breaking news
Stock Market
-
నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?
-
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 19.63 పాయింట్లు లేదా 0.026 శాతం నష్టంతో 74,294.96 వద్ద, నిఫ్టీ 75.80 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 23,346.40 వద్ద నిలిచాయి.అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, పూనావాలా ఫిన్కార్ప్ లిమిటెడ్, వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల బాటలో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:19 సమయానికి నిఫ్టీ(Nifty) 56 పాయింట్లు పెరిగి 23,322 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 162 పాయింట్లు పుంజుకొని 74,481 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.24బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 103.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.94 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.14 శాతం పెరిగింది.నాస్డాక్ 1.69 శాతం పుంజుకుంది.Today Nifty position 18-09-2026(time: 09:19 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టాటా గ్రూప్ షేర్లకు రెక్కలు..
టాటా సన్స్ చైర్మన్ గా ఎన్. చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందన్న వార్తలతో గురువారం టాటా గ్రూప్ కంపెనీల షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ప్రధానంగా టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ స్టాక్స్ నిఫ్టీ రికవరీకి బలమైన ఊతాన్నిచ్చాయి.బోర్డు నిర్ణయం వెనుక..టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగియనుంది. ఆయన మొదట పదవీ కాలాన్ని పొడిగించుకోవడానికి ఆసక్తి చూపకపోయినప్పటికీ, గ్రూప్ నాయకత్వం, కార్పొరేట్ పరివర్తన సమర్థవంతంగా సాగాలంటే ఆయనే కొనసాగాలని నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ కోరింది.దీంతో ఆయన ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. బోర్డు సమావేశంలో నోయల్ టాటా మినహా మిగతా సభ్యులందరూ చంద్రశేఖరన్ పునఃనియామకానికి అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం.స్టాక్ మార్కెట్లో మార్మోగిన టాటా గ్రూప్ షేర్లుటాటా కెమికల్స్ షేర్ల ధర 14% పెరిగి రూ.832 (19 వారాల గరిష్టం) లకు చేరి 6% లాభంతో రూ.775.10 వద్ద క్లోజైంది.టాటా మోటార్స్ (PV) షేర్ల విలువ 6% పైగా పెరిగి రూ.319.8 (16 వారాల గరిష్టం) గరిష్టాల వద్ద స్థిరంగా ట్రేడవుతుతోంది.టాటా ఇన్వెస్ట్మెంట్ షేర్లు 6% పెరిగి రూ.733.50 తాకి ఇంట్రాడే గరిష్ట స్థాయిల్లో కొనసాగుతోంది.టీసీఎస్ (TCS) షేర్లు 3% పైగా ఎగిసి రూ.2,263.60 లను తాకి ఫ్లాట్గా (రూ.2,193.50) ట్రేడవుతున్నాయి.కలిసొచ్చిన ఆర్బీఐ నిర్ణయంకోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (CIC)గా ఉన్న టాటా సన్స్, లిస్టింగ్ నిబంధనల నుంచి మినహాయింపు పొందడానికి ఆ హోదాను రద్దు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆ దరఖాస్తును ఆర్బీఐ ఇటీవల తిరస్కరించింది.ఈ పరిణామం టాటా సన్స్లో వాటాలు కలిగిన గ్రూప్ కంపెనీలకు (ముఖ్యంగా టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్) తీవ్ర ప్రయోజనం చేకూర్చడంతో ఈ వారం ప్రారంభం నుంచే మార్కెట్లో కొనుగోళ్ల పండగ కనిపిస్తోంది. బోర్డులో తాజా నాయకత్వ నిర్ణయం ఈ ర్యాలీకి మరింత ఊపందించింది. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 21.86 పాయింట్లు లేదా 0.029 శాతం నష్టంతో 74,314.59 వద్ద, నిఫ్టీ 53.00 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 23,270.60 వద్ద నిలిచాయి.టేగా ఇండస్ట్రీస్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, జేకే సిమెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, మీషో లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్రీన్ మార్క్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 23,258 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 68 పాయింట్లు పుంజుకొని 74,398 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.33బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 5 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.45 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.01 శాతం పడిపోయింది.Today Nifty position 17-09-2026(time: 09:21 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ పడుతున్నా తగ్గేదేలే.. 9 రోజుల్లో రూ.55,000 లాభం తెచ్చిన షేర్
-
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు యూపీఐ చార్జీల ఎఫెక్ట్.. ఎంత?
యూపీఐ (UPI) లావాదేవీలపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా యూపీఐ ద్వారా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు చెల్లింపులు చేసే వారికి కూడా చార్జీలు అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 15 నుంచి క్యాపిటల్ మార్కెట్ కేటగిరీలోని యూపీఐ చెల్లింపులపై 0.02 శాతం ఎండీఆర్ వసూలు చేయనున్నారు. ఒక్కో లావాదేవీకి ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300 ఉంటుంది.ఇన్వెస్టర్లపై నేరుగా నో ఎఫెక్ట్!కొత్త విధానంలో ఈ ఎండీఆర్ను రిటైల్ ఇన్వెస్టర్పై నేరుగా మోపడం కాకుండా, క్యాపిటల్ మార్కెట్ పరిధిలోని నియంత్రిత సంస్థలైన బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, డీలర్లు, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లు భరించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీలో ఈక్విటీ కొనుగోళ్లు, డెట్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ కొనుగోళ్లు, బ్రోకర్ అకౌంట్ లేదా వాలెట్కు నిధుల జమ వంటి యూపీఐ చెల్లింపులు ఉంటాయి.అందువల్ల సాధారణ దీర్ఘకాలిక మదుపరులకు తక్షణంగా అదనపు ఛార్జీ పడే అవకాశం పరిమితంగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సిప్ల వంటి లావాదేవీల్లో ప్రభావం తక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆయా సంస్థలు భవిష్యత్తులో తమ ఫీజు నిర్మాణాన్ని మార్చుతాయేమోనన్న ఆందోళనైతే ఉంది.రూ.1 లక్ష చెల్లిస్తే ఎంత?0.02 శాతం ఎండీఆర్ అంటే ప్రతి రూ.1 లక్ష క్యాపిటల్ మార్కెట్ యూపీఐ చెల్లింపుపై రూ.20 ఖర్చవుతుంది. రూ.5 లక్షల లావాదేవీకి లెక్క ప్రకారం రూ.100 అవుతుంది. అయితే రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించినా గరిష్ఠ ఎండీఆర్ రూ.300కే పరిమితం అవుతుంది.ఇది సాధారణ మర్చంట్ యూపీఐ చెల్లింపులపై అమలయ్యే 0.4 శాతం రేటుతో పోలిస్తే చాలా తక్కువ. సాధారణంగా రూ.2,000కు మించిన వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) లావాదేవీలకు 0.4 శాతం ఎండీఆర్, ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 వర్తిస్తుంది. మరోవైపు వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిపే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలూ ఉండవు.యాక్టివ్, ఇంట్రాడే ట్రేడర్లపై ప్రభావం?దీర్ఘకాలిక మదుపరులతో పోలిస్తే తరచూ ట్రేడింగ్ చేసే యాక్టివ్, ఇంట్రాడే ట్రేడర్ల విషయంలో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజులో అనేకసార్లు యూపీఐ ద్వారా ట్రేడింగ్ అకౌంట్లోకి నిధులు జమ చేసే సందర్భాల్లో బ్రోకర్లకు ప్రతి లావాదేవీపై ఈ ఖర్చు ఏర్పడుతుంది.డిస్కౌంట్ బ్రోకర్ల విషయంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. వీరు సాధారణంగా తక్కువ మార్జిన్లతో పనిచేస్తుండటంతో, అదనపు చెల్లింపు వ్యయం కొంత మేర లాభదాయకతపై ఒత్తిడి తేవచ్చు. దీనికి ప్రతిగా బ్రోకర్లు నెట్ బ్యాంకింగ్, NEFT/RTGS వర్చువల్ అకౌంట్లు, యూపీఐ బ్లాక్ మెకానిజం వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను మరింతగా ప్రోత్సహించే అవకాశం ఉంది.అన్ని పెట్టుబడులపైనా ఒకే ప్రభావం ఉండదుకొత్త ఎండీఆర్ ప్రభావం పెట్టుబడి సాధనం, లావాదేవీ పరిమాణం, సంబంధిత బ్రోకర్ లేదా ఏంఎంసీ ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజులపై ఆధారపడి మారవచ్చు. అందువల్ల షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర సెక్యూరిటీల లావాదేవీలపై ప్రభావం ఒకే విధంగా ఉండకపోవచ్చు.ఇదీ చదవండి: యూపీఐ చార్జీలు.. ఆర్బీఐ ఏమన్నదంటే? -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:00 సమయానికి నిఫ్టీ (Nifty) 100 పాయింట్లు పెరిగి 23,219 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 322 పాయింట్లు పుంజుకొని 74,326 వద్ద ట్రేడవుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నందున నిఫ్టీ 50, సెన్సెక్స్ కొద్దిగా పెరిగాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ లో నెస్లే ఇండియా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.25 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.56 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ ఫార్మా అత్యంత క్షీణించింది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.34బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 108.41 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 5.00 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.4 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.8 శాతం పడిపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్ల సంపద... రూ. 9 లక్షల కోట్లు ఆవిరి!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, బాండ్లపై రాబడులతో పాటు ముడిచమురు ధరలు పెరగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ 1 శాతానికి పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 778 పాయింట్లు కోల్పోయి మూడు నెలల కనిష్టం 74,004 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 280 పాయింట్లు పతనమై 5 నెలల కనిష్టం 23,119 వద్ద నిలిచింది. ప్రాథమిక మార్కెట్లో పలు ఐపీఓల సబ్స్క్రిప్షన్ ప్రారంభంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత, పశ్చిమాసియాలోకు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు, వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం (75,436) నుంచి 1,442 పాయింట్లు క్షీణించి 73,994 వద్ద, నిఫ్టీ డే హై (23,593) నుంచి 474 పాయింట్లు పతనమై 23,117 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 9 లక్షల కోట్ల మేర హరించుకుపోయి రూ.472 లక్షల కోట్లకు దిగొచి్చంది. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. భారత్కు అత్యధికంగా దిగుమతయ్యే బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 108 డాలర్లకు చేరుకుంది. ⇒ ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో క్యాపిటల్ గూడ్స్ 4.19%, రియల్టీ 3.93%, మిడ్క్యాప్ సెలెక్ట్ 2.50%, స్మాల్క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.41 శాతం పతనమయ్యాయి. ⇒ లిస్టింగ్ లాభాలు కోల్పోయిన ప్రణవ్ కన్స్ట్రక్షన్ షేరు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.124)తో పోలిస్తే 31% ప్రీమియంతో రూ.162 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 33% ఎగసి రూ.165 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి షేరు 4.50% పెరిగి రూ.130 వద్ద స్థిరపడింది.⇒ నూతన సీఈవో నియామక ప్రక్రియ ముందడుగుతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.27 శాతం పెరిగి రూ.717 వద్ద స్థిరపడింది. ⇒ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ‘టాటా సన్స్’ తన కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (సీఐసీ) నమోదును రద్దు చేసుకోవడానికి సమర్పించిన దరఖాస్తును ఆర్బీఐ తోసిపుచి్చంది. దీంతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు (లిస్టింగ్కు) రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంతో టాటా గ్రూప్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. టాటా కెమికల్స్ 20%, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 15.2% ర్యాలీ చేశాయి. టాటా కెమికల్స్ 20% ర్యాలీ చేశాయి. టీఎంపీవీ 5.9%, టీసీఎస్ 5.5%, టాటా ఎలాక్సీ 4.3%, టాటా పవర్ 3.4% పెరిగాయి. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 777.94 పాయింట్లు లేదా 1.04 శాతం నష్టంతో 74,003.82 వద్ద, నిఫ్టీ 279.50 పాయింట్లు లేదా 1.19 శాతం నష్టంతో నిలిచాయి.టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సోనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్, ఏసీఎమ్ఈ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయు. వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, జిందాల్ సా లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ దేశంలోనే అతిపెద్ద NSE IPO రెడీ
-
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 54 పాయింట్లు పెరిగి 23,456 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 214 పాయింట్లు పుంజుకొని 75,008 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.59బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 5.01 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.48 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.56 శాతం పడిపోయింది.Today Nifty position 15-09-2026(time: 09:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ ఆక్షన్ సెషన్.. సెబీ కొత్త ప్రతిపాదనలు
స్టాక్ మార్కెట్లో ఇటీవల ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) కారణంగా ఎక్స్పైరీ రోజున డెరివేటివ్స్ సెటిల్మెంట్ ధరల నిర్ణయంపై తలెత్తిన ఆందోళనలకు పరిష్కారం చూపేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇండెక్స్, సింగిల్ స్టాక్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ సెటిల్మెంట్ ధరను ఎలా నిర్ణయించాలన్న అంశంపై రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది. ఈ ప్రతిపాదనలపై మార్కెట్ భాగస్వాములు అక్టోబర్ 3 వరకు తమ అభిప్రాయాలను సమర్పించవచ్చు.సీఏఎస్తో వచ్చిన మార్పులపై సమీక్షఈక్విటీ క్యాష్ మార్కెట్లో సీఏఎస్ను సెబీ గత ఆగస్టు 3 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. షేర్లకు మరింత పారదర్శకంగా క్లోజింగ్ ప్రైస్ నిర్ణయించడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఎక్స్పైరీ రోజుల్లో సీఏఎస్ సమయంలో ఇండెక్స్ ఆప్షన్స్లో భారీగా ట్రేడింగ్ జరగడం, ఇండెక్స్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కనిపించడంతో డెరివేటివ్స్ సెటిల్మెంట్ ధరపై మార్కెట్ భాగస్వాములు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుత విధానాన్ని సమీక్షించనున్నట్లు సెబీ ఇటీవల ప్రకటించింది.రెండు సెటిల్మెంట్ విధానాలుబ్లెండెడ్ వీవ్యాప్: ఈ విధానంలో సాధారణ నిరంతర ట్రేడింగ్ సెషన్ (CTS) చివరి 30 నిమిషాల్లో జరిగిన లావాదేవీలతో పాటు, 10 నిమిషాల సీఏఎస్లో జరిగిన ట్రేడ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. రెండు సెషన్లలో జరిగిన వాస్తవ ట్రేడింగ్ వాల్యూమ్ ఆధారంగా వాటికి వెయిటేజీ ఇచ్చి సెటిల్మెంట్ ధరను నిర్ణయిస్తారు.సీటీఎస్ వీవ్యాప్: ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగించడం మరో ప్రత్యామ్నాయం. అంటే సాధారణ ట్రేడింగ్ సెషన్లో చివరి 30 నిమిషాల్లో జరిగిన లావాదేవీల వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ (VWAP) ఆధారంగానే డెరివేటివ్స్ ఎక్స్పైరీ సెటిల్మెంట్ ధరను నిర్ణయిస్తారు.ఏడాది పాటు ప్రస్తుత విధానమే?సీఏఎస్ కొత్త వ్యవస్థ కావడంతో మార్కెట్ పాల్గొనేవారికి దానిపై మరింత అవగాహన రావడానికి సమయం ఇవ్వాలని సెబీ భావిస్తోంది. అందువల్ల వెంటనే బ్లెండెడ్ వీవ్యాప్కు మారకుండా, కనీసం ఏడాది పాటు సీటీఎస్ వీవ్యాప్ను కొనసాగించి, ఆ తర్వాత సీఏఎస్లో లిక్విడిటీ, భాగస్వామ్యం, వివిధ మార్కెట్ పరిస్థితుల్లో వేలం పనితీరును సమీక్షించి బ్లెండెడ్ వీవ్యాప్కు మారే అవకాశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించింది.ఇండెక్స్ వ్యాల్యూ ప్రదర్శనకు బ్రేక్?సీఏఎస్ సమయంలో కనిపించే ఇండికేటివ్ ఇండెక్స్ వాల్యూ (IIV)పై కూడా సెబీ కీలక ప్రతిపాదన చేసింది. వేలంలో ఉన్న ఆర్డర్ల ఆధారంగా రూపొందే ఇండికేటివ్ ఈక్విలిబ్రియం ప్రైస్ (IEP) వాస్తవంగా జరిగిన ట్రేడ్ ధర కాదని, అందువల్ల దాని ఆధారంగా రూపొందే ఇండెక్స్ విలువను కూడా వాస్తవ మార్కెట్ స్థాయిగా భావించే అవకాశం ఉందని సెబీ పేర్కొంది.ఈ నేపథ్యంలో సీఏఎస్ సమయంలో ఐఈపీ ఆధారంగా రూపొందే ఇండికేటివ్ ఇండెక్స్ వాల్యూను ప్రదర్శించకుండా ఉండే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత షేర్లకు సంబంధించిన ఐఈపీలను మాత్రం కొనసాగించాలని ప్రతిపాదించింది.మార్కెట్ టైమింగ్స్లోనూ మార్పుల ప్రతిపాదనసెటిల్మెంట్ విధానంతో పాటు సీటీఎస్, సీఏఎస్, డెరివేటివ్స్ ట్రేడింగ్ మధ్య సమయ సమన్వయాన్ని కూడా సెబీ పునఃపరిశీలిస్తోంది. ఇందులో రెండు టైమింగ్ ఆప్షన్లను ప్రతిపాదించింది. ఒకదానిలో సీఏఎస్కు ముందు సీటీఎస్ను 3:30 గంటల వరకు, ఎఫ్&వో ట్రేడింగ్ను 3:45 గంటల వరకు కొనసాగించే విధానం ఉంది. మరోదానిలో సీటీఎస్ను 3:15 గంటలకు, ఎఫ్&వోను 3:30 గంటలకు ముగించే అవకాశం ఉంది.అదేవిధంగా సీఏఎస్ ముగిసిన తర్వాత డెరివేటివ్స్ ట్రేడింగ్ వ్యవధిని ఐదు నిమిషాలకు పరిమితం చేయడం, సెషన్ల మధ్య మార్పు సమయాన్ని ఒక నిమిషానికి తగ్గించడం వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. సీఏఎస్లో రిఫరెన్స్ ధరకు ±1 శాతానికి మించి ఉన్న లిమిట్ ఆర్డర్లను రద్దు చేయడంపై పరిమితులు, ధరను మెరుగుపరిచే దిశలో మాత్రమే మార్పులకు అనుమతి ఇవ్వడం వంటి చర్యలను కూడా సెబీ పరిశీలిస్తోంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 120.84 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 74,781.76 వద్ద, నిఫ్టీ 79.70 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 23,398.10 వద్ద నిలిచాయి.ఫిజిక్స్వాలా లిమిటెడ్, ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, యెస్ బ్యాంక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, వర్ల్పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘బేర్’మన్న స్టాక్ మార్కెట్.. రియల్టీ షేర్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 230 పాయింట్లు తగ్గి 23,247 వద్దకు చేరింది. సెన్సెక్స్ (Sensex) 654 పాయింట్లు నష్టపోయి 74,248 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.42 శాతం, 1.40 శాతం నష్టపోయాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ రియాల్టీ భారీగా పతనం కాగా, నిఫ్టీ ఐటీ మాత్రమే లాభాలను నమోదు చేసింది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.06బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 107.63 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.91 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.58 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.65 శాతం పడిపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్
గురువారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 138.37 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 74,902.59 వద్ద, నిఫ్టీ 46.30 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,477.80 వద్ద నిలిచాయి.స్వాన్ కార్ప్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సాయి లైఫ్ సైన్స్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
TVS Holdings భారీ బోనస్.. 100 షేర్లు ఉంటే 4,600 షేర్లు ఫ్రీ
-
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఈరోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 7 పాయింట్లు పెరిగి 23,440 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 47 పాయింట్లు పుంజుకొని 74,812 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.72బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 101 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.84 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.48 శాతం తగ్గింది.నాస్డాక్ 0.64 శాతం నష్టపోయింది.Today Nifty position 10-09-2026(time: 09:55 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market: నష్టాలే.. ఐటీ షేర్లు ఢమాల్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలలో ముగిశాయి. పెరుగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు 100 డాలర్లను తాకడంతో భారత బెంచ్ మార్క్ సూచీలు ప్రభావితమయ్యాయి. మూడవ రోజు కూడా క్షీణించాయి. సెన్సెక్స్ 813.35 పాయింట్లు లేదా 1.08 శాతం క్షీణించి 74,764.23 వద్ద, నిఫ్టీ 203.60 పాయింట్లు లేదా 0.86 శాతం క్షీణించి 23,431.50 వద్ద ముగిసింది.ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా స్టాక్లు నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.51 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.48 శాతం తగ్గాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యంత క్షీణించి 3 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ రియాల్టీ కూడా తక్కువ పనితీరు కనబరిచింది. నిఫ్టీ మెటల్ మాత్రం అవుట్ పెర్ఫార్మ్ చేసింది. -
ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!
