చేస్తోంది. మావిగన్ చర్చను అడ్డుకోవడానికి ఏబీఎన్ రాధాకృష్ణ క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నారు.వైఎస్ జగన్మోహన్రెడ్డిని దూషిస్తేనే ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ పెరుగుతుందని చంద్రబాబు టార్గెట్ పెట్టారు. అవినీతి చేసినా పర్లేదు కానీ.. వైఎస్ జగన్ను తిట్టడమే కూటమి ఎమ్మెల్యేల లక్ష్యం. రాధాకృష్ణ తన ‘చెత్తపలుకు’లో అత్యంత దిగజారి వైఎస్సార్సీపీ నేతలపై విషం చిమ్మారు. ఎవరూ మాట్లాడలేని చండాలమైన భాషను రాధాకృష్ణ వాడుతున్నారు.రాధాకృష్ణ జీవితమంతా అవినీతి మయం.. ఆయనలో ఎక్కడా నీతి అనేది కనిపించదు. సొంత జీవితంలో అనైతిక సంబంధాలు పెట్టుకున్న రాధాకృష్ణ.. మా ఇంటి మహిళల గురించి మాట్లాడతారా? చంద్రబాబుకు బ్రోకరిజం చేసిన రాధాకృష్ణకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు.రాజకీయ విమర్శల పేరుతో మహిళలను అవమానించడం అత్యంత నీచమైన ప్రవర్తన. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ వంద శాతం బ్రోకరిజం నడిపిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే సిగ్గు శరం లేకుండా దళారీ పనులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్ సీఎం అవ్వడం ఖాయం’ అని అన్నారు. -
నన్ను ఆ ఎమ్మెల్యే టార్గెట్ చేశారు.. టీడీపీ మహిళా సంచలన కామెంట్స్
-
భూ కబ్జాకు తెగబడుతున్న టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. ఏకంగా మైపాడు బీచ్ లోనే ఆక్రమణ
-
పెద్దల 'కుట్ర'..!
గంగపుత్రులకు అధికార టీడీపీ పెద్దలు వెన్నుపోటు పొడిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం స్థానిక మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఐదు నెలల కింద స్వాదీనం చేసుకున్న పాండిచ్చేరి (కరైకల్) బోట్లను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ వద్ద ఉంచారు. ఇటీవల టీడీపీ కీలక మంత్రులు వచ్చి వెళ్లాక వాటిని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు అండగా నిలవకుండా తెరవెనుక లాలూచీకి పాల్పడ్డారంటూ కూటమి నేతల కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణకు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. సింగరాయకొండ: తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో మన తీర ప్రాంతంలో చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇదంతా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీనిపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొంత వరకు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకుకెళ్లినా ప్రయోజనం లేదు. సోనాబోట్ల ఆగడాలతో విసిగిపోయిన మత్స్యకారులు వాటిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాంత మత్స్యకారులు ఏకమై ఒక సైన్యంలా ఏర్పడ్డారు. ప్రాణాలకు తెగించి తీరానికి వచ్చిన సోనాబోట్లను వెంబడించారు. తమిళనాడు జాలర్లను తరమికొట్టారు. నాలుగు సోనాబోట్లను స్వాదీనం చేసుకున్నారు. వాటిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్లో భద్రపరిచారు. ఎనిమిది నెలల కిందట జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్లను తమ భద్రతలో ఉంచుకున్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు వచ్చినా వదిలేందుకు మత్స్యకారులు ససేమిరా అన్నారు. మీ అంతుచూస్తామంటూ బెదిరింపులు ‘‘మా బోట్లను నిర్బంధించి, 8 నెలల పాటు ఇబ్బందులకు గురిచేస్తారా మీ అంతుచూస్తాం’’ అంటూ కరైకల్ మత్స్యకారులు బెదిరింపులకు దిగుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా తీరానికి దగ్గరగా చేపల వేట సాగిస్తూ లక్షలాది రూపాయల విలువైన వలలు తెంచేస్తూ స్థానికులు కనబడితే దాడులకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. చివరకు వారు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.జువ్వలదిన్నెలో ఆ రాత్రి ఏం జరిగింది.. ఇటీవల జువ్వలదిన్నెకు మంత్రులు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు వచ్చి వెళ్లాక హార్బర్ నుంచి మత్స్యకారులు స్వాదీనం చేసుకున్న సోనాబోట్లు మాయమయ్యాయి. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతనే మంత్రులు వచ్చి ఈ మంత్రాంగం అంతా నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు వచ్చిన కార్యక్రమానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న మత్స్యకారులను మాత్రమే అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కరైకల్ ప్రాంతంలోని సోనాబోట్లకు చెందిన మత్స్యకారులు కూడా హార్బర్లోకి ప్రవేశించి అక్కడ నిర్బంధంలో ఉన్న నాలుగు బోట్లకు డీజిల్ నింపారు. ఒక్కో సోనాబోటుకు సుమారు 10 వేల లీటర్ల సామర్ధ్యమున్న డీజిల్ ట్యాంకు ఉంటుంది. ఈ ప్రకారం నాలుగు సోనాబోట్లకు సుమారు ఒకటిన్నర డీజిల్ ట్యాంకర్ సుమారు 15 వేల లీటర్లు నింపారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తరువాత అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బోట్లను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు బోట్లకు చెందిన ఇంజన్లు పనిచేయగా, ఒక బోటు ఇంజన్ మాత్రం మొరాయించింది. దీంతో ఆ బోటును మిగతా వాటికి కట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై వెంటనే తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన సోనాబోట్లలో పనిచేస్తున్న తమ ప్రాంతానికి చెందిన వారిని అప్రమత్తం చేశారు. వారు ఆ బోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరమ్మతులకు గురైన బోటును వదిలేసి మిగతావాటితో పరారయ్యారు. వారు వదిలేసిన బోటును స్థానిక మత్స్యకారులు వెనక్కి తీసుకొస్తుండగా కరైకల్కు చెందిన మత్స్యకారులు సుమారు 12 బోట్లలో చుట్టుముట్టారు. దాడికి యత్నించారు. బోటును ఢీకొట్టారు. దౌర్జన్యానికి దిగి మరమ్మతులకు గురైన బోటును తీసుకెళ్లిపోయారు. బోటును ఢీకొట్టడంతో లోపలిభాగం ధ్వంసమైంది. దానిని మరమ్మతులు చేయాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెర వెనకున్నదెవరు..? జువ్వలదిన్నె హార్బర్లో మెరైన్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న నాలుగు బోట్లను కరైకల్ మత్స్యకారులు తరలించుకుపోవటంపై భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఈ పని జరిగే అవకాశం ఉందా అని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెరవెనుక కుట్రలు చేసి బోట్లను వదిలేసి నేడు దానిని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు అండగా ఉంటామంటూ ప్రకటనలు చేయడం సరికాదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కుట్రదారులెవరో తేల్చాలని వారు డిమాండ్ చేస్తుŠాన్నరు. 15 వేల లీటర్ల డీజిల్ ఎక్కడ నుంచి వచ్చిందో బహిర్గతం చేయాలని నిలదీస్తున్నారు.మెరైన్ పోలీసుల రక్షణలో ఉన్న నాలుగు బోట్లు ఎలా వెళ్లాయో ప్రకటించాలని వారు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. త్వరలో 164 గ్రామాల మత్స్యకారుల సమావేశం కరైకల్ బోట్ల వ్యవహారంపై శ్రీకాకుళం నుంచి తడ వరకు ఉన్న 164 మత్స్యకార గ్రామాల ప్రజలు సమావేశమై తదుపరి కార్యాచరణకు సమాయత్తమవుతున్నారు. వీరు త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారని స్థానిక మత్స్యకారుడు వివరించారు.ఐదు నెలలుగా ఎటువంటి భయం లేకుండా చేపల వేట సాగించామని, ఇప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు సమస్య పరిష్కరించకుండా మరింత సమస్యను సృష్టించారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
TDP నేతల రాసలీలలు.. బట్టలు విప్పి నాగిని డ్యాన్స్.. బయటపడ్డ సంచలన వీడియో
-
నెల్లూరులో టీడీపీ అరాచకం
నెల్లూరు(బారకాసు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. టీడీపీలో చేరని కారణంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్పై కక్షసాధింపు చర్యలకు దిగింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 46వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ నిర్వహిస్తున్న వాటర్ప్లాంట్ను కారణం చూపకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా ఉన్నపళంగా సోమవారం జేసీబీతో కూల్చేశారు.కార్పొరేటర్ ఉమామహేష్ 2019లో నాడు మంత్రిగా ఉన్న అనిల్కుమార్, అప్పటి 46వ డివిజన్ కార్పొరేటర్ వి.సుధారాణి సొంత నిధులతో అదే డివిజన్లోని చిన్నబజార్ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఖాళీ స్థలంలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు వేలూరు ఉమామహేష్ను కొన్నిరోజులుగా టీడీపీలో చేరాలంటూ అనేక విధాలుగా ప్రలోభాలు పెడుతూ వచ్చారు. ఇందుకు ఉమామహేష్ ఒప్పుకోకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే వాటర్ ప్లాంట్ను ఎలాంటి సమాచారం లేకుండానే కార్పొరేషన్ అధికారులు ధ్వంసం చేశారు.ఈ విషయం తెలుసుకున్న ఉమామహేష్ స్థానికులతో కలిసి హుటాహుటిన వాటర్ప్లాంట్ వద్దకు చేరుకుని ఎందుకీ దౌర్జన్యమంటూ కార్పొరేషన్ కింది స్థాయి అధికారులను అడిగారు. తమకు ఏమీ తెలియదని పైఅధికారుల ఆదేశాల మేరకు వాటర్ ప్లాంట్ను తొలగిస్తున్నామని దురుసుగా సమాధానం చెప్పారు. దీనిపై కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఇలా చేయడమేమిటని ఉమామహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై కార్పొరేటర్ ఉమామహేష్ చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు 2024 నుంచి తమ పార్టీలో చేరాలంటూ అందుకు రూ.కోట్లు ఇస్తామని ప్రలోభాలు పెట్టడం, తనను అనేక దఫాలుగా అడగడం జరిగిందన్నారు. అందుకు తాను ఒప్పుకోకపోవడంతోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిమ్ ఏర్పాటు కోసమే తొలగించాం నగరంలోని చిన్నబజార్ ప్రాంతంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో జిమ్ ఏర్పాటు చేయనున్నట్లు కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అందులో భాగంగానే కార్పొరేషన్కు చెందిన ఖాళీ స్థలం కాబట్టి అక్కడున్న వాటర్ ప్లాంట్ను తొలగించాల్సి వచ్చిందన్నారు. -
వ్యభిచారం కేసులో దొరికిన టీడీపీ నేత.. తప్పించబోయి పరువు తీసుకున్న పోలీసులు
-
సైదాపురం గ‘లీజు’ వాస్తవమే
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో సాగుతున్న మైనింగ్ అక్రమాలను ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది. ‘సైదాపురం గ‘లీజు’కు సర్కారు సై’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మైనింగ్ లీజు 50 ఏళ్ల గడువు ముగిసిన విషయం వాస్తవమేనని, అయితే లీజుదారులు గడువులోగా దరఖాస్తు చేసుకున్నందున ఆ లీజులు చట్టప్రకారం ఇంకా అమలులో ఉన్నట్లుగానే పరిగణిస్తున్నామని గనుల శాఖ నెల్లూరు జిల్లా అధికారి వివరణ ఇచ్చారు. ఆయా కంపెనీలు 15,69,334 మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించి నిబంధనల ప్రకారం రూ.188 కోట్లు జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ జరిమానా చెల్లించకపోయినా, తాము 10 రెట్లు డెడ్ రెంట్ చెల్లించాము కాబట్టి తమను కూడా ఎల్ఓఐ పొందిన వారిగా పరిగణించాలని లీజుదారులు అభ్యర్థించారని చెప్పారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 229 ప్రకారం 2025 ఫిబ్రవరి 20లోపు ఎల్ఓఐ పొందిన వారికి మాత్రమే లీజులు కొనసాగించే వెసులుబాటు ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించడం ఉద్దేశ పూర్వకమే అని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం కటాఫ్ తేదీలోపు ఎల్ఓఐ లేని పక్షంలో ఆ గనులను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోవాల్సి ఉండగా, అధికారులే వారికి దొడ్డిదారి వెతుకుతుండటం గమనార్హం. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను కొల్లగొట్టిన కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టి.. బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సింది పోయి మళ్లీ వారికే లీజులు ఇవ్వాలని అధికారులు సిఫార్సు చేయడం విశేషం. ఆ 5 కంపెనీల లీజుల కాలపరిమితి 2012–2022 మధ్యే ముగిసిపోయిందని ఒప్పుకున్న గనుల శాఖ.. గడువు ముగిసిన తర్వాత కూడా కాలయాపన చేస్తూ వారిని మైనింగ్ కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నట్లు తేటతెల్లమైంది. అక్రమ మైనింగ్ జరిమానాలపై హైకోర్టు స్టే ఇచ్చిందని అధికారులు సాకు చెబుతున్నారు. కోర్టు కేవలం నోటీసుల సాంకేతికతను ప్రశి్నంచి తాజాగా విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వమని ఆదేశించింది. ఆ గడువు ముగిసినా అధికారులు నివేదిక ఇవ్వకుండా అక్రమార్కులకు మేలు చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గనుల శాఖ ఇచ్చిన వివరణ వాస్తవాలను కప్పిపుచ్చుతూ, దోపిడీదారులకు కొమ్ముకాసేలా ఉందే తప్ప ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడేలా లేదని స్పష్టమైంది. -
‘వ్యభిచార’ లాడ్జీలో పట్టుబడ్డ టీడీపీ నేత రావూరి రాధాకృష్ణమ నాయుడు
నెల్లూరు: వ్యభిచార నిర్వహణ లాడ్జీపై పోలీసుల దాడిలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ కీలక నేత, పీఏసీఎస్ అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమ నాయుడు పట్టుబడ్డారు. నెల్లూరు ఏఎస్పీ పలు లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. మొత్తం 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా రాధాకృష్ణమ నాయుడు చలామణి అవుతున్నారు. ఇటు వ్యభిచార గృహాలు నడుపుతూ ఆయన అధిష్ఠానంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్తో రాధాకృష్ణమ నాయుడుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధిష్ఠానంలో పలుకుబడితో సర్వేపల్లిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయింపులో సదరు ప్రస్తుత విటుడు రాధాకృష్ణమ నాయుడిది కీలక భూమిక. -
సైదాపురం గ‘లీజు’కు సర్కారు సై!
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ అక్రమార్కుల ఆకలి ఎంతకూ తీరడం లేదు. క్వార్ట్జ్, పల్స్పర్, మైకా గనులను కొల్లగొట్టి దొరికిపోయిన తర్వాత, లీజు గడువు ముగిశాక కూడా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. అంతటితో ఆగక లీజులను పొడిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బహిరంగ వేలం వేయాల్సిన గనులను దొడ్డి దారిన పొందేందుకు 5 కంపెనీలు మంత్రాంగం నడుపుతుండగా, అందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు అండదండలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎంపీ ‘ముఖ్య’ నేత కుమారుడితో వాటాలు మాట్లాడుకుని ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టే ప్రధాన అనుచరుడు చక్రం తిప్పుతున్నారు. సైదాపురం మండలంలోని క్వార్ట్జ్, పల్స్పర్, మైకా గనుల్లో భారీ ఎత్తున లూటీ జరిగినట్లు గత ఏడాది గనుల శాఖ స్వయంగా గుర్తించింది. ఎం.శోభారాణి, షిర్డీ సాయి, సిద్ధివినాయక (జి.భరత్ బాబు), శ్రీ వెంకట కనకదుర్గ అండ్ ఉమామహేశ్వర మైకా మైన్, శ్రీ కేఎస్ఆర్ అండ్ కంపెనీలు 15,69,172 మెట్రిక్ టన్నుల ఖనిజాలను అక్రమంగా తవ్వినట్లు తేల్చింది. ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి ఆ కంపెనీలకు రూ.188.19 కోట్ల భారీ జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఆ కంపెనీలు జరిమానా సొమ్మును ప్రభుత్వానికి కట్టకపోగా, మళ్లీ 20 ఏళ్లపాటు లీజులు పొడిగించుకోవడానికి చక్రం తిప్పుతుండడం విస్తుగొలుపుతోంది. కేంద్ర నిబంధనలకు పాతర.. రద్దయిన ఫైళ్లకు ప్రాణం» కేంద్ర మైనింగ్ చట్టం (ఎంఎండీఆర్, 2015 చట్టం) ప్రకారం పాత లీజులకు గరిష్టంగా 50 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. దీని ప్రకారం సైదాపురంలోని ఈ ఐదు కంపెనీల లీజులు 2012–2022 మధ్య కాలంలోనే ముగిశాయి. చట్ట ప్రకారం ఈ గనులను తక్షణమే స్వాధీనం చేసుకుని, బహిరంగ వేలం ద్వారా కొత్త వారికి కేటాయించాలి. కానీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండడంతో గడువు తీరినప్పటికీ, ఆ గనులను మళ్లీ ఆ కంపెనీలకే అప్పగించేలా గనుల శాఖలో ఫైళ్లు చకచకా కదులుతున్నాయి.» కేంద్ర మైనింగ్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం 2025 ఫిబ్రవరి 20కి ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) పొందని దరఖాస్తులు ఆటోమేటిక్గా రద్దవుతాయి. ఆ తేదీ నాటికి ఎల్ఓఐ లేకపోతే ఆ లీజులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు అక్కడితో ముగిసినట్లే. ఒకవేళ 2025 ఫిబ్రవరి 20కి ముందే ఎల్ఓఐ జారీ అయి ఉన్నా, వేలం ప్రక్రియ పూర్తయి బిడ్డర్ ఎంపికైనప్పుడు మాత్రమే ఆ లీజులను రెండేళ్లలోపు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఆ గడువు దాటితే ఆ లీజులను సైతం ఇక అమలు చేయలేమని స్పష్టంగా పేర్కొంది.» మున్ముందు ఒకసారి లీజు మంజూరు చేసిన తర్వాత అవి మైనర్ మినరల్స్ కాదని మేజర్ మినరల్స్ కిందకు వస్తాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 16న జారీ చేసిన జీఓఆర్టీ నెంబర్ 229లో కూడా ఇదే విషయాలను స్పష్టంగా పేర్కొంది. 2025 ఫిబ్రవరి 20కి ముందు ఎల్ఓఐ జారీ అయిన కేసులనే ప్రత్యేకంగా పరిగణించాలని, లేదంటే ఆ కేసులను ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదని స్పష్టత ఇచ్చింది.అన్నీ 50 ఏళ్ల లీజు పూర్తయినవే» సైదాపురం మండలంలోని ఈ ఐదు లీజులు 50 సంవత్సరాల గడువు పూర్తి చేసుకున్నవే. నిబంధనల ప్రకారం ఆ లీజులను పొడిగించే అవకాశం లేదు. అలాంటి లీజులను కేవలం పబ్లిక్ ఆక్షన్ ద్వారా మాత్రమే మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఐదు లీజులకు 2025 ఫిబ్రవరి 20కి ముందు ఎల్ఓఐ జారీ కాలేదని సమాచారం. దాంతో ఈ లీజులకు రాష్ట్రం గానీ, కేంద్రం గానీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేని పరిస్థితి.» ఇంత స్పష్టమైన నిబంధనలు ఉన్నా, ఆ లీజులను చట్ట విరుద్ధంగా మరో 20 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ప్రయత్నాలు జరుగుతుండడం, వాటికి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సహకారం అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎన్జీటీ విచారణలో ఉన్నా ఆగని ఆగడాలుఈ అక్రమ మైనింగ్, లీజుల పొడిగింపుపై స్థానికులు కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను (ఎన్జీటీ) ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఓఏ నెంబర్ 32 (2025) కింద విచారణ జరుగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని నిబంధనలు చెబుతున్నా, ఆ కంపెనీలు మాత్రం ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో చక్రం తిప్పుతున్నాయి.‘ముఖ్య’ నేత కనుసన్నల్లోనే యవ్వారంఈ గ‘లీజు’ వ్యవహారానికి ముఖ్య నేత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాంత ఎంపీకి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఒక కీలక నేత సదరు కంపెనీలను లొంగదీసుకుని ఆ గనుల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ గనులన్నీ ఆయన మనుషుల ఆధీనంలోనే ఉన్నాయి. చాలా కాలంగా వాటిలో అక్రమ తవ్వకాలు జరిపి, ఖనిజాన్ని భారీ ఎత్తున నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దాన్ని అమ్మాలంటే లీజు గడువు ముగియడంతో ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో గడువు ముగిసిన లీజులను మరో 20 ఏళ్లు పొడిగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎంపీ నేరుగా ‘ముఖ్య’ నేత కుమారుడితో వాటాలు మాట్లాడుకుని, ఈ లీజులు పొడిగించుకునేందుకు పావులు కదిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఈ విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు. -
మత్స్యకారులకు ‘పెద్దల’ వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అలల సవ్వడితో ఆహ్లాదకరంగా ఉండే తీర ప్రాంతం చంద్రబాబు సర్కారు పెద్దల కుట్రలతో అట్టుడికి పోతోంది. తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీగా డీల్ కుదుర్చుకున్నారనే విషయం ఆంధ్రా మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ బతుకులపై దెబ్బ కొట్టిన వారికి ఎలా మద్దతిస్తారంటూ మత్స్యకార గ్రామాలన్నీ ఏకమై రగిలిపోతున్నాయి. ప్రభుత్వం అండ చూసుకుని మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన గ్రామ పెద్దలను తాళ్లతో నిర్బంధించి ఆరా తీయడంతో సర్కారు ద్రోహం బయటపడింది.ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి పెద్దపట్టపుపాళెం నుంచి తడ వరకు సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో చొచ్చుకువచ్చి స్థానిక మత్స్యకారుల వేటలో పట్టుబడిన మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీంతో అనేక దఫాలు తమిళ బోట్లను, జాలర్లను పట్టుకుని నిర్బంధిస్తే.. ఆంధ్రా, తమిళ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం చేసి విడిపిస్తున్నాయి. అయినా తమిళ జాలర్లు పంథా మార్చుకోకపోగా, ఆంధ్రా మత్స్యకారులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను భరించలేక కావలి, బోగోలు, అల్లూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన మత్స్యకారులు ఈ దఫా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఐదు నెలల క్రితం తమిళనాడుకు చెందిన నాలుగు మెకనైజ్డ్ బోట్లు (500 సీసీ) జిల్లాలోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుంటుండగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లతోపాటు పలువురు తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ పరిణామం సంచలనంగా మారడంతో కొందరు పెద్దలు స్థానిక మత్స్యకారులను ఒప్పించి తమిళ జాలర్లను వదిలేలా చేశారు. కానీ ఆ నాలుగు బోట్లను మాత్రం వదిలి పెట్టలేదు. వీటిని అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం మత్స్యకారుల పెద్దలకు అప్పగించారు. ఐదు నెలలుగా మత్స్యకార యువత వంతుల వారీగా బోట్ల వద్ద కాపలాగా ఉంటున్నారు. ఈ దఫా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వదిలే ప్రసక్తి లేదని ఒకమాటపై నిలిచారు. ఈ క్రమంలో మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్ల భద్రతలో పాలుపంచుకున్నారు. తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీ డీల్ » ఇటీవల బోగోలు మండలం జువ్వలదిన్నెకు ఒక కీలక మంత్రి వచ్చి వెళ్లడం.. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారులతో మరో మంత్రి సమావేశం కావడం.. ఆ తర్వాత నాలుగు రోజులకే అర్ధరాత్రి వేళ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమ నిర్బంధంలో ఉంచుకున్న నాలుగు బోట్లను రహస్యంగా వదిలేయడం జరిగిపోయింది. ఆఖరి క్షణంలో ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారులు మరోసారి ప్రాణాలకు తెగించి మెకనైజ్డ్ బోట్లను వెంటాడినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మత్స్యకారులు కోపాగి్నతో రగిలిపోతున్నారు. » టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతే ఈ మంత్రాంగం నడిచిందని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెం పెద్దలకు భారీ మొత్తం చేతిలో పెట్టి, మత్స్యకారుల నిర్బంధంలో ఉన్న తమిళ బోట్లను విడిపించినట్లు తెలుస్తోంది. ఇదంతా టీడీపీ పెద్దల కుట్ర కోణంతోనే జరిగిందని తీర ప్రాంతంలో ఉన్న దాదాపు 114 గ్రామాల మత్స్యకార ప్రజలు మండిపడుతున్నారు. బోట్లు వదిలేసిన వారిని నిర్బంధించిన మత్స్యకారులు » అల్లూరు మండలం ఇస్కపల్లిపాళెంకు చెందిన గ్రామ పెద్ద కాపు, ఆయన ఇద్దరు కుమారులతోపాటు బోగోలు మండలం బంగారుపాళెంకు చెందిన మరో కాపును మత్స్యకారులు, ఆయా గ్రామాల పెద్ద కాపులు కలిసి నిర్బంధించారు. తాళ్లతో కట్టేసి ఈ కుట్రకోణం వెనుక టీడీపీ పెద్దలు ఎవరున్నారో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు.» మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన కాపుల నోటి నుంచి టీడీపీ కీలక నేతల పేర్లు వచి్చనట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం కూడా ఉందని, కొందరు పోలీసు అధికారులు కూడా సహకరించడం వల్లే ఆ బోట్లను వదిలేశారని సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు, పోలీసులు అటు వైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కోసం వచ్చే నెల 3న సమావేశం కావాలని ఆ గ్రామాల మత్స్యకారులు నిర్ణయించారు. అప్పటి వరకు తాము నిర్బంధించిన వారిని తమ అదుపులోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.తరచూ జరిగేది ఇదేతీరంలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల మత్స్యకారులు తరచూ తమిళ జాలర్లతో బతుకు పోరాటం చేస్తున్నారు. వీరు వేటాడిన మత్స్య సంపదను రెప్పపాటులో తమిళ మత్స్య దొంగలు అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి దోచుకుపోతున్నారు. తమిళనాడులోని వ్యాపారులు కొందరు అత్యాధునిక బోట్లు, వలలతో వచ్చి మత్స్య సంపదను కొల్ల గొడుతున్నారు. నిబంధనల ప్రకారం తీరానికి 12 నాటికల్ మైళ్ల అవతల కాకుండా కేవలం 5 నాటికల్ మైళ్లలోపు వేట సాగిస్తున్నారు. తిరుపతి జిల్లా తడ నుంచి ప్రకాశం జిల్లా కొత్త పట్నం వరకు తమిళ మత్స్యకారులు దూసుకొస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు ప్రాంతం గోవిందరావు పట్టపుపాళెం, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టపుపాళెం, రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాళెం, ఊర్లపాళెం, పాకల పట్టపుపాళెం, టంగుటూరు మండలం తాళ్లపాళెం కొత్తపట్నం బీచ్, మడనూరు ప్రాంతాల్లో తమిళ మత్స్యకారులు దాడులకు తెగబడుతున్నారు. -
ఎవరిని వదిలిపెట్టం.. విడుదల తర్వాత పిన్నెల్లి ఫస్ట్ రియాక్షన్
-
నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు
-
ఆ బూతులేంటి..? కోటంరెడ్డి పై రెచ్చిపోయిన నెల్లూరు టీడీపీ నేత
-
టీడీపీ కార్యకర్తల వీరంగం YSRCP కార్యకర్త, మహిళా సిబ్బందిపై దాడి
-
పెళ్లి చేసుకుందామని మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి
-
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి
నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. బోగోలు మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో ఒక్కసారిగా తెప్ప పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడిపోయారు. సామర్థ్యానికి మించి ఒకేసారి తెప్పపైకి 80 మందికి పైగా ఎక్కడంతో ఈ ఘటన జరిగింది. తెప్ప ఒకపక్క మునిగిపోవడంతో.. స్వామివారిని చేతులతోనే మోస్తూ భక్తులు ఊరేగింపు నిర్వహించారు. -
నెల్లూరులో మైనర్ బాలికలపై ఆగని లైంగిక దాడులు
-
కాటేసిన పాముతో ఆస్పత్రికి..
నెల్లూరు జిల్లా: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది తనను కాటేసిన పామును చంపి.. దాన్ని చేత్తో పట్టుకొని నేరుగా ఆస్పత్రికే వచ్చారో వ్యక్తి. కోవూరు ప్రభుత్వ వైద్యశాల సాక్షిగా ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ సాహసం చూసి రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కోవూరు పరిధిలోని భగత్సింగ్ కాలనీకి చెందిన వలీ పనుల్లో ఉండగా, ఓ పాము కాటేసింది. అయితే దాన్ని అక్కడికక్కడే చంపేశారు. ఏ పాము కరిచిందో తెలిస్తేనే వైద్యం కచ్చితంగా అందుతుందనే ఉద్దేశంతో నేరుగా దాంతో సహా కోవూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే స్పందించి చికిత్సను ప్రారంభించారు. ప్రస్తు తం వలీ పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. -
నెల్లూరు జీజీహెచ్లో మంటలు
నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) ఎమ్సీహెచ్ బ్లాక్లోని హెచ్డీ వార్డులో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఏసీలు పేలిపోయాయి. అక్కడే డ్యూటీలో ఉన్న డాక్టర్ మాధురి సిబ్బంది సాయంతో అద్దాలు పగులగొట్టారు. సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఒక్కసారిగా ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని భయంతో అరుస్తూ చీకట్లోనే బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైరింజన్ వచ్చేలోపు అగి్నమాపక పరికరాల సాయంతో మంటలను ఆర్పేశారు. అప్పటికే రెండు బెడ్లకు మంటలు అంటుకోగా, వాటినీ అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి అధికారులు డాక్టర్ సుశీల్, డాక్టర్ కళారాణి పిల్లలను ట్రామా వార్డులోకి మార్చి వైద్యసేవలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. ఎస్పీ అజిత, ఆర్డీఓ అనూష, విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్, డీఈఈ అశోక్ తదితరులు పరిశీలించారు. -
బాధితులను పరామర్శించడమే నేరమా? వైఎస్ జగన్ పాలన చూసి నేర్చుకోండి
-
60 ఏళ్ల వృద్ధుడు.. బాలికపై లైంగిక వేధింపులు
-
నెల్లూరు జిల్లాలో దాష్టీకం
నెల్లూరు జిల్లా: కావలిలో దాష్టికం చోటు చేసుకుంది. పాఠశాల ముందు తినుబండారాలు అమ్మే ఒక చిరు వ్యాపారి, చిన్నారుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేస్తూ నెలల తరబడి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.తినుబండారాల ఆశ చూపి బాలికలను తన వలలోకి దింపిన ఈ వ్యక్తి, పాఠశాల పరిసరాల్లోనే దుష్కార్యాలకు పాల్పడినట్లు సమాచారం. బాధిత బాలికలు భయంతో మౌనం పాటించగా, చివరికి పాఠశాల హెడ్మాస్టర్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయితే, మొదట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం స్థానికులలో ఆగ్రహాన్ని రేపింది.ఈ ఘటనపై మహిళా సంఘాల నేతలు రంగంలోకి దిగారు. వారు బాధిత బాలికల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, అధికారికంగా ఫిర్యాదు చేయించేలా ముందడుగు వేశారు. దీంతో విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే, ఈ కేసును కేవలం సాధారణ నేరంగా కాకుండా పోక్సో చట్టం కింద నమోదు చేయాలని తల్లిదండ్రులు, మహిళా సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు జరగడం సమాజానికి మచ్చ అని వారు పేర్కొంటూ, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. -
Nellore: కొత్త జంటకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు (ఫొటోలు)
-
నెల్లూరు జిల్లా పర్యటనకు YS జగన్
-
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన నెల్లూరుకు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు. -
ఒకపక్క తండ్రి మృతి.. మరోపక్క ఇంటర్ పరీక్షా
-
ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): ఆన్లైన్ యాప్లలో ఇన్వెస్ట్ చేస్తే అధికలాభాలు వస్తాయని నమ్మించి మోసగించారని అందిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. తీగ లాగితే డొంక కదిలిన చందాన క్రికెట్ బెట్టింగ్ వెలుగులోకి వచ్చింది. ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం వివరాలు వెల్లడించారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్కు చెందిన ఓ వ్యాపారికి బుచ్చిరెడ్డిపాళెం రామకృష్ణానగర్కు చెందిన కె.వేణుగోపాల్తో పరిచయమైంది. ఆయన ఆన్లైన్ యాప్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన వ్యాపారి పలుమార్లు ఆ యాప్లో రూ.53 లక్షలు డిపాజిట్ చేశారు. రోజులు గడుస్తున్నా ఆదాయం రాకపోవడంతో వేణుగోపాల్ను బాధితుడు సంప్రదించగా కాలయాపన చేయడంతోపాటు ఇటీవల బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి బుచ్చిరెడ్డిపాళెంలోని ఇంటిపై దాడి చేసి వేణుతోపాటు అక్కడే ఉన్న బి.వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా క్రికెట్ బెట్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వేణుగోపాల్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు కలిసి రాధే ఎక్స్చేంజ్ యాప్ (ఆర్777) ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు, వెంకటరమణ బెట్టింగ్ తాలుకు నగదును తీసుకుని జూదరులకు ఇస్తున్నట్లు వెల్లడైంది. ఎవరైనా బెట్టింగ్ విషయంలో గొడవ చేస్తే కత్తులతో చంపుతామని నిందితులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. వ్యాపారికి చెందిన నగదును సైతం నిందితులు బెట్టింగ్లో పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. క్స్చేందీంతో పోలీసులు వేణుగోపాల్, వెంకటరమణను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.34,65,800 నగదు, ల్యాప్టాప్, టీవీ, 13 మొబైల్స్, రెండు కత్తులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1,64,74,600.60 నగదును సీజ్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష పాల్గొన్నారు. -
TDP: కోర్టుని లెక్కచేయకుండా.. రూ. 8000 కోట్లు మాయం
-
పట్టపగలే టీచర్పై కత్తితో దాడి
-
మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు
సాక్షి నెల్లూరు : కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమెదు చేసింది. ఇటీవల కోవూరు, గుమ్మళ్లదిబ్బలో ఓక మైనర్ బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు మాజీ మంత్రి వెంటనే స్పందించారు.బాధిత కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు. దీంతో మంత్రిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసుల నమోదు చేసి తీవ్ర వేదింపులకు గురిచేస్తున్నారు. -
నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని ములాఖత్ లో కలిసిన చెవిరెడ్డి
-
పిన్నెల్లి సోదరులను కలిసిన అనిల్ కుమార్ యాదవ్
-
ఉదయగిరిలో మగ పెద్ద పులి జాగ్రత్త..అటవీశాఖ హెచ్చరిక
-
ఏపీలో ప్రసిద్ధి చెందిన ఈ రంగనాధస్వామి ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
మెడికల్ షాపుపై టీడీపీ రౌడీల దాడి.. పట్టించుకోని పోలీసులు
-
విషాద తరంగం
అల్లూరు: కనుమ పండగ వేళ ఆ కుటుంబాలను విషాద తరంగం ముంచెత్తింది. సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. ఈఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈగ అమ్ములు (14), ఈగ బాలకృష్ణ (15) అన్నాచెల్లెళ్లు. బుచ్చిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన వీరు అల్లూరు మండల నార్త్ఆములూరు పంచాయతీ గోళ్లపాళెం చైల్డ్ ఆశ్రమంలో చదువుతున్నారు. వీరి బంధువులు అల్లూరు యర్రపగుంటలో ఉండగా సంక్రాంతి పండగ కావడంతో ఇక్కడకు వచ్చారు.శుక్రవారం మరో నలుగురు స్నేహితులు కె.అభిషేక్(16), జి.సు«దీర్(15), ఈగ చిన్నబయ్య, ఎస్.వెంకటేష్తో కలిసి ఇసుకపల్లి సముద్ర తీరానికి వెళ్లారు. తీరంలో నీటిలో మునుగుతుండగా ఒక్కసారిగా వచి్చన పెద్ద అలకు ఈగ అమ్ములు, బాలకృష్ణ, కె.అభిõÙక్, జి సు«దీర్ గల్లంతయ్యారు. ఈగ చిన్నబయ్య, వెంకటేష్ ప్రమాదం నుంచి బయటపడి స్థానికంగా ఉన్న మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. వారు తీరం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత ఈగ అమ్ములు, కాసేపటికి బాలకృష్ణ మృతదేహాలను వెలికి తీశారు. అభిõÙక్, సు«దీర్ ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇసుకపల్లి బీచ్లో కనుమ పండుగ రోజు సరదాగా గడిపేందుకు వెళ్ళిన ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, మరో ఇద్దరు గల్లంతు కావడం విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
AP: బీచ్లో విద్యార్థుల గల్లంతుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఈతకు వెళ్లి విద్యార్థులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సరదాగా గడిపేందుకు ఇసుకపల్లి బీచ్కు వెళ్లిన విద్యార్ధులు గల్లంతవడం విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్లో ఈతకెళ్లి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు అల్లూరు పంచాయతీ ఎర్రగుంటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తీరానికి ఇద్దరి మృతదేహాలు కొట్టుకు రావడంతో బయటకు తీశారు. మిగిలిన ఇద్దరు యువకుల కోసం మత్స్యకారులు గాలింపు చేపట్టారు. -
వింజమూరు పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం
-
కండలేరు వద్దకు వెళ్తున్న YSRCP నేతల అక్రమ అరెస్ట్
-
