breaking news
Stock Market
-
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 693.86 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 81,306.85 వద్ద, నిఫ్టీ 213.65 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 24,870.10 వద్ద నిలిచాయి.కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం, చెంబాండ్ కెమికల్స్ లిమిటెడ్, ఏజెడ్ఎమ్ఓ లిమిటెడ్, ఫోసెకో ఇండియా, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, వండర్ ఎలక్ట్రికల్స్, ఫోర్స్ మోటార్స్, వింటా ల్యాబ్స్, డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
250 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు తగ్గి 25,003కు చేరింది. సెన్సెక్స్(Sensex) 255 ప్లాయింట్లు దిగజారి 81,747 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 142.87 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో.. 82,000.71 వద్ద, నిఫ్టీ 33.20 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,083.75 వద్ద నిలిచాయి.ఇజ్మో లిమిటెడ్, డీపీ వైర్స్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, NAVA, బీఎఫ్ యుటిలిటీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. యూవై ఫిన్కార్ప్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హింద్ రెక్టిఫైయర్స్, బీఎస్ఈ లిమిటెడ్, మాస్టర్ ట్రస్ట్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుసగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్లో లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గడిచిన ఐదు సెషన్ల నుంచి మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,079కు చేరింది. సెన్సెక్స్(Sensex) 129 ప్లాయింట్లు పుంజుకుని 81,991 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐదో రోజూ అదే జోరు
ముంబై: ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించడంతో స్టాక్ సూచీలు ఐదో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 213 పాయింట్లు పెరిగి 81,858 వద్ద నిలిచింది. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 25,051 వద్ద స్థిరపడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 341 పాయింట్లు పెరిగి 81,985 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 25,089 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో ఐటీ 3%, టెక్ 2.22%, ఎఫ్ఎంసీజీ 1.36%, రియల్టి, టెలికమ్యూనికేషన్ 0.68% రాణించాయి. మిడ్, స్మా ల్ క్యాప్ సూచీలు 0.39%, 0.30% పెరిగాయి. బ్యాంకులు, చమురు, ఫైనాన్స్ సర్విసెస్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ⇒ ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. రియల్ మనీ గేమింగ్ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధం లేదంటూ కంపెనీ వివరణ ఇచ్చినప్పట్టకీ.., నజరా టెక్నాలజీస్ షేరు 13% పతనమై రూ.1,222 వద్ద స్థిరపడింది. ఆన్మొబైల్ గ్లోబల్స్ షేరు 3.53% నష్టపోయి రూ.53.27 వద్ద నిలిచింది. ⇒ రీగల్ రిసోర్సెస్ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.102)తో పోలిస్తే 39% ప్రీమియంతో రూ.142 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 43% ఎగసి రూ.146 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29% లాభంతో రూ.132 వద్ద ముగిసింది. కంపెనీ మార్కె ట్ విలువ రూ.1,352 కోట్లుగా నమోదైంది. -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. నిఫ్టీ మళ్లీ 25000 మార్క్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు నెల రోజుల విరామం తర్వాత 25,000 మార్కును తిరిగి పొందగలిగింది. ఈ సూచీ చివరిసారిగా జూలై 24న 25,000 మార్క్ పైన ముగిసింది. నేడు ఐటీ షేర్లలో బలమైన లాభాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి 25,089కు ఎగబాకి, చివరకు 70 పాయింట్లు లేదా 0.3 శాతం లాభంతో 25,050 స్థాయిల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలోనే నిఫ్టీ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో 563 పాయింట్లు లాభపడింది.బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు (0.3 శాతం) లాభపడి 81,858 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ దాదాపు 4 శాతం లాభపడి రూ.1,495 స్థాయికి చేరుకోగా, ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే 165 పాయింట్లు లాభపడింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కూడా 1-3 శాతం మధ్య లాభాల్లో ముగిశాయి. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటివరకు దీర్ఘకాలంగా పనితీరు కనబరచకపోవడంతో విలువ కొనుగోళ్లు లాభపడటానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.బీఎస్ఈ సెన్సెక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) 2 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ కూడా 1 శాతానికి పైగా క్షీణించాయి. విస్తృత సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్క్యాప్ 0.3 శాతం పెరిగాయి.రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2.6 శాతం, రియల్టీ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 1,718 షేర్లు క్షీణించగా, 2,347 షేర్లు లాభపడ్డాయి. అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ)ను నిషేధించే ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించడంతో వ్యక్తిగత షేర్లలో నజారా టెక్నాలజీస్ 13 శాతం నష్టపోయింది. -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గత రెండు రోజులుగా పుంజుకున్న మార్కెట్లు ఈ రోజు నష్టపోయాయి. ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 24,933కు చేరింది. సెన్సెక్స్(Sensex) 130 ప్లాయింట్లు నష్టపోయి 81,510 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగోరోజూ రయ్..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో జీఎస్టీ సంస్కరణల ఆశావహ దృక్పథం కొనసాగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు నాలుగోరోజూ లాభాలు గడించాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ (3%), టాటా మోటార్స్ (3.5%), ఎయిర్టెల్ (2.75%) షేర్లు రాణించి సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 371 పాయింట్లు పెరిగి 81,644 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 24,980 వద్ద నిలిచింది. ⇒ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్స్టైల్ షేరు లిస్టింగ్లో గట్టెక్కింది. ఇష్యూ ధర (రూ.517)తో పోలిస్తే బీఎస్ఈలో 1.58% డిస్కౌంట్తో రూ.509 వద్ద లిస్టయ్యింది. అయితే ఇంట్రాడేలో 9% ఎగసి రూ.564 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 6% లాభంతో రూ.546 వద్ద ముగిసింది.⇒ ట్రంప్ టారిఫ్ విధింపుతో టెక్స్టైల్ రంగంలో వచ్చే నష్టాలు భర్తీ చేసేందుకు కేంద్రం పత్తి దిగుమతులపై ఉన్న 11% కస్టమ్స్ డ్యూటీని తాత్కలింగా తొలగించింది. దీంతో టెక్స్టైల్ షేర్లు వర్ధమాన్ టెక్స్టైల్స్ 9%, రేమాండ్ లైఫ్స్టైల్ 8%, వెల్స్పన్ లివింగ్ 6%, అరవింద్ లిమిటెడ్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ 3% లాభపడ్డాయి.⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 87.13 వద్ద ముగిసింది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 370.64 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 81,644.39 వద్ద, నిఫ్టీ 103.70 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 24,980.65 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్ఎల్ఈ గ్లాస్కోట్, కేఐఓసీఎల్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, వర్ధమాన్ పాలిటెక్స్, భారత్ గేర్స్ వంటి కంపెనీలు చేరాయి. నిట్కో, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్డిజి టెక్, రెలియబుల్ డేటా సర్వీసెస్, SP అప్పారల్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 24,905కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 ప్లాయింట్లు పుంజుకుని 81,417 వద్ద ట్రేడవుతోంది.రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 676.09 పాయింట్లు లేదా 0.84 శాతం లాభంతో 81,273.75 వద్ద, నిఫ్టీ 245.65 పాయింట్లు లేదా 1.00 శాతం లాభంతో 24,876.95 వద్ద నిలిచాయి.పెన్నార్ ఇండస్ట్రీస్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, IFB ఇండస్ట్రీస్, సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, రవీందర్ హైట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీతి ఇంటర్నేషనల్, అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్, NDL వెంచర్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
-
1,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 339 పాయింట్లు పెరిగి 24,941కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1037 ప్లాయింట్లు పుంజుకుని 81,635 వద్ద ట్రేడవుతోంది.రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జీఎస్టీ సంస్కరణలే దిక్సూచి
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీపావళికల్లా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో భారీ సంస్కరణలకు తెరతీయనున్నట్లు ప్రకటించడం దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోపక్క గత వారం ఎస్అండ్పీ రెండు దశాబ్దాల తదుపరి దేశ సావరిన్ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే ఉక్రెయిన్, తదితర అంశాలపై ట్రంప్, పుతిన్ సమావేశం ఎటూ తేల్చకపోవడంతో అంతర్లీనంగా అనిశ్చితి సైతం కనిపించనున్నట్లు విశ్లేషించారు. వివరాలు చూద్దాం... రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ పేర్కొనడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. దీంతో స్టాక్ మార్కెట్లో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. సరైన సమయంలో జీఎస్టీ 2.0కు తెరతీయనుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభించనున్నట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్త వాణిజ్య ఆందోళనల మధ్య ఇవి కేవలం విధానపరమైన మార్పులు కాదని, అత్యంత ఆవశ్యకమైన నిర్మాణాత్మక సంస్కరణలని పేర్కొన్నారు. జీఎస్టీలో సంస్కరణల కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు పరిష్కారంకావడంతోపాటు.. పోటీ ప్రపంచంలో ఎగుమతులకు దన్ను లభించనున్నట్లు వివరించారు. జెలెన్స్కీతో ట్రంప్ భేటీ కీలకం..కొన్ని నెలలుగా రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో గత వారాంతాన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ సమావేశమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. అయితే సమావేశ వివరాలు వెల్లడికానప్పటికీ.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ట్రంప్ భేటీపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 25 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. అయితే ముందు ప్రకటించినట్లు ఈ నెల 27నుంచి కొత్త టారిఫ్లు అమలుకాకపోవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లలో సానుకూలతకు దోహదపడే వీలున్నట్లు అంచనా వేశారు. ఫెడ్ మినిట్స్ ఈ వారం యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెల్లడికానున్నాయి. ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకే ఫెడ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోపక్క చైనా కేంద్ర బ్యాంకు 1–5 ఏళ్ల కాలావధి రుణాలపై వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఇవికాకుండా యూఎస్ హౌసింగ్ గణాంకాలు తదితరాలు వెలువడనున్నాయి. దేశీయంగా హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసుల పీఎంఐ ఇండెక్స్లను ప్రకటించనున్నారు. వీటితోపాటు.. దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరు మారకం, ముడిచమురు ధరలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. వెరసి కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న మార్కెట్లు ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.రేటింగ్ ఎఫెక్ట్ గత వారం రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ సుమారు 18 ఏళ్ల తరువాత దేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను అప్గ్రేడ్ చేసింది. స్థిరత్వంతోకూడిన ఔట్లుక్తో బీబీబీ రేటింగ్ను ప్రకటించింది. పటిష్ట ఆర్థిక పురోభివృద్ధి, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వ కట్టుబాటు, ద్రవ్యోల్బణ అదుపునకు ఆర్బీఐ అనుసరిస్తున్న సానుకూల పరపతి విధానాలు ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు ఎస్అండ్పీ వివరించింది. వెరసి ఇన్వెస్టర్లకు జోష్ లభించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు.గత వారమిలా.. నాలుగు రోజులకే పరిమితమైన గత వారం(11–14) ట్రేడింగ్లో ఎట్టకేలకు 6 వారాల వరుస నష్టాలకు చెక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు(0.9 శాతం) పుంజుకుని 80,598 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 268 పాయింట్లు(1.1 శాతం) ఎగసి 24,631 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం చొప్పున క్షీణించాయి.సాంకేతికంగా చూస్తే.. ఆరు వారాల తదుపరి మార్కెట్లు గత వారం సానుకూలంగా ముగిసినప్పటికీ నష్టాల నుంచి బయటపడిన సంకేతాలు పూర్తిగా వెలువడనట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మరో రెండు వారాలు కన్సాలిడేషన్ కొనసాగవచ్చని అంచనా వేశారు. వీరి విశ్లేషణ ప్రకారం ఈ వారం మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి సాంకేతికంగా తొలుత 24,450 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. ఇలాకాకుండా 24,700ను దాటి బలపడితే.. 24,800 వద్ద, 25,000 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. అమ్మకాలు అధికమై 24,450 దిగువకు చేరితే 24,000 సమీపానికి చేరే అవకాశముంది.ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ఈ నెలలో రూ. 21,000 కోట్లు వెనక్కి ఇటీవల దేశీ స్టాక్స్లో నిరవధిక విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–14) రూ. 21,000 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. యూఎస్ వాణిజ్య సుంకాల భారం, తొలి త్రైమాసిక ఫలితాల నిరుత్సాహం, రూపాయి బలహీనత ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీల నుంచి రూ. 1.16 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జూలైలోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. మార్చి– జూన్మధ్య కాలంలో రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్టాక్ మార్కెట్లో కొత్త ఇండెక్స్
బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ విభాగం తాజాగా డిఫెన్స్ ఇండెక్స్ను ప్రారంభించింది. బీఎస్ఈ 1000 ఇండెక్స్లోని డిఫెన్స్ థీమ్ స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్లో) ఇండెక్స్లో మార్పులు, చేర్పులు చేస్తారు. విధాన సంస్కరణలు, పెరుగుతున్న బడ్జెట్ కేటాయింపులు, దేశీయంగా తయారీపై మరింతగా దృష్టి పెరుగుతుండటం తదితర సానుకూల అంశాలతో డిఫెన్స్ రంగం గణనీయంగా వృద్ధి చెందనుందని బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ వివరించింది.ఈ నేపథ్యంలో ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్ మొదలైన ప్యాసివ్ ఫండ్స్కి ఇండెక్స్ ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. అలాగే, పీఎంఎస్ వ్యూహాలు, మ్యుచువల్ ఫండ్ స్కీములు, ఫండ్ పోర్ట్ఫోలియోల పనితీరు మదింపునకు దీన్ని ప్రామాణికంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. -
స్టాక్ మార్కెట్ ఈరోజుకి ఫ్లాట్.. రేపటి నుంచి సెలవులు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ఫ్లాట్ గా ముగిశాయి. వీక్లీ నిఫ్టీ 50 ఆప్షన్ల గడువు ముగియడంతో బెంచ్ మార్క్ సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11.95 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 24,631.30 వద్ద ముగిసింది.మరోవైపు సెన్సెక్స్ 261 పాయింట్ల స్వల్ప రేంజ్లో కదలాడింది. బీఎస్ఈ బెంచ్మార్క్ 80,751.18 వద్ద గరిష్టాన్ని, 80,489.86 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 0.07 శాతం లేదా 57.75 పాయింట్లు పెరిగి 80,597.66 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలవగా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో విప్రో, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలవగా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.31 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.38 శాతం నష్టపోయింది. రంగాలవారీగా పనితీరు మిశ్రమంగా ఉంది. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (0.75 శాతం), నిఫ్టీ ఐటీ (0.4 శాతం) టాప్ గెయినర్స్గా నిలిచాయి. మెటల్, రియల్టీ వరుసగా 1.39 శాతం, 0.76 శాతం నష్టపోయాయి.కాగా ఈవారం ట్రేడింగ్ సెషన్ ఈరోజుతో ముగసింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న శుక్రవారం భారత మార్కెట్లకు సెలవు ఉంటుంది. తదుపరి మార్కెట్ సెషన్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. -
స్టాక్ మార్కెట్లో నిండా మునిగాడు.. ఇప్పుడు రూ.2.4 కోట్ల వేతనం!