-
‘బేర్’మన్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 135 పాయింట్లు తగ్గి 23,502 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 531 పాయింట్లు నష్టపోయి 75,045 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.81బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 99.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.8 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.58 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.32 శాతం పడిపోయింది.Today Nifty position 09-09-2026(time: 09:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 555.23 పాయింట్లు లేదా 0.73 శాతం నష్టంతో 75,577.58 వద్ద, నిఫ్టీ 144.05 పాయింట్లు లేదా 0.61 శాతం నష్టంతో 23,635.10 వద్ద నిలిచాయి.జీఈ వెర్నోవా టి&డి ఇండియా లిమిటెడ్, డేటా ప్యాటర్న్స్ (ఇండియా) లిమిటెడ్, పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, సోనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
400 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు తగ్గి 23,673 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 402 పాయింట్లు నష్టపోయి 75,719 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.78 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.29 శాతం పడిపోయింది.Today Nifty position 08-09-2026(time: 09:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 382.62 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 76,132.81 వద్ద, నిఫ్టీ 118.55 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 23,779.15 వద్ద నిలిచాయి.జైడస్ వెల్నెస్ లిమిటెడ్, టేగా ఇండస్ట్రీస్ లిమిటెడ్, జైడస్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) లిమిటెడ్, సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ
-
లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 362.57 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 76,515.43 వద్ద, నిఫ్టీ 24.25 పాయింట్లు లేదా 0.10 శాతం లాభంతో 23,897.70 వద్ద నిలిచాయి.న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, వోక్హార్డ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్ఆర్ కేబుల్ లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్, ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం భారీ లాభాల వద్ద ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 417.49 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 76,152.86 వద్ద, నిఫ్టీ 41.00 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 23,873.45 వద్ద నిలిచాయి.జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, కాప్రి గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈఐడి ప్యారీ (ఇండియా) లిమిటెడ్, గాబ్రియేల్ ఇండియా లిమిటెడ్, అథర్ ఎనర్జీ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 101 పాయింట్లు పెరిగి 24,017 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 332 పాయింట్లు పుంజుకొని 76,899 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.48బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 95.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.7 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.46 శాతం పెరిగింది.నాస్డాక్ 0.45 శాతం పుంజుకుంది.Today Nifty position 03-09-2026(time: 09:49 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఆటో, ఐటీ షేర్లు విలవిల
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలలో ముగిశాయి. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ దృక్పథం గురించి ఆందోళనలను పెంచడంతో బెంచ్ మార్క్ సూచీలు వరుసగా మూడవ సెషన్లోనూ నష్టాలను విస్తరించాయి. సెన్సెక్స్ 373.93 పాయింట్లు లేదా 0.49 శాతం క్షీణించి 76,570.35 వద్ద, నిఫ్టీ 141.35 పాయింట్లు లేదా 0.59 శాతం క్షీణించి 23,914.45 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఐషర్ మోటార్స్, విప్రో ఇండియా, బజాజ్ ఆటో టాప్ లూజర్స్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.37 శాతం తగ్గాయి. సెక్టార్ వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో 2 శాతం క్షీణించి ఇతర రంగాల సూచీలతో పోలిస్తే అత్యంత దెబ్బతింది. నిఫ్టీ, ఐటీ, మీడియా కూడా తక్కువ పనితీరు కనబరిచాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ బ్యాంక్, రియల్టీ మెరుగైన పనితీరు కనబరిచాయి. -
భారీగా పడిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:25 సమయానికి నిఫ్టీ(Nifty) 226 పాయింట్లు తగ్గి 23,827 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 683 పాయింట్లు నష్టపోయి 76,261 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.77బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 95.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.8 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.71 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.03 శాతం నష్టపోయింది.Today Nifty position 02-09-2026(time: 09:25 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయ 9:20 గంటలకు సెన్సెక్స్ 77.35 పాయింట్లు లేదా 0.10 శాతం నష్టంతో 76,879.92 వద్ద, నిఫ్టీ 40.40 పాయింట్లు లేదా 0.17 శాతం నష్టంతో 24,040.00 వద్ద నిలిచాయి.అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కేఈఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్: అదానీ షేర్లు ఢమాల్!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 307.23 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 76,957.27 వద్ద, నిఫ్టీ 95.25 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టంతో 24,080.40 వద్ద నిలిచాయి.ఏథర్ ఎనర్జీ లిమిటెడ్, ఇండెజీన్ లిమిటెడ్, సిఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. పెరుగుతున్న చమురు ధరలు, యూఎస్ వడ్డీ రేట్ల పెరుగుదల గురించి ఆందోళన కారణంగా నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి.ఉదయం 9:50 గంటల సమయానికి సెన్సెక్స్ 367.60 పాయింట్లు లేదా 0.48 శాతం క్షీణించి 76,896.91 వద్ద, నిఫ్టీ 50 148.85 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 24,026.80 వద్ద ట్రేడవుతున్నాయి.హిందాల్కో ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 73 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ సిమెంట్, నిఫ్టీ మీడియా తక్కువ పనితీరు కనబరిచాయి.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.70బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 89.31 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.73 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.52 శాతం నష్టపోయింది.Today Nifty position 28-08-2026(time: 10:00 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవో స్ట్రీట్: 2 ఆఫర్లు.. 8 లిస్టింగ్లు
ఈ నెలంతా పలు ఐపీవోలతో సందడి రేపిన ప్రైమరీ మార్కెట్లు కొత్త సెప్టెంబర్లోనూ కళకళలాడనున్నాయి. నేడు, రేపు రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. రెండు కంపెనీల ఇష్యూలు ముగియనున్నాయి. మరోపక్క ఈ వారం మెయిన్బోర్డులో ఏకంగా 8 కంపెనీలు లిస్ట్కానున్నాయి. వివరాలు చూద్దాం..పర్పుల్ స్టైల్ @ రూ. 546–575ఒక్కో షేరుకి రూ. 546–575 ధరల శ్రేణిలో పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభంకానుంది. సెపె్టంబర్ 2న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 680 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా పెర్నియాస్ పాపప్ షాప్ మాతృ సంస్థ రూ. 680 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఐపీవో నిధులలో రూ. 371 కోట్లు సొంత అనుబంధ సంస్థ పీఎస్ఎల్ రిటైల్లో ఇన్వెస్ట్ చేయనుంది. మరో రూ. 139 కోట్లు సేల్స్, మార్కెటింగ్ వ్యయాలకు కేటాయించనుంది.మిగిలిన నిధులను మల్టీబ్రాండ్ లగ్జరీ ఫ్యాషన్ ఓమ్నీ చానల్ ప్లాట్ఫామ్ నిర్వాహక కంపెనీ సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ రిటైల్గా పెర్నియాస్ పాపప్ షాప్ల ద్వారా సంప్రదాయ దుస్తులు, వ్యక్తిగత విలాసవంత వస్తువులు తదితరాలను విక్రయిస్తోంది. కంపెనీలో ఇప్పటికే సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, సచిన్, మహేశ్ బాబు తదితరులు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే!దీపా జ్యువెలర్స్ @ రూ. 168–177షేరుకి రూ. 168–177 ధరల శ్రేణిలో బంగారు ఆభరణాల తయారీ కంపెనీ దీపా జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ రేపు(సెపె్టంబర్ 1న) ప్రారంభమై 3న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.18 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 460 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. 2016లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా హాల్మార్క్డ్ బంగారు ఆభరణాల బీటూబీ డిజైనర్, ప్రాసెసర్, సరఫరాదారుగా నిలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్సహా కర్ణాటక, తమిళనాడు, కేరళలో కార్యకలాపాలు విస్తరించింది. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 8న లిస్ట్కానున్నాయి.లిస్టింగ్కు సై...నేడు లుమినో ఇండస్ట్రీస్(రూ. 700 కోట్ల సమీకరణ) ఐపీవో ముగియనుండగా.. రేపు ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్(రూ. 720 కోట్ల సమీకరణ) ఇష్యూ ముగియనుంది. ఇటీవలే ఇష్యూలు ముగించుకున్న 6 కంపెనీలతోపాటు మరో 2 సంస్థలు స్టాక్ మార్కెట్లలో ఈ వారం లిస్ట్కానున్నాయి. జాబితాలో ఆగ్మంట్ ఎంటర్ప్రైజెస్(నేడు), హైటెక్ ఇంజినీర్స్, స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్, సింబయోటెక్ ఫార్మాల్యాబ్(రేపు) చేరాయి. సెప్టెంబర్ 2న అన్ను ప్రాజెక్ట్స్, 3న లుమినో ఇండస్ట్రీస్, ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, ప్రయారిటీ జ్యువెల్స్ 4న లిస్ట్కానున్నాయి. -
ఆర్థిక గణాంకాలు.. క్రూడ్ ధరలపై ఫోకస్
ముంబై: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ ముడిచమురు (క్రూడాయిల్) ధరల కదలికలు ఈ వారం భారత స్టాక్ మార్కెట్కు దిశానిర్దేశం చేయనున్నాయి. జాక్సన్ హోల్ సదస్సులో యూఎస్ ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ చేసిన ‘కఠిన ద్రవ్య విధాన’ వ్యాఖ్యల నేపథ్యంలో.. వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వైఖరి (అవుట్లుక్) జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను శాసించనుంది.దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) నిధుల రాకపోకలపై నిఘా ఉంచాల్సి ఉంది. రంగాల వారీగా పరిశీలిస్తే ‘ఎన్విడియా అద్భుత ఆర్థిక ఫలితాలు, ఆశాజనకమైన గైడెన్స్తో గ్లోబల్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి ఊపురావడం భారత ఐటీ షేర్లకు కలిసొచ్చే అంశం. కమోడిటీల ధరలు స్థిరపడటంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొనే అవకాశముంది. అయితే, క్రూడాయిల్ ధరలు తగ్గడం చమురు ఉత్పత్తి సంస్థల షేర్లపై ఒత్తిడి పెంచవచ్చు. ఉత్పత్తి, ముడిసరుకుల వ్యయాల పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఎమ్సీజీ షేర్లు కూడా నష్టాల బాట పట్టొచ్చు. స్థూల ఆర్థిక గణాంకాల దృష్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసిక (క్యూ1) జీడీపీ గణాంకాలు నేడు (ఆగస్టు 31, సోమవారం) విడుదల కానున్నాయి. భారత ఆర్థిక వృద్ధి రేటు, రికవరీ వేగాన్ని అంచనా వేసేందుకు ఇవి అత్యంత కీలకం. రేపు (సెప్టెంబర్ 1, మంగవారం) ఆగస్టు నెలకు సంబంధించిన ఆటో విక్రయాలు, తయారీ రంగ పీఎమ్ఐ కార్యకలాపాలు, జీఎస్టీ వసూళ్ల డేటా వెలువడనుంది. అదే రోజు రాత్రి అమెరికా తయారీ రంగ ఐఎస్ఎమ్ గణాంకాలు వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ 3న (గురువారం) భారతీయ సేవల రంగ పీఎమ్ఐతో పాటు యూఎస్ ప్రైవేటురంగ ఉపాధి కల్పన (ఏడీపీ) డేటా రానుంది. ఇక వారాంతంలో (సెప్టెంబర్ 4, శుక్రవారం) ఆర్బీఐ ఫారెక్స్ నిల్వల సమాచారంతో పాటు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే ‘అమెరికా నాన్–ఫామ్ పేరోల్స్, నిరుద్యోగిత రేటు’ గణాంకాలు వెలువడనున్నాయి. చమురు పతనం.. భారత్కు లబ్ధి హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పాక్షికంగా పునఃప్రారంభం కావడంతో గత వారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 5% క్షీణించి 89.31 డాలర్లకు దిగొచ్చింది. రవాణా మరింత వేగవంతమైతే చమురు ధరలు తగ్గి భారత్ వంటి దిగుమతి దేశాలకు లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ మళ్లీ సరఫరా అడ్డంకులు ఎదురైతే మార్కెట్లపై ఒత్తిడి తప్పదు. ఇరాన్పై అమెరికా ఆంక్షలు ఆశించిన స్థాయిలో కఠినంగా లేకపోవడంతో చమురు ధరలు పడిపోయి, దిగుమతి ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. క్రూడ్ తగ్గడం, తద్వారా రూపాయి బలోపేతం కావడం మన మార్కెట్లకు సానుకూల అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు.నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్నిఫ్టీ ప్రస్తుతం పరిమిత శ్రేణిలో కన్సాలిడేషన్ అవుతోందని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. టెక్నికల్ అంశాలు బలంగా ఉన్నాయంటున్నారు. వీక్లీ టైమ్ఫ్రేమ్లో సూచీకి సానుకూల ధోరణి ఉన్నప్పటికీ, ఎగువ స్థాయిల వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. వారాంతంలో షార్ట్ కవరింగ్ జరగడంతో నిఫ్టీ 24,176 వద్ద ముగిసింది. ఈ సానుకూలత కొనసాగితే ఎగువ స్థాయిలో తక్షణ నిరోధం 24,200 – 24,300 శ్రేణిలో ఉంది. ఈ శ్రేణిని ఛేదించగలిగితే సూచీ 24,500 దాటి 24,710 స్థాయి వరకు ర్యాలీ సాగించవచ్చు. ఒకవేళ స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించక అమ్మకాలు నెలకొంటే... దిగువ స్థాయిలో 24,000 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే అమ్మకాల తీవ్రత పెరిగి సూచీ 23,600 స్థాయికి దిగొచ్చే ప్రమాదం ఉంది. -
ఇన్వెస్టర్లకు.. న్యూక్లియర్ ‘పవర్’
సోలార్ విప్లవాన్ని చూశాం. డిఫెన్స్ తయారీ విస్ఫోటాన్నీ చూశాం. అవి సృష్టించిన విజేతలనూ చూశాం. ఎన్నో అవకాశాలు... ఎన్నెన్నో కంపెనీలు. కొత్తవి వచ్చాయి. పాతవీ ఎదిగాయి. స్టాక్ మార్కెట్లో లిస్టయిన ‘వారీ రెన్యూవబుల్స్, వారీ ఎనర్జీ, కేపీఐ ఎనర్జీ, జీఈ వెర్నోవా, హిటాచీ ఎనర్జీ లాంటివి కళ్లు చెదిరే లాభాలనిచ్చాయి. దేశ సోలార్ ఎనర్జీ సామర్థ్యం ఏకంగా 150 గిగావాట్లకు చేరింది. కాకపోతే ఇది స్థాపిత సామర్థ్యం. దీని ద్వారా నికరంగా ఉత్పత్తయ్యేది 20 నుంచి 22 శాతం మాత్రమే. 30 నుంచి 33 గిగావాట్లు. డిఫెన్స్ కంపెనీలైతే చెప్పనక్కర్లేదు. రక్షణ రంగానికి చిన్న చిన్న పరికరాలు తయారు చేసే స్మాల్ క్యాప్ కంపెనీలు సైతం ఏకంగా లార్జ్క్యాప్ స్థాయికి చేరాయి. ప్రభుత్వ రంగంతో సహా పలు కంపెనీలు మల్టీ బ్యాగర్ రాబడులనిచ్చాయి. ఇపుడు అణు విద్యుత్తు విషయానికొద్దాం. ప్రస్తుతం ఉత్పత్తవుతున్నది 8–9 గిగావాట్లు. కానీ వచ్చే 20 ఏళ్లలో 100 గిగావాట్లకు చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. సౌర, పవన విద్యుత్తుల మాదిరి కాకుండా ఈ ప్లాంట్లు 85–90% సామర్థ్యంతో నడుస్తాయి. కాబట్టి 100 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే 85–90 గిగావాట్ల నికర విద్యుత్తూ ఉత్పత్తవుతుంది. అంటే సోలార్కన్నా 3 రెట్లు ఎక్కువ. కాకపోతే ప్రస్తుత సామర్థ్యాన్ని ఏకంగా 10 రెట్లు పెంచాలి. మరి దానికెంత యురేనియం కావాలి? ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని కేంద్రాలు నిర్మించే సత్తా మనకుందా? ఎలాంటి పరికరాలు కావాలి? వాటిని తయారు చేసేదెవరు? ప్లాంట్లు నిర్మించేదెవరు? వీటిలో లాభపడే కంపెనీలేంటి? రాబోయే అవకాశాలేంటి? సోలార్కు 3 రెట్లుండే ఈ ‘న్యూక్లియర్ ఎకానమీ’లో భవిష్యత్తు విజేతలెవరు? ఇన్వెస్టర్లు దీన్నెలా తీసుకోవాలి? ఇదే ఈ ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం..- రమణమూర్తి మంథా అణు విద్యుత్తును థర్మల్లానే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయటం సాధ్యమేనా? అంటే... అవుననే చెప్పాలి. ఎందుకంటే ఒక గిగావాట్ విద్యుత్కు ఏడాదికి 160–200 టన్నుల యురేనియం ఉంటే చాలు. శుద్ధిచేశాక వచ్చే 25–30 టన్నుల యురేనియం ఇంధనాన్ని అణు రియాక్టర్లలో నేరుగా వాడొచ్చు. అదే థర్మల్ విద్యుత్తుకైతే ఒక గిగావాట్కు ఏకంగా 3–4 మిలియన్ టన్నుల బొగ్గు కావాలి. అంటే 20వేల కిలోల బొగ్గు చేసే పనిని.. ఒక కిలో యురేనియం చేస్తుంది. కాబట్టి థర్మల్ మాదిరి నిరంతరం ప్లాంట్లకు గూడ్సు రైళ్లు తిరగక్కర్లేదు. ఏడాది, రెండేళ్లకోసారి ఇంధనాన్ని రవాణా చేస్తే చాలు. ఇక ప్రభుత్వం లక్షించిన 100 గిగావాట్లకైతే ఏడాదికి 17,000 టన్నులు కావాలి. మరి అంత యురేనియం నిల్వలు మన దగ్గరున్నాయా? ఇదే అసలైన సవాలు. దేశంలో ప్రస్తుతం ఏటా 600–800 టన్నుల యురేనియం ఉత్పత్తవుతోంది. అంటే 100 గిగావాట్లకు కావాల్సిన దాంట్లో 4–5 శాతం. ఏపీలోని తుమ్మలపల్లె (కడప), తెలంగాణలోని లంబాపూర్–పెద్దగట్టు, జార్ఖండ్లోని జాదుగూడ, మేఘాలయ, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్లలో యురేనియం నిల్వలున్నా... చాలావరకూ లో గ్రేడ్. ఇవి దాదాపు 4 లక్షల టన్నులుండొచ్చని అంచనా. ఇదీ చదవండి: ఎఫ్ అండ్ ఓ... ముంచేస్తోంది!కాకుంటే ఎక్కువశాతం లోగ్రేడ్. కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలతో పోలిస్తే మనకు వెలికి తీయటానికయ్యే ఖర్చు ఎక్కువ. కాబట్టి ప్రస్తుతం అణు విద్యుదుత్పత్తికి కజకిస్తాన్, కెనడా, ఉజ్బెకిస్తాన్, రష్యా, నమీబియా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటున్నాం. కాకపోతే కొన్ని సంవత్సరాలకు సరిపడా యురేనియాన్ని ఒకేసారి నిల్వ చేసుకోవచ్చు కనక దిగుమతులకు పెద్ద సమస్యేమీ లేదు. విశేషమేంటంటే దేశంలోని యురేనియం నిల్వల్లో 4వ వంతు... అంటే లక్ష టన్నులకు పైగా ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లె పరిశరాల్లోనే ఉన్నట్లు అంచనా. థోరియంపైనే ఆశలన్నీ... దేశంలో హైగ్రేడ్ యురేనియం నిల్వలు తక్కువ. కాకపోతే కావాల్సినంత యురేనియాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి అనుమతులున్నాయి. కానీ భారత అణుశక్తి విభాగం మాత్రం యురేనియం విషయంలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే లక్ష్యంతో ఉంది. అందుకే... ప్రపంచంలోకెల్లా ఇక్కడే అత్యధికంగా ఉన్న థోరియం నిల్వల్ని ఇందుకు ఉపయోగించుకోవాలనే యోచనలో ఉంది. మొనజైట్ అత్యధికంగా ఉండే కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిషాలోని బీచ్ శాండ్స్లో థోరియం నిల్వలు భారీగా ఉన్నాయి. దేశంలో అంచనా వేసిన నిల్వలు 10 లక్షల టన్నులకు పైనే.కానీ రియాక్టర్లలో ఇంధనంగా నేరుగా థోరియం పనిచెయ్యదు. దాన్ని యురేనియంగా మార్చాలి. దశాబ్దాల కిందట హోమీ జహంగీర్ బాబా నేతృత్వంలోనే దీనికి సంబంధించిన మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేశారు. సహజ యురేనియాన్ని ఇంధనంగా వాడి భారజల రియాక్టర్ల ద్వారా విద్యుత్తును, ప్లుటోనియాన్ని ఉత్పత్తి చేయటం తొలిదశ. రెండోదశలో ఫాస్ట్బ్రీడర్ రియాక్టర్లలో థోరియంను ఇంధనంగా వాడి యురేనియం–233ని ఉత్పత్తి చేయటం... మూడోదశలో థోరియం రియాక్టర్లలో యురేనియం–233ని వాడి విద్యుదుత్పత్తి చేయటం.ఇదీ చదవండి: వీటి ‘హోల్డింగ్’ వ్యూహాత్మకమే! నిజానికి ఇప్పటికీ మనదేశం మూడోదశకు చేరలేదు. తొలిదశ నుంచి రెండోదశకు వెళుతున్న పరిస్థితుల్లోనే ఉంది. థోరియం నుంచి యురేనియం –233 ఉత్పత్తికి కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పనిచేస్తోంది కూడా. మూడోదశకు మరికొంత సమయం పట్టినా... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సరిపడినన్ని యురేనియం నిల్వలున్నాయి కనక, దిగుమతి చేసుకోవటానికి మనకు ఇబ్బందుల్లేవు కనక 100 గిగావాట్ల లక్ష్యానికి ఇబ్బందులు లేవన్నది నిపుణుల మాట. 100 గిగావాట్లకు కావాల్సిందేంటి? రియాక్టర్లే కాదు. మొత్తం న్యూక్లియర్ వ్యవస్థ ఎదగాలి. లక్షల కోట్ల పెట్టుబడులు కావాలి. న్యూక్లియర్ గ్రేడ్ ఫోర్జింగ్, కంట్రోల్ వ్యవస్థలు, అత్యంత దృఢమైన పంప్లు, వాల్వ్లు, ప్రత్యేక లోహాలు, ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా, ఇంధన ప్రాసెసింగ్, వేస్ట్ మేనేజిమెంట్ ఇలా పలు రకాల వ్యవస్థలు కావాలి. రియాక్టర్లనేవి ఒక కోణమే. విస్తరించే క్రమంలో డజన్ల కొద్దీ ప్రత్యేక పరిశ్రమలు కావాలి. నిజానికి దేశంలో తమ పేర్లలోనే సౌర, పవన విద్యుత్తును తగిలించుకున్న కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ‘అణు’ విద్యుత్తు పేరిట ప్రభుత్వ కార్పొరేషన్లు తప్ప ఒక్క లిస్టెడ్ కంపెనీ కూడా లేదు. కాకపోతే దీనికి కావాల్సిన కీలక పరికరాలు తయారుచేసే కంపెనీలు చాలావరకూ వచ్చే రెండు దశాబ్దాల్లో లబ్ధి పొందనున్నాయి. వాటిని ఇన్వెస్టర్లు రకరకాలుగా వర్గీకరించుకోవచ్చు...హెవీ ఫోర్జింగ్స్, అణు పరికరాలుఎక్కువ లబ్ధి పొందేది ఈ రంగమే. ఎందుకంటే రియాక్టర్లకు వందల కొద్దీ టన్నుల... లెక్కలేనన్ని ఫోర్జింగ్ చేసిన పరికరాలు కావాలి. దీన్లో అగ్రగామి ఎల్ అండ్ టీయే. ఎందుకంటే రియాక్టర్ల నిర్మాణం, హెవీ ఫోర్జింగ్స్, స్టీమ్ జనరేటర్లు, రియాక్టర్ కూలింగ్ వ్యవస్థలు, న్యూక్లియర్ పైపులతో సహా మొత్తం ఈపీసీని పూర్తిచేసే సామర్థ్యం దేశంలో ఈ కంపెనీ ఒక్కదానికే ఉంది. వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ పురాతన అణు ఇంజినీరింగ్ కంపెనీగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే రియాక్టర్ పరికరాలు, కాలండ్రియా భాగాలు, ఎండ్ షీల్డ్లు, హెవీ ఫోర్జింగ్లు దీని ప్రత్యేకత. ఈ రంగంలోకి రావటానికి రకరకాల అర్హతలుండాలి కనక కొత్త కంపెనీలు రావటం అంత తేలికకాదు. కాకపోతే ఈ కంపెనీ సైజు చిన్నది. పని పూర్తి చేయటంలో రిస్కు ఎక్కువ. విజయవంతంగా పూర్తయితే రివార్డూ ఎక్కువే. బీహెచ్ఈఎల్ ఎక్కువమంది ఈ కంపెనీ కేవలం టర్బయిన్లే తయారు చేస్తుందనుకుంటారు. కానీ ఇది స్టీమ్ జనరేటర్లు, హీట్ ఎక్స్ఛేంజీలు, అణు పరికరాలు, భారీ ఫ్యాబ్రికేటెడ్ పరికరాలు సరఫరా చేస్తుంది. కాబట్టి అణు విద్యుత్తు లక్ష్యంలో దీని వాటా ఎక్కువే ఉంటుంది. ప్రెసిషన్ ఇంజినీరింగ్ రియాక్టర్లలోని పరికరాలు తయారు చేసే కంపెనీల విషయానికొస్తే ఎంటార్ టెక్నాలజీస్ను ప్రధాన లబ్ధిదారుగా చూడొచ్చు. ఫ్యూయల్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, రియాక్టర్ అసెంబ్లీలు, ప్రెసిషన్ మెషిన్ భాగాలు, ఏరోస్పేస్ పరికరాలు, ఇస్రో పరికరాలు తయారు చేసే ఈ తరహా కంపెనీలు తక్కువే. ఇందులోకి ప్రవేశించటం అంత తేలికకాదుకనక పోటీ కూడా తక్కువే. పీటీసీ ఇండస్ట్రీస్: ప్రత్యేకంగా వాచ్ చేయాల్సిన కంపెనీ ఇది. హైస్పీడ్ సూపర్ అల్లాయ్ కాస్టింగ్లు తయారు చేసే ఈ కంపెనీ ఏరోస్పేస్, డిఫెన్స్, అణు రంగాలకు వీటిని సరఫరా చేస్తోంది. అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరిగితే అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునే అల్లాయ్ కాస్టింగ్లు ఎక్కువ కావాలి. అప్పుడు పీటీసీ బాగా లబ్ధి పొందే అవకాశముంది. పంప్లు, వాల్వ్లుప్రతి అణు విద్యుత్తు కర్మాగారానికీ వేలకొద్దీ వాల్్వలు కావాలి. అలాగని అవేమీ సాధారణ వాల్వ్లు కాదు. రేడియేషన్ను, అత్యధిక ఒత్తిడిని, అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకుని దశాబ్దాల పాటు రాణించాలి. దీనికి సంబంధించిన లిస్టెడ్ కంపెనీల్ని చూస్తే కేఎస్బీ లిమిటెడ్కు ఎక్కువ ప్రాధాన్యమివ్వవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రైమరీ కూలెంట్ పంప్లు, న్యూక్లియర్ గ్రేడ్ పంప్లు సరఫరా చేసిన చరిత్ర దీని సొంతం. ఆ తరువాతి స్థానంలో డబ్ల్యూపీఐఎల్, కిర్లోస్కర్ బ్రదర్స్ కంపెనీలను వాచ్ లిస్టులో పెట్టుకోవచ్చు.స్పెషల్ అల్లాయ్స్ అణు విద్యుత్తు కర్మాగారాలకు భారీ ఎత్తున ప్రత్యేక లోహాలు కావాలి. దీనికి సంబంధించి దేశంలో పోటీ లేని అగ్రశ్రేణి సంస్థ ‘మిశ్రా ధాతు నిగమ్ – మిధానీ’యే అని చెప్పొచ్చు, ప్రభుత్వ రంగంలోని ఈ సంస్థ ప్రత్యేక లోహాలతో పాటు టైటానియం లోహాలు, నికెల్ అల్లాయ్స్, స్పెషల్ స్టీల్స్ తయారు చేస్తుంది. అంతేకాదు. ఇస్రో, డీఆర్డీఓ, న్యూక్లియర్ రంగాలకు సరఫరా కూడా చేస్తోంది. ఆ తరువాతి స్థానంలో ఆధునిక లోహాలు తయారు చేసే కంపెనీగా పీటీసీ ఇండస్ట్రీస్ను కూడా వాచ్లిస్టులో పెట్టుకోవచ్చు. నిర్మాణం – ఈపీసీ అణు విద్యుత్తు కర్మాగారాలకు అయ్యే ఖర్చులో సివిల్ నిర్మాణాలకే ఎక్కువవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎల్ అండ్ టీ, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వంటివి ప్రధాన లబ్ధిదారులుగా నిలిచే అవకాశముంది. హెచ్సీసీకి దీర్ఘకాల చరిత్ర ఉండగా... కైగా అణు విద్యుత్ కర్మాగారంలో టర్బైన్ ఐలాండ్ పనుల్ని పూర్తిచేసిన చరిత్ర పవర్ మెక్ ప్రాజెక్ట్స్’కు ఉంది. దీని న్యూక్లియర్ పోర్టుఫోలియో పెరుగుతోంది కూడా.ఇన్స్ట్రమెంటేషన్ సేన్సర్స్, ఆటోమేషన్, సేఫ్టీ వ్యవస్థలు, కంట్రోల్ ప్యానెల్ వంటివి కావాల్సిన ఈ రంగంలో టాటా గ్రూప్నకు చెందిన హనీవెల్ ఆటోమేషన్ ఇండియాను లీడర్గా చెప్పొచ్చు. కాకపోతే సీమెన్స్ ఇండియా, ఏబీబీ ఇండియా వంటివి దీనికి పోటీదారులుగా నిలుస్తాయి. ట్రాన్స్మిషన్అణు విద్యుత్తు ప్లాంట్లలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తలెత్తే నష్టాన్ని అంచనా వేయలేం. కాబట్టి అలాంటి సమయాల్లో జనాన్ని తరలించడానికి, ప్రమాదాన్ని నిలువరించడానికి భారీ ఎత్తున ఎవాక్యుయేషన్ వ్యవస్థలుండాలి. హిటాచీ ఎనర్జీ ఇండియా, జీఈ వెర్నోవా టీ అండ్ డీ ఇండియా, కేఈసీ ఇంటర్నేషనల్, కల్పతరు ప్రాజెక్ట్స్’ ఇంటర్నేషనల్ వంటివి ఈ రంగంలో దిగ్గజాలు.ఫ్యూయల్ సైకిల్...ఇది చాలా క్లిష్టమైన రంగం. కాబట్టి ప్రతిదీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ), భారజల బోర్డు ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనివే. అన్లిస్టెడ్ సంస్థలే. మొత్తంగా చూస్తే అణు విద్యుత్తు లక్ష్యం సాకారమవుతున్న కొద్దీ భారీ ఆర్డర్ బుక్స్తో ఎదిగే కంపెనీల జాబితా ఎక్కువే కనిపిస్తోంది. కాకపోతే దీనికి పట్టే సమయం ఎక్కువ. రివార్డు కూడా ఎక్కువే ఉంటుంది కనక... దీర్ఘకాలం దృష్టితో ఇన్వెస్టర్లు న్యూక్లియర్ ఎకానమీ కంపెనీలకు పోర్టుఫోలియోలో చోటివ్వవచ్చు. -
జియో.. మెగా ఐపీవోకు సై
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన టెలికం, డిజిటల్ సర్వీసుల విభాగం జియో ప్లాట్ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 37,700 కోట్లు (3.8 బిలియన్ డాలర్లు) సమీకరించనుంది. జియో ప్లాట్ఫామ్స్ సెబీకి ఈ ఏడాది జూన్లో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో 27 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇది ఐపీవో తదుపరి ఈక్విటీ మూలధనంలో 2.9%కి సమానంకాగా.. కంపెనీ విలువ 137 బిలియన్ డాలర్లకు చేరవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.వెరసి దేశీ మార్కెట్లో అతిపెద్ద ఇష్యూగా నిలిచే అవకాశముంది. తద్వారా 2024లో రికార్డ్ నెలకొల్పుతూ 3.3 బిలియన్ డాలర్ల ఐపీవో చేపట్టిన హ్యుందాయ్ మోటార్ను అధిగమించనుంది. అంతేకాకుండా దేశీ స్టాక్ ఎక్స్చెంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ సైతం భారీ ఐపీవో ద్వారా దాదాపు రూ. 30,000 కోట్లు సమీకరించనుంది. ఇష్యూతో జియో, హ్యుందాయ్ తర్వాత ఎన్ఎస్ఈ నిలవవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా.రుణ చెల్లింపులకు జియో ప్లాట్ఫామ్స్ ఐపీవో నిధులలో రూ. 27,500 కోట్లు కీలక అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. జియో ప్లాట్ఫామ్స్ గతంలో ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ, పీఈ దిగ్గజాల నుంచి పెట్టుబడులు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. 2020లో మెటాకు 9.99% వాటా కేటాయించడం ద్వారా రూ. 43,574 కోట్లు అందుకోగా.. గూగుల్ 7.73 శాతం వాటాకు రూ. 33,737 కోట్లు వెచి్చంచింది.ఈ బాటలో మరో 15.2 శాతం వాటాను సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, టీపీజీ, క్వాల్కామ్ వెంచర్స్, ఇంటెల్ క్యాపిటల్ తదితర ఫైనాన్షియల్, వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాల నుంచి రూ. 74,745 కోట్లు సమకూర్చుకుంది. ప్రస్తుతం కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 66.43% కాగా.. మెటా, గూగుల్ సంయుక్తంగా 17.71% వాటాను కలిగి ఉన్నాయి. మిగిలిన వాటా ఇతర ఇన్వెస్ట్మెంట్ కంపెనీల చేతిలో ఉంది. 2008 తదుపరి రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీవోగా జియో ప్లాట్ఫామ్స్ నిలవనుంది. -
రూ.1 లక్ష పెట్టుబడికి.. రూ.44 లక్షల లాభం?
గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయంలో సెన్సెక్స్లో ఒక్కసారిగా భారీ మార్పులు కనిపించాయి. దీంతో ట్రేడర్లలో దీనిపై చర్చ మొదలైంది. ఓ ట్రేడర్ ఎక్స్లో చేసిన పోస్ట్ ప్రకారం.. సెన్సెక్స్ 76,500 పుట్ ఆప్షన్లో మధ్యాహ్నం 3.15 గంటలకు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి, 3.20 గంటలకు విక్రయించి ఉంటే దాదాపు రూ.44 లక్షల లాభం వచ్చేదని పేర్కొన్నారు. అయితే ఇది కేవలం ఊహాత్మక లెక్క మాత్రమే. నిజంగా ఎవరో రూ.1 లక్ష పెట్టి రూ.44 లక్షలు సంపాదించారని భావించకూడదు. అంతేకాదు.. అసలు పోస్టులో 3.15 PMకు బదులుగా పొరపాటున 3.15 AM అని పేర్కొన్నారు.సెన్సెక్స్లో అనూహ్య కదలికలునెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజున మార్కెట్ క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్లో అనూహ్య కదలికలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 3.17 గంటలకు సుమారు 77,200 వద్ద ఉన్న సెన్సెక్స్.. కేవలం కొన్ని నిమిషాల్లోనే 74,983 స్థాయికి పడిపోయింది. అంటే 2,000 పాయింట్లకు పైగా క్షీణించింది. ఆ తర్వాత అంతే వేగంగా కోలుకుని, మరో ఏడు నిమిషాల్లో దాదాపు 2,000 పాయింట్లు తిరిగి పుంజుకుంది. చివరకు సెన్సెక్స్ 76,934 వద్ద ముగిసింది. దీంతో బుధవారం ముగింపుతో పోలిస్తే 539 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది.కీలక షేర్లలోనూ భారీ మార్పులుసెన్సెక్స్లో వచ్చిన ఈ కదలికలు ఇతర ప్రధాన షేర్లలోనూ కనిపించాయి. సెన్సెక్స్లో అత్యధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సుమారు రూ.1,289 నుంచి రూ.1,250కి పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ వేగంగా పుంజుకుని రూ.1,286 వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, భారతి ఎయిర్టెల్ వంటి ప్రముఖ షేర్లలోనూ మార్కెట్ ముగిసే సమయంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.క్లోజింగ్ ఆక్షన్ సెషన్పై ప్రశ్నలుఈ పరిణామాలతో బీఎస్ఈ ఇటీవల తీసుకొచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS)పై కూడా చర్చ మొదలైంది. ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా మార్కెట్ ముగింపు ధరను మరింత పారదర్శకంగా నిర్ణయించడం, ధరల తారుమారుకు అవకాశం తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే CAS ప్రారంభమైన తర్వాత మార్కెట్ చివరి 15 నిమిషాల్లో సెన్సెక్స్, నిఫ్టీల్లో అసాధారణ స్థాయిలో కదలికలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సెబీ చర్యలతో ఆసక్తిఇటీవల సెన్సెక్స్, దాని కీలక షేర్లకు సంబంధించిన ట్రేడింగ్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సెబీ రెండు సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే రూ.1 లక్ష నుంచి రూ.44 లక్షల లాభం అన్నది ఒక ట్రేడర్ చేసిన హైపోతెటికల్ లెక్క మాత్రమే. వాస్తవ ట్రేడింగ్లో ఆ ధరకు ఆప్షన్ను కొనడం, సరైన సమయంలో విక్రయించడం, మార్కెట్లో లిక్విడిటీ ఉండటం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే ఈ ఉదాహరణను ఖచ్చితమైన లేదా సులభమైన లాభ అవకాశంగా చూడకూడదు. పెట్టుబడిదారులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి.if you have invested 1L in Sensex option 76500 PE at 3:15 AM and exited at 3:20 PM you would have made 44 lakhs44 times in just 5 minPower of CAS 💪🏻— Vibhor Varshney (@nakulvibhor) August 27, 2026 -
ఐటీ షేర్ల జోరు.. స్టాక్మార్కెట్కు లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా, మెటల్ షేర్లు పుంజుకోవడంతో బెంచ్ మార్క్ సూచీలు రెండు రోజుల వరుస నష్టాలను విచ్ఛిన్నం చేశాయి. సెన్సెక్స్ 330.92 పాయింట్లు లేదా 0.43 శాతం పెరిగి 77,264.51 వద్ద, నిఫ్టీ 84.80 పాయింట్లు లేదా 0.35 శాతం పెరిగి 24,175.65 వద్ద స్థిరపడ్డాయి.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.2 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ టాప్ పెర్ఫార్మర్ గా ఉద్భవించగా, నిఫ్టీ కెమికల్ అత్యధికంగా క్షీణించింది. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:57 సమయానికి నిఫ్టీ(Nifty) 69 పాయింట్లు పెరిగి 24,158 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 292 పాయింట్లు పెరిగి 77,226 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.14బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.68 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.57 శాతం ఎగబాకింది.Today Nifty position 28-08-2026(time: 09:57 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్కు సిమెంట్ షేర్ల దెబ్బ..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య మెటల్, పీఎస్యూ బ్యాంక్, సిమెంట్ షేర్లు క్షీణించడంతో బెంచ్ మార్క్ సూచీలకు వరుసగా రెండో రోజూ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 539.35 పాయింట్లు లేదా 0.7 శాతం క్షీణించి 76,933.59 వద్ద, నిఫ్టీ 50 116.90 పాయింట్లు లేదా 0.48 శాతం క్షీణించి 24,090.85 వద్ద స్థిరపడ్డాయి.హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 0.1 శాతం, 0.13 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ సిమెంట్ 1 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 19 పాయింట్లు పెరిగి 24,225 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 3 పాయింట్లు పెరిగి 77,484 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.14బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.02 శాతం తగ్గింది.నాస్డాక్ 0.08 శాతం దిగజారింది.Today Nifty position 27-08-2026(time: 09:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ భద్రత కోసం సెబీ బిగ్ స్టెప్!
సెక్యూరిటీల మార్కెట్లో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం ‘సైబర్ సురక్ష పోర్టల్’ను ప్రారంభించింది. సైబర్ భద్రతకు సంబంధించిన సర్క్యులర్లు, వ్యవస్థల్లోని భద్రతా లోపాలపై హెచ్చరికలు, సైబర్ ఘటనలకు సంబంధించిన విశ్లేషణలను ఒకేచోట అందించే వన్–స్టాప్ హబ్గా ఇది పనిచేస్తుందని సెబీ తెలిపింది.‘‘సెక్యూరిటీల మార్కెట్లో సైబర్ భద్రతకు సంబంధించిన కీలక పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని పంచుకోవడానికి ఈ వేదిక సమగ్ర, కేంద్రీకృత కేంద్రంగా ఉపయోగపడుతుంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పోర్టల్ ద్వారా మార్కెట్ భాగస్వాములు తాజా సైబర్ భద్రతా సర్క్యులర్లు, భద్రతా లోపాలపై హెచ్చరికలు, సైబర్ ఘటనలకు సంబంధించిన వివరాలను నేరుగా పొందవచ్చని సెబీ తెలిపింది.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
మిశ్రమంగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:24 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు తగ్గి 24,301 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 71 పాయింట్లు పుంజుకొని 77,719 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 86.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.64 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.32 శాతం పెరిగింది.నాస్డాక్ 0.66 శాతం పుంజుకుంది.Today Nifty position 26-08-2026(time: 10:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లలో మురిపించిన రికవరీ
గత కొన్ని రోజులుగా ఆచితూచి అడుగులు వేస్తున్న భారత స్టాక్ మార్కెట్ ఈరోజు ఆరంభంలో నష్టాల్లోకి జారినా మార్కెట్ ముగిసే సమయానికి ‘అంతకంటే తీపి లేదు’ అన్నట్లుగా ఆశాజనక వాతావరణంలో లాభాల బాట పట్టింది. ఆగస్టు 25, 2026 నాటి ట్రేడింగ్లో దేశీయ ప్రధాన సూచీలు రికవరీని సాధించాయి. తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన ఈనాటి సెషన్లో నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకొని 24,334 వద్ద ముగియగా, సెన్సెక్స్ 286 పాయింట్లు ఎగబాకి 77,656 పాయింట్ల స్థాయికి చేరింది.గ్లోబల్ సెంటిమెంట్.. మార్కెట్ గమనంఅంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఉదయం అడుగడుగునా గండం అన్నట్లు ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్న సమయానికి కొనుగోళ్ల మద్దతుతో ఊపందుకున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్పై అమెరికా తాజా ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 90 డాలర్లకు పైగా ట్రేడ్ అవ్వడం మన మార్కెట్లను మొదట్లో భయపెట్టింది. అయితే అంతర్జాతీయంగా అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మున్ముందు వడ్డీ రేట్ల తగ్గింపుపై సానుకూల ధోరణి కనబరచవచ్చన్న అంచనాలు మార్కెట్కు ఊపిరి పోశాయి.మద్దతుగా విదేశీ నిధులుఇన్వెస్టర్లు సురక్షితమైన లార్జ్క్యాప్ కంపెనీల వైపే మొగ్గు చూపారు. విదేశీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల షేర్లలో భారీగా సాగిన షార్ట్ కవరింగ్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎయిర్లైన్ దిగ్గజం ఇండీగో షేర్లు లాభాలు.. వంటివి సూచీల రికవరీకి కారణమయ్యాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తిరిగి నికర కొనుగోలుదారులుగా మారడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది.విశ్లేషకుల అభిప్రాయంఅంతర్జాతీయ జియోపోలిటికల్ ఉద్రిక్తతలు ‘చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు’ తాత్కాలికంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేపినా భారత ఆర్థిక వ్యవస్థలోని బలమైన ప్రాథమిక సూచికలు ఆసియా మార్కెట్లలో మన స్థానాన్ని మళ్లీ అగ్రభాగాన నిలబెడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ధరల ఊగిసలాటపై దృష్టి పెట్టాలని, గుడ్డిగా పెట్టుబడులు పెట్టకుండా ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అన్న రీతిలో ముందస్తు వ్యూహంతో అడుగులు వేయాలని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
Stock Market Updates: నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:05 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు తగ్గి 24,146 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 148 పాయింట్లు క్షీణించి 77,220 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో సిప్లా, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.06 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అత్యధికంగా పెరిగాయి.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.02బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.42 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.72 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.76 శాతం నష్టపోయింది.Today Nifty position 25-08-2026(time: 10:07 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల స్వీకరణతో దేశీయ సూచీలపై ఒత్తిడి
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈవారం ఆరంభంలో ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఈరోజు (ఆగస్టు 24, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్మార్క్ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 24,219 వద్ద, సెన్సెక్స్ 171 పాయింట్లు క్షీణించి 77,369 వద్ద ముగిశాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో ముందంజ వేసినప్పటికీ గ్లోబల్ మార్కెట్ ప్రతికూలతలు, మదుపరుల లాభాల స్వీకరణతో సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి.సెంటిమెంట్ను దెబ్బతీసిన అంశాలుగ్లోబల్ మార్కెట్లలో బాండ్ ఈల్డ్స్ గరిష్ఠ స్థాయిల్లో నిలకడగా కొనసాగడం, దానికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో రిస్క్ అపెటైట్ను (ఆసక్తిని) తగ్గించింది. డాలర్ బలపడటంతో రూపీపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం సూచీలను దిగువకు లాగుతోంది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల కీలక షేర్లలో భారీగా విక్రయాలు జరిగాయి. ముఖ్యంగా అధిక వాల్యుయేషన్ల వద్ద లాభాలను స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలలోని హెచ్చుతగ్గులు ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళనలను పెంచి మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీశాయి.మదుపరులకు సూచనసాంకేతికపరంగా నిఫ్టీకి 24,000–24,100 వద్ద బలమైన సపోర్ట్ ఉంది. మార్కెట్ తిరిగి కోలుకోవాలంటే నిఫ్టీ 24,400 స్థాయిని అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలో రిటైల్ ఇన్వెస్టర్లు తొందరపడి బల్క్ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా నాణ్యమైన షేర్లలో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్పై నిషేధం -
పుంజుకున్న స్టాక్మార్కెట్లు.. లాభాల్లో ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు పెరిగి 24,276 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 121 పాయింట్లు పుంజుకొని 77,662 వద్ద ట్రేడవుతోంది.ఇన్ఫోసిస్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.17 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.33 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా మెరుగైన పనితీరు కనబరిచగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ తక్కువ పనితీరు కనబరిచాయి.ఇదీ చదవండి: ఈ చిట్కాలతో.. మహిళలకూ ట్రేడింగ్ సులువే.. అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.80బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.48 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.71 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.43 శాతం పెరిగింది.నాస్డాక్ 0.43 శాతం పుంజుకుంది.Today Nifty position 24-08-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ చిట్కాలతో.. మహిళలకూ ట్రేడింగ్ సులువే..
చాలా మంది గృహిణులకు ‘ఫ్రీ టైమ్’ అంటే గంటలు.. గంటలు దొరకదు. బోలెడన్ని పనుల మధ్యలో.. కొద్ది కొద్దిగా నిమిషాల రూపంలో దొరుకుతుంది. పొద్దున్నే పనులు.. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ తయారీ.. అటు పైన పిల్లలు స్కూళ్ల నుంచి రావడం..అక్కణ్నుంచి వాళ్లకు ప్రిపరేషన్లు.. వీటిన్నింటి మధ్య అప్పుడప్పుడు కాస్తంత విరామం లభిస్తుంటుంది. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే ఉంటుంది. ఇన్వెస్టింగ్ కావచ్చు..ట్రేడింగ్ కావొచ్చు.. వీటికి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా ఇంత హడావుడి మధ్యలో అంతంత సమయం వెచ్చించలేములే అని పక్కన పెట్టేసే పరిస్థితులు ఉంటాయి. అయితే, నిజం చెప్పాలంటే దీని కోసం గంటలు గంటలు స్క్రీన్పై వెచ్చించాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ డిగ్రీ అక్కర్లేదు. మీకు ఆసక్తి ఉండి, ఒక్క అరగంట సేపు ప్రశాంతంగా కాన్సెంట్రేట్ చేయగలిగితే స్ట్రెస్ ఫ్రీగా మార్కెట్ గురించి నేర్చుకోవచ్చు. దీనిపై పట్టు సాధించవచ్చు. ఇందుకోసం సింపుల్ కొన్ని చిట్కాలు ఉన్నాయి.చిన్నగా ప్రారంభించాలి.. ట్రేడింగ్ మొదలుపెట్టాలంటే బోలెడంత డబ్బుండాల్సిందే అనే అపోహ ఒకటుంది. నిజానికి అలాంటిదేమీ లేదు. చిన్న చిన్న మొత్తాలతో కూడా మొదలుపెట్టొచ్చు. వంద రూపాయలు కావొచ్చు.. వెయ్యి రూపాయల నుంచి కూడా ప్రారంభించవచ్చు. ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు కాబట్టి దీన్ని లెర్నింగ్ కోసం కేటాయించిన బడ్జెట్లాగా భావించాలే తప్ప ఇన్వెస్టింగ్ బడ్జెట్గా అనుకోవద్దు. ఈ దశలో ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. నేర్చుకోవడం. అంతే తప్ప ఎకాయెకిన లాభాలను సాధించేయడం కాదు. ముందుగా యాప్ ఎలా పని చేస్తుంది. ఆర్డర్లు ఎలా పెట్టాలి. రేట్లు ఏ రకంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడంపైనే దృష్టి పెట్టాలి. ఇందులోని సాధకబాధకాల గురించి అర్థం చేసుకునేందుకు చిన్న మొత్తాన్ని కేటాయిస్తేనే మంచిది. అప్పుడే మనస్సూ ప్రశాంతంగా ఉంటుంది. నేర్చుకోవడమూ సులభంగా, సరదాగా ఉంటుంది.ఫోకస్ ముఖ్యం .. మల్టీ టాస్కింగ్ వద్దు.. మహిళలు సహజంగానే మల్టీటాస్కర్లు. ఏకకాలంలో బోలెడన్ని పనులు చక్కబెట్టేస్తుంటారు. అయితే, ట్రేడింగ్ విషయానికొస్తే.. గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే.. వంట చేస్తూనో, ఇల్లు శుభ్రం చేసుకుంటూనో.. లేదా టీవీ చూస్తూనో.. ట్రేడింగ్ను కూడా చుట్టబెట్టేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మిగతా పనుల్లాగా కాకుండా మార్కెట్టు, ట్రేడింగు అంటే ప్రత్యేకంగా దానిపైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అది కొద్ది నిమిషాలే కావచ్చు. ఏకాస్త ఫోకస్ తప్పినా ... ఏదో పనిలో హడావిడిగా ఉండి.. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినా లేదా ఎగ్జిట్ అయినా తీవ్ర ఫ్ర్రస్టేషన్కి దారి తీయొచ్చు. అందుకే మిగతా ఏ పనులూ లేనప్పుడు, మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఫోకస్గా ఉండగలిగినప్పుడు ఒక్క 15–30 నిమిషాల స్లాట్ని కేవలం దీని కోసమే కేటాయించాలి. ఒక రకంగా మీకు అత్యంత ఇష్టమైన హాబీ విషయంలో మీరు ఎలా ఉంటారో దీన్ని కూడా అలాగే భావించి, సమయం వెచ్చించాలి. పూర్తి ఫోకస్తో ఉండే ఆ కాస్తంత సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. ఆత్మవిశ్వాసమూ వస్తుంది.ఫస్ట్ ట్రేడ్ కోసం బడ్జెట్ పెట్టుకోవాలి.. ఇది చాలా చాలా ముఖ్యమైన రూల్. ఎప్పుడూ కూడా ఇంటి అవసరాల కోసం ఉద్దేశించిన డబ్బుతో ట్రేడింగ్ చేయనే కూడదు. మీరు ట్రేడింగ్ మొదలుపెట్టదల్చుకున్నప్పుడు ముందుగానే, దాని గురించి తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు నెలవారీగా ఇంత అని కాస్త మొత్తాన్ని పక్కన ఉంచుకోండి. అది అయిదు వందల రూపాయలైనా కావచ్చు.. దాన్ని వేరుగానే ఉంచండి. ఇంటి అవసరాల ఖర్చులు, ట్రేడింగ్పై ఇన్వెస్ట్మెంట్ని కలగాపులగం చేయొద్దు. దేనికదే వేరుగా ఉండాలి. సరిహద్దులు స్పష్టంగా ఉండాలి. అప్పుడు ట్రేడింగ్ అనేది ఆర్థికంగా ఒక రిస్కీ వ్యవహారంగా కాకుండా వ్యక్తిగతంగా చేపట్టిన ఒక ప్రాజెక్టులాగా అనిపిస్తుంది. ఆందోళనకు ఆస్కారం ఉండదు. నిత్యావసరాలు, ఫీజులు, ఇంటి ఖర్చులు.. ఇలాంటి వాటి కోసం ఉద్దేశించిన డబ్బు జోలికి వెళ్లనే వెళ్లొద్దు.15 నిమిషాల రొటీన్..రొటీన్గా ప్రతిరోజు పాటించే చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద ప్రయోజనాలను చేకూరుస్తుంటాయి. కాబట్టి దీని విషయంలోనూ రోజూ ఒక పదిహేను నిమిషాల సేపు కేటాయించండి. ఒక ఐదు నిమిషాలు బేసిక్ ట్యుటోరియల్స్ను చూసేందుకు, నేర్చుకునేందుకు కేటాయించండి. ఇంకో ఐదు నిమిషాల పాటు సింపుల్ చార్ట్ను పరిశీలించండి. మీరు పరిశీలించిన, తెలుసుకున్న విషయాలను మననం చేసుకునేందుకు, రాసిపెట్టుకునేందుకు చివరి ఐదు నిమిషాలను కేటాయించండి. ఇలా వారాల తరబడి, కాస్త కాస్తంతగా తెలుసుకున్న విషయాలతో మార్కెట్పై కొంత చెప్పుకోతగ్గ స్థాయిలో అవగాహన వస్తుంది. చూస్తుండగానే మార్కెట్ ట్రెండ్స్, క్యాండిల్స్, ఎంట్రీలు, ఎగ్జిట్ల విషయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ట్రేడింగ్ అనేది ఆందోళన కలిగించేది వ్యవహారంగా ఉండనక్కర్లేదు. ప్రశాంతంగా, మీకు సమయం చిక్కినప్పుడు నెమ్మదిగా నైపుణ్యాలను పెంచుకునే విధంగా ఉండాలి. భారీగా కాకుండా, చిన్న మొత్తాన్ని కేటాయించి, స్పష్టమైన సరిహద్దులు పెట్టుకుని, ఏకాగ్రతతో నేర్చుకునేందుకు కొద్ది నిమిషాలు కేటాయించగలిగితే.. నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకెళ్తే మార్కెట్ గురించి తెలుసుకోవచ్చు. సానుకూల ఫలితాలనే కాకుండా ప్రయాణాన్నీ ఆస్వాదించవచ్చు.అలర్ట్లను ఉపయోగించుకోవాలి..ట్రేడింగ్ తీరుతెన్నులు తెలుసుకోవడం కోసం మీరు గంటలు గంటలు స్క్రీన్ ముందే కూర్చుని ఉండనక్కర్లేదు. ఇప్పుడు ఆధునిక ట్రేడింగ్ యాప్స్లో చాలా వెసులుబాట్లు ఉంటున్నాయి. మీరు ఆసక్తిగా గమనిస్తున్న షేరు ధర, మీరు అంచనా వేసే స్థాయికి చేరుకున్నప్పుడు తక్షణం నోటిఫై చేసేందుకు వీటిల్లో ప్రైస్ అలర్టులు ఉంటున్నాయి. అంటే, మీరు మీ రోజువారీ పనులు చేసుకోవడం కొనసాగిస్తూనే, అలర్టు వచ్చినప్పుడు ఒకసారి యాప్ చేసుకుంటే చాలు. దీనివల్ల స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత అవి తప్పయితే చింతించే పరిస్థితి తప్పుతుంది. పైగా ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా స్థిమితంగా నేర్చుకునేందుకు వీలవుతుంది.సాధారణంగానే మహిళా ఇన్వెస్టర్లు డిసిప్లిన్గా ఉంటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వారు అతిగా ట్రేడింగ్ చేయరు. డబ్బు వ్యవహారాల్లో ఎలా తోస్తే అలా నిర్ణయాలు తీసుకోరు. రిసు్కల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకునే వారికన్నా బోలెడంత సహనంతో, నిలకడగా ఉండే వారికే ట్రేడింగ్ లాభాలనిస్తుంది. మహిళల్లో సహజసిద్ధంగానే ఈ స్వభావం ఉంటుంది కాబట్టి వారికి అదొక సానుకూలాంశం. ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే అనుకూల ఫలితాలను సాధించగలమనే విషయాన్ని విశ్వసించాలి. -
అంతర్జాతీయ సంకేతాలు కీలకం..
