breaking news
Stock Market
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 463.50 పాయింట్లు లేదా 0.59 శాతం నష్టంతో 78,491.26 వద్ద, నిఫ్టీ 65.35 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 24,570.65 వద్ద నిలిచాయి.సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్, సంవర్ధన మోథర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈఐహెచ్ లిమిటెడ్, ఈక్లర్క్స్ సర్వీసెస్ లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో దలాల్ స్ట్రీట్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 32 పాయింట్లు తగ్గి 24,602 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 266 పాయింట్లు నష్టపోయి 78,684 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.97బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 83.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.68 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.18 శాతం తగ్గింది.నాస్డాక్ 0.06 శాతం నష్టపోయింది.Today Nifty position 07-08-2026(time: 9:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ తీరుపై వారెన్ బఫెట్ సీరియస్!
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, బెర్క్షైర్ హాథ్వే చైర్మన్ వారెన్ బఫెట్ ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేటి ఆర్థిక మార్కెట్ల తీరుపై హెచ్చరికలు జారీ చేశారు. స్వల్పకాలిక ఊహాగానాలు, క్రమశిక్షణ లేని జూదపు(కేసినో) ధోరణులు మార్కెట్ను ఏలుతున్నాయని స్పష్టం చేశారు.రూ.33 లక్షల కోట్లకు పైగా నగదు నిల్వలుమార్కెట్లపై ఆసక్తి పెరిగిన ప్రస్తుత సమయంలోనూ బెర్క్షైర్ హాథ్వే 2026 మొదటి త్రైమాసికంలో ఏకంగా 397.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33 లక్షల కోట్లకు పైగా) రికార్డు నగదు, స్వల్పకాలిక ట్రెజరీ బిల్లులను సమకూర్చుకుంది. ఇది కంపెనీ మొత్తం విలువలో మూడో వంతు కంటే ఎక్కువ కావడం గమనార్హం. మార్కెట్లో వ్యాల్యూయేషన్లు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రతి ఒక్కరూ జూదాన్ని ఇష్టపడుతున్నప్పుడు సరైన విలువ కలిగిన షేర్లను కనుగొనడం అత్యంత కష్టం అని సీఎన్బీసీ ఇంటర్వ్యూలో బఫెట్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వన్-డే ఆప్షన్స్ ట్రేడింగ్, పాలీమార్కెట్ వంటి ప్రిడిక్షన్ మార్కెట్ల వేగవంతమైన వృద్ధిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.సంక్షోభ సమయాల్లోనే పెట్టుబడులుఅనవసరమైన ఉత్సాహంతో ఊహాజనిత ర్యాలీలను వెంబడించడం కంటే లిక్విడిటీని నిలుపుకోవడమే తమ శైలి అని బఫెట్ పునరుద్ఘాటించారు. ‘మార్కెట్లో పెద్ద ఎత్తున క్షీణత లేదా తీవ్ర సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే మేము ఈ భారీ నిధులను రంగంలోకి దించుతాం’ అని పేర్కొన్నారు. 2008 నాటి ఆర్థిక సంక్షోభం, కొవిడ్ క్రాష్ వంటి సమయాల్లో బెర్క్షైర్ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. 2026 ప్రారంభంలో బఫెట్ నుంచి సీఈఓ బాధ్యతలు స్వీకరించిన గ్రెగ్ అబెల్ కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నారు. తన మొదటి త్రైమాసికంలోనే 8.1 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ హోల్డింగ్స్ను విక్రయించి రక్షణత్మక వైఖరిని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026’కు ఆమోదం -
వాజ్పేయి సాయం.. వేదాంత విజయం!
ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో.. కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక మధుర జ్ఞాపకాన్ని వేదాంత సంస్థ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తన వ్యాపార జీవితంలో అత్యంత కీలకమైన విజయానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సహాయం కారణమని ఆయన తెలిపారు.భారతీయ కంపెనీలకు దేశీయ స్టాక్ మార్కెట్లో తగిన గుర్తింపు, విలువ లభించడం లేదని అనిల్ అగర్వాల్ భావించారు. దీంతో.. వేదాంతను లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే.. విదేశీ స్టాక్ మార్కెట్లో భారతదేశ కంపెనీని లిస్ట్ చేయాలంటే ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవడం తప్పనిసరి. ఆ అనుమతి పొందడం చాలా కష్టమైన పని.10 December 2003!मुझे आज भी London की वो सुबह याद है, जब Vedanta के साथ-साथ, हिंदुस्तान भी इतिहास रचने के लिए तैयार था।उस समय मुझे अक्सर लगता था कि भारतीय businesses को सही value और growth नहीं मिल रही।मैंने तय कर लिया कि Vedanta को London Stock Exchange पर list करेंगे।पर… pic.twitter.com/DyX1GE6eCb— Anil Agarwal (@AnilAgarwal_Ved) August 5, 2026ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అనిల్ అగర్వాల్ ఢిల్లీకి వెళ్లి పలువురు అధికారులను కలిశారు. చివరకు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని కలిసి తన ఆలోచనను వివరించే అవకాశం దక్కింది. ఆయన చెప్పిన విషయాన్ని వాజ్పేయి ఎంతో శ్రద్ధగా విన్నారు. తర్వాత.. అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ను చూసి,''ఈ అబ్బాయి మంచివాడిలా కనిపిస్తున్నాడు. ఇతనికి సహాయం చేద్దాం. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం దేశానికి వస్తుంది'' అని చెప్పారు.ప్రధానమంత్రి మద్దతుతో ప్రభుత్వం వెంటనే అవసరమైన ఎన్ఓసీను జారీ చేసింది. ఆ అనుమతి పత్రంతో.. అనిల్ అగర్వాల్ తిరిగి లండన్ వెళ్లి తన కలను నిజం చేసుకున్నారు. వేదాంత సంస్థ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ పొందిన తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఎఫ్టీఎస్ఈ 100 ఇండెక్స్లో కూడా స్థానం సంపాదించింది. ఈ విజయాన్ని అనిల్ అగర్వాల్ తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: 100మంది రిజెక్ట్ చేసినా.. రూ.38 వేల కోట్ల కంపెనీ నిర్మించాడు! -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్!
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 373.76 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 78,954.76 వద్ద, నిఫ్టీ 11.35 పాయింట్లు లేదా 0.046 శాతం లాభంతో 24,636.00 వద్ద నిలిచాయి.నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. బ్లూ స్టార్ లిమిటెడ్, సరిగమ ఇండియా లిమిటెడ్, హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆర్బీఐ ఎఫెక్ట్: మార్కెట్ ముగిసిందిలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో భారత బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ కాస్త లాభాలతో పుంజుకున్నాయి. నిఫ్టీ 0.04 శాతం లేదా 9.75 పాయింట్ల లాభంతో 24,624.65 వద్ద, సెన్సెక్స్ 152.05 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 78,581.00 వద్ద ముగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 0.18 శాతం, 0.7 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి. -
లక్ష పెడితే 12 లక్షలు.. స్టాక్ మార్కెట్ లో మరో సెన్సేషన్
-
సెన్సెక్స్ 394 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు తగ్గి 24,629 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 394 పాయింట్లు పుంజుకొని 78,822 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.78బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.79 శాతం పెరిగింది.నాస్డాక్ 2.59 శాతం పుంజుకుంది.Today Nifty position 05-08-2026(time: 9:44 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్.. పబ్లిక్ ఇష్యూల సందడి!
ముంబై: మళ్లీ ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంటోంది. ఈ వారాంతాన రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. మరో కంపెనీ సెబీకి ప్రాథమిక దరఖాస్తు దాఖలు చేసింది. పీఈ దిగ్గజం కేకేఆర్కు పెట్టుబడులున్న లీప్ ఇండియా, మౌలిక రంగ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవో చేపట్టనున్నాయి. వివరాలు చూద్దాం..రూ. 2,480 కోట్లకు రెడీసప్లై చైన్ నిర్వహణ కంపెనీ లీప్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి రూ. 151–159 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభంకానుండగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లు ఆఫర్ చేయనుంది. 11న ముగియనున్న ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 480 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 2,480 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైలర్లు కనీసం 94 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 360 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ నెల 14న లిస్ట్కానుంది.2013లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా సప్లై చైన్ నిర్వహణ రంగంలో పంచుకోవడం, పునర్వినియోగం(షేర్ అండ్ రీయూజ్) పద్ధతిన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తద్వారా సరఫరా సంబంధ సౌకర్యాలను తాత్కాలిక ప్రాతిపదికన కస్టమర్లు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఫలితంగా కస్టమర్లు తయారీ దగ్గరనుంచి వస్తువుల పంపిణీసహా.. రిటైల్(పీవోఎస్)వరకూ సేవలు సమకూరుస్తోంది. గతేడాది(2025-26) రూ. 747 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 62 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 252 కోట్లపై కన్నుప్రధానంగా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు చేపట్టే ఈపీసీ కంపెనీ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవోకు రూ. 200–212 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభంకానుండగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లు ఆఫర్ చేయనుంది. 11న ముగియనున్న ఐపీవోలో భాగంగా కంపెనీ 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ సంస్థ కార్తికేయ కన్స్ట్రక్షన్స్ మరో 23.76 లక్షల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 252 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 150 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. గతేడాది(2025–26) రూ. 345 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 43 కోట్ల నికర లాభం ఆర్జించింది.ఎన్క్యూబ్ ఎథికల్స్ సెబీకి దరఖాస్తుస్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఎన్క్యూబ్ ఎథికల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్ మేహుల్ మధుసూదన్ షా, ప్రస్తుత వాటాదారు ఫ్రంటియర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి.దీంతో ఇష్యూ నిధులు కంపెనీ ప్రమోటర్తోపాటు, ఇన్వెస్టర్ సంస్థకు మాత్రమే చేరనున్నాయి. 1995లో ఏర్పాటైన కంపెనీ ప్రపంచవ్యాప్త ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల ప్లాట్ఫామ్గా సర్వీసులందిస్తోంది. సాంకేతికంగా క్లిష్టతరహా(కాంప్లెక్స్) టాపికల్, ట్రాన్స్డెర్మల్ డోసేజీలను రూపొందిస్తోంది. భారత్సహా.. యూఎస్, యూకే, యూరప్ తదితర రెగ్యులేటెడ్ మార్కెట్లకు ప్రొడక్టులను అందిస్తోంది. గతేడాది(2025–26) రూ. 1,849 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 437 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం మిశ్రమ ఫలితాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 210.08 పాయింట్లు లేదా 0.27 నష్టంతో 78,428.95 వద్ద, నిఫ్టీ 159.40 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 24,614.90 వద్ద నిలిచాయి.ఏథర్ ఎనర్జీ లిమిటెడ్, కేఈఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఎల్ లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 544.39 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 78,639.03 వద్ద, నిఫ్టీ 390.70 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో 24,774.30 వద్ద నిలిచాయి.అర్బన్ కంపెనీ లిమిటెడ్, బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్, పైన్ ల్యాబ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెన్సెక్స్ 445 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు పెరిగి 24,521 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 445 పాయింట్లు పుంజుకొని 78,536 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.75బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 83.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.7 శాతం పెరిగింది.నాస్డాక్ 1 శాతం పుంజుకుంది.Today Nifty position 03-08-2026(time: 9:25 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రేడింగ్ ఒక వృత్తి కాగలదా?
నేటి ఆధునిక ఆర్థిక ప్రపంచంలో ‘ఆర్థిక స్వాతంత్య్రం’ సాధించ డానికి ట్రేడింగ్ ఒక ఆకర్షణీయమైన మార్గంగా కనిపిస్తోంది. గతంలో దీనిని కేవలం ఒక జూదంగానో లేదా పార్ట్–టైమ్ ఆదాయ వనరుగానో చూసేవారు. నేడు సాంకేతిక విప్లవం, మార్కెట్లపై అవగాహన పెరగడంతో చాలామంది దీనిని పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకోవాలని భావిస్తున్నారు.భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన ‘సెబీ’ రిటైల్ ట్రేడర్ల శైలి, వారి లాభనష్టాలపై ఒక లోతైన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈ గణాంకాలు ట్రేడింగ్ను వృత్తిగా మార్చుకోవాల నుకునే వారికి కనువిప్పు కలిగిస్తున్నాయి.భారతదేశంలో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ చేసే వ్యక్తిగత ట్రేడర్లలో దాదాపు 90% నుండి 93% మంది నష్టపోతున్నారు. నష్టపోయే ప్రతి యాక్టివ్ ట్రేడర్ సగటున ఏడాదికి రూ. 1.25 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు నష్టపోతున్నట్లు సెబీ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 7% నుండి 10% మంది మాత్రమే మార్కెట్లో లాభాలు గడిస్తున్నారు. వీరిలో కూడా కేవలం 1.5% మంది మాత్రమే నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని స్థిరంగా సంపాదించగలుగుతున్నారు. ట్రేడర్లు సంపాదించే లాభాల్లో లేదా నష్టాల్లో దాదాపు 15% నుండి 25% వరకు కేవలం బ్రోకరేజ్, పన్నులు, ఇతర లావాదేవీల ఖర్చులకే సరిపోతుందని తేలింది.ట్రేడింగ్లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్నప్పుడు భయం, దురాశ వంటి భావోద్వేగా లను నియంత్రించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ట్రేడింగ్ను విజయ వంతమైన కెరీర్గా మార్చుకోవాలంటే ట్రేడింగ్కు సంబంధించి చాలా అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి ట్రేడ్లోనూ మీ పెట్టుబడిపై ఎంత శాతం నష్టాన్ని (స్టాప్–లాస్ విధానం) భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్ ఇండికేటర్లపై శాస్త్రీయ మైన పట్టు ఉండాలి.ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో (ముఖ్యంగా అమెరికా, యూరప్, సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో) ట్రేడింగ్ను ఒక జూదంగానో లేదా సైడ్ హాసిల్గానో కాకుండా, గౌరవప్రదమైన, వ్యవస్థీకృతమైన ‘వైట్ కాలర్‘ వృత్తిగా చూస్తారు. విదేశాలతో పోలిస్తే భారతదేశంలో ట్రేడింగ్ను వృత్తిగా మార్చుకోవడానికి ఉన్న అతిపెద్ద సవాలు ఆర్థిక అక్షరాస్యత లోపించడం, సరైన గైడెన్స్ లేకపోవడం.– డా. ఎం.డి. ఖ్వాజా మొయినుద్దీన్, స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు -
స్టాక్ మార్కెట్ అప్డేట్స్: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 166.49 పాయింట్లు లేదా 0.21 శాతం లాభంతో 78,094.64 వద్ద, నిఫ్టీ 43.95 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 24,361.10 వద్ద నిలిచాయి.బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, సజిలిటీ లిమిటెడ్, సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
SIPలో ఎవరూ చెప్పని సీక్రెట్.. ₹50,000 తో కోటి..
-
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు పెరిగి 24,347 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 పాయింట్లు తగ్గి 77,961 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.18బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 85.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.64 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.66 శాతం పెరిగింది.నాస్డాక్ 2.78 శాతం పుంజుకుంది.Today Nifty position 31-07-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 180.83 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 77,835.43 వద్ద, నిఫ్టీ 46.30 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 24,296.50 వద్ద నిలిచింది.బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రెడింగ్టన్ లిమిటెడ్, సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్, హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రేడర్లకు అలర్ట్.. స్టాక్ మార్కెట్లో కొత్త టైమింగ్!
దేశీయ స్టాక్ మార్కెట్లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. పెట్టుబడిదారులకు మరింత పారదర్శకమైన, న్యాయమైన ట్రేడింగ్ వాతావరణాన్ని కల్పించేందుకు 2026 ఆగస్టు 3 నుంచి సీఏఎస్ (Closing Auction Session) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ విధానం వల్ల షేర్ల ముగింపు ధర మరింత ఖచ్చితంగా నిర్ణయించడం జరుగుతుంది.ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత.. మార్కెట్ ముగింపు సమయాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. F&O విభాగంలో ఉన్న షేర్ల ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటలకు ముగుస్తుంది. మిగతా అన్ని ఈక్విటీ షేర్ల ట్రేడింగ్ 3:30 గంటలకు, ఇండెక్స్ అండ్ స్టాక్ F&O కాంట్రాక్టుల ట్రేడింగ్ 3:40 గంటలకు ముగుస్తుంది. అయితే మార్కెట్ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారికి కూడా.. కొత్త ఆటో స్క్వేర్ ఆఫ్ సమయాలు అమల్లోకి వస్తాయి. సీఏఎస్ పరిధిలోని షేర్లకు 3:10 గంటలకు, సీఏఎస్ పరిధిలో లేని షేర్లకు 3:20 గంటలకు, ఇండెక్స్ అండ్ స్టాక్ ఎఫ్&ఓ కాంట్రాక్టులకు 3:25 గంటలకు ఆటో స్క్వేర్ ఆఫ్ జరుగుతుంది. కాబట్టి ఇంట్రాడే ట్రేడర్లు ఈ సమయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.సీఏఎస్ ఎందుకు ప్రవేశపెట్టారు? ప్రస్తుతం మార్కెట్ ముగింపు ధరను 'కంటిన్యూస్ ట్రేడింగ్ సెషన్'లో జరిగిన ట్రేడ్ల సగటు ధర (VWAP) ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ మార్కెట్ చివరి నిమిషాల్లో పెద్ద సంస్థలు భారీగా కొనుగోలు లేదా అమ్మకాలు చేయడం వల్ల షేర్ల ధరలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల నిజమైన ముగింపు ధర ప్రతిబింబించకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సీఏఎస్ తీసుకురావడం జరిగింది.సీఏఎస్ ఉపయోగాలుజెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్ సీఏఎస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్లు, ETFలు వంటి పెద్ద పెట్టుబడి సంస్థలు మార్కెట్ ముగింపు ధరకు అనుగుణంగా ట్రేడింగ్ చేయడం వల్ల వాటి ట్రాకింగ్ ఎర్రర్ తగ్గుతుంది. అలాగే పెద్ద ఆర్డర్ల కారణంగా మార్కెట్పై పడే ప్రభావం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా.. మార్కెట్ ముగింపు సమయంలో ఇండెక్స్ ధరలను కృత్రిమంగా మార్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.ప్రపంచంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీలు అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (NYSE), లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ (LSE) వంటి మార్కెట్లు ఇప్పటికే ఈ సీఏఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల మార్కెట్లో పారదర్శకత పెరుగుతుంది, పెద్ద పెట్టుబడిదారుల ప్రభావం తగ్గుతుంది, చిన్న పెట్టుబడిదారులకు కూడా న్యాయమైన ట్రేడింగ్ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి.. సీఏఎస్ భారతీయ స్టాక్ మార్కెట్ను మరింత బలంగా, విశ్వసనీయంగా మార్చే ఒక మంచి ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు. -
లక్షకు 5 లక్షల లాభం.. ఈ షేర్ మిస్ అయితే బోనస్ మిస్..
-
నెమ్మదించిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు పెరిగి 24,256 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 34 పాయింట్లు తగ్గి 77,618 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.91బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 89.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.7 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.52 శాతం తగ్గింది.నాస్డాక్ 1.74 శాతం నష్టపోయింది.Today Nifty position 30-07-2026(time: 9:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ షేర్ల మెరుపులు.. లాభాల్లో స్టాక్మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్ల లాభాల దన్నుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. సెన్సెక్స్ 889 పాయింట్లు లేదా 1.16 శాతం పెరిగి 77,654.60 వద్ద, నిఫ్టీ 265 పాయింట్లు లేదా 1.1 శాతం పెరిగి 24,250.20 వద్ద స్థిరపడ్డాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.82 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.48 శాతం పెరిగాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మెరుగైన పనితీరు కనబరిచాయి. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 69.86 పాయింట్లు లేదా 0.091 శాతం నష్టంతో 76,765.92 వద్ద, నిఫ్టీ 10.60 పాయింట్లు లేదా 0.044 శాతం నష్టంతో 23,985.35 వద్ద నిలిచాయి.అశికా గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, రాడాన్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, నీల్కమల్ లిమిటెడ్, అఫ్లే 3ఐ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎస్.కె.ఎం. ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ (ఇండియా) లిమిటెడ్, ఆరియన్ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 776.01 పాయింట్లు లేదా 1.02 శాతం లాభంతో 76,835.78 వద్ద, నిఫ్టీ 228.50 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 23,995.95 వద్ద నిలిచాయి.పిరమిడ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్, క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, కార్ట్రేడ్ టెక్ లిమిటెడ్, రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నెల్కాస్ట్ లిమిటెడ్, గాంధర్ ఆయిల్ రిఫైనరీ (ఇండియా) లిమిటెడ్, మోస్చిప్ టెక్నాలజీస్ లిమిటెడ్, టిప్స్ ఫిల్మ్స్ లిమిటెడ్, క్రాస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 23,944 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 601 పాయింట్లు పుంజుకొని 76,667 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.16బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.63 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం పెరిగింది.నాస్డాక్ 0.64 శాతం నష్టపోయింది.Today Nifty position 27-07-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మణిపాల్ హెల్త్ ఐపీవో.. షేరు ధర ఇలా..