సోమశిల సందర్శనపై పోలీసుల ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లా ప్రజలు, రైతుల భవిష్యత్ను తెలంగాణ సీఎంకు తాకట్టు పెట్టి.. సీమ ఎత్తిపోతల పథకాన్ని బాబు సర్కారు నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ పిలుపు మేరకు శనివారం చేపట్టిన సోమశిల ప్రాజెక్ట్ సందర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడా లేని ఆంక్షలతో వేకువజాము నుంచే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి నివాసాలకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్లతో నానాహంగామా సృష్టించారు. సోమశిల డ్యామ్ సందర్శనకు వెళ్తే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. రైతుల ప్రయోజనాలు తాకట్టు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడంపై శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వైఎస్సార్సీపీ పిలుపునిచి్చంది. జిల్లాలోని రైతులు సోమశిలకు చేరుకుని వారికి జరిగే అన్యాయంపై మీడియాతో మాట్లాడేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతతో జరిగే నష్టాలపై జిల్లా రైతులు కన్నెర్ర చేయడంతో ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందోనని భయపడిన ప్రభుత్వ పెద్దలు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు.సోమశిల ప్రాజెక్టు వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు. రహదారులపై బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకున్నారు. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా సోమశిల ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై మూడుచోట్ల, సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులను నిలువరించేందుకు రెండు ప్రాంతాలతోపాటు అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే వద్ద బారికేడ్లు పెట్టి రైతులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి ఉక్కుపాదం మోపారు. కాకాణి నివాసం వద్ద ఉద్రిక్తత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన కాకాణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో వేకువజాము నుంచే కాకాణి నివాసం వద్ద కాపు కాశారు. ఆయనకు నోటీసు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, కిలివేటి సంజీవయ్యతోపాటు వందలాది మంది కార్యకర్తలు కాకాణి నివాసం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సోమశిల ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లడం నేరమా? అంటూ కాకాణి వాహనం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా నెట్టేశారు. దీంతో కాకాణితోపాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీసు ఆంక్షలకు నిరసనగా నెల్లూరులోని పొదలకూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలు, అదనపు బలగాలు నేతలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి కాకాణి నివాసంలో ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు. కార్యకర్తలపై లాఠీచార్జి కాకాణి గోవర్ధన్రెడ్డిని పోలీసులు అడ్డుకునే సమయంలో కార్యకర్తలు ఆయనకు అడ్డుగా నిల్చోవడంతో పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. కొందరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో చావబాదారు. పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. తాము శాంతియుతంగా సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపడితే పోలీసులు అత్యుత్సాహం ఏమిటని ప్రశి్నంచారు. పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తే గుర్తు పెట్టుకుంటామని, ఎవరిని వదిలి పెట్టబోమని మండిపడ్డారు. -
Kakani: హౌస్ అరెస్ట్ మా ప్రాణాలు బ అర్పించడానికైనా సిద్ధం
-
YSRCP నేతలు హౌస్ అరెస్ట్
-
నెల్లూరులో టెన్షన్ టెన్షన్ సంకెళ్లు వేసుకుని విద్యార్థుల ఆందోళన
-
Nellore: ఎంపీటీసీల ఓటు వేసే హక్కును కాలరాసిన కూటమి ప్రభుత్వం
-
YSRCP MPTC ల కిడ్నాప్.. వైరల్ అవుతున్న వీడియో
-
మంత్రి నారాయణ ఆడియో లీక్.. రౌడీషీటర్లకు డిసెంబర్ 31st ఆఫర్
-
నెల్లూరు జిల్లాలోకి గూడూరు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. జిల్లాల పునర్విభజనపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో చేసిన ప్రతిపాదనలకు కొన్ని మార్పులు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. గత నెల 27న కొత్తగా మూడు జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా వివిధ మార్పులపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా... వాటిపై రాష్ట్రవ్యాప్తంగా 927 అభ్యంతరాలు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. కాగా, సమావేశంలో రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయడంపై చర్చ జరిగింది. ప్రజల సూచనలకు అనుగుణంగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. విస్తీర్ణంలో పెద్దదైన ఆదోని మండలాన్ని రెండుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులు అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లో, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాను ప్రతిపాదించిన విధంగా మనుగడలోకి తీసుకురానున్నారు.మరికొన్ని మార్పులు ఇలా..శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్కు, అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్కు, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్కు, అద్దంకి డివిజన్లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె. పంగులూరు, కొరిశపాడు మండలాలను ప్రకాశం జిల్లాలోకి మార్పు.» కనిగిరి రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్లోకి చేర్చి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలి.» కందుకూరు డివిజన్లోని ఐదు మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చాలి. కందుకూరు డివిజన్లోని మిగిలిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్లో చేర్చాలి.» చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరుకు, చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్కు మార్చాలి. సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్లో చేర్చాలి.» శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. కదిరి డివిజన్లోని ఆమదగురు మండలం పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరంట్ల పెనుకొండ డివిజన్లో చేర్పు. ఈ మార్పుచేర్పులతో ఈ నెల 31న తుది నోటిఫికేషన్ను విడుదల చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. -
కొత్త ట్రెండ్.. కరెన్సీ మాల
రాజకీయ నాయకులు, ప్రముఖులకు వివిధ సందర్భాల్లో అనుచరగణం భారీ పూలమాలలు వేస్తుంటారు. అయితే ఒకటి, రెండు రోజుల్లో అవి చెత్తకుప్పలోదర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. కరెన్సీ నోట్లతో చేసిన మాలలను నేతలకు వేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కావాల్సిన పనులు చేయించుకునేందుకు ఇదొక మార్గమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నెల్లూరులోని మినీబైపాస్ రోడ్డు జేమ్స్ గార్డెన్ వద్ద పూల దుకాణాల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లే వారిని ఈ డబ్బుల దండలు (Currency Garlands) ఆకర్షిస్తున్నారు. చాలా మంది వీటిని ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. కొంత మంది తమ సెల్ఫోన్లతో ఫొటోలు కూడా తీసుకుంటున్నారు. ఈ దండల ధరలు అందులో పొందుపరిచిన నోట్లకు అనుగుణంగా ఉంటాయని తెలుస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు చదవండి: రఘురామకృష్ణరాజుతో కాస్త జాగ్రత్త -
నెల్లూరు చేపల పులుసు
కావలసినవి: చేప ముక్కలు (కొరమీను / వంజరం / బొచ్చ చేప) – అర కిలో; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి); టమాటాలు – 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి); పచ్చిమిర్చి – 3–4 (నిలువుగా కట్చేసినవి); వెల్లుల్లి రెబ్బలు – 8–10 ( నిలువుగా కట్చేసినవి); అల్లం – చిన్న ముక్క; కరివేపాకు – 2 కొమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; చింతపండు రసం – కప్పు (పులుపు తగినంత); నూనె – 3 టేబుల్ స్పూన్లు; పులుసు మసాలా: కారం – 2 టీ స్పూన్లు; ధనియాలపోడి – 2 టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; జీలకర్రపోడి – పావు టీ స్పూన్; మెంతులు – పావు టీ స్పూన్.తయారీ: చేప ముక్కలను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు, పసుపు రాసి పక్కన పెట్టాలి. మట్టిపాత్ర లేదా మందమైన వెడల్పాటి పాత్రలో నూనె వేసి, వేడి చేయాలి. అందులో మెంతులు వేసి, వేగాక ఉల్లి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు వేసి బాగా వేయించాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ధనియాలపోడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు రసం, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలను జాగ్రత్తగా పులుసులో వేయాలి. కదపకూడదు. మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. పులుసు నుంచి నూనె పైకి తేలినప్పుడు జీలకర్రపోడి, కొత్తిమీర వేసి మంట తీసేయాలి. వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.దాల్ మఖనీసంప్రదాయ ఉత్తర భారతీయ వంటకం కావలసినవి: మినప్పప్పు – కప్పు; రాజ్మా – పావు కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్లు; నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ – పెద్దది (సన్నగా తరిగినది); టమాటా గుజ్జు – 2 కప్పులు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – 1 (సన్నగా తరగాలి); కారం∙– టీ స్పూన్; ధనియాలపోడి – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; పాల మీగడ – పావు కప్పు; కొత్తిమీర – అలంకరణకు;తయారీ: పప్పులు రాత్రిపూట నానబెడితే ఉదయానికి ఉడికించడానికి రెడీగా ఉంటాయి. నానబెట్టిన పప్పులను కుకర్లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి పాన్ లో నూనె, టేబుల్ స్పూన్ వెన్న వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి టమాటా గుజ్జు వేసి, నూనె తేలేవరకు ఉడికించాలి. తర్వాత కారం, ధనియాలపోడి, ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత ఉడికించిన మినప పప్పు, రాజ్మా పై మిశ్రమంలో వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి మెల్లగా మరిగించాలి. సన్నని మంటపై అరగంటసేపు ఉడికిస్తే రుచి మరింత బాగుంటుంది. చివరగా మిగిలిన వెన్న, మీగడ, గరం మసాలా వేసి కలిపి, ఐదు నిమిషాలు ఉడికించి, స్టౌ ఆఫ్ చేయాలి. పై నుంచి మరికొద్దిగా పాల మీగడ, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలిదాల్ మఖానీని నాన్, రోటీ, జీరా రైస్ లేదా కుల్చాతో వడ్డిస్తే అద్భుతమైన రుచి వస్తుంది.మటన్ రోగన్ ఘోష్ఇది కాశ్మీర్కు చెందిన ప్రసిద్ధ వంటకం. ఘుమఘుమలాడే మసాలా, మృదువైన మటన్ ముక్కలు, ప్రత్యేకమైన రంగు, రుచి ఈ వంటకం ప్రత్యేకత. కావలసినవి: మటన్ – పావు కిలో; పెరుగు – కప్పు; ఉల్లి పాయలు – 2 (సన్నగా తరిగినవి); అల్లం – వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; కాశ్మీరీ కారం – 2 టీ స్పూన్లు; కారం – పావు టీ స్పూన్ ; ధనియాలపోడి – రెండు టీ స్పూన్లు; జీలకర్రపోడి – టీ స్పూన్; సోంపుపోడి – 1 టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; యాలకులు – 3; లవంగాలు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ – 1; నూనె లేదా నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – అలంకరణకు.తయారీ: మటన్కు కొద్దిగా ఉప్పు, సగం అల్లం–వెల్లుల్లి పేస్ట్ రాసి, 30 నిమిషాలు ఉంచాలి. పాన్ లేదా ప్రెజర్ కుకర్లో నూనె/నెయ్యి వేడి చేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మిగిలిన అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మటన్ ముక్కలు వేసి, మసాలాలో బాగా కలిపి 5–7 నిమిషాలు వేయించాలి. మంట తగ్గించి పెరుగు కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి. కశ్మీరీ కారం, కారం, ధనియాలు, జీలకర్ర, సోంపుపోడులు, ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి, కుకర్లో 4–5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బయట గిన్నెలో అయితే మటన్ మెత్తబడే వరకు ఉడికించాలి. మూత తీసి గ్రేవీ చిక్కగా అయ్యేవరకు ఉంచి, గరం మసాలా వేసి కలపాలి. కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి.రోటీ, నాన్ లేదా అన్నంతో ఈ మటన్ రోగన్ ఘోష్ ను వడ్డించాలి. -