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం భారత స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. జాక్సన్ హోల్ సింపోజియంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్‡్ష ప్రసంగం, ఎన్వీడియా త్రైమాసిక ఫలితాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ట్రేడింగ్పై ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. దేశీయంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి కదలికలు, లిక్విడిటీ పరిస్థితులను మార్కెట్ వర్గాలు పరిశీలించే అవకాశం ఉంది. ‘‘ఇన్వెస్టర్లు రియల్టీ, మెటల్, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల వైపు మొగ్గు చూపుతుండటం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత మార్కెట్లలో కొనుగోళ్లు కొనసాగిస్తుండటం ఊరటనిచ్చే అంశం. రాబోయే రోజుల్లో బ్రెంట్ క్రూడ్ ధరలు 90 డాలర్ల కిందకు దిగువ వస్తే, దేశీయ ఈక్విటీ మార్కెట్లో కన్సాలిడేషన్ చోటుచేసుకునే అవకాశం ఉంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్పై దృష్టి ఈ వారం జాక్సన్ హోల్ సింపోజియం ఇన్వెస్టర్లకు కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్‡్ష ప్రసంగంపై ప్రపంచ మార్కెట్లు దృష్టి సారించనున్నాయి. సెపె్టంబర్లో జరగనున్న ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు ద్రవ్యోల్బణం, ఉపాధి పరిస్థితులు, వడ్డీ రేట్ల భవిష్యత్ దిశపై ఆయన ఎలాంటి సంకేతాలిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికాలో వడ్డీ రేట్లపై అంచనాలు మారితే ప్రపంచ మార్కెట్లతో పాటు భారత ఈక్విటీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియా పరిణామాలు, క్రూడ్ ధరలపై కన్ను...పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఈ వారం కూడా మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఏర్పడిన అంతరాయం కారణంగా ముడి చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 90 డాలర్ల ఎగువన కొనసాగడం భారత మార్కెట్కు ప్రధాన ఆందోళనగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురు ధరలు మరింత పెరిగితే దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగి మార్కెట్పై ఒత్తిడి పడే అవకాశం ఉంది.గత వారం స్వల్ప నష్టాలు గత వారంతో స్టాక్ మార్కెట్ పరిమితి శ్రేణిలో ట్రేడవుతూ, స్వల్ప అమ్మకాల ఒత్తిడికి లోనైంది. వారాంతంలో శుక్రవారం కోలుకున్నప్పటికీ, మొత్తం వారానికి సెన్సెక్స్ 468 పాయింట్లు (0.60%), నిఫ్టీ 114 పాయింట్లు (0.46%) నష్టపోయాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్లపై రాబడులు పెరుగుదల గత వారం మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. సాంకేతిక అంశాలు... నిఫ్టీలో గత రెండు వారాలుగా కరెక్షన్ కొనసాగిన నేపథ్యంలో, స్వల్ప కాంలో మార్కెట్ కొంత స్థిరీకరణతో పాటు స్వల్పంగా కోలుకునే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చు.దిగువ స్థాయిలో 24,200 వద్ద తక్షణ మద్దతు ఉండగా, ఈ స్థాయిని కోల్పోతే 24,000 వరకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, 24,350 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే నిఫ్టీ 24,500 దిశగా కదిలే అవకాశం ఉందని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా గణాంకాలూ కీలకమే అమెరికా జీడీపీ అంచనాలు, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు, వినియోగదారుల విశ్వాస సూచీతో పాటు పీసీఈ ద్రవ్యోల్బణ గణాంకాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ఈ గణాంకాలు అమెరికా ఆర్థిక వ్యవ స్థ స్థితిగతులపై స్పష్టత ఇవ్వడంతో పాటు, ఫెడరల్ రిజర్వ్ తదుపరి విధాన నిర్ణయాలపై మార్కెట్ అంచనాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ వారంలో ఎనీ్వడియా త్రైమాసిక ఫలితాలు కూడా అంతర్జాతీయ టెక్నాలజీ షేర్ల కదలికలకు కీలకంగా మారవచ్చు.భారత మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు ఆగస్టులో రూ.23,544 కోట్ల పెట్టుబడులు భారత ఈక్విటీ మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఆగస్టు లో ఇప్పటివరకు (21 తేదీ వరకు) భారత ఈక్విటీల్లో రూ.23,544 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆర్థిక త్రైమాసిక ఫలితాలు ప్రకటన, రూపాయి స్థిర త్వం, మార్కెట్పై సానుకూల వృద్ధి అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. జూలైలో రూ.20,200 కోట్ల పెట్టుబడుల తర్వాత వరుసగా రెండో నెల కూడా విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం విశేషం. ‘‘కార్పొరేట్ లాభాల వృద్ధి పుంజుకోవడం, క్యూ1 ఫలితాల్లో కనిపించిన మెరుగుదల, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల మళ్లింపు, రూపా యి స్థిరత్వం తదితర అంశాలు ఎఫ్పీఐలను మళ్లీ భారత మార్కెట్ వైపు ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్పీలులు ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్లలో లభిస్తున్న బ్యాంకింగ్, ఐటీ దిగ్గజాల షేర్లను కొనుగోలు చేయడం లేదు. అధిక వ్యాల్యుయేషన్లు ఉన్నప్పటికీ ఎంపిక చేసిన మిడ్క్యాప్ స్టాక్స్పైనే దృష్టి సారిస్తున్నారు’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీ.కే. విజయకుమార్ తెలిపారు. ఈక్విటీలతో పాటు డెట్ (రుణ) మార్కెట్పైనా విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సమీక్షించిన కాలంలో ‘ఎఫ్ఏఆర్’ మార్గంలో రూ.852 కోట్ల పెట్టుబడులు రాగా, సాధారణ పద్ధతిలో రూ.995 కోట్లు కోట్ల నిధులు వెనక్కి వెళ్లినట్లు సీడీఎస్ఎల్ గణాంకాలు వెల్లడించాయి. -
ఎఫ్ అండ్ ఓ... ముంచేస్తోంది!
స్మోకింగ్ కిల్స్... అని హెచ్చరించినా సిగరెట్లు తాగుతూనే ఉంటారు. మద్యపానం హానికరం అన్నా... తాగేవారు మానరు. స్టాక్ మార్కెట్ డే ట్రేడింగ్ కూడా అలాంటిదే. ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సెబీ వార్నింగ్ డే ట్రేడర్లకు పట్టదు. ఎందుకంటే ఇదో వ్యసనం. గతేడాది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో జనం పోగొట్టుకున్నది ఏకంగా 91,685 కోట్లు. దీన్లో రూ.20వేల కోట్లు పన్నులు, ఎక్సే్ఛంజీల చార్జీలు, బ్రోకరేజీ సంస్థల ఫీజలుకు పోతే... మరో 72 వేల కోట్లు నికరంగా పోగొట్టుకున్నవి. విచిత్రమేంటంటే చరిత్రలో తొలిసారిగా మన మార్కెట్లలో డే–ట్రేడర్ల సంఖ్య గతేడాది తగ్గిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 20 లక్షల మంది తగ్గిపోయారు. అంటే.. పోగొట్టుకున్నవారంతా మౌనంగా మార్కెట్ల నుంచి నిష్క్రమిస్తున్నారన్న మాట. మార్కెట్లలో ఎందరు నష్టపోతున్నారు? ఎందరు లాభపడుతున్నారు? అసలు ట్రేడింగ్ ధోరణి ఎలా ఉంది? ఏ వయసు వారు ట్రేడింగ్లోకి వస్తున్నారు? మూలధనం ఎంత పెడుతున్నారు? అసలు షేర్లు కొంటున్నారా? ట్రేడింగ్ మాత్రమే చేస్తున్నారా? అనే అంశాలపై ‘సెబీ’ రెండు అధ్యయనాల్ని విడుదల చేసింది. డే–ట్రేడర్లకు కనువిప్పు కలిగించే ఈ అధ్యయనాల సమాహారమే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ..నెలకోసారి ఎక్స్పైరీ ఉండే ఆప్షన్లు వారానికోసారి ఎక్స్పైరీతో ఫ్రెష్గా ముస్తాబవుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్లే కాకుండా క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్లో సైతం ఆప్షన్లు జోరందుకున్నాయి. ఖాతాలో పదివేలున్నా సరే ట్రేడింగ్ చేయొచ్చునంటూ కొన్ని బ్రోకరేజీ సంస్థలు యువతను ఆకర్షిస్తున్నాయి. డీమ్యాట్ ఖాతాల్లో గనక షేర్లుంటే... డబ్బులు లేకపోయినా మార్జిన్తో ట్రేడింగ్ చేసుకోవచ్చని ఊరిస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ వాల్యూమ్ విపరీతంగా పెరిగింది. కానీ ఫలితమైతే మారలేదు. నష్టాలు తప్పటంలేదు. డే ట్రేడింగ్ చేసిన ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సత్యాన్ని సెబీ తాజా అధ్యయనం ద్వారా మరోసారి చెప్పింది. కాకపోతే కొన్నేళ్లుగా ప్రతి ఏటా విపరీతంగా పెరుగుతూ వచ్చిన ట్రేడర్ల సంఖ్య... గతేడాది మాత్రం తొలిసారిగా తగ్గింది. అదికూడా మామూలు తగ్గుదల కాదు. ఏకంగా 20 శాతం. ఈ అధ్యయనం ప్రకారం... → 2026 ఆర్థిక సంవత్సరంలో 87.7% మంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో ఏకంగా రూ.72,000 కోట్లు పోగొట్టుకున్నారు. అదికూడా ఎక్సే్ఛంజీలకు, బ్రోకరేజీలకు చెల్లించిన ఛార్జీలు కాకుండా. ఈ ఛార్జీలు రూ.20వేల కోట్లు కలిపితే మొత్తంగా వీరు నష్టపోయింది రూ.92 వేల కోట్లు పైనే. → ఎక్సే్ఛంజీ చార్జీలు, బ్రోకరేజీలు కాకుండానే 2025లో పోగొట్టుకున్న రూ.1.11 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. కాకపోతే ట్రేడర్ల సంఖ్య కూడా 98 లక్షల నుంచి 78 లక్షలకు పడిపోయింది. → సగటు ట్రేడరు పోగొట్టుకున్న మొత్తం మాత్రం రూ.1.13 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు పెరిగింది. → గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ట్రేడర్ల సంఖ్య తగ్గిపోవడమన్నది ఇదే తొలిసారి.మార్కెట్లకు దూరమవుతున్నదెవరు? తొలిసారి 20% మంది మార్కెట్లను వదిలేశాక.. మనం సమాధానం వెతకాల్సిన ప్రశ్న ఎందరు నష్టపోతున్నారన్నది కాదు. ఇంకా ఎవరు ట్రేడింగ్ చేస్తున్నారన్నది. సెబీ అధ్యయనంలో దీనిక్కొంత సమాధానం దొరికింది. అదేంటంటే ఇపుడు రిటైల్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో యువత సంఖ్యే ఎక్కువని. చిన్న ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలతో సంబంధంలేని మామూలు ట్రేడర్లు వీరికి తోడవుతున్నారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసే రిటైలర్లలో 43% మంది 30 ఏళ్ల లోపు వారే. వీరిలో 90% మంది గతేడాది నష్టపోయిన వారే. ఈ యువ ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్లకన్నా 93 రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో పెడుతున్నారు. అంటే... రూ. 1,000 షేర్లలో ఉంటే 93 వేలు ఎఫ్ అండ్ ఓలో ట్రేడింగ్కు వాడుతున్నారన్న మాట. అంటే వీళ్లెవరూ తమ షేర్లలో రిస్క్ తగ్గించుకోవటానికి ఎఫ్ అండ్ ఓను ఉపయోగించుకోవట్లేదు. జస్ట్ దాన్నో బెట్టింగ్ సాధనంగా చూస్తున్నారు. అంతే! వాస్తవమేంటంటే ఓ ఇన్వెస్టరుకు తన ఖాతాలో రూ.లక్ష విలువైన షేర్లున్నాయనుకోండి. వాటిపై వచ్చే మార్జిన్తో కోట్ల రూపాయల ఎఫ్ అండ్ఓ ట్రేడింగ్ చేయగలడు. అది చాలా ఎక్కువ మొత్తం కనక నష్టం వస్తే ఈ లక్షలో రూపాయి కూడా మిగలకపోవచ్చు. తక్కువ ట్రేడింగ్... ఎక్కువ లాభం లాభాలు ఆర్జించిన వారి విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తోంది. ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయాన్ని సంపాదిస్తున్న ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్ల విలువకన్నా ఏకంగా 73 రెట్లు ఎక్కువ ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారన్నది సెబీ తేలి్చన వాస్తవం. కానీ ఏడాదికి రూ.కోటికన్నా ఎక్కువ సంపాదించేవారు మాత్రం తమ పోర్టుఫోలియోకన్నా 14 రెట్లు మాత్రమే అధికంగా ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారు. అంటే ఎక్కువ సంపాదించేవారు తక్కువ ట్రేడింగ్ చేస్తున్నారు. తక్కువ సంపాదించేవారు, నష్టపోతున్న వారు మాత్రమే అత్యధికంగా ట్రేడింగ్ చేస్తున్నారు. ముగ్గురిలో ఒకరు.. అలాంటివారే! కొంతమంది ట్రేడర్లకు ఇన్వెస్ట్మెంట్లతో ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. వారి ఖాతాల్లో జీరో షేర్లున్నా సరే... ఎఫ్ అండ్ ఓ మాత్రం జోరుగా చేస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలా పూర్తి స్పెక్యులేషన్ ట్రేడింగ్నే చేస్తున్నారట. వాస్తవానికి ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లలో 78 శాతం మంది తమ ఖాతాల్లో రూ.లక్ష కన్నా తక్కువ షేర్లున్నవారే. కానీ ట్రేడర్లు పోగొట్టుకుంటున్న మొత్తంలో 70 శాతం వీళ్లదే. అంటే.. వీళ్లు తమ షేర్లతో సంబంధం లేకుండా ఎఫ్ అండ్ ఓ చేస్తున్నారు. భారీగా పోగొట్టుకుంటున్నారు. ఆప్షన్స్... అదే ఆకర్షణ ఎఫ్ అండ్ ఓ అంటే... ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. కానీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చెయ్యాలంటే భారీగా డబ్బులుండాలి. నష్టమైనా, లాభమైనా సమ పాళ్లలోనే ఉంటుంది. కానీ ఆప్షన్స్లో అలాకాదు. రూ.100, వెయ్యితో కూడా ఆప్షన్స్ చేయొచ్చు. అప్పటికప్పుడే వెయ్యి డబుల్ అయిపోవచ్చు. సున్నా కూడా అయిపోవచ్చు. ఇదే అసలైన ఆకర్షణ. ఈ ఆకర్షణ ఎంతలా పెరిగిందంటే... 2020లో ఎఫ్ అండ్ ఓలో రూ.100 టర్నోవర్ జరిగితే అందులో రూ.5 మాత్రమే ఆప్షన్స్ది. మిగతా మొత్తం ఫ్యూచర్స్దే. కానీ 2025 వచ్చేసరికి ఈ 5 ఏకంగా రూ.41కి చేరింది. నిజానికి ఆప్షన్ కొనటమంటే షేరు కొన్నట్లు కాదు. ఎందుకంటే షేర్లకు ఎక్స్పైరీ ఉండ దు. పడినా మళ్లీ కోలుకుంటాయి. కానీ ఆప్షన్లకు ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ గడు వు దగ్గరకొస్తున్నకొద్దీ ఆప్షన్ ప్రీమియం కరిగిపోతుంది. చివరికి సున్నా అయిపోతుంది. అలాగని ఆప్షన్లు కొనటం మాత్రమే రిస్కనుకుంటే అదీ పొరపాటే. ఆప్షన్లు కొనేవారి కన్నా అమ్మే వారిలో నష్టపోయేవారు తక్కువే. కానీ వారి నష్టాలు మాత్రం బీభత్సం. అప్షన్లు కొనేవారి సగటు నష్టాలు రూ.4.6 లక్షలు ఉంటే... అమ్మేవారి సగటు నష్టాలు రూ.51.7 లక్షలు. దీన్నిబట్టే రిస్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సెబీ ప్రయోగం ఫలించిందా? నిజానికి ఎఫ్ అండ్ ఓ నిబంధనల్ని కఠినం చేయటాన్ని సెబీ 2024లోనే మొదలుపెట్టింది. → వీక్లీ ఆప్షన్ల సంఖ్యను తగ్గించింది. కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటే ట్రేడింగ్ను నియంత్రించవచ్చనేది సెబీ వ్యూహం. → కాంట్రాక్టు సైజుల్ని పెంచింది. అంటే కొనటానికి అవసరమయ్యే మొత్తాన్ని బాగా పెంచింది. ఇలా చేయటం వల్ల లాభమైనా, నష్టమైనా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి చాలామంది దూరంగా ఉంటారన్నది సెబీ ఆలోచన. → ఆప్షన్ ప్రీమియంలను కొనటానికైనా, అమ్మటానికైనా కావలసిన మొత్తాన్ని పూర్తిగా ముందే చెల్లించటమనే నిబంధన తెచ్చింది. → పొజిషన్ల పరిమితుల్ని ఇంట్రాడేలో పర్యవేక్షించటం... ఎక్సే్ఛంజీలన్నింటినీ ఒక తాటిమీదికి తెస్తూ ఎక్స్పైరీ తేదీల్ని హేతుబద్ధం చేయటం వంటివి చేసింది. కాకపోతే తాజా అధ్యయనాన్ని పరిశీలిస్తే కొన్ని కోణాల్లో సెబీ చర్యలు ఫలితాలనిచ్చాయి. రిటైలర్ల టర్నోవర్ తగ్గింది. వాళ్ల సంఖ్య తగ్గింది. నష్టాలు తగ్గాయి. కానీ దీనివల్ల.. నష్టపోయే ట్రేడర్లేమైనా తగ్గారా అంటే అలాంటిదేమీ జరగలేదు. నష్టపోయేవారి సంఖ్య అసాధారణంగానే ఉంది. పైపెచ్చు వారి నష్టాలు పెరిగాయి. కాబట్టి నాణ్యమైన ట్రేడర్లు పెరగటమన్నదే ఇపుడు సెబీ ముందున్న అతిపెద్ద సవాలు.ఆ 23 శాతం మందే...సెబీ వివరాల ప్రకారం... ట్రేడింగ్లో నష్టాల్లో 90 శాతం వరకూ కేవలం 23 శాతం మంది నుంచే వస్తున్నాయి. అంటే... మొత్తంగా 78 లక్షల మంది రూ.91వేల కోట్లు పోగొట్టుకుంటే... అందులో రూ.82 వేల కోట్లు పోగొట్టుకున్నది 18 లక్షల మందే. దీన్నిబట్టి కొందరు ఈ ట్రాప్లో ఇరుక్కుని అత్యధికంగా పోగొట్టుకుంటున్నారని అర్థమవుతుంది. వీళ్ల ధోరణిని విశ్లేషిస్తే బయటపడ్డ అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. అవి... → వీళ్లు తమ ఆదాయానికి మించి అత్యధికంగా టర్నోవర్ నమోదు చేస్తున్నారు. → పదేపదే నష్టాలొచ్చినా డబ్బులు తెచ్చి పెడుతున్నారు. → ఎక్స్పైరీ డేనాడు అత్యధికంగా ట్రేడ్ చేస్తున్నారు. → వీరి టర్నోవర్కు–పోర్టుఫోలియోకు పొంతన లేదు. → పదేపదే ఆప్షన్లు కొనటం... లాట్ సైజు పెంచుకుంటూ పోయి పోగొట్టుకోవటం.మెట్రోలకే పరిమితం కాదిప్పుడు... మొబైల్ యాప్లు, టెక్నాలజీ షేర్ల ట్రేడింగ్ను సమూలంగా మార్చేశాయి. పలితం... ఈ ఎఫ్ అండ్ ఓ ఆకర్షణ ఇప్పుడు మెట్రో నగరాలకే పరిమితం కావటం లేదు. దేశంలో ప్రధానంగా గుర్తించిన 30 మెట్రో నగరాలను మినహాయిస్తే... వాటి వెలుపలున్న ప్రాంతంలోనే ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 72 శాతం ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ మెట్రోలకు వెలుపల జరుగుతున్నట్లు వెల్లడయింది. అంటే నష్టపోతున్నవారిలో ఎక్కువ మంది టైర్–2, టైర్–3 పట్టణాలు, గ్రామాలకు చెందినవారన్న మాట. అది ఆందోళనకరమన్నది నిపుణుల మాట. అసలు లాభపడ్డది ఎవరు? సెబీ అధ్యయనం ప్రకారం చూస్తే రిటైల్ ట్రేడర్లు రూ.72వేల కోట్లు పోగొట్టుకుంటే... సంస్థాగత ఇన్వెస్టర్లు, సంస్థలు రూ.72వేల కోట్లు లాభాలను ఆర్జించాయి. ప్రొప్రయిటరీ ట్రేడర్లు అత్యధికంగా రూ.44వేల కోట్లు లాభపడగా, ఎఫ్పీఐలు రూ.14వేల కోట్లు, కార్పొరేట్లు రూ.8వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్లు రూ.3వేల కోట్లు, ఎల్ఎల్పీ/పార్ట్నర్షిప్ సంస్థలు రూ.3వేల కోట్లు ఆర్జించాయి. ఇది రిటైలర్లు పోగొట్టుకున్న రూ.72వేల కోట్లకు సమానం. ఇక మిగిలిన మొత్తంలో ఎన్ఎస్ఈ రూ.11,366 కోట్లు, బీఎస్ఈ రూ.3,134 కోట్లు చార్జీల రూపంలో వసూలు చేశాయి. కొంత మొత్తం ప్రభుత్వానికి సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూపంలో చేరింది. కొంత సెబీకి ఛార్జీల రూపంలో చేరగా... మిగిలింది బ్రోకరేజీ రూపంలో బ్రోకరేజీ సంస్థలకు దక్కింది. అయితే ఇదంతా ట్రేడర్లు పోగొట్టుకున్న లెక్క మాత్రమే. లాభాలను ఆర్జించినట్లు చెబుతున్న సంస్థలు కూడా బ్రోకరేజీ, కొంత ఎస్టీటీ, కొంత ఎక్సే్ఛంజీలకు చార్జీలుగా చెల్లిస్తాయి. అంటే ఈ ట్రేడింగ్ వ్యవస్థపై ఫీజులు, పన్నులు, బ్రోకరేజీల రూపంలో పోతున్నదే ఎక్కువ భాగమన్నమాట!రమణమూర్తి మంథా -
స్టాక్ మార్కెట్ లో సెన్సేషన్.. దూసుకెళ్తున్న NHC Foods షేర్
-
స్టాక్మార్కెట్ ట్రేడింగ్లో ట్రంప్ దూకుడు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో జూన్ నెలలో భారీ కదలికలు చోటుచేసుకున్నాయి. ఆయనకు సంబంధించిన పెట్టుబడి ఖాతాల నుంచి ఏకంగా 1,051 సెక్యూరిటీస్ లావాదేవీలు జరిగినట్లు తాజా ఆర్థిక వెల్లడి నివేదికలో వెల్లడైంది. ఈ లావాదేవీల మొత్తం విలువ కనీసం 78.1 మిలియన్ డాలర్ల నుంచి గరిష్ఠంగా 263.1 మిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ నైతిక వ్యవహారాల కార్యాలయం (OGE) వెల్లడించిన పత్రాలు చెబుతున్నాయి. అయితే ఒక్కో లావాదేవీకి ఖచ్చితమైన మొత్తం కాకుండా నిర్దిష్ట విలువల పరిధినే ఫైలింగ్లో పేర్కొన్నారు.జూన్లో ట్రంప్ పోర్ట్ఫోలియోలోకి ప్రముఖ కంపెనీల షేర్లు భారీగా వచ్చాయి. ముఖ్యంగా బెర్క్షైర్ హాత్వే, వీసా, మాస్టర్కార్డ్, సింటాస్ షేర్లలో ఒక్కో కంపెనీకి 1 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల పరిధిలో కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడైంది. అదే సమయంలో మెటా ప్లాట్ఫామ్స్, మోటరోలా సొల్యూషన్స్లోనూ 1 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల రేంజ్లో షేర్లను విక్రయించారు.భారీ విక్రయం.. వాన్గార్డ్ ఈటీఎఫ్జూన్ 22న జరిగిన లావాదేవీల్లో అత్యంత పెద్దది వాన్గార్డ్ గ్రూప్కు చెందిన డివిడెండ్ అప్రిషియేషన్ ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్ షేర్ల విక్రయం. దీని విలువ 5 మిలియన్ డాలర్ల నుంచి 25 మిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు ఫైలింగ్ పేర్కొంది. అదే రోజున ఫిడెలిటీ నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (FIS), హోమ్ డిపో షేర్లను కూడా కొనుగోలు చేసినట్లు వివరాలు వెల్లడయ్యాయి.పలాంటీర్లోనూ కొనుగోళ్లు, అమ్మకాలుసాఫ్ట్వేర్ సంస్థ పలాంటీర్ షేర్ల విషయంలోనూ ట్రంప్ పెట్టుబడి ఖాతాలు పలుమార్లు లావాదేవీలు జరిపాయి. జూన్ 3న 1,001–15,000 డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, జూన్ 16న 15,001–50,000 డాలర్లు, జూన్ 18న 500,000–1 మిలియన్ డాలర్లు విలువైన షేర్లను విక్రయించారు. అనంతరం జూన్ 23, 24 తేదీల్లో మళ్లీ పలాంటీర్లో కొనుగోళ్లు జరిగాయి.2025లోనూ 21 వేలకు పైగా ట్రేడ్స్ట్రంప్ పెట్టుబడులపై ఇలాంటి చురుకుదనం కొత్తది కాదు. 2025లో ఆయనకు సంబంధించిన ఖాతాల నుంచి 21,000కు పైగా సెక్యూరిటీస్ లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ 600 మిలియన్ నుంచి 1.86 బిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు గతంలో వెల్లడైన ఫైలింగ్ తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఒకే రోజున ఒకే సెక్యూరిటీని కొనుగోలు చేయడంతోపాటు విక్రయించిన లావాదేవీలు కూడా నమోదయ్యాయి.స్వతంత్ర నిర్వహణలోనే పెట్టుబడులుట్రంప్ పెట్టుబడుల విషయంలో ప్రయోజనాల సంఘర్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ.. వైట్హౌస్ మాత్రం ఆయనకు పెట్టుబడి నిర్ణయాలపై ప్రత్యక్ష నియంత్రణ లేదని చెబుతోంది. ట్రంప్ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, ఆస్తులను స్వతంత్ర మేనేజర్లు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత మోడల్ పోర్ట్ఫోలియోల ద్వారా ప్రముఖ సూచీలను అనుసరించే విధంగా పెట్టుబడులు నిర్వహిస్తున్నారని వైట్హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగ్లే తెలిపారు. ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా ఆస్తులు బ్లైండ్ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయని గతంలో పేర్కొన్నారు.అయితే పెట్టుబడుల సమయం, భారీ లావాదేవీల సంఖ్య కారణంగా నైతికతపై చర్చ కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే ట్రంప్ పెట్టుబడి ఖాతాలు వేల సంఖ్యలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినట్లు గతంలో వెల్లడైంది.ఇదీ చదవండి: బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి: బిలియనీర్ ఇన్వెస్టర్ హెచ్చరిక.. సూచన -
దేశీ స్టాక్ మార్కెట్కు తగ్గిన ప్రాధాన్యం
ప్రస్తుతం ఆసియాలోకెల్లా భారత్ స్టాక్ మార్కెట్కు అత్యల్ప ప్రాధాన్యమిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవోఎఫ్ఏ) చేపట్టిన సర్వే పేర్కొంది. ఈ నెల 7–13 మధ్య ఆసియా ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైనట్లు నివేదికలో బీవోఎఫ్ఏ సర్వేలో తెలియజేసింది. దీంతో ఇండొనేసియా స్థానంలో భారత్ను చేర్చినట్లు వెల్లడించింది. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 272 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులను నిర్వహిస్తున్న 98 ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో బీవోఏ మరిన్ని అంశాలను పేర్కొంది. వివరాలు ఇలా..27 శాతానికి డౌన్ భారత్తో పోలిస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంటు ఇండొనేసియావైపు మొగ్గు చూపుతోంది. జూలైలో 32 శాతంగా నమోదైన నెట్ అండర్వెయిట్(పెట్టుబడుల ప్రాధాన్యం) ఆగస్ట్ రెండోవారానికల్లా 27 శాతానికి క్షీణించింది. ఇదే సమయంలో ఇండొనేసియాకు ప్రాధాన్యం పెరిగింది. ఆసియా ప్రాంతంలో తైవాన్, జపాన్ మార్కెట్లకు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి భారత్ చైనా, ఫిలిప్పీన్స్కంటే వెనుకబడినట్లు సర్వే పేర్కొంది.ఏఐలో వెనుకబాటుప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో పటిష్టస్థాయిలో ఎక్స్పోజర్ లేకపోవడానికితోడు.. బలహీన ఆర్థిక వృద్ధి దేశీ ఈక్విటీలపట్ల సమస్యాత్మకంగా భావిస్తున్నట్లు బీవోఎఫ్ఏ సర్వే పేర్కొంది. సంస్కరణలలేమి, షేర్ల అధిక ధరలు, రూపాయి బలహీనత సైతం ప్రతికూలంగా పరిణమించినట్లు వివరించింది. గత రెండు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడిన సందర్భంలో సర్వే వివరాలు వెలువడటం గమనార్హం! అయితే ఇటీవల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతుండటం, కంపెనీల ఆర్జన అంచనాలు మెరుగుపడటం, మార్కెట్ అంతర్గత మూలాలు మెరుగుపడుతుండటం తదితర సానుకూలతలను ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా స్పందించినట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. తొలి 6 నెలలు డీలా..ఈ క్యాలండర్ ఏడాది(2026) తొలి ఆరు నెలలు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో భాగమైన కంపెనీల సగటు ఆర్జన వార్షికంగా 18 శాతం పుంజుకోగా.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనాలు 10 శాతాన్ని మించడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం మే నెలలోనూ బీవోఎఫ్ఏ సర్వేలో ఇండియా అత్యల్ప ప్రాధాన్యతగల మార్కెట్గా నిలిచింది. ఇందుకు యూఎస్ ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం ప్రభావం చూపింది. దీంతో ఇంధన వ్యయాల భారంతో ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెరిగినట్లు సర్వే అభిప్రాయపడింది.దీనికితోడు రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలకు సమీప భవిష్యత్లో పరిష్కారం కనిపించకపోవడం, పెరుగుతున్న చమురు ధరలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమయ్యాయి. అయితే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 8 శాతం రికవరీ అయినప్పటికీ ఈ ఏడాది దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా 8 శాతం క్షీణించాయి. దీంతో ఆసియాలో బలహీనపడిన ప్రధాన మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలిచినట్లు సర్వే తెలియజేసింది. ఇదే కాలంలో ఇండొనేసియా మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. జకార్తా కాంపోజిట్ ఇండెక్స్ జూన్ కనిష్టం నుంచి 20 శాతం పుంజుకున్నట్లు పేర్కొంది. ఇందుకు ఆ దేశ కరెన్సీ నిలకడకు కేంద్ర బ్యాంకు తీసుకున్న చర్యలు కొంతమేర దోహదపడినట్లు ప్రస్తావించింది. ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! -
నత్తనడకన మార్కెట్లు.. ప్లాట్గా ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్!