జీవితమంటేనే కష్టాలు, కన్నీళ్లు. వీటికి భయపడకుండా పట్టుదలతో కృషి చేస్తేనే.. సక్సెస్ సాధ్యమవుతుంది. దీనిని నిరూపించినవాళ్ల గురించి గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఇదేకోవకు చెందిన మరో వ్యక్తి గురించి.. అతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.2008లో ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి స్టాక్ మార్కెట్లో సర్వసం కోల్పోయాడు. కానీ కొడుకు దశాబ్దానిపైగా కృషి చేసి.. కెరీర్ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఏడాదికి రూ. 2.4 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఢిల్లీలో మధ్య తరగతిలో పుట్టి పెరిగిన ఆ వ్యక్తి (కొడుకు).. ప్రారంభ జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే 2008లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చదువుకునే రోజుల్లోనే.. పాఠశాలలో నాటకాలు, డ్యాన్స్ ఇతర కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్లో సైన్స్ ఎంచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.చదువు పూర్తయిన తరువాత 2014లో నెలకు రూ. 35,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 2016లో తన స్నేహితురాలికి దగ్గరగా ఉండాలని ఉద్యోగం మారాడు. అప్పుడు అతని జీతం రూ. 60,000లకు పెరిగింది. 2017లో మరొక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం రూ. 90,000లకు చేరింది. ఐదేళ్లు అదే కంపెనీలు ఉంటూ.. 2021 నాటికి నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఇదీ చదవండి: వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!2022లో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆఫర్ వచ్చింది. అక్కడ అతని వార్షిక వేతనం 202000 డాలర్లు (రూ.1.7 కోట్ల కంటే ఎక్కువ). 2025 నాటికి అతని వేతనం రూ. 2.4 కోట్ల కంటే ఎక్కువ అయింది. కేవలం రూ. 35000 జీతంతో మొదలైన వ్యక్తి.. రూ.2.4 కోట్ల వేతనం వరకు ఎదిగాడంటే.. దాని వెనుక అతని శ్రమ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఉద్యోగం చేసే సమయంలో.. జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. మొత్తం నాలుగు ఖండాల్లో 17 దేశాలు ప్రయాణించాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణించిన ఇతడు.. లగ్జరీ విమానాలలో ప్రయాణించే వరకు ఎదిగాడు. డబ్బు ఒక నిర్దిష్ట స్థాయి వరకు ముఖ్యమైనదని, కానీ దానికి మించి, ఆరోగ్యం, సంబంధాలు, అనుభవాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వ్యక్తి చెబుతాడు. జీవితంలో ఏ దశలోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని పేర్కొన్నారు. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు పెరిగి 24,641కు చేరింది. సెన్సెక్స్(Sensex) 68 ప్లాయింట్లు పుంజుకుని 80,611 వద్ద ట్రేడవుతోంది.> రేపు ఆగస్టు 15 రోజున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలు పని చేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 304.32 పాయింట్లు లేదా 00.38 శాతం పెరిగి 80,539.91 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 131.95 పాయింట్లు లేదా 0.54 శాతం పెరిగి 24,619.35 వద్ద ముగిసింది.బీఎస్ఈలో బీఈఎల్, ఎటర్నల్, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు గ్రీన్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.63 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.66 శాతం లాభపడింది. రంగాలవారీగా పనితీరు మిశ్రమంగా ఉంది. నిఫ్టీ హెల్త్కేర్ 2.13 శాతం, ఫార్మా 1.73 శాతం, మెటల్ 1.26 శాతం, ఆటో 1.12 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 0.04 శాతం, 0.14 శాతం, 0.05 శాతం నష్టపోయాయి. -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు పెరిగి 24,546కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 ప్లాయింట్లు పుంజుకుని 80,392 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలు
ముంబై: అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం మేర నష్టపోయాయి. భారత్, అమెరికాల జూలై రిటైల్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 368 పాయింట్లు నష్టపోయి 80,235 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పతనమై 24,487 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 833 పాయింట్ల పరిధిలో 80,164 వద్ద కనిష్టాన్ని, 80,998 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 24,465 – 24,702 శ్రేణిలో ట్రేడైంది. చైనాతో వాణిజ్య ఒప్పందానికి అమెరికా మరో 90 రోజుల విరామం, యూఎస్ జూలై ద్రవ్యోల్బణ ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. ఇష్యూ ధర (రూ.70)తో పోలిస్తే బీఎస్ఈలో 67% ప్రీమియంతో రూ.117 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 75% ఎగసి రూ.123 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి., అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.881 కోట్లుగా నమోదైంది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 368.48 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో.. 80,235.59 వద్ద, నిఫ్టీ 97.65 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో.. 24,487.40 వద్ద నిలిచింది.టాప్ గెయినర్స్ జాబితాలో.. యాత్ర ఆన్లైన్, డబ్ల్యుఎస్ ఇండస్ట్రీస్, NDL వెంచర్స్, రికో ఆటో, సోనాటా సాఫ్ట్వేర్ కంపెనీలు చేరాయి. మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా), మార్క్సాన్స్ ఫార్మా, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), పిక్స్ ట్రాన్స్మిషన్స్, ఆస్ట్రల్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు పెరిగి 24,645కు చేరింది. సెన్సెక్స్(Sensex) 203 ప్లాయింట్లు పుంజుకుని 80,802 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 746.29 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 80,604.08 వద్ద, నిఫ్టీ 198.85 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,562.15 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో సీఎల్ ఎడ్యుకేట్, యాత్ర ఆన్లైన్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎన్డీఎల్ వెంచర్స్, ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ వంటి కంపెనీలు చేరాగా.. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఫేజ్ త్రీ, ఆరోన్ ఇండస్ట్రీస్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, బెస్ట్ ఆగ్రోలైఫ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 45 పాయింట్లు పెరిగి 24,414కు చేరింది. సెన్సెక్స్(Sensex) 145 ప్లాయింట్లు పుంజుకుని 80,005 వద్ద ట్రేడవుతోంది.భారత్ దిగుమతులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో ఎగుమతి సంబంధ రంగాలపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫార్మాపైనా వడ్డింపులు తప్పవన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఔషధ రంగంతోపాటు.. లెదర్, కెమికల్స్, ఫుట్వేర్, ఆక్వా, ఐటీ, టెక్స్టైల్స్ ప్రభావితంకానున్నట్లు పేర్కొన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..
కోర్టు సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే '1929 నాటి మహా మాంద్యం' వస్తుందని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం హెచ్చరించారు. ఇంతకీ ఈ మహా మాంద్యం ఏమిటి?, దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనే.. విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.1929 నాటి మహా మాంద్యం1929 నాటి మహా మాంద్యం.. 20వ శతాబ్దంలోని అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యంగా చరిత్రలో నిలిచింది. ఇది 1929లో ప్రారంభమై సుమారు 1939 వరకు ప్రభావం చూపింది. ఈ మాంద్యం మొదట అమెరికాలో 1929 అక్టోబర్ 24 నాటి స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైంది. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపింది.1929 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలుస్టాక్ మార్కెట్ పతనంస్టాక్ ధరలు పెరుగుతుండటం, వాటిపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న ప్రజలు స్టాక్లను కొనుగోలు చేశారు. చాలామంది అప్పు తెచ్చుకున్న డబ్బుతో కూడా స్టాక్ కొనేశారు. ఇలా పెద్దఎత్తున స్టాక్లు అమ్ముడవడం వల్ల మార్కెట్ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది.బ్యాంకులు మూతపడటంప్రజలు తమ డబ్బును బ్యాంకుల నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది బ్యాంకులు మూతపడటానికి కారణమైంది. వేలాది బ్యాంకులు క్లోజ్ అవ్వడంతో.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ప్రభుత్వ జోక్యం కూడా తగ్గిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడటం ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమైంది.అధిక ఉత్పత్తి, తక్కువ డిమాండ్రైతులు మార్కెట్ అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేశారు. పారిశ్రామిక రంగం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకుండా పోయింది. ఇది ధరలు తగ్గడానికి మాత్రమే కాకుండా.. అప్పులు పెరగడానికి కూడా కారణమైంది. ఇది ఆర్ధిక వ్యవస్థను మరింత దిగజారేలా చేసింది.ప్రపంచ వాణిజ్య పతనంస్మూట్ హాలీ టారిఫ్ చట్టం (1930) వల్ల అమెరికా దిగుమతులపై అధిక పన్నులు విధించడం జరిగింది. ఇది ఇతర దేశాల నుంచి ప్రతీకార సుంకాలను సైతం పెంచింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం క్షిణించింది. ప్రపంచ మాంద్యం తీవ్రతరం అయింది.ప్రజలపై ప్రభావం1929 నాటి మహా మాంద్యం కారణంగా అమెరికాలో నిరుద్యోగం రేటు 25% దాటింది. లక్షలాది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది ఇళ్లను కూడా వదిలి బయటకు వలసలు వెళ్లి, నిరాశ్రయులయ్యారు. -
దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం
టారిఫ్ ప్రతిష్టంభన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తో వాణిజ్య చర్చలను తోసిపుచ్చడంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 765.47 పాయింట్లు (0.95 శాతం) క్షీణించి 79,857.79 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 232.85 పాయింట్లు లేదా 0.95 శాతం తగ్గి 24,363.30 వద్ద ముగిసింది.ఈ క్రమంలో ఈ వారం సెన్సెక్స్ 742 పాయింట్లు, నిఫ్టీ 202 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, ట్రెంట్ టాప్ గెయినర్స్గా నిలవగా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.64 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 1.49 శాతం నష్టపోయింది. అన్ని రంగాలు నెగిటివ్ జోన్లో ముగిశాయి. నిఫ్టీ రియల్టీ 2.11 శాతం, నిఫ్టీ మెటల్ 1.76 శాతం, ఆటో 1.40 శాతం, ఫార్మా 1.30 శాతం నష్టపోయాయి. -
250 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 65 పాయింట్లు తగ్గి 24,529కు చేరింది. సెన్సెక్స్(Sensex) 256 ప్లాయింట్లు నష్టపోయి 80,367 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ఐటీ, ఫార్మా స్టాక్స్ నేతృత్వంలో భారత్ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ రికవరీని సాధించాయి. సెన్సెక్స్ 811.97 పాయింట్లు పుంజుకుని రోజు కనిష్ట స్థాయి (79,811.29) నుంచి 80,623.26 వద్ద (0.10 శాతం లేదా 79.27 పాయింట్లు) ముగిసింది. నిఫ్టీ కూడా 252 పాయింట్లు పుంజుకుని 24,344.15 పాయింట్ల వద్ద (21.95 పాయింట్లు లేదా 0.09 శాతం) 24,596.15 వద్ద ముగిసింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. గత వారం భారత దిగుమతులపై సంతకం చేసిన 25 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా ప్రకటించిన టారిఫ్ లు 21 రోజుల నోటీసు పీరియడ్ తర్వాత ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.బీఎస్ఈలో టెక్ మహీంద్రా, ఎటర్నల్ (జొమాటో), హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా కోలుకుని పాజిటివ్ గా ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.17 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా 0.75 శాతం, ఐటీ 0.87 శాతం, మీడియా 0.99 శాతం, ఆటో 0.25 శాతం, పీఎస్ యూ బ్యాంక్ 0.29 శాతం, మెటల్ 0.13 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 0.13 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.19 శాతం చొప్పున నష్టపోయాయి. -
ట్రంప్ టారిఫ్లు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు తగ్గి 24,501కు చేరింది. సెన్సెక్స్(Sensex) 253 ప్లాయింట్లు నష్టపోయి 80,288 వద్ద ట్రేడవుతోంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరోసారి 25 శాతం సుంకాలను ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 24,656కు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 ప్లాయింట్లు పుంజుకొని 80,783 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వెంటాడిన టారిఫ్ భయాలు
ముంబై: రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పాలసీ ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకులు, చమురు షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించకలేపోతున్నాయి.ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 308 పాయింట్లు నష్టపోయి 80,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు పతనమై 24,650 వద్ద నిలిచింది.⇒ తొలి త్రైమాసిక నికర లాభం 56% వృద్ధి నమోదుతో గాడ్ఫ్రై ఫిలిప్స్ షేరుకు డిమాండ్ లభించింది. బీఎస్ఈలో 10% పెరిగి రూ.9887 వద్ద లోయర్ సర్క్యూట్ తాకి అక్కడే ముగిసింది.జీవితకాల కనిష్టాన్ని తాకిన రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు నష్టపోయి 87.88 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2025 ఫిబ్రవరి 10 నాటి జీవితకాల కనిష్టం 87.95 స్థాయిని తాకింది. రష్యన్ చమురు కొనుగోలు కారణంగా భారత్పై సుంకాలను మరింత పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మన కరెన్సీ కోతకు ప్రధాన కారణంగా నిలిచాయి. దేశీ స్టాక్ మార్కెట్ పతనం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచింది.ఆదిత్య ఇన్ఫోటెక్ అరంగేట్రం అదుర్స్ సీపీ ప్లస్ బ్రాండ్ కింద నిఘా పరికరాలను విక్రయించే ఆదిత్య ఇన్ఫోటెక్ షేరు ఎక్సే్చంజీల్లోకి అదిరిపోయే అరంగేట్రం చేసింది. ఇష్యూ ధర(రూ.675)తో పోలిస్తే బీఎస్ఈలో 51% ప్రీమియంతో రూ.1,018 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 64% ఎగసి రూ.1,104 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 61% లాభంతో రూ.1,084 వద్ద ముగిసింది. లక్ష్మి ఇండియా ఫైనాన్స్ నిరాశఎన్బీఎఫ్సీ లక్ష్మి ఇండియా ఫైనాన్స్ లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.158)తో పోలిస్తే బీఎస్ఈలో 14 శాతం డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 16 శాతం క్షీణించి రూ.133 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 15% నష్టంతో రూ.134 వద్ద నిలిచింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 308.47 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో.. 80,710.25 వద్ద, నిఫ్టీ 73.20 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో 24,649.55 వద్ద నిలిచాయి.ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్, తాన్లా ప్లాట్ఫారమ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్, త్రివేణి టర్బైన్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, శీతల్ కూల్ ప్రొడక్ట్స్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
300 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 77 పాయింట్లు నష్టపోయి 24,643కు చేరింది. సెన్సెక్స్(Sensex) 302 ప్లాయింట్లు దిగజారి 80,707 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 199.77 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో.. 80,799.68 వద్ద, నిఫ్టీ 71.85 పాయింట్లు లేదా 0.29 శాతం లాభంతో.. 24,637.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్, మీర్జా ఇంటర్నేషనల్, సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్, ఆర్ఫిన్ ఇండియా, కాప్స్టన్ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ZIM లాబొరేటరీస్, PSP ప్రాజెక్ట్స్, కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్, AMJ ల్యాండ్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
Stock market: భారీ నష్టాలు.. నెత్తురు కక్కిన ఫార్మా షేర్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. వివిధ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల నేపథ్యంలో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను ప్రతికూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 585.67 పాయింట్లు (0.72 శాతం) క్షీణించి 80,599.91 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 81,317.51 -80,495.57 శ్రేణిలో ట్రేడ్ అయింది.ఇక 24,784.15 -24,535.05 రేంజ్లో కదలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 203 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 24,565.35 వద్ద స్థిరపడింది. ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్ 4.43 నుంచి 2.41 శాతం మధ్య నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.33 శాతం, 1.66 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లో టాప్లో ఉండి 3.33 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లో అరబిందో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా వరుసగా 5.17 శాతం, 4.89 శాతం నష్టపోయాయి. అస్థిరత సూచీ, ఇండియా (విఐఎక్స్) 3.74 శాతం పెరిగి 11.98 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
స్టాక్ మార్కెట్ సూచీలు నేలచూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు నష్టపోయి 24,713కు చేరింది. సెన్సెక్స్(Sensex) 169 ప్లాయింట్లు దిగజారి 81,001 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు గురువారం అస్థిర సెషన్ లో ప్రతికూలంగా ముగిశాయి. సెన్సెక్స్ 296.28 పాయింట్లు (0.36 శాతం) క్షీణించి 81,185.58 వద్ద స్థిరపడింది. గురువారం ఈ సూచీ 81,803.27 నుంచి 80,695.15 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 86.70 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 24,768.35 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.70-1.34 శాతం రేంజ్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ షేర్లు 3.61 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.05 శాతం, 0.93 శాతం నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మార్కెట్ ధోరణులను అధిగమించి ఇమామీ, హిందుస్థాన్ యూనిలీవర్ నేతృత్వంలో 1.44 శాతం లాభాలతో స్థిరపడింది. నిఫ్టీ ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ సూచీలు 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,153 షేర్లలో 2,418 రెడ్లో, 1,598 గ్రీన్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. -
200 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 11:39 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు నష్టపోయి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 219 ప్లాయింట్లు దిగజారి 81,261 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈలో ఇన్వెస్టర్ ఖాతాలు 23 కోట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ఖాతాల సంఖ్య జూలైలో 23 కోట్ల స్థాయిని దాటింది. అకౌంట్ల సంఖ్య ఏప్రిల్లో 22 కోట్ల మార్కును దాటగా కేవలం మూడు నెలల్లోనే మరో 1 కోటి అకౌంట్లు జతయ్యాయి. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 4 కోట్ల ఖాతాలు (మొత్తం అకౌంట్లలో 17 శాతం) ఉండగా, తర్వాత స్థానాల్లో ఉత్తర్ప్రదేశ్ (2.5 కోట్లు, 11 శాతం వాటా), గుజరాత్ (2 కోట్లకు పైగా, 9 శాతం వాటా), పశ్చిమ బెంగాల్..రాజస్థాన్ (చెరి 1.3 కోట్లు, 6 శాతం వాటా) ఉన్నాయి. మొత్తం ఇన్వెస్టర్ అకౌంట్లలో దాదాపు సగ భాగం వాటా ఈ అయిదు రాష్ట్రాలదే ఉంది. టాప్ 10 రాష్ట్రాల వాటా నాలుగింట మూడొంతులు ఉందని ఎన్ఎస్ఈ వెల్లడించింది. విశిష్ట ఖాతాదారుల సంఖ్య 11.8 కోట్లుగా ఉంది. సాధారణంగా ఒకే ఇన్వెస్టరు పలు బ్రోకరేజీ సంస్థల్లో అకౌంట్లు తీసుకోవచ్చు. ఇన్వెస్టర్లలో యువత, మొదటిసారిగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎన్ఎస్ఈ వివరించింది. డిజిటలీకరణ వేగవంతం కావడం, మొబైల్ ఆధారిత ట్రేడింగ్ సొల్యూషన్స్ విస్తృతంగా వినియోగంలోకి రావడం తదితర అంశాలు ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడానికి కారణమని సంస్థ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. -
స్టాక్ మార్కెట్లో 10 రోజులు నో ట్రేడింగ్!