నెల్లూరులో విద్యార్థిని ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్): స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమో.. సహచర విద్యార్థి వేధింపులో.. మరే ఇతర కారణమో తెలియదు గానీ పదో తరగతి చదువుతున్న ఓ బాలిక నెల్లూరు నగరంలోని ఫతేఖాన్పేటలో గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు... ఫతేఖాన్పేటలో నివసిస్తున్న తిరుపాల్, స్వాతి దంపతులకు నాగచైతన్య, లావణ్య (15) పిల్లలు. తండ్రి ఓ ఎల్రక్టానిక్ షాప్లో సూపర్వైజర్గా, తల్లి ఓ షోరూంలో పనిచేస్తున్నారు. లావణ్య తన ఇంటి సమీపంలోని ప్రియాంక ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి చదువుతోంది.మూడున్నర నెలల క్రితం అదే పాఠశాలలో చదువుతున్న సహచర విద్యార్థి ఇన్స్ట్రాగామ్లో ఓ మెసేజ్ చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో 15 రోజుల ముందు స్కూల్లో లావణ్య బ్లేడ్తో కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఘటనపై యాజమాన్యాన్ని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, దురుసుగా ప్రవర్తించడంతోపాటు సదరు బాలుడికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో గురువారం పాఠశాలలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికెళ్లిన బాలిక చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కళాశాల నుంచి ఇంటికొచ్చి గమనించిన సోదరుడు నాగచైతన్య విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు తెలియజేశాడు. చిన్నబజార్ పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై బాలిక తల్లిదండ్రులు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ కరస్పాండెంట్ను విచారిస్తున్నారు. -
జనసేన కార్యకర్తను చితకబాదిన టీడీపీ నేతలు
-
కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన పచ్చ పోలీసులు..!
-
కార్పొరేటర్ రవిచందర్ కిడ్నాప్.. YSRCP ఆందోళన
-
నెల్లూరులో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, తాడేపల్లి: నెల్లూరులో టీడీపీకి ఊహించిని షాక్ తగిలింది. టీడీపీని వీడిన ఐదు మంది కార్పొరేటర్లు.. వైఎస్సార్సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలోకి నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో మద్దినేని మస్తానమ్మ (6వ డివిజన్), ఓబుల రవిచంద్ర (5వ డివిజన్), కాయల సాహితి (51వ డివిజన్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (16వ డివిజన్), షేక్ ఫమిదా (34వ డివిజన్) ఉన్నారు.వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు మేయర్పై అవిశ్వాసం నేపథ్యంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఐదుగురు పార్టీ వీడటంతో మరెందరు వెళ్తారోనన్న భయం కూటమికి పట్టుకుంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. -
మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సరెండర్
-
Nallapareddy Prasanna: మందు, విందులతో రౌడీలకు జైల్లో రాజభోగాలు
-
నెల్లూరు పోలీసుల క్రూరత్వం వృద్ధురాలని కూడా చూడకుండా స్టేషన్ లో పెట్టి..!
-
Cyclone Ditwah: వణికిస్తున్న దిత్వా తుఫాన్ డేంజర్ లో నెల్లూరు!
-
దేవత పేరు పెట్టుకుని.. దెయ్యం పనులు.. నెల్లూరు కామాక్షి దందా
-
నెల్లూరులో కుండపోత వర్షం (ఫొటోలు)
-
Kakani: కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో హత్యలు పెరిగాయి
-
నా భర్త దారిలోనే నేనూ వెళ్తా
నెల్లూరు సిటీ: నా భర్త ఏ మార్పును తీసుకుని రావాలని అనుకున్నారో.. అదే దారిలో తానూ నడుస్తానంటూ గంజాయి కిరాతకుల చేతిలో బలైపోయిన పెంచలయ్య భార్య దుర్గా అలియాస్ రమ్య స్పష్టం చేసింది. నగరంలోని ఆర్టీడీ కాలనీలోని ఆమె నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఐటీఐ చదివారని, పిల్లలను మంచి చదువులు చదివించాలని అనుకున్నాడు. ఆర్టీడీ కాలనీలో తమ పాటికి తాము ఉన్నామని, ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయన్నారు. బోడిగాడితోటలో ఉన్పప్పుడు అక్కడి వాళ్లమని చెప్పుకోలేకపోయామని, ఇప్పుడు ఆర్టీడీ కాలనీకి చెందిన వాళ్లమని కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానికంగా గంజాయి విక్రయాలపై తన భర్త వారికి వ్యక్తిగతంగా చెప్పారు. కానీ ఆగలేదన్నారు. సీఐ, ఎస్సైల సహకారంతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారన్నారు. దీంతో వాళ్ల వ్యాపారం పడిపోయిందని భయం పుట్టిందన్నారు. స్థానికంగా ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి చెందిన డబ్బులు, నగలు కూడా అరవ కామాక్షి తినేశారన్నారు. ఎవరితోనూ తన భర్తకు విభేదాలు లేవన్నారు. కాలనీలో మార్పు తీసుకుని రావాలని ప్రయత్నించి నా భర్త వారిలో చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైనా, వీరమరణం పొందారని భావిస్తున్నట్లు తెలిపారు. -
పెంచలయ్య హత్య కేసులో పురోగతి
-
నెల్లూరు పెంచలయ్య హత్య కేసులో సంచలన నిజాలు
-
Kakani : గంజాయి వద్దన్నందుకు చంపేస్తారా..! కోటంరెడ్డి..ఇక నటించకు
-
Nellore: పెంచలయ్య హత్య వెనుక టీడీపీ మహిళా నేత
-
హత్య కుట్ర పన్నింది అరవ కామాక్షి అని తేల్చిన పోలీసులు
-
పెంచలయ్య దారుణ హత్య.. నిందితులపై పోలీసుల కాల్పులు
-
చెడు అలవాట్లు వద్దన్నందుకు సీపీఎం నేత హత్య
నెల్లూరు సిటీ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం దారుణహత్య జరిగింది. పిల్లలతో స్కూటీపై వెళుతున్న సీపీఎం నాయకుడు కొట్టివిడి పెంచలయ్య (38)ను కత్తులతో పొడిచి చంపేశారు. స్థానికులు, డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ ట్రెజరర్గా ఉన్న పెంచలయ్య ఎల్రక్టీíÙయన్గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సీపీఎం నాయకుడైన అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాలనీకి చెందిన ఆరవ కామాక్షి నేరచరితులకు ఆశ్రయం ఇవ్వడం, దొంగతనాలకు పాల్పడేవారితో అసాంఘిక కార్యకలాపాలు చేయించడం గమనించిన పెంచలయ్య ఆమెను పద్ధతి మార్చుకోమని మందలించాడు. గంజాయి విక్రయిస్తున్న యువకులను అలా విక్రయించవద్దని చైతన్యవంతం చేసేందుకు ప్రయతి్నంచాడు. పోలీసులకు సమాచారం ఇచ్చి గంజాయి విక్రయాలను అడ్డుకుంటున్నాడు. తమ వ్యాపారాలకు అడ్డువస్తున్నాడని పెంచలయ్యపై కామాక్షి కక్షపెంచుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పెంచలయ్య పిల్లలతో స్కూటీపై వెళుతుండగా హౌసింగ్ బోర్డు ఆర్చ్ వద్ద తొమ్మిదిమంది దుండగులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కత్తులు తీసి పెంచలయ్యను వెంటాడి పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పెంచలయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వేణు, ఎస్ఐ లక్ష్మణ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కామాక్షి తన బంధువులు, చెడునడతగల యువకులతో పెంచలయ్యను హత్య చేయించినట్లు డీఎస్పీ తెలిపారు. -
మీసం లేనోడు మీసం తిప్పుతా అన్నట్టు.. టీడీపీ నేతలపై కాకాణి పంచులు అదుర్స్
-
తోడు లేకుంటే వైద్యం చేయం
నెల్లూరు జిల్లా: ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం ఒంటరిగా వచ్చిన ఓ పేషెంట్ ఓపీ తీసుకున్నప్పటికీ తోడుగా ఎవరూ రాలేదని వైద్యం చేయడానికి నిరాకరిస్తూ బయటకు పంపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం పేదలకు గగనంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాధ్యతగా పనిచేసిన ఇదే వైద్య సిబ్బంది ఇప్పుడు ఇంత నిర్లక్ష్యంగా, నిర్దయగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కలువాయి మండలం అంకుపల్లి గ్రామానికి చెందిన కొప్పాల పెంచలయ్య నెల్లూరులోని ఫత్తేఖాన్పేటలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా గత నెల క్రితం వరకు పని చేశాడు. అప్పట్లో వర్షాల నేపథ్యంలో కళాశాల వరండాలో వర్షపు నీరు అధికంగా చేరడంతో వాటిని కాలితో నెట్టుతూ ఉండడంతో నాలుగు రోజులకే అతని అరి కాలికి పుండ్లు ఏర్పడ్డాయి. స్థానికంగా ప్రైవేట్గా వైద్యం చేయించినా తగ్గకపోవడంతో, విధులు నిర్వర్తించలేకపోవడంతో ఏజెన్సీ వారు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా.. విభేదాలతో వేరుగా ఉంటున్నారు. దీంతో స్వగ్రామమైన అంకుపల్లికి చేరాడు. రోజు రోజుకు కాలి బాధ తీవ్రం కావడంతో నడవలేని స్థితిలో అష్టకష్టాలు పడి శనివారం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వైద్యం చేయించుకొనేందుకు వచ్చాడు. ఓపీ సైతం తీసుకున్నాడు. కట్టు కట్టే దగ్గరకు వెళ్తే అక్కడి సిబ్బంది ‘నువ్వు సహాయకుడు లేకుండా వస్తే వైద్యం చేయం’ అని చెప్పడంతో తాను గతంలో జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా 2021లో గుండె ఆపరేషన్ నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రిలో చేయించుకున్నానని, అప్పట్లో తన వెంట ఎవరూ లేరని, అయినా వైద్యం చేశారని తెలిపాడు. జగనన్న వల్ల తనకు ఉచితంగా వైద్యం జరగడంతో ఆయన పేరును తన గుండెపై పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు పెంచలయ్య ఆత్మకూరు ఆస్పత్రి సిబ్బందికి తెలిపాడు. దీంతో అక్కడి సిబ్బంది ఇక్కడ రాజకీయాలు చెప్పొద్దని, ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వైద్యం చేయకుండానే పంపేశారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక ఏడుస్తూ నడవలేని స్థితిలో మున్సిపల్ బస్టాండ్ వద్దకు చేరుకొని దిక్కుతోచక రోడ్డుపై కూర్చోని రోదిస్తున్న తీరు చూసిన స్థానికులు ఆస్పత్రి సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, బస్టాండ్లో అతని పరిస్థితి చూసిన పలువురు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ను వివరణ కోసం ప్రయతి్నంచగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
మంత్రి నారాయణపై మాజీ MLA విఠపు బాలసుబ్రహ్మణ్యం ఫైర్
-
Nellore Lorry Incident: ఇంటికొస్తున్నా.. నీకేం కావాలి..