భారతీయ ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం (ఆగస్టు 21, 2026) ముగింపు సమయానికి ఎలాంటి స్పష్టమైన దిశా నిర్దేశం లేకుండా ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 24,252 స్థాయి వద్ద స్థిరపడగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 3 పాయింట్లు పెరిగి 77,540 వద్ద క్లోజ్ అయింది. రోజంతా తీవ్ర ఒడిదొడుకుల మధ్య సాగిన మార్కెట్లో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడానికే మొగ్గు చూపారు.ఫ్లాట్ ముగింపునకు కారణాలుఅమెరికా బాండ్ ఈల్డ్లు అనూహ్యంగా పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది.మధ్యప్రాచ్యంలో రాజకీయ ఉద్రిక్తతల (అమెరికా-ఇరాన్ సంక్షోభం) కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 93 డాలర్లు దాటి ట్రేడ్ అవ్వడం స్థానిక మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.సాంకేతికంగా నిఫ్టీకి 24,300-24,400 వద్ద బలమైన నిరోధం (Resistance) ఎదురవుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో సుస్థిరత ఏర్పడే వరకు భారత మార్కెట్లు కొంతకాలం స్థిరీకరణ దశలోనే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: సైబర్ ముఠాల ఆన్లైన్ దోపిడీకి కేంద్రం చెక్ -
స్టాక్ మార్కెట్ ఫ్లాట్.. ఐటీ షేర్లు ఇలా..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 12.65 పాయింట్లు లేదా 0.052 శాతం తగ్గి 24,219.20 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 56.94 పాయింట్లు లేదా 0.073 శాతం కరిగి 77,480.78 వద్ద ట్రేడవుతోంది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.04 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.44 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ చాలా క్షీణించగా, నిఫ్టీ రియాల్టీ అధిగమించింది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.34బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 93.30 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.70 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.87 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.00 శాతం నష్టపోయింది.Today Nifty position 21-08-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. రయ్మన్న రియాల్టీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్ల మద్దతుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 628.04 పాయింట్లు లేదా 0.82 శాతం పెరిగి 77,537.72 వద్ద, నిఫ్టీ 153.55 పాయింట్లు లేదా 0.64 శాతం పెరిగి 24,231.85 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. రంగాల వారీగా, నిఫ్టీ రియాల్టీ దాదాపు 2 శాతం లాభంతో అధిగమించగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ తక్కువ లాభంతో తక్కువ పనితీరు కనబరిచాయి. -
దలాల్ స్ట్రీట్లో లాభాల జోరు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 131 పాయింట్లు పెరిగి 24,211 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 569 పాయింట్లు పుంజుకొని 77,475 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 91.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.63 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.21 శాతం పెరిగింది.నాస్డాక్ 0.16 శాతం పుంజుకుంది.Today Nifty position 20-08-2026(time: 9:43 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 325.78 పాయింట్లు లేదా 0.42 శాతం నష్టంతో 76,909.68 వద్ద.. నిఫ్టీ 76.60 పాయింట్లు లేదా 0.32 శాతం నష్టంతో 24,078.30 వద్ద నిలిచింది.ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, సైయంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, సిఇఎస్సి లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్లోబల్ నెగెటివ్ సంకేతాలు.. నష్టాల్లో మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు తగ్గి 24,096 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 166 పాయింట్లు నష్టపోయి 77,070 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.55బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 91.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.69 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.33 శాతం దిగజారింది.Today Nifty position 19-08-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి కుప్పకూలాయి. సెన్సెక్స్ 492.70 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 77,235.46 వద్ద, నిఫ్టీ 132.75 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 24,154.90 వద్ద నిలిచాయి.జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్, టొరెంట్ పవర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ అప్డేట్: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:45 గంటలకు సెన్సెక్స్ 249.00 పాయింట్లు లేదా 0.32 శాతం నష్టంతో 77,479.16 వద్ద, నిఫ్టీ 50.70 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,236.95 వద్ద ముందుకు సాగుతున్నాయి.వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కోల్గేట్-పాల్మోలివ్ (ఇండియా) లిమిటెడ్, లోధా డెవలపర్స్ లిమిటెడ్, బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 281.09 పాయింట్లు లేదా 0.36 శాతం లాభంతో 77,728.16 వద్ద, నిఫ్టీ 78.35 పాయింట్లు లేదా 0.32 శాతం నష్టంతో 24,287.65 వద్ద నిలిచాయి.ఐపిసిఎ లాబొరేటరీస్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. బెల్రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, NMDC స్టీల్ లిమిటెడ్, జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 347.28 పాయింట్లు లేదా 0.45 శాతం నష్టంతో 77,661.97 వద్ద.. నిఫ్టీ 76.50 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 24,289.50 వద్ద నిలిచాయి.ఐపిసిఎ లాబొరేటరీస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. NMDC స్టీల్ లిమిటెడ్, బెల్రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీఎస్ఈ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్..
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 70.71 పాయింట్లు లేదా 0.091 శాతం నష్టంతో 78,009.25 వద్ద, నిఫ్టీ 29.85 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 24,366.00 వద్ద నిలిచాయి.జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్, ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెడ్ జోన్లో నిఫ్టీ, సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు తగ్గి 24,325 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 291 పాయింట్లు నష్టపోయి 77,783 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.92బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.65 శాతం పెరిగింది.నాస్డాక్ 0.81 శాతం పుంజుకుంది.Today Nifty position 14-08-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 113.61 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో.. 78,079.96 వద్ద, నిఫ్టీ 40.10 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 24,395.85 వద్ద నిలిచాయి.ఆస్ట్రల్ లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, శారదా ఎనర్జీ & మినరల్స్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఫిజిక్స్వాలా లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ లోకి లలితా జువెల్లరీ IPO.. ఒక్కో షేరు ఎంతో తెలుసా?
-
స్టాక్ మార్కెట్లో రెడ్ అలర్ట్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ(Nifty) 88 పాయింట్లు తగ్గి 24,349 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 174 పాయింట్లు నష్టపోయి 77,789 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.01బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.67 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.54 శాతం పుంజుకుంది.Today Nifty position 13-08-2026(time: 9:44 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచే ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుసగా రెండవ రోజు పడిపోయాయి. సెన్సెక్స్ 187.90 పాయింట్లు 0.24 శాతం క్షీణించి 77,966.35 వద్ద, నిఫ్టీ 35.75 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 24,435.95 వద్ద స్థిరపడ్డాయి.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), మాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.18 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ 1.54 శాతం క్షీణించి చెత్త పనితీరు కనబరిచింది. ఇదిలా ఉండగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 2శాతం పెరిగి సహచర రంగాలను అధిగమించింది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 388.19 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 78,154.25 వద్ద.. నిఫ్టీ 112.10 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో 24,471.70 వద్ద నిలిచాయి.చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్, లాయిడ్స్ మెటల్స్ & ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెన్సెక్స్ 304 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు తగ్గి 24,491 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 304 పాయింట్లు నష్టపోయి 78,228 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.75బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.7 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.06 శాతం తగ్గింది.నాస్డాక్ 0.32 శాతం నష్టపోయింది.Today Nifty position 11-08-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా సూచీలు! నిఫ్టీ తదుపరి టార్గెట్ ఎంతంటే?
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్థిరీకరణ దిశగా అడుగులు వేశాయి. సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 43 పాయింట్లు పెరిగి 78,542 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకొని 24,583 వద్ద ముగిసింది.మార్కెట్ను నడిపించిన ప్రధాన అంశాలుపశ్చిమాసియాలో వ్యాపార నావిగేషన్ మార్గాలైన హార్మూజ్ జలసంధి ప్రతిష్టంభన మూలంగా ముడిచమురు ధరలు బ్యారెల్కు 79 డాలర్లతో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇది పెట్టుబడిదారుల్లో కొంత ముందస్తు లాభాల స్వీకరణకు కారణమైంది. అమెరికా లేబర్ మార్కెట్ డేటా, వడ్డీ రేట్ల అంచనాల నేపథ్యంలో ఆసియా ప్రధాన మార్కెట్లు (జపాన్ నిక్కీ, కొరియా కోస్పి) సానుకూలంగా స్పందించడం మన మార్కెట్లకు కొంత మద్దతుగా నిలిచింది.ప్రస్తుతం నిఫ్టీకి 24,350 వద్ద బలమైన సపోర్ట్ అందుతుండగా 25,000 స్థాయి వద్ద నిరోధం కనిపిస్తోందని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ భౌగోళిక అంశాలు తేటపడే వరకు మార్కెట్ కొంత పరిమితిలోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్! -
12న స్టాక్ ట్రేడింగ్ బంద్! కొత్త రూల్పై ఆగ్రహం
మార్కెట్ ముగింపు ధరలను నిర్ణయించే విధానంలో ఇటీవల వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) డే ట్రేడర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్త విధానం రిటైల్ ట్రేడర్ల కంటే పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తూ కొందరు ట్రేడర్లు ఆగస్టు 12న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ను ఒకరోజు బహిష్కరించాలని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. సీఏఎస్తో పాటు అధిక సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT), తరచూ మారుతున్న మార్కెట్ నిబంధనలపైనా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ‘నో ట్రేడ్ డే’దాదాపు 1.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఓ ట్రేడర్ ఎక్స్లో “ఎస్టీటీ, సీఏఎస్కు వ్యతిరేకంగా ఆగస్టు 12న నో ట్రేడ్ డే” అంటూ పోస్టు చేశారు. మరో పోస్టులో రిటైల్ ట్రేడర్లపై ప్రభావం చూపుతున్న నిబంధనలు, పెరుగుతున్న పన్నులకు నిరసనగా ఒకరోజు ట్రేడింగ్ బహిష్కరణకు పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రచారం ఎంతమంది ట్రేడర్లను వాస్తవంగా ట్రేడింగ్కు దూరంగా ఉంచుతుందన్నది ఇంకా స్పష్టంగా లేదు.అసలు సీఏఎస్లో ఏం మారింది?సెక్యూరిటీస్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నిర్ణయం మేరకు సీఏఎస్ను 2026 ఆగస్టు 3 నుంచి అమల్లోకి తెచ్చారు. తొలిదశలో డెరివేటివ్స్ కాంట్రాక్టులు అందుబాటులో ఉన్న స్టాక్స్కు ఇది వర్తిస్తోంది. ఇంతకుముందు ఈ స్టాక్స్ ముగింపు ధరను సాధారణ ట్రేడింగ్లో చివరి 30 నిమిషాల్లో జరిగిన లావాదేవీల VWAP ఆధారంగా నిర్ణయించేవారు.కొత్త విధానంలో సంబంధిత స్టాక్స్ సాధారణ నిరంతర ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటలకే ముగుస్తుంది. అనంతరం 3:15–3:35 మధ్య 20 నిమిషాల సీఏఎస్ జరుగుతుంది. 3:00–3:15 మధ్య ట్రేడింగ్ ఆధారంగా రిఫరెన్స్ ధరను నిర్ణయించి, ఆ తర్వాత కొనుగోలు, విక్రయ ఆర్డర్లను ఒకచోట సమీకరిస్తారు. చివరికి గరిష్ఠంగా సాధ్యమైన లావాదేవీల పరిమాణాన్ని అమలు చేయగల ఈక్విలిబ్రియం ధరనే ఆ రోజు అధికారిక ముగింపు ధరగా నిర్ణయిస్తారు. ఆర్డర్ ఎంట్రీ చివరి దశలో 3:28–3:30 మధ్య యాదృచ్ఛికంగా ముగిసే విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు.నిఫ్టీ–సెన్సెక్స్ మధ్య వ్యత్యాసమే అసలు భయం?సీఏఎస్ అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో నిఫ్టీ, సెన్సెక్స్ ముగింపు స్థాయిల్లో అసాధారణ వ్యత్యాసం కనిపించడం ట్రేడర్ల ఆందోళనకు మరో కారణంగా మారింది. సీఏఎస్ కారణంగా F&O స్టాక్స్ క్యాష్ మార్కెట్ ముగింపు ధర నిర్ణయించే సమయం, ఇతర స్టాక్స్ ట్రేడింగ్ సమయం వేర్వేరుగా మారడంతో సూచీల కదలికల్లో తేడాలు కనిపించాయి. ముఖ్యంగా డెరివేటివ్స్ గడువు ముగిసే రోజుల్లో చివరి దశలో ధరల్లో వేగవంతమైన మార్పులు రావడంతో ఆప్షన్ ట్రేడర్లకు అనూహ్యమైన లాభనష్టాలు ఏర్పడే పరిస్థితి కనిపించింది.సెబీ వాదన మాత్రం వేరే..అయితే సీఏఎస్ను తీసుకురావడం వెనుక ఉద్దేశం రిటైల్ ట్రేడర్లకు నష్టం చేయడం కాదని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. చివరి నిమిషాల్లో పెద్ద ఆర్డర్ల ప్రభావంతో ధరలు అస్థిరంగా మారకుండా, ఒకే ధర వద్ద ఎక్కువ లిక్విడిటీని సమీకరించి మరింత స్థిరమైన, పారదర్శకమైన ముగింపు ధరను కనుగొనడమే లక్ష్యమని సెబీ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఇలాంటి క్లోజింగ్ ఆక్షన్ విధానాలు అమల్లో ఉన్నాయని తెలిపింది.ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్స్, పాసివ్ ఫండ్స్, ఈటీఎఫ్లు వంటి సంస్థలకు ఒకే ముగింపు ధర వద్ద లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కల్పించడం ద్వారా ఇండెక్స్ ట్రాకింగ్ ఎర్రర్ను తగ్గించవచ్చని సెబీ అభిప్రాయపడుతోంది. అలాగే చివరి నిమిషాల్లో జరిగే భారీ సంస్థాగత లావాదేవీల వల్ల ధరల్లో ఏర్పడే వక్రీకరణలను తగ్గించడంలో సీఏఎస్ సహాయపడుతుందని రెగ్యులేటర్ భావిస్తోంది.ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 12పైనే..సీఏఎస్ అమల్లోకి వచ్చి వారం రోజులు కూడా పూర్తికాకముందే ట్రేడర్ల నుంచి నిరసనకు పిలుపు రావడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు ధరల ఆవిష్కరణను మెరుగుపరచడమే సీఏఎస్ లక్ష్యమని సెబీ చెబుతుండగా, మరోవైపు చివరి 20 నిమిషాల్లో మార్కెట్ కదలికలను అర్థం చేసుకోవడం కష్టమవుతోందని డే ట్రేడర్లు వాదిస్తున్నారు. దీంతో ఆగస్టు 12న పిలుపునిచ్చిన ‘నో ట్రేడ్ డే’కు ఎంతమేర స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం ఇది ట్రేడర్ల సోషల్ మీడియా ప్రచారమే తప్ప అధికారిక ట్రేడింగ్ బంద్ కాదు.12 August 2026. One day. No trades. No orders. 📵Retail traders are standing together to peacefully protest the SEBI rules and rising taxes that hit the small trader hardest.We trade. We pay taxes. We deserve fair rules.If you back it, take part peacefully on 12th Aug and… pic.twitter.com/fniGkUKIJl— FIIDII Data (@Fii_Dii_Data) August 7, 2026 -
ఫ్లాట్గా స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 10.65 పాయింట్లు తగ్గి 24,560.00 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 28.67 పాయింట్లు నష్టపోయి 78,470.50 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.65బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.49 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.66 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.62 శాతం పెరింగింది.నాస్డాక్ 1.30 శాతం లాభపడింది.Today Nifty position 10-08-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పోర్ట్ఫోలియోకి స్థిరత్వం, వృద్ధికి దన్ను
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే విషయంలో ‘పెట్టుబడి పెట్టాలా వద్దా’ అని కాకుండా .. ‘ఎందులో పెట్టాలి’ అనేదే అత్యంత క్లిష్టమైన సవాలుగా అనిపిస్తుంది. సాధారణంగా చాలాకాలంగా లార్జ్ క్యాప్ కంపెనీలు స్థిరత్వానికి, నిలకడైన వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ, పోర్ట్ఫోలియోలకు దన్నుగా నిలుస్తున్నాయి. మరోవైపు, మిడ్ క్యాప్ స్టాక్స్.. కార్పొరేట్ రంగ తదుపరి వృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశాలను కల్పిస్తున్నాయి. అయితే, ఈ రెండింటికీ పోర్ట్ఫోలియోల్లో స్థానం ఉంటున్నప్పటికీ, వీటి మధ్య సరైన సమతుల్యతను సాధించడం చెప్పినంత ఈజీ కాదు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ డేటా ప్రకారం ’లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్’ కేటగిరీలోకి నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2025 జూన్లో రూ. 3,497 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, 2026 జూన్ నాటికి 24 శాతం పెరిగి రూ. 4,321 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఫక్తు లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి పెట్టుబడులు ఒక మోస్తరుగానే వృద్ధి చెంది రూ. 2,067 కోట్లు వచ్చాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనే డైవర్సిఫికేషన్ ద్వారా మిడ్ క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి సామర్థ్యాన్ని, లార్జ్ క్యాప్ కంపెనీల స్థిరత్వం అలాగే లిక్విడిటీ ప్రయోజనాలను కూడా పొందాలని భావిస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఇది తెలియజేస్తోంది. ఈ కేటగిరీకి ఎందుకింత ప్రాధాన్యత.. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ప్రత్యేకత అంతా కూడా దీన్ని నిర్వహించే విధానంలోనే ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం ఈ ఫండ్స్ తమ దగ్గరున్న నిధుల్లో కనీసం 35 శాతాన్ని లార్జ్ క్యాప్ కంపెనీల్లో, మరో 35 శాతాన్ని మిడ్ క్యాప్ కంపెనీల్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. మిగతా భాగాన్ని ఫండ్ మేనేజర్ తన విచక్షణకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ విధానం వల్ల రెండు విభాగాల్లోనూ ఎప్పుడూ సరైన ప్రాతినిధ్యం ఉండటమే కాకుండా, అధిక లాభాలకు ఆస్కారమున్న సాధనానికి కేటాయింపులను పెంచేందుకు వీలుంటుంది. డబుల్ ప్రయోజనాలు.. సాధారణంగా లార్జ్ క్యాప్ కంపెనీలకు నిరూపితమైన వ్యాపార మోడల్స్, పటిష్టమైన బ్యాలెన్స్ ఉంటాయి. ఆర్థిక సవాళ్లను తట్టుకుని నిలబడే సామర్థ్యాలు ఉండటం వల్ల మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా కూడా పోర్ట్ఫోలియోకి ఇవి కొంత స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇక మిడ్ క్యాప్ కంపెనీలను చూస్తే ఇవి చిన్న సంస్థలకంటే మెరుగైన వృద్ధి దశలో ఉండి, ఇంకా లార్జ్ క్యాప్ స్థాయికి చేరుకోనివై ఉంటాయి. వ్యాపార విస్తరణ, మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, లాభదాయకతను పెంచుకోవడం ద్వారా ఇవి దీర్ఘకాలంలో అధిక ఆదాయ వృద్ధిని అందిస్తాయి.అయితే, దీనికి తగ్గట్లుగానే వీటిలో రిస్క్లు, ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ రెండింటి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్లోని పలు రంగాల్లో లార్జ్ క్యాప్లు ఆకర్షణీయమైన విలువకే లభిస్తుండగా, మిడ్ క్యాప్లు మరింత మెరుగైన రాబడిని పొందే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండింటినీ కలపడం ద్వారా ఒకే పోర్ట్ఫోలియో ద్వారా ఇన్వెస్టర్లు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలనూ పొందవచ్చు. నిబంధనలకు ప్రాధాన్యత.. ఈ కేటగిరీ కేవలం విభిన్న క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీల కలయికగా మాత్రమే కాకుండా, పెట్టుబడులను సొంతంగా నిర్వహించుకునే ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా చూపుతుంది. చాలామంది ఇన్వెస్టర్లు ఇటీవల బాగా రాణించిన రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడమో లేదా నష్టాల్లో ఉన్న విభాగాల నుంచి వెంటనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమో చేస్తుంటారు. ఇలాంటి ఆలోచన విధానం సహజమే అయినప్పటికీ, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు పోర్ట్ఫోలియో తీవ్రంగా దెబ్బతింటుంది.లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ కంపెనీలకి తప్పనిసరిగా కేటాయింపులు ఉండేలా చూడటం ద్వారా ఇలాంటి ఆలోచనా ధోరణుల వల్ల, ఇన్వెస్టర్లు నష్టాల బారిన పడకుండా చూసేందుకు తోడ్పడుతుంది. ఇన్వెస్టర్ వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడకుండా, ఈ ఫండ్ నిర్మాణ స్వరూపంలోనే క్రమశిక్షణ ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ విభాగాల్లో ఏది ఎప్పుడు మెరుగ్గా రాణిస్తుందో అనేది అంచనాలు వేసుకోవాల్సిన పని ఇన్వెస్టర్లకు ఉండదు. పోర్ట్ఫోలియోలో ఎప్పుడూ రెండూ ఉంటాయి కాబట్టి, మార్కెట్ ఎలా ఉన్నా, ఆయా సమయాల్లో లభించే అవకాశాలను ఇది అందిపుచ్చుకుంటుంది. ఎవరికి అనుకూలం..? ఈక్విటీల్లో పెట్టుబడులపరంగా వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలను కోరుకుంటున్నా, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు తమ పెట్టుబడులను తాము స్వయంగా నిర్వహించుకోలేని ఇన్వెస్టర్లకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ ఫండ్లను విడివిడిగా కొనుగోలు చేసి నిర్వహించుకోవడానికి బదులుగా, స్థిరత్వం అలాగే వృద్ధి రెండింటినీ ఒకే ఫండ్ ద్వారా పొందాలనుకునే కొత్త ఇన్వెస్టర్లకు ఇది సరైన ఎంపిక. ఇప్పటికే లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి, స్మాల్ క్యాప్స్లో రిస్కుల బారిన పడకుండా, అధిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కేటగిరీ ఫండ్స్ ఇటు లార్జ్ క్యాప్స్, అటు మిడ్ క్యాప్స్కి అర్థవంతంగా పెట్టుబడులు కేటాయిస్తూనే, కొంత మేర స్మాల్ క్యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఈక్విటీ మార్కెట్లలో అవకాశాలను సమతూకంతో అందించే ప్రయత్నం చేస్తాయి. వేర్వేరు ఫండ్లలో పెట్టుబడులు పెట్టి వాటిని తరచూ రీబ్యాలెన్స్ చేసే శ్రమ లేకుండా, ఒకే ఈక్విటీ ఫండ్ తమ పోర్ట్ఫోలియోకి ప్రధాన ఆధారంగా ఉండాలని కోరుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చివరిగా.. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఏ ఒక్క ఫండ్ కేటగిరీ కూడా అన్ని అవసరాలనూ తీర్చలేదు. అయితే, లార్జ్ అండ్ మిడ్–క్యాప్ ఫండ్లు నిరూపితమైన పెద్ద కంపెనీల స్థిరత్వాన్ని, ఎదుగుతున్న కంపెనీల వృద్ధి సామర్థ్యాలని ఒక నియమావళికి లోబడి ఇన్వెస్టర్లకు అందిస్తాయి. గడిచిన ఏడాది కాలంగా ఈ ఫండ్స్లోకి పెరిగిన నిధులను చూస్తే, ఇన్వెస్టర్లు కేవలం ఒకే రకమైన మార్కెట్–క్యాప్పై ఆధారపడకుండా స్థిరత్వంతో కూడిన వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. పెట్టుబడుల కేటాయింపుల్లో క్రియాశీలకంగా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇటు స్థిరత్వం అటు వృద్ధి ప్రయోజనాలను పొందాలనుకునే వారికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. మార్కెట్లో ఒక్కో సెగ్మెంట్ ఒక్కో సందర్భంలో రాణిస్తుంది. తదుపరి రాణించబోయే సెగ్మెంట్ గురించి అంచనాలు వేసుకంటూ, ఊహాగానాల్లో ఉండిపోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడులను కొనసాగించిన వారికే ప్రయోజనాలు దక్కుతాయనేది గుర్తుంచుకోవాలి. ఇందుకోసం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ క్రమశిక్షణతో కూడుకున్న విధానంగా ఉపయోగపడతాయి. -
6 నెలల్లో Penny Stocks హై రిటర్న్స్.. 1 లక్షకు 2 కోట్లు!