న్యూఢిల్లీ: హెల్త్కేర్ దిగ్గజం మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు షేరు ధరల శ్రేణిని రూ.560–590గా కంపెనీ నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.77,600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ నెల 29న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ 31న ముగుస్తుంది. రూ.9,275 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. ఇందులో భాగంగా రూ. 8,000 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుండగా.. సంస్థలోని ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో మరో 2.16 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. మణిపాల్ హెల్త్ సమీకరించనున్న నిధుల్లో రూ.5,378 కోట్లను సబ్సిడరీ మణిపాల్ హాస్పిటల్స్కు చెందిన రుణ చెల్లింపుల కోసం, రూ.574 కోట్లను మరో సబ్సిడరీ సహ్యాద్రి హాస్పిటల్స్లో మైనారిటీ వాటా కొనుగోలు కోసం, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. దేశవ్యాప్తంగా 49 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ (13,000 బెడ్స్) కలిగిన మణిపాల్ హెల్త్.. 2025 సెపె్టంబర్ 30తో ముగిసిన ఆరు నెలలకు రూ.4,713 కోట్ల ఆదాయంపై రూ. 572 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.3–4 ఏళ్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడి హాస్పిటల్స్ నెట్వర్క్ విస్తరణ కోసం వచ్చే 3–4 ఏళ్లలో రూ.3,560 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు మణిపాల్ హెల్త్ ఎండీ, సీఈఓ దిలీప్ జోస్ చెప్పారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ప్రస్తుత హాస్పిటల్స్ విస్తరణ ద్వారా మరో మూడేళ్లలో 3000 బెడ్స్ అదనంగా జతయ్యే అవకాశం ఉందన్నారు. విస్తరణలో భాగంగా కేరళ, హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ఆసుపత్రుల కొనుగోలుకు సిద్ధమేనని కూడా జోస్ వెల్లడించారు. -
స్టాక్ మార్కెట్: ఐదో రోజూ నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాలతోనే ముగిశాయి. పెరిగిన చమురు ధరల మధ్య ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన భయాలతో మదుపరులు అమ్మకాలకు దిగడంతో బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ శుక్రవారం నష్టాలతో సెషన్ను ముగించాయి.సెన్సెక్స్ 332 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 76,059.77 వద్ద, నిఫ్టీ 102.15 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 23,767.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.1 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.32 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1 శాతం పతనమై అత్యంత చెత్త పనితీరు కనబరిచింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫార్మా కూడా తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల బాట
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 181 పాయింట్లు తగ్గి 23,692 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 642 పాయింట్లు నష్టపోయి 75,758 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.41బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.7 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.21 శాతం తగ్గింది.నాస్డాక్ 2.15 శాతం నష్టపోయింది.Today Nifty position 24-07-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 376.84 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 76,378.20 వద్ద, 126.65 పాయింట్లు లేదా 0.53 శాతం నష్టంతో 23,869.60 వద్ద నిలిచాయి.టిప్స్ ఫిల్మ్స్ లిమిటెడ్, ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్, ప్రజే ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, తాన్లా ప్లాట్ఫారమ్స్ లిమిటెడ్, షా మెటాకార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కంట్రోల్ ప్రింట్ లిమిటెడ్, సిఐఇ ఆటోమోటివ్ ఇండియా లిమిటెడ్, వాటర్వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 23,945 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 208 పాయింట్లు నష్టపోయి 76,557 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.66 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.14 శాతం తగ్గింది.నాస్డాక్ 0.57 శాతం నష్టపోయింది.Today Nifty position 23-07-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్మార్కెట్!
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రియల్టీ, పీఎస్యూ బ్యాంకు షేర్ల కుదేలుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్లోనూ భారీగా పతనమయ్యాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తత కారణంగా అధిక చమురు ధరలు కూడా రిస్క్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 715.06 పాయింట్లు లేదా 0.92 శాతం క్షీణించి 76,755.05 వద్ద, నిఫ్టీ 191.45 పాయింట్లు లేదా 0.79 శాతం క్షీణించి 23,996.25 వద్ద ముగిసింది.సెన్సెక్స్ లోని 30 స్టాక్స్ లో 22 షేర్లు నష్టపోయాయి. రేపటి క్యూ 1 ఫలితాలకు ముందు ఇండిగో 3.7 శాతం క్షీణతతో టాప్ లూజర్ గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఢమాలయ్యాయి. మరోవైపు, ఎటర్నల్, Q1 ఫలితాల తరువాత ఉత్తమ పనితీరును కనబరిచింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.09 శాతం, 1.54 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ అత్యంత క్షీణించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగాయి. -
సెన్సెక్స్.. 560 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు తగ్గి 24,024 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 568 పాయింట్లు నష్టపోయి 76,915 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.16బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.89 శాతం పెరిగింది.నాస్డాక్ 1.29 శాతం పుంజుకుంది.Today Nifty position 22-07-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ నిఫ్టీ అహింసా ఇండెక్స్!
భారత స్టాక్ మార్కెట్లో థీమ్ ఆధారిత పెట్టబడులకు సంబంధించి మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అంటే ఇప్పటివరకు లాభాలు, వృద్ధి, డివిడెండ్లు ప్రమాణాలుగా పరిగణించేవారు. ఇప్పుడు వీటికి ’అహింస’ అనే కొత్త ప్రమాణం కూడా జతకలిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 500 పేరుతో అహింస ఇండెక్స్ను ప్రారంభించింది. జంతువులపై హింసకు పాల్పడని, జంతువులకు సంబంధంలేని కంపెనీలను ఈ ఇండెక్స్లో చేర్చడం విశేషం. ఇతరదేశాల్లో కొత్తగా ట్రెండవుతున్న ఎథికల్ ఇన్వెస్టింగ్ (నైతిక విలువల పెట్టుబడులు)కోరుకునే ఇన్వెస్టర్లకు దేశీయంగా ఈ ఇండెక్స్ను ఎన్ఎస్ఈ అందుబాటులోకి తెచ్చింది.ఈ ఇండెక్స్లో నిఫ్టీ 500 లోని కంపెనీలను ప్రత్యేకంగా పరిశీలించి వాటి ఉత్పత్తులు, వ్యాపార విధానాలు, సేవలు జంతువులకు ఏవిధంగా అయినా హాని కలిగిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించి ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియను అహింసాగైన్ ఫౌండేషన్ రూపొందించిన అహింసా ఇన్వెస్ట్మెంట్ మూవ్మెంట్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు కేవలం లాభాలే కాకుండా పర్యావరణం, సామాజిక బాధ్యత, నైతిక విలువలు వంటి అంశాలను కూడా పెట్టుబడి చేసే ముందు పరిగణలోకి తీసుకుంటున్నారు. పర్యావరణ (ఎని్వరాన్మెంటల్) సా మాజిక (సోషల్), పాలనా (గవర్నెన్స్) ఈఎస్జీ ప్రమాణాల తర్వాత యానిమల్ వెల్ఫేర్ ఇన్వెస్టింగ్ కూడా ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇప్పటికే రూ.80 లక్షల కోట్లకు పైగా ఆస్తులు నిర్వహణలో ఉన్నప్పటికీ జంతు సంక్షేమాన్ని ఆధారంగా చేసుకున్న పెట్టుబడి ఉత్పత్తులు పరిమితంగానే ఉన్నాయి. ఈ కొత్త ఇండెక్స్ ఆ లోటును కొంత వరకు భర్తీ చేయవచ్చనేది మార్కెట్ నిపుణుల అంచనా. ఇన్వెస్టింగ్ అంటే కేవలం లాభాలే కాదు మన డబ్బు ఏ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందో కూడా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని, విలువలకు ప్రాధాన్యం ఇచ్చే పెట్టుబడుల యుగానికి ఎన్ఎస్ఈ ఇండెక్స్ నాంది పలికిందని భావిస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ఎంపిక ఎలా? ఇండెక్స్లో చేర్చే కంపెనీలను గ్రీన్, ఆరెంజ్, రెడ్ అనే మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. గ్రీన్: జంతు హింసకు దూరంగా ఉండే కంపెనీలు ఆరెంజ్: కొంత మేర ప్రభావం చూపే సంస్థలు రెడ్: ... జంతువులపై ప్రత్యక్ష ప్రభావం చూపే వ్యాపారాలు ఆరెంజ్, రెడ్ కేటగిరీల్లో ఉన్న కంపెనీలను ఈ ఇండెక్స్లో చేర్చరు. ఈ ఇండెక్స్ ఆధారంగా భవిష్యత్తులో ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్లు, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడి ఉత్పత్తులను ప్రారంభించే అవకాశముందని ఎన్ఎస్ఈ వెల్లడించింది. ప్రస్తుతం ప్రారంభించిన ఇండెక్స్ లో బ్యాంకింగ్ రంగానికి చెందిన ఒక్క కంపెనీ కూడా లేదు. అలాగే రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు కూడా స్థానం దక్కలేదు. మరోవైపు ప్రముఖ ఐటీ కంపెనీలు,ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, కొన్ని తయారీ రంగ సంస్థలు ఇండెక్స్లో చోటు సంపాదించాయి. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 238.41 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 77,470.11 వద్ద, నిఫ్టీ 50.80 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,187.70 వద్ద నిలిచాయి.ఆస్థా స్పిన్టెక్స్ లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్, కేసీపీ షుగర్ & ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, వెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్ లిమిటెడ్, విమ్తా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్, ఏకేజీ ఎగ్జిమ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు పెరిగి 24,251 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 7 పాయింట్లు పెరిగి 77,718 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.98బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.19 శాతం తగ్గింది.నాస్డాక్ 0.05 శాతం నష్టపోయింది.Today Nifty position 21-07-2026(time: 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 442.93 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 77,708.52 వద్ద, నిఫ్టీ 95.80 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టంతో 24,238.50 వద్ద నిలిచాయి.సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్, అషిమా లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్, సిక్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భన్సాలీ ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, రాజదర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగు ఐపీఓలు.. రెండు లిస్టింగ్లు!
ముంబై: దేశీ ప్రైమరీ మార్కెట్లో ఈ వారం కూడా ఐపీఓల సందడి జోరుగా కొనసాగనుంది. నేటి (జూలై 20)తో ప్రారంభమయ్యే ఈ వారంలో మెయిన్ బోర్డ్ విభాగంలో మొత్తం నాలుగు కొత్త పబ్లిక్ ఇష్యూలు ఓపెన్ కానున్నాయి. అలాగే గత వారం ముగిసిన రెండు కీలక కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిస్టింగ్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎస్బీఐ ఫండ్స్ మెగా లిస్టింగ్ గత వారం రూ. 9,813 కోట్ల భారీ ఐపీఓ ప్రక్రియ ముగిసిన తర్వాత, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ షేర్లు జూలై 21న (మంగళవారం) ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు 16 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. కాలిబర్ మైనింగ్.. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన కోల్ మైనింగ్ సర్వీసెస్ కంపెనీ ‘కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్’ రూ. 450 కోట్ల విలువైన ఐపీఓ జూలై 21న ముగియనుంది. జూలై 24న (శుక్రవారం) ఈ షేరు మార్కెట్లో లిస్ట్ కానుంది. గ్రే మార్కెట్లో షేరు ధర ఏకంగా 27 శాతం ప్రీమియంతో దూసుకుపోతుండటం విశేషం.కొత్త ఇష్యూలు.. క్యూబ్ హైవేస్ ట్రస్ట్ ఇన్విట్: ఈ పబ్లిక్ ఇష్యూ జూలై 22న ప్రారంభమై, జూలై 24న ముగియనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో రూ. 5,000 కోట్లను సేకరించనుంది. దీని ధరల శ్రేణి రూ. 151–152. ఇండో–ఎమ్ఐఎమ్: బెంగళూరుకు చెందిన ఈ ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది. లోహియా కార్ప్: కాన్పూర్కు చెందిన ఈ టెక్నికల్ టెక్స్టైల్ మెషినరీ తయారీ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది. ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్: ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఈ సంస్థ రూ.170 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో జూలై 23న మార్కెట్లోకి వస్తోంది. దీని ధరల శ్రేణి రూ.120–127గా ఉంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:52 సమయానికి నిఫ్టీ(Nifty) 165 పాయింట్లు తగ్గి 24,169 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 665 పాయింట్లు నష్టపోయి 77,489 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.72బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.01 శాతం తగ్గింది.నాస్డాక్ 1.4 శాతం నష్టపోయింది.Today Nifty position 20-07-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!. కొంచెం స్టాక్మార్కెట్ గురించి తెలిసిన వాళ్లంతా గురువులు, స్నేహితుల రూపంలో అప్పుడే ఎదురవుతారు. ‘‘ఇది మంచి కంపెనీ. ధర ఓకే. జస్ట్ కొని పక్కనపెట్టుకోండి. ఎప్పటికీ అమ్మకపోతేచాలు’’ అని సలహా ఇస్తారు. ఇదిగో... ఇన్వెస్టర్లు తప్పులో కాలేసేదిక్కడే. ఎందుకంటే ‘షేర్లు కొని మర్చిపోండి’ అనే సలహాలో నిజం సగమే. ఒక గొప్ప కంపెనీ షేరును కొన్నంత మాత్రాన అద్భుతమైన లాభాలు వస్తాయని కానీ... ఒక నాసిరకం కంపెనీ షేరును కొన్నంత మాత్రాన నష్టాలు ఖాయమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కంపెనీ– షేరు కవలలు కాదు. కేవలం సోదరులే. రెండింట్లో తేడాలుండొచ్చు. అనుకున్నట్టుగా రాణించే మంచి కంపెనీలకన్నా, అనూహ్యంగా రాణించే సాధారణ కంపెనీలే బాగా ముందుకెళతాయి. అదెలాగో సోదాహరణంగా వివరించేదే ఈ సాక్షి ‘వెల్త్’ ప్రత్యేక కథనం... ఒక షేరు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎన్నాళ్లలో ఎంత రాబడినిస్తుంది? ఇదంతా కేవలం కంపెనీ ఎంత బాగుందన్న దానిపైనే ఆధారపడదు. కంపెనీ వ్యాపారం ఏటా ఏ స్థాయిలో పెరుగుతోంది? ఆ పెరిగే వృద్ధికి మార్కెట్ ఎంత విలువ ఇస్తోంది? ఆ కంపెనీ ఎంత డివిడెండ్ చెల్లిస్తోంది? మనం కొన్న షేరును ఎంతకాలం విక్రయించకుండా ఉంచగలుగుతున్నాం? ఇవన్నీ కలిసే షేరుపై వచ్చే రాబడిని నిర్ణయిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలివీ... గొప్ప కంపెనీ... కానీ పూర్ ఇన్వెస్ట్మెంట్! పేజ్ ఇండస్ట్రీస్: 2009–2019 మధ్య దేశంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లకు అత్యంత భారీ లాభాలిచ్చిన షేరు ఇదే. ఆదాయం బీభత్సం. మార్జిన్లు అద్భుతం. పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి(ఆర్ఓసీఈ) అత్యధికం. దీంతో 2009లో రూ.300 ఉన్న షేరు ధర పదేళ్లలో ఏకంగా రూ.35వేలకు చేరింది. ఇన్వెస్టర్లు ఇక ఈ కంపెనీకి ఎదురులేదనుకున్నారు. ధర ఎంత పెరిగినా కొనటం మొదలుపెట్టారు. వేల్యుయేషన్లు పెరిగాయి. అంటే.. కంపెనీ భవిష్యత్తుకు తగ్గట్టు ముందే షేరు ధర పెరిగిపోయింది. జాకీ బ్రాండ్ దుస్తుల్ని దేశీయంగా విక్రయించే ఈ కంపెనీ వ్యాపారం 2019 తరువాత కూడా అద్భుతంగా కొనసాగింది. కానీ అప్పటికే ఆ భవిష్యత్తు మొత్తం షేరు ధరలో చేరిపోయింది. ఈ ఏడేళ్లలో షేరు ధర రూ.40 వేలకు అటూఇటుగా ఉంది. మరి 2019లోనో ఆ తరువాతో ఇన్వెస్ట్ చేసిన వారికిది పూర్ ఇన్వెస్ట్మెంటే కదా? కొటక్ మహీంద్రా బ్యాంక్దీ ఇలాంటి స్టోరీనే.దేశంలోని అతికొద్ది అద్భుతమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. మేనేజ్మెంట్, అండర్రైటింగ్, అసెట్ క్వాలిటీ అన్నింటా సూపర్. ఇన్వెస్టర్లకూ ఇష్టమే. కానీ అందరూ ఇష్టపడి కొనటం వల్ల ఈ షేరు వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. తరువాత రుణాల వృద్ధి తగ్గింది. వ్యాపారం, బుక్ వేల్యూ పెరుగుతున్నా వాల్యుయేషన్ల ప్రీమియం తగ్గటంతో షేరు ధర బాగా పడింది. ఏషియన్ పెయింట్స్దీ ఇలాంటి కథే. ఒకప్పుడు ఇది వ్యాపారానికి బెంచ్మార్క్. పోటీ సంస్థలకన్నా అన్నింటా ముందంజే. కానీ గత కొన్నేళ్లుగా షేరుపై రాబడి పెద్దగా లేదు. ఎందుకంటే వ్యాపారం బాగానే ఉన్నా అంచనాలు విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకోవటం సాధ్యం కాని స్థితిలో... షేరు ధర పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంటోంది. రాబడిలో నిలకడ లేకుంటే... షేరు ధర అంతంతే! నాట్కో ఫార్మా: అప్పుల్లే వు. ఆర్ అండ్ డీ అద్భుతం. మార్జిన్లు సూపర్. పటిష్ఠమైన మేనేజ్మెంట్. కానీ... దీర్ఘకాలలలో చూస్తే ఈ కంపెనీపై రాబడి చాలా నాసిరకం. కారణమేంటి? ఈ కంపెనీ లాభాలన్నీ బ్లాక్బస్టన్ జనరిక్ డ్రగ్స్ను ప్రవేశపెట్టడంపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. ఒక అద్భుతమైన ఉత్పత్తితో అన్నీ మారిపోతాయి. తరవాత దానికి పోటీ వస్తుంది. మార్జిన్లు పడిపోతాయి. మరో కొత్త ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ తరహా అనిశ్చితి మార్కెట్కు నచ్చదు. దివీస్ లాబొరేటరీస్: ఇది కూడా నాట్కో తరహాలో దేశీ ఫార్మా కంపెనీనే. కానీ ఈ కంపెనీ పనితీరులో నాటకీయ అనూహ్యతేదీ ఉండదు. బ్లాక్బస్టర్ డ్రగ్స్ ఉండవు. కానీ... అదే పనితీరు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మార్జిన్లు, క్యాష్ ఫ్లో, రాబడి... అన్నీ అంచనాలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఈ కంపెనీ షేరు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతూనే వస్తోంది. కొన్ని సార్లు వేచి చూడాలి... అంతే! రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ది ప్రత్యేక కథ. 2002–08 మధ్య చూస్తే... చమురు రిఫైనింగ్ బూమ్లో ఉంది. షేరు ధర రూ.20 నుంచి ఏకంగా రూ.350కి చేరి ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. కానీ అప్పటి నుంచి 2016 వరకు వ్యాపారం అద్భుతంగానే ఉన్నా షేరు ధర పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. ఆ తరువాతి ఐదేళ్లూ... అంటే 2021 వరకూ చూస్తే జియో వచ్చింది. రిటైల్ పెరిగింది. కంపెనీ విలువ మారిపోయింది. షేరు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1400 కూడా తాకింది. మరి తరువాతేంటి? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానంకోసమే మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే గడిచిన ఐదేళ్లలో షేరు ధర పెరగలేదు. జియో ఐపీవోకు వస్తే దాని విలువెంత? రిటైల్ ఐపీఓ ఎంత? గ్రీన్ ఎనర్జీ ఆదాయాలెలా ఉంటాయి? ఏఐతో వచ్చే లాభమెంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం మార్కెట్ వేచిచూస్తోంది. కంపెనీ మారలేదు. వ్యాపారం క్షీణించలేదు. కానీ మార్కెట్ కంపెనీ వృద్ధికి కొత్త ట్రిగ్గర్ కోసం ఎదురుచూసింది. అందుకే ఐదేళ్లపాటు షేరు ధర పెద్దగా కదల్లేదు. ఇదే టైమ్ కరెక్షన్.సాదాసీదా వ్యాపారం... షేరు అద్భుతం! షిప్పింగ్ కంపెనీలను చూడండి. వ్యాపార నాణ్యత అంతంతే. రాబడులు కొన్నిసార్లు మాత్రం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా సరకు రవాణా సైకిల్స్ మారుతుంటాయి కనక. దానికి తగ్గట్టే షేర్లూ పెరుగుతుంటాయి. షుగర్ కంపెనీలదీ అదే తీరు. మార్జిన్లు తక్కువ. ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ. కానీ... ఇథనాల్ నిర్ణయాలప్పుడు... చక్కెర సీజన్లోను ఈ షేర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని చాలాసార్లు రెండుమూడు రెట్ల చొప్పున పెరిగాయి. కానీ వ్యాపారమేమీ అంత నాటకీయంగా మారిపోదు. సీజన్ మారుతుంది... అంతే.షేర్ల రాబడికి గ్రోత్ ఇంజిన్లు ఇవే... పై ఉదాహరణలన్నీ చూశాక ప్రతి ఇన్వెస్టరూ గమనించాల్సినవి ఇవే. → రాబడుల్లో వృద్ధి: కంపెనీ ఆదాయం, లాభం క్రమం తప్పకుండా పెరగాలి. → ఊహించినట్టే: కంపెనీ భవిష్యత్తు రాబడులపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉండాలి. → వేల్యుయేషన్: ఎంత పీఈ దగ్గర కొంటున్నామనే విషయంతో పాటు కంపెనీ పీఈ ఏటా ఏ స్థాయిలో పెరుగుతోందో కూడా చూడాలి. అప్పుడే ధర సహేతుకమో కాదో తెలుస్తుంది. → క్యాపిటల్ కేటాయిపు: రాబడుల్లో మిగిలే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఏ మేరకు సరిపోతుందన్నది కూడా ముఖ్యమే. → టైమ్: ఇది అన్నిటికన్నా ముఖ్యం. కొన్నిసార్లు అన్నీ బాగున్నా మార్కెట్ మాత్రం ఆ కంపెనీ నుంచి మరిన్ని సంకేతాల కోసం ఎదురు చూస్తుంటుంది. ఇన్వెస్టర్లు చూడాల్సినవివే... ఒక షేరు కొనేటపుడు ‘ఇది మంచి కంపెనీయే’ అని సింపుల్గా తేల్చేసుకోకుండా... → కంపెనీ రాబడుల్లో వృద్ధి నిలకడగా ఉంటుందా? → వ్యాపార పనితీరు అనుకున్నట్టుగానే సాగుతుందా? → లాభాలను కంపెనీ తెలివిగా వాడి విస్తరణ చేయగలుగుతుందా? → కంపెనీ షేరు విలువ సహేతుకంగానే ఉందా? → ఈ కంపెనీనుంచి మార్కెట్ ఆశిస్తున్నదెంత? కంపెనీ సాధించిందెంత? → వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీ ఏ రకమైన అనూహ్య ఫలితాలు సాధిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని... ఆ తరువాత ఇన్వెస్ట్ చేస్తేనే అనుకున్న ఫలితాలొస్తాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్యం తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతారు. కానీ అది సరికాదనే అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ‘ఈ వ్యాపారం భవిష్యత్ బాగుంటుందా?’ అనే ఆలోచిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం... ‘ఈ వ్యాపారం తాలూకు భవిష్యత్తు వృద్ధి ఇప్పటికే ఈ షేరులో కనిపిస్తోందా?’ అనేది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కంపెనీని కొనరు. ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాలను కొంటారు. ఆ భవిష్యత్తుకు ఎంత ధర చెల్లిస్తున్నారన్నదే చివరికి వారి రాబడిని నిర్ణయిస్తుంది. ఆ చెల్లించే ధర మరీ ఎక్కువ అనిపిస్తే ఆ షేరుకు దూరంగానే ఉండాలి. కనీసం కొన్నాళ్లయినా!! -మంథా రమణమూర్తి -
కుప్పకూలిన పతంజలి షేర్లు.. బ్లాక్ డీల్స్ తో భారీ షాక్!