మాటేసిన మృత్యువు.. కంటైనర్ రూపంలో కాటేసింది. ఎన్నెన్నో కలలను కబళించింది. మూడు కుటుంబాలకు కన్నీరు మిగిలి్చంది. ఆస్పత్రికి వెళ్లొస్తున్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు ఇక లేడని తెలుసుకొని ఓ అన్నా చెల్లెలు.. బయటకెళ్లిన భర్త కొబ్బరి నీరు తెస్తాడని ఎదురు చూసిన నిండు గర్భిణైన భార్య గుండెలు పగిలిలా తల్లడిల్లారు. జీవనోపాధి నిమిత్తం కంకులు విక్రయిస్తూ బతుకు పోరాటం చేస్తున్న మీజూరి మల్లిక.. కొబ్బరి బోండాలు అమ్మే మాలకొండయ్య గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. నెల్లూరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది.నెల్లూరు (క్రైమ్): కంటైనర్ మితిమీరిన వేగం వారి పాలిట మృత్యువైంది. తండ్రి, తోడబుట్టిన సోదరుడు ఇక రారని అన్నా, చెల్లెలు.. జీవితాంతం బాసటగా నిలుస్తానని బాస చేసిన భర్త కానరాని తీరాలకు వెళ్లిపోయారని తెలుసుకొని ఎనిమిది నెలల గర్భిణి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నెల్లూరులోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాలను చిదిమిసేంది. నెల్లూరు ఎస్వీజీఎస్ కళాశాల మైదాన సమీపంలో జాతీయ రహదారి పక్కన ఎనీ్టఆర్నగర్ రాయపుపాళేనికి చెందిన మీజూరు మల్లిక తోపుడు బండిపై మొక్కజొన్న కంకులు.. ఎనీ్టఆర్నగర్కు చెందిన చుండూరి మాలకొండయ్య టాటా ఏస్ వాహనంలో కొబ్బరి బోండాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.సూళ్లూరుపేటలో చేపలను అన్లోడ్ చేసిన మినీ కంటైనర్ నెల్లూరుకు మంగళవారం మధ్యాహ్నం బయల్దేరింది. గ్రీన్ సిటీ మార్గం వద్దకొచ్చేసరికి చెన్నై వైపు రహదారి నుంచి కావలి వైపు ఒక బైక్పై యూటర్న్ తీసుకుంది. మితిమీరిన వేగంతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ బైక్ను తప్పించే క్రమంలో వేగాన్ని నియంత్రించలేకపోయారు. బైక్తో పాటు ముందు వెళ్తున్న మరో బైక్, కంకులను కొనుగోలు చేస్తున్న వ్యక్తి, తోపుడు బండిని ఢీకొని దూసుకెళ్లి ముందున్న పెద్ద చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం సిరి గార్డెన్స్కు చెందిన ఒట్టూరు సురేష్ (36), తండ్రీకొడుకులు ఖాజా నజీమ్ మొహిద్దీన్ (70), ముజాహిద్ అలీ (35) అక్కడికక్కడే మృతి చెందారు. మల్లిక, మాలకొండయ్యతో పాటు కంకుల కొనుగోలుకు వచ్చిన లైన్మెన్ ఈదూరు అనిల్, యూటర్న్ తీసుకున్న ద్విచక్రవాహనదారుడు కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు.వైద్యచికిత్స చేయించి ఇంటికెళ్తూ..నెల్లూరు రూరల్ మండలం సిరి గార్డెన్స్కు చెందిన ఖాజా నజీమ్ మొహిద్దీన్ (70) విశ్రాంత పీఈటీ. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు తౌహీద్, కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న కుమారుడు ముజాహిద్ అలీ నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటలోని సచివాలయంలో శానిటరీ అండ్ ఎని్వరాన్మెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ తరుణంలో హెల్త్ చెకప్ నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తండ్రిని తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి జాతీయ రహదారి మీదుగా బయల్దేరారు. ఈ క్రమంలో కంటైనర్ ఢీకొని వారు మృతి చెందారు. తండ్రి, సోదరుడు మృతి చెందారనే విషయం తెలుసుకున్న తౌహీద్, సోదరి ఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.హాస్పిటల్లో మిన్నంటిన రోదనలుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లిక, మాలకొండయ్య, అనిల్.. మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన హాస్పిటల్కు చేరుకొని విషాదంలో మునిగిపోయారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన అనిల్కు భార్య మెర్సీ, ఇద్దరు పిల్లలున్నారు. ఆయన నెల్లూరులో లైన్మెన్గా పని చేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.ఎనీ్టఆర్నగర్కు చెందిన మల్లిక, రవిచంద్ర దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. జాతీయ రహదారి పక్కన తోపుడు బండిపై మొక్కజొన్న కంకులను విక్రయిస్తూ మల్లిక జీవనం సాగిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని రోదించారు.ఎనీ్టఆర్నగర్కు చెందిన మాలకొండయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. టాటా ఏస్ వాహనంలో కొబ్బరి బోండాలను విక్రయిస్తూ కొంతకాలంగా మాలకొండయ్య జీవనం సాగిస్తున్నారు.తిరుపతి జిల్లా కోట మండలం ఉచ్చువారిపాళేనికి చెందిన కోటేశ్వరరావు నెల్లూరు గ్రీన్ సిటీలోని సచివాలయ బిల్డింగ్కు వాచ్మెన్గా రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసేందుకెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు.ఇంటికొస్తున్నా.. నీకేం కావాలి..మూలాపేటకు చెందిన సురేష్ ప్రస్తుతం సిరి గార్డెన్స్లో ఉంటున్నా రు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం భార్య నిండు గర్భిణి. సురేష్ ఇంటికొస్తూ.. భార్యకు ఫోన్ చేసి నీకేం కావాలి తన అడిగారు. కొబ్బరి నీళ్లు తీసుకురావాలనడంతో అక్కడ ఆగడమే ఆయనకు ఆఖరి క్షణమని తెలియదు. సురేష్ మృతి విషయాన్ని భార్యకు చాలా సేపటి వరకు బంధువులు చెప్పలేదు. గర్భిణి కావడంతో కొంచెంగా చెప్పారు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కూప్పకూలిపోయారు. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం
-
నా 'సోమి' రంగా..
సాక్షి టాస్క్ ఫోర్స్: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పడిన ఆయిల్ పరిశ్రమలు, రవాణా వాహనాలపట్ల టీడీపీ మూకల ఆగడాలు శృతిమించుతున్నాయి. వీటి నిర్వాహకుల నుంచి ముక్కుపిండి మరీ లక్షల్లో ‘ఎస్’ట్యాక్స్ వసూలుచేస్తున్నాయి. ప్రభుత్వానికి చెల్లించే పన్నులతోపాటు ‘ఎస్’ ట్యాక్స్ చెల్లించకపోతే ఆయిల్ ట్యాంకర్ టైర్ కూడా కదలదంటూ సర్వేపల్లి ముఖ్యనేత అనుచరులు హెచ్చరిస్తూ చెలరేగిపోతున్నారు. ఈ దౌర్జన్యాలు, దాదాగిరి భరించలేక.. విసిగిపోయిన తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్ల నిర్వాహకులు రోడ్డెక్కారు. అలాగే, అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగానంద్ మీడియా ముఖంగా ఇదే విషయాన్ని ఆరోపించడం పోర్టులో ‘ఎస్’ ట్యాక్స్ తీవ్రతకు అద్దంపడుతోంది. జిల్లాలో ఇప్పుడీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో బిహార్ తరహా రౌడీరాజ్యం నడుస్తోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ముఖ్యనేత కనుసన్నల్లో ‘ఎస్’ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లకు తెగబడుతున్నారు. నేలటూరు ఏపీ జెన్కో వద్ద బూడిద రవాణా చేసే బల్కర్ల (ట్యాంకర్లు) నుంచి టీడీపీ మూకలు రౌడీమామూళ్లు వసూళ్లుచేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు అనుబంధంగా ఉన్న ఆయిల్ పరిశ్రమల వద్ద కూడా టీడీపీ మూకలు చెలరేగిపోతున్నాయి. ప్రత్యేకంగా టోల్గేట్ పెట్టి రోజుకు రూ.లక్షల్లో దండుకుంటున్నారు.ప్రత్యేక టోల్గేట్ పెట్టి మరీ ముత్తుకూరు మండలం పంటపాళెంలో ఉన్న ఎడిబుల్ ఆయిల్తోపాటు పెయింట్ ఆయిల్, బిస్కెట్ల ఆయిల్, మెడిసిన్ తయారీ ఆయిల్ పరిశ్రమలున్నాయి. వీటి నుంచి రోజుకు దాదాపు 250 ట్యాంకర్ల ఆయిల్ దేశ నలుమూలలకు రవాణా జరుగుతుంది. ఇందుకు దాదాపు వెయ్యి ట్యాంకర్లు ఉన్నాయి. వీటిల్లో ఏపీకి చెందినవి దాదాపు 300 ఉంటే.. మిగిలిన 700 ఆయిల్ ట్యాంకర్లు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, డెహ్రడూన్ రాష్ట్రాలకు చెందినవి. టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి ఏపీకి చెందిన ట్యాంకర్లకు ‘ఎస్’ ట్యాక్స్ను రూ.300.. దక్షణాది రాష్ట్రాలకు చెందిన వాహనాలకు రూ.7 వేలు, ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం రూ.15 వేలు చొప్పున ‘ఎస్’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ముఖ్యనేత నుంచి పార్టీ పెద్దల వరకు ఇందులో వాటాలు వెళ్తున్నాయని ట్యాంకర్ల యజమానులు చెబుతున్నారు. ఆయిల్పై లీటర్కి రూపాయి చొప్పున వసూలు ఇదిలా ఉంటే.. ఆయిల్ కంపెనీలకు డీలర్లు డిపాజిట్ కట్టి ఆయిల్ కొనుగోలు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న ఇతర ఆయిల్ వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి లోకల్ జిల్లా వ్యాపారుల కనుసన్నల్లో వ్యాపారం సాగిస్తుంటారు. వీరు రోజూ రవాణా చేసే ఆయిల్పై లీటర్కి రూపాయి పచ్చమూకలు చొప్పున వసూలుచేస్తున్నాయి. దీంతో ప్రతి ట్యాంకర్ నుంచి పచ్చ మాఫియాకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు వస్తోంది. ఇది కాకుండా మొత్తం దోపిడీ నుంచి ‘ఎస్’ ట్యాక్స్ రూపంలో ముఖ్యనేత సింహభాగం వాటా దండుకుంటున్నారు. ఇలా ప్రతిరోజు దాదాపు 250 ట్యాంకర్ల నుంచి 87 లక్షల లీటర్ల ఆయిల్ రవాణా అవుతుంది. లీటర్కి రూపాయి చొప్పున చూసుకున్నా రోజుకు రూ.85 లక్షల వరకు టీడీపీ మాఫియా వసూలుచేస్తోంది. ఇందులో సింహభాగం అంటే రూ.10 కోట్లకు పైగా ‘ఎస్’ ట్యాక్స్ కింద ముఖ్యనేతకు చేరుతోంది. కాళ్లు, చేతులు తీసేస్తామని అంటున్నారుఇలా ‘ఎస్’ ట్యాక్స్ వసూళ్ల దందాతో విసుగెత్తిన ఆయిల్ ట్యాంకర్ల యజమానులు, వ్యాపారులు రోడ్డెక్కారు. శ్రీకాళహస్తికి చెందిన ఇద్దరు వ్యాపారులు యోగానంద్తోపాటు మరొకరు సర్వేపల్లి ముఖ్యనేత పేరుతో సాగుతున్న ఈ దందా వ్యవహారాన్ని మీడియా సమక్షంలో వెల్లడించారు. వసూళ్ల దందాపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, కాళ్లు చేతులు తీసేస్తామంటూ భయపెడుతున్నారని వారు ఆరోపించారు. రెండ్రోజుల క్రితం దందాపై ప్రెస్మీట్ పెట్టారనే కారణంతో శ్రీకాళహస్తిలో ఉన్న తమ నివాసాలను ధ్వంసం చేయించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ‘ఎస్’ ట్యాక్స్ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. -
లోకేష్ నెల్లూరు పర్యటనలో అపశృతి
-
అకస్మాత్తుగా జోగి రమేష్ జైలు మార్పు..