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 463.50 పాయింట్లు లేదా 0.59 శాతం నష్టంతో 78,491.26 వద్ద, నిఫ్టీ 65.35 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 24,570.65 వద్ద నిలిచాయి.సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్, సంవర్ధన మోథర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈఐహెచ్ లిమిటెడ్, ఈక్లర్క్స్ సర్వీసెస్ లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో దలాల్ స్ట్రీట్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 32 పాయింట్లు తగ్గి 24,602 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 266 పాయింట్లు నష్టపోయి 78,684 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.97బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 83.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.68 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.18 శాతం తగ్గింది.నాస్డాక్ 0.06 శాతం నష్టపోయింది.Today Nifty position 07-08-2026(time: 9:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ తీరుపై వారెన్ బఫెట్ సీరియస్!
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, బెర్క్షైర్ హాథ్వే చైర్మన్ వారెన్ బఫెట్ ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేటి ఆర్థిక మార్కెట్ల తీరుపై హెచ్చరికలు జారీ చేశారు. స్వల్పకాలిక ఊహాగానాలు, క్రమశిక్షణ లేని జూదపు(కేసినో) ధోరణులు మార్కెట్ను ఏలుతున్నాయని స్పష్టం చేశారు.రూ.33 లక్షల కోట్లకు పైగా నగదు నిల్వలుమార్కెట్లపై ఆసక్తి పెరిగిన ప్రస్తుత సమయంలోనూ బెర్క్షైర్ హాథ్వే 2026 మొదటి త్రైమాసికంలో ఏకంగా 397.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33 లక్షల కోట్లకు పైగా) రికార్డు నగదు, స్వల్పకాలిక ట్రెజరీ బిల్లులను సమకూర్చుకుంది. ఇది కంపెనీ మొత్తం విలువలో మూడో వంతు కంటే ఎక్కువ కావడం గమనార్హం. మార్కెట్లో వ్యాల్యూయేషన్లు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రతి ఒక్కరూ జూదాన్ని ఇష్టపడుతున్నప్పుడు సరైన విలువ కలిగిన షేర్లను కనుగొనడం అత్యంత కష్టం అని సీఎన్బీసీ ఇంటర్వ్యూలో బఫెట్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వన్-డే ఆప్షన్స్ ట్రేడింగ్, పాలీమార్కెట్ వంటి ప్రిడిక్షన్ మార్కెట్ల వేగవంతమైన వృద్ధిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.సంక్షోభ సమయాల్లోనే పెట్టుబడులుఅనవసరమైన ఉత్సాహంతో ఊహాజనిత ర్యాలీలను వెంబడించడం కంటే లిక్విడిటీని నిలుపుకోవడమే తమ శైలి అని బఫెట్ పునరుద్ఘాటించారు. ‘మార్కెట్లో పెద్ద ఎత్తున క్షీణత లేదా తీవ్ర సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే మేము ఈ భారీ నిధులను రంగంలోకి దించుతాం’ అని పేర్కొన్నారు. 2008 నాటి ఆర్థిక సంక్షోభం, కొవిడ్ క్రాష్ వంటి సమయాల్లో బెర్క్షైర్ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. 2026 ప్రారంభంలో బఫెట్ నుంచి సీఈఓ బాధ్యతలు స్వీకరించిన గ్రెగ్ అబెల్ కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నారు. తన మొదటి త్రైమాసికంలోనే 8.1 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ హోల్డింగ్స్ను విక్రయించి రక్షణత్మక వైఖరిని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026’కు ఆమోదం -
వాజ్పేయి సాయం.. వేదాంత విజయం!
ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో.. కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక మధుర జ్ఞాపకాన్ని వేదాంత సంస్థ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తన వ్యాపార జీవితంలో అత్యంత కీలకమైన విజయానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సహాయం కారణమని ఆయన తెలిపారు.భారతీయ కంపెనీలకు దేశీయ స్టాక్ మార్కెట్లో తగిన గుర్తింపు, విలువ లభించడం లేదని అనిల్ అగర్వాల్ భావించారు. దీంతో.. వేదాంతను లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే.. విదేశీ స్టాక్ మార్కెట్లో భారతదేశ కంపెనీని లిస్ట్ చేయాలంటే ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవడం తప్పనిసరి. ఆ అనుమతి పొందడం చాలా కష్టమైన పని.10 December 2003!मुझे आज भी London की वो सुबह याद है, जब Vedanta के साथ-साथ, हिंदुस्तान भी इतिहास रचने के लिए तैयार था।उस समय मुझे अक्सर लगता था कि भारतीय businesses को सही value और growth नहीं मिल रही।मैंने तय कर लिया कि Vedanta को London Stock Exchange पर list करेंगे।पर… pic.twitter.com/DyX1GE6eCb— Anil Agarwal (@AnilAgarwal_Ved) August 5, 2026ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అనిల్ అగర్వాల్ ఢిల్లీకి వెళ్లి పలువురు అధికారులను కలిశారు. చివరకు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని కలిసి తన ఆలోచనను వివరించే అవకాశం దక్కింది. ఆయన చెప్పిన విషయాన్ని వాజ్పేయి ఎంతో శ్రద్ధగా విన్నారు. తర్వాత.. అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ను చూసి,''ఈ అబ్బాయి మంచివాడిలా కనిపిస్తున్నాడు. ఇతనికి సహాయం చేద్దాం. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం దేశానికి వస్తుంది'' అని చెప్పారు.ప్రధానమంత్రి మద్దతుతో ప్రభుత్వం వెంటనే అవసరమైన ఎన్ఓసీను జారీ చేసింది. ఆ అనుమతి పత్రంతో.. అనిల్ అగర్వాల్ తిరిగి లండన్ వెళ్లి తన కలను నిజం చేసుకున్నారు. వేదాంత సంస్థ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ పొందిన తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఎఫ్టీఎస్ఈ 100 ఇండెక్స్లో కూడా స్థానం సంపాదించింది. ఈ విజయాన్ని అనిల్ అగర్వాల్ తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: 100మంది రిజెక్ట్ చేసినా.. రూ.38 వేల కోట్ల కంపెనీ నిర్మించాడు! -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్!
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 373.76 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 78,954.76 వద్ద, నిఫ్టీ 11.35 పాయింట్లు లేదా 0.046 శాతం లాభంతో 24,636.00 వద్ద నిలిచాయి.నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. బ్లూ స్టార్ లిమిటెడ్, సరిగమ ఇండియా లిమిటెడ్, హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆర్బీఐ ఎఫెక్ట్: మార్కెట్ ముగిసిందిలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో భారత బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ కాస్త లాభాలతో పుంజుకున్నాయి. నిఫ్టీ 0.04 శాతం లేదా 9.75 పాయింట్ల లాభంతో 24,624.65 వద్ద, సెన్సెక్స్ 152.05 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 78,581.00 వద్ద ముగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 0.18 శాతం, 0.7 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి. -
లక్ష పెడితే 12 లక్షలు.. స్టాక్ మార్కెట్ లో మరో సెన్సేషన్
-
సెన్సెక్స్ 394 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు తగ్గి 24,629 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 394 పాయింట్లు పుంజుకొని 78,822 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.78బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.79 శాతం పెరిగింది.నాస్డాక్ 2.59 శాతం పుంజుకుంది.Today Nifty position 05-08-2026(time: 9:44 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్.. పబ్లిక్ ఇష్యూల సందడి!
ముంబై: మళ్లీ ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంటోంది. ఈ వారాంతాన రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. మరో కంపెనీ సెబీకి ప్రాథమిక దరఖాస్తు దాఖలు చేసింది. పీఈ దిగ్గజం కేకేఆర్కు పెట్టుబడులున్న లీప్ ఇండియా, మౌలిక రంగ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవో చేపట్టనున్నాయి. వివరాలు చూద్దాం..రూ. 2,480 కోట్లకు రెడీసప్లై చైన్ నిర్వహణ కంపెనీ లీప్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి రూ. 151–159 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభంకానుండగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లు ఆఫర్ చేయనుంది. 11న ముగియనున్న ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 480 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 2,480 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైలర్లు కనీసం 94 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 360 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ నెల 14న లిస్ట్కానుంది.2013లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా సప్లై చైన్ నిర్వహణ రంగంలో పంచుకోవడం, పునర్వినియోగం(షేర్ అండ్ రీయూజ్) పద్ధతిన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తద్వారా సరఫరా సంబంధ సౌకర్యాలను తాత్కాలిక ప్రాతిపదికన కస్టమర్లు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఫలితంగా కస్టమర్లు తయారీ దగ్గరనుంచి వస్తువుల పంపిణీసహా.. రిటైల్(పీవోఎస్)వరకూ సేవలు సమకూరుస్తోంది. గతేడాది(2025-26) రూ. 747 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 62 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 252 కోట్లపై కన్నుప్రధానంగా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు చేపట్టే ఈపీసీ కంపెనీ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవోకు రూ. 200–212 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభంకానుండగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లు ఆఫర్ చేయనుంది. 11న ముగియనున్న ఐపీవోలో భాగంగా కంపెనీ 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ సంస్థ కార్తికేయ కన్స్ట్రక్షన్స్ మరో 23.76 లక్షల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 252 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 150 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. గతేడాది(2025–26) రూ. 345 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 43 కోట్ల నికర లాభం ఆర్జించింది.ఎన్క్యూబ్ ఎథికల్స్ సెబీకి దరఖాస్తుస్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఎన్క్యూబ్ ఎథికల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్ మేహుల్ మధుసూదన్ షా, ప్రస్తుత వాటాదారు ఫ్రంటియర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి.దీంతో ఇష్యూ నిధులు కంపెనీ ప్రమోటర్తోపాటు, ఇన్వెస్టర్ సంస్థకు మాత్రమే చేరనున్నాయి. 1995లో ఏర్పాటైన కంపెనీ ప్రపంచవ్యాప్త ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల ప్లాట్ఫామ్గా సర్వీసులందిస్తోంది. సాంకేతికంగా క్లిష్టతరహా(కాంప్లెక్స్) టాపికల్, ట్రాన్స్డెర్మల్ డోసేజీలను రూపొందిస్తోంది. భారత్సహా.. యూఎస్, యూకే, యూరప్ తదితర రెగ్యులేటెడ్ మార్కెట్లకు ప్రొడక్టులను అందిస్తోంది. గతేడాది(2025–26) రూ. 1,849 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 437 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం మిశ్రమ ఫలితాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 210.08 పాయింట్లు లేదా 0.27 నష్టంతో 78,428.95 వద్ద, నిఫ్టీ 159.40 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 24,614.90 వద్ద నిలిచాయి.ఏథర్ ఎనర్జీ లిమిటెడ్, కేఈఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఎల్ లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 544.39 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 78,639.03 వద్ద, నిఫ్టీ 390.70 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో 24,774.30 వద్ద నిలిచాయి.అర్బన్ కంపెనీ లిమిటెడ్, బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్, పైన్ ల్యాబ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెన్సెక్స్ 445 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు పెరిగి 24,521 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 445 పాయింట్లు పుంజుకొని 78,536 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.75బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 83.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.7 శాతం పెరిగింది.నాస్డాక్ 1 శాతం పుంజుకుంది.Today Nifty position 03-08-2026(time: 9:25 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రేడింగ్ ఒక వృత్తి కాగలదా?
నేటి ఆధునిక ఆర్థిక ప్రపంచంలో ‘ఆర్థిక స్వాతంత్య్రం’ సాధించ డానికి ట్రేడింగ్ ఒక ఆకర్షణీయమైన మార్గంగా కనిపిస్తోంది. గతంలో దీనిని కేవలం ఒక జూదంగానో లేదా పార్ట్–టైమ్ ఆదాయ వనరుగానో చూసేవారు. నేడు సాంకేతిక విప్లవం, మార్కెట్లపై అవగాహన పెరగడంతో చాలామంది దీనిని పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకోవాలని భావిస్తున్నారు.భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన ‘సెబీ’ రిటైల్ ట్రేడర్ల శైలి, వారి లాభనష్టాలపై ఒక లోతైన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈ గణాంకాలు ట్రేడింగ్ను వృత్తిగా మార్చుకోవాల నుకునే వారికి కనువిప్పు కలిగిస్తున్నాయి.భారతదేశంలో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ చేసే వ్యక్తిగత ట్రేడర్లలో దాదాపు 90% నుండి 93% మంది నష్టపోతున్నారు. నష్టపోయే ప్రతి యాక్టివ్ ట్రేడర్ సగటున ఏడాదికి రూ. 1.25 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు నష్టపోతున్నట్లు సెబీ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 7% నుండి 10% మంది మాత్రమే మార్కెట్లో లాభాలు గడిస్తున్నారు. వీరిలో కూడా కేవలం 1.5% మంది మాత్రమే నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని స్థిరంగా సంపాదించగలుగుతున్నారు. ట్రేడర్లు సంపాదించే లాభాల్లో లేదా నష్టాల్లో దాదాపు 15% నుండి 25% వరకు కేవలం బ్రోకరేజ్, పన్నులు, ఇతర లావాదేవీల ఖర్చులకే సరిపోతుందని తేలింది.ట్రేడింగ్లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్నప్పుడు భయం, దురాశ వంటి భావోద్వేగా లను నియంత్రించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ట్రేడింగ్ను విజయ వంతమైన కెరీర్గా మార్చుకోవాలంటే ట్రేడింగ్కు సంబంధించి చాలా అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి ట్రేడ్లోనూ మీ పెట్టుబడిపై ఎంత శాతం నష్టాన్ని (స్టాప్–లాస్ విధానం) భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్ ఇండికేటర్లపై శాస్త్రీయ మైన పట్టు ఉండాలి.ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో (ముఖ్యంగా అమెరికా, యూరప్, సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో) ట్రేడింగ్ను ఒక జూదంగానో లేదా సైడ్ హాసిల్గానో కాకుండా, గౌరవప్రదమైన, వ్యవస్థీకృతమైన ‘వైట్ కాలర్‘ వృత్తిగా చూస్తారు. విదేశాలతో పోలిస్తే భారతదేశంలో ట్రేడింగ్ను వృత్తిగా మార్చుకోవడానికి ఉన్న అతిపెద్ద సవాలు ఆర్థిక అక్షరాస్యత లోపించడం, సరైన గైడెన్స్ లేకపోవడం.– డా. ఎం.డి. ఖ్వాజా మొయినుద్దీన్, స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు -
స్టాక్ మార్కెట్ అప్డేట్స్: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 166.49 పాయింట్లు లేదా 0.21 శాతం లాభంతో 78,094.64 వద్ద, నిఫ్టీ 43.95 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 24,361.10 వద్ద నిలిచాయి.బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, సజిలిటీ లిమిటెడ్, సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
SIPలో ఎవరూ చెప్పని సీక్రెట్.. ₹50,000 తో కోటి..
-
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు పెరిగి 24,347 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 పాయింట్లు తగ్గి 77,961 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.18బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 85.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.64 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.66 శాతం పెరిగింది.నాస్డాక్ 2.78 శాతం పుంజుకుంది.Today Nifty position 31-07-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 180.83 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 77,835.43 వద్ద, నిఫ్టీ 46.30 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 24,296.50 వద్ద నిలిచింది.బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రెడింగ్టన్ లిమిటెడ్, సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్, హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రేడర్లకు అలర్ట్.. స్టాక్ మార్కెట్లో కొత్త టైమింగ్!
దేశీయ స్టాక్ మార్కెట్లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. పెట్టుబడిదారులకు మరింత పారదర్శకమైన, న్యాయమైన ట్రేడింగ్ వాతావరణాన్ని కల్పించేందుకు 2026 ఆగస్టు 3 నుంచి సీఏఎస్ (Closing Auction Session) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ విధానం వల్ల షేర్ల ముగింపు ధర మరింత ఖచ్చితంగా నిర్ణయించడం జరుగుతుంది.ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత.. మార్కెట్ ముగింపు సమయాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. F&O విభాగంలో ఉన్న షేర్ల ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటలకు ముగుస్తుంది. మిగతా అన్ని ఈక్విటీ షేర్ల ట్రేడింగ్ 3:30 గంటలకు, ఇండెక్స్ అండ్ స్టాక్ F&O కాంట్రాక్టుల ట్రేడింగ్ 3:40 గంటలకు ముగుస్తుంది. అయితే మార్కెట్ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారికి కూడా.. కొత్త ఆటో స్క్వేర్ ఆఫ్ సమయాలు అమల్లోకి వస్తాయి. సీఏఎస్ పరిధిలోని షేర్లకు 3:10 గంటలకు, సీఏఎస్ పరిధిలో లేని షేర్లకు 3:20 గంటలకు, ఇండెక్స్ అండ్ స్టాక్ ఎఫ్&ఓ కాంట్రాక్టులకు 3:25 గంటలకు ఆటో స్క్వేర్ ఆఫ్ జరుగుతుంది. కాబట్టి ఇంట్రాడే ట్రేడర్లు ఈ సమయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.సీఏఎస్ ఎందుకు ప్రవేశపెట్టారు? ప్రస్తుతం మార్కెట్ ముగింపు ధరను 'కంటిన్యూస్ ట్రేడింగ్ సెషన్'లో జరిగిన ట్రేడ్ల సగటు ధర (VWAP) ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ మార్కెట్ చివరి నిమిషాల్లో పెద్ద సంస్థలు భారీగా కొనుగోలు లేదా అమ్మకాలు చేయడం వల్ల షేర్ల ధరలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల నిజమైన ముగింపు ధర ప్రతిబింబించకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సీఏఎస్ తీసుకురావడం జరిగింది.సీఏఎస్ ఉపయోగాలుజెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్ సీఏఎస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్లు, ETFలు వంటి పెద్ద పెట్టుబడి సంస్థలు మార్కెట్ ముగింపు ధరకు అనుగుణంగా ట్రేడింగ్ చేయడం వల్ల వాటి ట్రాకింగ్ ఎర్రర్ తగ్గుతుంది. అలాగే పెద్ద ఆర్డర్ల కారణంగా మార్కెట్పై పడే ప్రభావం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా.. మార్కెట్ ముగింపు సమయంలో ఇండెక్స్ ధరలను కృత్రిమంగా మార్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.ప్రపంచంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీలు అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (NYSE), లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ (LSE) వంటి మార్కెట్లు ఇప్పటికే ఈ సీఏఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల మార్కెట్లో పారదర్శకత పెరుగుతుంది, పెద్ద పెట్టుబడిదారుల ప్రభావం తగ్గుతుంది, చిన్న పెట్టుబడిదారులకు కూడా న్యాయమైన ట్రేడింగ్ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి.. సీఏఎస్ భారతీయ స్టాక్ మార్కెట్ను మరింత బలంగా, విశ్వసనీయంగా మార్చే ఒక మంచి ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు. -
లక్షకు 5 లక్షల లాభం.. ఈ షేర్ మిస్ అయితే బోనస్ మిస్..
-
నెమ్మదించిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు పెరిగి 24,256 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 34 పాయింట్లు తగ్గి 77,618 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.91బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 89.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.7 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.52 శాతం తగ్గింది.నాస్డాక్ 1.74 శాతం నష్టపోయింది.Today Nifty position 30-07-2026(time: 9:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ షేర్ల మెరుపులు.. లాభాల్లో స్టాక్మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్ల లాభాల దన్నుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. సెన్సెక్స్ 889 పాయింట్లు లేదా 1.16 శాతం పెరిగి 77,654.60 వద్ద, నిఫ్టీ 265 పాయింట్లు లేదా 1.1 శాతం పెరిగి 24,250.20 వద్ద స్థిరపడ్డాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.82 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.48 శాతం పెరిగాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మెరుగైన పనితీరు కనబరిచాయి. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 69.86 పాయింట్లు లేదా 0.091 శాతం నష్టంతో 76,765.92 వద్ద, నిఫ్టీ 10.60 పాయింట్లు లేదా 0.044 శాతం నష్టంతో 23,985.35 వద్ద నిలిచాయి.అశికా గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, రాడాన్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, నీల్కమల్ లిమిటెడ్, అఫ్లే 3ఐ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎస్.కె.ఎం. ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ (ఇండియా) లిమిటెడ్, ఆరియన్ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 776.01 పాయింట్లు లేదా 1.02 శాతం లాభంతో 76,835.78 వద్ద, నిఫ్టీ 228.50 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 23,995.95 వద్ద నిలిచాయి.పిరమిడ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్, క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, కార్ట్రేడ్ టెక్ లిమిటెడ్, రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నెల్కాస్ట్ లిమిటెడ్, గాంధర్ ఆయిల్ రిఫైనరీ (ఇండియా) లిమిటెడ్, మోస్చిప్ టెక్నాలజీస్ లిమిటెడ్, టిప్స్ ఫిల్మ్స్ లిమిటెడ్, క్రాస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 23,944 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 601 పాయింట్లు పుంజుకొని 76,667 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.16బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.63 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం పెరిగింది.నాస్డాక్ 0.64 శాతం నష్టపోయింది.Today Nifty position 27-07-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మణిపాల్ హెల్త్ ఐపీవో.. షేరు ధర ఇలా..
