నష్టాల్లో ముగిసిన మార్కెట్లు | Stock Market Close September 15 Sensex slips 119 pts, Nifty at 25069 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Sep 15 2025 3:41 PM | Updated on Sep 15 2025 3:55 PM

Stock Market Close September 15 Sensex slips 119 pts, Nifty at 25069

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఎటువంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు మందగించాయి. అయితే ఈ వారం చివర్లో రానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై ట్రేడర్లు దృష్టి సారించారు. ముగింపులో బీఎస్‌ఈ సెన్సెక్స్ 118.96 పాయింట్లు లేదా 0.15 శాతం స్వల్పంగా తగ్గి 81,785.74 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 44.8 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టపోయి 25,069.2 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్ ఇండెక్స్ లో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టైటాన్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్ లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ (జొమాటో), అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

అయితే, విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.44 శాతం, 0.76 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 2.41 శాతం పెరిగి టాప్ గెయినర్ గా ఉంది. ఫ్లిప్ సైడ్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.58 శాతం, నిఫ్టీ ఫార్మా 0.64 శాతం క్షీణించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement