Sensex
-
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు!
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మార్కెట్లపై బేర్ పంజా.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 411 పాయింట్లు తగ్గి 22,711 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1269 పాయింట్లు నష్టపోయి 73,268 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.67బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 112.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.51 శాతం పడిపోయింది.నాస్డాక్ 2.01 శాతం నష్టపోయింది.Today Nifty position 23-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 74,532.96 వద్ద, నిఫ్టీ 112.35 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో.. 23,114.50 వద్ద నిలిచింది.వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్, కెఐఓసిఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఫిన్కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 260 పాయింట్లు పెరిగి 23,259 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 811 పాయింట్లు పుంజుకొని 75,019 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.59 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.27 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.28 శాతం నష్టపోయింది.Today Nifty position 20-03-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్రాష్.. ముంచేసిన చమురు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణ చమురు మౌలిక సదుపాయాలకు మరింత నష్టం కలిగించడంతో ఇంధన ధరలు పెరగడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ క్షీణించాయి.ఎన్ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు లేదా 3.26 శాతం క్షీణించి 23,002.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్లు లేదా 3.26 శాతం తగ్గి 74,207.24 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని అన్ని స్టాక్స్ నష్టాలలో ముగిశాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ఈ జాబితాలో ఉన్నాయి.విస్తృత మార్కెట్ సూచీలు నెత్తురు కక్కాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 3.19 శాతం, స్మాల్ క్యాప్ 100 2.94 శాతం నష్టపోయాయి. కౌంటర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.మార్కెట్ సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 11 శాతం పెరిగి 119.5 డాలర్లకు చేరుకుంది. కీలకమైన రిఫైనర్లు దెబ్బతిన్న తరువాత సౌదీ అరేబియా యాన్బు నౌకాశ్రయంలో చమురు లోడ్ చేయడాన్ని నిలిపివేసిందని నివేదికలు వచ్చిన తరువాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 11 శాతం పెరిగింది. -
మళ్లీ నేలకరిచిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గడిచిన మూడు సెషన్లలో లాభాల్లోకి చేరిన మార్కెట్లు ఈరోజు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 459 పాయింట్లు తగ్గి 23,312 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1526 పాయింట్లు దిగజారి 75,201 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 111.37 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.36 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.46 శాతం నష్టపోయింది.Today Nifty position 19-03-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ, రియల్టీ స్టాక్స్ అండతో భారీ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, రియల్టీ స్టాక్స్ మద్దతు ఇవ్వడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రోజు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 196.65 పాయింట్ల లాభంతో 23,777.80 వద్ద, సెన్సెక్స్ 0.83 శాతం లేదా 633.29 పాయింట్లు పెరిగి 76,704.13 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.94 శాతం, 1.70 శాతం పెరిగాయి.రంగాల వారీగా నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్ గా నిలిచింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. రంగాల సూచీలలో నిఫ్టీ మెటల్, ఎఫ్ఎంసిజి అత్యధికంగా క్షీణించాయి. -
క్రమంగా పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 142 పాయింట్లు పెరిగి 23,723 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 423 పాయింట్లు ఎగబాకి 76,485 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.59బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.97 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25 శాతం పెరిగింది.నాస్డాక్ 0.47 శాతం పుంజుకుంది.Today Nifty position 18-03-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 514.24 పాయింట్ల లాభంతో 76,017.09 వద్ద, నిఫ్టీ 150.00 పాయింట్ల లాభంతో 23,558.80 వద్ద నిలిచాయి.డిసిఎం శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్, MOIL లిమిటెడ్, ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. LMW లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, జెల్ప్మాక్ డిజైన్ అండ్ టెక్ లిమిటెడ్, శ్యామ్ టెలికాం లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 68 పాయింట్లు పెరిగి 23,476 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు ఎగబాకి 75,713 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.89బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 102.87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.01 శాతం పెరిగింది.నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.Today Nifty position 17-03-2026(time: 9:49 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ అదుర్స్.. అదరగొట్టిన ఆటో షేర్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, బ్యాంక్ స్టాక్స్ మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ట్రేడ్ చివరి దశలో పదునైన లాభాలతో మూడు రోజుల నష్టాల పరంపరను బ్రేక్ చేశాయి.నిఫ్టీ 1.11 శాతం లేదా 257.70 పాయింట్ల లాభంతో 23,408.80 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 939 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగి 75,502.85 వద్ద ముగిశాయి.అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ సెన్సెక్స్లో టాప్ గెయినర్లలో ఉన్నాయి. బీఈఎల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.65 శాతం నష్టపోయాయి.సెక్టార్ వారీగా చూస్తే ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లలో నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇక నిఫ్టీ రియల్టీ ఇతర సూచీల కంటే తక్కువ పనితీరు కనబరిచింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 81 పాయింట్లు పెరిగి 23,227 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 244 పాయింట్లు ఎగబాకి 74,823 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.26బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.12 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.93 శాతం నష్టపోయింది.Today Nifty position 16-03-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అదే భయం... అదే పతనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతోపాటు.. చమురు ధరలు మండుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు బేర్మంటున్నాయి. వరుసగా మూడో రోజు అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,580 పాయింట్లు పడిపోయి 74,455కు చేరింది. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం నీరసించడం సెంటిమెంటును దెబ్బతీసింది.ముంబై: చమురు ధరల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నాయి. దీనికితోడు ఇంధన కొరత ఆర్థిక వ్యవస్థల వృద్ధికి విఘాతం కలిగించనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో ఆసియాసహా అమెరికావరకూ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దేశీయంగా మూడో రోజూ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,471 పాయింట్లు పడిపోయి 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. మిడ్సెషన్కల్లా సెన్సెక్స్ 1,580 పాయింట్లు క్షీణించి 74,455 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 23,112 వరకూ నీరసించింది. మెటల్స్ మెల్టింగ్.. ఎన్ఎస్ఈలో అన్నిరంగాలూ నీరసించగా.. మెటల్స్ 5 శాతం పతనమైంది. క్రూడ్ సెగతో ఆటో, పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్, కెమికల్స్ 3.6–2.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్అండ్టీ 7.5 శాతం పడిపోగా.. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, గ్రాసిమ్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, టీఎంపీవీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, అల్ట్రాటెక్, యాక్సిస్ బ్యాంక్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. కేవలం టాటా కన్జూమర్, ఎయిర్టెల్ 2–1 శాతం బలపడ్డాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర 102 డాలర్లకు ఎగువన కదులుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం పెరగనున్నట్లు తెలియజేశారు. చిన్న షేర్లు విలవిల తాజా అమ్మకాలతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2.5 శాతం పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో 3,439 నష్టపోగా.. కేవలం 858 లాభపడ్డాయి. నగదు విభాగంలో తాజాగా ఎఫ్పీఐలు రూ. 10,717 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 9,977 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 4 రోజుల్లోనూ ఎఫ్పీఐలు రూ. 24,320 కోట్లకుపైగా పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 27,450 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల 2–6 మధ్య సైతం ఎఫ్పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.మరో 10 లక్షల కోట్లు ఆవిరిఅమ్మకాల సునామీతో ఒక్క రోజులోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువకు రూ. 10.24 లక్షల కోట్ల మేర చిల్లు పడింది. రెండు వారాల్లో సెన్సెక్స్ 8.3% (6,723 పాయింట్లు) పతనంకాగా.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 33.68 లక్షల కోట్లు ఆవిరైంది. వెరసి మార్కెట్ క్యాప్ రూ. 429.82 లక్షల కోట్లు (4.65 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. -
యుద్ధ సంక్షోభం : రూ. 19 లక్షల కోట్లు ఢమాల్!
Iran War: ప్రపంచవ్యాప్తంగా ఏ ఉపద్రం వచ్చినా, భౌగోళికంగా ఎలాంటి సంక్షోభం తలెత్తినా ముఖ్యంగా యుద్ధం వచ్చిందంటే ముందుగా ప్రభావితమయ్యేది దేశీయ స్టాక్ మార్కెట్లు. తాజాగా ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మధ్యప్రాచ్య అనిశ్చితి, హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు సంక్షోభం భారత మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా గత నాలుగేళ్లలో అత్యంత దారుణమైన వారంగా ఈ వారం నిలిచింది. ఈ దారుణ పతనంతో పెట్టుబడిదారులు దాదాపు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ అనిశ్చితి ప్రపంచ మార్కెట్లను కూడా బలహీనపరిచిందని, కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు విశ్లేషకులు.75వేల దిగువకు సెన్సెక్స్, మార్కెట్ క్యాప్ నష్టంఈ వారం వీకెండ్ శుక్రవారం రోజు సెన్సెక్స్ 1,442 పాయింట్లు కోల్పోయి 75వేల పాయింట్ల (74,592 పాయింట్ల వద్ద ముగిసింది)దిగువకు చేరింది. ఒక రోజులో దాదాపు రూ.9.8 లక్షల కోట్ల సందప తుడిచి పెట్టుకుపోయింది. ఫలితంగా రూ.19 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. మార్కెట్ వాల్యుయేషన్ రూ.430 లక్షల కోట్లకు చేరింది. FIIలు అమ్మకాల భారీగా కొనసాగుతున్నాయి. ఎల్ అండ్ టీ టాటా స్టీల్ , SBI, భారత్ ఎలక్ట్రానిక్స్ , మారుతి టాప్ లూజర్స్గా నిలిచాయి. మునుపటి శుక్రవారం అంటే మార్చి 6న బీఎస్సీ సెన్సెక్స్ 78,918 వద్ద ముగిసింది. అప్పటి మార్కెట్ వాల్యుయేషన్ రూ.449.35 లక్షల కోట్లుగా ఉంది.ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్నిఫ్టీ నష్టాలు ఇలా..ఇక నిఫ్టీ 468 పాయింట్లు క్షీణించి 23,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. జనవరి 5న నమోదైన గరిష్ట స్థాయి 26,373 పాయింట్లు. అంటే 10 శాతం క్షీణించింది. భారత మార్కెట్లు చివరిసారిగా ఈ స్థాయిలో నష్టాలను చవిచూసింది 2022 జూన్లో మాత్రమే. బ్రెంట్ ముడిచమురు ధరలు బ్యారెల్కు 102 డాలర్లకు పెరగడం ఈ వారం పెట్టుబడిదారులకు ఒక పీడకల చెప్పవచ్చు.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలుయుద్ధం చమురు సంక్షోభం- మార్కెట్లు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చమురు సరఫరాపై ప్రభావం ముడిచమురు ధరలను అమాంతం పెరిగాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా, జపాన్, చైనా , హాంకాంగ్ల సూచీలు దిగువన ముగిశాయి. (తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు లేదా 1.93 శాతం నష్టంతో.. 74,563.92 వద్ద, నిఫ్టీ 468.70 పాయింట్లు లేదా 1.98 శాతం నష్టంతో 23,170.45 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, కంప్యూకామ్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, సుమిత్ వుడ్స్ లిమిటెడ్, సెంట్రమ్ క్యాపిటల్ లిమిటెడ్, బర్న్పూర్ సిమెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కృతిక వైర్స్ లిమిటెడ్, ఎస్ఈపీసీ లిమిటెడ్, అకీ ఇండియా లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, లోరెంజిని అప్పారల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కరుగుతోన్న ఇన్వెస్టర్ల సంపద
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు తగ్గి 23,422 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 694 పాయింట్లు దిగజారి 75,357 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.72బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.52 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.78 శాతం నష్టపోయింది.Today Nifty position 13-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రూడ్ మంట.. బేర్ పంజా!