-
ఇన్వెస్టర్లూ ‘బాస్’తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
కృత్రిమ మేధస్సు (AI), డీప్ఫేక్ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని జరుగుతున్న సైబర్ మోసాలపై భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) దేశంలోని కంపెనీలు, పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా "బాస్ స్కామ్" పేరుతో పెరుగుతున్న కొత్త తరహా మోసాలపై శుక్రవారం సెబీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.సెబీ వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు AI సాయంతో కంపెనీల సీఎండీలు, సీఈఓలు లేదా ఇతర ఉన్నతాధికారుల గొంతును క్లోన్ చేయడం, డీప్ఫేక్ వీడియోలు రూపొందించడం, అలాగే ఈ-మెయిల్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా వారిలా నటించి ఫైనాన్స్ విభాగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. "అత్యవసరం", "రహస్యంగా ఉంచాలి" అంటూ వెంటనే నిధులు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చి కోట్ల రూపాయలు కాజేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయని సెబీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో మాల్వేర్ ఫైళ్లను పంపి ఉద్యోగుల పరికరాలను హ్యాక్ చేసి, వారి ఖాతాల నుంచే నకిలీ చెల్లింపు ఆదేశాలు పంపుతున్నట్లు కూడా వెల్లడించింది.ఇదే సమయంలో ఎన్ఎస్ఈ కూడా పెట్టుబడిదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ ఎన్ఎస్ఈ వెబ్సైట్లు, క్లోన్ ట్రేడింగ్ యాప్లు, సోషల్ మీడియా పెట్టుబడి గ్రూపులు, తప్పుడు స్టాక్ సిఫార్సుల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్లు, యాప్ల ద్వారానే ట్రేడింగ్ సేవలను ఉపయోగించాలని, అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయొద్దని, OTPలు లేదా లాగిన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 964.59 పాయింట్లు లేదా 1.25 శాతం లాభంతో 24,346.15 వద్ద, నిఫ్టీ 273.40 పాయింట్లు లేదా 1.14 శాతం లాభంతో 24,346.15 వద్ద నిలిచాయి.రిలాక్సో ఫుట్వేర్స్ లిమిటెడ్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, పార్ డ్రగ్స్ & కెమికల్స్ లిమిటెడ్, వర్చుసో ఆప్టోఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రిండ్వెల్ నార్టన్ లిమిటెడ్, నవ్కర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏఏఏ టెక్నాలజీస్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్టి లిమిటెడ్, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 128 పాయింట్లు పెరిగి 24,202 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 488 పాయింట్లు ఎగబాకి 77,667 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.77బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.51 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.47 శాతం దిగజారింది.Today Nifty position 17-07-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 1.44 శాతం లేదా 0.0019 పాయింట్ల లాభంతో 77,186.87 వద్ద, నిఫ్టీ 5.75 శాతం లేదా 0.024 పాయింట్ల నష్టంతో 24,072.75 వద్ద నిలిచాయి.లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, గ్రిండ్వెల్ నార్టన్ లిమిటెడ్, శ్రీమతి బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్, సౌరాష్ట్ర సిమెంట్స్ లిమిటెడ్, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, జేఎన్కే ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్మార్కెట్ ట్రేడింగ్ జోష్.. బ్రోకరేజీ కంపెనీలకు కాసుల వర్షం!
ఫిన్టెక్, స్టాక్ బ్రోకరేజీ సంస్థ ‘ఏంజెల్ వన్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) ఆకర్షణీయమైన పనితీరు కనబరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల చురుకైన పార్టిసిపేషన్, భారీ ట్రేడింగ్ వాల్యూమ్స్ కారణంగా జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండింతలకు పైగా ఎగసి రూ.231 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (క్యూ1) కంపెనీ నికర లాభం రూ.114.5 కోట్లుగా నమోదైంది. అయితే, మునుపటి త్రైమాసికంతో (ఎఫ్వై26, క్యూ4) పోలిస్తే మాత్రం నికర లాభం 28 శాతం తగ్గి రూ.320 కోట్ల నుంచి రూ.231 కోట్లకు పరిమితమైంది.సమీక్షా త్రైమాసికంలో, కంపెనీ మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగి రూ.1,143 కోట్ల నుంచి రూ.1,434 కోట్లకు చేరినట్లు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. ఉద్యోగుల ఖర్చులు, ఫైనాన్స్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఇదే క్యూ1లో మొత్తం వ్యయాలు రూ.979 కోట్ల నుంచి రూ.1,109 కోట్లకు చేరాయి. కాగా, కంపెనీ బోర్డు డైరెక్టర్లు తమ షేర్ హోల్డర్లకు ప్రతి ఈక్విటీ షేరుపై రూ. 1 తొలి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించారు.పెరిగిన ఆర్డర్లు, ఏయూఎం ప్రస్తుత త్రైమాసికంలో మొత్తం ట్రేడింగ్ ఆర్డర్లు 18.4% పెరిగి 40.6 కోట్లకు చేరాయి. కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ విభాగం నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) జూన్ చివరి నాటికి ఏకంగా 81.4 శాతం ఎగసి రూ.620 కోట్లకు చేరుకుంది. మొత్తం క్లయింట్ల బేస్ వార్షిక ప్రాతిపదికన దాదాపు 19 శాతం వృద్ధితో 3.86 కోట్లకు చేరింది.‘గ్రో’ నికర లాభం 94 శాతం వృద్ధిన్యూఢిల్లీ: డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ‘గ్రో’ మాతృ సంస్థ ‘బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) లో అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. జూన్ 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 94 శాతం ఎగసి రూ.735 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ1లో కంపెనీ రూ.378 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ద్వారా ఆదాయం 66 శాతం వృద్ధితో రూ.904 కోట్ల నుంచి రూ.1,501 కోట్లకు చేరినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.445 కోట్ల నుంచి రూ.556 కోట్లకు పెరిగాయి.గత త్రైమాసికంతో పోలిస్తే... గత త్రైమాసికం (జనవరి–మార్చి) తో పోల్చితే కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.1,505 కోట్ల నుండి రూ.1,501 కోట్లతో దాదాపు స్థిరంగానే కొనసాగింది. అయితే, నికర లాభం మాత్రం జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.686.36 కోట్లతో పోలిస్తే ప్రస్తుత క్యూ1లో మెరుగైన వృద్ధిని నమోదు చేయడం విశేషం. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 63 పాయింట్లు పెరిగి 24,141 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 245 పాయింట్లు ఎగబాకి 77,426 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.53బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరిగింది.నాస్డాక్ 0.62 శాతం పుంజుకుంది.Today Nifty position 16-07-2026(time: 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్: బ్యాంక్ షేర్ల మెరుపులు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 హై నోట్ తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 130.49 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 77,185.43 వద్ద ముగిసింది, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 26.45 పాయింట్లు మరియు 0.11 శాతం పెరిగి 24,074.85 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 దాదాపు 0.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.7 శాతం పెరిగాయి.సెన్సెక్స్ స్టాక్స్ లో 18 లాభాలను అందుకోగా 12 స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. అల్ట్రాటెక్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో ఎటర్నల్, ఎస్బీఐ ఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ టాప్ లూజర్ గా నిలిచింది. టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ కూడా టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.రంగాల వారీగా నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 1 శాతం లాభపడగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1 శాతానికి పైగా క్షీణించింది. ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ సూచీలు తమ నష్టాల పరంపరను పొడిగించగా, ఫార్మా వరుసగా రెండవ సెషన్ లో గరిష్టంగా ముగిసింది. రెండు రోజుల నష్టాల తర్వాత చమురు & గ్యాస్ కోలుకున్నాయి. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు పెరిగి 24,201 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 533 పాయింట్లు ఎగబాకి 77,602 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.78బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 85 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరిగింది.నాస్డాక్ 0.9 శాతం పుంజుకుంది.Today Nifty position 15-07-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 561.46 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో 77,054.94 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టంతో 24,052.05 వద్ద నిలిచాయి.శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, బాల్ ఫార్మా లిమిటెడ్, నూరేకా లిమిటెడ్, వ్రాజ్ ఐరన్ & స్టీల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ఎస్సార్ షిప్పింగ్ లిమిటెడ్, పీపీఏపీ ఆటోమోటివ్ లిమిటెడ్, బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
250 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 64 పాయింట్లు తగ్గి 24,142 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 256 పాయింట్లు నష్టపోయి 77,359 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.2బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.79 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.55 శాతం దిగజారింది.Today Nifty position 14-07-2026(time: 9:25 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 47.01 పాయింట్లు లేదా 0.061 శాతం లాభంతో 77,616.40 వద్ద, నిఫ్టీ 4.10 పాయింట్లు లేదా 0.017 శాతం లాభంతో 24,211.00 వద్ద నిలిచాయి.తైన్వాలా కెమికల్స్ & ప్లాస్టిక్స్ (ఇండియా) లిమిటెడ్, బీఎఫ్ యూటిలిటీస్ లిమిటెడ్, బోరోసిల్ లిమిటెడ్, జీఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, సంగమ్ (ఇండియా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, యూనికెమ్ లాబొరేటరీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్, ఎస్జీ మార్ట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
SBI Jackpot! 15 పైసల షేర్ ఇప్పుడు 7,366 కోట్లు !
-
రెడ్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ(Nifty) 187 పాయింట్లు తగ్గి 24,010 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 672 పాయింట్లు నష్టపోయి 76,898 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.14బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 79.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.58 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.42 శాతం లాభపడింది.నాస్డాక్ 0.29 శాతం పెరిగింది.Today Nifty position 13-07-2026(time: 9:16 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్లో ఈరోజు ఏం జరుగుతుందంటే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పశ్చిమాసియాను మరోసారి అగ్నిగుండంగా మార్చాయి. అమెరికా వైమానిక దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఊహించని రీతిలో విరుచుకుపడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్లలోని అమెరికా సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆదివారం సెలవు కావడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లు నేరుగా స్పందించనప్పటికీ వారంతపు ఆఖరి సెషన్లో సాధించిన రికార్డు గరిష్టాల నుంచి నేడు ఆసియా మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ ఒడిదొడుకులను ఎదుర్కొనే ప్రమాదముందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.భగ్గుమన్న బ్రెంట్ క్రూడాయిల్ రేట్లుపశ్చిమాసియాలో ఏ చిన్న అలజడి రేగినా దాని ప్రత్యక్ష ప్రభావం చమురు ధరలపై పడుతుంది. ఇరాన్ దాడులు జరిగిన ప్రాంతాలు ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మార్గానికి సమీపంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గత శుక్రవారం (జులై 10) నాటికి బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు సుమారు 75-76 డాలర్ల వద్ద నిలకడగా ఉంటే ప్రస్తుతం అది 79.2 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి పెద్ద దిగుమతి దేశానికి కరెంట్ అకౌంట్ లోటు పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుంది. ఇది భారత మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే మొదటి అంశం.గ్లోబల్ మార్కెట్ల రియాక్షన్అంతర్జాతీయ మార్కెట్లు గత వారం అమెరికా టెక్ స్టాక్స్ ర్యాలీతో రికార్డు స్థాయిల్లో ముగిశాయి. అయితే, ఈ తాజా పరిణామం ఇన్వెస్టర్లను రక్షణ ధోరణి వైపు నెట్టనుంది. నేడు ఉదయం ప్రారంభమయ్యే నికాయ్, హాంగ్ సెంగ్, గిఫ్ట్ నిఫ్టీ సూచీలు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రతికూలతతో కదలాడుతున్నాయి. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వంటి సాధనాలవైపు మళ్లే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం త్వరగా ముగిసిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లాంటి సంస్థలు గతంలో భావించినప్పటికీ ఇరాన్ నేరుగా ఐదు దేశాలపై దాడులకు దిగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇన్వెస్టర్లు నేడు మార్కెట్ ప్రారంభంలోనే కంగారుపడి విక్రయాలు చేయకుండా కొద్దిసేపు మార్కెట్ కదలికలను గమనించడం ఉత్తమం. ముఖ్యంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నందున అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, నేడు జులై 13, 2026 సోమవారం నాటి ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
రూ.10 వేల కోట్ల సందడి!
ప్రైమరీ మార్కెట్లో ఈ వారం రూ.10 వేల కోట్లకు పైగా విలువైన మూడు ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. మెయిన్బోర్డు విభాగంలో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, ఆల్పైన్ టెక్స్వరల్డ్లు, ఎస్ఎంఈ విభాగంలో మిల్వర్క్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానున్నాయి. అలాగే ఇదే వారంలో మూడు ఐపీఓలు ముగియనున్నాయి. నాలుగు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్టింగ్కు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాలు ఈ వారం జోరందుకోనున్నాయి.ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ ఈ వారంలో ప్రధాన ఆకర్షణ ‘ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్’ ఐపీఓ కానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఫ్రాన్స్కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ అముండి సంయుక్తంగా ప్రమోట్ చేసిన ఈ కంపెనీ రూ.9,812.91 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూను తీసుకొస్తోంది. షేరు ధరను రూ.545–574గా నిర్ణయించారు. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండటంతో సమీకరించే నిధులు కంపెనీకి కాకుండా, షేర్లు విక్రయించే వాటాదారులకే దక్కనున్నాయి. ఆల్పైన్ టెక్స్వరల్డ్ గుజరాత్కు చెందిన టెక్స్టైల్ కంపెనీ ఆల్పైన్ టెక్స్వరల్డ్ మెయిన్బోర్డు విభాగంలో రెండో ఐపీఓగా రానుంది. రూ.126.25 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనుంది. షేరు ధరను రూ.100–105గా నిర్ణయించారు. సమీకరించిన నిధులను కొత్త వీవింగ్ యూనిట్ ఏర్పాటు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మిల్వర్క్స్ టెక్నాలజీస్ ఎస్ఎంఈ విభాగంలో మిల్వర్క్స్ టెక్నాలజీస్ ఒక్కటే పబ్లిక్ ఇష్యూను తీసుకొస్తోంది. రూ.160.30 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనుంది. షేరు ధరను రూ.315–331గా నిర్ణయించారు. సమీకరించే నిధులను ప్లాంట్ ఏర్పాటు, యంత్రాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.4 లిస్టింగులు ఈ వారంలో (బుధవారం) జూలై 15న కుసుమ్గర్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కానున్నాయి. మరుసటి రోజు గురువారం లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా, డెవ్సన్ క్యాటలిస్ట్, హ్యాపీ స్టీల్స్ షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుంది. గ్రే మార్కెట్లో ఈ నాలుగు కంపెనీల షేర్లు రెండంకెల ప్రీమియంతో ట్రేడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
5 వేలకు ఏకంగా 5.50 లక్షలొచ్చాయ్.. మ్యాజిక్ చేసిన STOCK
-
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 702.06 పాయింట్లు లేదా 0.91శాతం లాభంతో 77,443.88 వద్ద, నిఫ్టీ 196.30 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,159.10 వద్ద నిలిచాయి.కొథారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ముతూత్ మైక్రోఫిన్ లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డీ-లింక్ (ఇండియా) లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నీలమలై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, బోధి ట్రీ మల్టీమీడియా లిమిటెడ్, లోధా డెవలపర్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
NSE IPOకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ LISTING ఎప్పుడంటే?