జోగి రమేష్ అరెస్ట్.. అప్డేట్స్విజయవాడ:కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న( ఆదివారం, నవంబర్ 2 వతేదీ) నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారుజోగి రమేష్ అరెస్టును ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలుమాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికిపాటి శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి గుంజ శ్రీనివాస్, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలుఎటువంటి ఆధారాలు లేకుండా జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టారుఇది ప్రభుత్వ పైశాచిక ఆనందంజోగి రమేష్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూడా కేసులు పెడుతున్నారు.. ఇది దుర్మార్గ పాలన కాదా?ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి వేల మంది వైఎస్సార్సీపీ సైనికుల గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి.నెల్లూరు జైలుకు జోగి రమేష్జైలు మార్పుతో జోగి రమేష్ కుటుంబ సభ్యుల్లో ఆందోళనవిజయవాడ నుంచి ఆకస్మాత్తుగా నెల్లూరు తరలింపునెల్లూరు జైలుకు జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాముజోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు.జోగి రమేష్ భార్య, కుమారులపై కేసు నమోదు చేసింది. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినపుడు జీజీహెచ్లో దౌర్జన్యం చేసి అద్దాలు పగులకొట్టినట్టు ఫిర్యాదు మాచవరం పోలీసులకు డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఫిర్యాదుగుణదల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా శ్రీనివాసరావు విధులు శ్రీనివాసరావు ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు ఏ1 గా జోగి రమేష్ భార్య శకుంతల దేవి , ఏ2 గా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ , ఏ3గా జోగి రమేష్ చిన్న కుమారుడు రోహిత్లపై కేసు నమోదు నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం(నవంబర్ 2వ తేదీ) ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. -
గుట్టలు గుట్టలుగా బాటిళ్లు..! సాక్షి కెమెరాకు చిక్కిన లిక్కర్ దందా
-
MLA కావ్య కృష్ణారెడ్డిని అడ్డుకున్న మాలేపాటి వర్గీయులు
-
నెల్లూరులో భారీ వర్షాలు.. ఎవరూ బయటకు రావొద్దు..
-
నెల్లూరు టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. YSRCPలో భారీ చేరికలు
-
మరో ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగ
-
బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి
-
నెల్లూరులో పెన్నమ్మ పరవళ్లు..పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
AP: రోడ్డు పక్కన ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు
-
నేను ఆత్మహత్య చేసుకుంటున్నా
నెల్లూరు: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ వెలుగు వీఓఏ వాట్సాప్ గ్రూపులో సెల్ఫీ వీడియో పెట్టింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెతో మాట్లాడారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నందిపాడులో వెలుగు వీఓఏగా రజియా పనిచేస్తోంది. ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియో పెట్టింది. సీసీ తనను విధుల నుంచి తప్పించి మరొకరిని పెట్టుకోవాలని చూస్తున్నారని అందులో ఆరోపించింది. కొందరు పొదుపు మహిళలు, మరో వ్యక్తి వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఆదిలక్ష్మి సకాలంలో స్పందించి రజియాతో మాట్లాడి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ వెలుగు అధికారులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు. -
పోలీసుల ఓవరాక్షన్.. కారు దిగి నడుచుకుంటూ వెళ్లిన జక్కంపూడి రాజా..
-
పక్కా ప్లాన్ తోనే నా భర్తను చంపారు
-
నిరుపేదల పొట్ట కొడుతున్న కూటమి.. టీడీపీ నేతల కొత్త దందా
-
Nellore: మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో నిరసన
-
నెల్లూరు పెన్నా బ్యారేజీ సమీపంలో డబుల్ మర్డర్
-
బాలికపై లైంగికదాడి
నెల్లూరు (క్రైమ్): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి ఆమెపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సంతపేట పోలీసుల కథనం మేరకు.. సంతపేట కామాక్షినగర్కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలోని ఓ దుకాణంలో శశి అనే యువకుడు పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.ఈ నెల 3వ తేదీన బాలిక స్కూల్కు వెళుతుండగా మార్గమధ్యంలో యువకుడు అడ్డుకుని ఆమెను బాలాజీనగర్లోని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను బైక్పై మైపాడుబీచ్కు తీసుకెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. సాయంత్రం అవుతున్నా బాలిక ఇంటికి రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు వెళ్లి విచారించారు. బాలిక రాలేదని తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాత్రి 8 గంటల సమయంలో బాలికను ఆమె ఇంటికి సమీపంలో వదిలి వెళ్లాడు.ఇంటికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక నానమ్మ శనివారం రాత్రి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. -
సచివాలయ ఉద్యోగుల ‘ఆత్మగౌరవం’ భగ్నం
నెల్లూరు (పొగతోట): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు టౌన్హాల్లో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆత్మగౌరవ రొట్టె, ఆత్మగౌరవ సమావేశం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర కార్యక్రమాలకు పోలీసుల అనుమతి కోరారు. ఆత్మగౌరవ రొట్టె, కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతించకపోవడంతో ఆత్మగౌరవ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు టౌన్హాల్కు భారీగా తరలివచ్చారు. అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు సభ నిర్వహణకు అనుమతిలేదంటూ ఉద్యోగులను బయటకు పంపించేశారు. అనంతరం టౌన్హాల్ గేట్లకు తాళాలు వేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జేఏసీ నాయకులు, ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా వీఆర్సీ మైదానం వద్దకు వెళ్లాలంటూ హుకుం జారీ చేయడంతో అక్కడికి చేరుకుని నిరసన కొనసాగించారు.మా డిమాండ్లు నెరవేర్చాలిఉభయ గోదావరి జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగింది. 1,500 మంది సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.ఐక్యవేదిక చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, వలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్తో క్యాడర్ అప్గ్రేడ్ చేయాలని కోరారు. సంఘ సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్కృష్ణ, కనీ్వనర్ షేక్ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు. -
నెల్లూరు మెడికల్ స్టూడెంట్ గీతాంజలి కేసులో బిగ్ ట్విస్ట్!
-
నెల్లూరులో మెడికో విద్యార్థిని సూసైడ్
-
ప్రశ్నిస్తానన్న పవన్ ఏమైపోయాడు.. మా పోరాటం ఆగదు
-
నెల్లూరులో సందడి చేసిన యాంకర్ సుమ, మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
పెరమన రోడ్డు ప్రమాద ఘటన చాలా దారుణం: మేకపాటి విక్రమ్ రెడ్డి
-
కారును ఈడ్చుకెళ్లిన టిప్పర్.. ఏడుగురిని చంపిన టీడీపీ నేత అత్యాశ
-
Mutukur Gate Road: టీడీపీ ఇసుక దందాకు ప్రాణాలు పోయాయంటూ ఆగ్రహం
-
KSR Live Show: టిప్పర్ ప్రమాదంలో ఏడుగురి మృతి.. ఈ పాపం ఎవరిది?
-
ఏడుగురు మృతికి కారకుడైన టీడీపీ నేత
-
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
AP: మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి ఔట్!