మళ్లీ ముడిచమురు ధరల మంటతోపాటు పశ్చిమాసియాలో యుద్ధ భయాలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండో రోజు షాక్ తగిలింది. రోజంతా అమ్మకాలదే పైచేయి కావడంతో మార్కెట్లు నష్టాలలోనే కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 76,000 పాయింట్ల దిగువకు సైతం పడిపోయింది. బ్రెంట్ చమురు పీపా ధర 10 శాతం ఎగసి 100 డాలర్లను దాటింది.ముంబై: చమురు ధరలకు రెక్కలు రావడంతో మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు పతనమై 76,034 వద్ద ముగిసింది. ఒక దశలో అమ్మకాలు పెరగడంతో 993 పాయింట్లు నీరసించి 76,000 దిగువన 75,871ను తాకింది. ఇక నిఫ్టీ 228 పాయింట్లు క్షీణించి 23,639 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 23,556కు చేరింది. యుద్ధానికి ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ దాడులు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క ముడిచమురు ధరలు సైతం తిరిగి జోరందుకోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీనతలు సైతం వీటికి జత కలిసినట్లు వెల్లడించారు. బుధవారం సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 395 పాయింట్లు కోల్పోయిన విషయం విదితమే. ఆటో రివర్స్ గేర్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ సూచీలు 3–2% మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, టీఎంపీవీ, ఐషర్, ఎల్అండ్టీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, హెచ్యూఎల్, అ్రల్టాటెక్, అపోలో హాస్పిటల్స్, ఇండిగో, ఐటీసీ, యాక్సిస్, ఐసీఐసీఐ 4–2 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే కోల్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, జియో ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్ 5–0.5 శాతం మధ్య లాభపడ్డాయి. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6% చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 2,645 నష్టపోగా.. 1,598 బలపడ్డాయి.రూ. 23.44 లక్షల కోట్లు హుష్కాకి పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులకు బీజం పడ్డాక దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఫిబ్రవరి 28 మొదలు ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 5,253 పాయింట్లు(6.5 శాతం) క్షీణించింది. అయితే అన్ని రంగాలలోనూ అమ్మకాలు కొనసాగుతుండటంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 23.44 కోట్లమేర హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.4,40,06,434 కోట్ల (4.77 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది.రికార్డ్ కనిష్టానికి రూపాయి 24 పైసలు క్షీణతతో 92.25కుచమురు ధరల సెగ మరోసారి దేశీ కరెన్సీని దెబ్బతీసింది. డాలరుతో మారకంలో రూపాయి 24 పైసలు క్షీణించి 92.25 వద్ద ముగిసింది. వెరసి ఇంతక్రితం ఈ నెల 9న నమోదైన సరికొత్త కనిష్టం 92.21ను తుడిచి పెట్టింది. కాగా, ఇంట్రాడేలో 92.36 వద్ద తాజాగా చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది.కిచెన్ అప్లయెన్సెస్ షేర్ల జోరుఇండక్షన్ కుక్టాప్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు భారీ గిరాకీఅమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కార ణంగా చమురు ధరల మంటకుతోడు.. గ్యాస్ రవాణా నిలిచిపోవడంతో దేశీయంగా కిచెన్ అప్లయెన్సెస్కు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. ఇండక్షన్ కుక్టాప్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు భారీ గిరాకీ ఏర్పడటంతో వరుసగా మూడో రోజు కిచెన్ అప్లయెన్సెస్ త యారీ కంపెనీల కౌంటర్లు వెలుగులో నిలిచా యి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా జైపాన్ ఇండస్ట్రీస్ 14 శాతం, టీటీకే ప్రెస్టీజ్ 8.3 శాతం చొప్పున జంప్చేశాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్, వీగార్డ్ 1.5 శాతం మధ్య లాభపడ్డాయి. గత మూడు(9–11) రోజుల్లో బటర్ఫ్లై, టీటీకే, స్టవ్క్రాఫ్ట్ 35 శాతానికిపైగా దూసుకెళ్లిన విషయం విదితమే. రెస్టారెంట్లకు సెగఎల్పీజీ కొరత నేపథ్యంలో రెస్టారెంట్ కౌంటర్లు అమ్మకాలు ఎదుర్కొంటున్నాయి. యునైటెడ్ ఫుడ్బ్రాండ్స్ 7 శాతం, వెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్ 3 శాతం, జూబిలెంట్ ఫుడ్వర్క్స్ 2 శాతం క్షీణించగా.. రెస్టారెంట్ బ్రాండ్స్, ఎటర్నల్, స్విగ్గీ 1 శాతం చొప్పున డీలా పడ్డాయి. ఐటీసీ హోటల్స్ 2.4 శాతం క్షీణించి రూ. 158కు చేరింది. ఇది ఏడాది కనిష్టంకాగా.. లెమన్ ట్రీ హోటల్స్ రూ. 101 వద్ద, స్విగ్గీ రూ. 271 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్ల నష్టంతో 76,034.42 వద్ద, నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23,639.15 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, క్రియేటివ్ ఐ లిమిటెడ్, అవాన్మోర్ క్యాపిటల్ & మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, అక్యూస్ లిమిటెడ్, కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మార్కెట్ సూచీలు నేల చూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 255 పాయింట్లు తగ్గి 23,606 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 809 పాయింట్లు దిగజారి 76,045 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.92 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.08 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.08 శాతం పెరిగింది.Today Nifty position 12-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆసియా మార్కెట్లు ఢమాల్..
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేడు భారత స్టాక్ మార్కెట్ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. నేడు (గురువారం) ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా పయనిస్తుండటంతో మన దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు గ్యాప్ డౌన్తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆసియా మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జపాన్ సూచీ నిక్కీ, కోస్పీ-దక్షిణ కొరియా మార్కెట్, గిఫ్ట్ నిఫ్టీ.. వంటి ముందస్తు దిక్సూచిగా భావించే సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇది భారత మార్కెట్లు కనీసం 1.5% నుంచి 2% నష్టంతో ప్రారంభమవుతాయని సూచిస్తోంది.మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలుఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లను భయపెడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవచ్చనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి.యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ద్రవ్యోల్బణ ముప్పుగా పరిణమించనుంది.గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్ల ర్యాలీకి బ్రేక్ పడింది. టెక్ దిగ్గజాల వాల్యుయేషన్లపై అనుమానాలు మొదలవడంతో అంతర్జాతీయ స్థాయిలో టెక్ షేర్లను ఇన్వెస్టర్లు వదిలించుకుంటున్నారు.భారత మార్కెట్పై ప్రభావం ఎలా ఉండబోతోంది?నిపుణుల అంచనా ప్రకారం.. మార్కెట్ అవర్స్లో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మార్కెట్లు పడిపోతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నేడు బంగారం పెరిగే అవకాశం ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడవచ్చు.‘ప్రస్తుత అస్థిరత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం లేదా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ పతనాన్ని అవకాశంగా మార్చుకోవడం ఉత్తమం’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే! -
పడగొట్టిన పశ్చిమాసియా
ముంబై: యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు చేసిన ప్రకటనపై స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులోనే విశ్వాసాన్ని కోల్పోయాయి. మరోపక్క ముడిచమురు ధరలు సైతం తిరిగి జోరందుకోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్ 1,342 పాయింట్లు పతనమైంది. 76,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 395 పాయింట్లు కోల్పోయి 23,867 వద్ద నిలిచింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 5.14 లక్షల కోట్లు ఆవిరైంది. తొలుత ఆసియా మార్కెట్ల సానుకూలతలతో స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చమురు ధరల సెగతో వెనువెంటనే డీలా పడ్డాయి. ఉదయం లండన్ మార్కెట్లలో బ్రెంట్ చమురు ధర పీపాకు 6 శాతం ఎగసింది. 93 డాలర్లకు చేరింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభంకావడంతో మిడ్సెషన్ నుంచీ సెంటిమెంటు మరింత బలహీనపడింది. ఫలితంగా సమయం గడిచేకొద్దీ అమ్మకాలు పెరిగిపోయాయి. దీంతో చివర్లో సెన్సెక్స్ 1,447 పాయింట్లు పడిపోయి 76,759ను తాకగా.. నిఫ్టీ 23,834వరకూ క్షీణించింది. ఫైనాన్స్, ఆటో వీక్..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, రియల్టీ, కెమికల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ 3–1% మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ, మారుతీ, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, టీఎంపీవీ, టీసీఎస్, ఎయిర్టెల్ 5–2% మధ్య డీలాపడ్డాయి..గ్యాస్, జల్ జీవన్ పుష్.. గ్యాస్ కొరత ప్రభావంతో అదానీ టోటల్ గ్యాస్ 18 శాతం ఎగసింది, ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ పెరగడంతో టీటీకే ప్రెస్టీజ్, స్టవ్క్రాఫ్ట్ షేర్లు 12 శాతం చొప్పున జంప్చేశాయి. కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్కు మరింత మద్దతివ్వడంతో శక్తి పంప్స్, రోటో పంప్స్, జైన్ ఇరిగేషన్, జిందాల్ సా, ఎన్విరో ఇన్ఫ్రా, ఇండియన్ హ్యూమ్ పైప్, ఎస్పీఎంఎల్ తదితరాలు 20–13 శాతం మధ్య దూసుకెళ్లాయి.సెడెమాక్ లిస్టింగ్ భేష్ పతన మార్కెట్లోనూ ఆటో విడిభాగాల(పవర్ట్రెయిన్ కంట్రోల్స్) తయారీ కంపెనీ సెడెమాక్ మెకట్రానిక్స్ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,352తో పోలిస్తే ఎన్ఎస్ఈలో రూ. 1,535 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 13.5 శాతం అధికం కాగా.. బీఎస్ఈలో 12 శాతం లాభంతో రూ. 1,510 వద్ద లిస్టయ్యింది. చివరికి 7.4 శాతం బలపడి రూ. 1,452 వద్ద ముగిసింది. -
స్టాక్ మార్కెట్లో ‘బ్లడ్ బాత్’
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ ఏకంగా 394 పాయింట్లు నష్టపోయి 23,866 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1342 పాయింట్లు దిగజారి 76,863 వద్దకు చేరింది. దీంతో మార్కెట్లో ఈ ఒక్కరోజే దాదాపు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు అయింది.అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. ఈరోజు (మార్చి 11, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలను పాతాళానికి నెట్టింది.సూచీల పతనానికి ప్రధాన కారణాలుఇంధన సంక్షోభం: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు మార్కెట్ను భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతోంది. భారత్ లాంటి చమురు దిగుమతి దేశానికి పెద్ద దెబ్బగా మారింది.ఎనర్జీ సెక్టార్లో అమ్మకాలు: ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ముడి పదార్థాల వ్యయం పెరుగుతుందన్న ఆందోళనతో ఎనర్జీ ఇండెక్స్ ఏకంగా కుప్పకూలింది.ఎఫ్ఐఐల విక్రయాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల వారు సురక్షితమైన బాండ్లు, బంగారం వైపు మళ్లుతుండటంతో దేశీయ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోతోంది.రూపాయి రికార్డు పతనం: చమురు దిగుమతుల కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం, ఎఫ్ఐఐల నిష్క్రమణతో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇది దిగుమతి చేసుకునే వస్తువుల ధరలను పెంచి, దేశీయ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్న భయం నెలకొంది.కీలక రంగాలు పతనం: బ్యాంకింగ్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రెడ్ మార్క్లో ట్రేడయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ ఉన్న షేర్లు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యం పోసింది.ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉంది. నిఫ్టీకి 23,700 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, చమురు ధరలు తగ్గితే తప్ప తక్షణ రికవరీ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ అస్థిర సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నాణ్యమైన షేర్లలో సిప్ పద్ధతిని కొనసాగించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 43 పాయింట్లు తగ్గి 24,221 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 182 పాయింట్లు దిగజారి 77,988 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.82బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.65 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.14 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.21 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.01 శాతం పెరిగింది.Today Nifty position 11-03-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రూడ్ కూల్.. బుల్ చల్!
వారం రోజులుగా భగభగలాడి చప్పున చల్లారిన చమురు ధరలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ అయ్యాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్లు 2 శాతంపైగా బలపడటంతో దేశీయంగానూ ఇండెక్సులు జోరందుకున్నాయి. వెరసి ఒక దశలో సెన్సెక్స్ 960 పాయింట్లు జంప్చేసింది.ముంబై: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ సంక్షోభం త్వరలోనే ముగియనున్న అంచనాలకుతోడు.. ముడిచమురు ధరలు ఒక్కసారిగా చల్లబడటంతో ప్ర పంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నేలక్కొట్టిన బంతిలా మార్కెట్లు పైకెగశాయి. సెన్సెక్స్ 640 పాయింట్లు జంప్చేసి 78,206 వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్లు జమ చేసుకుని 24,262 వద్ద స్థిరపడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు 5–2 శాతం మధ్య పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు జోష్వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 960 పాయింట్లు ఎగసి 78,526ను తాకగా.. నిఫ్టీ 24,303వరకూ బలపడింది. ఐటీ డీలా ఎన్ఎస్ఈలో ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్(0.4 శాతం)మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ముందురోజు పతనమైన ఆటో, బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్ 3–1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 8 శాతం దూసుకెళ్లగా.. ఇండిగో, ఎంఅండ్ఎం, ఐషర్, టీఎంపీవీ, ఐసీఐసీఐ, మారుతీ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, జేఎస్డబ్ల్యూ 3.5–2.5 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్, ఎయిర్టెల్, టీసీఎస్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.4–0.4 శాతం మధ్య నీరసించాయి. చల్లారిన చమురు...ఉదయం సెషన్లో లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర 9 శాతం పతనమై 90 డాలర్లకు చేరగా.. న్యూయార్క్లో లైట్ స్వీట్ చమురు బ్యారల్ 87 డాలర్లకు దిగివచ్చింది. ఫలితంగా ఏవియేషన్, ఆటో, బ్యాంకింగ్ తదితర రంగాల కౌంటర్లకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. పశి్చమాసియా ఆందోళనలకు త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సా హం లభించినట్లు తెలియజేశారు. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 3,053 లాభపడితే.. 1,231 మాత్రమే డీలా పడ్డాయి. ఎఫ్పీఐల వెనకడుగు ఇటీవల దేశీ స్టాక్స్లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 4,673 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ (డీఐఐలు) మాత్రం రూ. 6,333 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 9,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం.రూపాయి రయ్.. 36 పైసలు అప్– 91.85కు చమురు ధరలు దిగిరావడంతో దేశీ కరెన్సీకి జోష్ వచ్చింది. డాలరుతో మారకంలో 36 పైసలు బలపడింది. వెరసి చరిత్రాత్మక కనిష్టం 92.21 నుంచి కోలుకుని 92 దిగువన 91.85 వద్ద ముగిసింది. రోజంతా 91.71– 92.19 మధ్య ఊగిసలాడింది. సోమవారం 39 పైసలు క్షీణించి 92.21 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ సైతం 0.5 శాతం క్షీణించి 98.65కు చేరింది.ఎరువుల షేర్లకు బలిమి గ్యాస్ కేటాయింపులలో ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తదుపరి ఎరువులకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఫెర్టిలైజర్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. దీంతో రాష్ర్టీయ కెమికల్స్(ఆర్సీఎఫ్) 16%, నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) 13%, దీపక్ ఫెర్టిలైజర్స్, పారదీప్ ఫాస్ఫేట్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ 5%, కోరమాండల్ ఇంటర్నేషనల్ 4% చొప్పున దూసుకెళ్లాయి. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 639.82 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 78,205.98 వద్ద, నిఫ్టీ 233.55 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,261.60 వద్ద నిలిచాయి.ఆటమ్ ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుడ్స్ & ఇన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, డీసీఎం నౌవెల్ లిమిటెడ్, అక్షర్కెమ్ (ఇండియా) లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 92 పాయింట్లు పెరిగి 24,127 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 334 పాయింట్లు ఎగబాకి 77,905 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.91బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 93.87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.11 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.83 శాతం పుంజుకుంది.నాస్డాక్ 1.38 శాతం పెరిగింది.Today Nifty position 10-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ పై క్రూసేడ్!