-
ఇన్వెస్టర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 238.22 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 76,741.82 వద్ద, నిఫ్టీ 80.75 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,962.80 వద్ద నిలిచాయి.పాల్ మర్చంట్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్, శంకర బిల్డ్ప్రో లిమిటెడ్, పాల్ మర్చంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, లిబాస్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, డీబీ (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లక్షకు 45 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల పంట పండించిన స్టాక్
-
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:18 సమయానికి నిఫ్టీ(Nifty) 162 పాయింట్లు పెరిగి 24,042 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 546 పాయింట్లు ఎగబాకి 77,050 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.2 శాతం పెరిగింది.Today Nifty position 09-07-2026(time: 10:18 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:22 సమయానికి నిఫ్టీ(Nifty) 159 పాయింట్లు తగ్గి 24,241 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 507 పాయింట్లు దిగజారి 77,671 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.45 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.16 శాతం దిగజారింది.Today Nifty position 08-07-2026(time: 10:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 104.35 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 78,180.72 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 24,398.70 వద్ద నిలిచాయి.షేర్ ఇండియా సెక్యూరిటీస్ లిమిటెడ్, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, డీబీ (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్, కొథారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్, మెరైన్ ఎలక్ట్రికల్స్ (ఇండియా) లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,445 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 29 పాయింట్లు పెరిగి 78,329 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.86బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.12 శాతం పుంజుకుంది.Today Nifty position 07-07-2026(time: 09:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ మెగా ఐపీఓ ఎప్పుడంటే..
ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మెగా పబ్లిక్ ఇష్యూకి ముహూర్తం ఖరారైంది. దాదాపు రూ.30,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా రానున్న ఈ ఐపీఓ ఈ ఏడాది సెప్టెంబర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.ఈ ఇష్యూ ద్వారా ఎన్ఎస్ఈ మొత్తం మార్కెట్ విలువ రూ. 5 లక్షల కోట్లు దాటవచ్చని అంచనా. ఐపీఓ విజయవంతమైతే.. 2024 అక్టోబర్లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల పబ్లిక్ ఇష్యూ రికార్డును అధిగమిస్తుంది. తద్వారా భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా అవతరిస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలోనే ఉంటుంది. -
నేటి మార్కెట్లో బుల్ రన్.. కారణాలివేనా?
భారత స్టాక్ మార్కెట్లో ఈరోజు (జులై 06, 2026) ర్యాలీ చోటుచేసుకుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి తోడు అంతర్జాతీయ సానుకూల సంకేతాలు తోడవడంతో మార్కెట్లు దూసుకుపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 24,430 వద్దకు, సెన్సెక్స్ 521 పాయింట్లు పెరిగి 78,285 వద్దకు చేరడం మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ను స్పష్టం చేస్తోంది.ర్యాలీకి దారితీసిన ప్రధాన కారణాలుమధ్యప్రాచ్యంలో సడలిన ఉద్రిక్తతలు: గత వారం ఇరాన్ వేదికగా చోటుచేసుకున్న పరిణామాల తర్వాత భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. యూఎస్-ఇరాన్ చర్చలలో పురోగతి, యుద్ధ మేఘాలు తొలగిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచింది.యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలు: అమెరికాలో ఇటీవల విడుదలైన ఉపాధి గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా నమోదు కావడంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపుతుందనే ఆశలు పెరిగాయి. ఇది అంతర్జాతీయంగా రిస్క్ అసెట్స్ అయిన ఈక్విటీ మార్కెట్లలోకి నిధులు వచ్చేలా చేసింది.ఆసియా, ఐరోపా మార్కెట్ల మద్దతు: యూరోజోన్లో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గడం, ఆసియా మార్కెట్లలో (హాంకాంగ్, షాంఘై) ఐటీ, టెక్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం భారత మార్కెట్లకు సానుకూలంగా మారింది.చమురు ధరల పతనంఇరాన్ సంక్షోభం సడలడం, ఒప్పందం ప్రకారం ఓపెక్ ప్లస్ దేశాలు చమురు సరఫరాను పెంచేందుకు అంగీకరించడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 71.50 డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడం వల్ల భారత్ దిగుమతి బిల్లు భారం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి, కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పెరగడానికి (ముఖ్యంగా ఆటోమొబైల్, పెయింట్స్, ఏవియేషన్ రంగాలకు) ఎంతగానో దోహదపడుతుంది.సంస్థాగత పెట్టుబడులువిదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మళ్లీ భారత మార్కెట్ల వైపు మళ్లారు. గత శుక్రవారం దాదాపు రూ.1,355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా ఈరోజు కూడా కొనుగోళ్ల జోరు కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్కు బలాన్నిస్తున్నారు. జూన్ త్రైమాసిక కార్పొరేట్ ఆదాయాల సీజన్ ప్రారంభం కానుండటంతో కంపెనీల బిజినెస్ అప్డేట్స్ సానుకూలంగా వస్తున్నాయి.రూపాయి స్థిరత్వండాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ కొంత బలహీనపడటం, చమురు ధరలు దిగిరావడంతో రూపాయిపై ఒత్తిడి తగ్గింది. రూపాయి బలోపేతం కావడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు భారత ఈక్విటీలపై నమ్మకం పెరిగి మరింత పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఇదీ చదవండి: కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి! -
వేదాంతా పవర్ జాక్ పాట్! ఇన్వెస్టర్లకు భారీ లాభాలు!
-
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 297.73 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 78,061.64 వద్ద, నిఫ్టీ 73.25 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 24,344.10 వద్ద ఉన్నాయి.సవితా ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్, డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్ లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఏఆర్టీ నిర్మాణ్ లిమిటెడ్, సుప్రియా లైఫ్సైన్స్ లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్, బరాక్ వ్యాలీ సిమెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్యూ1 ఫలితాలు, క్రూడ్ ధరలు కీలకం
దేశీయ కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా రుతుపవనాల కదలికలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. అంతర్జాతీయంగా అమెరికా–ఇరాన్ల మధ్య జరుగుతున్న దౌత్య చర్చల పరిణామాలు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ సమావేశ వివరాలను (ఫెడ్ మినిట్స్) మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. 9 నుంచి కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాల సీజన్ షురూ..! దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ జూలై 9 (గురువారం)న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఫలితాలను ప్రకటించి, దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్కు తెరతీయనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ యాజమాన్యం ఇచ్చే అవుట్లుక్ వ్యాఖ్యలపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో డిమాండ్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? టెక్నాలజీ రంగంలో కంపెనీలు చేసే వ్యయాలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యాపార అవకాశాల వేగం ఏ మేరకు ఉంటుంది? అనే విషయాలపై సంకేతాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.‘‘తొలి దశలో విడుదలయ్యే కార్పొరేట్ ఫలితాలు, కంపెనీల మేనేజ్మెంట్ వ్యాఖ్యలు మార్కెట్లో డిమాండ్ పరిస్థితులు, మార్జిన్ల స్థితిగతులు, భవిష్యత్తులో ఆదాయ అంచనాలపై కీలకమైన స్పష్టతను ఇస్తాయి. ఇవే రాబోయే వారాల్లో మార్కెట్ దిశను నిర్దేశిస్తాయి’’ అని స్వాస్తిక ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక విశ్లేషకుడు పర్వేష్ గౌర్ తెలిపారు. అమెరికా–ఇరాన్ల దౌత్య చర్చల ప్రభావం ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే పశ్చిమాసియా నుంచి ‘వార్తలు లేకపోవడమే శుభవార్త’ అనే పంథా కొనసాగుతోంది. శాంతి ప్రయత్నాలు ప్రస్తుతానికి బాగానే సాగుతున్నాయి, ఎక్కడా ఉద్రిక్తతలు పెరిగినట్లు నివేదికలు రాలేదు. గత వారం ప్రారంభంలో దోహాలో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చల తర్వాత ఈ సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలను ఇరాన్ ప్రస్తుతం నిర్వహిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చల్లో తమ షరతులకు దాదాపు అన్నింటికీ ఇరాన్ అంగీకరించిందని పేర్కొన్నారు. క్రూడాయిల్ ధరలపై కన్ను అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 72 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా–ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం తర్వాత క్రూడాయిల్ ఎగుమతులు మరింత పెరిగాయి. ఆసియా మార్కెట్లలో అమ్మకాలను మరింత వేగవంతం చేసేందుకు ‘సౌదీ అరామ్కో’ స్పాట్ ప్రైసింగ్ (తక్షణ ధరల విధానం) వైపు మొగ్గు చూపుతోందని రాయిటర్స్ నివేదించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు అదుపులో ఉండటం భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు భారీ ఉపశమనంగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ మినిట్స్పై దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూన్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) జూలై 9న (గురువారం) విడుదల కానున్నాయి. ఇటీవల విడుదలైన యూఎస్ ఆర్థిక గణాంకాలు బలహీనపడటంతో, భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడ్ కొంత ‘సరళతర వైఖరి విధానాన్ని అవలంబించవచ్చు’ అనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో వడ్డీరేట్లు, ఆర్థిక దృక్పథంపై పాలసీ నిర్ణేతల అంచనాలను తెలుసుకోవడం కోసం ఇన్వెస్టర్లు ఈ జూన్ పాలసీ సమావేశ మినిట్స్ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.సాంకేతిక అంశాలు ‘‘నిఫ్టీ ఇండెక్సు డైలీ చార్ట్లో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ను నమోదు చేసింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతోందనేందుకు స్పష్టమైన సంకేతం’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ తెలిపారు. ‘‘ఇప్పటికీ నిఫ్టీ కీలకమైన 50–రోజుల ఈఎంఏ స్థాయి కంటే పైనే కొనసాగుతోంది. ఇది స్వల్పకాలిక సానుకూల ధోరణిని మరింత బలోపేతం చేస్తోంది. సాంకేతిక అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో నిఫ్టీ 24,500 స్థాయిని ఛేదించి, అంతకు మించిన పైస్థాయిలకు దూసుకెళ్లేందుకు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ నష్టపోయినా.. దిగువ స్థాయిలో నిఫ్టీకి 24,200 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. ఆ తర్వాత 24,000 వద్ద బలమైన సపోర్ట్ జోన్ ఉంది’’ అని రూపక్ విశ్లేíÙంచారు. గతవారమిలా... అమెరికాలో ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో, వడ్డీ రేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ చైర్మన్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో గతవారం (జూన్ 30 నుంచి జూలై 3 మధ్య) దేశీయ స్టాక్ మార్కెట్ లాభపడింది. గతవారంలో సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 215 పాయింట్ల చొప్పున పెరిగాయి. -
డీమార్ట్ స్టాక్ భారీ పతనం.. ఒక్క అప్డేట్ తో వేల కోట్లు ఆవిరి
-
మోడీ వల్లే బంగారం రేట్లు పడిపోతున్నాయా ?
-
‘డబ్బా ట్రేడింగ్’పై వార్నింగ్.. పోలీసులకు ఫిర్యాదు
దేశీయ స్టాక్ మార్కెట్లో అక్రమ ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) కీలక హెచ్చరిక జారీ చేసింది. లెజెండ్రీ ట్రేడర్స్ (Legendry Traders), లెట్స్ ట్రేడ్ ఇండియా (Let's Trade India) పేర్లతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న రెండు సంస్థలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎన్ఎస్ఈ తెలిపింది.ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం, లెజెండ్రీ ట్రేడర్స్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా స్టాక్ మార్కెట్ చిట్కాలు అందించడంతో పాటు, ఇన్వెస్టర్ల ట్రేడింగ్ ఖాతాలను నిర్వహించే సేవలను కూడా అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లెట్స్ ట్రేడ్ ఇండియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెళ్లు, అనుబంధ వెబ్సైట్లు, 9773687281 మొబైల్ నంబర్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది.గ్యారెంటీ లాభాలంటే నమ్మొద్దుస్టాక్ మార్కెట్లో హామీ లేదా నిర్ధారిత రాబడులు ఇస్తామని ప్రచారం చేసే ఏ వ్యక్తి లేదా సంస్థను నమ్మవద్దని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇటువంటి పథకాలు చట్టవిరుద్ధమని, వాటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి ట్రేడింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది.రిజిస్టర్డ్ బ్రోకర్లేనా? ముందుగా చెక్ చేసుకోండిఈ రెండు సంస్థలు ఎన్ఎస్ఈలో నమోదైన స్టాక్ బ్రోకర్లు గానీ, అధీకృత ప్రతినిధులు గానీ కాదని ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. కాబట్టి ఏ బ్రోకర్ లేదా సంస్థతోనైనా లావాదేవీలు చేపట్టే ముందు ఎన్ఎస్ఈ వెబ్సైట్లోని "Know/Locate Your Stock Broker" సదుపాయం ద్వారా వారి నమోదు వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించేకోవాలని ఇన్వెస్టర్లకు సూచించింది.ఏమిటీ 'డబ్బా ట్రేడింగ్'?'డబ్బా ట్రేడింగ్' అనేది సెబీ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెలుపల జరిగే చట్టవిరుద్ధ, అనియంత్రిత ట్రేడింగ్ విధానం. ఇందులో కొనుగోలు, అమ్మకాల ఒప్పందాలు అధికారిక ఎక్స్ఛేంజీలపై అమలు కాకుండా, డబ్బా ఆపరేటర్లు తమ అంతర్గత వ్యవస్థల్లోనే సెటిల్ చేస్తారు. దీంతో ఈ ట్రేడ్లు సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీల పర్యవేక్షణకు దూరంగా ఉంటాయి.ఇలాంటి ట్రేడింగ్లో పెట్టుబడిదారులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండదు. అధికారిక ఎక్స్ఛేంజీల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా వినియోగించుకోలేరు. అందువల్ల డబ్బా ట్రేడింగ్కు దూరంగా ఉండాలని ఎన్ఎస్ఈ మరోసారి స్పష్టం చేసింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 261.79 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 77,763.91 వద్ద, నిఫ్టీ 95.15 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,270.85 వద్ద నిలిచాయి.డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఏషియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్, సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్, సోలార్వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, టీడీ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
560 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:41 సమయానికి నిఫ్టీ(Nifty) 186 పాయింట్లు ఎగబాకి 24,362 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 563 పాయింట్లు పెరిగి 78,062 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.78బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.02 శాతం తగ్గింది.నాస్డాక్ 0.8 శాతం నష్టపోయింది.Today Nifty position 03-07-2026(time: 09:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. ఐటీ షేర్లకు మంచిరోజు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. యూఎస్, ఇరాన్ వాణిజ్య చర్చల సానుకూల సంకేతాలపై చమురు ధరలు తగ్గడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు గణనీయంగా ఎగిశాయి. నిఫ్టీ 0.71 శాతం 169.85 పాయింట్ల లాభంతో 24,175.70 వద్ద, సెన్సెక్స్ 0.75 శాతం లేదా 579.48 పాయింట్లు పెరిగి 77,502.12 వద్ద ముగిశాయి.ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ వరుసగా 0.48 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.25 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ సెక్టోరల్ సూచీలను అధిగమించింది. 2025 మే తర్వాత ఉత్తమ ఇంట్రాడే లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ రియాల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 97 పాయింట్లు ఎగబాకి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 292 పాయింట్లు పెరిగి 77,216 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.38బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.22 శాతం తగ్గింది.నాస్డాక్ 0.66 శాతం నష్టపోయింది.Today Nifty position 02-07-2026(time: 09:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్: ఎవరికి లాభాలు.. ఎవరికి నష్టాలు?
ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం వంటి కారణాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండు సెషన్ల నష్టాల తర్వాత బుధవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 443.97 పాయింట్లు (0.58%) పెరిగి 76,922.64 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 631 పాయింట్లకుపైగా పెరిగి 77,110.08 గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.10 పాయింట్లు (0.59%) లాభంతో 24,005.85 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, రియల్టీ రంగాలు సూచీల ర్యాలీకి ప్రధాన మద్దతు ఇచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల్లో ఈరోజు టాప్ గెయినర్లు ఏవి, టాప్ లూజర్లు ఏవి.. ఈ కింద చూద్దాం..సెన్సెక్స్ టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%అల్ట్రాటెక్ సిమెంట్11,456+203.00+1.81%యాక్సిస్ బ్యాంక్1,369+23.00+1.71%సెన్సెక్స్ టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ బ్యాంక్796.15-1.81-0.23%టైటాన్4,399-5.40-0.13%నిఫ్టీ 50 టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%అదానీ ఎంటర్ప్రైజెస్3,144+108.00+3.55%నెస్లే ఇండియా1,454+48.60+3.46%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%నిఫ్టీ 50 టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%హిందాల్కో939.70-16.90-1.77%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%డాక్టర్ రెడ్డీస్1,340-17.20-1.27%టాటా మోటార్స్347.80-4.40-1.25%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ లైఫ్569.95-5.90-1.03%మొత్తంగా, గ్లోబల్ సెంటిమెంట్ మెరుగుపడటం, చమురు ధరలు తగ్గడం మార్కెట్కు బలాన్నిచ్చాయి. అయితే ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడం వల్ల కొన్ని భారీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. -
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:18 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు పెరిగి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 పాయింట్లు పుంజుకొని 76,643 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 2.07 శాతం పుంజుకుంది.Today Nifty position 01-07-2026(time: 09:18 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. జూలైలో 8 రోజుల సెలవు!