దేశంలో స్టాక్ మార్కెట్పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవారు నిరంతరం మార్కెట్ను గమనిస్తుంటారు. ఆగస్టు నెలలో వారాంతాలు మినహా రెండు రోజులు భారత స్టాక్ మార్కెట్ మూసి ఉంటుంది. శని, ఆదివారాలతో సహా మొత్తం పది రోజుల పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు సెలవు ఉంటుంది. అంటే ఆయా రోజుల్లో ట్రేడింగ్ జరగదు.ఎన్ఎస్ఈ ట్రేడింగ్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025లో రాబోయే మార్కెట్ సెలవు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తదుపరిది ఆగస్టు 27న వినాయక చవితి రోజున ఉంటుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్), కరెన్సీ డెరివేటివ్స్ కూడా ఆగస్టు 15, 27 తేదీల్లో మూసి ఉంటాయి.ఈ ఏడాది ఇక రానున్న స్టాక్ మార్కెట్ సెలవులుఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవంఆగష్టు 27 - వినాయక చవితిఅక్టోబర్ 2 - మహాత్మాగాంధీ జయంతి/ దసరాఅక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజఅక్టోబర్ 22 - బలిప్రతిపాదనవంబర్ 5 - ప్రకాశ్ గురుపూర్ శ్రీ గురునానక్ దేవ్డిసెంబర్ 25 - క్రిస్మస్ -
మార్కెట్ ముగిసిందిలా.. టాప్ గెయినర్స్ ఇవే..
భారత ఈక్విటీలు ఈ రోజు క్యూ1 ఫలితాలతో నడిచాయి. 2025 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన తర్వాత సెన్సెక్స్లో ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. దీనికి తోడు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన నిర్ణయం ఇన్వెస్టర్లను పక్కకు నెట్టి స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులకు లోనయ్యాయి.సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 143.9 పాయింట్లు (0.18 శాతం) పెరిగి 81,481.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34 పాయింట్లు లాభపడి 24,855.05 వద్ద ముగిసింది. అదేసమయంలో ఎల్అండ్టీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 0.31 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ (0.96 శాతం), నిఫ్టీ ఆటో (0.6 శాతం) అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ ఒడిదుడుకుల అంచనాలను కొలిచే ఇండియా వీఐఎక్స్ 2.77 శాతం నష్టంతో 11.21 వద్ద ముగిసింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 24,866కు చేరింది. సెన్సెక్స్(Sensex) 138 ప్లాయింట్లు పుంజుకుని 81,479 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.75బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.62 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.32 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.38 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,694కు చేరింది. సెన్సెక్స్(Sensex) 19 ప్లాయింట్లు పుంజుకుని 80,906 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమ్మకాల ఒత్తిడి.. బేర్మన్న మార్కెట్లు
బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 572.07 పాయింట్లు (0.70 శాతం) క్షీణించి 80,891 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.10 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 24,680.90 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ అనుబంధ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ మాత్రమే 1.23 శాతం వరకు లాభపడగా, మిగతావి నష్టాల్లో స్థిరపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు 1.14 శాతం నుంచి 7.31 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.26 శాతం, 0.84 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ రెడ్లో స్థిరపడగా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.26 శాతం నష్టంతో ముగిసింది. -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 24,832కు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 ప్లాయింట్లు దిగజారి 81,397 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కుప్పకూలిన బజాజ్ షేర్లు
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇతర హెవీవెయిట్ షేర్ల బలహీనత మధ్య భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయంగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు (0.88 శాతం) నష్టపోయి 81,463.09 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్లు (0.9 శాతం) క్షీణించి 24,837 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో బజాజ్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ట్రెంట్ షేర్లు టాప్ లూజర్స్గా నిలవగా సన్ ఫార్మా మాత్రమే లాభపడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.61 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా (0.54 శాతం) మినహా అన్ని కౌంటర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ ఆటో 1.27 శాతం, నిఫ్టీ ఐటీ 1.42 శాతం, నిఫ్టీ మెటల్ 1.64 శాతం, నిఫ్టీ రియల్టీ 0.99 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.91 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.9 శాతం నష్టపోయాయి.దేశీయ మార్కెట్లో మార్కెట్ అస్థిరతకు కొలమానమైన ఇండియా వీఐఎక్స్ 5.15 శాతం లాభంతో 11.28 వద్ద ముగిసింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 134 పాయింట్లు నష్టపోయి 24,932కు చేరింది. సెన్సెక్స్(Sensex) 395 ప్లాయింట్లు దిగజారి 81,794 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడేసిన ఐటీ, రియల్టీ షేర్లు
ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఈఎక్స్, కోఫోర్జ్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ జూన్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు స్పందించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 542.47 పాయింట్లు (0.66 శాతం) క్షీణించి 82,184.17 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 157.8 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 25,062.1 వద్ద ముగిశాయి.ఎటర్నల్ (జొమాటో), టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టైటాన్ షేర్లు టాప్ గెయినర్స్గా లాభపడగా, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ వరుసగా 0.58 శాతం, 1.09 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 2.21 శాతం, నిఫ్టీ రియల్టీ 1.04 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 1.24 శాతం, నిఫ్టీ ఫార్మా 0.55 శాతం లాభపడ్డాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు నష్టపోయి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 172 ప్లాయింట్లు దిగజారి 82,382 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లు ర్యాలీ.. రయ్మన్న ఆటో షేర్లు
ప్రపంచ మార్కెట్ల బలాన్ని ట్రాక్ చేస్తూ భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్ను లాభాలతో ముగించాయి. దీనికి తోడు జూన్ త్రైమాసికం (క్యూ1 ఎఫ్వై26) ఫలితాలకు సంబంధించి కొనసాగుతున్న త్రైమాసిక రాబడుల సీజన్ మధ్య స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా సెంటిమెంట్కు దిశానిర్దేశం చేసింది.బీఎస్ఈ సెన్సెక్స్ 539.83 పాయింట్లు (0.66 శాతం) లాభంతో 82,726.64 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 159 పాయింట్లు లేదా 0.63 శాతం లాభంతో 25,219.9 వద్ద సెషన్ను ముగించాయి. టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ టాప్ గెయినర్స్గా నిలవగా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.34 శాతం లాభంతో, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఫ్లాట్ గా ముగిశాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.76 శాతం, నిఫ్టీ మెటల్ 0.48 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 2.6 శాతం నష్టపోయింది. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు పెరిగి 25,121కు చేరింది. సెన్సెక్స్(Sensex) 196 ప్లాయింట్లు పుంజుకుని 82,382 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రిలయన్స్, ఐటీ షేర్లు పడేశాయ్..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 82,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 25,061 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆరంభంలోనే ఓ మోస్తారు లాభాలు గడించాయి. ఒక దశలో సెన్సెక్స్ 338 పాయింట్లు పెరిగి 82,538 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు బలపడి 25,182 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి.అయితే భారత్ – యూఎస్వాణిజ్య ఒప్పందానికి తుది గడువు ఆగస్టు 1 సమీపిస్తున్నా.. డీల్పై ఎలాంటి స్పష్టత రాకపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఇండెక్సుల వారీగా బీఎస్ఈలో రియల్టీ 1%, టెలీకమ్యూనికేషన్, ఆటో, ఐటీ, టెక్ షేర్లు అరశాతం నష్టపోయాయి.⇒ అంచనాలకు మించి క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటనతో డెలివరీ దిగ్గజం ఎటర్నల్ షేరు రెండో రోజూ రాణించింది. బీఎస్ఈలో 11% పెరిగి రూ.300 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.312 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లో కంపెనీ మార్కెట్ విలువ రూ.41,013 కోట్లు పెరిగి రూ.2.89 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. శాంతి గోల్డ్ @ రూ. 189–199న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల తయారీ సంస్థ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకి రూ. 189–199 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. దీనిలో భాగంగా 1.81 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 360 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా విభిన్న బంగారు ఆభరణాల డిజైన్, తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ప్రస్తుతం వార్షికంగా 2,700 కేజీల బంగారు ఆభరణాల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు పెరిగి 25,109కు చేరింది. సెన్సెక్స్(Sensex) 122 ప్లాయింట్లు పుంజుకుని 82,324 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీవెయిట్స్ నుంచి బలమైన క్యూ1 రాబడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 442.61 పాయింట్లు లేదా 0.54 శాతం పెరిగి 82,200.34 స్థాయిలలో స్థిరపడగా, నిఫ్టీ 50 122.3 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 25,090.7 స్థాయిలలో ముగిసింది.నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.66 శాతం లాభపడగా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, యూపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, బీఎస్ ఈ, బీడీఎల్, పాలసీబజార్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సుజ్లాన్, అశోక్ లేలాండ్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ప్రతికూల ప్రభావంతో ఫ్లాట్ గా స్థిరపడింది.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, మెటల్ 1 శాతానికి పైగా లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచాయి. బ్యాంక్ షేర్లలో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.7 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ, ఆటో, ఎనర్జీ, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, మీడియా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 18 షేర్లు గ్రీన్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ 5.4 శాతం వరకు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.67 శాతం క్షీణించి 11.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు నష్టపోయి 24,906కు చేరింది. సెన్సెక్స్(Sensex) 159 ప్లాయింట్లు దిగజారి 81,593 వద్ద ట్రేడవుతోంది.యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే బాటలో దేశీ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరితే సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపే వీలున్నట్లు తెలియజేశారు. వడ్డీ రేట్లపై యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత వారం భారత్, యూఎస్ బృందాలు నాలుగు రోజులపాటు వాషింగ్టన్లో నిర్వహించిన ఐదో రౌండ్ చర్చలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్టు 1కల్లా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫలితాలు, వాణిజ్య చర్చలపై దృష్టి
ప్రధానంగా తొలి త్రైమాసిక ఫలితాలే ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాతాన పలు దిగ్గజాలు ఏప్రిల్–జూన్(క్యూ1) పనితీరు వెల్లడించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో మరిన్ని బ్లూచిప్స్ క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్గత వారాంతాన ప్రకటించిన క్యూ1 ఫలితాలలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డ్కు తెరతీసింది. ఒక త్రైమాసికంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 26,994 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. వాటాదారులకు సంస్థ చరిత్రలోనే తొలిసారి అదికూడా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని ప్రకటించింది. ఇక మరో దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సైతం పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ1లో 16% వృద్ధితో రూ. 13,558 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి నేడు ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లు సందడి యనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ రెడీ..: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ మరింత జోరందుకోనుంది. ఈ వారం డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఎంఅండ్ఎం, ఏసీసీ, కాల్గేట్, డిక్సన్, తదితర బ్లూచిప్స్ క్యూ1 పనితీరు వెల్లడించనున్నాయి. అంతేకాకుండా ఎటర్నల్, జీల్, ఎంఫసిస్, కెనరా బ్యాంక్, ఎస్ బీఐ లైఫ్ తదితరాలు సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫలితాలపై అత్యధికంగా దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. వాణిజ్య డీల్స్..: యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే బాటలో దేశీ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరితే సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమవుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఇది విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపే వీలున్నట్లు తెలియజేశారు. వడ్డీ రేట్లపై యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత వారం భారత్, యూఎస్ బృందాలు నాలుగు రోజులపాటు వాషింగ్టన్లో నిర్వహించిన ఐదో రౌండ్ చర్చలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్ట్ 1కల్లా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావానికి చెక్ పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లలో అనిశ్చితికి కారణమవుతున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. సాంకేతికంగా చూస్తే.. గత వారం నిఫ్టీ 25,000 మైలురాయి దిగువన 24,900కు క్షీణించింది. దీంతో సాంకేతిక నిపుణుల అంచనా ప్రకారం ఈ వారం ఆటుపోట్ల మధ్య మరింత బలహీనపడి 24,500వరకూ నీరసించే వీలుంది. అయితే మార్కెట్లు బలపడితే నిఫ్టీకి 25,250 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు.ఎఫ్పీఐల వెనకడుగుజులైలో రూ. 5,524 కోట్లు వెనక్కిన్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నగదు విభాగంలో ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 5,524 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో 2025 తొలి 7 నెలల్లో రూ. 83,245 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే జూన్లో రూ. 14,590 కోట్లు, మే నెలలో రూ. 19,860 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్ మధ్య నుంచి అమ్మకాల బాటను వీడి రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు మార్చిలో రూ. 3,973 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గత వారమిలా వరుసగా మూడో వారం దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 743 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 81,758 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 181 పాయింట్లు తగ్గి 24,968 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు 1–1.5 శాతం చొప్పున నష్టపోయాయి. -
స్టాక్ మార్కెట్లో యూత్!