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమనడంతో దేశీయంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. పశ్చిమాసియాలో చమురు క్షేత్రాలపై దాడులతో చమురు ధరలు తొలుత పీపాకు 30 శాతంపైగా ఎగశాయి. దీంతో ప్రారంభంలో 2,494 పాయింట్లకుపైగా పడిపోయిన సెన్సెక్స్ చివరికి 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద ముగిసింది. మొదట్లో 753 పాయింట్లు పతనమైన నిఫ్టీ సైతం.. చివరికి 422 పాయింట్ల క్షీణతతో 24,028 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,425 దిగువకు చేరగా.. నిఫ్టీ 23,698 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో ఒక్క రోజులో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 8 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. ధరల మంట... లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ధర ఉదయం 120 డాలర్లను తాకింది. న్యూయార్క్లో లైట్ స్వీట్ క్రూడ్ సైతం 119.5 డాలర్లకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు తలెత్తాయి. వెరసి దాదాపు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు పరుగుతీశారు. అయితే మిడ్సెషన్కల్లా చమురు ధరలు కాస్త ఉపశమించాయి. మరోపక్క యూఎస్ మార్కెట్ల ఫ్యూచర్స్ నష్టాలు సైతం సగానికి తగ్గాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లలో కొంతమేర రికవరీ కనిపించింది. గత వారం నైమెక్స్ క్రూడ్ 36 శాతం, బ్రెంట్ 28 శాతం జంప్ చేయడం తెలిసిందే. అమ్మకాల షాక్: ఎన్ఎస్ఈలో ఐటీ నష్టపోకుండా నిలదొక్కుకోగా.. ఆటో, పీఎస్యూ, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్అండ్ గ్యాస్, కెమికల్స్ 4–2% మధ్య పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీఎంపీపీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ, కొటక్ బ్యాంక్ 5.3–3.5% మధ్య పతనమయ్యాయి. అయితే విప్రో, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ 1.6–0.6 మధ్య బలపడ్డాయి. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతంపైగా నీరసించాయి. చమురు మంటతో టైర్లు, ఆటోమొబైల్, పెయింట్లు, ఎయిర్లైన్స్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ధరలకు రెక్కలురానుండటంతో ఆర్బీఐ కఠినతర విధానాలవైపు మొగ్గు చూపవలసి వస్తుందని తెలియజేశారు. దీంతో బ్యాంకింగ్ కౌంటర్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం బలహీనపడటం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు సెగతో చమురు దెబ్బకు ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ 6–4.3% మధ్య పడిపోయాయి. షాలిమార్, ఇండిగో, ఏషియన్, నెరోలాక్, బెర్జర్ పెయింట్స్ 4–2% మధ్య, జేకే, సియట్, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ 6–2% మధ్య క్షీణించాయి. ఏటీఎఫ్ వ్యయాలపై భయాలతో ఇంటర్గ్లోబ్ 4 శాతం పడింది.ఎఫ్పీఐల భారీ అమ్మకాలుయుద్ధ భయాలతో ఇటీవల దేశీ స్టాక్స్లో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 9,014 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం. -
పేకమేడల్లా కుప్పకూలిన సూచీలు.. కారణాలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 449 పాయింట్లు నష్టపోయి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1424 పాయింట్లు దిగజారి 77,494 వద్దకు చేరింది.భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు పేకమేడల్లా కూలిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల సెన్సెక్స్, నిఫ్టీలను పాతాళానికి నెట్టేశాయి. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు దాదాపు ఒకనొక సమయంలో రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలుగత వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ కాల్పుల విరమణకు నిరాకరించడం, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగింది.యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 26% పెరిగింది. భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 92.33 కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది.అమెరికాలో 10 ఏళ్ల బాండ్ యీల్డ్స్ 4.20% స్థాయికి చేరడం, డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు సురక్షితమైన అమెరికా బాండ్ల వైపు మళ్లుతున్నాయి.వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశలు ఆవిరి కావడంతో బ్యాంకింగ్ స్టాక్స్ కుదేలయ్యాయి.ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్తో చేయం’ -
స్టాక్ మార్కెట్ క్రాష్.. రూ.12 లక్షల కోట్లు ఆవిరి!
గత వారం నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ఉదయం కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా దాదాపు 3% పడిపోయాయి. సెన్సెక్స్ దాదాపు 2,400 పాయింట్లు పడిపోయి 76,424కి చేరుకోగా, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా పడిపోయి 23,750కి చేరుకుంది.బీఎస్ఇలో జాబితా చేసిన అన్ని కంపెనీల మొత్తం.. మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి ప్రారంభమైన 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే రూ.12.39 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. సెన్సెక్స్లోని అన్ని భాగాలు నష్టాల్లో కూరుకున్నాయి. ఇండిగో షేర్లు దాదాపు 8% నష్టపోయాయి. టాటా స్టీల్, ఎల్ అండ్ టి, ఎస్బీఐ, మారుతి సుజుకి & ఎటర్నల్ షేర్లు వరుసగా 5% నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 5% కంటే ఎక్కువ పడిపోయి భారీ నష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ ఆటో దాదాపు 4% పడిపోయింది, నిఫ్టీ రియాలిటీ అండ్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 3% పైగా పడిపోయాయి.పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు ప్రపంచం ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలాంటి సమయంలో ధరల పెరుగుదల శాశ్వతం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. -
బేర్మన్న స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లో ప్రారంభం!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 2,284.27 పాయింట్లు లేదా 2.89 శాతం నష్టంతో 76,634.63 వద్ద, నిఫ్టీ 703.35 పాయింట్లు లేదా 2.88 శాతం నష్టంతో 23,747.10 వద్ద సాగుతున్నాయి.క్యుపిడ్ లిమిటెడ్, కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ & హాలిడేస్ లిమిటెడ్, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషసాయి టెక్నాలజీస్ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్ టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జింకుశల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లిమిటెడ్, ట్రిజిన్ టెక్నాలజీస్ లిమిటెడ్, నోయిడా టోల్ బ్రిడ్జ్ కంపెనీ లిమిటెడ్, మీషో లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 101 పాయింట్లు నష్టపోయి 24,659 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 353 పాయింట్లు పడిపోయి 79,662 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.96బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.51 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.13 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.56 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 06-03-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.ఎల్గీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్, మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, సెంచరీ ఎక్స్ట్రూషన్స్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్, ఇంటిగ్రే ఎసెన్షియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్, పిఎన్జిఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్స్ పెరగడానికి కారణంభారతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలివేయడానికి కొన్ని షరతులతో సిద్ధంగా ఉందని వదంతులు రావడమే. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చని భావించి పెట్టుబడిదారులు మార్కెట్లో కొనుగోళ్లు పెంచారు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్ సూచీల దారెటు?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 24,596 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 375 పాయింట్లు పుంజుకొని 79,502 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి?
పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ మేఘాల సెగ భారత స్టాక్ మార్కెట్లను చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుండగా ఇటీవల దేశీయ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. నిన్న ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8.75 లక్షల కోట్లు ఆవిరైపోయింది.బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు (1.40%) నష్టపోయి 79,116.19 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది 1,795 పాయింట్ల వరకు పడిపోవడం గమనార్హం. నిఫ్టీ 385.20 పాయింట్లు (1.55%) కోల్పోయి 24,480.50 వద్ద ముగిసింది. రంగాల వారీగా ఎనర్జీ సెక్టార్కు చెందిన షేర్లు అత్యధికంగా 14.90% పతనమయ్యాయి. రియల్టీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్ సూచీలు కూడా 3% పైగా నష్టపోయాయి.మార్కెట్లు ఎందుకు కుప్పకూలాయి?ముడి చమురు సెగ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడటం మార్కెట్లను భయపెట్టింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా బ్యారెల్కు 82 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి, కరెంట్ అకౌంట్ లోటు పెరిగే ప్రమాదం ఉంది.రూపాయి రికార్డు పతనం: అంతర్జాతీయ అనిశ్చితి వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్టానికి (92.17) పడిపోయింది. ఇది దిగుమతులపై భారాన్ని పెంచుతోంది.ఎఫ్ఐఐల అమ్మకాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత మూడు సెషన్లలోనే దాదాపు రూ.14,400 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.ఆసియా మార్కెట్ల ప్రభావం: జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి వంటి ఇతర ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉండటం దేశీయ సెంటిమెంట్ను దెబ్బతీసింది.ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుఇలాంటి సంక్షోభ సమయాల్లో భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భయం వద్దు.. మార్కెట్లు పడిపోగానే కంగారుపడి క్వాలిటీ షేర్లను విక్రయించకూడదు. యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తాత్కాలికమే. చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి పతనం తర్వాత మార్కెట్లు మరింత బలంగా పుంజుకున్నాయి.సిప్ కొనసాగిచాలి: మార్కెట్ కనిష్టాల్లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీనివల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం చేకూరుతుంది.నగదు నిల్వలు: పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుకోవడం మంచిది. మంచి షేర్లు తక్కువ ధరలో లభించినప్పుడు కొనుగోలు చేయడానికి ఇది మీకు ఒక అవకాశం ఇస్తుంది.స్టాప్ లాస్ తప్పనిసరి: ట్రేడర్లు ట్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా స్టాప్ లాస్ పాటించాలి. మార్కెట్ సూచీల ఊగిసలాట ఎక్కువగా ఉన్నప్పుడు అధిక లివరేజ్ తీసుకోవడం రిస్క్తో కూడుకున్న పని.ప్రపంచ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే చమురు ధరలు 100 డాలర్లకు చేరే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పునసమీక్షించుకోవాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా వేచి చూసే ధోరణి అవలంబించడం ఉత్తమం.ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం! -
యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
-
స్టాక్ మార్కెట్ క్రాష్.. 1122 పాయింట్లు కూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మధ్యప్రాచ్యంలో ఏర్పడుతున్న పరిస్థితి గురించి మదుపరులు ఆందోళన చెందడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడవ సెషన్లోనూ క్షీణించాయి. సెన్సెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1.6 శాతం లేదా 385.2 పాయింట్ల నష్టంతో 24,480.5 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 1.40 శాతం లేదా 1,122.66 పాయింట్లు నష్టపోయి 79,116.19 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్లో ఎన్బీ ట్రేడ్& ఫైనాన్స్, సికాల్ లాజిస్టిక్స్, సాధన నైట్రో కెమ్, పాదం కాటన్ యార్న్స్, ఎఫ్ మెక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్, రూబీ మిల్స్, మార్గ్ టెక్నో ప్రాజెక్ట్స్, పిక్చర్హౌస్ మీడియా, శ్రీ హవిషా హాస్పెటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను మించి పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.2 శాతం, 2.1 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బుధవారం సెషన్ ను లాభాలతో ముగించిన ఏకైక సెక్టోరల్ సూచీ నిఫ్టీ ఐటీ. -
యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 486 పాయింట్లు తగ్గి 24,384 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1580 పాయింట్లు నష్టపోయి 78,661 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.15బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.94 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.02 శాతం దిగజారింది.అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. అటు ఆసియా, యూరప్ సూచీలు కూడా భారీగా తగ్గాయి.దక్షిణ కొరియా కోస్పి స్టాక్ ఇండెక్స్ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్ నిల్వలున్నప్పటికీ జపాన్ నికాయ్ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు.అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్కి 7% పైగా పెరిగి 82.2 డాలర్ల వద్ద, నైమెక్స్ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.Today Nifty position 04-03-2026(time: 9:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం కారణంగా.. సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,048.34 పాయింట్ల నష్టంతో 80,238.85 వద్ద, నిఫ్టీ 312.95 పాయింట్ల నష్టంతో 24,865.70 వద్ద నిలిచాయి.జిందాల్ డ్రిల్లింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. వర్వీ గ్లోబల్ లిమిటెడ్, కృధాన్ ఇన్ఫ్రా లిమిటెడ్, AKG Exim లిమిటెడ్, క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఫింకుర్వే ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 283 పాయింట్లు తగ్గి 24,886 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1004 పాయింట్లు నష్టపోయి 80,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.8బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.98 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్అరబ్ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి.హుర్ముజ్ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది.Today Nifty position 02-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
-
బ్యాంకుల షేర్లు విలవిల.. స్టాక్ మార్కెట్ భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీతా పతనమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య రియల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ క్షీణించడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు గణనీయంగా క్షీణించాయి.నిఫ్టీ 1.22 శాతం లేదా 311.85 పాయింట్ల నష్టంతో 25,178.65 వద్ద, సెన్సెక్స్ 961.42 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయి 81,287.19 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా పడిపోయాయి.విస్తృత మార్కెట్లు కూడా బెంచ్ మార్క్ సూచీలకు అనుగుణంగా పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.14 శాతం, 1.10 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు అత్యధికంగా క్షీణించాయి. ఈ సూచీలు వరుసగా 2.3 శాతం, 2.1 శాతం నష్టపోయాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు తగ్గి 25,403 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 269 పాయింట్లు నష్టపోయి 81,971 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.81బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.54 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.Today Nifty position 27-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 45.52 పాయింట్ల నష్టంతో 82,230.55 వద్ద, నిఫ్టీ 14.05 పాయింట్ల లాభంతో 25,496.55 వద్ద నిలిచాయి.ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, సనోఫీ కన్స్యూమర్ హెల్త్కేర్ ఇండియా లిమిటెడ్, రినైసాన్స్ గ్లోబల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్, జిందాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, వీఎల్ ఈ గవర్నెన్స్ & ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
25,500 మార్కు వద్ద నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 25,536 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 148 పాయింట్లు పుంజుకొని 82,424 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.58బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.81 శాతం పెరిగింది.నాస్డాక్ 1.26 శాతం పుంజుకుంది.Today Nifty position 26-02-2026(time: 9:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 152 పాయింట్లు పెరిగి 25,573 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 501 పాయింట్లు పుంజుకొని 82,722 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.82బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.77 శాతం పెరిగింది.నాస్డాక్ 1.05 శాతం పుంజుకుంది.Today Nifty position 25-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పులు, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వస్తున్న పెనుమార్పులు దలాల్ స్ట్రీట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గడిచిన ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ సుమారు 1,068 పాయింట్లు కుప్పకూలి 82,225 వద్ద ముగియగా, నిఫ్టీ 25,400 స్థాయికి దిగువన సరిపెట్టుకుంది. నేటి మార్కెట్ గమనాన్ని శాసించే కొన్ని అంశాలను పరిశీలిద్దాం.ట్రంప్ టారిఫ్లు - యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన దిగుమతి సుంకాలపై అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద అధ్యక్షుడు నేరుగా టారిఫ్లు విధించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇది తాత్కాలికంగా ఊరటనిచ్చినా ట్రంప్ వెంటనే మరో చట్టం (సెక్షన్ 122) కింద 15% అంతర్జాతీయ టారిఫ్లను ప్రకటించడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది.భారత్పై ప్రభావం: ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి ఆధారిత రంగాలు ఈ అనిశ్చితి కారణంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు ఈ వెయిట్ అండ్ వాచ్ ధోరణి కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఆంత్రోపిక్ ప్రకంపనలుటెక్నాలజీ రంగంలో ప్రస్తుతం సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్(సాస్)లు కొనసాగుతున్నాయి. ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన క్లాడ్ కోవర్క్, కోబాల్ వంటి ఏజెంటిక్ ఏఐ సర్వీసులు ఐటీ కంపెనీల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా అనాలిసిస్ వంటి పనులను ఈ ఏఐ సర్వీసులు ఆటోమేట్ చేయడంతో మానవ ఆధారిత వ్యాపారం చేసే భారతీయ ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గుతాయని మార్కెట్ భయపడుతోంది.అంతర్జాతీయ అనిశ్చితులుమిడిల్ఈస్ట్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చుతగ్గులు, ఎఫ్ఐఐల నిరంతర అమ్మకాలు మార్కెట్ను బేరిష్ జోన్లోకి నెట్టాయి. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ కూడా బలహీనమైన సంకేతాలనే ఇస్తోంది.పెట్టుబడిదారులకు సూచనలునగదు ఉండాల్సిందే: మార్కెట్ కనిష్ట స్థాయిలను తాకినప్పుడు కొనుగోలు చేయడానికి కొంత నగదును సిద్ధంగా ఉంచుకోండి.ఐటీ రంగంపై జాగ్రత్త: ఐటీ కంపెనీలు ఏఐని ఎంత త్వరగా తమ వ్యాపారంలోకి స్వీకరిస్తున్నాయో గమనించండి. కేవలం తక్కువ ధరకు దొరుకుతున్నాయని ఐటీ స్టాక్స్ను భారీగా కొనకండి.సిప్: దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను పట్టించుకోకుండా క్రమానుగతంగా పెట్టుబడులు కొనసాగించడం మేలు.గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. -
కోబాల్ షాక్
ముంబై: అమెరికా ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ కొత్త అప్డేట్ తీసుకొచ్చినప్పుడల్లా ‘ఐటీ మార్కెట్’ వణికిపోతోంది. తాజాగా కోబాల్ వంటి పాత ప్రోగ్రామింగ్ భాషలతో పనిచేస్తున్న సిస్టమ్లు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చేందుకు తమ ‘క్లాడ్ కోడ్’ టూల్ ఉపయోగపడుతుందని ప్రకటించింది. ఈ కోడింగ్ టూల్స్తో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులపై వ్యయాలు తగ్గి, కంపెనీల ఆదాయాల పరిమితం కావొచ్చని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో ఐటీ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఒకశాతానికి పైగా పతనమైంది.అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత అనిశి్చతులు, క్రూడాయిల్ ధరలు, అమెరికా–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 1069 పాయింట్లు పతనమై 82,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,425 వద్ద నిలిచింది. ఒక్కరోజే రూ.2.85 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.466 లక్షల కోట్లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ పుంజుకోవడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలహీనపడి 90.95 వద్ద స్థిరపడింది. బలహీనంగా మొదలై.. భారీ నష్టాల్లోకి..అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ గడిచే కొద్ది మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఏఐ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేయటంతో ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో చిత్తు అయ్యాయి. రియల్టీ, మీడియా స్టాక్స్ కూడా భారీగానే నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,360 పాయింట్లు క్షీణించి 82 వేల స్థాయి దిగువన 81,934 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పతనమై 25,328 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అలాగే మంగళవారం నిఫ్టీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్పైరీ కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మార్పు, చేర్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. ⇒ ఆంథ్రోపిక్ తాజా అప్డేట్ ప్రకటనతో భారత ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్టీఐఎం 6.50%, టెక్ మహీంద్రా 6.17%, పెర్సిస్టెంట్ 6%, హెచ్సీఎల్ టెక్ 5.83%, కోఫోర్జ్ 5.24% క్షీణించాయి. ఎంఫసిస్ 3.67%, టీసీఎస్ 3.56%, ఇన్ఫోసిస్ 3.56%, విప్రో 3% పతనమయ్యాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్సు 4.8% నష్టపోయింది. కృత్రిమ మేధ ఆందోళనలతో నిఫ్టీ ఐటీ ఇండెక్సు ఈ ఫిబ్రవరిలో ఏకంగా 21% కుప్పకూలింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2008) తర్వాత ఈ సూచీ ఒక నెలలో ఆ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 5%, రియల్టీ 2.61%, టెలీకమ్యూనికేషన్ 1.79%, కన్జూమర్ డి్రస్కేషనరీ 1.12%, ఇండ్రస్టియల్స్ 0.91%, క్షీణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.68%, 0.54% చొప్పున క్షీణించాయి. ⇒ ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ యూఎస్ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా ఇతర చట్టాల ద్వారా టారిఫ్లు విధిస్తామని ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండోనేíÙయా 1.4%, హాంగ్కాంగ్ 1.85%, సింగపూర్ 0.4% పతనమయ్యాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు అరశాతం వరకు పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు ఆరంభంలో భారీగా పడి, వెంటనే కోలుకుని లాభాలతో ట్రేడవుతున్నాయి.ఐబీఎంకు ఆంథ్రోపిక్ భయంఐబీఎం సిస్టమ్స్లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోబాల్ను తమ ‘క్లాడ్ కోడ్ టూల్ ఆధునికీకరించగలదంటూ ఆంథ్రోపిక్ చేసిన ప్రకటనతో ఐబీఎం షేరు కుప్పకూలింది. సోమవారం ఏకంగా 13.2% క్షీణించి 223.35 డాలర్ల వద్ద ముగిసింది. 2000 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువకు ఒక్కరోజే 40 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.టెక్ నిపుణులు నెలల పాటు శ్రమించి రూపొందించే కోడ్ లాంగ్వేజీని స్వల్ప వ్యవధిలో పూర్తి చేసే కోబాల్ క్లాడ్ కోడ్ టూల్ ఆవిష్కరణతో ఐబీఎంతో పాటు అంతర్జాతీయంగా సైబర్ సెక్యురిటీ, సాఫ్ట్వేర్ యాస్ ఏ సర్వీస్ (సాస్) రంగంలోని దిగ్గజ కంపెనీల షేర్లు భారీ నష్టపోయాయి. ఈ ప్రభావమూ దేశీయ ఐటీ సంస్థల షేర్లపై పడింది. సోమవారం భారీ నష్టం నుంచి తేరుకున్న ఐబీఎం షేరు మంగళవారం ఇంట్రాడేలో 4.27% లాభంతో 232.88 డాలర్లను తాకింది. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్: సెన్సెక్స్ & నిఫ్టీ ఇలా..