జూలై నెలలో మొత్తం 8 రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇవి సాధారణ వారాంతపు సెలవులు మాత్రమే. ఇందులో 4 శనివారాలు, 4 ఆదివారాలు ఉన్నాయి. తేదీల ప్రకారం చూస్తే జూలై 4, 11, 18, 25 శనివారాలు కాగా, జూలై 5, 12, 19, 26 ఆదివారాలు మార్కెట్ సెలవులు అవుతాయి.సాధారణ వారాంతపు సెలవుల కారణంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ క్లోజ్ అవుతాయి. కాబట్టి జూలై 2026లో తమ ట్రేడింగ్ షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంటున్న పెట్టుబడిదారులు ఈ నెలలో వారపు రోజులలో స్టాక్ మార్కెట్ సెలవులు లేవని గమనించాలి. ఎందుకంటే.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) రెండూ అన్ని ట్రేడింగ్ రోజులలో యధావిధిగా పనిచేస్తాయి.ఎన్ఎస్ఈ క్యాలెండర్ ప్రకారం.. 2026లో తదుపరి వర్కింగ్ డే సెలవు సెప్టెంబర్ 14న వస్తుంది. ఆ రోజు గణేష్ చతుర్థి కారణంగా మార్కెట్ క్లోజ్.2026 సంవత్సరంలో మొత్తం 16 వర్కింగ్ డే సెలవులు షేర్ మార్కెట్కు ఉన్నాయి. రాబోయే నెలల్లో వివిధ జాతీయ, మతపరమైన పండుగల కారణంగా ట్రేడింగ్ ఉండదు. అవి..అక్టోబర్ 2: గాంధీ జయంతిఅక్టోబర్ 20: దసరానవంబర్ 10: దీపావళినవంబర్ 24: శ్రీ గురు నానక్ జయంతిడిసెంబర్ 25: క్రిస్మస్కొన్ని ముఖ్యమైన పండుగలు వారాంతాల్లో రావడంతో అదనపు సెలవులు ఉండవు. ఉదాహరణకు, ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) శనివారం కావడం వల్ల అదనపు ట్రేడింగ్ సెలవుగా ఉండదు. అలాగే దీపావళి లక్ష్మీ పూజ కూడా ఆదివారం రావడం వల్ల సాధారణ సెలవు ఉండదు. అయితే ఆ రోజున ప్రత్యేకంగా ముహూర్త ట్రేడింగ్ సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 249.70 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 76,478.67 వద్ద, నిఫ్టీ 80.50 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 23,865.75 వద్ద నిలిచాయి.ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, దివ్గి టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ లిమిటెడ్, దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్, బిల్కేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహాలక్ష్మి ఫ్యాబ్రిక్ మిల్స్ లిమిటెడ్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, AION-TECH సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు నష్టపోయి 23,865 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 239 పాయింట్లు తగ్గి 76,498 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 2.07 శాతం పుంజుకుంది.Today Nifty position 30-06-2026(time: 09:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 372.10 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 76,728.37 వద్ద, నిఫ్టీ 109.75 శాతం లేదా 0.46 శాతం నష్టంతో 23,946.25 వద్ద నిలిచాయి.ప్రకాష్ పైప్స్ లిమిటెడ్, బజాజ్ హెల్త్కేర్ లిమిటెడ్, మాక్పవర్ సిఎన్సి మెషీన్స్ లిమిటెడ్, సినీవిస్టా లిమిటెడ్, బోరోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, టార్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్, క్రెబ్స్ బయోకెమికల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, అటల్ రియల్టెక్ లిమిటెడ్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు ఎగబాకి 24,067 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.34బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం తగ్గింది.నాస్డాక్ 0.24 శాతం నష్టపోయింది.Today Nifty position 29-06-2026(time: 09:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
డబ్బులు రెడీ చేసుకోండి అద్విత్ జువెలర్స్ ఐపీఓకు భారీ డిమాండ్
-
స్టాక్ మార్కెట్: ట్రేడింగ్ బంద్
మొహర్రం సందర్భంగా శుక్రవారం (జూన్ 26) దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)ల్లో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) తదితర అన్ని ప్రధాన విభాగాల్లో లావాదేవీలు జరగవు. దీంతో దలాల్ స్ట్రీట్కు వరుసగా మూడు రోజుల విరామం లభించింది. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో రెగ్యులర్ ట్రేడింగ్ మళ్లీ జూన్ 29 (సోమవారం) ప్రారంభం కానుంది.కరెన్సీ, డెట్ మార్కెట్లలో కూడా శుక్రవారం ఎలాంటి ట్రేడింగ్ ఉండదు. జూన్ నెలలో ఇదే ఏకైక అధికారిక ట్రేడింగ్ సెలవు కాగా, అంతకుముందు మే 28న బక్రీద్ సందర్భంగా మార్కెట్లు మూతపడ్డాయి. జూలై, ఆగస్టు నెలల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెలవులు లేకపోగా, తదుపరి మార్కెట్ సెలవు సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా ఉంటుంది.అయితే కమోడిటీ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఉదయం సెషన్ (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ట్రేడింగ్ ఉండదు. అయితే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30/11:55 గంటల వరకు ఈవెనింగ్ సెషన్లో ట్రేడింగ్ కొనసాగుతుంది. మరోవైపు NCDEXలో మాత్రం రోజంతా ట్రేడింగ్ అందుబాటులో ఉండదు. -
రూ.10 షేర్.. రూ. 5,800 కోట్ల రిటర్న్స్.. JIOలో మహేంద్ర నహతా సంచలనం
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 109.25 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 77,100.47 వద్ద, నిఫ్టీ 34.35 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,056.00 వద్ద నిలిచాయి.గుజరాత్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్ లిమిటెడ్, సాక్సాఫ్ట్ లిమిటెడ్, రిలాక్సో ఫుట్వేర్స్ లిమిటెడ్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ వద్ద.. టీసీఐ ఎక్స్ప్రెస్ లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, సవితా ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ షేర్లే టాప్ గెయినర్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:51 సమయానికి నిఫ్టీ(Nifty) 0.63 శాతం లేదా 151.70 పాయింట్లు పెరిగి 24,173.35 వద్ద, సెన్సెక్స్(Sensex) 521.17 పాయింట్లు లేదా 0.68 శాతం పెరిగి 77,512.39 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 సూచీలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వరుసగా 0.56 శాతం, 0.36 శాతం పెరిగాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ మంచి పనితీరు చూపిస్తుండగా నిఫ్టీ మెటల్, మీడియా తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్: అవే షేర్లు నిలబెట్టాయ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, రియల్టీ, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 197.55 పాయింట్ల లాభంతో 24,021.65 వద్ద, సెన్సెక్స్ 1.04 శాతం లేదా 790.54 పాయింట్లు పెరిగి 76,991.22 వద్ద స్థిరపడ్డాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ట్రెంట్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.39 శాతం పెరిగాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ 2 శాతానికి పైగా లాభంతో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. మరొవైపు నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ ఆధిక్యంలో ఉండటంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ మ్యూట్ ఓపెన్ తర్వాత పెరిగాయి. ఈరోజు ఉదయం 9:35 గంటల సమయానికి నిఫ్టీ 0.19 శాతం లేదా 46.20 పాయింట్లు పెరిగి 23,870.30 వద్ద, సెన్సెక్స్ 230.96 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 76,431.64 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.03 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ 1 శాతం పెరిగి ఇతర రంగాల సూచీలలో లీడ్ లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఆటో తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఛాయ్ పైసలతో SIP..? యాక్సిస్ బ్యాంక్ సరికొత్త స్కీమ్
-
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 893.39 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టంతో 76,200.68 వద్ద, నిఫ్టీ 278.80 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టంతో 23,824.10 వద్ద నిలిచాయి.ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ఓరియంటల్ హోటల్స్ లిమిటెడ్, కోహాన్స్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, మోహిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. రోసెల్ టెక్సిస్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, వింధ్య టెలిలింక్స్ లిమిటెడ్, గంగా ఫోర్జింగ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమై వెంటనే పుంజుకున్నాయి. ఈరోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 16.20 పాయింట్లు ఎగబాకి 23,925 వద్దకు 24,119.10 చేరింది. సెన్సెక్స్(Sensex) 35.18 పాయింట్లు పెరిగి 77,129.25 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ట్రెంట్ , శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.15 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.21 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ లాభాల్లో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 291.17 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 77,094.07 వద్ద, నిఫ్టీ 89.80 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో 24,102.90 వద్ద నిలిచాయి.నోసిల్ లిమిటెడ్, మెనన్ పిస్టన్స్ లిమిటెడ్, థెమిస్ మెడికేర్ లిమిటెడ్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈఎమ్ఎస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహాలక్ష్మి రబ్టెక్ లిమిటెడ్, బాన్స్రాస్ సింటెక్స్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్టి లిమిటెడ్, ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ సెషన్ ను 357.77 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 77,160.67 వద్ద ప్రారంభించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.50 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,106.60 వద్ద ప్రారంభమైంది.నిఫ్టీ 50లో సిప్లా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.48 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.58 శాతం పెరిగాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ వారం 3 ఐపీఓలు
మార్కెట్లో మళ్లీ సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ వారంలో మూడు ఐపీఓలు ఇన్వెస్టర్ల తలుపు తుడుతున్నాయి. లగ్జరీ క్రూ యిజ్ సర్వీసులను అందిస్తున్న కార్డీలియా క్రూ యిజెస్ పేరెంట్ కంపెనీ వాటర్వేస్ లీజర్ టూరిజమ్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో రూ. 585 కోట్లు సమీకరించనుంది. ఇక జైపూర్కు చెందిన ఆభరణాల తయారీ సంస్థ అద్విత్ జ్యువెల్స్, ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సీఎస్ఎం టెక్నాలజీస్ కూడా జాబితాలో ఉన్నాయి.వాటర్వేస్ లీజర్ టూరిజం ఎప్పుడు: జూన్ 23న ప్రారంభం.. 25న ముగింపు షేరు ధరల శ్రేణి: రూ.769–808 సమీకరణ మొత్తం: రూ.585 కోట్లుఅద్విత్ జ్యువెల్స్ ఎప్పుడు: జూన్ 23న ప్రారంభం.. 25న ముగింపు షేరు ధరల శ్రేణి: రూ.130–138 సమీకరణ మొత్తం: రూ.165 కోట్లుసీఎస్ఎం టెక్నాలజీస్ ఎప్పుడు: జూన్ 24న ప్రారంభం.. 29న ముగింపు షేరు ధరల శ్రేణి: రూ.107–113 సమీకరణ మొత్తం: రూ.146 కోట్లు -
శాంతి చర్చలు.. క్రూడ్ ధరలే దిక్సూచి!
పశ్చిమాసియాలో శాంతి పవనాలు... క్రూడ్ మంటలు చల్లారడంతో స్టాక్ మార్కెట్లలో మళ్లీ కాస్త జోష్ కనిపిస్తోంది. అయితే, అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పురోగతితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రూపాయి కదలికలు, రుతుపవనాల విస్తరణపైనా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నారు. మరోపక్క, మొహర్రం సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. పశ్చిమాసియాలో ఒకపక్క ఉద్రిక్తతలు కుదుటపడుతున్న తరుణంలో తాజాగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు మళ్లీ అనిశ్చితికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్లోని అమెరికా–ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లో ఆదివారం తొలి విడత శాంతి చర్చలు మొదలయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనికి హాజరు కాగా, ఇరాన్ ప్రతినిధుల బృందానికి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వం వహించారు. ఈ కీలక చర్చల్లో ఎలాంటి పురోగతి ఉంటుందనేది ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశీయంగా స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘ఈ వారం ఇన్వెస్టర్ల ఫోకస్ అంతా యూఎస్–ఇరాన్ శాంతి చర్చలపైనే ఉంటుంది. మరోపక్క క్రూడ్ ఆయిల్ ధరల కదలికలను కూడా నిశితంగా గమనిస్తారు. చమురు ధరల సెగ తగ్గడం రానున్న రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు గనుక తలెత్తితే క్రూడ్ మంటతో మార్కెట్లతో పాటు ఎకానమీకి కూడా షాక్ తగులుతుంది’ అని ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. వరుణుడు కరుణిస్తాడా... ఎల్నినో ఎఫెక్ట్తో ఈ ఏడాది వర్షాలకు గండి పడుతుందన్న అంచనాలు బలడుతున్నాయి. జూన్ నెల దాదాపు చివరికి చేరుకుంటున్నప్పటికీ ఇంకా రుతుపవనాలు విస్తరించకపోవడం.. నైరుతి రుతుపవన సీజన్లో ఇప్పటిదాకా 41 శాతం లోటు వర్షపాతం ఉండన్న వాతావరణ శాఖ (ఐఎండీ) గణంకాలతో మార్కెట్ల ఫోకస్ వరుణుడి వైపు మళ్లింది. వర్షాలు సరిగ్గా పడకపోతే గ్రామీణ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్లకు ఇది చాలా ప్రతికూలాంశంగా మారుతుందనేది విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రుతుపవనాల విస్తరణపై ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరిస్తారని వారు అంటున్నారు.గతవారమిలా...పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగడం, క్రూడ్ చల్లారడం, రూపాయి కోలుకోవడంతో గతవారం దేశీ మార్కెట్లు భారీగా బౌన్స్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,274 పాయింట్లు (1.65%) పుంజుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 390 పాయింట్లు (1.65%) ఎగబాకి 24,000 పాయింట్ల పైన స్థిరపడింది.సాంకేతికంగా చూస్తే...గతవారం బుల్లిష్ ధోరణి ఈ వారం కూడా కొనసాగితే.. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీకి 24,080–24,120 పాయింట్ల వద్ద తొలి నిరోధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 24,200 పాయింట్ల పైన నిలదొక్కుకుంటే.. తదుపరి 24,400 వరకూ ఎగబాకే అవకాశం ఉంటుంది. ఇక సూచీ గనుక వెనకడుగు వేస్తే.. 23,900 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. దాన్ని కోల్పోతే 23,800 వద్ద రెండో మద్దతు దొరుకుతుంది. దీని దిగువున 23,700 స్థాయిని మళ్లీ పరీక్షించే అవకాశం ఉంటుంది.రూపాయిపై ఫోకస్..పశ్చిమాసియా యుద్ధం.. క్రూడ్ సెగతో బక్కచిక్కిన రూపాయి.. ఆర్బీఐ, ప్రభుత్వ చర్యలతో గత రెండు వారాల్లో భారీగా కోలుకుంది. మే నెలాఖర్లో డాలరుతో రూపాయి మారకం విలువ 96.96 ఆల్టైమ్ కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. చమురు ధరలు శాంతించడం (బ్రెంట్ క్రూడ్ 80 డాలర్ల దిగువకు చేరింది) డాలర్ల ప్రవాహానికి చేపట్టిన చర్యల ప్రభావంతో తాజాగా 94.20 స్థాయికి పుంజుకుంది. అయితే, అమెరికా–ఇరాన్ శాంతి చర్చల ఆధారంగా క్రూడ్ ధరల్లో చోటు చేసుకునే హెచ్చుతగ్గులు రానున్న రోజుల్లో రూపాయి విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘మార్కెట్లు క్రమంగా రెండు ప్రధాన అడ్డంకులను అధిగమిస్తున్నాయి. టారిఫ్ అనిశ్చితితో పాటు పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు సద్దుమణిగేలా కనబడుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న స్థిరీకరణ తర్వాత ఈ సానుకూలతలు మార్కెట్ రికవరీకి దన్నుగా నిలుస్తాయి. అయితే, వాటి ఫలితాలపైనే మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్టాక్ మార్కెట్ అలర్ట్: ట్రేడింగ్ 4 రోజులే..
భారత స్టాక్ మార్కెట్లకు వచ్చే వారం ఒక అదనపు సెలవు రానుంది. దీంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు జూన్ 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ చేసే అవకాశం ఉంటుంది. భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) శుక్రవారం అంటే జూన్ 26న మొహర్రం సందర్భంగా పూర్తిగా మూతపడనున్నాయి.ఈ సెలవు కారణంగా ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) వంటి ప్రధాన విభాగాల్లో ట్రేడింగ్ జరగదు.శుక్రవారం మొహర్రం సెలవుతో పాటు జూన్ 27, 28 తేదీల్లో శని, ఆదివారాల వారాంతపు విరామం ఉండటంతో మార్కెట్కు వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. తిరిగి జూన్ 29, సోమవారం నుంచి సాధారణ ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.స్టాక్ మార్కెట్ సమయాలు ఇలా..మార్కెట్ సాధారణ సమయాల ప్రకారం.. ప్రీ-ఓపెన్ సెషన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై 9:08 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు రెగ్యులర్ ట్రేడింగ్ జరుగుతుంది. ముగింపు (క్లోజింగ్) సెషన్ 3:40 నుంచి 4 గంటల వరకు ఉంటుంది.ఇదిలా ఉండగా, సెలవుతో కూడిన ఈ వారంలో డివిడెండ్లు, బోనస్ షేర్లు తదితర కార్పొరేట్ చర్యల కారణంగా పలు ప్రముఖ కంపెనీల షేర్లు ఎక్స్-డేట్కు వెళ్లనున్నాయి. ఇక్కడ ఎక్స్-డేట్ (Ex-Date) అంటే కంపెనీ ప్రకటించిన డివిడెండ్, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ లేదా రైట్స్ ఇష్యూ వంటి కార్పొరేట్ బెనిఫిట్లకు అర్హత నిర్ణయించే కీలక తేదీ. అందువల్ల ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పొజిషన్లు, మార్జిన్ అవసరాలు, సెటిల్మెంట్లను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం కొత్త ప్లాట్ఫామ్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు, ట్రేడర్ల కోసం బ్రోకరేజ్ సంస్థ ‘5పైసా క్యాపిటల్’ శనివారం కొత్త ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. ‘అల్గోస్పేస్’ పేరుతో ప్రారంభించిన ఈ అల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా.. సాధారణ ఇన్వెస్టర్లు కూడా సులువుగా అల్గో–ఆధారిత ఇన్వెస్ట్మెంట్లు, ట్రేడింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.సాధారణంగా ఆటోమేటెడ్ వ్యూహాలను రూపొందించడం, వాటిని అమలు చేయడం కష్టంగా ఉంటుంది. ఇప్పటివరకు అల్గోరిథమిక్ ట్రేడింగ్ రంగంలో కేవలం పెద్ద పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లు, సాంకేతికంగా లోతైన అవగాహన ఉన్నవారే ఎక్కువగా రాణిస్తున్నారు. అయితే, ఈ సాంకేతిక అడ్డంకులను తొలగిస్తూ కోడింగ్ నైపుణ్యాలు, సంక్లిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండానే నేరుగా వాడుకునేందుకు సిద్ధంగా ఉన్న ట్రేడింగ్ వ్యూహాలను ఈ ‘అల్గోస్పేస్’ ద్వారా మార్కెట్లోకి తెచ్చినట్లు ‘5పైసా’ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ ఛార్జీలు మినహా, ఈ ‘అల్గోస్పేస్’ను వాడుకునేందుకు ఇన్వెస్టర్ల నుండి ఎలాంటి అదనపు ప్లాట్ఫామ్ ఫీజులు, కమీషన్లు వసూలు చేయమని స్పష్టం చేసింది. -
నమ్మితే నట్టేట మునిగినట్టే !
గ్లోబల్ షేర్ మార్కెట్పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. అనంతపురం సిటీ: షేర్ మార్కెట్లలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. గతంలో మోసగాళ్లు కోల్డ్ కాల్స్పై ఆధార పడగా, ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాలు, ఏఐ వీడియోలతో పెట్టుబడిదారులను పెడదోవ పట్టిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న యువతనే లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సెబీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దేశీయంగా స్టాక్ మార్కెట్ మోసాల నియంత్రణకు సెబీ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నా... సరికొత్త స్కామ్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే సమయంలో సంచలనం రేకెత్తించిన పంప్ అండ్ డంప్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశీయంగా ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఆర్థిక మోసాల్లో భాగంగా ముందుగా స్కామర్లు తక్కువ ధర ఉన్న పెన్నీ స్టాక్స్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి విలువను కృత్రిమంగా పెంచేస్తారు. ఆ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా మొత్తం విక్రయించి స్టాక్ నుంచి బయటపడిపోతారు. ఇది తెలిసే లోపు స్టాక్ భారీగా పతనమై చిన్న పాటి పెట్టుబడిదారులు మొత్తం సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. ఆకట్టుకునేలా ఏఐ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విప్రో ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి తదితర ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రకటనలు ఊపందుకున్నాయి. ఇందులో రూ.22 వేలు ఒక్కసారి పెట్టుబడి పెడితే... ఎలాంటి పని చేయకపోయినా వారం రోజుల తర్వాత రూ.5.50 లక్షలు అందుతుందని స్వయంగా వారు మాట్లాడుతున్నట్లుగా వీడియోలను రూపొందించడం గమనార్హం. ఈ వీడియోల పట్ల ఆకర్షితులైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, పెట్టుబడి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోసపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 607 పాయింట్లు డౌన్!
శుక్రవారం ఉదయం నష్టాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 607.08 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంతో 76,802.90 వద్ద, నిఫ్టీ 154.90 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 24,013.10 వద్ద నిలిచాయి.రవీంద్ర ఎనర్జీ లిమిటెడ్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్, రాణే (మద్రాస్) లిమిటెడ్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్, ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఆర్ఆర్ఐఎల్ లిమిటెడ్, మెగెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే!