ఒకప్పుడు.. ‘స్టాక్ మార్కెట్తో మాకేంటి సంబంధం?’ అని సామాన్యుడు అనుకునేవాడు. కానీ, ఇప్పుడు అదే స్టాక్ మార్కెట్లో సామాన్యులు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా, కోవిడ్, ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలు.. ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఫలితంగా ఇప్పుడు ఇన్టెస్టర్ల సంఖ్యలో ఏటా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశ జనాభాలో సుమారు 11.5 కోట్ల మంది జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పెట్టుబడులు పెట్టారు. వీరిలో 30 ఏళ్లలోపు వారు 39 శాతం కాగా.. మహిళలు సుమారు 25 శాతం కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనూ మదుపరులు.. ముఖ్యంగా మహిళల సంఖ్య భారీగా పెరిగింది.బిహార్.. దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) వేదికగా బిహార్ ఇన్వెస్టర్ల సంఖ్య అయిదేళ్లలో దేశంలోనే అత్యధికంగా 678 శాతం పెరిగింది. మదుపరుల సంఖ్య 7 లక్షల నుంచి 52 లక్షలకు దూసుకెళ్లింది. బిహార్లోనే ఇలా ఉంటే మరి ఇతర రాష్ట్రాల్లో? అవును.. ఇతర రాష్ట్రాల్లోనూ మదుపరులు గణనీయంగా పెరిగారు. ఎన్ఎస్ఈలో మదుపరుల సంఖ్య 2014–15లో 1,79,60,000. ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 11,49,42,000కు చేరింది. అంటే పదేళ్లలో 540 శాతం పెరుగుదల! 5–6 నెలలకే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారంటే స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.సులభమైన షేర్ల లావాదేవీలు!స్మార్ట్ ఫోన్ సామాన్యుడికి చేరువైంది. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు సులువయ్యాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే భయపడే రోజుల నుంచి.. ప్రతిరోజూ వేలూ, లక్షల రూపాయలను రకరకాల మార్గాల్లో పంపే పరిస్థితులు వచ్చాయి. డిజిటల్ అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. మరోపక్క.. దేశీయ స్టాక్ మార్కెట్ కూడా రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ మదుపరులను ఊరిస్తోంది. తక్కువ సమయంలో, సులభమైన ఆదాయ మార్గంగా స్టాక్ మార్కెట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు దరఖాస్తు ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది.ఏ కంపెనీని ఎంచుకోవాలో సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు! షేర్ల కదలిక కళ్ల ముందు కనపడుతోంది. సామాన్యులు సైతం అతి తక్కువగా.. అంటే రూ.100 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టొచ్చు. పెట్టుబడి పెట్టడమే కాదు.. ఉపసంహరణ సైతం చాలా సులభం అయిపోయింది. ముఖ్యంగా రిటైల్ ట్రేడింగ్ను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఎన్నో వచ్చాయి. కోవిడ్ సమయంలో చాలామందికి ఇంటి దగ్గర ఉంటూ ఆదాయార్జన మార్గంగా స్టాక్ మార్కెట్ను ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి.పెరిగిన మహిళా శక్తి!..: స్టాక్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుండడం విశేషం. మహిళా ఇన్వెస్టర్ల వాటా 2022–23లో 22.5 శాతం కాగా ఈ ఏడాది మే నాటికి 24.4 శాతానికి చేరింది. గోవాలో అత్యధికంగా మహిళా పెట్టుబడిదారులు 32.6 శాతం ఉన్నారు. దేశంలో మొత్తం ఇన్వెస్టర్ల పరంగా మహిళా ఇన్వెస్టర్ల అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 28.4 శాతం ఉంటే , గుజరాత్లో 27.8 శాతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 23.4, తెలంగాణలో 24.9 శాతం మహిళలు ఉన్నారు.ఆ మూడు రాష్ట్రాలు..: ఒక కోటి మంది ఇన్వెస్టర్ల క్లబ్లో చేరిన మూడో రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. 1.86 కోట్లతో మహారాష్ట్ర, 1.31 కోట్లతో ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే 4.2 కోట్లతో ఉత్తర భారత్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ భారత్ 3.5 కోట్లు, దక్షిణాది 2.4 కోట్లు, తూర్పు భారత్లో 1.4 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. సంఖ్యా పరంగా ఏడాదిలో ఉత్తరాదిలో 24%, తూర్పు భారత్ 23%, దక్షిణాది 22%, పశ్చిమ భారత్లో 17% వృద్ధి నమోదైంది. మే నెలలో తోడైన కొత్త ఇన్వెస్టర్ల సంఖ్యలో దేశంలోని టాప్–10 జిల్లాల్లో రంగారెడ్డి (8), హైదరాబాద్ (10) చోటు దక్కించుకున్నాయి.దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల మంది మదుపరులకు జూలై 14 నాటికి 22.87 కోట్లకుపైగా ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో ఏపీ నుంచి 1.04 కోట్లకుపైగా ఉంటే, తెలంగాణలో 51.50 లక్షలకుపైగా ఉన్నాయి. -
ఫ్లాట్గా కదులుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎల్టీఐమైండ్ట్రీ వంటి సంస్థలు ప్రకటించిన జూన్ త్రైమాసికం (Q1FY26) ఫలితాలకు ఇన్వెస్టర్లు స్పందించడంతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. మరోవైపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలను మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. భారత్పై అమెరికా 10-15 శాతం సుంకం విధించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.ఉదయం 9.34 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 161.82 (0.20%) పాయింట్లు క్షీణించి 82,097.4 వద్ద, నిఫ్టీ 50 36.85 (0.15%) పాయింట్లు క్షీణించి 25,099 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం నష్టపోయాయి.నేటి క్యూ1 ఫలితాలురిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్తాన్ జింక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎల్టీ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, అతుల్, హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఇండియామార్ట్ ఇంటర్మేష్, మాస్టెక్, ఎంపీఎస్, ఆర్తి డ్రగ్స్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, గరుడ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్, శివ సిమెంట్, కేరళ ఆయుర్వేద, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్, అసోసియేటెడ్ స్టోన్ ఇండస్ట్రీస్ (కోటా) తదితర కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయంగా జూన్ త్రైమాసిక రాబడులు మందకొడిగా ప్రారంభం కావడం, ప్రపంచవ్యాప్తంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 375.24 పాయింట్లు లేదా 0.45 శాతం క్షీణించి 82,259.24 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 100.6 పాయింట్లు లేదా 0.4 శాతం క్షీణించి 25,111.45 వద్ద స్థిరపడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 1.39 శాతం నష్టంతో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ఎల్టీఐ, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఎంఫాసిస్, కోఫోర్జ్, హెచ్సీఎల్ టెక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ అన్నీ రెడ్లోనే ముగిశాయి. నిఫ్టీ రియల్టీ 1.24 శాతం లాభపడగా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు నష్టాలలో ముగిశాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, ఎల్అండ్టీ, టీసీఎస్ షేర్లు 2.8 శాతం వరకు నష్టపోయాయి. అదేసమయంలో టాటా స్టీల్, ట్రెంట్, టైటాన్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ స్వల్పంగా పెరిగి 0.02 శాతం పెరిగి 11.24 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:54 సమయానికి నిఫ్టీ(Nifty) 17 పాయింట్లు నష్టపోయి 25,194కు చేరింది. సెన్సెక్స్(Sensex) 52 ప్లాయింట్లు దిగజారి 82,578 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:54 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు నష్టపోయి 25,161కు చేరింది. సెన్సెక్స్(Sensex) 81 ప్లాయింట్లు దిగజారి 82,482 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి దిగిరావడంతో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు చిగురించాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు మన మార్కెట్కు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీల 4 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 317 పాయింట్లు పెరిగి 82,571 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 25,196 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 490 పాయింట్లు బలపడి 82,744 వద్ద, నిఫ్టీ 163 పాయింట్లు ఎగసి 25,245 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఆసియాలో కొరియా, జపాన్, హాంగ్కాంగ్ సూచీలు 1% లాభపడ్డాయి. యూరప్ సూచీలు అరశాతం నష్టపోయాయి. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.⇒ వినిమయ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ ఇండెక్సుల్లో ఆటో 1.50%, ఫార్మా 1.14%, వినిమయ, ఎఫ్ఎంసీజీ, 1%, రియల్టి, సర్విసెస్ అరశాతం చొప్పున పెరిగాయి.⇒ తొలి త్రైమాసిక నికర లాభం 10% క్షీణత నమోదుతో హెచ్సీఎల్ టెక్ షేరు 3% నష్టపోయి రూ.1,566 వద్ద నిలిచింది. -
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు పెరిగి 25,094కు చేరింది. సెన్సెక్స్(Sensex) 37 ప్లాయింట్లు ఎగబాకి 82,297 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. యూరోపియన్ యూనియన్, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 30 శాతం సుంకం విధించడంతో బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు జూన్ త్రైమాసికం రాబడుల సీజన్లో నెలకొన్న ఆందోళన కూడా సెంటిమెంటును అదుపులో ఉంచింది.బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 231 పాయింట్లు (0.28 శాతం) క్షీణించి 82,269 వద్ద, నిఫ్టీ ఇండెక్స్ 68 పాయింట్లు (0.27 శాతం) క్షీణించి 25,100 పాయింట్ల మార్కును అధిగమించి 25,082 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. అదేసమయంలో సన్ఫార్మా, ట్రెంట్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎంఅండ్ఎం షేర్లు 0.7 శాతం వరకు లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 1 శాతం, నిఫ్టీ మీడియా ఇండెక్స్ 0.75 శాతం, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయాయి. -
స్టాక్మార్కెట్లో కొత్త ఇండెక్స్ ప్రారంభం
బీఎస్ఈ అనుబంధ సంస్థ అయిన ఏషియా ఇండెక్స్ తాజాగా బీఎస్ఈ ఇన్సూరెన్స్ పేరిట కొత్త సూచీని ప్రారంభించింది. బీఎస్ఈ 1000 ఇండెక్స్లోని బీమా రంగం కింద వర్గీకరించిన సంస్థలు ఈ సూచీలో ఉంటాయి. దీని బేస్ వేల్యూ 1000గా, తొలి వేల్యూ డేట్ 2018 జూన్ 18గా ఉంటుంది. వార్షికంగా రెండు సార్లు (జూన్, డిసెంబర్) ఈ సూచీలో మార్పులు, చేర్పులు చేస్తారు. ప్యాసివ్ వ్యూహాలను పాటించే ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్లకు ఇది ప్రామాణికంగా ఉంటుంది. ప్రాంతీయ భాషల్లో సీడీఎస్ఎల్ ఐపీఎఫ్ పోర్టల్ పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో అవగాహన పెంపొందించేందుకు సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎస్ఎల్ ఐపీఎఫ్) తాజాగా ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ ప్లాట్ఫాంను ప్రా రంభించింది. ఇందులో తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ తదితర 12 భాషల్లో కంటెంట్ ఉంటుంది.తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారితో పాటు పెట్టుబడులు పెట్టాలనే అలోచనతో ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని భావి ఇన్వెస్టర్లకు కూడా ఈ వెబ్సైట్ ఉపయోగకరంగా ఉంటుంది. సీడీఎస్ఎల్ఐపీఎఫ్డాట్కామ్లోని ఈ కంటెంట్ను ఉచితంగా పొందవచ్చని సంస్థ సెక్రటేరియట్ సుధీష్ పిళ్లై తెలిపారు. -
ఐటీ షేర్లు టపటప.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
టీసీఎస్ త్రైమాసిక (క్యూ1) రాబడులు ఆశించిన దానికంటే బలహీనంగా ఉండటంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ఐటీ షేర్లలో అమ్మకాలతో నష్టాల్లో ముగిశాయి. దీనికి తోడు కెనడాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వాణిజ్య సుంకాలు విధించిన తర్వాత పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు కూడా సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 689.81 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 82,500.47 స్థాయిలలో ముగియగా, నిఫ్టీ 50 కూడా 205.4 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 25,149.85 స్థాయిలలో స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.88 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.02 శాతం చొప్పున నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో దాదాపు 1.8 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ క్యూ1 రాబడులు ఊహించిన దానికంటే తక్కువగా ఉండటంతో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఎనర్జీ, బ్యాంక్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 23 షేర్లు రెడ్లోనే ముగిశాయి. టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, టైటాన్ షేర్లు 3.5 శాతం వరకు నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.24 శాతం లాభపడి 11.81 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
టీసీఎస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) షేరు ధర బలహీనమైన జూన్ త్రైమాసిక ఫలితాల మధ్య బిఎస్ఇలో ప్రారంభ ఒప్పందాలలో 2 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ సహా ఇతర ఐటీ షేర్లు కూడా 3 శాతం వరకు క్షీణించాయి.ఉదయం 9.46 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్లు లేదా 0.23% నష్టపోయి82,996.41 పాయింట్ల వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు లేదా 0.22% నష్టంతో 25,299.55 వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం, టెక్ ఎం, ఎటర్నల్ (జొమాటో), బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో కొనసాగుతుండగా హెచ్యూఎల్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.03 శాతం, 0.14 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.8 శాతం, నిఫ్టీ ఆటో 0.15 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు వరుసగా 0.57 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు, జూన్ త్రైమాసికం (క్యూ1 ఎఫ్వై 26) రాబడులపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ1 త్రైమాసిక ఫలితాలు నేడు ప్రకటించనున్న నేపథ్యంలో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 345.8 పాయింట్లు లేదా 0.41 శాతం క్షీణించి 83,190.28 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 కూడా 120.85 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 25,355.25 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.32 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.3 శాతం నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఐటీ 0.8 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ క్యూ1 ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూడడంతో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు ఎడ్లో ముగిశాయి. అదేసమయంలో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు 2.6 శాతం వరకు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.24 శాతం క్షీణించి 11.6 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు తగ్గి 25,452కు చేరింది. సెన్సెక్స్(Sensex) 69 ప్లాయింట్లు దిగజారి 83,473 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.రేంజిబౌండ్ సెషన్ తర్వాత దిశా సంకేతాలు లేకపోవడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు నష్టాల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 176.43 పాయింట్లు (0.21 శాతం) క్షీణించి 83,536.08 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.4 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 25,476.10 వద్ద ముగిశాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.59 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 1.49 శాతం, 1.4 శాతం, 1.25 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, ఐటీ, మీడియా, పీఎస్యూ బ్యాంక్, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికాకు చెందిన వైస్రాయ్ రీసెర్చ్ తన మాతృసంస్థ రుణభారం తగ్గించుకోవడంతో మైనింగ్ దిగ్గజం వేదాంత షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. అదేసమయంలో హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.09 శాతం క్షీణించి 11.9 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
నేడే టారిఫ్ డెడ్లైన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు తగ్గి 25,481కు చేరింది. సెన్సెక్స్(Sensex) 177 ప్లాయింట్లు దిగజారి 83,522 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
చివర్లో కొనుగోళ్లు
ముంబై: ట్రేడింగ్ చివర్లో బ్యాంకులు, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 270 పాయింట్లు పెరిగి 83,713 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 25,523 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. అమెరికా–భారత్ వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 491 పాయింట్ల పరిధిలో 83,321 వద్ద కనిష్టాన్ని, 83812 వద్ద గరిష్టాన్ని తాకింది.నిఫ్టీ 25,424 – 25,548 శ్రేణిలో కదలాడింది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఆరు ప్రధాన కరెన్సీ విలువలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ బలహీనపడడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 85.73 వద్ద స్థిరపడింది. యూరప్ మార్కెట్లు అరశాతం లాభాల్లో ముగిశాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ కంపెనీ తొలి త్రైమాసిక వ్యాపార అప్డేట్ ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో టైటాన్ కంపెనీ షేరు 6% నష్టపోయి రూ.3,441 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఆరున్నర శాతం క్షీణించి రూ.3,435 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.20,086 కోట్లు కోల్పోయి రూ.3.05 లక్షల కోట్లకు దిగివచి్చంది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా నష్టపోయి షేరు ఇదే. -
రేపే టారిఫ్ డెడ్లైన్.. ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:51 సమయానికి నిఫ్టీ(Nifty) 16 పాయింట్లు పెరిగి 25,479కు చేరింది. సెన్సెక్స్(Sensex) 76 ప్లాయింట్లు పుంజుకుని 83,522 వద్ద ట్రేడవుతోంది.ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్పై త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జులై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోని దేశాలకు ఆగస్టు 1 నుంచి సుంకాలు అమలు చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్గా స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 9.61 పాయింట్లు (0.01 శాతం) స్వల్పంగా లాభపడి 83,442.50 వద్ద ముగియగా, నిఫ్టీ 50 25,461.3 స్థాయిలో ముగిసింది. విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 0.27 శాతం, ఎన్ఎస్ఈ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.44 శాతం నష్టపోయాయి.నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.68 శాతం లాభపడగా, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇమామీ, బ్రిటానియా, వరుణ్ బేవరేజెస్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ ఎనర్జీ కూడా గ్రీన్లో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, బ్యాంక్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, హెచ్సీఎల్ టెక్, మారుతి, ఇన్ఫోసిస్, ఎస్బీఐ 2.4 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ 3 శాతం వరకు లాభపడ్డాయి. -
యూఎస్తో వాణిజ్య ఒప్పందంపై ఫోకస్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 25,423కు చేరింది. సెన్సెక్స్(Sensex) 126 ప్లాయింట్లు నష్టపోయి 83,313 వద్ద ట్రేడవుతోంది.మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 193.42 పాయింట్లు లేదా 0.23 శాతం పెరిగి 83,432.89 వద్ద ముగియగా, నిఫ్టీ 55.7 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 25,461 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ప్రతికూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.03 శాతం పెరిగింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో, మెటల్ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. భారత్ పెట్రోలియం, ఐజీఎల్, ఇండియన్ ఆయిల్, మహానగర్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు లాభపడటంతో నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.05 శాతం లాభపడింది.నిఫ్టీ రియల్టీ, ఫార్మా, ఐటీ, బ్యాంక్, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.57 శాతం క్షీణించి 12.32 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:53 సమయానికి నిఫ్టీ(Nifty) 6 పాయింట్లు తగ్గి 25,401కు చేరింది. సెన్సెక్స్(Sensex) 18 ప్లాయింట్లు నష్టపోయి 83,224 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బ్యాంక్ షేర్లు పతనం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్, ఎఫ్ఐఐ అమ్మకాల ఒత్తిడిపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సానుకూలంగా ప్రారంభమై స్వల్ప లాభాలతో ట్రేడయిన భారత బెంచ్మార్క్ సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో స్థిరపడ్డాయి.ఇంట్రాడేలో 83,850 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 170.22 పాయింట్లు (0.2 శాతం) క్షీణించి 83,239.7 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 48.1 పాయింట్లు (0.19 శాతం) క్షీణించి 25,405.3 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ సానుకూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.26 శాతం నష్టపోయింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 0.89 శాతం క్షీణించి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, బ్యాంక్, ఫియాన్షియల్ సర్వీసెస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.నిఫ్టీ మీడియా, ఆటో, ఫార్మా, హెల్త్కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.48 శాతం క్షీణించి 12.38 పాయింట్ల వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదేసమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు తగ్గి 25,442కు చేరింది. సెన్సెక్స్(Sensex) 48 ప్లాయింట్లు నష్టపోయి 83,383 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు తగ్గి 25,538కు చేరింది. సెన్సెక్స్(Sensex) 14 ప్లాయింట్లు పెరిగి 83,713 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో ఆచితూచి ఆశావహ దృక్పథంతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ఫ్లాట్ గా ముగిశాయి. ఇంట్రాడేలో 83,874.29 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 90.83 పాయింట్లు (0.11 శాతం) లాభపడి 83,697.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 24.75 పాయింట్లు లేదా 0.1 శాతం స్వల్ప లాభంతో 25,541.8 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 0.10 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, ఐటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ షేర్లు నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో 3,020 షేర్లలో 1,491 షేర్లు లాభాల్లో, 1,452 షేర్లు నష్టాల్లో ముగియగా, 77 షేర్లలో ఎలాంటి మార్పులేదు. 96 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 119కి పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 43 పడిపోయాయి.ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.36 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.01 శాతం క్షీణించి 12.5 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 క్యాలెండర్ ఇయర్ ద్వితీయార్ధం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు (0.15 శాతం) లాభపడి 83,730 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఫ్లాట్గా 25,515 వద్ద ప్రారంభమయ్యాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 4 శాతం వరకు లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.24 శాతం, 0.31 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.65 శాతం లాభపడగా, నిఫ్టీ మెటల్ 0.18 శాతం నష్టంతో టాప్ లూజర్గా నిలిచింది.నేటి ఐపీవోలుఎల్లెన్ బారి ఇండస్ట్రియల్ గ్యాస్స్ ఐపీఓ (మెయిన్ లైన్ ), కల్పతరు ఐపీవో (మెయిన్ లైన్ ), గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీవో (మెయిన్ లైన్ ), శ్రీ హరే కృష్ణ స్పాంజ్ ఐరన్ ఐపీవో (ఎస్ ఎంఈ), ఏజేసీ జ్యువెల్ ఐపీవో (ఎస్ ఎంఈ) ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో విడుదల కానున్నాయి.వందన్ ఫుడ్స్ ఐపీఓ (ఎస్ఎంఈ), మార్క్ లోయిర్ ఐపీఓ (ఎస్ఎంఈ), సెడార్ టెక్స్టైల్ ఐపీఓ (ఎస్ఎంఈ), పుష్పా జ్యువెలర్స్ ఐపీఓ (ఎస్ఎంఈ), సిల్కీ ఓవర్సీస్ ఐపీఓ (ఎస్ఎంఈ) సబ్స్క్రిప్షన్ కోసం తెరవనుండగా, నీతూ యోషి ఐపీఓ (ఎస్ఎంఈ), యాడ్కౌంటీ మీడియా ఐపీఓ (ఎస్ఎంఈ) మూడో రోజుకు ప్రవేశించనున్నాయి.ఇండోగుల్ఫ్ క్రాప్ సైన్సెస్ ఐపీఓ (మెయిన్ లైన్), మూవింగ్ మీడియా ఐపీఓ (ఎస్ ఎంఈ), వాలెన్సియా ఇండియా ఐపీఓ (ఎస్ ఎంఈ), ఏస్ ఆల్ఫా ఐపీవో (ఎస్ ఎంఈ), ప్రో ఎఫ్ ఎక్స్ టెక్ ఐపీవో (ఎస్ ఎంఈ)లకు వీటి కేటాయింపులు ఉంటాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నాలుగు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ వేసిన భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. 84,099.53 - 83,482.13 శ్రేణిలో ట్రేడైన బీఎస్ఈ సెన్సెక్స్ 452.44 పాయింట్లు లేదా 0.54 శాతం క్షీణించి 83,606.46 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 120.75 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 25,517.05 వద్ద స్థిరపడింది.అయితే, విస్తృత మార్కెట్ ప్రధాన సూచీలను అధిగమించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.68 శాతం, 0.52 శాతం లాభపడ్డాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. మహారాష్ట్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.నిఫ్టీ ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, హెల్త్కేర్, మీడియా, ఎనర్జీ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు పెరిగి 25,646కు చేరింది. సెన్సెక్స్(Sensex) 3 ప్లాయింట్లు తగ్గి 84,048 వద్ద ట్రేడవుతోంది.దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్కు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. నేడు(30న) మే నెలకుగాను వార్షికంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), కరెంట్ ఖాతా 2025 జనవరి–మార్చి లోటు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్లో ఐఐపీ 2.7 శాతం పుంజుకుంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో 11.5 బిలియన్ డాలర్ల లోటు నమోదైంది. మంగళవారం(జులై 1న) జూన్ నెలకు తయారీ రంగ పీఎంఐ, 3న సర్వీసు రంగ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. వీటికితోడు రుతుపవన కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ మరింత స్పీడు!