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 974.77 పాయింట్ల నష్టంతో 82,319.89 వద్ద, నిఫ్టీ 253.65 పాయింట్ల నష్టంతో 25,459.35 వద్ద నిలిచాయి.డాల్ఫిన్ ఆఫ్షోర్ ఎంటర్ప్రైజెస్ (ఇండియా) లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, తమిళనాడు టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఎంబీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అకీ ఇండియా లిమిటెడ్, యాత్ర ఆన్లైన్ లిమిటెడ్, భండారీ హొజియరీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఆరే డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 198 పాయింట్లు తగ్గి 25,512 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 706 పాయింట్లు దిగజారి 82,587 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.78బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.07 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.04 శాతం తగ్గింది.నాస్డాక్ 1.13 శాతం దిగజారింది.Today Nifty position 24-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్కు ‘యూఎస్ సుప్రీం’ జోష్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు(టారిఫ్లు) చెల్లవంటూ యూఎస్ సుప్రీం కోర్టు ఇచి్చన తీర్పు ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ 480 పాయింట్లు పెరిగి 83,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142 పాయింట్లు బలపడి 25,713 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ లాభాల ముగింపు. ఉదయమే సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో ముందుకు కదిలాయి. స్థిరమైన డిమాండ్, ఆర్థిక పునరుద్ధరణపై ఆశావహ అంచనాలతో ప్రభుత్వ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డి్రస్కేషనరీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 671 పాయింట్లు పెరిగి 83,486 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు ఎగసి 25,771 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్స్ 1.4%, సరీ్వసెస్ 0.97%, హెల్త్కేర్ 0.89%, విద్యుత్ 0.76%, ఆటో 0.71%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 0.65%, ఎఫ్ఎంసీజీ 0.54%, యుటిలిటి 0.52 శాతం పెరిగాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41% లాభపడగా, మిడ్క్యాప్ సూచీ 1.56% నష్టపోయింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు డీలాహరియాణా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగిందంటూ వార్తలు వెలుగులోకి రావడంతో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో 20% క్షీణించి రూ.66.85 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. చివరికి 16% నష్టంతో రూ.70 వద్ద స్థిరపడింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుతో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ నుంచి హరియాణా ప్రభుత్వం తొలగించింది. దీంతో ఏయూ బ్యాంక్ షేరు 5.30% పతనమై రూ.974 వద్ద స్థిరపడింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.95 పాయింట్ల లాభంతో 83,294.66 వద్ద, నిఫ్టీ 132.70 పాయింట్ల లాభంతో 25,703.95 వద్ద నిలిచాయి.అక్మే ఫిన్ట్రేడ్ (ఇండియా) లిమిటెడ్, మోర్పెన్ లాబొరేటరీస్ లిమిటెడ్, అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇండో టెక్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, ఈ2ఈ నెట్వర్క్స్ లిమిటెడ్, 63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 25,746 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 582 పాయింట్లు పుంజుకొని 83,381 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.47బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.08 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.69 శాతం పెరిగింది.నాస్డాక్ 0.9 శాతం పుంజుకుంది.Today Nifty position 23-02-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్ల (0.38 శాతం) లాభంతో 82,814.71 వద్ద, నిఫ్టీ 116.90 పాయింట్ల (0.46 శాతం) లాభంతో 25,571.25 వద్ద నిలిచాయి.VL E-గవర్నెన్స్ & IT సొల్యూషన్స్ లిమిటెడ్, BLB లిమిటెడ్, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, సకార్ హెల్త్కేర్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. విక్రమ్ సోలార్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, ట్రాన్స్వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్, కెఎన్ అగ్రి రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
25,480 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 25,486 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 40 పుంజుకొని 82,552 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.96బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.28 శాతం తగ్గింది.నాస్డాక్ 0.31 శాతం దిగజారింది.ఇరాన్తో అణు చర్చలు విఫలమైతే అమెరికా యుద్ధానికి సిద్ధమైంది. అమెరికా కీలక వడ్డీ రేట్ల విషయంపై ఫెడరల్ రిజర్వ్ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు జనవరి 27–28 జరిగిన ఫెడ్ సమావేశ మినిట్స్లో వెల్లడైంది. ఫెడ్ వడ్డీ రేట్ల కోతలను ఆలస్యం చేసినా లేదా రేట్లు పెంచినా, భారత ఈక్విటీ మార్కెట్లకు ప్రతికూలం. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. భారత్కు దిగుమతి అయ్యే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 71 డాలర్లపైకి చేరింది.Today Nifty position 20-02-2026(time: 9:48 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు తగ్గి 25,819 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 41 దిగజారి 83,696 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 19-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు తగ్గి 25,721 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 47 దిగజారి 83,405 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 18-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆదుకున్న బ్యాంకులు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 83,451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు బలపడి 25,725 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 611 పాయింట్ల పరిధిలో 82,987 – 83,598 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 25,570 వద్ద కనిష్టాన్ని, 25,764 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.52 లక్షల కోట్లు పెరిగి రూ.470.11 లక్షల కోట్లకు చేరింది. లూనార్ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చైనా, దక్షిణ కొరియా, హాంగ్కాంగ్, తైవాన్, సింగపూర్ మార్కెట్లు పనిచేయలేదు. జపాన్ ఇండెక్సు 0.50% నష్టపోయింది. ఆరంభ నష్టాలు భర్తీ చేసుకున్న యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈ రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ 2.36% పెరిగింది. ఐటీ 1.15%, ఇండ్రస్టియల్స్ 1.13%, సర్వీసెస్ 0.98% ఐటీ 0.94%, ఎఫ్ఎంసీజీ 0.87%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.85%, క్యాపిటల్ గూడ్స్ 0.76% పెరిగాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్సులు 0.49%, 0.26% లాభపడ్డాయి. మరోవైపు మెటల్, కమోడిటీస్, ఇంధన, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ⇒ హెచ్సీఎల్ టెక్ 1.50 శాతం, విప్రో 1.21శాతం, ఎల్అండ్టీఎం 1 శాతం లాభపడ్డాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ షేర్లు 0.50 శాతం పెరిగాయి. ⇒ భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్... ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో మరిన్ని రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోళ్ల ఒప్పందం కుదరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా డిఫెన్స్ షేర్లకు డిమాండ్ లభించింది. కొచి్చన్ షిప్యార్డ్ 4%, భారత్ ఎల్రక్టానిక్స్ 2%, యూనిమెక్ ఏరోస్పేస్ 4%, భారత్ ఫోర్జ్ 1.38%, పరాస్ డిఫెన్స్, జెన్ టెక్నాలజీస్ 1%, హెచ్ఏఎల్ 0.50% లాభపడ్డాయి. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 173.81 పాయింట్ల లాభంతో 83,450.96 వద్ద, నిఫ్టీ 42.65 పాయింట్ల లాభంతో 25,725.40 వద్ద నిలిచాయి.యూనికామర్స్ ఈసొల్యూషన్స్ లిమిటెడ్, కొఠారి ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, కెల్టన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండోవిండ్ ఎనర్జీ లిమిటెడ్, కామధేను వెంచర్స్ లిమిటెడ్, సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, యుకెన్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు తగ్గి 25,603 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 171 దిగజారి 83,096 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.13బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 68.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.03 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం పెరిగింది.నాస్డాక్ 0.22 శాతం దిగజారింది.Today Nifty position 17-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 650.39 పాయింట్ల లాభంతో 83,277.15 వద్ద, నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద నిలిచాయి.భారత్ సీట్స్ లిమిటెడ్, ఆర్.ఎ.సి.ఎల్. గేర్టెక్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, ఆసియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. బీటా డ్రగ్స్ లిమిటెడ్, సార్థక్ మెటల్స్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్, టీఐఎల్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు క్రితం సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు పెరిగి 25,489 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 పుంజుకొని 82,646 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 16-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నేడు దలాల్ స్ట్రీట్ దారి ఎటువైపు?
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (ఫిబ్రవరి 16, 2026) ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 330 పాయింట్లకు పైగా భారీగా పతనమైన నేపథ్యంలో నేడు కూడా మార్కెట్ బేరిష్(తగ్గుదల) ట్రెండ్ను కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.అంతర్జాతీయ అనిశ్చితులు - టెక్ రంగంలో ప్రకంపనలుఅమెరికా మార్కెట్లలో ముఖ్యంగా టెక్నాలజీ (ఐటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్లలో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు భారతీయ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నాస్డాక్ పతనం కారణంగా దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అలాగే, పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ బలపడటం కూడా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిష్క్రమణకు దారితీస్తోంది.క్రూడాయిల్ ధరలు.. భారత్పై ప్రభావంప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు సుమారు 67 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ అణు చర్చల నేపథ్యంలో సరఫరా అంతరాయాలు తగ్గుతాయన్న ఆశలు ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగలేదు. క్రూడాయిల్ ధరలు పెరిగితే అది భారతదేశ ద్రవ్యోల్బణంపై, కరెంటు ఖాతా లోటు (క్యాడ్)పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది రూపాయి విలువ క్షీణతకు కారణమై మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది.ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ భవిష్యత్తు నిర్ణయాలుఇటీవలి ఫిబ్రవరి మానిటరీ పాలసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచింది. అయితే, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పటికీ ఆహార ధరల పెరుగుదల, అంతర్జాతీయ అనిశ్చితుల దృష్ట్యా ఆర్బీఐ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత లేకపోవడం మార్కెట్లలో కొంత నిరుత్సాహాన్ని నింపింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి గ్లోబల్ లిక్విడిటీపై ప్రభావం చూపుతోంది.టెక్నికల్ లెవల్స్పై నిపుణుల అంచనాటెక్నికల్ చార్టుల ప్రకారం, నిఫ్టీకి 25,400 స్థాయి అత్యంత కీలకమైన సపోర్ట్గా ఉంది. ఒకవేళ నిఫ్టీ ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే అది 25,200 నుంచి 25,000 వరకు వెళ్లే ప్రమాదం ఉంది. సెన్సెక్స్కు 82,500 - 82,400 జోన్ బలమైన సపోర్ట్గా పనిచేస్తుంది. ఇన్వెస్టర్లు ప్రస్తుతం దూకుడుగా పెట్టుబడులు పెట్టడం కంటే వేచి చూడటం ఉత్తమమని, ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగాల షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఉఫ్.. బిగ్ రిలీఫ్! -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 257 పాయింట్లు తగ్గి 25,548 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 809 దిగజారి 82,868 వద్ద ట్రేడవుతోంది.భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 13, 2026) భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు, ముఖ్యంగా ఐటీ రంగంలో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ కార్పొరేట్ లీగల్ విధులను ఆటోమేట్ చేసే కొత్త టూల్ను విడుదల చేయడం భారత ఐటీ రంగానికి శాపంగా మారింది. ఈ సాంకేతికత వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై నీలి నీడలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు.అమెరికాలో జనవరి నెలకు సంబంధించి వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమే అయినప్పటికీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్లను కలవరపెట్టాయి.‘ప్రస్తుత పతనం ప్రధానంగా ఐటీ, గ్లోబల్ సెంటిమెంట్ వల్ల జరిగింది. అయితే, నిఫ్టీకి 25,500 వద్ద బలమైన మద్దతు ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్లలో ఈ పతనాన్ని కొనుగోలు అవకాశంగా చూడవచ్చు’ అని నిపుణులు సూచిస్తున్నారు.Today Nifty position 13-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 558.72 పాయింట్ల నష్టంతో.. 83,674.92 వద్ద, నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో జీఈ పవర్ ఇండియా లిమిటెడ్, క్రౌన్ లిఫ్టర్స్ లిమిటెడ్, రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్, యూనిటెక్ లిమిటెడ్, కిలిచ్ డ్రగ్స్(ఐ) లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 114 పాయింట్లు తగ్గి 25,853 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 381 దిగజారి 83,836 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 12-02-2026(time: 9:43 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
26,000 మార్కు చేరువలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,985 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 110 పుంజుకొని 84,386 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 11-02-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 208.17 పాయింట్ల (0.25 శాతం) లాభంతో 84,273.92 వద్ద, నిఫ్టీ 67.85 పాయింట్ల (0.26 శాతం) లాభంతో 25,935.15 వద్ద ఉన్నాయి.పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుమాక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లక్ష్మి కోట్స్పిన్ లిమిటెడ్, క్షితిజ్ పాలీలైన్ లిమిటెడ్, ఏబీఎమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, జూబిలెంట్ అగ్రి అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, స్పేస్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్లో కొనసాగుతోన్న లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,921 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 185 పుంజుకొని 84,269 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 10-02-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపుతో ముగిశాయి. సెన్సెక్స్ 485.35 పాయింట్లు పెరిగి 84,065.75 వద్ద, నిఫ్టీ 173.60 పాయింట్ల లాభంతో 25,867.30 వద్ద నిలిచాయి.నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇజ్మో లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 127 పాయింట్లు పెరిగి 25,822 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 419 పుంజుకొని 84,002 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.61బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.22 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.97 శాతం పెరిగింది.నాస్డాక్ 2.18 శాతం పుంజుకుంది.Today Nifty position 09-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 266.47 శాతం లాభంతో.. 83,580.40 వద్ద, నిఫ్టీ 50.90 పాయింట్ల లాభంతో 25,693.70 వద్ద నిలిచాయి.నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐజెడ్ఎంఓ లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 514.66 పాయింట్ల లాభంతో.. 83,303.02 వద్ద, నిఫ్టీ 135.30 పాయింట్ల లాభంతో 25,640.70 వద్ద నిలిచాయి.మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, బార్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, టిజారియా పాలీపైప్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సరళ పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జువారీ ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 86 పాయింట్లు తగ్గి 25,691 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 251 నష్టపోయి 83,568 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,780 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 85 ఎగబాకి 83,819 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.35బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.84 శాతం తగ్గింది.నాస్డాక్ 1.43 శాతం నష్టపోయింది.Today Nifty position 04-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లో ర్యాలీ.. ఇప్పుడేం చేయాలంటే..