న్యూఢిల్లీ: హెల్త్కేర్ దిగ్గజం మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు షేరు ధరల శ్రేణిని రూ.560–590గా కంపెనీ నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.77,600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ నెల 29న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ 31న ముగుస్తుంది. రూ.9,275 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. ఇందులో భాగంగా రూ. 8,000 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుండగా.. సంస్థలోని ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో మరో 2.16 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. మణిపాల్ హెల్త్ సమీకరించనున్న నిధుల్లో రూ.5,378 కోట్లను సబ్సిడరీ మణిపాల్ హాస్పిటల్స్కు చెందిన రుణ చెల్లింపుల కోసం, రూ.574 కోట్లను మరో సబ్సిడరీ సహ్యాద్రి హాస్పిటల్స్లో మైనారిటీ వాటా కొనుగోలు కోసం, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. దేశవ్యాప్తంగా 49 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ (13,000 బెడ్స్) కలిగిన మణిపాల్ హెల్త్.. 2025 సెపె్టంబర్ 30తో ముగిసిన ఆరు నెలలకు రూ.4,713 కోట్ల ఆదాయంపై రూ. 572 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.3–4 ఏళ్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడి హాస్పిటల్స్ నెట్వర్క్ విస్తరణ కోసం వచ్చే 3–4 ఏళ్లలో రూ.3,560 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు మణిపాల్ హెల్త్ ఎండీ, సీఈఓ దిలీప్ జోస్ చెప్పారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ప్రస్తుత హాస్పిటల్స్ విస్తరణ ద్వారా మరో మూడేళ్లలో 3000 బెడ్స్ అదనంగా జతయ్యే అవకాశం ఉందన్నారు. విస్తరణలో భాగంగా కేరళ, హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ఆసుపత్రుల కొనుగోలుకు సిద్ధమేనని కూడా జోస్ వెల్లడించారు. -
స్టాక్ మార్కెట్: ఐదో రోజూ నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాలతోనే ముగిశాయి. పెరిగిన చమురు ధరల మధ్య ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన భయాలతో మదుపరులు అమ్మకాలకు దిగడంతో బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ శుక్రవారం నష్టాలతో సెషన్ను ముగించాయి.సెన్సెక్స్ 332 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 76,059.77 వద్ద, నిఫ్టీ 102.15 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 23,767.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.1 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.32 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1 శాతం పతనమై అత్యంత చెత్త పనితీరు కనబరిచింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫార్మా కూడా తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల బాట
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 181 పాయింట్లు తగ్గి 23,692 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 642 పాయింట్లు నష్టపోయి 75,758 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.41బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.7 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.21 శాతం తగ్గింది.నాస్డాక్ 2.15 శాతం నష్టపోయింది.Today Nifty position 24-07-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 376.84 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 76,378.20 వద్ద, 126.65 పాయింట్లు లేదా 0.53 శాతం నష్టంతో 23,869.60 వద్ద నిలిచాయి.టిప్స్ ఫిల్మ్స్ లిమిటెడ్, ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్, ప్రజే ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, తాన్లా ప్లాట్ఫారమ్స్ లిమిటెడ్, షా మెటాకార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కంట్రోల్ ప్రింట్ లిమిటెడ్, సిఐఇ ఆటోమోటివ్ ఇండియా లిమిటెడ్, వాటర్వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 23,945 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 208 పాయింట్లు నష్టపోయి 76,557 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.66 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.14 శాతం తగ్గింది.నాస్డాక్ 0.57 శాతం నష్టపోయింది.Today Nifty position 23-07-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్మార్కెట్!
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రియల్టీ, పీఎస్యూ బ్యాంకు షేర్ల కుదేలుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్లోనూ భారీగా పతనమయ్యాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తత కారణంగా అధిక చమురు ధరలు కూడా రిస్క్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 715.06 పాయింట్లు లేదా 0.92 శాతం క్షీణించి 76,755.05 వద్ద, నిఫ్టీ 191.45 పాయింట్లు లేదా 0.79 శాతం క్షీణించి 23,996.25 వద్ద ముగిసింది.సెన్సెక్స్ లోని 30 స్టాక్స్ లో 22 షేర్లు నష్టపోయాయి. రేపటి క్యూ 1 ఫలితాలకు ముందు ఇండిగో 3.7 శాతం క్షీణతతో టాప్ లూజర్ గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఢమాలయ్యాయి. మరోవైపు, ఎటర్నల్, Q1 ఫలితాల తరువాత ఉత్తమ పనితీరును కనబరిచింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.09 శాతం, 1.54 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ అత్యంత క్షీణించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగాయి. -
సెన్సెక్స్.. 560 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు తగ్గి 24,024 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 568 పాయింట్లు నష్టపోయి 76,915 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.16బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.89 శాతం పెరిగింది.నాస్డాక్ 1.29 శాతం పుంజుకుంది.Today Nifty position 22-07-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ నిఫ్టీ అహింసా ఇండెక్స్!
భారత స్టాక్ మార్కెట్లో థీమ్ ఆధారిత పెట్టబడులకు సంబంధించి మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అంటే ఇప్పటివరకు లాభాలు, వృద్ధి, డివిడెండ్లు ప్రమాణాలుగా పరిగణించేవారు. ఇప్పుడు వీటికి ’అహింస’ అనే కొత్త ప్రమాణం కూడా జతకలిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 500 పేరుతో అహింస ఇండెక్స్ను ప్రారంభించింది. జంతువులపై హింసకు పాల్పడని, జంతువులకు సంబంధంలేని కంపెనీలను ఈ ఇండెక్స్లో చేర్చడం విశేషం. ఇతరదేశాల్లో కొత్తగా ట్రెండవుతున్న ఎథికల్ ఇన్వెస్టింగ్ (నైతిక విలువల పెట్టుబడులు)కోరుకునే ఇన్వెస్టర్లకు దేశీయంగా ఈ ఇండెక్స్ను ఎన్ఎస్ఈ అందుబాటులోకి తెచ్చింది.ఈ ఇండెక్స్లో నిఫ్టీ 500 లోని కంపెనీలను ప్రత్యేకంగా పరిశీలించి వాటి ఉత్పత్తులు, వ్యాపార విధానాలు, సేవలు జంతువులకు ఏవిధంగా అయినా హాని కలిగిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించి ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియను అహింసాగైన్ ఫౌండేషన్ రూపొందించిన అహింసా ఇన్వెస్ట్మెంట్ మూవ్మెంట్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు కేవలం లాభాలే కాకుండా పర్యావరణం, సామాజిక బాధ్యత, నైతిక విలువలు వంటి అంశాలను కూడా పెట్టుబడి చేసే ముందు పరిగణలోకి తీసుకుంటున్నారు. పర్యావరణ (ఎని్వరాన్మెంటల్) సా మాజిక (సోషల్), పాలనా (గవర్నెన్స్) ఈఎస్జీ ప్రమాణాల తర్వాత యానిమల్ వెల్ఫేర్ ఇన్వెస్టింగ్ కూడా ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇప్పటికే రూ.80 లక్షల కోట్లకు పైగా ఆస్తులు నిర్వహణలో ఉన్నప్పటికీ జంతు సంక్షేమాన్ని ఆధారంగా చేసుకున్న పెట్టుబడి ఉత్పత్తులు పరిమితంగానే ఉన్నాయి. ఈ కొత్త ఇండెక్స్ ఆ లోటును కొంత వరకు భర్తీ చేయవచ్చనేది మార్కెట్ నిపుణుల అంచనా. ఇన్వెస్టింగ్ అంటే కేవలం లాభాలే కాదు మన డబ్బు ఏ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందో కూడా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని, విలువలకు ప్రాధాన్యం ఇచ్చే పెట్టుబడుల యుగానికి ఎన్ఎస్ఈ ఇండెక్స్ నాంది పలికిందని భావిస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ఎంపిక ఎలా? ఇండెక్స్లో చేర్చే కంపెనీలను గ్రీన్, ఆరెంజ్, రెడ్ అనే మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. గ్రీన్: జంతు హింసకు దూరంగా ఉండే కంపెనీలు ఆరెంజ్: కొంత మేర ప్రభావం చూపే సంస్థలు రెడ్: ... జంతువులపై ప్రత్యక్ష ప్రభావం చూపే వ్యాపారాలు ఆరెంజ్, రెడ్ కేటగిరీల్లో ఉన్న కంపెనీలను ఈ ఇండెక్స్లో చేర్చరు. ఈ ఇండెక్స్ ఆధారంగా భవిష్యత్తులో ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్లు, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడి ఉత్పత్తులను ప్రారంభించే అవకాశముందని ఎన్ఎస్ఈ వెల్లడించింది. ప్రస్తుతం ప్రారంభించిన ఇండెక్స్ లో బ్యాంకింగ్ రంగానికి చెందిన ఒక్క కంపెనీ కూడా లేదు. అలాగే రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు కూడా స్థానం దక్కలేదు. మరోవైపు ప్రముఖ ఐటీ కంపెనీలు,ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, కొన్ని తయారీ రంగ సంస్థలు ఇండెక్స్లో చోటు సంపాదించాయి. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 238.41 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 77,470.11 వద్ద, నిఫ్టీ 50.80 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,187.70 వద్ద నిలిచాయి.ఆస్థా స్పిన్టెక్స్ లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్, కేసీపీ షుగర్ & ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, వెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్ లిమిటెడ్, విమ్తా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్, ఏకేజీ ఎగ్జిమ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు పెరిగి 24,251 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 7 పాయింట్లు పెరిగి 77,718 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.98బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.19 శాతం తగ్గింది.నాస్డాక్ 0.05 శాతం నష్టపోయింది.Today Nifty position 21-07-2026(time: 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 442.93 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 77,708.52 వద్ద, నిఫ్టీ 95.80 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టంతో 24,238.50 వద్ద నిలిచాయి.సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్, అషిమా లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్, సిక్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భన్సాలీ ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, రాజదర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగు ఐపీఓలు.. రెండు లిస్టింగ్లు!
ముంబై: దేశీ ప్రైమరీ మార్కెట్లో ఈ వారం కూడా ఐపీఓల సందడి జోరుగా కొనసాగనుంది. నేటి (జూలై 20)తో ప్రారంభమయ్యే ఈ వారంలో మెయిన్ బోర్డ్ విభాగంలో మొత్తం నాలుగు కొత్త పబ్లిక్ ఇష్యూలు ఓపెన్ కానున్నాయి. అలాగే గత వారం ముగిసిన రెండు కీలక కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిస్టింగ్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎస్బీఐ ఫండ్స్ మెగా లిస్టింగ్ గత వారం రూ. 9,813 కోట్ల భారీ ఐపీఓ ప్రక్రియ ముగిసిన తర్వాత, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ షేర్లు జూలై 21న (మంగళవారం) ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు 16 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. కాలిబర్ మైనింగ్.. శుక్రవారం మహారాష్ట్రకు చెందిన కోల్ మైనింగ్ సర్వీసెస్ కంపెనీ ‘కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్’ రూ. 450 కోట్ల విలువైన ఐపీఓ జూలై 21న ముగియనుంది. జూలై 24న (శుక్రవారం) ఈ షేరు మార్కెట్లో లిస్ట్ కానుంది. గ్రే మార్కెట్లో షేరు ధర ఏకంగా 27 శాతం ప్రీమియంతో దూసుకుపోతుండటం విశేషం.కొత్త ఇష్యూలు.. క్యూబ్ హైవేస్ ట్రస్ట్ ఇన్విట్: ఈ పబ్లిక్ ఇష్యూ జూలై 22న ప్రారంభమై, జూలై 24న ముగియనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో రూ. 5,000 కోట్లను సేకరించనుంది. దీని ధరల శ్రేణి రూ. 151–152. ఇండో–ఎమ్ఐఎమ్: బెంగళూరుకు చెందిన ఈ ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది. లోహియా కార్ప్: కాన్పూర్కు చెందిన ఈ టెక్నికల్ టెక్స్టైల్ మెషినరీ తయారీ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది. ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్: ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఈ సంస్థ రూ.170 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో జూలై 23న మార్కెట్లోకి వస్తోంది. దీని ధరల శ్రేణి రూ.120–127గా ఉంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:52 సమయానికి నిఫ్టీ(Nifty) 165 పాయింట్లు తగ్గి 24,169 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 665 పాయింట్లు నష్టపోయి 77,489 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.72బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.01 శాతం తగ్గింది.నాస్డాక్ 1.4 శాతం నష్టపోయింది.Today Nifty position 20-07-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!. కొంచెం స్టాక్మార్కెట్ గురించి తెలిసిన వాళ్లంతా గురువులు, స్నేహితుల రూపంలో అప్పుడే ఎదురవుతారు. ‘‘ఇది మంచి కంపెనీ. ధర ఓకే. జస్ట్ కొని పక్కనపెట్టుకోండి. ఎప్పటికీ అమ్మకపోతేచాలు’’ అని సలహా ఇస్తారు. ఇదిగో... ఇన్వెస్టర్లు తప్పులో కాలేసేదిక్కడే. ఎందుకంటే ‘షేర్లు కొని మర్చిపోండి’ అనే సలహాలో నిజం సగమే. ఒక గొప్ప కంపెనీ షేరును కొన్నంత మాత్రాన అద్భుతమైన లాభాలు వస్తాయని కానీ... ఒక నాసిరకం కంపెనీ షేరును కొన్నంత మాత్రాన నష్టాలు ఖాయమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కంపెనీ– షేరు కవలలు కాదు. కేవలం సోదరులే. రెండింట్లో తేడాలుండొచ్చు. అనుకున్నట్టుగా రాణించే మంచి కంపెనీలకన్నా, అనూహ్యంగా రాణించే సాధారణ కంపెనీలే బాగా ముందుకెళతాయి. అదెలాగో సోదాహరణంగా వివరించేదే ఈ సాక్షి ‘వెల్త్’ ప్రత్యేక కథనం... ఒక షేరు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎన్నాళ్లలో ఎంత రాబడినిస్తుంది? ఇదంతా కేవలం కంపెనీ ఎంత బాగుందన్న దానిపైనే ఆధారపడదు. కంపెనీ వ్యాపారం ఏటా ఏ స్థాయిలో పెరుగుతోంది? ఆ పెరిగే వృద్ధికి మార్కెట్ ఎంత విలువ ఇస్తోంది? ఆ కంపెనీ ఎంత డివిడెండ్ చెల్లిస్తోంది? మనం కొన్న షేరును ఎంతకాలం విక్రయించకుండా ఉంచగలుగుతున్నాం? ఇవన్నీ కలిసే షేరుపై వచ్చే రాబడిని నిర్ణయిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలివీ... గొప్ప కంపెనీ... కానీ పూర్ ఇన్వెస్ట్మెంట్! పేజ్ ఇండస్ట్రీస్: 2009–2019 మధ్య దేశంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లకు అత్యంత భారీ లాభాలిచ్చిన షేరు ఇదే. ఆదాయం బీభత్సం. మార్జిన్లు అద్భుతం. పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి(ఆర్ఓసీఈ) అత్యధికం. దీంతో 2009లో రూ.300 ఉన్న షేరు ధర పదేళ్లలో ఏకంగా రూ.35వేలకు చేరింది. ఇన్వెస్టర్లు ఇక ఈ కంపెనీకి ఎదురులేదనుకున్నారు. ధర ఎంత పెరిగినా కొనటం మొదలుపెట్టారు. వేల్యుయేషన్లు పెరిగాయి. అంటే.. కంపెనీ భవిష్యత్తుకు తగ్గట్టు ముందే షేరు ధర పెరిగిపోయింది. జాకీ బ్రాండ్ దుస్తుల్ని దేశీయంగా విక్రయించే ఈ కంపెనీ వ్యాపారం 2019 తరువాత కూడా అద్భుతంగా కొనసాగింది. కానీ అప్పటికే ఆ భవిష్యత్తు మొత్తం షేరు ధరలో చేరిపోయింది. ఈ ఏడేళ్లలో షేరు ధర రూ.40 వేలకు అటూఇటుగా ఉంది. మరి 2019లోనో ఆ తరువాతో ఇన్వెస్ట్ చేసిన వారికిది పూర్ ఇన్వెస్ట్మెంటే కదా? కొటక్ మహీంద్రా బ్యాంక్దీ ఇలాంటి స్టోరీనే.దేశంలోని అతికొద్ది అద్భుతమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. మేనేజ్మెంట్, అండర్రైటింగ్, అసెట్ క్వాలిటీ అన్నింటా సూపర్. ఇన్వెస్టర్లకూ ఇష్టమే. కానీ అందరూ ఇష్టపడి కొనటం వల్ల ఈ షేరు వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. తరువాత రుణాల వృద్ధి తగ్గింది. వ్యాపారం, బుక్ వేల్యూ పెరుగుతున్నా వాల్యుయేషన్ల ప్రీమియం తగ్గటంతో షేరు ధర బాగా పడింది. ఏషియన్ పెయింట్స్దీ ఇలాంటి కథే. ఒకప్పుడు ఇది వ్యాపారానికి బెంచ్మార్క్. పోటీ సంస్థలకన్నా అన్నింటా ముందంజే. కానీ గత కొన్నేళ్లుగా షేరుపై రాబడి పెద్దగా లేదు. ఎందుకంటే వ్యాపారం బాగానే ఉన్నా అంచనాలు విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకోవటం సాధ్యం కాని స్థితిలో... షేరు ధర పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంటోంది. రాబడిలో నిలకడ లేకుంటే... షేరు ధర అంతంతే! నాట్కో ఫార్మా: అప్పుల్లే వు. ఆర్ అండ్ డీ అద్భుతం. మార్జిన్లు సూపర్. పటిష్ఠమైన మేనేజ్మెంట్. కానీ... దీర్ఘకాలలలో చూస్తే ఈ కంపెనీపై రాబడి చాలా నాసిరకం. కారణమేంటి? ఈ కంపెనీ లాభాలన్నీ బ్లాక్బస్టన్ జనరిక్ డ్రగ్స్ను ప్రవేశపెట్టడంపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. ఒక అద్భుతమైన ఉత్పత్తితో అన్నీ మారిపోతాయి. తరవాత దానికి పోటీ వస్తుంది. మార్జిన్లు పడిపోతాయి. మరో కొత్త ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ తరహా అనిశ్చితి మార్కెట్కు నచ్చదు. దివీస్ లాబొరేటరీస్: ఇది కూడా నాట్కో తరహాలో దేశీ ఫార్మా కంపెనీనే. కానీ ఈ కంపెనీ పనితీరులో నాటకీయ అనూహ్యతేదీ ఉండదు. బ్లాక్బస్టర్ డ్రగ్స్ ఉండవు. కానీ... అదే పనితీరు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మార్జిన్లు, క్యాష్ ఫ్లో, రాబడి... అన్నీ అంచనాలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఈ కంపెనీ షేరు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతూనే వస్తోంది. కొన్ని సార్లు వేచి చూడాలి... అంతే! రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ది ప్రత్యేక కథ. 2002–08 మధ్య చూస్తే... చమురు రిఫైనింగ్ బూమ్లో ఉంది. షేరు ధర రూ.20 నుంచి ఏకంగా రూ.350కి చేరి ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. కానీ అప్పటి నుంచి 2016 వరకు వ్యాపారం అద్భుతంగానే ఉన్నా షేరు ధర పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. ఆ తరువాతి ఐదేళ్లూ... అంటే 2021 వరకూ చూస్తే జియో వచ్చింది. రిటైల్ పెరిగింది. కంపెనీ విలువ మారిపోయింది. షేరు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1400 కూడా తాకింది. మరి తరువాతేంటి? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానంకోసమే మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే గడిచిన ఐదేళ్లలో షేరు ధర పెరగలేదు. జియో ఐపీవోకు వస్తే దాని విలువెంత? రిటైల్ ఐపీఓ ఎంత? గ్రీన్ ఎనర్జీ ఆదాయాలెలా ఉంటాయి? ఏఐతో వచ్చే లాభమెంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం మార్కెట్ వేచిచూస్తోంది. కంపెనీ మారలేదు. వ్యాపారం క్షీణించలేదు. కానీ మార్కెట్ కంపెనీ వృద్ధికి కొత్త ట్రిగ్గర్ కోసం ఎదురుచూసింది. అందుకే ఐదేళ్లపాటు షేరు ధర పెద్దగా కదల్లేదు. ఇదే టైమ్ కరెక్షన్.సాదాసీదా వ్యాపారం... షేరు అద్భుతం! షిప్పింగ్ కంపెనీలను చూడండి. వ్యాపార నాణ్యత అంతంతే. రాబడులు కొన్నిసార్లు మాత్రం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా సరకు రవాణా సైకిల్స్ మారుతుంటాయి కనక. దానికి తగ్గట్టే షేర్లూ పెరుగుతుంటాయి. షుగర్ కంపెనీలదీ అదే తీరు. మార్జిన్లు తక్కువ. ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ. కానీ... ఇథనాల్ నిర్ణయాలప్పుడు... చక్కెర సీజన్లోను ఈ షేర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని చాలాసార్లు రెండుమూడు రెట్ల చొప్పున పెరిగాయి. కానీ వ్యాపారమేమీ అంత నాటకీయంగా మారిపోదు. సీజన్ మారుతుంది... అంతే.షేర్ల రాబడికి గ్రోత్ ఇంజిన్లు ఇవే... పై ఉదాహరణలన్నీ చూశాక ప్రతి ఇన్వెస్టరూ గమనించాల్సినవి ఇవే. → రాబడుల్లో వృద్ధి: కంపెనీ ఆదాయం, లాభం క్రమం తప్పకుండా పెరగాలి. → ఊహించినట్టే: కంపెనీ భవిష్యత్తు రాబడులపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉండాలి. → వేల్యుయేషన్: ఎంత పీఈ దగ్గర కొంటున్నామనే విషయంతో పాటు కంపెనీ పీఈ ఏటా ఏ స్థాయిలో పెరుగుతోందో కూడా చూడాలి. అప్పుడే ధర సహేతుకమో కాదో తెలుస్తుంది. → క్యాపిటల్ కేటాయిపు: రాబడుల్లో మిగిలే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఏ మేరకు సరిపోతుందన్నది కూడా ముఖ్యమే. → టైమ్: ఇది అన్నిటికన్నా ముఖ్యం. కొన్నిసార్లు అన్నీ బాగున్నా మార్కెట్ మాత్రం ఆ కంపెనీ నుంచి మరిన్ని సంకేతాల కోసం ఎదురు చూస్తుంటుంది. ఇన్వెస్టర్లు చూడాల్సినవివే... ఒక షేరు కొనేటపుడు ‘ఇది మంచి కంపెనీయే’ అని సింపుల్గా తేల్చేసుకోకుండా... → కంపెనీ రాబడుల్లో వృద్ధి నిలకడగా ఉంటుందా? → వ్యాపార పనితీరు అనుకున్నట్టుగానే సాగుతుందా? → లాభాలను కంపెనీ తెలివిగా వాడి విస్తరణ చేయగలుగుతుందా? → కంపెనీ షేరు విలువ సహేతుకంగానే ఉందా? → ఈ కంపెనీనుంచి మార్కెట్ ఆశిస్తున్నదెంత? కంపెనీ సాధించిందెంత? → వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీ ఏ రకమైన అనూహ్య ఫలితాలు సాధిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని... ఆ తరువాత ఇన్వెస్ట్ చేస్తేనే అనుకున్న ఫలితాలొస్తాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్యం తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతారు. కానీ అది సరికాదనే అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ‘ఈ వ్యాపారం భవిష్యత్ బాగుంటుందా?’ అనే ఆలోచిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం... ‘ఈ వ్యాపారం తాలూకు భవిష్యత్తు వృద్ధి ఇప్పటికే ఈ షేరులో కనిపిస్తోందా?’ అనేది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కంపెనీని కొనరు. ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాలను కొంటారు. ఆ భవిష్యత్తుకు ఎంత ధర చెల్లిస్తున్నారన్నదే చివరికి వారి రాబడిని నిర్ణయిస్తుంది. ఆ చెల్లించే ధర మరీ ఎక్కువ అనిపిస్తే ఆ షేరుకు దూరంగానే ఉండాలి. కనీసం కొన్నాళ్లయినా!! -మంథా రమణమూర్తి -
కుప్పకూలిన పతంజలి షేర్లు.. బ్లాక్ డీల్స్ తో భారీ షాక్!