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరు చూపవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. గత వారం అంచనాలకు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్ను దాటి నిలిచింది. ఈ స్పీడ్ కొనసాగనున్నట్లు అధిక శాతం మంది నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్కు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. నేడు(30న) మే నెలకుగాను వార్షికంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), కరెంట్ ఖాతా 2025 జనవరి–మార్చి లోటు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్లో ఐఐపీ 2.7 శాతం పుంజుకుంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో 11.5 బిలియన్ డాలర్ల లోటు నమోదైంది. మంగళవారం(జులై 1న) జూన్ నెలకు తయారీ రంగ పీఎంఐ, 3న సర్విసుల రంగ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఆర్డర్లరాకతోపాటు పరిశ్రమల రంగ ప్రగతిని తయారీ పీఎంఐ తెలియజేయనున్నట్లు బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ పేర్కొంది. వీటికితోడు రుతుపవన కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. విదేశీ అంశాలు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ మార్కెట్లకు సానుకూల అంశంకాగా.. 1న జపనీస్ తయారీ రంగ క్యూ1 వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజు జూన్ నెలకు చైనా తయారీ పీఎంఐ తెలియనుంది. 3న జూన్ నెలకు యూఎస్ ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా 9న యూఎస్ టారిఫ్ల గడువు ముగియనుంది. యూఎస్, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు తగ్గడంతో చమురు ధరలు చల్లబడ్డాయి. ఈ నేపథ్యంలో విదేశీ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నాయిర్ తెలియజేశారు. ఎఫ్పీఐల దన్ను విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత వారం భారీస్థాయిలో రూ. 13,108 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. ఫలితంగా జూన్లో ఇంతవరకూ నికరంగా రూ. 8,915 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లయ్యింది. ఆర్బీఐ రెపో రేటులో 0.5 శాతం కోతకుతోడు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు ఉపశమించడం, యూఎస్ టారిఫ్ల ఆందోళనలు సైతం తగ్గడం ఎఫ్పీఐల పెట్టుబడులకు దోహదం చేస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. గతేడాది అక్టోబర్ మొదలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచి్చన ఎఫ్పీఐలు ఏప్రిల్ చివరి నుంచి దేశీ స్టాక్స్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. వెరసి ఏప్రిల్లో నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేయగా..మే నెలలో రూ. 19,860 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.26,100 పాయింట్లపై కన్ను అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో బ్రేకవుట్ నమోదైంది. 5 వారాలుగా ఒక పరిమిత శ్రేణిలోనే కదిలిన మార్కెట్లు పరిధిని చేదించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ అంచనాలకు అనుగుణంగా సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్ను అధిగమించి నిలిచింది. ఫలితంగా 25,600 పాయింట్లను దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. ఈ బాటలో మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. వెరసి నిఫ్టీ 25,800 పాయింట్లను దాటి 26,100వరకూ పరుగు తీయవచ్చని భావిస్తున్నారు. మధ్యకాలంలో నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టం 26,277 పాయింట్లవైపు పరుగు తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాకాకుండా బలహీనపడితే 25,300 వద్ద మద్దతు లభించే వీలున్నట్లు పేర్కొన్నారు. గత వారమిలా ఐదు వారాల కన్సాలిడేషన్ తదుపరి గత వారం చివరి 4 రోజుల్లో మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ 2,162 పాయింట్లు జంప్చేసింది. దీంతో నికరంగా గత వారం సెన్సెక్స్ 1,651 పాయింట్లు(2 శాతం) జమ చేసుకుంది. 84,059 వద్ద ముగిసింది. ఈ బాటలో చివరి 4 రోజుల్లో 666 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ నికరంగా 525 పాయింట్లు(2.1 శాతం) లాభపడింది. 25,638 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ మరింత అధికంగా 2.35 శాతం, స్మాల్క్యాప్ 3.6 శాతం చొప్పున జంప్ చేయడం గమనార్హం! -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. సెన్సెక్స్ కొత్త మార్క్
బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో సెషన్ లోనూ లాభాల బాటలో పయనించి, వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను సానుకూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 303.03 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 84,058.90 వద్ద స్థిరపడింది. శుక్రవారం ఈ సూచీ 84,089.35 - 83,645.41 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 88.80 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 25,657.80 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.27 శాతం, 0.91 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ లాభాల్లో ముగియగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.19 శాతం లాభపడింది.ఎన్ఎస్ఈలో 2,986 షేర్లలో 1,681 షేర్లు లాభాల్లో, 1,229 షేర్లు నష్టాల్లో ముగియగా, 76 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 86 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 105కు పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 40 పడిపోయాయి.ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.32 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.60 శాతం క్షీణించి 12.39 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 16 పాయింట్లు పెరిగి 25,565కు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 ప్లాయింట్లు పుంజుకుని 83,799 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎంఅండ్ఎం షేర్లలో కొనుగోళ్లతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఫ్గాట్గా కదులుతున్నాయి.30 షేర్ల సెన్సెక్స్ 243 పాయింట్లు (0.29 శాతం) పెరిగి 82,998 వద్ద, 50 షేర్ల నిఫ్టీ 83 పాయింట్లు లేదా 0.33 శాతం పెరిగి 25,327 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.31 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి. ఇండియా వీఐఎక్స్ 0.7 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.38 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 0.8 శాతం, నిఫ్టీ ఆటో 0.4 శాతం లాభపడ్డాయి.నేటి ఐపీవోలుహెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, రమా టెలికాం, సన్టెక్ ఇన్ఫ్రా, సూపర్టెక్ ఈవీ ఐపీఓలు సబ్స్క్రిప్షన్ రెండో రోజులోకి ప్రవేశించనున్నాయి. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీఓ, ఎల్లెన్ బారీ ఇండస్ట్రియల్ ఐపీఓ , కల్పతరు ఐపీఓ, ఐకాన్ ఫెసిలిటేటర్స్ ఐపీఓ, శ్రీ హరే-కృష్ణ స్పాంజ్ ఐపీఓ, అబ్రామ్ ఫుడ్స్ ఐపీఓ తమ సబ్ స్క్రిప్షన్ లో మూడో రోజుకు, ఏజేసీ జువెల్ మాన్యుఫాక్చరర్స్ ఐపీఓ 4వ రోజుకు ప్రవేశిస్తాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. చమురు ధరల పతనం, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించడంతో మీడియా, టెక్ షేర్లలో లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలను ఆర్జించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 700.4 పాయింట్లు లేదా 0.85 శాతం పెరిగి 82,755.51 వద్ద ముగియగా, నిఫ్టీ 50 కూడా 200.40 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 25,244.75 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగాయి.నిఫ్టీ మీడియా, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు వరుసగా 1.99 శాతం, 1.64 శాతం, 1.43 శాతం చొప్పున లాభపడ్డాయి. టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ 3.6 శాతం వరకు లాభపడ్డాయి. బీఈఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి, మార్కెట్ అస్థిరతను అంచనా వేయడానికి ఉపయోగించే భయ సూచిక ఇండియా వీఐఎక్స్ దాదాపు 5 శాతం పడిపోయి 12.96 పాయింట్లకు పడిపోయింది. -
Stock Market Updates: గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 140 పాయింట్లు పెరిగి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 492 ప్లాయింట్లు పుంజుకుని 82,549 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సీజ్ఫైర్ ఉల్లంఘన.. స్వల్ప లాభాలతో సరి
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడటంతో దేశీయ స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. మంగళవారం ఇంట్రాడేలో 1,121 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ ఆఖరికి 158 పాయింట్ల స్వల్ప లాభంతో 82,055 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 25,044 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి.ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ప్రథమార్థంలో కొనుగోళ్ల జోరు కనిపించింది ఒక దశలో సెన్సెక్స్ 1,121 పాయింట్లు ర్యాలీ చేసి 83,018 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు దూసుకెళ్లి 25,318 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. అయితే ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ క్షిపణులతో దాడులు చేస్తూందంటూ ఇజ్రాయెల్ ఆరోపణలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు – 2–3% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో సర్వీసెస్ 2%, టెలికమ్యూనికేషన్, మెటల్, ఫైనాన్షియల్ సర్విసెస్, బ్యాంకెక్స్ ఇండెక్సులు ఒకశాతం పెరిగాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.75%, 0.50 శాతం చొప్పున లాభపడ్డాయి.సూచీలకు అదానీ షేర్ల దన్ను...అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రాణించి సూచీల పతనాన్ని అడ్డుకున్నాయి. వివిధ వ్యాపారాలపై వచ్చే అయిదేళ్లలో 15–20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటనతో అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ లభించింది. అంబుజా సిమెంట్స్ 4%, సంఘీ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ 3%, అదానీ పోర్ట్స్ 2.60%, ఏసీసీ, అదానీ ఎనర్జీ 2% లాభపడ్డాయి.⇒ బ్రెంట్ క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఆయిల్ మార్కెట్ కంపెనీలు, ఏవియేషన్, పెయింట్స్, అడెషివ్స్ షేర్లకు కలిసొచ్చింది. హెచ్పీసీఎల్ 3%, ఐఓసీ, బీపీసీఎల్ 2% లాభపడ్డాయి. ఇండిగో ఏవియేషన్ 2.5%, స్పైస్జెట్ 2.15% పెరిగాయి. కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, షాలీమార్ పెయింట్స్ 2% లాభపడ్డాయి. -
మార్కెట్లో యుద్ధ భయాలున్నా లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 192 పాయింట్లు పెరిగి 25,171కు చేరింది. సెన్సెక్స్(Sensex) 620 ప్లాయింట్లు పుంజుకుని 82,526 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. అయితే దీన్ని ఇరాన్ ఖండించింది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడితో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. క్రూడాయిల్ ధరలూ అయిదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో నిన్నటి మార్కెట్ సెషన్లో ఐటీ, టెక్, ఆటో షేర్లలో భారీ అమ్మకాలు నెలకొన్నాయి. అయితే ట్రేడింగ్ చివర్లో దిగువ స్థాయిలో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత తగ్గాయి. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమని, కాస్త చల్లారాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్, ఏవియేషన్ రంగాల షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్ట సూచీలు.. పడిపోయిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలలో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రవేశించడం, ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై బాంబు దాడి చేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్ ను నష్టాలతో ముగించాయి.82,169.67 - 81,476.76 శ్రేణిలో ట్రేడైన బీఎస్ఈ సెన్సెక్స్ 511.38 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 81,896.79 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 140.50 పాయింట్లు (0.56 శాతం) క్షీణించి 24,971.90 వద్ద స్థిరపడింది. సోమవారం ఈ సూచీ 25,057 - 24,824.85 శ్రేణిలో ట్రేడ్ అయింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 21 నష్టాలలో ముగియగా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టూబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు 2.28 శాతం నుంచి 1.21 శాతం మధ్య నష్టపోయాయి. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ 3.39 శాతం - 0.58 శాతం మధ్య లాభపడ్డాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.36 శాతం, 0.70 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ లను అధిగమించాయి. సెక్టోరల్ మార్కెట్లు మిశ్రమంగా స్థిరపడ్డాయి, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.48 శాతం నష్టపోయింది, కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నష్టపోయాయి. ఇతర రంగాల సూచీల్లో బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ సూచీలు నష్టపోగా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, మీడియా సూచీలు లాభాల్లో ముగిశాయి.ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,995 షేర్లలో 1,545 షేర్లు నష్టాలలో స్థిరపడగా, 1,364 షేర్లు లాభాలను అందుకున్నాయి. 86 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.13 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.74 శాతం లాభంతో 14.05 పాయింట్ల వద్ద ముగిసింది. -
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
-
యుద్ధంలో యూఎస్ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 270 పాయింట్లు నష్టపోయి 24,841కు చేరింది. సెన్సెక్స్(Sensex) 901 ప్లాయింట్లు తగ్గి 81,507 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై దాడికి పాల్పడడమే అందుకు కారణమని చెబుతున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.22 శాతం తగ్గింది.నాస్డాక్ 0.51 శాతం నష్టపోయింది.ఇదీ చదవండి: అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలుసుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్ జోన్)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫండ్స్ కోసం పబ్లిక్ ఇష్యూ బాట
సాస్(ఎస్ఏఏఎస్) సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.83 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలకు, ప్రొడక్టులు, ప్లాట్ఫామ్ సంబంధ రీసెర్చ్, డిజైనింగ్, డెవలప్మెంట్కు రూ. 152 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రూ.10 కోట్లు కంప్యూటర్ సిస్టమ్స్ కొనుగోలుకి, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఇంతక్రితం 2021 డిసెంబర్లో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసినప్పటికీ అనుమతి లభించలేదు. కంపెనీ ప్రధానంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు ఏఐ ఆధారిత క్లౌడ్నేటివ్ సాస్ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) కంపెనీ ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 598 కోట్లను తాకింది. టర్న్అరౌండ్ సాధించి రూ. 13 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ. 59 కోట్ల నష్టాలు ప్రకటించింది.పీఎన్జీఎస్ రెవా డైమండ్ సెబీకి దరఖాస్తున్యూఢిల్లీ: రిటైల్ జ్యువెలరీ కంపెనీ పీఎన్జీఎస్ రెవా డైమండ్ జ్యువెలరీ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 289 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. 2028కల్లా కొత్తగా 15 స్టోర్లను తెరిచే ప్రణాళికల్లో ఉంది. ఈ బాటలో ప్రధాన బ్రాండు ‘రెవా’ మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల కోసం రూ. 35 కోట్లకుపైగా వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలుప్రమోటర్ పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ స్లంప్ సేల్ ద్వారా డైమండ్ బిజినెస్ను విక్రయించడంతో కంపెనీ ఆవిర్భవించింది. దీంతో పీఎన్జీఎస్ రెవా ప్రత్యేక కంపెనీగా సొంత గుర్తింపుతో డైమండ్ జ్యువెలరీ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025 మార్చి31కల్లా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో 33 స్టోర్లను కలిగి ఉంది. గతేడాది(2024–25) ఆదాయం 32 శాతం ఎగసి రూ. 258 కోట్లను తాకగా.. నికర లాభం 40 శాతం జంప్చేసి రూ.59 కోట్లను అధిగమించింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 43 పాయింట్లు లాభపడి 24,836కు చేరింది. సెన్సెక్స్(Sensex) 173 ప్లాయింట్లు పెరిగి 81,528 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆటో షేర్లు మాత్రం అదుర్స్!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర దాడులు, ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు విధించడానికి గడువు సమీపిస్తుండటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ప్రతికూలంగా పయనించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 82.79 పాయింట్లు (0.10 శాతం) క్షీణించి 81,361.87 వద్ద స్థిరపడింది. గురువారం ఈ సూచీ 81,583.94 - 81,191.04 శ్రేణిలో ట్రేడ్ అయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 18.80 పాయింట్లు (0.08 శాతం) క్షీణించి 24,793.25 వద్ద స్థిరపడింది.అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు 2.50 శాతం నుంచి 1.28 శాతం మధ్య క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, మారుతీ సుజుకీ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, లార్సెన్ అండ్ టుబ్రో 1.57-0.32 శాతం మధ్య లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.63 శాతం, 1.99 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్ లలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ మొత్తం మార్కెట్ ధోరణులను అధిగమించి, పాజిటివ్ గా క్లోజ్ అయిన ఏకైక సెక్టోరల్ ఇండెక్స్ గా అవతరించింది. ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో లాభాలతో సూచీ 0.52 శాతం లాభపడింది.మరోవైపు నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.04 శాతం నష్టంతో ముగిసింది. ఆ తర్వాత నిఫ్టీ మెటల్, మీడియా, రియల్టీ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. మిగిలిన అన్ని రంగాల సూచీలు కూడా గురువారం నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఒడిదుడుకులను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.14 శాతం క్షీణించి 14.26 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,954 షేర్లలో 2,363 నష్టాల్లో ముగియగా, 516 లాభపడ్డాయి. 75 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు లాభపడి 24,831కు చేరింది. సెన్సెక్స్(Sensex) 49 ప్లాయింట్లు పెరిగి 81,497 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.54 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.03 శాతం తగ్గిందినాస్డాక్ 0.13 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 81,237 వద్ద కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 138.64 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 41.35 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 24,812.05 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.46 శాతం, 0.23 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మీడియా 1.27 శాతం నష్టపోగా, నిఫ్టీ ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రియల్టీ, ఎనర్జీ, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.టీసీఎస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ షేర్లు 1.6 శాతం వరకు నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్ 4.4 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్లలో ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.89 శాతం క్షీణించి 14.27 పాయింట్ల వద్ద స్థిరపడింది.ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం తీవ్రతరం కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నాటాంజ్ వద్ద ఇరాన్ భూగర్భ యురేనియం కర్మాగారం దెబ్బతిన్నదన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు ఐదో రోజు కూడా కొనసాగాయి.దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, భవిష్యత్తులో రేట్ల కోత, ముడిచమురు ధరలు పెరగడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాలపై చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 89 పాయింట్లు లాభపడి 24,942కు చేరింది. సెన్సెక్స్(Sensex) 259 ప్లాయింట్లు పెరిగి 81,836 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