భారత స్టాక్ మార్కెట్లు ఫిబ్రవరి 3, 2026 నాటి ట్రేడింగ్ సెషన్లో భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్కరోజులోనే సుమారు రూ.12.5 లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం. ఈ భారీ ర్యాలీకి దారితీసిన కారణాలు, రాబోయే రోజుల్లో మదుపర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.సెన్సెక్స్, నిఫ్టీ భారీ జంప్మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 2,072.67 పాయింట్లు (2.54%) పెరిగి 83,739.13 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 629.75 పాయింట్లు (2.51%) లాభంతో 25,718.15 వద్ద ముగిసింది.మార్కెట్ ర్యాలీకి కారణాలుభారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ప్రకటించిన ట్రేడ్ డీల్ ఈ భారీ ర్యాలీకి కీలకంగా నిలిచింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో గతంలో విధించిన 25% అదనపు పెనాల్టీ సుంకాలను అమెరికా పూర్తిగా ఎత్తివేసింది. అలాగే భారత ఉత్పత్తులపై ప్రాథమిక సుంకాలను 25% నుంచి 18%కి తగ్గించడం ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ వంటి ఎగుమతి రంగాలకు పెద్ద ఊరటనిచ్చింది.ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావం.. భారత్-అమెరికా డీల్ వార్తలతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. జపాన్ నిక్కీ (Nikkei 225) 2.44%, దక్షిణ కొరియా కోస్పి (Kospi) 5% వరకు పెరగడం భారత మార్కెట్లకు సానుకూల సంకేతాలను ఇచ్చింది.బడ్జెట్ అనంతరం స్పష్టత.. కేంద్ర బడ్జెట్ 2026లో ఎఫ్అండ్ఓపై ఎస్టీటీ పెంపు వంటి అంశాల వల్ల ఏర్పడిన అనిశ్చితిని ఈ వాణిజ్య ఒప్పందం వార్తలు మరుగునపడేశాయి. పెట్టుబడిదారులు తిరిగి దేశీయ మార్కెట్లపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.లాభాల స్వీకరణకు అవకాశం ఉందా?మార్కెట్లు భారీగా పెరిగినప్పుడు సహజంగానే మదుపర్లు గరిష్ఠ స్థాయిల వద్ద లాభాలను స్వీకరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్వల్పకాలంలో మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనవ్వొచ్చు. ఫిబ్రవరి 3 నాటి ట్రేడింగ్లో సెన్సెక్స్ మార్కెట్ ప్రారంభంలో వెళ్లిన గరిష్ఠాల నుంచి కొంత మేర తగ్గడం దీనికి సంకేతంగా చూడవచ్చు.ఇన్వెస్టర్లు పాటించాల్సిన జాగ్రత్తలుమార్కెట్ గరిష్ఠాల వద్ద ఉన్నప్పుడు గుడ్డిగా పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. నిపుణుల సూచనల ప్రకారం కింది జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక్కసారిగా పెట్టుబడి పెట్టవద్దు.. మార్కెట్ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా క్రమానుగతంగా పెట్టుబడులను కొనసాగించడం మంచిది.నాణ్యమైన షేర్లకే ప్రాధాన్యత.. అమెరికా సుంకాల తగ్గింపు వల్ల లాభపడే ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, కెమికల్ రంగాల్లోని నాణ్యమైన కంపెనీలను ఎంచుకోండి.స్టాప్ లాస్ తప్పనిసరి.. స్వల్పకాలిక ట్రేడర్లు మార్కెట్ అస్థిరతను దృష్టిలో ఉంచుకుని కచ్చితమైన స్టాప్ లాస్ పాటించడం అవసరం.పోర్ట్ఫోలియో రీ-బ్యాలెన్సింగ్.. ఇప్పటికే మంచి లాభాల్లో ఉన్న షేర్లలో కొంత మేర లాభాలను స్వీకరించి నగదును సిద్ధంగా ఉంచుకోవడం వల్ల మార్కెట్ తగ్గితే తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
సెన్సెక్స్ సునామీ
ముంబై: భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మంగళవారం దలాల్ స్ట్రీట్లో బుల్ లాభాల రంకె వేసింది.భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా సెన్సెక్స్ 2,073 పాయింట్లు ఎగసి 83,739 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 639 పాయింట్లు దూసుకెళ్లి 25,728 వద్ద నిలిచింది. గతేడాది 2025, మే 12 తర్వాత గడిచిన 8 నెలల్లో సూచీలకు ఒకరోజులో అతిపెద్ద ర్యాలీ ఇదే కావడం విశేషం.ఇంట్రాడే ట్రేడింగ్లో రికార్డు: ఉదయమే ఉత్సాహంగా మొదలైన సెన్సెక్స్ 3,657 పాయింట్ల లాభంతో 85,323 వద్ద, నిఫ్టీ 1,220 వద్ద పాయింట్లు పెరిగి 26,308 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. దలాల్స్ట్రీట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతంగా ఇంట్రాడే లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ ఏకంగా 4,205 పాయింట్లు (5.14%) ఎగసి 85,872 వద్ద, నిఫ్టీ 1,253 పాయింట్లు దూసుకెళ్లి 26,341 వద్ద గరిష్టాలు తాకాయి. తద్వారా సూచీలు ఇంట్రాడేలో అత్యధిక లాభాలు ఆర్జించిన కొత్త రికార్డు నమోదైంది. ఇన్వెస్టర్లకు లాభాల పంట: స్టాక్ మార్కెట్ రెండున్నర శాతం ర్యాలీతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. ఒక్కరోజే రూ. 12.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.467.14 లక్షల కోట్లకు చేరుకుంది. ⇒ సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో టెక్ మహీంద్రా (–0.47%), బీఈఎల్(–0.02%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా అదానీ పోర్ట్స్ 9.12%, బజాజ్ ఫైనాన్స్ 6.68%, ఇండిగో 5.51%, పవర్గ్రిడ్ 4.85%, సన్ఫార్మా 4.54 శాతం పెరిగాయి. ⇒ స్టాక్ మార్కెట్ ర్యాలీలో అన్ని రంగాల షేర్లూ పాలుపంచుకున్నాయి. బీఎస్ఈలో రంగాల వారీ సూచీల్లో సరీ్వసెస్ 4.86%, రియల్టీ 4.79%, పవర్ 4.79%, యుటిలిటీస్ 3.92%, క్యాపిటల్ గూడ్స్ 3.71%, ఇండస్ట్రియల్స్ 3.44%, కన్జూమర్ డిస్క్రేషనరీ 3.06%, మెటల్స్ 2.85%, ఫార్మా 2.83%, ఫైనాన్షియల్స్ సర్వీసెస్ 2.83% లాభపడ్డాయి. అమెరికా ట్రేడ్ డీల్ ఎఫెక్ట్... టెక్స్టైల్, లెదర్ స్టాక్స్: గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ 20%, వెల్స్పన్ లివింగ్ 19.85%, గర్వారే టెక్నికల్ ఫైబర్స్ 17.07%, కేపీఆర్ మిల్స్ 15.31 శాతం ర్యాలీ చేశాయి.ఎస్పీ అప్పరెల్స్ 14.19% వర్ధమాన్ టెక్స్టైల్స్ 12.12%, ట్రిడెంట్ 11.27%, అర్వింద్ లిమిటెడ్ 10.23%, పేజ్ ఇండస్ట్రీస్ 3.79%, రేమాండ్ లైఫ్స్టయిల్ 3.39 శాతం లాభపడ్డాయి. సీఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ షేర్లు: అవంతీ ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ 20% ర్యాలీ చేసి వరుసగా రూ.961, రూ.351 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకాయి. జీల్ ఆక్వా 10.58%, కింగ్స్ ఇన్ఫ్రా 7.64%, ముక్కా ప్రోటీన్స్ 5.01%, కోస్టల్ కార్పొరేషన్ 5% లాభపడ్డాయి. స్పెషాలిటీ కెమికల్స్: ఆర్తి ఇండస్ట్రీస్ 15.10%, గుజరాత్ ఫ్లోరో 6.82%, నవీన్ ఫ్లోరైన్ 6.22%, నియోజెన్ కెమ్ 6.19% పెరిగాయి. అతుల్ ఇండస్ట్రీస్ 5.25%, వినతి ఆర్గానిక్స్ 4.67%, ఎస్ఆర్ఎఫ్ 3.76%, ఆక్విటాస్ కెమ్ 1.26% లాభపడ్డాయి. వజ్రాభరణాల షేర్లు: గోల్డియమ్ ఇంటర్నేషనల్ 20%, వైభవ్ గ్లోబల్ 9.13%, కళ్యాణ్ జ్యువెలరీ 4.91%, శ్రింగార్ హౌస్ 4.51% మెరిశాయి. టైటాన్ 3%, పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ 1.52%, పీసీ జ్యువెలర్ 0.29% లాభపడ్డాయి. ఆటో ఉపకరణాల కంపెనీల షేర్లు: బెల్రైజ్ ఇండస్ట్రీస్ 7.37%, భారత్ ఫోర్జ్ 6.56%, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ 6.44% బీఎల్డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్స్ 6.13%, సుందరం ఫాస్టెనర్స్ 4%, భాష్, యూఎన్ఓ మిండా 3% పెరిగాయి. అదానీ షేర్ల పరుగులు: స్టాక్ మార్కెట్ ర్యాలీలో భాగంగా అదానీ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 10.61%, అదానీ ఎంటర్ప్రైజస్ 10.38%, అదానీ ఎనర్జీ సొల్యూ షన్స్ 10.23%, అదానీ పోర్ట్స్ 9.12%, అదానీ పవర్ 6.76%, అదానీ టోటల్ గ్యాస్ 4.52%, సంఘీ ఇండస్ట్రీస్ 3.60% లాభపడ్డాయి. -
భారత్ - యూఎస్ డీల్: భారీ లాభల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపులో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,072.67 పాయింట్ల (2.54 శాతం) లాభంతో 83,739.13 వద్ద, నిఫ్టీ 639.15 పాయింట్ల (2.55 శాతం) లాభంతో 25,727.55 వద్ద నిలిచాయి.పారామౌంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఫేజ్ త్రీ లిమిటెడ్, అవలోన్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ లిమిటెడ్, TECIL కెమికల్స్ & హైడ్రో పవర్ లిమిటెడ్, కామత్ హోటల్స్ (ఇండియా) లిమిటెడ్, MPS లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.అందులో భారీ లాభాల్లో..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణం. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
2400 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీగా పెరిగాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 757 పాయింట్లు పెరిగి 25,846 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 2467 ఎగబాకి 84,160 వద్ద ట్రేడవుతోంది.మార్కెట్ల పెరుగుదలకు కారణాలు..భారత్-అమెరికా చరిత్రాత్మక డీల్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్గా నిలువనుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.రష్యా ఆయిల్ పెనాల్టీ తొలగింపురష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్పై ఉన్న అదనపు పెనాల్టీలను అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి, ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది.ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలుఫిబ్రవరి 4-6 తేదీల్లో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెపో రేటును 0.25% తగ్గించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్కు కలిసొచ్చే అంశం.బడ్జెట్ 2026-27 కేటాయింపులుఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసింది. సెమీకండక్టర్లు, ఫార్మా (బయోఫార్మా శక్తి), డిఫెన్స్, మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ ఇచ్చిన ఊతం మార్కెట్ సెంటిమెంట్ను బలపరుస్తోంది. డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ)పై ఎస్టీటీ పెంపు వంటి స్వల్పకాలిక ప్రతికూలతలను అధిగమించి ఇన్వెస్టర్లు ఇప్పుడు దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.Today Nifty position 03-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యూఎస్-భారత్ డీల్.. మార్కెట్లు జోరందుకుంటాయా?
యూఎస్-భారత్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 320 పాయింట్ల వరకు లాభపడటం చూస్తుంటే, నేడు దలాల్ స్ట్రీట్లో బుల్ రన్ పక్కా అనిపిస్తోంది. అమెరికా పన్నుల తగ్గింపు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలు, బడ్జెట్ 2026 కేటాయింపులు వెరసి ఇన్వెస్టర్లలో ఆశావాదాన్ని పెంచుతున్నాయి.మార్కెట్ జోరుకు ప్రధాన కారణాలు(అంచనా)భారత మార్కెట్లు నేడు భారీ గ్యాప్-అప్తో ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్-అమెరికా చరిత్రాత్మక డీల్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్గా నిలువనుంది. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.రష్యా ఆయిల్ పెనాల్టీ తొలగింపురష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్పై ఉన్న అదనపు పెనాల్టీలను అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గి, ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది.ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలుఫిబ్రవరి 4-6 తేదీల్లో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై అందరి దృష్టి ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెపో రేటును 0.25% తగ్గించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్కు కలిసొచ్చే అంశం.బడ్జెట్ 2026-27 కేటాయింపులుఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసింది. సెమీకండక్టర్లు, ఫార్మా (బయోఫార్మా శక్తి), డిఫెన్స్, మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ ఇచ్చిన ఊతం మార్కెట్ సెంటిమెంట్ను బలపరుస్తోంది. డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ)పై ఎస్టీటీ పెంపు వంటి స్వల్పకాలిక ప్రతికూలతలను అధిగమించి ఇన్వెస్టర్లు ఇప్పుడు దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?అంతర్జాతీయ పరిణామాలు భారత్కు అనుకూలంగా ఉండటంతో ఐటీ, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి ఎగుమతి ఆధారిత కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించవచ్చు. అయితే మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు లాభాల స్వీకరణ జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.ఇదీ చదవండి: ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట! -
ఫ్లాట్గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 7 పాయింట్లు తగ్గి 24,836 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 పెరిగి నష్టపోయి 80,872 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 02-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సండే స్టాక్ మార్కెట్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
సాధారణంగా ఆదివారం రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే యూనియన్ బడ్జెట్ 2026 కారణంగా.. ఈ రోజు (ఫిబ్రవరి 1) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఆదివారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు 290.58 పాయింట్ల నష్టంతో 82,275.79 వద్ద, నిఫ్టీ 117.45 పాయింట్ల నష్టంతో 25,301.45 వద్ద కొనసాగుతున్నాయి.యునైటెడ్ ఫుడ్బ్రాండ్స్ లిమిటెడ్, సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్, రాజ్దర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, IKIO టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
త్వరలో బడ్జెట్.. నష్టాల్లో మార్కెట్!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 296.59 పాయింట్ల నష్టంతో 82,269.78 వద్ద, నిఫ్టీ 98.25 పాయింట్ల నష్టంతో 25,320.65 వద్ద నిలిచాయి.పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, రేమండ్ రియాల్టీ లిమిటెడ్, రేమండ్ లైఫ్స్టైల్ లిమిటెడ్, భారత్ బిజ్లీ లిమిటెడ్, భారత్ రోడ్ నెట్వర్క్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, హిందూస్తాన్ జింక్ లిమిటెడ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, వేదాంత లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బడ్జెట్ సెషన్కు ముందు ఊగిసలాడుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 167 పాయింట్లు తగ్గి 25,247 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 522 పాయింట్లు నష్టపోయి 82,071 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 30-01-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ అప్డేట్: నష్టాల నుంచి లాభాల్లోకి..