గత ఐదు రోజులు వరుస లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం ఒక్కసారిగా బ్రేక్ పడింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 23,950 స్థాయి కంటే దిగువకు చేరుకుంది. ఈ పతనంతో కేవలం రెండు గంటల్లోనే అన్ని బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మొత్తం విలువ సుమారు రూ. 1.3 లక్షల కోట్లు తగ్గింది.స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడానికి ఐటీ షేర్ల అమ్మకాలు, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, లాభాల స్వీకరణ, ప్రపంచ మార్కెట్ల బలహీనత, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.ఐటీ రంగంమార్కెట్ పతనానికి ప్రధాన కారణం ఐటీ రంగం అని తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ తన 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై ఆందోళనలు పెరిగాయి.దీంతో భారత ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్ వంటి దిగ్గజ షేర్లు 5 నుంచి 8 శాతం మధ్య పడిపోయాయి. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో పెద్ద భాగం ఉత్తర అమెరికా మార్కెట్ నుంచే వస్తుంది. కాబట్టి అక్కడ టెక్నాలజీ ఖర్చులు తగ్గే అవకాశం ఉందనే భయం.. పెట్టుబడిదారులను అమ్మకాల వైపు మళ్లించింది.విదేశీ పెట్టుబడిదారులుఇటీవల మూడు రోజుల పాటు కొనుగోళ్లు చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ అమ్మకాల వైపు మొగ్గు చూపారు. గురువారం ఒక్కరోజే వారు సుమారు రూ.1,025 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇది మార్కెట్లో ఆందోళనను పెంచింది. ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ దిశను ప్రభావితం చేసే ముఖ్యమైన వర్గం. వారు అమ్మకాలు పెంచితే మార్కెట్పై ఒత్తిడి పెరుగుతుంది.లాభాల స్వీకరణస్టాక్ మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవు. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 5% పెరిగింది. నిఫ్టీ 4% కంటే ఎక్కువ లాభపడింది. ఇంత వేగంగా మార్కెట్ పెరిగిన తర్వాత కొంతమంది పెట్టుబడిదారులు తమ లాభాలను బుక్ చేసుకోవడం సహజం. దీనినే లాభాల స్వీకరణ (Profit Booking) అంటారు. ఈ అమ్మకాలు మొదట చిన్న స్థాయిలో ప్రారంభమైనా, తరువాత మరింత విస్తరించి మొత్తం మార్కెట్పై ప్రభావం చూపాయి.ప్రపంచ మార్కెట్లుభారత మార్కెట్కు ప్రపంచ మార్కెట్ల పరిస్థితి కూడా చాలా ముఖ్యమైనది. ఆసియా మార్కెట్లు భారీగా పడిపోయాయి, దక్షిణ కొరియా కోస్పి, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల భారత మార్కెట్కు సానుకూల సంకేతాలు లభించలేదు. దీంతో ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ మరింత ఒత్తిడికి గురైంది.మధ్యప్రాచ్య ఉద్రిక్తతలుఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, మధ్యప్రాచ్యంలో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. దక్షిణ లెబనాన్లో కొత్త దాడుల వార్తలు, ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు మళ్లీ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. భారతదేశానికి ముఖ్యంగా ముడి చమురు (Crude Oil) ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.స్టాక్ మార్కెట్ పతనం అనేది సర్వ సాధారణమే అని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ మళ్లీ కోలుకునే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు రాబోయే రోజుల్లో ప్రపంచ పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, చమురు ధరల కదలికలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందని చెబుతున్నారు. -
ఆ షేర్ల ట్రేడింగ్లో జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనధికారిక ఎల్రక్టానిక్ ప్లాట్ఫాంలు, వెబ్సైట్ల ద్వారా అన్లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, విక్రయ లావాదేవీలు జరపరాదని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. అటువంటి ప్లాట్ఫాంలకు గుర్తింపు ఉండదని, వాటిపై నియంత్రణ సంస్థ పర్యవేక్షణ ఉండదని పేర్కొంది.కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫాంలు అన్లిస్టెడ్ కంపెనీల్లో లావాదేవీలకు వీలు కల్పిస్తున్నాయని సెబీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో 2016 ఆగస్టు, 2024 డిసెంబర్లో కూడా ఇటువంటి అడ్వైజరీలను జారీ చేసినట్లు సెబీ పేర్కొంది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు మాత్రమే సెక్యూరిటీల ట్రేడింగ్, నిధుల సమీకరణకు వేదికలుగా వ్యవహరించేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. -
ఐటీ షేర్లు ఢమాల్.. స్టాక్ మార్కెట్ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారతీయ బెంచ్ మార్క్ సూచీలు పతనమయ్యాయి. ఈరోజు ఉదయం 9:50 సమయానికి నిఫ్టీ(Nifty) 197.60 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 23,970.40 వద్ద, సెన్సెక్స్(Sensex) 721.13 పాయింట్లు 0.93 పతనంతో 76,688.84 వద్ద ట్రేడవుతోంది.ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.55 శాతం, 0.19 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ దాదాపు 6 శాతం క్షీణతతో అత్యధికంగా నష్టపోయింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా భారీగానే నష్టాలనే నమోదు చేశాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
2026లో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్?: కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్స్ గురించి సంచనల ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఏడాది (2026) అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతోందని కియోసాకి హెచ్చరించారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక సంక్షోభం దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో S&P 500 కూడా దాదాపు 50% వరకు పడిపోయింది. దీనివల్ల అనేక మంది పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనను కొందరు 'గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్' అని కూడా పిలుస్తారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా రిస్క్లో ఉందని, అప్పులు, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ సమస్యల కారణంగా మరో పెద్ద క్రాష్ వచ్చే అవకాశం ఉందని కియోసాకి భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ పెట్టుబడులపై మాత్రమే ఆధారపడకుండా.. బంగారం, వెండి లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆయన సూచిస్తారు.అయితే.. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే?, కియోసాకి చెప్పినది కేవలం ఒక అంచనా మాత్రమే. స్టాక్ మార్కెట్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ ఎకానమీ, కంపెనీల పనితీరు, పెట్టుబడిదారుల భావోద్వేగాలు మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఎవరు చెప్పినా మార్కెట్ క్రాష్ ఖచ్చితంగా జరుగుతుందని ముందే చెప్పడం సాధ్యం కాదు.మార్కెట్ క్రాష్ అంటే?స్టాక్ మార్కెట్ క్రాష్ అంటే షేర్ల ధరలు చాలా తక్కువ సమయంలో భారీగా పడిపోవడం. ఇది ఆర్థిక మాంద్యం, కంపెనీల లాభాలు తగ్గడం లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వల్ల జరుగుతుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో షేర్లు అమ్మేయడం వల్ల మార్కెట్ మరింత పడిపోతుంది.🚨 BREAKING:RICH DAD POOR DAD AUTHOR ROBERT KIYOSAKI SAID:"THE BIGGEST STOCK MARKET CRASH IS COMING IN 2026."HE PREDICTED THE 2008 CRASH, WHEN S&P 500 CRASHED -50%HE BELIEVES SOMETHING BAD IS COMING... pic.twitter.com/a6Gw0qrXxW— ᴛʀᴀᴄᴇʀ (@DeFiTracer) June 17, 2026 -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 254.36 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 77,409.98 వద్ద, నిఫ్టీ 82.30 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 24,168.00 వద్ద నిలిచాయి.ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బాటా ఇండియా లిమిటెడ్, కేపీఆర్ మిల్ లిమిటెడ్, జోడియాక్ క్లాతింగ్ కంపెనీ లిమిటెడ్, డైనమిక్ కేబుల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ఐఎఫ్సీఐ లిమిటెడ్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, డిబి (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ హాకిష్ విరామం తరువాత గ్లోబల్ ఈక్విటీల క్షీణత మధ్య దేశీయ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ కొద్దిగా పడిపోయాయి. ఈరోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 29 పాయింట్లు ఎగబాకి 24,115 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 పాయింట్లు పెరిగి 77,220 వద్ద ట్రేడవుతోంది.ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.17 శాతం, 0.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యంత క్షీణించింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ మెరుగైన పనితీరు కనబరిచాయి.యూఎస్, ఇరాన్ మధ్యంతర శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తరువాత బ్రెంట్ ముడి చమురు ధరలు దిగివచ్చాయి. ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ లో జూన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ బ్యారెల్ కు 1.48 శాతం తగ్గి 78.37 డాలర్లుగా ఉంది. ఇక బంగారం, వెండి ఫ్యూచర్స్ వరుసగా 0.93 శాతం, 1.9 శాతం నష్టపోయాయి. -
దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
బుధవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 347.14 పాయింట్లు లేదా 0.45 శాతం లాభంతో 77,155.62 వద్ద, నిఫ్టీ 96.55 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 24,085.70 వద్ద నిలిచాయి.బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్, హైబ్రిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, అమాగి మీడియా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీమెక్ లిమిటెడ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్టి లిమిటెడ్, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు మిశ్రమ ప్రపంచ సంకేతాలను ట్రాక్ చేస్తూ నిఫ్టీ 50, సెన్సెక్స్ పెరిగాయి. ఉదయం 9:47 గంటల సమయానికి, నిఫ్టీ 73.50 పాయింట్లు లేదా 0.31 శాతం పెరిగి 24,062.65 వద్ద, సెన్సెక్స్ 259.43 పాయింట్లు లేదా 0.34 శాతం ఎగిసి 77,067.91 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.ఈ రోజు విడుదలవుతున్న యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ రేటు నిర్ణయం ఫలితం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మదుపరులు అప్రమత్తంగా ఉన్నారు. రేట్-సెట్టింగ్ ప్యానెల్ ఫెడరల్ ఫండ్ టార్గెట్ రేటును 3.5–3.75 శాతం వద్ద స్థిరంగా ఉంచుతుందని భావిస్తున్నారు.హిందాల్కో ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ షేర్ ధర 22.7 శాతం తగ్గి రూ .555.50 కు పడిపోయింది. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.26 శాతం, 0.36 శాతం పెరిగాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ టాప్ అండర్ పెర్ఫార్మర్ గా ఉన్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ పెర్ఫార్మర్ గా ఉన్నాయి. -
స్టాక్ మార్కెట్ జోష్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 544.15 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 76,826.78 వద్ద, నిఫ్టీ 135.25 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 23,989.15 వద్ద నిలిచాయి.ఎక్స్ప్రో ఇండియా లిమిటెడ్, భారత్ గేర్స్ లిమిటెడ్, ఆర్టెక్ సోలనిక్స్ లిమిటెడ్, రాశి పెరిఫెరల్స్ లిమిటెడ్, టార్సన్స్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మోటిసన్స్ జ్యువెలర్స్ లిమిటెడ్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కమర్షియల్ సిన్ బ్యాగ్స్ లిమిటెడ్, రైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 68 పాయింట్లు ఎగబాకి 23,925 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు పెరిగి 76,532 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.7బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.65 శాతం పెరిగింది.నాస్డాక్ 3.07 శాతం పుంజుకుంది.Today Nifty position 16-06-2026(time: 09:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ సెన్సేషన్.. దూసుకుపోతున్న వెర్టెక్స్ సెక్యూరిటీస్
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 736.38 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 76,264.33 వద్దఎం నిఫ్టీ 231.00 పాయింట్లు లేదా 0.98 శాతం లాభంతో 23,853.90 వద్ద నిలిచాయి.మెగెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్, ఏబీ కాట్స్పిన్ ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్, ఎక్సీకామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్, గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శార్దూల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎక్సారో టైల్స్ లిమిటెడ్, హెచ్బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, రవీందర్ హైట్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమెరికా, ఇరాన్ ఒప్పందం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో జోష్
-
భారీ లాభాల్లో స్టాక్మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ అమాంతం ఎగిశాయి. ఉదయం 9:41 గంటల సమయానికి నిఫ్టీ 326.10 పాయింట్లు లేదా 1.38 శాతం పెరిగి 23,949.00 వద్ద, సెన్సెక్స్ 1,063.64 పాయింట్లు లేదా 1.41 శాతం పెరిగి 76,591.59 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పశ్చిమాసియాలో నాలుగు నెలల పాటు జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి వాషింగ్టన్, టెహ్రాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా, ఇరాన్ రెండూ అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ లో బ్రెంట్ క్రూడ్ జూన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 3.5 శాతం తగ్గి బ్యారెల్ కు 83.79 డాలర్లుగా ఉంది. యూఎస్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కీలకమైన ఇంధన సరఫరా జలమార్గం హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నందున పెట్టుబడిదారుల ఆందోళలు సడలాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.4 శాతం, 1.7 శాతం పెరిగాయి.సెక్టార్ వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ సమీక్షే మార్కెట్కు దిక్సూచి
పలు దేశ, విదేశీ గణాంకాలపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. యూఎస్, ఇరాన్ మధ్య డీల్పైనా భారీ అంచనాలున్నాయి. వెరసి ఈ అంశాల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రధానంగా యూఎస్, ఇరాన్ మధ్య ఒప్పందం కోసం ప్రపంచవ్యాప్తంగా అటు ఇన్వెస్టర్లు, ఇటు ఆర్థికవేత్తలు ఎదురుచూస్తున్నారు. మూడు నెలలుగా పలు అంశాలలో అనిశ్చితికి కారణమవుతున్న పశి్చమాసియా యుద్ధం ముగింపుపై గత వారాంతాన ఆశలు చెలరేగాయి. యుద్ధం ముగిసే ఒప్పందం కుదరనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో గత వారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కె ట్లు జోరందుకున్నాయి. హార్ముజ్, న్యూక్లియర్ అంశాలు ఒక కొలిక్కి వచ్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ వారం ఇరాన్, యూఎస్ మధ్య కుదిరే వీలున్న శాంతి ఒప్పందానికి విశ్వవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలిపారు. ద్రవ్యోల్బణంపై ఫోకస్ నేడు(సోమవారం) దేశీయంగా మే నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్లో డబ్ల్యూపీఐ ఏకంగా 3.88 శాతం నుంచి 8.3 శాతానికి ఎగసింది. ఇది 42 నెలల గరిష్టంకాగా.. పశి్చమాసియా సంక్షోభం ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. గత వారం విడుదలైన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) సైతం ఆహార ధరల కారణంగా 3.93 శాతానికి పెరిగింది. ఇవి ఆర్బీఐ పరపతి విధానాలను ప్రభావం చేయగలవని ఆర్థికవేత్తలు తెలియజేశారు. మే నెలకు రేపు(16న) వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. ఏప్రిల్లో వాణిజ్య లోటు 28.4 బిలియన్ డాలర్లకు చేరింది. యథాతథంగా 5.25 శాతం వద్దే రెపో రేటు కొనసాగించిన ఆర్బీఐ గత వారం పాలసీ వివరాలు(మినిట్స్) వారాంతాన(19న) వెల్లడి కానున్నాయి. విదేశీ అంశాలు మే నెలకు యూఎస్ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలను మించుతూ 1,72,000గా నమోదైంది. దీంతో నిరుద్యోగ రేటు 4.3% వద్దే ఉంది. ఇది ఫెడరల్ రిజర్వ్ రేట్ల స్టేటస్ కో నిర్ణయాలను సమరి్థస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. గత పాలసీ సమావేశంలో ఫెడ్ 3.5–3.75% వద్ద ఫండ్స్ రేట్లను నిలిపి ఉంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం(17న) ఫెడ్ పరపతి సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి.సాంకేతికంగా చూస్తే.. గత వారం ప్రధాన ఇండెక్సులు బలాన్ని పుంజుకోవడం ద్వారా పరిమిత కన్సాలిడేషన్ నుంచి సాంకేతికంగా బయటపడ్డాయి. దీంతో ఈ వారం నిఫ్టీ వెనువెంటనే 23,800 పాయింట్లను తాకవచ్చు. ఈ స్థాయిలో ఎదురయ్యే రెసిస్టెన్స్ని అధిగమిస్తే 24,000–24,200వరకూ పుంజుకునే వీలుంది. మరోపక్క 23,450– 23,350 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించవచ్చు.గత వారమిలా ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,285 పాయింట్లు(1.75 శాతం) ఎగసి 75,528 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 256 పాయింట్లు(1.1 శాతం) పుంజుకుని 23,623 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్క్యాప్ 0.3% నీరసించగా.. , స్మాల్ క్యాప్ 0.2% లాభపడింది.ఎఫ్పీఐ అమ్మకాల స్పీడ్ ఈ నెల 15 రోజుల్లో రూ. 62,853 కోట్లు దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెల తొలి రెండు వారాల్లో రూ. 62,853 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. పశి్చమాసియా సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, డాలరుతో మారకంలో రూపాయి క్షీణత తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్ఎస్డీఎల్ వివరాల ప్రకారం దేశీ స్టాక్స్ నుంచి ఎఫ్పీఐలు 2026లో ఇప్పటివరకూ రూ. 2.87 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. తద్వారా 2025 కేలండర్ ఏడాదిలో నమోదైన రూ. 1.66 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను దాటేశాయి. 2026లో ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్పీఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తూ వస్తున్నారు. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 461.30 పాయింట్లు లేదా 1.99 శాతం పెరిగి 23,622.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,695.40 పాయింట్లు లేదా 2.30 శాతం పెరిగి 75,527.95 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 50 ఇండెక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టూబ్రో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 2.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 2.8 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది. -
ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ ఐపీఓకు రికార్డు స్పందన
ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో(IPO)గా నిలిచిన ‘స్పేస్ఎక్స్’ (SpaceX) షేర్ల విక్రయానికి మదుపరుల నుంచి భారీ స్పందన లభించింది. ఎలాన్ మస్క్కు చెందిన ఈ రాకెట్, శాటిలైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐపీఓలో రిటైల్ పెట్టుబడిదారులు ఒక్కరే 100 బిలియన్ డాలర్లకు పైగా కొనుగోలు ఆర్డర్లు సమర్పించినట్లు బ్లూమ్బర్గ్, రాయిటర్స్ నివేదికలు వెల్లడించాయి.స్పేస్ఎక్స్ షేర్లు ఒక్కొక్కటి 135 డాలర్ల ధరకు విక్రయించగా, మొత్తం 555.6 మిలియన్ షేర్ల ద్వారా సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 1.75 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించింది...కానీ అందరికీ షేర్లు దక్కవుస్పేస్ఎక్స్ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కనీసం 20 శాతం షేర్లను కేటాయించినప్పటికీ, వచ్చిన డిమాండ్ ఆ కేటాయింపును అనేక రెట్లు మించి ఉంది. సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి కూడా భారీగా ఆర్డర్లు రావడంతో చాలా మంది చిన్న మదుపరులకు పూర్తి కేటాయింపు దక్కే అవకాశాలు తగ్గాయి. మొత్తం పెట్టుబడిదారుల డిమాండ్ 250 బిలియన్ డాలర్లను దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి.చైనా ఇన్వెస్టర్లకు నో!అమెరికా సాంకేతిక ఎగుమతి పరిమితుల కారణంగా చైనా ప్రధాన భూభాగం, హాంకాంగ్కు చెందిన ఇన్వెస్టర్ల ఆర్డర్లను స్పేస్ఎక్స్ ఐపీఓలో అంగీకరించలేదు. రాకెట్, ఉపగ్రహ, కృత్రిమ మేధస్సు రంగాలకు సంబంధించిన కీలక సాంకేతికత కారణంగా ఈ పరిమితులు అమల్లోకి వచ్చాయి.మస్క్కు మరో మైలురాయిస్పేస్ఎక్స్ ఐపీఓ విజయంతో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి మరో కీలక మైలురాయి చేరింది. అయితే కంపెనీ భారీ విలువ, ఇంకా లాభదాయకత సాధించని వ్యాపార నమూనా, భవిష్యత్ వృద్ధి అంచనాలపై మార్కెట్లో చర్చ కొనసాగుతోంది. అయినప్పటికీ, స్పేస్ఎక్స్ ఐపీఓ ప్రపంచ మూలధన మార్కెట్ల చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలవడం ఖాయం.చైనా, హాంకాంగ్ ఐపీఓల ముందు చిన్నదే!స్పేస్ఎక్స్ ఐపీఓకు వచ్చిన స్పందన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పటికీ, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో కొన్ని ఐపీఓలు ఇంకా పెద్ద స్థాయిలో రిటైల్ ఆసక్తిని ఆకర్షించాయి. 2025లో షాంఘైలో చిప్ తయారీ సంస్థ మెటాఎక్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐపీవోకు సుమారు 3 ట్రిలియన్ యువాన్లు (దాదాపు 444 బిలియన్ డాలర్లు) విలువైన రిటైల్ బిడ్లు వచ్చినట్లు మార్కెట్ డేటా సూచిస్తోంది. అదే విధంగా హాంకాంగ్లో బబుల్-టీ దిగ్గజం మిక్సు గ్రూప్ ఐపీవోకు దాదాపు 1.8 ట్రిలియన్ హాంకాంగ్ డాలర్లు (సుమారు 230 బిలియన్ యూఎస్ డాలర్లు) ఆర్డర్లు నమోదయ్యాయి.చైనాలో ఐపీఓలకు అంత క్రేజ్ ఎందుకు?చైనా ప్రధాన భూభాగంలో కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీల షేర్లు మొదటి రోజే భారీ లాభాలు ఇవ్వడం సాధారణం. నియంత్రణ సంస్థలు ప్రారంభ ధరలను తక్కువగా ఉంచడం వల్ల ఇన్వెస్టర్లకు తొలి రోజు లాభాలపై అధిక నమ్మకం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది చిన్న మదుపరులు ఐపీఓలను ఒకరకమైన "లాటరీ అవకాశం"గా భావిస్తూ దరఖాస్తు చేస్తుంటారు.హాంకాంగ్లో అయితే బ్రోకరేజీలు సులభంగా మార్జిన్ రుణాలు ఇవ్వడం వల్ల పెట్టుబడిదారులు పెద్ద మొత్తాల్లో అప్పు తీసుకుని కూడా ఐపీఓలకు దరఖాస్తు చేస్తుంటారు. తదుపరి టెక్ దిగ్గజాన్ని కోల్పోతామనే భయం (FOMO) కూడా ఈ ఉత్సాహానికి కారణమవుతోంది. -
భారీగా పెరిగిన స్టాక్ జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు
-
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో సంఘర్షణ తీవ్రమైన కారణంగా రిస్క్ సెంటిమెంట్ దెబ్బతినడతో నిఫ్టీ 50, సెన్సెక్స్ అస్థిర సెషన్ ను నష్టాలతో ముగించాయి. నిఫ్టీ 53.35 పాయింట్లు లేదా 0.23 శాతం తగ్గి 23,161.60 వద్ద, సెన్సెక్స్ 150.63 పాయింట్లు లేదా 0.20 శాతం క్షీణించి 73,832.55 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎటర్నల్ నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.81 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.67 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ కెమికల్ షేర్లు అత్యధికంగా క్షీణించాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
మిశ్రమంగా ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 27.15 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టపోయి 23,214.95 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 64.42 పాయింట్లు లేదా 0.09 శాతం పెరిగి 73,983.18 వద్ద ముగిసింది.హెచ్ యూఎల్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.49 శాతం, 1.33 శాతం నష్టపోయాయిరంగాల వారీగా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ కెమికల్ మెరుగైన పనితీరు కనబరిచాయి. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 87 పాయింట్లు పెరిగి 23,327 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 358 పాయింట్లు ఎగబాకి 74,274 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.97బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.97 శాతం తగ్గింది.Today Nifty position 10-06-2026(time: 09:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
చివరి గంటలో కొనుగోళ్ల జోరు..