ముంబై: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రికత్తలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు మెటల్, ఫార్మా, ఆయిల్అండ్గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 81,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్లు పతనమై 24,853 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 369 పాయింట్లు కోల్పోయి 81,427 వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు పతనమై 24,814 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.ఆసియాలో కొరియా, జపాన్ నికాయ్ ఇండెక్సులు లాభాల్లో.., చైనా, హాంగ్కాంగ్ ఇండెక్సులు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ⇒ డాలర్ మారకంలో రూపాయి 30 పైసలు బలహీనపడి 86.34 వద్ద స్థిరపడింది. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, డాలర్ బలోపేతం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 85.96 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 85.96 – 86.28 శ్రేణిలో ట్రేడైంది.ఓస్వాల్ పంప్స్ ఐపీఓకు 34 రెట్ల స్పందన ఓస్వాల్ పంప్స్ పబ్లిక్ ఇష్యూకు 34.42 రెట్ల అధిక స్పందన లభించింది. క్యూఐబీ కోటా 88.08 రెట్లు, రిటైల్ కోటా 3.60 రెట్లు, నాన్ ఇన్స్టి ట్యూషనల్ కోటా 36.7 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. -
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ రేసు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లో అత్యధిక శాతం ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోనే జరుగుతుంటుంది. ఇటీవల నగదు విభాగంలోనూ టర్నోవర్ భారీగా పెరిగినప్పటికీ ఎఫ్పీఐలు, డీఐఐలు అధికంగా పొజిషన్స్ తీసుకునే డెరివేటివ్స్దే ఆధిపత్యం. అయితే కొన్నేళ్లుగా ఎన్ఎస్ఈలో ఎఫ్అండ్వో కాంట్రాక్టుల గడువు ప్రతి నెలా చివరి గురువారం ముగుస్తుంటే.. బీఎస్ఈలో వీటికి చివరి మంగళవారం తెరపడుతోంది.ఈ నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఒకే రోజు ఈక్విటీ డెరివేటివ్స్ ముగింపు ప్రయోజనకరంగా ఉంటుందంటూ గత నెల(మే)లో స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సూచించింది. కానీ.. బీఎస్ఈ గడువుకు ఎన్ఎస్ఈ, ఎన్ఎస్ఈ గడువుకు బీఎస్ఈ తాజాగా సెబీ నుంచి అనుమతులు పొందడం విశేషం! అటూఇటూ మార్పు(స్వాప్) ఇలా.. ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రతి నెలా చివరి మంగళవారం ముగించేందుకు సెబీ అనుమతించినట్లు ఒక ప్రకటనలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) వెల్లడించింది. ప్రస్తుతం ప్రతి నెలా చివరి గురువారం ఎఫ్అండ్వో ముగింపును చేపడుతోంది. మరోపక్క బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) సైతం డెరివేటివ్ కాంట్రాక్టుల గడువును ప్రతి నెలా చివరి మంగళవారం నుంచి గురువారానికి మార్చుకునేందుకు సెబీ అనుమతించినట్లు తెలియజేసింది.వెరసి ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ ప్రతీ నెలా చివరి మంగళవారం, బీఎస్ఈ కాంట్రాక్టులు ప్రతి నెలా చివరి గురువారం ముగియనున్నాయి. ఎఫ్అండ్వో గడువు మార్పును రెండు ఎక్స్ఛేంజీలు సర్క్యులర్లో పేర్కొన్నాయి. వెరసి 2025 సెపె్టంబర్ 1 నుంచి డెరివేటివ్ కాంట్రాక్టులకు కొత్త షెడ్యూల్ అమలుకానుంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:58 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు నష్టపోయి 24,876కు చేరింది. సెన్సెక్స్(Sensex) 233 ప్లాయింట్లు తగ్గి 81,562 వద్ద ట్రేడవుతోంది.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.94 శాతం పెరిగిందిమధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. బ్రెంట్ చమురు బ్యారల్ 74 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరుగుతోంది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ప్చ్.. టాటా మోటర్స్ మాత్రం..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఈక్విటీ మార్కెట్లు నిలకడగా ఉండి, వేగంగా పుంజుకున్నాయి. బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 1 శాతం చొప్పున పెరిగాయి.ఇంట్రాడేలో 81,865.82 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 677.55 పాయింట్లు (0.84 శాతం) పెరిగి 81,796.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 అయితే ఏకంగా 227.9 పాయింట్లు లేదా 0.92 శాతం ఎగిసి 24,946.50 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.93 శాతం, 0.95 శాతం లాభాలతో ముగిశాయి.రంగాల వారీగా చూస్తే అన్ని రంగాలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ సూచీలు వరుసగా 1.57 శాతం, 1.32 శాతం, 1.11 శాతం, 1.07 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్, ఎనర్జీ, మీడియా, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ షేర్లలో అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు 2.4 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ మాత్రమే నష్టపోయాయి. టాప్ లూజర్ గా నిలిచిన టాటా మోటార్స్ 3.76 శాతం నష్టపోయింది.మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 1.6 శాతం క్షీణించి 14.83 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక క్రూడాయిల్ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.6 శాతం తగ్గుదలతో 72.56 డాలర్లకు క్షీణించింది. -
ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు.. స్థిరంగా సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు లాభపడి 24,729కు చేరింది. సెన్సెక్స్(Sensex) 47 ప్లాయింట్లు పెరిగి 81,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.32 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.08 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.13 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.3 శాతం దిగజారింది.అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆటుపోట్లకే అధిక చాన్స్
అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నాయి. మరోపక్క ఫైనాన్షియల్ మార్కెట్లలో అత్యంత కీలకమైన బ్యాంక్ ఆఫ్ జపాన్, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలు చేపట్టనున్నాయి. దేశీయంగా చూస్తే రుతు పవన కదలికలు, టోకు ధరల గణాంకాలు ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం... – సాక్షి, బిజినెస్ డెస్క్అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు. వడ్డీ రేట్లపై కన్ను బ్యాంక్ ఆఫ్ జపాన్ రేపు(17న) పాలసీ సమీక్షను చేపట్టనుంది. మే నెల సమావేశంలో స్వల్పకాలిక వడ్డీ రేటును 0.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. 2008 తదుపరి గరిష్ట స్థాయిలో వడ్డీ రేట్లు కదులుతున్నాయి. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సైతం బుధవారం(18న) పరపతి నిర్ణయాలు ప్రకటించనుంది. గత నెలలో చేపట్టిన సమీక్షలో ఫండ్స్ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతం వద్దే కొనసాగించేందుకు ఎఫ్వోఎంసీ నిర్ణయించింది.వాణిజ్య సుంకాల నేపథ్యంలో తలెత్తిన గ్లోబల్ అనిశ్చితి, యూఎస్ ఆర్థిక మందగమనం, ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో రేట్ల కోతకు తొందరపడబోమని ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యత గల కేంద్ర బ్యాంకుల రేట్ల నిర్ణయాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్, ఆల్మండ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సేల్స్ హెడ్ కేతన్ వికమ్ తెలియజేశారు. గణాంకాల తీరు మే నెలకు చైనా పారిశ్రామిక ప్రగతి గణాంకాలు నేడు(16న) విడుదలకానున్నాయి. మార్చిలో నమోదైన 7.7 శాతం నుంచి ఏప్రిల్లో 6.1 శాతానికి తగ్గింది. ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు 5.9 శాతం నుంచి 5.1 శాతానికి నీరసించాయి. యూఎస్ మే రిటైల్ అమ్మకాలు 17న వెల్లడికానున్నాయి. మార్చిలో నమోదైన 1.7 శాతం నుంచి తగ్గి ఏప్రిల్లో 0.1 శాతానికి పరిమితమయ్యాయి.జపాన్ మే వాణిజ్య గణాంకాలు 18న వెల్లడికానున్నాయి. ఏప్రిల్లో వాణిజ్య లోటు 116 బిలియన్ జపనీస్ యెన్లకు దిగివచి్చంది. ఏప్రిల్లో జపాన్ ద్రవ్యోల్బణం 3.6 శాతంకాగా.. మే వివరాలు 20న తెలియనున్నాయి. దేశీయంగా మే టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు 16న వెలువడనున్నాయి. ఏప్రిల్లో డబ్ల్యూపీఐ 2.05 శాతం నుంచి వెనకడుగువేసి 0.85 శాతానికి పరిమితమైంది. ఇతర అంశాలు దేశీయంగా రుతుపవన కదలికలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, టోకు ధరలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. ప్రపంచ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్తోపాటు.. రంగాలవారీగా వెలువడే వార్తలు దేశీయంగా ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. గత వారమిలా...ఆర్బీఐ లిక్విడిటీ పెంపు చర్యలు, గ్లోబల్ ఆందోళనల మధ్య గత వారం(9–13) దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,070 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 81,119 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 284 పాయింట్లు(1.1 శాతం) నీరసించి 24,719 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.1 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి. సాంకేతికంగా... సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీకి 24,600 పాయింట్ల వద్ద సపోర్ట్ కనిపించవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి 24,500 దిగువకు చేరితే అమ్మకాలు ఊపందుకోవచ్చని అంచనా. 24,450 వద్ద మరోసారి మద్దతు లభించవచ్చు. ఎగువముఖంగా చూస్తే 25,350 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే ఇండెక్స్ 25,600వరకూ బలపడవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. -
స్టాక్ మార్కెట్లు.. వరుస నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పెరగడం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు పతనమయ్యాయి.ఇంట్రాడేలో 80,354.59 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 573.6 పాయింట్లు (0.7 శాతం) క్షీణించి 81,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 169.6 పాయింట్లు లేదా 0.68 శాతం క్షీణించి 24,718.6 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.24 శాతం, 0.43 శాతం నష్టపోయాయి.అయితే రంగాలవారీ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎనర్జీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 26 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ మాత్రమే లాభపడ్డాయి.ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధర బ్యారెల్కు 8.57 శాతం పెరుగుదలతో 73.87 డాలర్లకు ఎగసింది. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 7.6 శాతం పెరిగి 15.08 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.21 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.91 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 0.24 శాతం పుంజుకుంది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ సూచీలు నిన్నటి సెషన్లో ఒకశాతం నష్టపోయాయి. ఇరాన్పై ఇజ్రాయిల్ దాడికి సన్నాహాలు చేస్తోందన్న వార్తలతో క్రూడాయిల్ ధరలు పెరుగుదల, అధిక వాల్యుయేషన్ల ఆందోళనలు, వారాంతపు ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు అంశాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సూచీల ఒక శాతం పతనంతో రూ.5.98 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.449 లక్షల కోట్లు (5.26 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లు భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పతనమయ్యాయి. నిఫ్టీ 50 ఎఫ్ అండ్ ఓ వారాంతపు గడువు ముగియడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు పెరగడం, ట్రంప్ వాణిజ్య ఒప్పందం గడువు సమీపించడం వంటి అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి.ఇంట్రాడేలో 81,523.16 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 823.16 పాయింట్లు లేదా 1 శాతం క్షీణించి 81,691.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 253.2 పాయింట్లు లేదా 1.01 శాతం క్షీణించి 24,888.2 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.73 శాతం, 1.90 శాతం నష్టపోయాయి.అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే స్థిరపడ్డాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 2.02 శాతం క్షీణించగా, ఫీనిక్స్, గోర్డెజ్ ప్రాపర్టీస్, అనంత్ రాజ్, డీఎల్ఎఫ్, ప్రెస్టీజ్, శోభా, బ్రిగేడ్, మాక్రోటెక్ డెవలపర్స్ 3 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1 శాతానికి పైగా నష్టపోయాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 27 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, టైటాన్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.54 శాతం పెరిగి 14.01 పాయింట్ల వద్ద స్థిరపడింది.ㅤ ㅤ ㅤ -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.36 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 69.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.27 శాతం లాభపడింది. నాస్డాక్ 0.5 శాతం పుంజుకుంది.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలలో ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య ఇతర ఆసియా మార్కెట్ల సంకేతాలతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 82,783.5 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 123 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 82,515.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కేవలం 37.15 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 25,141.4 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.49 శాతం, 0.53 శాతం క్షీణించాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.47 శాతం, ఐటీ 1.26 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ షేర్లలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.48 శాతం క్షీణించి 13.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు లాభపడి 25,134కు చేరింది. సెన్సెక్స్(Sensex) 81 ప్లాయింట్లు పెరిగి 82,467 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.16 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 66.77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.55 శాతం లాభపడింది. నాస్డాక్ 0.63 శాతం పుంజుకుంది.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు క్షీణించడం వరుసగా ఐదో నెలలోనూ చోటు చేసుకుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో చేసే పెట్టుబడులు బలంగా నమోదయ్యాయి. ఏప్రిల్లో సిప్ పెట్టుబడులు రూ.26,632 కోట్లుగా ఉంటే, మే నెలలో రూ.26,688 కోట్లకు పెరిగాయి. ఈ మేరకు మే నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇంధన, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: ఇంధన, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ సూచీల నాలుగు రోజుల వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–0.69%), హెచ్డీఎఫ్సీ బ్యాంకు(–0.64%), ఐసీఐసీఐ బ్యాంకు(–0.85%) షేర్ల పతనంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 82,392 వద్ద స్థిరపడింది.నిఫ్టీ ఒక పాయింటు స్వల్ప లాభంతో 25,104 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 236 పాయింట్లు బలపడి 82,681 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు ఎగసి 25,199 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. విదేశీ పెట్టుబడుల పునరాగమనంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు బలపడి 85.57 స్థాయి వద్ద ముగిసింది. మెరికా చైనాల మధ్య లండన్లో జరుగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీగా రియల్టీ 1%, టెలికం 0.55%, ఫైనాన్సియల్ 0.46%, సర్విసెస్ 0.21%, కన్జూమర్ డిస్క్రిషనరీ 0.16 శాతం నష్టపోయాయి. నష్టాల మార్కెట్లోనూ ఐటీ, వినిమయ, విద్యుత్, టెక్, హెల్త్కేర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు లాభపడి 25,114కు చేరింది. సెన్సెక్స్(Sensex) 28 ప్లాయింట్లు దిగజారి 82,415 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.24 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.09 శాతం లాభపడింది. నాస్డాక్ 0.31 శాతం పుంజుకుంది.బ్యాంకుల లిక్విడిటీ పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో జోరందుకున్నాయి. ఈ ప్రభావం ఇకపైన సైతం కనిపించే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, కన్జూమర్ రంగాలలో యాక్టివిటీ కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే రుతుపవనాల కదలికలు, దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు, యూఎస్, భారత్ వాణిజ్య చర్చలు తదితర పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే చివర్లోనే ఆశలు రేపిన రుతుపవనాలు ప్రస్తుతం మందగించాయి. ఇకపై వీటి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. బ్యాంక్ షేర్లదే హవా...