-
ఇన్వెస్టర్లూ ‘బాస్’తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
కృత్రిమ మేధస్సు (AI), డీప్ఫేక్ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని జరుగుతున్న సైబర్ మోసాలపై భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) దేశంలోని కంపెనీలు, పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా "బాస్ స్కామ్" పేరుతో పెరుగుతున్న కొత్త తరహా మోసాలపై శుక్రవారం సెబీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.సెబీ వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు AI సాయంతో కంపెనీల సీఎండీలు, సీఈఓలు లేదా ఇతర ఉన్నతాధికారుల గొంతును క్లోన్ చేయడం, డీప్ఫేక్ వీడియోలు రూపొందించడం, అలాగే ఈ-మెయిల్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా వారిలా నటించి ఫైనాన్స్ విభాగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. "అత్యవసరం", "రహస్యంగా ఉంచాలి" అంటూ వెంటనే నిధులు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చి కోట్ల రూపాయలు కాజేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయని సెబీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో మాల్వేర్ ఫైళ్లను పంపి ఉద్యోగుల పరికరాలను హ్యాక్ చేసి, వారి ఖాతాల నుంచే నకిలీ చెల్లింపు ఆదేశాలు పంపుతున్నట్లు కూడా వెల్లడించింది.ఇదే సమయంలో ఎన్ఎస్ఈ కూడా పెట్టుబడిదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ ఎన్ఎస్ఈ వెబ్సైట్లు, క్లోన్ ట్రేడింగ్ యాప్లు, సోషల్ మీడియా పెట్టుబడి గ్రూపులు, తప్పుడు స్టాక్ సిఫార్సుల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్లు, యాప్ల ద్వారానే ట్రేడింగ్ సేవలను ఉపయోగించాలని, అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయొద్దని, OTPలు లేదా లాగిన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 964.59 పాయింట్లు లేదా 1.25 శాతం లాభంతో 24,346.15 వద్ద, నిఫ్టీ 273.40 పాయింట్లు లేదా 1.14 శాతం లాభంతో 24,346.15 వద్ద నిలిచాయి.రిలాక్సో ఫుట్వేర్స్ లిమిటెడ్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, పార్ డ్రగ్స్ & కెమికల్స్ లిమిటెడ్, వర్చుసో ఆప్టోఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రిండ్వెల్ నార్టన్ లిమిటెడ్, నవ్కర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏఏఏ టెక్నాలజీస్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్టి లిమిటెడ్, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 128 పాయింట్లు పెరిగి 24,202 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 488 పాయింట్లు ఎగబాకి 77,667 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.77బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.51 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.47 శాతం దిగజారింది.Today Nifty position 17-07-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 1.44 శాతం లేదా 0.0019 పాయింట్ల లాభంతో 77,186.87 వద్ద, నిఫ్టీ 5.75 శాతం లేదా 0.024 పాయింట్ల నష్టంతో 24,072.75 వద్ద నిలిచాయి.లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, గ్రిండ్వెల్ నార్టన్ లిమిటెడ్, శ్రీమతి బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్, సౌరాష్ట్ర సిమెంట్స్ లిమిటెడ్, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, జేఎన్కే ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్మార్కెట్ ట్రేడింగ్ జోష్.. బ్రోకరేజీ కంపెనీలకు కాసుల వర్షం!
ఫిన్టెక్, స్టాక్ బ్రోకరేజీ సంస్థ ‘ఏంజెల్ వన్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) ఆకర్షణీయమైన పనితీరు కనబరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల చురుకైన పార్టిసిపేషన్, భారీ ట్రేడింగ్ వాల్యూమ్స్ కారణంగా జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండింతలకు పైగా ఎగసి రూ.231 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (క్యూ1) కంపెనీ నికర లాభం రూ.114.5 కోట్లుగా నమోదైంది. అయితే, మునుపటి త్రైమాసికంతో (ఎఫ్వై26, క్యూ4) పోలిస్తే మాత్రం నికర లాభం 28 శాతం తగ్గి రూ.320 కోట్ల నుంచి రూ.231 కోట్లకు పరిమితమైంది.సమీక్షా త్రైమాసికంలో, కంపెనీ మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగి రూ.1,143 కోట్ల నుంచి రూ.1,434 కోట్లకు చేరినట్లు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. ఉద్యోగుల ఖర్చులు, ఫైనాన్స్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఇదే క్యూ1లో మొత్తం వ్యయాలు రూ.979 కోట్ల నుంచి రూ.1,109 కోట్లకు చేరాయి. కాగా, కంపెనీ బోర్డు డైరెక్టర్లు తమ షేర్ హోల్డర్లకు ప్రతి ఈక్విటీ షేరుపై రూ. 1 తొలి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించారు.పెరిగిన ఆర్డర్లు, ఏయూఎం ప్రస్తుత త్రైమాసికంలో మొత్తం ట్రేడింగ్ ఆర్డర్లు 18.4% పెరిగి 40.6 కోట్లకు చేరాయి. కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ విభాగం నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) జూన్ చివరి నాటికి ఏకంగా 81.4 శాతం ఎగసి రూ.620 కోట్లకు చేరుకుంది. మొత్తం క్లయింట్ల బేస్ వార్షిక ప్రాతిపదికన దాదాపు 19 శాతం వృద్ధితో 3.86 కోట్లకు చేరింది.‘గ్రో’ నికర లాభం 94 శాతం వృద్ధిన్యూఢిల్లీ: డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ‘గ్రో’ మాతృ సంస్థ ‘బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) లో అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. జూన్ 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 94 శాతం ఎగసి రూ.735 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ1లో కంపెనీ రూ.378 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ద్వారా ఆదాయం 66 శాతం వృద్ధితో రూ.904 కోట్ల నుంచి రూ.1,501 కోట్లకు చేరినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.445 కోట్ల నుంచి రూ.556 కోట్లకు పెరిగాయి.గత త్రైమాసికంతో పోలిస్తే... గత త్రైమాసికం (జనవరి–మార్చి) తో పోల్చితే కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.1,505 కోట్ల నుండి రూ.1,501 కోట్లతో దాదాపు స్థిరంగానే కొనసాగింది. అయితే, నికర లాభం మాత్రం జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.686.36 కోట్లతో పోలిస్తే ప్రస్తుత క్యూ1లో మెరుగైన వృద్ధిని నమోదు చేయడం విశేషం. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 63 పాయింట్లు పెరిగి 24,141 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 245 పాయింట్లు ఎగబాకి 77,426 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.53బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరిగింది.నాస్డాక్ 0.62 శాతం పుంజుకుంది.Today Nifty position 16-07-2026(time: 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్: బ్యాంక్ షేర్ల మెరుపులు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 హై నోట్ తో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 130.49 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 77,185.43 వద్ద ముగిసింది, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 26.45 పాయింట్లు మరియు 0.11 శాతం పెరిగి 24,074.85 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 దాదాపు 0.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.7 శాతం పెరిగాయి.సెన్సెక్స్ స్టాక్స్ లో 18 లాభాలను అందుకోగా 12 స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. అల్ట్రాటెక్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో ఎటర్నల్, ఎస్బీఐ ఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ టాప్ లూజర్ గా నిలిచింది. టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ కూడా టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.రంగాల వారీగా నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 1 శాతం లాభపడగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1 శాతానికి పైగా క్షీణించింది. ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ సూచీలు తమ నష్టాల పరంపరను పొడిగించగా, ఫార్మా వరుసగా రెండవ సెషన్ లో గరిష్టంగా ముగిసింది. రెండు రోజుల నష్టాల తర్వాత చమురు & గ్యాస్ కోలుకున్నాయి. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు పెరిగి 24,201 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 533 పాయింట్లు ఎగబాకి 77,602 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.78బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 85 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం పెరిగింది.నాస్డాక్ 0.9 శాతం పుంజుకుంది.Today Nifty position 15-07-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 561.46 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో 77,054.94 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టంతో 24,052.05 వద్ద నిలిచాయి.శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, బాల్ ఫార్మా లిమిటెడ్, నూరేకా లిమిటెడ్, వ్రాజ్ ఐరన్ & స్టీల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ఎస్సార్ షిప్పింగ్ లిమిటెడ్, పీపీఏపీ ఆటోమోటివ్ లిమిటెడ్, బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
250 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 64 పాయింట్లు తగ్గి 24,142 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 256 పాయింట్లు నష్టపోయి 77,359 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.2బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.79 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.55 శాతం దిగజారింది.Today Nifty position 14-07-2026(time: 9:25 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 47.01 పాయింట్లు లేదా 0.061 శాతం లాభంతో 77,616.40 వద్ద, నిఫ్టీ 4.10 పాయింట్లు లేదా 0.017 శాతం లాభంతో 24,211.00 వద్ద నిలిచాయి.తైన్వాలా కెమికల్స్ & ప్లాస్టిక్స్ (ఇండియా) లిమిటెడ్, బీఎఫ్ యూటిలిటీస్ లిమిటెడ్, బోరోసిల్ లిమిటెడ్, జీఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, సంగమ్ (ఇండియా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రద్ధా రియల్టీ లిమిటెడ్, యూనికెమ్ లాబొరేటరీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్, ఎస్జీ మార్ట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
SBI Jackpot! 15 పైసల షేర్ ఇప్పుడు 7,366 కోట్లు !
-
రెడ్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ(Nifty) 187 పాయింట్లు తగ్గి 24,010 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 672 పాయింట్లు నష్టపోయి 76,898 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.14బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 79.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.58 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.42 శాతం లాభపడింది.నాస్డాక్ 0.29 శాతం పెరిగింది.Today Nifty position 13-07-2026(time: 9:16 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్లో ఈరోజు ఏం జరుగుతుందంటే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పశ్చిమాసియాను మరోసారి అగ్నిగుండంగా మార్చాయి. అమెరికా వైమానిక దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఊహించని రీతిలో విరుచుకుపడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్లలోని అమెరికా సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆదివారం సెలవు కావడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లు నేరుగా స్పందించనప్పటికీ వారంతపు ఆఖరి సెషన్లో సాధించిన రికార్డు గరిష్టాల నుంచి నేడు ఆసియా మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ ఒడిదొడుకులను ఎదుర్కొనే ప్రమాదముందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.భగ్గుమన్న బ్రెంట్ క్రూడాయిల్ రేట్లుపశ్చిమాసియాలో ఏ చిన్న అలజడి రేగినా దాని ప్రత్యక్ష ప్రభావం చమురు ధరలపై పడుతుంది. ఇరాన్ దాడులు జరిగిన ప్రాంతాలు ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మార్గానికి సమీపంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గత శుక్రవారం (జులై 10) నాటికి బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు సుమారు 75-76 డాలర్ల వద్ద నిలకడగా ఉంటే ప్రస్తుతం అది 79.2 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి పెద్ద దిగుమతి దేశానికి కరెంట్ అకౌంట్ లోటు పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుంది. ఇది భారత మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే మొదటి అంశం.గ్లోబల్ మార్కెట్ల రియాక్షన్అంతర్జాతీయ మార్కెట్లు గత వారం అమెరికా టెక్ స్టాక్స్ ర్యాలీతో రికార్డు స్థాయిల్లో ముగిశాయి. అయితే, ఈ తాజా పరిణామం ఇన్వెస్టర్లను రక్షణ ధోరణి వైపు నెట్టనుంది. నేడు ఉదయం ప్రారంభమయ్యే నికాయ్, హాంగ్ సెంగ్, గిఫ్ట్ నిఫ్టీ సూచీలు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రతికూలతతో కదలాడుతున్నాయి. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వంటి సాధనాలవైపు మళ్లే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం త్వరగా ముగిసిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లాంటి సంస్థలు గతంలో భావించినప్పటికీ ఇరాన్ నేరుగా ఐదు దేశాలపై దాడులకు దిగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇన్వెస్టర్లు నేడు మార్కెట్ ప్రారంభంలోనే కంగారుపడి విక్రయాలు చేయకుండా కొద్దిసేపు మార్కెట్ కదలికలను గమనించడం ఉత్తమం. ముఖ్యంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నందున అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, నేడు జులై 13, 2026 సోమవారం నాటి ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
రూ.10 వేల కోట్ల సందడి!
ప్రైమరీ మార్కెట్లో ఈ వారం రూ.10 వేల కోట్లకు పైగా విలువైన మూడు ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. మెయిన్బోర్డు విభాగంలో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, ఆల్పైన్ టెక్స్వరల్డ్లు, ఎస్ఎంఈ విభాగంలో మిల్వర్క్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానున్నాయి. అలాగే ఇదే వారంలో మూడు ఐపీఓలు ముగియనున్నాయి. నాలుగు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్టింగ్కు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాలు ఈ వారం జోరందుకోనున్నాయి.ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ ఈ వారంలో ప్రధాన ఆకర్షణ ‘ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్’ ఐపీఓ కానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఫ్రాన్స్కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ అముండి సంయుక్తంగా ప్రమోట్ చేసిన ఈ కంపెనీ రూ.9,812.91 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూను తీసుకొస్తోంది. షేరు ధరను రూ.545–574గా నిర్ణయించారు. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండటంతో సమీకరించే నిధులు కంపెనీకి కాకుండా, షేర్లు విక్రయించే వాటాదారులకే దక్కనున్నాయి. ఆల్పైన్ టెక్స్వరల్డ్ గుజరాత్కు చెందిన టెక్స్టైల్ కంపెనీ ఆల్పైన్ టెక్స్వరల్డ్ మెయిన్బోర్డు విభాగంలో రెండో ఐపీఓగా రానుంది. రూ.126.25 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనుంది. షేరు ధరను రూ.100–105గా నిర్ణయించారు. సమీకరించిన నిధులను కొత్త వీవింగ్ యూనిట్ ఏర్పాటు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మిల్వర్క్స్ టెక్నాలజీస్ ఎస్ఎంఈ విభాగంలో మిల్వర్క్స్ టెక్నాలజీస్ ఒక్కటే పబ్లిక్ ఇష్యూను తీసుకొస్తోంది. రూ.160.30 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనుంది. షేరు ధరను రూ.315–331గా నిర్ణయించారు. సమీకరించే నిధులను ప్లాంట్ ఏర్పాటు, యంత్రాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.4 లిస్టింగులు ఈ వారంలో (బుధవారం) జూలై 15న కుసుమ్గర్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కానున్నాయి. మరుసటి రోజు గురువారం లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా, డెవ్సన్ క్యాటలిస్ట్, హ్యాపీ స్టీల్స్ షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుంది. గ్రే మార్కెట్లో ఈ నాలుగు కంపెనీల షేర్లు రెండంకెల ప్రీమియంతో ట్రేడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
5 వేలకు ఏకంగా 5.50 లక్షలొచ్చాయ్.. మ్యాజిక్ చేసిన STOCK
-
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 702.06 పాయింట్లు లేదా 0.91శాతం లాభంతో 77,443.88 వద్ద, నిఫ్టీ 196.30 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,159.10 వద్ద నిలిచాయి.కొథారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ముతూత్ మైక్రోఫిన్ లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డీ-లింక్ (ఇండియా) లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నీలమలై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, బోధి ట్రీ మల్టీమీడియా లిమిటెడ్, లోధా డెవలపర్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
NSE IPOకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ LISTING ఎప్పుడంటే?
-
ఇన్వెస్టర్లకు ఊరట.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 238.22 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 76,741.82 వద్ద, నిఫ్టీ 80.75 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,962.80 వద్ద నిలిచాయి.పాల్ మర్చంట్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్, శంకర బిల్డ్ప్రో లిమిటెడ్, పాల్ మర్చంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, లిబాస్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, డీబీ (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లక్షకు 45 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల పంట పండించిన స్టాక్
-
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:18 సమయానికి నిఫ్టీ(Nifty) 162 పాయింట్లు పెరిగి 24,042 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 546 పాయింట్లు ఎగబాకి 77,050 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.2 శాతం పెరిగింది.Today Nifty position 09-07-2026(time: 10:18 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:22 సమయానికి నిఫ్టీ(Nifty) 159 పాయింట్లు తగ్గి 24,241 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 507 పాయింట్లు దిగజారి 77,671 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.45 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.16 శాతం దిగజారింది.Today Nifty position 08-07-2026(time: 10:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 104.35 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 78,180.72 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 24,398.70 వద్ద నిలిచాయి.షేర్ ఇండియా సెక్యూరిటీస్ లిమిటెడ్, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, డీబీ (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్, కొథారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్, మెరైన్ ఎలక్ట్రికల్స్ (ఇండియా) లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,445 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 29 పాయింట్లు పెరిగి 78,329 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.86బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.12 శాతం పుంజుకుంది.Today Nifty position 07-07-2026(time: 09:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ మెగా ఐపీఓ ఎప్పుడంటే..
ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మెగా పబ్లిక్ ఇష్యూకి ముహూర్తం ఖరారైంది. దాదాపు రూ.30,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా రానున్న ఈ ఐపీఓ ఈ ఏడాది సెప్టెంబర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.ఈ ఇష్యూ ద్వారా ఎన్ఎస్ఈ మొత్తం మార్కెట్ విలువ రూ. 5 లక్షల కోట్లు దాటవచ్చని అంచనా. ఐపీఓ విజయవంతమైతే.. 2024 అక్టోబర్లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల పబ్లిక్ ఇష్యూ రికార్డును అధిగమిస్తుంది. తద్వారా భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా అవతరిస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలోనే ఉంటుంది. -
నేటి మార్కెట్లో బుల్ రన్.. కారణాలివేనా?
భారత స్టాక్ మార్కెట్లో ఈరోజు (జులై 06, 2026) ర్యాలీ చోటుచేసుకుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి తోడు అంతర్జాతీయ సానుకూల సంకేతాలు తోడవడంతో మార్కెట్లు దూసుకుపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 24,430 వద్దకు, సెన్సెక్స్ 521 పాయింట్లు పెరిగి 78,285 వద్దకు చేరడం మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ను స్పష్టం చేస్తోంది.ర్యాలీకి దారితీసిన ప్రధాన కారణాలుమధ్యప్రాచ్యంలో సడలిన ఉద్రిక్తతలు: గత వారం ఇరాన్ వేదికగా చోటుచేసుకున్న పరిణామాల తర్వాత భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. యూఎస్-ఇరాన్ చర్చలలో పురోగతి, యుద్ధ మేఘాలు తొలగిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచింది.యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలు: అమెరికాలో ఇటీవల విడుదలైన ఉపాధి గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా నమోదు కావడంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపుతుందనే ఆశలు పెరిగాయి. ఇది అంతర్జాతీయంగా రిస్క్ అసెట్స్ అయిన ఈక్విటీ మార్కెట్లలోకి నిధులు వచ్చేలా చేసింది.ఆసియా, ఐరోపా మార్కెట్ల మద్దతు: యూరోజోన్లో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గడం, ఆసియా మార్కెట్లలో (హాంకాంగ్, షాంఘై) ఐటీ, టెక్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం భారత మార్కెట్లకు సానుకూలంగా మారింది.చమురు ధరల పతనంఇరాన్ సంక్షోభం సడలడం, ఒప్పందం ప్రకారం ఓపెక్ ప్లస్ దేశాలు చమురు సరఫరాను పెంచేందుకు అంగీకరించడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 71.50 డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడం వల్ల భారత్ దిగుమతి బిల్లు భారం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి, కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పెరగడానికి (ముఖ్యంగా ఆటోమొబైల్, పెయింట్స్, ఏవియేషన్ రంగాలకు) ఎంతగానో దోహదపడుతుంది.సంస్థాగత పెట్టుబడులువిదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మళ్లీ భారత మార్కెట్ల వైపు మళ్లారు. గత శుక్రవారం దాదాపు రూ.1,355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా ఈరోజు కూడా కొనుగోళ్ల జోరు కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్కు బలాన్నిస్తున్నారు. జూన్ త్రైమాసిక కార్పొరేట్ ఆదాయాల సీజన్ ప్రారంభం కానుండటంతో కంపెనీల బిజినెస్ అప్డేట్స్ సానుకూలంగా వస్తున్నాయి.రూపాయి స్థిరత్వండాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ కొంత బలహీనపడటం, చమురు ధరలు దిగిరావడంతో రూపాయిపై ఒత్తిడి తగ్గింది. రూపాయి బలోపేతం కావడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు భారత ఈక్విటీలపై నమ్మకం పెరిగి మరింత పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఇదీ చదవండి: కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి! -
వేదాంతా పవర్ జాక్ పాట్! ఇన్వెస్టర్లకు భారీ లాభాలు!
-
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 297.73 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 78,061.64 వద్ద, నిఫ్టీ 73.25 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 24,344.10 వద్ద ఉన్నాయి.సవితా ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్, డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్ లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఏఆర్టీ నిర్మాణ్ లిమిటెడ్, సుప్రియా లైఫ్సైన్స్ లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్, బరాక్ వ్యాలీ సిమెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్యూ1 ఫలితాలు, క్రూడ్ ధరలు కీలకం
దేశీయ కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా రుతుపవనాల కదలికలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. అంతర్జాతీయంగా అమెరికా–ఇరాన్ల మధ్య జరుగుతున్న దౌత్య చర్చల పరిణామాలు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ సమావేశ వివరాలను (ఫెడ్ మినిట్స్) మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. 9 నుంచి కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాల సీజన్ షురూ..! దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ జూలై 9 (గురువారం)న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఫలితాలను ప్రకటించి, దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్కు తెరతీయనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ యాజమాన్యం ఇచ్చే అవుట్లుక్ వ్యాఖ్యలపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో డిమాండ్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? టెక్నాలజీ రంగంలో కంపెనీలు చేసే వ్యయాలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యాపార అవకాశాల వేగం ఏ మేరకు ఉంటుంది? అనే విషయాలపై సంకేతాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.‘‘తొలి దశలో విడుదలయ్యే కార్పొరేట్ ఫలితాలు, కంపెనీల మేనేజ్మెంట్ వ్యాఖ్యలు మార్కెట్లో డిమాండ్ పరిస్థితులు, మార్జిన్ల స్థితిగతులు, భవిష్యత్తులో ఆదాయ అంచనాలపై కీలకమైన స్పష్టతను ఇస్తాయి. ఇవే రాబోయే వారాల్లో మార్కెట్ దిశను నిర్దేశిస్తాయి’’ అని స్వాస్తిక ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక విశ్లేషకుడు పర్వేష్ గౌర్ తెలిపారు. అమెరికా–ఇరాన్ల దౌత్య చర్చల ప్రభావం ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని పరిశీలిస్తే పశ్చిమాసియా నుంచి ‘వార్తలు లేకపోవడమే శుభవార్త’ అనే పంథా కొనసాగుతోంది. శాంతి ప్రయత్నాలు ప్రస్తుతానికి బాగానే సాగుతున్నాయి, ఎక్కడా ఉద్రిక్తతలు పెరిగినట్లు నివేదికలు రాలేదు. గత వారం ప్రారంభంలో దోహాలో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చల తర్వాత ఈ సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలను ఇరాన్ ప్రస్తుతం నిర్వహిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చల్లో తమ షరతులకు దాదాపు అన్నింటికీ ఇరాన్ అంగీకరించిందని పేర్కొన్నారు. క్రూడాయిల్ ధరలపై కన్ను అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 72 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా–ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం తర్వాత క్రూడాయిల్ ఎగుమతులు మరింత పెరిగాయి. ఆసియా మార్కెట్లలో అమ్మకాలను మరింత వేగవంతం చేసేందుకు ‘సౌదీ అరామ్కో’ స్పాట్ ప్రైసింగ్ (తక్షణ ధరల విధానం) వైపు మొగ్గు చూపుతోందని రాయిటర్స్ నివేదించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు అదుపులో ఉండటం భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు భారీ ఉపశమనంగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ మినిట్స్పై దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూన్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) జూలై 9న (గురువారం) విడుదల కానున్నాయి. ఇటీవల విడుదలైన యూఎస్ ఆర్థిక గణాంకాలు బలహీనపడటంతో, భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడ్ కొంత ‘సరళతర వైఖరి విధానాన్ని అవలంబించవచ్చు’ అనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో వడ్డీరేట్లు, ఆర్థిక దృక్పథంపై పాలసీ నిర్ణేతల అంచనాలను తెలుసుకోవడం కోసం ఇన్వెస్టర్లు ఈ జూన్ పాలసీ సమావేశ మినిట్స్ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.సాంకేతిక అంశాలు ‘‘నిఫ్టీ ఇండెక్సు డైలీ చార్ట్లో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ను నమోదు చేసింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతోందనేందుకు స్పష్టమైన సంకేతం’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ తెలిపారు. ‘‘ఇప్పటికీ నిఫ్టీ కీలకమైన 50–రోజుల ఈఎంఏ స్థాయి కంటే పైనే కొనసాగుతోంది. ఇది స్వల్పకాలిక సానుకూల ధోరణిని మరింత బలోపేతం చేస్తోంది. సాంకేతిక అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో నిఫ్టీ 24,500 స్థాయిని ఛేదించి, అంతకు మించిన పైస్థాయిలకు దూసుకెళ్లేందుకు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ నష్టపోయినా.. దిగువ స్థాయిలో నిఫ్టీకి 24,200 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. ఆ తర్వాత 24,000 వద్ద బలమైన సపోర్ట్ జోన్ ఉంది’’ అని రూపక్ విశ్లేíÙంచారు. గతవారమిలా... అమెరికాలో ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో, వడ్డీ రేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ చైర్మన్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో గతవారం (జూన్ 30 నుంచి జూలై 3 మధ్య) దేశీయ స్టాక్ మార్కెట్ లాభపడింది. గతవారంలో సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 215 పాయింట్ల చొప్పున పెరిగాయి. -
డీమార్ట్ స్టాక్ భారీ పతనం.. ఒక్క అప్డేట్ తో వేల కోట్లు ఆవిరి
-
మోడీ వల్లే బంగారం రేట్లు పడిపోతున్నాయా ?