గడిచిన రెండు సెషన్లుగా ఇన్వెస్టర్లను కలవరపెట్టిన నష్టాల పరంపరకు మంగళవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా బ్యాంకింగ్ రంగంలో వ్యూహాత్మక కొనుగోళ్లు మార్కెట్లకు ఊరటనిచ్చాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 394 పాయింట్లు పుంజుకొని 73,918.76 మార్కు వద్ద స్థిరపడింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty 50) కూడా 119 పాయింట్లు లాభపడి 23,242.10 వద్ద ముగిసింది. మధ్యాహ్నం సమయంలో కొంత లాభాల స్వీకరణ జరిగినప్పటికీ చివరి గంటలో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంతో సూచీలు తిరిగి పుంజుకున్నాయి.మార్కెట్ జోష్కు దారితీసిన కారణాలునేటి మార్కెట్ గమనాన్ని విశ్లేషిస్తే ఈ రికవరీకి ప్రధానంగా కొన్ని అంశాలు దోహదపడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో..ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల తగ్గింపుపశ్చిమాసియాలో కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చిన ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పర దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లలో భయాలను తొలగించింది.క్రూడాయిల్ ధరలుఅంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 0.71% తగ్గి బ్యారెల్కు 92.75 డాలర్ల వద్దకు చేరింది. భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థకు చమురు ధరలు తగ్గడం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది.ఆర్బీఐ బూస్టర్ డోస్.. బ్యాంకింగ్ రంగం హవానేటి మార్కెట్ ర్యాలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం బూస్ట్గా మారింది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు గాను బ్యాంకులు సేకరించే తాజా ఎఫ్సీఎన్ఆర్-బీ డిపాజిట్ల కోసం యూఎస్ డాలర్-రూపాయి ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. కనీసం 3 సంవత్సరాల నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది.ఈ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ ఏకంగా 1,255 పాయింట్లు దూసుకెళ్లింది. ఏప్రిల్ 10 తర్వాత బ్యాంక్ నిఫ్టీ సాధించిన అత్యుత్తమ సింగిల్-డే లాభం ఇదే కావడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి హెవీవెయిట్ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి.అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుగత వారం అమెరికా వాల్ స్ట్రీట్లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సెమికండక్టర్, టెక్నాలజీ షేర్లు రాణించాయి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:40 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు పెరిగి 23,152 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 67 పాయింట్లు ఎగబాకి 73,588 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.95బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 93.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3 శాతం పెరిగింది.నాస్డాక్ 0.86 శాతం పుంజుకుంది.Today Nifty position 09-06-2026(time: 10:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్ను ముంచెత్తిన అమ్మకాల వరద!
భారత స్టాక్ మార్కెట్ ఈ వారం తొలి సెషన్లోనే తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముడిచమురు ధరల మంట దేశీయ మార్కెట్లను కుప్పకూల్చాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయి 23,123 వద్ద స్థిరపడింది. మరోవైపు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 719 పాయింట్లు దిగజారి 73,524 వద్ద ముగిసింది. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఏకంగా 7.25% పెరిగి 16.93 మార్కుకు చేరడం మదుపరుల్లో ఉన్న తీవ్ర ఆందోళనను ప్రతిబింబిస్తోంది. భారత ఈక్విటీ మార్కెట్ ఇంతలా కుప్పకూలడానికి ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయం, ద్రవ్యోల్బణ భయాలు కారణమయ్యాయి.యుద్ధ సంక్షోభం తీవ్రతరంమార్కెట్లను కుదిపేసిన అత్యంత కీలకమైన అంశం పశ్చిమ ఆసియా సంక్షోభం. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దాడులు, తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన దాడుల కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదరాల్సిన శాంతి ఒప్పందాలపై ఈ పరిణామాలు నీళ్లు చల్లడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. యుద్ధ భయాల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడులవైపు మదుపరులు మొగ్గు చూపడం మార్కెట్ల పతనానికి దారితీసింది.ముడిచమురు ధరలుమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఆటంకం కలుగుతుందనే భయాలు పెరిగాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 4.5% పైగా పెరిగి బ్యారెల్కు 97.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడే భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడింది.టెక్ షేర్లలో అమ్మకాల వెల్లువగత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లను పరుగులు పెట్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక రంగానికి చెందిన షేర్లలో అంతర్జాతీయంగా ప్రాఫిట్ బుకింగ్ ఊపందుకుంది. ఈ ఏఐ ర్యాలీ అత్యంత వేగంగా, పరిమితికి మించి జరిగిందన్న భయాలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు టెక్ షేర్లను విక్రయించారు. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు భారత ఐటీ రంగంపైనా స్పష్టంగా కనిపించింది.ఆర్బీఐ నెమ్మదించిన వృద్ధి అంచనాలుఇటీవలి ద్రవ్య పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.9% నుంచి 6.6%కి తగ్గించింది. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.1%కి పెంచడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఉంచవచ్చనే సంకేతాలు తోడయ్యాయి.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
స్టాక్ మార్కెట్ క్రాష్.. వణికిపోతున్న సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కదులుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత మళ్లీ పెరగడంతో భారత ప్రామాణిక సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి. వార్తల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. ఇది అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఆశలపై నీరు పోసింది. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 188.20 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 23,178.50 వద్ద, సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 10.82 శాతం క్షీణించి 73,632.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.51 శాతం, 1.52 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ మంచి పనితీరు కనబరుస్తున్నాయి. -
గణాంకాలపై మార్కెట్ ఫోకస్!
దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా పలు దేశ, విదేశీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోపక్క రోజుకో మలుపు తీసుకుంటున్న పశ్చిమాసియా పరిస్థితులు కీలకం కానున్నాయి. గత వారాంతాన యూఎస్ మార్కెట్లతోపాటు.. పసిడి, వెండి తదితర కమోడిటీలలో అమ్మకాలు వెల్లువెత్తాయి. యూఎస్ స్టాక్ మార్కెట్లు 1.5–4% మధ్య క్షీణించగా.. బంగారం 3 శాతం, వెండి 6.5% చొప్పున పతనమయ్యాయి. ముడిచమురు, కాపర్, నేచురల్ గ్యాస్ సైతం 2–4 శాతం మధ్య నీరసించాయి. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూఎస్ లీజర్, హెల్త్కేర్, ఆతిథ్య రంగాల దన్నుతో మే నెలలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించాయి. దీంతో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు పెరిగి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 100కు బలపడింది. మరోపక్క ఏఐ సవాళ్లతో టెక్నాలజీ స్టాక్స్లో తలెత్తిన భారీ అమ్మకాలు నాస్డాక్ను 4% పడగొట్టినట్లు తెలిపా రు. కాల్పుల విరమణ అంటూనే యూఎస్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. నేడు అటూఇటుగా గత వారం చివర్లో యూఎస్ మార్కెట్లు, కమోడిటీలలో నమోదైన అమ్మకాల ప్రభావం నేడు దేశీయంగా కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత వారం విడుదలైన దేశ జీడీపీ గణాంకాలు, ఆర్బీఐతోపాటు ప్రభుత్వం చేపట్టిన విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాల నిబంధనల సవరణలు కొంతమేర ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు వివరించారు. రాజకీయ, భౌగోళిక అనిశ్చితి, చమురు ధరల కారణంగా ఎదురవుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ తగ్గించడం కొంతమేర ప్రతికూలమేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు ఆర్బీఐ దన్ను, బలపడిన డాలరు.. రూపాయిపై ప్రభావం.. ఇవన్నీ కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. వెరసి నేడు మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాలపై దృష్టిఇటీవల ఆశలు రేపుతున్న రుతుపవనాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మే నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు 12న వస్తాయి. ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గ్లోబల్ ఐటీ దిగ్గజాల్లో అమ్మకాలు దేశీయంగానూ ప్రభావం చూపవచ్చని లివ్లాంగ్ వెల్త్ రీసెర్చ్ నిపుణులు కె.హరిప్రసాద్ చెప్పారు.సాంకేతికంగా చూస్తే.. సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం గత వారం సెన్సెక్స్ మద్దతు స్థాయిలకు సమీపంలో నిలిచినప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. మరోపక్క 23,500 పాయింట్లను దాటలేకపోతున్న నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. వెరసి ఈ వారం నిఫ్టీ 23,000 పాయింట్ల దిగువకు 22,900కు చేరవచ్చు. బలపడితే 23,500 వద్ద రెసిస్టెన్స్కు అవకాశముంది. గత వారం డీలా విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర విక్రయాల నేపథ్యంలో గత వారం(1–5) హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 532 పాయింట్లు(0.7%) నష్టపోయి 74,243 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు(0.76%) క్షీణించి 23,367 వద్ద స్థిరపడింది. ఎఫ్పిఐ అమ్మకాల దెబ్బ కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలు చేపడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల తొలి వారంలోనూ ఇదే ధోరణి కొనసాగించారు. వెరసి జూన్ తొలి వారంలో రూ. 43,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేలండర్ ఏడాది(2026)లో ఇప్పటివరకూ రూ. 2.67 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇది సరికొత్త రికార్డ్కాగా.. ఎన్ఎస్డీఎల్ వివరాల ప్రకారం 2025లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు రూ. 1.66 లక్షల కోట్లను ఇవి దాటేశాయి. బలహీన కార్పొరేట్ ఫలితాలు, రూపాయి క్షీణత, గ్లోబల్ మార్కెట్లలో ఆకర్షణీయ అవకాశాలు తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్పీఐలు నికర అమ్మకందారులుగానే నిలవడం గమనార్హం! మార్చిలో అత్యధికంగా రూ. 1.17 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
తైవాన్ నేర్పే ఆర్థిక పాఠాలు
కేవలం ఉమ్మడి మహబూబ్నగర్, ఆది లాబాద్ జిల్లాలను కలిపినంత భూభాగం; జనాభా పరంగా ఇంచుమించు మన దేశంలోని ఓ పెద్ద మహానగరంతో సమానం (2.3 కోట్లు) – అదే దశాబ్దాలుగా చైనా నుంచి తీవ్రమైన ఒత్తిడి నెదుర్కొంటున్న తైవాన్ దేశం. కానీ గత మే నెలలో ఈ చిన్న ద్వీపదేశం స్టాక్ మార్కెట్ సంపద విలువ ఏకంగా 4.95 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకి, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశ స్టాక్ మార్కెట్ను స్వల్పంగా అధిగమించింది. దాంతో తైవాన్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద మార్కెట్గా అవతరించడం ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఆ ఒక్క కంపెనీఒకప్పుడు వ్యవసాయం, పశుపోషణ, చేపలవేట వంటి మౌలిక వృత్తులపై ఆధారపడిన తైవాన్ – 70వ దశకంలో ఆర్థిక మంత్రి కేటీ లీ వంటి దీర్ఘదృష్టి గల నాయకుల సారథ్యంలో సాంకేతికత వైపు మళ్లింది. అప్పట్లో మైక్రోచిప్స్ రంగం అమెరికా, జపాన్ బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యంలో ఉండేది. అందులో పొంచి ఉన్న అవకా శాన్ని పసిగట్టిన తైవాన్, అమెరికాలో అప్పటికే విశేషానుభవం గడించిన మోరిస్ చాంగ్ అనే స్వదేశీయుణ్ణి ప్రోత్సహించింది. ఆ నేపథ్యంలో 1987లో సాధారణ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ప్రారంభ మైన టీఎస్ఎంసీ (తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ), నేడు అంతర్జాతీయ కాంట్రాక్ట్ చిప్ తయారీ రంగంలో దాదాపు 70% వాటాతో ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. 80,000 మందికి పైగా అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలను కలిగి ఉన్న టీఎస్ఎంసీ, తైవాన్ స్టాక్ మార్కెట్ సంపదలో సుమారు 42–44% వాటా కలిగి ఉంది.ప్రపంచం నేడు స్మార్ట్ఫోన్ల నుండి కృత్రిమ మేధ ఆధారిత సూపర్ కంప్యూటర్ల వరకు అవసరమైన చిప్స్ కోసం తైవాన్పై ఆధారపడుతోంది. దాంతో ఈ చిన్న చిప్లే చైనా వంటి శక్తిమంత మైన దేశంతో నిరంతర ప్రమాదం పొంచివుండే ఆ దేశానికి, అదృశ్య రక్షణ కవచంగా మారాయి. తైవాన్ దాడికి గురైతే, ఈ చిప్ల సరఫరాకు అంతరాయం ఏర్పడి తమ ఆర్థిక వ్యవస్థలకు ముప్పు తప్పదనే భయంతో పాశ్చాత్య దేశాలు, కూటములు తైవాన్ రక్షణకు బాసటగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా, తైవాన్ పొందే ఈ రక్షణ ‘సిలికాన్ షీల్డ్’ (సిలికాన్ రక్షణ కవచం)గా పేరొందింది. ప్రభుత్వ–ప్రైవేట్–విదేశీ సహకారం2016లో తైవాన్ మార్కెట్ విలువ 820 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, భారత్ 1.45 ట్రిలియన్ డాలర్లతో ముందుంది. గత పదేళ్లలో భారత్ గణనీయంగా వృద్ధి చెందినా, తైవాన్ మరింత వేగంగా పరుగులు తీసింది. భారత్ బ్యాంకింగ్, ఐటీ సేవలు, విని యోగ వస్తువులు, ఇంధనం వంటి వివిధ రంగాలపై దృష్టి సారిస్తే; తైవాన్ తన శక్తియుక్తులను చిప్ తయారీ వంటి హార్డ్వేర్ రంగంపై కేంద్రీకరించడం దీనికి ప్రధాన కారణం. మన వ్యవస్థలు ఎక్కువగా దేశీయ వినియోగంపై ఆధారపడి నడుస్తుంటే; తైవాన్ మాత్రం ప్రపంచ దేశాల సాంకేతికావసరాలను తీర్చుతూ అంతర్జాతీయ పెట్టుబడులను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. అయితే, 143 కోట్ల జనాభా వినియోగావసరాలను తీర్చడానికి మన దేశం ప్రాధాన్యత నివ్వడం కూడా ఆక్షేపణీయం కాదు.తైవాన్ విజయం వెనుక టీఎస్ఎంసీ ఒక్కటే కాదు– ఆ దేశ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్ల విధానం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. సిన్చు సైన్ ్స పార్క్లో చిప్ డిజైన్ కంపెనీలు, తైచుంగ్ ఇండస్ట్రియల్ పార్క్లో రోబోటిక్స్, కచ్చిత యంత్రాల తయారీ పరిశ్రమలు... వనరులు, సాంకేతికత మార్పిడి వంటి అంశాల్లో పరస్పరం అనుసంధానమై పని చేస్తు న్నాయి. ప్రభుత్వ–ప్రైవేట్–విదేశీ సంస్థల మధ్య సహకారం, ఫిలిప్స్ వంటి దిగ్గజాల నుండి సాంకేతికత సరఫరా, అమెరికా విపణులతో సంబంధాలు ఈ వ్యవస్థను పటిష్ఠపరిచాయి. దీనికి తోడు, విద్యావిధానాన్ని పరిశ్రమల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, విశ్వవిద్యాలయాలను నైపు ణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో స్థిరపడిన తైవాన్ మేధావులను తిరిగి రప్పించడానికి పన్ను మినహా యింపులు, పరిశోధనా నిధులు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో, ఆ మానవ వనరులు దేశాభివృద్ధికి పునరంకితమయ్యాయి.అయినప్పటికీ ఈ నమూనా బలహీనతలకు అతీతం కాదు. ఒకే కంపెనీపై గణనీయంగా ఆధారపడ్డ సెమీకండక్టర్ రంగం తైవాన్ జీడీపీలో సుమారు 18–20% వాటా కలిగి ఉంది. ఈ పరిణామం ‘డచ్ డిసీజ్’ లాంటి సంక్షోభం తెచ్చిపెట్టే ప్రమాదం పొంచి ఉంది. 1960ల కాలంలో నెదర్లాండ్స్ (డచ్) అప్పుడప్పుడే అన్వేషించ బడుతున్న సహజ వనరులపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరించడంతో, ఇతర రంగాలు బలహీనపడ్డాయి. అలా ఏదైనా ఒక రంగంపై దేశం అధికంగా ఆధారపడితే వచ్చే దుష్పరిణామాలను సూచించడానికి ఈ పదం వాడతారు. చిప్లకు ప్రత్యామ్నాయాలు ఆవిర్భవించినా లేదా అమెరికా, దక్షిణ కొరియా, భారత్ వంటి కొత్త పోటీదారులు పుంజుకున్నా దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలు చిక్కుల్లో పడతాయి. అంతేకాకుండా పరిమిత వనరులు కలిగిన ఆ దేశం విద్యుత్ సర ఫరాలో అంతరాయాలు, నీటి ఎద్దడి, వృద్ధాప్యానికి చేరువవుతున్న జనాభా, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వంటి సవాళ్లను ఎదు ర్కొంటోంది. అన్నింటికంటే పెద్ద ముప్పు – దేశ సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేయగలిగిన చైనా సైనిక–రాజకీయ ఒత్తిడి. పారిశ్రా మికాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చిన తైవాన్, తొలినాళ్ళలో వీటిపై దృష్టి సారించలేదు. మనమేం చేయొచ్చు?సవాళ్లను అధిగమిస్తూ తైవాన్ సాధిస్తున్న విజయాలు వర్ధమాన దేశాలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. భారతదేశం, ముఖ్యంగా సెమీకండక్టర్ రంగంలో ముందుకు సాగుతున్న తెలుగు రాష్ట్రాలు, తైవాన్ పురోగతిని నిశితంగా పరిశీలించాలి. భారత్ ప్రభుత్వం ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ ద్వారా వేల కోట్లు పెట్టుబడి పెట్టడం, ప్రస్తుత కృత్రిమ మేధ యుగంలో సరైన ముందడుగే. కానీ కేవలం భారీ ఉత్పత్తి సామర్థ్యాలు సమకూర్చుకోవడంతో పాటుగా, తైవాన్ తరహా సమగ్రమైన సరఫరా శృంఖలలను సృష్టించగలగాలి. నైపుణ్యాలను పెంపొందించే విద్యా విధానం, వ్యతిరేక దిశలో మేధో వలసలు, పారిశ్రామిక సముదాయాలు, విడిభాగాల ఉత్పత్తికేంద్రాలు, సాంకేతికత మార్పిడి, మార్కెటింగ్ అనుసంధానం– ఇవన్నీ అందులో అంతర్భాగాలు కావాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో ప్రతిభ చూపుతున్న మన తెలుగు యువత – తమ నైపుణ్యాలను హార్డ్వేర్ రూపకల్పన, చిప్ తయారీ, సరఫరా గొలుసుల కూర్పు వైపు కూడా విస్తరించాలి. ఇందుకోసం మన తెలుగు రాష్ట్రాలు కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ రూపకల్పన, ఉత్పత్తి పారిశ్రామిక వాడలను నిర్మించాలి. విద్యారంగాన్ని సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ చిప్ సంస్థలతో ఇంటర్న్షిప్లు, పరిశోధనలు, తైవాన్ లాంటి దేశాల సందర్శనలు వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. ఏఐ వల్ల సాఫ్ట్వేర్ రంగం ప్రభావితమవ్వబోతోందన్న ఆందోళనకు ఇదో చక్కటి పరిష్కారం కూడా!పల్లపోతు కృష్ణబాలాజివ్యాసకర్త విశ్రాంత ఉన్నతాధికారి, ఎస్.బి.ఐ. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి, నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 116.66 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 74,243.34 వద్ద, నిఫ్టీ 49.85 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 23,366.70 వద్ద నిలిచాయి.అగ్రి-టెక్ (ఇండియా) లిమిటెడ్, ప్రిమో కెమికల్స్ లిమిటెడ్, రామ్కో సిస్టమ్స్ లిమిటెడ్, భగేరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జాగ్రన్ ప్రకాశన్ లిమిటెడ్, సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, సన్ఫ్లాగ్ ఐరన్ & స్టీల్ కంపెనీ లిమిటెడ్, వింధ్య టెలిలింక్స్ లిమిటెడ్, రవీంద్ర ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 48 పాయింట్లు పెరిగి 23,462 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 197 పాయింట్లు ఎగబాకి 74,556 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.41బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 95.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.41 శాతం పెరిగింది.నాస్డాక్ 0.09 శాతం దిగజారింది.Today Nifty position 05-06-2026(time: 09:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన క్యూ-లైన్ బయోటెక్ ipo