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. లండన్ లో యూఎస్-చైనా వాణిజ్య చర్చలకు ముందు సానుకూల ప్రపంచ సెంటిమెంట్, బలమైన యూఎస్ ఉద్యోగాల డేటా, యూఎస్-ఇండియా వాణిజ్య చర్చల పురోగతి వంటి అంతర్జాతీయ అంశాలతో పాటు ఆర్బీఐ బలమైన ద్రవ్య విధాన చర్యల మద్దతుతో భారతీయ ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సానుకూలంగా చలించాయి. ఇంట్రాడేలో 82,669 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 256.22 పాయింట్లు (0.31 శాతం) పెరిగి 82,445.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 100.15 పాయింట్లు లేదా 0.4 శాతం లాభపడి 25,103.20 వద్ద ముగిసింది. రంగాలవారీగా చూస్తే రియల్టీ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనార్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్స్, ఐటీ, ఎనర్జీ 1 శాతానికి పైగా పెరిగాయి.సెన్సెక్స్లో కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అదేసమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.13 శాతం, 1.57 శాతం లాభాలతో ముగిశాయి. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.43 శాతం పెరిగి 14.69 వద్ద స్థిరపడింది. -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు లాభపడి 25,094కు చేరింది. సెన్సెక్స్(Sensex) 316 ప్లాయింట్లు ఎగబాకి 82,504 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.99 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 66.47 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.03 శాతం లాభపడింది. నాస్డాక్ 1.2 శాతం పుంజుకుంది.బ్యాంకుల లిక్విడిటీ పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో జోరందుకున్నాయి. ఈ ప్రభావం ఇకపైన సైతం కనిపించే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, కన్జూమర్ రంగాలలో యాక్టివిటీ కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే రుతుపవనాల కదలికలు, దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు, యూఎస్, భారత్ వాణిజ్య చర్చలు తదితర పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే చివర్లోనే ఆశలు రేపిన రుతుపవనాలు ప్రస్తుతం మందగించాయి. ఇకపై వీటి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీ ర్యాలీని చవిచూశాయి.ఇంట్రాడేలో 82,299.89 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 746.95 పాయింట్లు (0.92 శాతం) పెరిగి 82,189 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 252.15 పాయింట్లు లేదా 1.02 శాతం లాభపడి 25,003.05 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.92 శాతం పెరిగాయి.ఆర్బీఐ ఎంపీసీ 50 బేసిస్ పాయింట్ల రేట్ల కోతను ప్రకటించి, అంతర్జాతీయ వృద్ధి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని 'న్యూట్రల్' నుంచి 'న్యూట్రల్'కు మారుస్తూ రెపో రేటు కోతను ప్రకటించింది. అయితే వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్బీఐ ఎంపీసీ నాలుగు విడతల్లో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో 100 బేసిస్ పాయింట్ల కోత విధించింది. అయితే పాలసీ ప్రసంగం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రేట్లను తగ్గించే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. ఎంపీసీ సభ్యులందరూ రేట్ల వైఖరితో ఏకీభవించారని ఆయన స్పష్టం చేశారు.ప్రతిపాదిత గోల్డ్ లోన్ నిబంధనలను సడలించవచ్చని ఆర్బీఐ చెప్పడంతో ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి గోల్డ్ ఫైనాన్షియర్ల షేర్లు శుక్రవారం పెరిగాయి. ముత్తూట్ ఫైనాన్స్ 6.6 శాతం, మణప్పురం ఫైనాన్స్ 3 శాతం పెరిగాయి.ఈ ప్రకటనతో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.5 శాతం లాభంతో 56,650 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. రంగాలవారీగా చూస్తే రేట్ సెన్సిటివ్ రంగాలు దూసుకుపోతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ దాదాపు 5 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.5 శాతం, నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.4 శాతం పెరిగాయి. -
అందరిచూపు ఆర్బీఐ వైపు.. ఫ్లాట్గా మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 21 పాయింట్లు నష్టపోయి 24,727కు చేరింది. సెన్సెక్స్(Sensex) 158 ప్లాయింట్లు దిగజారి 81,293 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.53 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.83 శాతం దిగజారింది.ఈ రోజు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ఆర్బీఐ ఈసారి కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో నిన్న మార్కెట్లు పుంజుకున్నాయి. అంచనాలకు తగినట్లుగానే ఈసారి రెపో రేటులో ఆర్బీఐ కోత విధిస్తే ఇది వరుసగా మూడోసారి అవుతుంది. ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీరేట్లును తగ్గించారు. తర్వాత ఏప్రిల్లోనూ కుదించారు. డిసెంబర్లో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా వడ్డీరేట్లును తగ్గిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:06 సమయానికి నిఫ్టీ(Nifty) 127 పాయింట్లు పెరిగి 24,747కు చేరింది. సెన్సెక్స్(Sensex) 406 ప్లాయింట్లు ఎగబాకి 81,408 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.67 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.36 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం లాభపడింది. నాస్డాక్ 0.32 శాతం పుంజుకుంది.ప్రధానంగా బ్లూచిప్ కౌంటర్లలో నిన్నటి మార్కెట్లో కొనుగోళ్ల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. అంచనాలను మించిన యూఎస్ ఉపాధి గణాంకాలకుతోడు టారిఫ్లపై యూఎస్, చైనా వాణిజ్య చర్చలు సెంటిమెంటుకు జోష్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిన్నటి మార్కెట్లో ఎన్ఎస్ఈలో మెటల్, ఆయిల్ రంగాలు 0.6 శాతం పుంజుకోగా.. రియల్టీ 0.7 శాతం నీరసించింది.రూపాయి నేలచూపుదేశీ కరెన్సీ రెండో రోజు డీలా పడింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 26 పైసలు క్షీణించి 85.87 వద్ద నిలిచింది. రూపాయి 85.69 వద్ద ప్రారంభమై 86.05 వరకూ పతనమైంది. మంగళవారం సైతం రూపాయి 22 పైసలు కోల్పోయి 85.61 వద్ద ముగిసిన విషయం విదితమే. వెరసి రెండు రోజుల్లో 48 పైసలు నష్టపోయింది. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 99.11కు చేరింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
81,000 దిగువకు సెన్సెక్స్
ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య సుంకాల భయాలతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతం మేర నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 636 పాయింట్లు నష్టపోయి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,543 వద్ద నిలిచింది. సూచీలకిది మూడో రోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.ఇంధన, ఫైనాన్స్, ఐటీ షేర్లలో భారీగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 799 పాయింట్లు క్షీణించి 80,575 వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 24,502 వద్ద కనిష్టాన్ని తాకాయి. అమెరికా తయారీ రంగం వరుసగా మూడోనెలా తగ్గుముఖం పట్టడంతో పాటు చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎనిమిది నెలల్లో తొలిసారి క్షీణించినట్లు డేటా రావడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు బలహీనపడి 86.61 వద్ద స్థిరపడింది.⇒అదానీ గ్రూప్ ముంద్రా రేవు ద్వారా కొన్ని కంపెనీలు ఇరాన్ ఎల్పీజీ దిగుమతి చేసుకునేందుకు సహకరించిందనే ఆరోపణల నేపథ్యంలో గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ పోర్ట్స్, ఎన్డీటీవీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజస్ 2.50% – 2% క్షీణించాయి. ⇒ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.105)తో పోలిస్తే 19% ప్రీమియంతో రూ.125 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 24% ఎగసి రూ.130 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 20% లాభంతో రూ.126 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.743 కోట్లకు చేరింది. -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు తగ్గి 24,634కు చేరింది. సెన్సెక్స్(Sensex) 329 ప్లాయింట్లు దిగజారి 81,044 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.96 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.41 శాతం లాభపడింది. నాస్డాక్ 0.67 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉక్కు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల ఆందోళనల మధ్య భారత బెంచ్మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు, ఎఫ్ఐఐల అమ్మకాలు, రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్బీఐ ద్రవ్య విధాన ఫలితాలకు ముందు భయాందోళనలు సోమవారం సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 581 పాయింట్లు లేదా 0.71 శాతం క్షీణించి 80,870 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 165 పాయింట్లు లేదా 0.67 శాతం క్షీణించి 24,586 వద్ద ప్రారంభమైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, హెచ్సీసీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 1.7 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎస్బీఐ నష్టాల నుంచి తప్పించుకున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున క్షీణించాయి. ఫియర్ గేజ్ ఇండియా వీఐఎక్స్ ప్రారంభ డీల్స్ లో 8 శాతం పెరిగింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.9 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.16 శాతం పెరిగింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఐటీ, మెటల్, ఆటో రంగాల్లో విస్తృత స్థాయి అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి సెషన్ లో నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 182.01 పాయింట్లు (0.22 శాతం) క్షీణించి 81,451.01 వద్ద ముగిసింది. ఈ సూచీ 81,698.21 - 81,286.45 రేంజ్లో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 82.90 పాయింట్లు (0.33 శాతం) క్షీణించి 24,750.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,863.95 వద్ద, ఇంట్రాడే కనిష్ట స్థాయి 24,717.40 వద్ద నమోదయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.06 శాతం, 0.06 శాతం నష్టంతో ముగియగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ మహారాష్ట్ర బ్యాంక్, యూకో బ్యాంక్ నేతృత్వంలో 2.88 శాతం లాభంతో స్థిరపడింది.నిఫ్టీ మీడియా, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ మినహా ఎన్ఎస్ఈలోని మిగతా సెక్టోరల్ ఇండెక్స్లలన్నీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా దాదాపు ఒక శాతం (0.98 శాతం) నష్టపోయింది.ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,955 షేర్లలో 1,581 నష్టాల్లో ముగియగా, 1,299 షేర్లు లాభాలను అందుకున్నాయి. 75 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.18 లక్షల కోట్లుగా ఉంది.2025 మార్చి త్రైమాసికానికి కార్పొరేట్ ఆదాయాల తుది సెట్ను ఇన్వెస్టర్లు అంచనా వేయడం, క్యూ4 జీడీపీ గణాంకాల కోసం వేచి ఉండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ చర్యలతో ముడిపడి ఉన్న ప్రపంచ వాణిజ్య పరిణామాలను ట్రాక్ చేయడంతో మార్కెట్ సెంటిమెంట్ అప్రమత్తంగా ఉంది. -
బాలీవుడ్ నటుడు సహా 58 మందిపై సెబీ బ్యాన్
షేర్ల కొనుగోలు విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా మరికొంత మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చర్యలు చేపట్టింది. సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తూ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు మరో 57 మంది వ్యక్తులు, సంస్థలను ఏడాది నుంచి ఐదేళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది.అర్షద్ వార్సీ, ఆయన భార్య మారియాకు చెరో రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించిన సెబీ సాధన బ్రాడ్ కాస్ట్ (ప్రస్తుతం క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్) ప్రమోటర్లతో సహా మరో 57 మంది వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించింది. అంతేకాకుండా, రూ.58.01 కోట్ల అక్రమ లాభాలను దర్యాప్తు ముగిసినప్పటి నుంచి వాస్తవ చెల్లింపు తేదీ వరకు 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఈ సంస్థలను ఆదేశించింది.ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా అర్షద్ వార్సీ రూ.41.70 లక్షలు, ఆయన భార్య మారియా రూ.50.35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక సూత్రధారులు గౌరవ్ గుప్తా, రాకేశ్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని సెబీ తుది ఉత్తర్వుల్లో గుర్తించింది. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఆర్టీఏ డైరెక్టర్గా ఉన్న సుభాష్ అగర్వాల్ మనీష్ మిశ్రా, ప్రమోటర్ల మధ్య జీవోగా వ్యవహరించారని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 320.70 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో.. 81,633.02 వద్ద, నిఫ్టీ 128.35 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 24,880.80 వద్ద నిలిచింది.మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంటీసీ), వీటో స్విచ్గేర్స్ అండ్ కేబుల్స్, ఎన్టీఎల్ గ్లోబల్, నేచురల్ క్యాప్సూల్స్, ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ మొదలైన కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్, సందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓరస్, ఆల్పా లాబొరేటరీస్, లాసా సూపర్జెనరిక్స్, డీసీ ఇన్ఫోటెక్ అండ్ కమ్యూనికేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు సెషన్ ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 239.31 పాయింట్లు (0.29 శాతం) క్షీణించి 81,312.32 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 81,613.36 నుంచి 81,244.02 మధ్య ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 73.75 పాయింట్లు (0.30 శాతం) క్షీణించి 24,752.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 నేడు 24,864.25 నుంచి 24,737.05 మధ్యలో కదలాడింది. నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, నెస్లే ఇండియా షేర్లు 1.93-1.62 శాతం మధ్య నష్టపోయాయి.మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 1.51 - 0.63 శాతం మధ్య లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,940 షేర్లలో 1,462 లాభాల్లో ముగియగా, 1,395 షేర్లు నష్టాలను చవిచూశాయి. 83 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.విస్తృత మార్కెట్ సూచీల్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్వల్పంగా 0.02 శాతం నష్టపోగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.33 శాతం లాభంతో ముగిసింది. రంగాలవారీగా చూస్తే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.49 శాతం నష్టపోయింది.బ్రిటిష్ అమెరికన్ టొబాకో పీఎల్సీ (బీఏటీ) కంపెనీలో 2.5 శాతం వాటాను విక్రయించడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ 1.17 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో, మెటల్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ సూచీలు 0.68 శాతం వరకు నష్టపోయాయి.మరోవైపు నిఫ్టీ మీడియా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు మార్కెట్ ట్రెండ్ను అధిగమించి వరుసగా 1.04 శాతం, 0.97 శాతం లాభాలతో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.79 శాతం క్షీణించి 18.02 పాయింట్ల వద్ద ముగిసింది. -
రెడ్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 40 పాయింట్లు తగ్గి 24,781కు చేరింది. సెన్సెక్స్(Sensex) 152 ప్లాయింట్లు పడిపోయి 81,388 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.75 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో భారీ లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 2.05 శాతం లాభపడింది. నాస్డాక్ 2.47 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: టర్కీ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేసిన చెన్నై ఎయిర్పోర్ట్ముందుగానే ‘నైరుతి’ పలకరింపు, యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ 50% సుంకాల విధింపు వాయిదాతో దలాల్ స్ట్రీట్ ఇటీవల మార్కెట్ సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. కేంద్రానికి ఆర్బీఐ 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అంశాలు వంటి కలిసొచ్చేవిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 591.52 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో.. 81,584.94 వద్ద, నిఫ్టీ 174.95 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 24,826.20 వద్ద నిలిచాయి.నూపూర్ రీసైక్లర్స్, బోరానా వీవ్స్ లిమిటెడ్, శ్రీరామ్ ప్రాపర్టీస్, క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్, కామ్లిన్ ఫైన్ సైన్సెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్, ట్రాక్సన్ టెక్నాలజీస్, బజాజ్ హెల్త్కేర్, పార్శ్వనాథ్ డెవలపర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ముఖేశ్ భాయ్ ట్రేడింగ్ చేశారా..?
