న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా, రైలు, రోడ్డు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది.
🚨🌊 कोल्हापुरात मुसळधार पाऊस
जिल्ह्यातील कासारी आणि पंचगंगा नद्या दुथडी भरून वाहत असून पंचगंगेची पातळी ३० फुटांवर पोहोचली आहे. (इशारा पातळी ३९ फूट, धोका पातळी ४३ फूट). जिल्ह्यातील ३३ बंधारे पाण्याखाली गेले आहेत. महापुराचा धोका नसला, तरी प्रशासनाने नागरिकांना नदीकाठी न जाण्याचे… pic.twitter.com/w81z1GC9w1— DD Sahyadri News | सह्याद्री बातम्या (@ddsahyadrinews) July 5, 2026
ఒడిశాలోని పలు పట్టణాలు జలమయమయ్యాయి. మహారాష్ట్రలో వర్షాల తీవ్రత అత్యధికంగా ఉంది. పుణేలో మరో ముగ్గురు మరణించడంతో, గత మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో మరణాల సంఖ్య 13కు చేరింది. ముంబై, ఠాణే, రాయ్గఢ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబై-పుణే ఎక్స్ప్రెస్వేపై కొండచరియలు విరిగిపడటం, కాంక్రీట్ పిల్లర్ కూలిపోవడంతో రవాణా నిలిచిపోయింది.
ముంబైలో లోకల్ రైళ్లు, విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదల వల్ల రోడ్లు, పంట పొలాలు దెబ్బతిన్నాయి. చంబాలో రాయి పడి 14 ఏళ్ల బాలిక మరణించింది. జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఆకస్మిక వరదలకు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సమీపంలో వాహనాలు, యంత్రాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఒడిశాలో వాయుగుండం ప్రభావంతో వరుసగా మూడో రోజు భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. రాజస్థాన్లో సైతం రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి.