సాక్షి, అమరావతి: అటు కేంద్రంలోనూ అధికారంలో కొనసాగుతూ కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి.. రాష్ట్రానికి కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాజెక్టులను తీసుకురాకపోగా గత ప్రభుత్వ కృషితో వచ్చిన వాటిని సైతం వెళ్లగొట్టేలా వ్యవహరిస్తుండటంపై పారిశ్రామిక వర్గాల్లో విభ్రాంతి వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు మూతపడుతున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ పీఎస్యూ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ని్రష్కియాపరత్వంతో చాప చుట్టేసే పనిలో ఉంది. కీలకమైన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో, మిధానీ కలసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ స్థాపించేలా వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. పలు కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024–25 వార్షిక నివేదికలో ఈ విషయం నాల్కో స్పష్టంగా పేర్కొంది. అంటే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే మంగళం పలకబోతున్నారని, రా్ష్ట్రం నుంచి ఒక భారీ ప్రాజెక్టును తరిమేస్తున్నారని అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న కూటమి నేతలు దీనిపై నోరు విప్పక పోవడం పట్ల ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంత్రులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు చేజారిపోతున్నా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలపైనే మోజు.. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థలపై ఉన్న మోజు ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండదని పలు సందర్భాల్లో రుజువైంది. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నా నోరు తెరవడం లేదు. పైగా ఈ యూనిట్ మూసివేతకు సహకరించే విధంగా ఓ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో అనకాపల్లి వద్ద భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయిస్తూ దానికి సొంత ఇనుప గనులు కేటాయించాలని స్వయంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా కేంద్రాన్ని కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంతో పోరాడి చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద 600 ఎకరాల్లో ఎనీ్టపీసీ, బీహెచ్ఈఎల్తో రూ.6,000 కోట్లతో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ను తీసుకురాగా విభజన అనంతరం టీడీపీ హయాంలో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. శరవేగంగా అన్ని అనుమతులు..నెల్లూరులో హైఎండ్ అల్యూమినియం కంపెనీ ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగంగా అడుగులు వేసింది. నాల్కో, మిధానీ కలసి 2019 ఆగస్టులో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ (యూఏడీఎన్ఎల్) పేరిట భాగస్వామ్య కంపెనీనీ ఏర్పాటు చేశాయి. 2020 అక్టోబర్లో నెల్లూరు జిల్లా బీవీపాలెం వద్ద 110 ఎకరాలు భూమిని కేటాయించిన గత ప్రభుత్వం భూసేకరణలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను సైతం వేగంగా పరిష్కరించింది. దీంతో 2021 జూలైలో ఉత్కర్ష కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అత్యవసరమైన పర్యావరణ అనుమతులు సైతం 2021 జూలైలో వచ్చేశాయి. నాల్కో సీఎండీ శ్రీధర్పాత్ర, మిధానీ ఎండీ సంజయ్కుమార్ 2022 ఏప్రిల్లో నాటి సీఎం వైఎస్ జగన్ను కలసి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. -
మీ అక్క నా వద్ద ఉంది.. వచ్చి తీసుకెళ్లు
నెల్లూరు (క్రైమ్): ఓ యువతిని కత్తితో పొడిచి ప్రేమికుడే కడతేర్చిన ఘటన శనివారం తెల్లవారుజామున నెల్లూరు నగరంలోని పోస్టల్ కాలనీలో జరిగింది. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబలి్లకి చెందిన గిరిబాబు, శ్రీలక్ష్మి దంపతులకు మైథిలిప్రియ (23), సాహితి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గిరిబాబు 2020లో గుండెపోటుతో మృతి చెందాడు. ప్రస్తుతం ఆ కుటుంబం మూలాపేటలో ఉంటోంది. మైథిలిప్రియ వెంకటాచలంలోని ఓ కళాశాలలో ఈ ఏడాది మార్చిలో బీఫార్మసీ పూర్తి చేసింది. ఆమె బీఫార్మసీ చదివే సమయంలో అదే కళాశాలలో సహచర విద్యార్థి రాపూరు మండలానికి చెందిన నిఖిల్తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. మైథిలిప్రియ, ఆమె చెల్లెలు సాహితి పోస్టల్కాలనీ మొదటి వీధిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఎదురు బిల్డింగ్లో నిఖిల్ ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ మరో యువతితో సన్నిహితంగా ఉంటూ మైథిలితో తరచూ గొడవ పడుతుండేవాడు. సుమారు నాలుగు నెలల కిందట మైథిలికి బెంగళూరులోని అమెజాన్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడకు వెళ్లింది. పుట్టిన రోజు జరుపుకునేందుకు వచ్చి.. ఈ నెల 6న మైథిలి పుట్టిన రోజు కావడంతో 3న నెల్లూరుకు వచ్చింది. చెల్లెలు గదిలో ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలోనే నిఖిల్ పలుమార్లు ఆమెకు ఫోన్ చేసి గొడవ పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సాహితి అతనితో ఇక వద్దని అక్కకు సూచించింది. ఈ నెల 12న రాత్రి పొద్దుపోయే వరకు మైథిలి ఫోన్ చేసుకుంటూ ఉండగా సాహితి నిద్రపోయింది. 13వ తేదీ తెల్లవారుజామున సుమారు 1.45 గంటల ప్రాంతంలో సాహితి నిద్ర నుంచి లేచి చూడగా అక్క కనిపించకపోవడంతో ఆమెకు ఫోన్ చేసింది. ఫ్రెండ్స్తో ఉన్నానని, పది నిమిషాల్లో వస్తానని, నిఖిల్కు ఫోన్ చేయొద్దని చెప్పింది. దీంతో సాహితి తిరిగి నిద్రపోయింది. సుమారు 3.35 గంటల ప్రాంతంలో ‘‘మీ అక్క నా వద్ద ఉందని, వచ్చి తీసుకెళ్లు’’ అని నిఖిల్ సాహితికి ఫోన్ చేసి చెప్పాడు. సాహితి తన స్నేహితురాలు, రూమ్ కింద ఉంటున్న ఓ మహిళను తీసుకుని నిఖిల్ గది వద్దకు వెళ్లింది. అక్కడ మెట్లపై మైథిలి విగతజీవిగా ఉంది. ఆమె ఎడమ చంక కింద కత్తి పోటు ఉంది. రక్తస్రావమైంది. దీంతో తన అక్కకు ఏమైందని నిఖిల్ను నిలదీయగా తనతో గొడవపడడంతో కత్తితో పొడిచానని నిఖిల్ చెప్పాడు. సాహితి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సాహితి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నిఖిల్ దర్గామిట్ట పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. తన కుమార్తెను హత్య చేసిన నిఖిల్ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి శ్రీలక్ష్మి పోలీసు అధికారులను కోరారు. -
నెల్లూరులో కొత్త లేడీ డాన్..! ఎక్కువ చేస్తే ఖతం
-
తెలుగు గంగ కాలువకు గండి పడే అవకాశం
-
శ్రీకాంత్ నెల్లూరు జైలులో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడినట్లుగా సమాచారం
-
ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కాకాణి
-
మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి ఊరట
సాక్షి,విజయవాడ: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఊరట దక్కింది. నెల్లూరులో ప్రవేశించొద్దన్న షరతును ఏపీ హైకోర్టు తొలగించింది. నెల్లూరు జిల్లాలో ఉండొద్దన్న పోలీసులు పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. నెల్లూరులో ఉండేందుకు కాకాణి గోవర్ధన్రెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. -
ఇది కాకాణి నిజాయితీ నీకు దమ్ముంటే మా ఛాలెంజ్ స్వీకరించు
-
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా
నెల్లూరు జిల్లా: బిల్డర్ను బెదిరించిన ఘటనలో ఒంగోలు జైల్లో రిమాండ్లో ఉన్న నిడుగుంట అరుణను కోర్టు అనుమతితో కోవూరు పోలీసులు మూడు రోజుల కస్టడీకి గురువారం తీసుకున్నారు. ఎస్సై రంగనాథ్గౌడ్ నేతృత్వంలో సిబ్బంది ఆమెను ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. సీఐ సుధాకర్రెడ్డి ఆమెను సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించారు. తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానంటూ అన్నింటికీ సమాధానాలిచ్చారని సమాచారం. విచారణ అనంతరం ఆమెను జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. మోసాలు.. ఒక్కొక్కటిగా బయటకు పట్టాల పేరిట అరుణ మోసగించిందని కోవూరు పోలీసులకు పలువురు గిరిజనులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. గంజాయి కేసుల్లోనూ ఆమె ప్రమేయం ఉందంటూ మరో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో ఆమె సెల్ఫోన్లను పోలీస్ అ«ధికారులు సీజ్ చేశారు. కాల్డీటైల్స్ ఆధారంగా ఇప్పటికే అనేక మంది రౌడీïÙటర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీకి తీసుకొని సమాచారాన్ని పూర్తిస్థాయిలో రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు అరుణ ఫోన్ డేటాను సేకరిస్తున్నారు. అందులో కీలక సమాచారం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్ డేటా బయటకొస్తే అనేక మంది గుట్టురట్టయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో అరుణతో సన్నహితంగా ఉన్న వారిలో అలజడి మొదలైంది. విచారణ విషయాలు బయటకు పొక్కకుండా పోలీస్ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. గుండెల్లో దడ మొదలు సాక్షి టాస్క్ఫోర్స్: కిలేడి అరుణకు సహకరించిన వ్యక్తుల గుండెల్లో దడ మొదలైంది. పోలీస్ కస్టడీలో తమ పేర్లను బయటపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది.. తమను అరెస్ట్ చేస్తారాననే ఆందోళన వారిలో స్టార్టయింది. ఈ క్రమంలోనే రాష్ట్ర పోలీస్ బాస్ జిల్లాకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోవూరు పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో ఒంగోలు జైల్లో రిమాండ్లో ఉన్న అరుణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మిగిలిన రెండు రోజుల్లో వీలైనంత సమాచారాన్ని రాబట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఆమె ముఖ్య అనుచరులైన నలుగుర్ని నెల్లూరు నగర పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారని తెలిసింది. వీరిలో ఇద్దరు సుమారు ఆరేళ్ల క్రితం రైల్లో జరిగిన నగదు దోపిడీ కేసులో నిందితులని సమాచారం. ఆమెతో కలిసి వీరు దౌర్జన్యాలు చేశారనే అంశాన్ని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. వీరిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. మరోవైపు తిరుపతి జిల్లాలోనూ శ్రీకాంత్, అరుణకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని అక్కడ జరిగిన కొన్ని నేరాల్లో వీరి ప్రమేయం ఏమైనా ఉందాననే కోణాల్లో విచారణ జరుపుతున్నారని తెలిసింది. -
నెల్లూరులో దుమ్ములేపిన కాకాణి కాన్వాయ్
-
Jupudi Prabhakar Rao: రౌడీషీటర్ శ్రీకాంత్ వెనుక ఉన్నది టీడీపీ నేతలే..
-
కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల
-
నెల్లూరు ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
నెల్లూరు ఆర్ఎన్ఆర్ కాలేజీలో దారుణం
సాక్షి,నెల్లూరు: అన్నమయ్య సర్కిల్ ఆర్ఎన్ఆర్ జూనియర్ ఇంటర్ కాలేజీలో దారుణం జరిగింది. హాస్టల్లో ఉంటున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది.దీంతో విద్యార్థిని ఆత్మహత్య గురించి గుట్టుచప్పుడు కాలేజీ యాజమాన్యం వ్యవహరించింది. ఎవరికీ అనుమానం రాకుండా.. విద్యార్ధినికి ఆరోగ్యం బాగలేదంటూ ఆస్పత్రికి తరలించింది. బాధితురాలి తల్లిదండ్రులకు ఇదే విధంగా సమాచారం అందించింది. కుమార్తె ఆరోగ్యంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు.అయితే,విద్యార్థిని మెడ భాగంపై కమిలిన గాయాలు ఉండడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. -
నెల్లూరులో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, చాకిచెర్ల: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుపాన్ వాహనం లారీని ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఉలవపాడు మండలం చాకిచర్ల వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తుపాను వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, వీరంతా.. పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
నేను నవ్వినందుకు కేసు పెట్టారు
సాక్షి,నెల్లూరు: నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డికు మద్దతు తెలిపేందుకు నాపై కేసు పెట్టారు.ప్రసన్న కుమార్తో కలిసి నన్ను ఏ2గా చేర్చారు. నేను నవ్వినందుకు కేసు పెట్టారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కూటమి ప్రభుత్వంలో వేదిక మీద నవ్విన నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చాయి. నవ్విన తప్పే అంటే ఇక ఏమి చేయాలి?. కూటమి నేతలు ఏ స్థాయికి దిగజారి పోయారో తెలుస్తోంది.36 ప్రశ్నలు అడిగారు, 10 నిమిషాల్లో సమాధానం రాసి ఇచ్చాను. నన్ను ఆరు గంటలు కూర్చోబెట్టారు, విచారణ చేశారు. బీసీ నాయకులను కూటమి ప్రభుత్వం కక్ష్య సాధిస్తోంది’అని ఆరోపించారు. కాగా,కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. -
అనిల్ కుమార్ యాదవ్ పై కక్ష సాధింపు
-
ఆ కేసులో అనిల్ కుమార్ యాదవ్ ని ఇరికించే కుట్ర
-
నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసుకు అనిల్ కుమార్ యాదవ్