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈఓ నిఖిల్ కామత్ అడిగిన ప్రశ్నకు నీతా అంబానీ సమాధానం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ముంబైలోని నీతా అంబానీ ఆధ్వర్యంలో ఉన్న ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ‘క్లాస్ ఆఫ్ 2025’ గ్రాడ్యుయేషన్ వేడుకలకు నిఖిల్ కామత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.38 ఏళ్ల నిఖిల్ కామత్ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. భారతదేశంలో అత్యంత చిన్న వయస్కుడైన బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. స్కూల్ గ్రాడ్యుయేషన్డేలో పాల్గొన్న ఆయన ప్రసంగంలో తన మొదటి ఉద్యోగం, మొదటి జీతం, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా ప్రారంభించాడో తెలియజేశారు. వేడుకలో పాల్గొన్న ముఖేష్ అంబానీని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.నిఖిల్ కామత్ తనకు 17 ఏళ్ల వయసులో కాల్ సెంటర్లో తొలిసారి ఫుల్టైమ్ ఉద్యోగం వచ్చిందని వెల్లడించారు. ఈ ఉద్యోగం చేస్తూనే స్టాక్స్ ట్రేడింగ్ చేసేవాడినని చెప్పారు. గతంలో స్టాక్ మార్కెట్లు ఉదయం 10 గంటలకు ఓపెన్ అయ్యేవన్నారు. ఇప్పుడు అవి ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతున్నాయని చెప్పారు. తాను ఎన్నో ‘స్టాక్ మార్కెట్ మార్నింగ్స్’(మార్కెట్ ఓపెనింగ్) చూశానని చెప్పారు. అయితే ముకేశ్ భాయ్ అలాంటి మార్నింగ్స్ ఎన్ని చూశారో తనకు తెలియదన్నారు. వెంటనే నీతా అంబానీ తల అడ్డంగా ఊపుతూ చిరునవ్వులు చిందిస్తూ.. ముఖేశ్ అంబానీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయరన్నట్లు సంకేతమిచ్చారు.ఇదీ చదవండి: జెప్టో కేఫ్ల మూసివేత..?ముకేశ్ భాయ్ స్టాక్ మార్కెట్లో బిజీగా ఉన్నారో లేదో తనకు కచ్చితంగా తెలియదని, కానీ భవిష్యత్తు మార్కెట్ను దాదాపు కచ్చితంగా అంచనా వేసేవారిలో ముఖేశ్ ముందుంటారని కామత్ తెలిపారు. 15 ఏళ్ల వయసులోనే చదువు మానేసి హైస్కూల్ డ్రాపవుట్గా ఉన్న తనను స్కూల్ స్నాతకోత్సవంలో ప్రసంగించమనడం విడ్డూరంగా ఉందని కామత్ అన్నారు. -
స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల వరుస లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 220 పాయింట్లు తగ్గి 24,783కు చేరింది. సెన్సెక్స్(Sensex) 743 ప్లాయింట్లు పడిపోయి 81,431 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.89 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.95 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.67 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1 శాతం పడిపోయింది.ముందుగానే ‘నైరుతి’ పలకరింపు, యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ 50% సుంకాల విధింపు వాయిదాతో దలాల్ స్ట్రీట్ సోమవారం అరశాతానికిపైగా లాభపడింది. కేంద్రానికి ఆర్బీఐ 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అంశాలు వంటి కలిసొచ్చాయి. అమెరికా కరెన్సీ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూలతలు కలిసిరావడంతో నిన్నటి మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 35 పైసలు బలపడి 85.10 వద్ద స్థిరపడింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు.. స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 455.38 పాయింట్లు లేదా 0.56 శాతం లాభంతో.. 82,176.45 వద్ద, నిఫ్టీ 148.00 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 25,001.15 వద్ద నిలిచాయి.శ్రేయాన్స్ ఇండస్ట్రీస్, ఖైతాన్ (ఇండియా), ఎక్సారో టైల్స్, ఓరియంటల్ కార్బన్ అండ్ కెమికల్స్, వాక్స్టెక్స్ కాట్ఫ్యాబ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫేజ్ త్రీ, సాల్జర్ ఎలక్ట్రానిక్స్, కమర్షియల్ సిన్ బ్యాగ్స్, పిక్స్ ట్రాన్స్మిషన్స్, ఎమ్బి ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
స్టాక్మార్కెట్, కరెన్సీ అప్డేట్స్
నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
శుక్రవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 728.96 పాయింట్లు లేదా 0.90 శాతం లాభంతో.. 81,680.95 వద్ద, నిఫ్టీ 239.25 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,848.95 వద్ద నిలిచాయి.సిగ్మా సాల్వ్, ఖైతాన్ (ఇండియా), క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్, అపోలో పైప్స్, హొనస కన్స్యూమర్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, కృతి న్యూట్రియంట్స్, సంఘ్వీ మూవర్స్, ది గ్రోబ్ టీ, యూఎఫ్ఓ మూవీజ్ ఇండియా వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల భారీగా పడిన మార్కెట్లలో ఈ రోజు రిలీఫ్ ర్యాలీ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 173 పాయింట్లు పెరిగి 24,783కు చేరింది. సెన్సెక్స్(Sensex) 508 ప్లాయింట్లు ఎగబాకి 81,466 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.82 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.04 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం లాభపడింది.అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు గురువారం అరశాతానికిపైగా నష్టపోయాయి. అమెరికా ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు, బాండ్లపై రాబడులు పెరగడంతో ఐటీ, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా నిన్నటి మార్కెట్ సెషన్లో సెన్సెక్స్ 645 పాయింట్లు నష్టపోయి 80,952 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,107 పాయింట్లు క్షీణించి 80,490 వద్ద, నిఫ్టీ 351 పాయింట్లు పతనమై 24,462 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 5% మించగా, జపాన్ బాండ్ ఈల్డ్స్ 3.5 శాతానికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు డీలాపడ్డాయి.ఇదీ చదవండి: భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్లో వేడుకలురూపాయి 36 పైసలు క్రాష్విదేశీ బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో నిన్న రూపాయి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 36 పైసలు క్షీణించి 85.95 వద్ద స్థిరపడింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం ప్రపంచ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మధ్యప్రాచ్య దేశాల్లో భౌగోళిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడంతో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఈ పరిణామాలూ దేశీయ కరెన్సీపై ప్రభావాన్ని చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
గురువారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 644.64 పాయింట్లు లేదా 0.79 శాతం నష్టంతో 80,951.99 వద్ద, నిఫ్టీ 203.75 పాయింట్లు లేదా 0.82 శాతం నష్టంతో 24,609.70 వద్ద నిలిచాయి.కాస్మో ఫస్ట్, జై భారత్ మారుతి, నహర్ పాలీ ఫిల్మ్స్, రామ్కో సిస్టమ్, అలికాన్ కాస్టల్లాయ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్కే స్వామి, వడిలాల్ ఇండస్ట్రీస్, లింకన్ ఫార్మాస్యూటికల్స్, పారామౌంట్ కమ్యూనికేషన్స్, గీకీ వెంచర్స్ మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 225 పాయింట్లు దిగజారి 24,587కు చేరింది. సెన్సెక్స్(Sensex) 736 ప్లాయింట్లు పడిపోయి 80,813 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.61 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.41 శాతం పడిపోయింది.భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య అధికమవుతుంది. వారం రోజుల్లో 170కి పైగా కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగికరెన్సీ విలువ -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల వాతావరణంలో స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో 82,021 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 410.19 పాయింట్లు (0.51 శాతం) పెరిగి 81,596.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 129.55 పాయింట్లు లేదా 0.52 శాతం లాభపడి 24,813.45 వద్ద ముగిసింది.బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 1.87 శాతం వరకు నష్టపోయాయి.బీఎస్ఈలో ట్రేడైన 4,115 షేర్లలో 2,304 షేర్లు లాభాల్లో ముగియగా, 1,674 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.78 శాతం, 0.38 శాతం లాభాలతో ముగిశాయి.రంగాలవారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఎన్ ఎస్ ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు లాభాల్లో స్థిరపడగా, నిఫ్టీ రియాల్టీ, ఫార్మా సూచీలు వరుసగా 1.72 శాతం, 1.25 శాతం లాభపడ్డాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.93 శాతం పెరిగి 17.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 108 పాయింట్లు పెరిగి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 364 ప్లాయింట్లు ఎగబాకి 81,560 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 66.38 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.39 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.38 శాతం పడిపోయింది.ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా ఇటీవల 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బ్లూచిప్స్లో లాభాల స్వీకరణ
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 873 పాయింట్లు పతనమై 81,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 261పాయింట్లు కోల్పోయి 24,684 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఫైనాన్స్, రక్షణ రంగ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 906 పాయింట్లు క్షీణించి 81,154 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు కోల్పోయి 24,670 వద్ద కనిష్టాన్ని తాకాయి.⇒ భారీ పతనంతో మంగళవారం ఒక్కరోజే రూ.5.64 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.438 లక్షల కోట్లకు దిగివచ్చింది. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 85.58 వద్ద స్థిరపడింది.పతనం ఎందుకంటే...⇒ ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ⇒ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెట్టాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ⇒ వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రేతలుగా మారారు. అనూహ్యంగా మే 19న డీఐఐలూ అమ్మకాలకు పాల్పడ్డారు. మంగళవారం ఎఫ్ఐఐలు రూ.10,016 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. -
లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 886.65 పాయింట్లు లేదా 1.08 శాతం నష్టంతో.. 81,172.77 వద్ద, నిఫ్టీ 270.85 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 24,674.60 వద్ద నిలిచాయి.ఆల్కలీ మెటల్స్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, కాప్స్టన్ సర్వీసెస్, హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, HLE గ్లాస్కోట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గణేష్ బెంజోప్లాస్ట్, క్వెస్ కార్ప్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, డీఓఎంఎస్ ఇండస్ట్రీస్, కొచ్చిన్ షిప్యార్డ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,956కు చేరింది. సెన్సెక్స్(Sensex) 38 ప్లాయింట్లు ఎగబాకి 82,085 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.38 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.53 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.09 శాతం లాభపడింది. నాస్డాక్ 0.02 శాతం ఎగబాకింది.2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్టైల్ కంపెనీ బొరానా వీవ్స్ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్ ఆఫర్ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కు చెందిన స్లోస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోప్యాక్ టెర్మినల్స్, అరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్ బ్యాండ్లను ప్రకటించనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ ఐపీఓల సందడి!
న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా కళతప్పిన ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. 2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్టైల్ కంపెనీ బొరానా వీవ్స్ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్ ఆఫర్ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కు చెందిన స్లోస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోప్యాక్ టెరి్మనల్స్, అరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్ బ్యాండ్లను ప్రకటించనున్నాయి. ధరల శ్రేణి ఇలా... బొరానా వీవ్స్ రూ.144 కోట్ల సమీకరణ కోసం చేపడుతున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి (ప్రైస్ బ్యాండ్) ప్రకటించింది. బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఈ ఇష్యూ ద్వారా రూ.2,150 కోట్లు సమీకరిస్తోంది. దీనికి ధరల శ్రేణి రూ. 85–90గా నిర్ణయించింది. స్లోస్ బెంగళూరు రూ.3,000 కోట్ల తాజా ఈక్విటీతో పాటు ఓఎఫ్ఎస్ ద్వారా రూ.2,000 కోట్ల ప్రమోటర్ షేర్లను కూడా విక్రయించనుంది. ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఏజిస్ వోప్యాక్ టెర్మినల్స్ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించనుంది. ఇక నిర్మాణ రంగ మెటీరియల్ సరఫరాదారు ఆరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ రూ.600 కోట్లు, స్కోడా ట్యూబ్స్ రూ.275 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.ఇప్పటిదాకా 10...: ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బకు ఈ ఏడాది మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మన సూచీలు ఆల్టైమ్ గరిష్టం నుంచి దాదాపు 17 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ ప్రభావంతో కంపెనీలు ఐపీఓలకు ముఖం చాటేశాయి. 2024లో రికార్డు స్థాయిలో 91 పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1,6 లక్షల కోట్లు సమీకరించగలిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పొలోమంటూ వచి్చన ఇష్యూకల్లా సబ్స్క్రయిబ్ చేయడంతో ప్రైమరీ మార్కెట్ కళకళలాడింది. అయితే, 2025లో ఇప్పటిదాకా కేవలం 10 కంపెనీలు మాత్రమే ఐపీఓలకు వచ్చాయి. కాగా, టారిఫ్ యుద్ధానికి ట్రంప్ 90 రోజుల విరామం ప్రకటించడం.. ట్రేడ్ డీల్స్పై జోరుగా చర్చలు జరుగుతుండటంతో మార్కెట్లు మళ్లీ తాజా కనిష్టాల నుంచి బాగానే బౌన్స్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్టైమ్ గరిష్టానికి మరో 4 శాతం దూరంలోనే ఉన్నాయి. సెకండరీ మార్కెట్ దన్నుతో ఐపీఓలకు కంపెనీలు మళ్లీ ముందుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, సెబీ నుంచి దాదాపు 57 కంపెనీలకు ఐపీఓల కోసం దాదాపు లైన్ క్లియర్ కాగా.. మరో 74 కంపెనీల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. ఇందులో సోలార్/పునరుత్పాదక ఇంధనం నుంచి కో–వర్కింగ్ స్పేస్, ఫార్మా, హెల్త్కేర్, తయారీ, కెమికల్స్, రియల్టీ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఇష్యూగా నిలిచిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీ దాదాపు రూ.3,000 కోట్లు సమీకరించడం విదితమే. అయితే, పేలవంగా లిస్టయ్యి.. ఇప్పటికీ ఇష్యూ ధర (రూ.321) కంటే దిగువనే ఉండటం గమనార్హం.కోల్ ఇండియా సబ్సిడరీలు కూడా..ప్రభుత్వరంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాకు చెందిన రెండు అనుబంధ సంస్థలు.. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ (సీఎంపీడీఐ) ఐపీఓకు సన్నద్ధమవుతున్నాయి. ఈ రెండూ త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్లు కోల్ ఇండియా డైరెక్టర్ దేబశిష్ నందా వెల్లడించారు. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లను నియమించుకున్నామని, మార్కెట్ పరిస్థితులను బట్టి ఇష్యూ ఉంటుందని చెప్పారు. కోల్ ఇండియాకు 7 సబ్సిడరీలు ఉండగా. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా దీని చేతిలోనే ఉంది. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 271.17 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో.. 82,059.42 వద్ద, నిఫ్టీ 74.35 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో.. 24,945.45 వద్ద నిలిచాయి.ప్రోటీన్ ఈగోవ్ టెక్నాలజీస్, భారత్ బిజిలీ, ముకంద్, వోడాఫోన్ ఐడియా, గ్లోబల్ ఎడ్యుకేషన్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి. కయా, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), జొడియాక్ ఎనర్జీ, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, ఫుడ్స్ అండ్ ఇన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:41 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు నష్టపోయి 24,991కు చేరింది. సెన్సెక్స్(Sensex) 159 ప్లాయింట్లు దిగజారి 82,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.86 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.7 శాతం లాభపడింది. నాస్డాక్ 0.52 శాతం ఎగబాకింది.భారత్–పాకిస్థాన్ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంటుంది. ఇది మార్కెట్ సెంటిమెంట్పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)