-
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్: నష్టాల నుంచి లాభాలు!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 13.84 పాయింట్లు లేదా 0.019 శాతం లాభంతో 74,360.01 వద్ద, నిఫ్టీ 10.95 పాయింట్లు లేదా 0.047 శాతం లాభంతో 23,416.55 వద్ద నిలిచాయి.పనాసియా బయోటెక్ లిమిటెడ్, అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎంఎస్టీసీ లిమిటెడ్, రూబీ మిల్స్ లిమిటెడ్, క్వాలిటీ వాల్స్ (ఇండియా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్లోబ్ ఇంటర్నేషనల్ క్యారియర్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, షా మెటాకార్ప్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్, థాకర్ & కంపెనీ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 47 పాయింట్లు నష్టపోయి 23,362 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 151 పాయింట్లు దిగజారి 74,196 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.49బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.74 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.89 శాతం దిగజారింది.Today Nifty position 04-06-2026(time: 09:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market: ఆదుకున్న బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ పతనాలను అధిగమించి స్వల్ప నష్టాలతో ముగిశాయి. పీఎస్యూ బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ 560, సెన్సెక్స్ సూచీలు రోజు కనిష్ట స్థాయి నుండి గణనీయమైన మొత్తంలో నష్టాలను అధిగమించాయి. నిఫ్టీ 77.95 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 23,405.60 వద్ద, సెన్సెక్స్ 303.67 పాయింట్లు లేదా 0.41 శాతం క్షీణించి 74,346.17 వద్ద ముగిసింది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సెన్సెక్స్ లో టీసీఎస్, టెక్ ఎం, హెచ్ సీఎల్ టెక్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.42 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.11 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ హెల్త్ కేర్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ ఐటీ 6 శాతానికి పైగా ఇంట్రాడే నష్టంతో అత్యంత చెత్త పనితీరు కనబరిచించింది. -
920 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 249 పాయింట్లు నష్టపోయి 23,230 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 924 పాయింట్లు దిగజారి 73,731 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.24బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.13 శాతం పెరిగింది.నాస్డాక్ 0.03 శాతం పుంజుకుంది.Today Nifty position 03-06-2026(time: 09:56 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏఐ రేసులో భారత్ బేజారు
కొద్ది నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా వినిపిస్తున్న పదం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)! బుడిబుడి అడుగులేస్తూ విశ్వమంతటా వ్యాపించిన వామనుడిలా అన్ని రంగాలలోనూ ఏఐ విస్తరిస్తోంది. తొలుత సాఫ్ట్వేర్ రంగంలో విప్లవంగా అభివర్ణించిన ఏఐ ప్రస్తుతం అడుగుపెట్టని పరిశ్రమలేదంటే అతిశయోక్తికాదు!! అయితే ఏఐలో ముందడుగు వేస్తూ ఆవిష్కరణలకు తెరతీస్తున్న కంపెనీలు, దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్నాయ్.. దీంతో అటు పూర్తిగా ఏఐ లేదా ఇటు విభిన్న ఆవిష్కరణలలో బలమైన వృద్ధిని అందుకోలేక సతమతమవుతున్న భారత్ను మార్కెట్ విలువలో తైవాన్ అధిగమించింది. ఇదే సమయంలో మరోపక్క దక్షిణ కొరియా దూసుకొస్తోంది. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఏఐ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలోనూ ప్రకంపనలు రేపుతోంది. ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేసిన యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆశించినస్థాయిలో లబ్ది పొందలేదన్న అంచనాలు షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ బాటలో దేశీయంగానూ ఐటీ సేవల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో తదితర కౌంటర్లలోనూ కొద్ది రోజులుగా భారీ అమ్మకాలకు తెరలేచింది.మరోపక్క ఏఐ బూమ్తో భారీగా లబ్ధి పొందుతున్న యూఎస్ చిప్ దిగ్గజం ఎన్విడియా కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొనడంతో షేరు రోజుకో గరిష్టాన్ని తాకుతోంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఎన్విడియా కంపెనీ మార్కెట్ విలువ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్లను అధిగమించింది! వెరసి దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువను మించిపోయింది!! నెక్ టు నెక్ ఏఐ సానుకూలతలతో దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజాలు శామ్సంగ్ ఎల్రక్టానిక్స్, ఎస్కే హైనిక్స్ షేర్లు సైతం ర్యాలీ చేస్తున్నాయి. ఫలితంగా ఆ దేశ స్టాక్ మార్కెట్ విలువ సైతం వేగంగా బలపడుతోంది. 2026లో ఇప్పటివరకూ 70 శాతం జంప్చేయడంతో 4.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దీంతో భారత్ స్టాక్ మార్కెట్ విలువకు (ప్రస్తుతం 4.91 లక్షల కోట్ల డాలర్ల) చేరువైంది. మరోపక్క ఏఐ బూమ్ తైవాన్కు బాగా కలసి వస్తోంది.2026లో 50 శాతం వృద్ధి చెందడంతో తైవాన్ మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందుకు ప్రధానంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ) షేరు 50 శాతం పురోగమించడం సహకరించింది. తద్వారా మార్కెట్ విలువ ర్యాంకింగ్లో భారత్ను వెనక్కి నెట్టి ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది! దేశీయంగా నేలచూపు ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో మార్కెట్ విలువలో 28–24 శాతం మధ్య కోతపడింది. ఇదే సమయంలో ప్రధాన ఇండెక్సులు 12 శాతం క్షీణించగా.. ఐటీ ఇండెక్స్ 25 శాతం పతనమైంది. ఐటీ మిడ్క్యాప్స్లో కోఫోర్జ్, ఎల్టీఎం, పెర్సిస్టెంట్, ఎంఫసిస్ 30–22 శాతం మధ్య తిరోగమించాయి. ఇందుకు హెచ్1బీ వీసా ఫీజు భారీ పెంపు, క్లయింట్ల వ్యయాలు తగ్గడం, డీల్స్లో ఆలస్యం ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల వీటన్నిటికిమించి ఏఐ మరింత ఆందోళనలకు కారణమవుతోంది. వెరసి ఈ ఏడాది మొత్తం లిస్టెడ్ ఐటీ షేర్ల మార్కెట్ విలువలో రూ. 7,67,000 కోట్లు ఆవిరైనట్లు ఒక నివేదిక తెలియజేసింది.భారత్ సేఫ్దేశీ క్యాపిటల్ మార్కెట్ల మొత్తం విలువలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాటా 4 శాతమే. ఇక ఐటీ పరిశ్రమ విలువ సుమారు 281 బిలియన్ డాలర్లుకాగా.. మొత్తం మార్కెట్ క్యాప్లో వాటా 5–7 శాతమే. అయితే దక్షిణ కొరియా మార్కెట్ విలువలో శామ్సంగ్, ఎస్కే హైనిక్స్ 50 శాతం వాటా ఆక్రమిస్తుండగా.. తైవాన్ మార్కెట్ విలువలో టీఎస్ఎంసీ వాటానే 40 శాతం. దీంతో ఆయా దిగ్గజాల షేర్ల విలువ మొత్తం మార్కెట్ విలువను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి భారత్పై ఏ ఒక్క రంగం లేదా కంపెనీ అతిగా ప్రభావం చూపే వీలులేకపోవడం సానుకూల అంశమని తెలియజేశారు. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 382.50 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 74,649.84 వద్ద, నిఫ్టీ 100.95 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 23,483.55 వద్ద నిలిచాయి.థాకర్ & కంపెనీ లిమిటెడ్, జీనా సిఖో లైఫ్కేర్ లిమిటెడ్, జీ-టెక్ జైంక్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సుప్రియా లైఫ్సైన్స్ లిమిటెడ్, పయనీర్ ఇన్వెస్ట్కార్ప్ లిమిటెడ్, వోక్హార్డ్ లిమిటెడ్, మ్యానుగ్రాఫ్ ఇండియా లిమిటెడ్, బి&బి ట్రిపుల్వాల్ కంటైనర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 118 పాయింట్లు నష్టపోయి 23,266 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 323 పాయింట్లు దిగజారి 73,958 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.19బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 94.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.44 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.42 శాతం పుంజుకుంది.Today Nifty position 02-06-2026(time: 09:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 508.40 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో 74,267.34 వద్ద, నిఫ్టీ 165.15 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో 23,382.60 వద్ద నిలిచాయి.ఎన్ఐఐటీ లిమిటెడ్, జీ-టెక్ జైంక్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్, లంబోధర టెక్స్టైల్స్ లిమిటెడ్, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్, పశుపతి అక్రిలాన్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జీనా సిఖో లైఫ్కేర్ లిమిటెడ్, కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్, బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్, అరిహంత్ ఫౌండేషన్స్ & హౌసింగ్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 23,585 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 162 పాయింట్లు పుంజుకొని 74,937 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.22 శాతం పెరిగింది.నాస్డాక్ 0.21 శాతం పుంజుకుంది.Today Nifty position 01-06-2026(time: 09:55 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ అలర్ట్: ట్రేడింగ్ సమయంలో మార్పు
డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్–ఎఫ్అండ్ఓ) విభాగంలో ట్రేడింగ్ సమయాలను పొడిగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం 2026 ఆగస్టు 3 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో సాధారణ ట్రేడింగ్ ముగింపు సమయం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 3:40 గంటలకు మారనుంది. ప్రీ-ఓపెన్ సెషన్, మార్కెట్ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.క్యాష్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్న ‘క్లోజింగ్ ఆక్షన్ సెషన్’ (CAS)తో డెరివేటివ్స్ ట్రేడింగ్ సమయాలను సమలేఖనం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఎన్ఎస్ఈ వెల్లడించింది. కొత్త విధానంలో క్యాష్ మార్కెట్లో మధ్యాహ్నం 3:15 నుంచి 3:35 గంటల వరకు క్లోజింగ్ ఆక్షన్ నిర్వహించి, ఆ రోజు అధికారిక ముగింపు ధర (Closing Price)ను నిర్ణయించనున్నారు.ట్రేడర్లకు మరింత వెసులుబాటుక్లోజింగ్ ఆక్షన్ సమయంలో ఏర్పడే ధరల మార్పులను దృష్టిలో ఉంచుకుని, ఎఫ్అండ్ఓ ట్రేడర్లు తమ పొజిషన్లను హెడ్జ్ చేసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి లేదా ఎగ్జిట్ కావడానికి అదనంగా 10 నిమిషాల సమయం లభిస్తుంది. దీంతో క్యాష్, డెరివేటివ్స్ మార్కెట్ల మధ్య ముగింపు సమయాల్లో ఉండే వ్యత్యాసం తగ్గి, ధరల ఆవిష్కరణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.మారని అంశాలు ఇవే...ప్రీ-ఓపెన్ సెషన్ ఉదయం 9 గంటలకే ప్రారంభంరెగ్యులర్ మార్కెట్ ప్రారంభ సమయం యథాతథంట్రేడ్ మాడిఫికేషన్ సౌకర్యం సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగుతుందిఎఫ్అండ్ఓ క్లోజింగ్ ధరల లెక్కింపునకు ఉపయోగించే VWAP విండోను 3:10–3:40 గంటల మధ్య ట్రేడింగ్కు అనుగుణంగా సవరించనున్నారు.ఇటీవలి కీలక మార్పులుగత కొంతకాలంగా డెరివేటివ్స్ మార్కెట్లో ఎన్ఎస్ఈ పలు సంస్కరణలను అమలు చేస్తోంది. 2025 చివర్లో ఎఫ్అండ్ఓ విభాగంలో ప్రీ-ఓపెన్ సెషన్ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు క్లోజింగ్ ఆక్షన్ వ్యవస్థకు అనుగుణంగా ట్రేడింగ్ సమయాన్ని కూడా పొడిగిస్తోంది. మార్కెట్ పారదర్శకత, మెరుగైన ధరల నిర్ణయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవస్థను తీర్చిదిద్దడమే ఈ మార్పుల లక్ష్యంగా పేర్కొంటున్నారు. -
స్టాక్ మార్కెట్ లో కాఫీ డే షేర్లకు రెక్కలు
-
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.05 పాయింట్లు లేదా 1.44 శాతం నష్టంతో 74,775.74 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్లు లేదా 1.50 శాతం నష్టంతో 23,547.75 వద్ద నిలిచాయి.సుప్రియా లైఫ్సైన్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, వోక్హార్డ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జయకే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, లింకన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్, నాట్కో ఫార్మా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు తగ్గి 23,906 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు పెరిగి 75,948 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.02బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 91.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.58 శాతం పెరిగింది.నాస్డాక్ 0.91 శాతం పుంజుకుంది.Today Nifty position 29-05-2026(time: 09:49 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ బలహీన పనితీరుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ తగ్గాయి. నిఫ్టీ 6.55 పాయింట్లు లేదా 0.03 శాతం నష్టపోయి 23,907.15 వద్ద, సెన్సెక్స్ 141.90 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టపోయి 75,867.80 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.42 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.15 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు తగ్గి 23,886 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 149 పాయింట్లు నష్టపోయి 75,838 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.11బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం పెరిగింది.నాస్డాక్ 1.19 శాతం పుంజుకుంది.Today Nifty position 27-05-2026(time: 09:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత్ను అధిగమించిన తైవాన్!
గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కంటే తక్కువ జనాభా కలిగిన తైవాన్, భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా నిలిచింది. తైవాన్ మార్కెట్ విలువ సుమారు 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు బ్లూమ్బెర్గ్ డేటా వెల్లడించింది.తైవాన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అనే చిప్ తయారీ సంస్థ భారీ వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది 49% వరకు పెరగడం వల్ల తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది.టీఎస్ఎంసీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థగా.. ఎన్విడియా, ఆపిల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్, క్వాల్కామ్ ఉపయోగించే అధునాతన చిప్లను తయారు చేసి సరఫరా చేస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు ఏఐ, సెమీకండక్టర్ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ.. తైవాన్ మార్కెట్లోకి పెద్ద మొత్తంలో నిధులు తరలిస్తున్నారు. ఫలితంగా తైవాన్ మార్కెట్ వేగంగా ఎదిగింది.అయితే.. ప్రస్తుతం భారత్ పరిస్థితి భిన్నంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, రూపాయి విలువ తగ్గడం, కార్పొరేట్ లాభాల మందగింపు వంటి కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు.. భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు. అంతే కాకుండా గ్లోబల్ ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో భారత్కు ఇంకా పెద్ద స్థాయిలో లిస్టెడ్ కంపెనీలు లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.భారతదేశానికి పెద్ద ఆర్థిక వ్యవస్థ, 140 కోట్లకుపైగా జనాభా, వేల సంఖ్యలో లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ ఎక్కువగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెట్లవైపు వెళ్తోంది. కానీ ఇప్పుడు తైవాన్.. భారత్ను అధిగమించడం అనేది ఇండియాకు పెద్ద నష్టం కాదు. ఈ సమయంలో కూడా దేశీయ పెట్టుబడిదారుల బలం, SIPలు, రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో భారత మార్కెట్ స్థిరంగా కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. -
బక్రీద్పై కన్ఫ్యూజన్.. మే 28న స్టాక్ మార్కెట్లకు సెలవా?
భారతదేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్లైన.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు 2026 మే 28, గురువారం రోజున బక్రీద్ పండుగ సందర్భంగా మూతపడనున్నాయి. కాబట్టి.. స్టాక్ మార్కెట్లలో అన్ని ప్రధాన ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.ఎన్ఎస్ఈ విడుదల చేసిన అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం.. బక్రీద్ రోజు ఈక్విటీ ట్రేడింగ్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) వంటి విభాగాలలో ట్రేడింగ్ ఉండే అవకాశం లేదు. అందువల్ల పెట్టుబడిదారులు ఆ రోజున షేర్ల కొనుగోలు లేదా అమ్మకాలు చేయలేరు.అయితే.. ఈసారి బక్రీద్ సెలవు మే 27న ఉంటుందా?, లేదా మే 28న ఉంటుందా? అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొన్ని రాష్ట్రాలు, సంస్థలు మొదట మే 27ను పరిగణించినప్పటికీ.. ఎక్కువ శాతం ఆర్థిక సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లు మే 28నే అధికారిక సెలవు రోజుగా ప్రకటించాయి. దీంతో పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ ప్రణాళికలను దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.అదేవిధంగా.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా మే 28 ఉదయం సెషన్ మూతపడనుంది. అయితే.. సాయంత్రం సెషన్లో కమోడిటీ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే.. బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ వంటి వస్తువుల ట్రేడింగ్ సాయంత్రం తర్వాత కొనసాగుతుందన్నమాట.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక! -
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 479.26 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 76,009.70 వద్ద, నిఫ్టీ 118.00 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 23,913.70 వద్ద నిలిచాయి.ఇండో రామా సింథటిక్స్ (ఇండియా) లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఆగ్రో ఫోస్ ఇండియా లిమిటెడ్, ప్రతాప్ స్నాక్స్ లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టెక్నో ఎలక్ట్రిక్ & ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, గాంధీ స్పెషల్ ట్యూబ్స్ లిమిటెడ్, డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్, అజ్మేరా రియల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు తగ్గి 24,023 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 44 పాయింట్లు నష్టపోయి 76,451 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం పెరిగింది.నాస్డాక్ 0.19 శాతం పుంజుకుంది.Today Nifty position 26-05-2026(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం లాభల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,073.61 పాయింట్లు లేదా 1.42 శాతం లాభంతో 76,488.96 వద్ద, నిఫ్టీ 312.40 పాయింట్లు లేదా 1.32 శాతం లాభంతో 24,031.70 వద్ద నిలిచాయి.సుందరం బ్రేక్ లైనింగ్ లిమిటెడ్, రూబీ మిల్స్ లిమిటెడ్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, థాకర్ & కంపెనీ లిమిటెడ్ వంటివి లాభాలను పొందాయి. సూర్య రోష్ని లిమిటెడ్, సాన్స్టార్ లిమిటెడ్, ఎక్సెల్సాఫ్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