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 221.69 పాయింట్ల (0.27 శాతం) లాభంతో.. 82,566.37 వద్ద, నిఫ్టీ 76.15 పాయింట్ల (0.30 శాతం) లాభంతో 25,418.90 వద్ద నిలిచాయి.హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జింకుశల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్, డిజికాంటెంట్ లిమిటెడ్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్, సువిధా ఇన్ఫోసర్వ్ లిమిటెడ్, జిందాల్ డ్రిల్లింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
రెండు రోజుల లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్లు ఈరోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 115 పాయింట్లు తగ్గి 25,223 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 436 పాయింట్లు నష్టపోయి 81,898 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 29-01-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రేడ్ డీల్ జోష్
ముంబై: ఐరోపా సమాఖ్య(ఈయూ)తో మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ముగిసింది. బ్యాంకులు, మెటల్ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 81,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 127 పాయింట్లు బలపడి 25,175 వద్ద నిలిచింది.⇒ దేశీయ ఆటో రంగ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. భారత్–ఈయూల మధ్య కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు చౌకగా లభించనున్నాయి. దీంతో మార్కెట్లో మరింత పోటీతత్వం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా మహీంద్రాఅండ్మహీంద్రా 4%, హ్యుందాయ్ మోటార్స్ 4% పతనమయ్యాయి. మారుతీ సుజుకీ 1.50%, టాటా మోటార్స్ పీవీ 1.22%, ఎంఆర్ఎఫ్ 1.20%, అశోక్ లేలాండ్ 0.50% నష్టపోయాయి. ⇒ ఈయూతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్, హోమ్ టెక్స్టైల్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గి ఎగుమతులు మరింత పెరగొచ్చనే ఆశావహ అంచనాలతో దేశీయ టెక్స్టైల్స్ కంపెనీ షేర్లకు డిమాండ్ నెలకొంది. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, కేఆర్పీ మిల్స్ 6% ర్యాలీ చేశాయి. వెల్స్పన్ లివింగ్ 4.22%, అలోక్ ఇండస్ట్రీస్ 2.50%, ట్రిడెంట్ 2%, అరవింద్ అరశాతం లాభపడ్డాయి. భారత టెక్స్టైల్, రెడీమేడ్ వ్రస్తాల ఎగుమతులకు అమెరికా తర్వాత యూరోపియన్ యూనియన్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.77 పాయింట్ల లాభంతో.. 81,857.48 వద్ద, నిఫ్టీ 126.75 పాయింట్ల లాభంతో 25,175.40 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ లిమిటెడ్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, కామధేను లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వన్సోర్స్ స్పెషాలిటీ ఫార్మా లిమిటెడ్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్, SBFC ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
25,100 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ(Nifty) 104 పాయింట్లు పెరిగి 25,152 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు పుంజుకొని 81,771 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 27-01-2026(time: 9:32 am)ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 769.66 పాయింట్ల నష్టంతో 81,537.70 వద్ద, నిఫ్టీ 241.25 పాయింట్ల నష్టంతో 25,048.65 వద్ద నిలిచాయి.ధంపూర్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, ఎవరెస్ట్ కాంటో సిలిండర్ లిమిటెడ్, బైడ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.45 పాయింట్ల (0.59 శాతం) లాభంతో 82,389.08 వద్ద, నిఫ్టీ 161.35 పాయింట్ల (0.64 శాతం) లాభంతో 25,318.85 వద్ద నిలిచాయి.బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ట్రాన్స్వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఫిజిక్స్ వాలా లిమిటెడ్, అక్ష్ ఆప్టిఫైబర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. షేఖావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్, హ్యూబాచ్ కలరెంట్స్ ఇండియా లిమిటెడ్, IIFL ఫైనాన్స్ లిమిటెడ్, పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం వరుసగా మూడవ సెషన్లోనూ క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 270.84 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 81,909.63 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 75 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టపోయి 25,157.5 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.9 శాతం క్షీణించాయి. -
మార్కెట్ క్రాష్ ఈరోజూ కొనసాగుతుందా?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు తగ్గి 25,242 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 31 పాయింట్లు నష్టపోయి 82,127 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి మార్కెట్ సెషన్లో సూచీలు దారుణంగా పడిపోయాయి.నిన్నటి స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.Today Nifty position 21-01-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రాష్ మార్కెట్
ముంబై: అమెరికా, ఐరోపా దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ అనిశ్చితి దలాల్ స్ట్రీట్ను వణికించాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పతనం ప్రతిబంధకాలయ్యాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,066 పాయింట్లు పతనమైన 83 వేల స్థాయి కింద 82,180 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 25,232 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. మార్కెట్ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సందగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.465 లక్షల కోట్ల నుంచి రూ.455 లక్షల కోట్లకు దిగివచి్చంది. రోజంతా నష్టాల ట్రేడింగ్: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఏ దశలోనూ కోలుకోలేక రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,235 పాయింట్లు క్షీణించి 82,011 వద్ద, నిఫ్టీ 414 పాయింట్లు కుప్పకూలి 25,171 వద్ద కనిష్టాలు తాకాయి. హెచ్డీఎఫ్సీ షేరుకు మాత్రమే లాభాలు సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు మాత్రమే 0.38% స్వల్ప లాభంతో గట్టెక్కింది. ఇదే సూచీలో ఎటర్నల్ 4%, బజాజ్ ఫైనాన్స్ 3.88% సన్ఫార్మా 3.68%, బజాజ్ ఫిన్సర్వ్ 3.05%, ఇండిగో 3% అత్యధికంగా నష్టపోయిన టాప్ 5 షేర్లు. అన్ని రంగాల ఇండెక్సులు డీలామార్కెట్లోని విస్తృత స్థాయి అమ్మకాలతో బీఎస్ఈలో అన్ని రంగాల ఇండెక్సులు డీలాపడ్డాయి. రియల్టీ 5.21%, సర్వీసెస్ 3%, క్యాపిటల్ గూడ్స్ 2.76%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.73%, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.71%, టెలికమ్యూనికేషన్ 2.42%, ఆటో 2.36%, విద్యుత్ 2.23 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.74%, 2.52 శాతం క్షీణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనం ట్రంప్ టారిఫ్ భయాలు, గ్లోబల్ టారిఫ్విధానంపై అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లూ నష్టాల్లో ట్రేడయ్యాయి. చైనా, జపాన్, సింగపూర్, హాంగ్కాంగ్ మార్కెట్లు 1.50% నుంచి 0.50% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% క్షీణించాయి. అమెరికా స్టాక్ సూచీలు ఒకటిన్నరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నష్టాలకు 4 కారణాలుసూచీలకు ఐటీ షేర్ల పోటు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ల కారణంగా ఐటీ రంగ కంపెనీలు డిసెంబర్ త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. బలహీన ఆదాయాల ప్రకటనతో విప్రో 3%, ఎల్టీఐ మైండ్ట్రీ 7%, ఇన్ఫోసిస్ 1%, టీసీఎస్ 2% నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ ఏకంగా 3% పతనమైంది. ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. ట్రంప్ టారిఫ్ బెదిరింపులు గ్రీన్లాండ్ విషయంలో తనకు సహకరించకుంటే వాణిజ్య సుంకాలు విధిస్తానని యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ టారిఫ్ వార్ భయాలు మార్కెట్లలో మొదలయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. విదేశీ ఇన్వెస్టర్ల టేకాఫ్ మూడ్భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ ఆగడంలేదు. సోమ, మంగళవారాల్లో రూ.6,200 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో 11వ రోజూ అమ్మకాలు కొనసాగాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలహీన పడి జీవిత కాల కనిష్ట ముగింపు 90.97 వద్ద ముగిసింది. పెరిగిన క్రూడ్; వీఐఎక్స్ ఇండెక్స్అంతర్జాతీయంగా బ్రెంట్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు రేకెత్తాయి. మరోవైపు ఈక్విటీ మార్కెట్లో అనిశి్చతిని సూచించే వీఐఎక్స్ ఇండెక్సు 4% పెరిగి 12.34 వద్దకు చేరుకుంది. దీనికి తోడు మంగళవారం ‘నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ’ కారణంగా భారీ ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్ల సంపద ఆవిరి!
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో ఒక్క రోజులోనే మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది. ఆర్తి సర్ఫ్యాక్టెంట్స్ లిమిటెడ్, పటేల్ రిటైల్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, అంజని పోర్ట్ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారత్ రసయాన్ లిమిటెడ్, ఆల్మండ్జ్ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్, బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
25,500 మార్కు కిందకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 93 పాయింట్లు తగ్గి 25,493 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 288 పాయింట్లు నష్టపోయి 82,967 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 20-01-2026(time: 9:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 324.17 పాయింట్ల నష్టంతో 83,246.18 వద్ద, నిఫ్టీ 108.85 పాయింట్ల నష్టంతో 25,585.50 వద్ద నిలిచాయి.భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఏఎండీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిందాల్ సా లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్ప్రింట్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ (ఇండియా) లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, డిలిజెంట్ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
25,500 మార్కు వద్దకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు తగ్గి 25,545 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 449 పాయింట్లు నష్టపోయి 83,116 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 19-01-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 187.64 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 83,570.91 వద్ద, నిఫ్టీ 28.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,694.90 వద్ద నిలిచాయి.అజ్మీరా రియాల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆసోమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, వర్ధమాన్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రామా ఫాస్ఫేట్స్ లిమిటెడ్, HBL ఇంజనీరింగ్ లిమిటెడ్, L&T టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,693 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 146 పాయింట్లు నష్టపోయి 83,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.25 శాతం పుంజుకుంది.Today Nifty position 16-01-2026(time: 9:19 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 47 పాయింట్లు తగ్గి 25,692 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 155 పాయింట్లు నష్టపోయి 83,468 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.16బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.19 శాతం తగ్గింది.నాస్డాక్ 0.1 శాతం నష్టపోయింది.Today Nifty position 14-01-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిలకడగా నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో కదలాడుతున్నాయి. దాంతో ఇటీవలి వరుస నష్టాలకు ఈరోజుతో బ్రేక్ పడినట్లయింది. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,832 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 101 పాయింట్లు పుంజుకొని 83,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.94బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.07 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.16 శాతం పెరిగింది.నాస్డాక్ 0.26 శాతం పుంజుకుంది.Today Nifty position 13-01-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గడిచిన సెషన్లోనూ నష్టాల్లోకి జారుకున్న సూచీలు ఈరోజు ఉదయం 9:58 సమయానికి నిఫ్టీ(Nifty) 116 పాయింట్లు తగ్గి 25,567 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 425 పాయింట్లు నష్టపోయి 83,151 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.95బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.16 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.65 శాతం పెరిగింది.నాస్డాక్ 0.82 శాతం పుంజుకుంది.Today Nifty position 12-01-2026(time: 9:59 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 604.72 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 83,576.24 వద్ద, నిఫ్టీ 193.55 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 25,683.30 వద్ద నిలిచాయి.ఆసోమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, యాషో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆకాష్ ఇన్ఫ్రా-ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎలెకాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రాజ్రతన్ గ్లోబల్ వైర్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, అహ్లాదా ఇంజనీర్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్
వరుస నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 780.18 పాయింట్ల నష్టంతో 84,180.96 వద్ద, నిఫ్టీ 263.90 పాయింట్ల నష్టంతో 25,876.85 వద్ద నిలిచాయి.ఆకాష్ ఇన్ఫ్రా-ప్రాజెక్ట్స్ లిమిటెడ్, జిందాల్ ఫోటో లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, యాషో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్
బీఎస్ఈ ఎక్స్ఛేంజ్లోని బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 2026 డిసెంబర్ నాటికి 93,918 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ క్లయింట్ అసోసియేట్స్ అంచనా వేసింది. అంటే సెన్సెక్స్ ప్రస్తుత స్థాయి (84,961)తో పోలిస్తే 11% పెరిగే వీలుందని అభిప్రాయపడింది.‘‘దేశీయ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. కార్పొరేట్ ఆదాయాల అవుట్లుక్ మెరుగ్గానే ఉన్నాయి. అయితే షేర్ల వాల్యుయేషన్లు అధికంగా ఉండటం, అంతర్జాతీయ అనిశి్చతుల కారణంగా ఇన్వెస్టర్లు ‘క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి’ వ్యూహాన్ని అనుసరించవచ్చు. దీంతో ఈ ఏడాది భారతీయ మార్కెట్ విస్తృత స్థాయి ర్యాలీలకు స్వస్తి పలికి.., ఎంపిక చేసుకున్న, ఫండమెంటల్ ఆధారిత అవకాశాల దిశగా అడుగులు వేయోచ్చు’’ అని సంస్థ రీసెర్చ్ హెడ్ నితిన్ అగర్వాల్ తెలిపారు.రిస్క్ అంచనాలను మెరుగుపరుచుకుంటూ.., సరైన డైవర్సిఫికేషన్ విధానాలను అనుసరిస్తే ధీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు ప్రధాన వనరులుగా కొనసాగుతాయని అగర్వాల్ పేర్కొన్నారు.ఇంకా 2026కి సంబంధించిన క్లయింట్ అసోసియేట్స్ వార్షిక ఈక్విటీ అంచనా నివేదికలో.... పోర్ట్ఫోలియో వైవిద్యీకరణలో బంగారం, వెండి కీలకం. డాలర్ బలహీనత, భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాల్లో మార్పుల కారణంగా గతేడాదిలో విలువైన లోహాలు భారీ రాబడులు ఇచ్చాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం డిమాండి పెరిగి, వ్యూహాత్మక పెట్టుబడి సాధనగా పసిడి ప్రాధాన్యం మరింత పెరిగింది. అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు, అమెరికా–చైనా ఉద్రిక్తతలు, వెండిని కూడా కీలక లోహంగా గుర్తించే చర్చల నేపథ్యంలో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్ వృద్ధి అవుట్లుక్ మెరుగ్గానే ఉంది. బలమైన డిమాండ్, తయారీ–సేవల రంగ విస్తరణ, స్థిరమైన జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదవ్వొచ్చు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మాదిరిగానే.. బుధవారం కూడా నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 92.45 పాయింట్ల నష్టంతో.. 84,970.90 వద్ద, నిఫ్టీ 35.15 పాయింట్ల నష్టంతో 26,143.55 వద్ద నిలిచాయి.జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, అహ్లాదా ఇంజనీర్స్ లిమిటెడ్, ఎన్ఐబిఎల్ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఓరియంట్ సెరాటెక్ లిమిటెడ్, ఇన్క్రెడిబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 376.27 పాయింట్ల నష్టంతో 85,063.34 వద్ద, నిఫ్టీ 74.70 పాయింట్ల నష్టంతో 26,175.60 వద్ద నిలిచాయి.శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్, గోయల్ అల్యూమినియంస్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిస్టమ్మాటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్, ట్రెంట్ లిమిటెడ్, రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా స్వల్ప నష్టాల్లో ప్రారంభమై.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నిఫ్టీ(Nifty) 90.60 పాయింట్లు నష్టంతో 26,237.95 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 351.07 పాయింట్లు క్షీణించి 85,410.94 వద్ద నిలిచాయి.రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్, బిపిఎల్ లిమిటెడ్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ లిమిటెడ్, క్రితి న్యూట్రియంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్యుపిడ్ లిమిటెడ్, వివిమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్డెకో హౌసింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 573.41 పాయింట్లు లేదా 0.67 శాతం లాభంతో 85,762.01 వద్ద, నిఫ్టీ 182.00 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 26,328.55 వద్ద నిలిచాయి.రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్, బీపీఎల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్, కృతి న్యూట్రియంట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, క్యుపిడ్, వివిమెడ్ ల్యాబ్స్, కిరి ఇండస్ట్రీస్, ఎల్డెకో హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్ అప్డేట్: లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 333.44 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 85,522.04 వద్ద, నిఫ్టీ 105.60 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 26,252.15 వద్ద కొనసాగుతున్నాయి.స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్, సింటర్కామ్ ఇండియా, కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, లాసా సూపర్జెనరిక్స్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వివిమెడ్ ల్యాబ్స్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఒసియా హైపర్ రిటైల్ లిమిటెడ్, నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, కిరి ఇండస్ట్రీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
బుధవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ఉదయం కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 209.55 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 85,430.15 వద్ద, నిఫ్టీ 63.95 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 26,193.55 వద్ద కొనసాగుతున్నాయి.కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, పనామా పెట్రోకెమ్, లాసా సూపర్జెనరిక్స్, పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు లాభాల బాట పట్టగా.. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, వివిమెడ్ ల్యాబ్స్, ఐటీసీ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 544.66 పాయింట్లు లేదా 0.64 శాతం లాభంతో 85,219.74 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 26,136.35 వద్ద నిలిచింది.కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, ఆస్పిన్వాల్ అండ్ కంపెనీ, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్, కిరి ఇండస్ట్రీస్, ఓరియంట్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రివి స్పెషాలిటీ కెమికల్స్, వోడాఫోన్ ఐడియా, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మళ్లీ 26,000 మార్కుపైకి నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 69 పాయింట్లు పెరిగి 26,009 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు పుంజుకొని 84,877 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 31-12-2025(time: 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం.. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ 103.16 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 84,798.70 వద్ద, నిఫ్టీ 27.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,969.85 వద్ద నిలిచాయి.ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, ఓరియంట్ టెక్నాలజీస్, ఓరియంట్ సెరాటెక్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పావ్నా ఇండస్ట్రీస్, మోదీ రబ్బర్ లిమిటెడ్, ప్రకాష్ స్టీలేజ్, నందని క్రియేషన్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 48 పాయింట్లు నష్టంతో 25,895 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 పాయింట్లు తగ్గి 84,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.04బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 61.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.11 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.35 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.5 శాతం తగ్గింది.Today Nifty position 30-12-2025(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 345.91 పాయింట్లు, లేదా 0.41 శాతం నష్టంతో 84,695.54 వద్ద, నిఫ్టీ 100.20 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 25,942.10 వద్ద నిలిచాయి.ప్రకాష్ స్టీలేజ్, రాజనందిని మెటల్, కంట్రీ కాండోస్ లిమిటెడ్, ఓరియంట్ బెల్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మోడీ రబ్బరు, బ్రూక్స్ లాబొరేటరీస్, టీమో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
26 వేల మార్కు వద్దే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు లాభంతో 26,056 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 17 పాయింట్లు పెరిగి 85,061 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 29-12-2025(time: 9:24)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్.. నష్టాల ముగింపు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం నష్టాలలో ముగిశాయి. ఐటీ, ఆటో స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి, సెన్సెక్స్ గడువు ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మందగించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 367.25 పాయింట్లు లేదా 0.43 శాతం నష్టపోయి 85,041.45 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 99.80 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 26,042.30 వద్ద స్థిరపడింది.టైటాన్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ బీఎస్ఈలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్స్.ఎన్ఎస్ఈలో టైటాన్, హిండాల్కో, నెస్లే ఇండియా టాప్ విన్నర్లుగా ఉండగా, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు కూడా ప్రతికూలంగానే ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.23 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.08 శాతం నష్టపోయాయి. సెక్టార్ వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 1.03 శాతం, ఆటో 0.52 శాతం నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ మెటల్ 0.59 శాతం లాభంతో ముగిసింది. -
26,000 మార్కు వద్దకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 56 పాయింట్లు నష్టంతో 26,086 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు దిగజారి 85,209 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 26-12-2025(time: 9:50am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 43 పాయింట్లు కోల్పోయి 85,525 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అయిదు పాయింట్లు పెరిగి 26,177 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ రోజు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 85,343 – 85,705 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 26,119 వద్ద కనిష్టాన్ని, 26,234 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 0.71%, రియల్టీ 0.21%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.10% నష్టపోయాయి. మరోవైపు కమోడి టీస్ 0.68%, వినిమయ 0.59%, మెటల్ 0.52%, విద్యుత్ 0.40%, ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఇంధన 0.36% లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.38%, 0.07% పెరిగాయి. ⇒ తన అనుబంధ సంస్థలు ఏసీసీ లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్స్ కంపెనీల విలీనానికి అంబుజా సిమెంట్స్ సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ షేరు 4.40% పెరిగి రూ.171 వద్ద ముగిసింది. ఒక దశలో 10% పెరిగి రూ.180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంబుజా సిమెంట్స్ షేరు 1.25% పెరిగి రూ.547 వద్ద స్థిరపడింది. ఒక దశలో 4.30% లాభపడి రూ.563 వద్ద గరిష్టాన్ని తాకింది. ఏసీసీ షేరు 1.21% నష్టపోయి రూ.1,754 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.50% పతనమై రూ.1,802 కనిష్టాన్ని తాకింది. ⇒ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.384)తో బీఎస్ఈలో 3.50% డిస్కౌంటుతో రూ.370 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 9% క్షీణించి రూ.350 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 8% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 65.43 పాయింట్లు లేదా 0.076 శాతం నష్టంతో 85,502.05 వద్ద, నిఫ్టీ 6.35 పాయింట్లు లేదా 0.024 శాతం నష్టంతో 26,166.05 వద్ద నిలిచాయి.ఓమాక్స్, మోడీ రబ్బర్ లిమిటెడ్, టీమో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్, ప్రిజం జాన్సన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ష్రెనిక్ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విన్నీ ఓవర్సీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 27 పాయింట్లు నష్టంతో 26,144 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 128 పాయింట్లు దిగజారి 85,434 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 23-12-2025(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 638.12 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 85,567.48 వద్ద, నిఫ్టీ 195.20 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 26,161.60 వద్ద నిలిచాయి.క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, జూపిటర్ వ్యాగన్స్, ష్రెనిక్, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, సద్భావ్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, దావణగెరె షుగర్ కంపెనీ, ఆర్వీ లాబొరేటరీస్, మీషో లిమిటెడ్, రిలయన్స్ పవర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
26,100 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు లాభంతో 26,128 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 484 పాయింట్లు పుంజుకొని 85,408 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 22-12-2025(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 447.55 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 84,929.36 వద్ద, నిఫ్టీ 150.85 పాయింట్లు లేదా 0.58 శాతం లాభంతో 25,966.40 వద్ద నిలిచాయి.ఆర్వీ లాబొరేటరీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్, జీ లెర్న్, ప్రెసిషన్ కామ్షాఫ్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఉగార్ షుగర్ వర్క్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, భగీరధ్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్, అవధ్ షుగర్ & ఎనర్జీ, ది వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 147 పాయింట్లు లాభంతో 25,961 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 488 పాయింట్లు పుంజుకొని 84,976 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.46బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 59.68 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.13 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.79 శాతం పెరిగింది.నాస్డాక్ 1.38 శాతం పుంజుకుంది.Today Nifty position 19-12-2025(time: 09:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
534 పాయింట్లు డౌన్
ముంబై: వాణిజ్య లోటు పెరుగుతుండటం, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత తదితర అంశాల కారణంగా రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతోంది. తాజాగా ఇంట్రాడేలో 91 మార్కును దాటేసింది. చివరికి డాలరుతో పోలిస్తే మరో 15 పైసలు క్షీణించి 90.93 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే ఇంట్రాడేలో 36 పైసల క్షీణతతో 91.14 స్థాయిని కూడా తాకింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలోనే రూపాయి మారకం విలువ 90 నుంచి 91కి పడిపోయింది. గత అయిదు సెషన్లలో ఏకంగా 1 శాతం పతనమైంది. ఈ నెలలోనే 92 మార్కును కూడా దాటేయొచ్చని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఈడీ అనిల్ కుమార్ భన్సాలీ తెలిపారు. ఈ ఏడాది 5.1 శాతం డౌన్.. రాజ్యసభలోనూ ఈ అంశం చర్చకు రాగా, డేటా ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 3 వరకు రూపాయి విలువ 5.1 శాతం క్షీణించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. వాణిజ్య లోటు, అమెరికా–భారత్ ఒప్పందానికి సంబంధించిన పరిణామాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. అయితే, రూపాయి పతనంతో ఎగుమతులపరంగా పోటీతత్వం మెరుగుపడొచ్చని, ఇది ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. డేటా ప్రకారం డాలరుతో పోలిస్తే రూపాయి 2015లో 4.5 శాతం, 2016లో 2.6 శాతం క్షీణించగా, 2017లో 6.4 శాతం పెరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం క్షీణత కొనసాగింది. 91కి జారిన రూపాయిముంబై: విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ డీలాపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేమి, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 91 స్థాయిని బ్రేక్ చేయడం ఇన్వెస్టర్లను కలవరపరిచింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 84,680 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167 పాయింట్లు కోల్పోయి 25,860 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు, అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో రోజంతా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 592 పాయింట్లు క్షీణించి 84,621 వద్ద, నిఫ్టీ 193 పాయింట్లు పతనమై 25,834 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రమే రాణించాయి. రియల్టీ 1.36%, బ్యాంకెక్స్ 1.03%, కమోడిటీస్ 0.91%, ఐటీ 0.90%, ఐటీ 0.86%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83%, మెటల్ 0.82 శాతం నష్టపోయాయి. మిడ్క్యాప్ ఇండెక్సు 0.78%, స్మాల్క్యాప్ సూచీ 0.69% పతనమయ్యాయి. ∙యాక్సిస్ బ్యాంకు షేరు 5% పతనమై రూ.1,220 వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ వరకూ నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సిటి ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ షేరు పడింది. -
రెండోరోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 533.50 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 84,679.86 వద్ద, నిఫ్టీ 167.20 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 25,860.10 వద్ద నిలిచాయి.అసహి సాంగ్వాన్ కలర్స్, అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్, అగ్రి టెక్ ఇండియా, ఈప్యాక్ డ్యూరబుల్స్, న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సలోనా కాట్స్పిన్, ఆర్వీ లాబొరేటరీస్, విపుల్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎల్జీ రబ్బరు వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:12 సమయానికి నిఫ్టీ(Nifty) 138 పాయింట్లు తగ్గి 25,890కు చేరింది. సెన్సెక్స్(Sensex) 464 పాయింట్లు నష్టపోయి 84,748 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 16-12-2025(time: 10:12 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 84.00 పాయింట్లు లేదా 0.099 శాతం నష్టంతో 85,183.66 వద్ద, నిఫ్టీ 19.65 పాయింట్లు లేదా 0.075 శాతం నష్టంతో 26,027.30 వద్ద నిలిచాయి.కరోనా రెమెడీస్ లిమిటెడ్, తైన్వాలా కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ (ఇండియా), టీవీ విజన్, రిఫెక్స్ ఇండస్ట్రీస్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మనీబాక్స్ ఫైనాన్స్ లిమిటెడ్, వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమర్షియల్స్, G-Tec Jainx ఎడ్యుకేషన్, ఎంబసీ డెవలప్మెంట్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పడిలేచిన కెరటంలా నిఫ్టీ సూచీ
ఏడాదిలో ఇక్విటీ రిటైలర్లను నిఫ్టీ సూచీ ఓ ఆట ఆడేసుకొని చివరకు గరిష్టాలను చేరుకుంది. మొదటి త్రైమాసికంలో నష్టాల్లో ఉన్న నిఫ్టీ సూచీ ఏడాది చివరినాటికి జీవితకాల గరిష్టాలను చేరింది. అందుకు దేశీయంగా, అంతర్జాతీయంగా చాలా కారణాలున్నాయి. ఏడాదిలో చోటుచేసుకున్న చాలా పరిణామాల వల్ల నిఫ్టీ కదలికలపై ఇయర్ ఎండర్ రివ్యూ.భారత స్టాక్ మార్కెట్లకు ప్రధాన కొలమానమైన నిఫ్టీ 50 సూచీకి 2025 సంవత్సరం రికార్డుల ఇయర్గా మిగిలింది. జనవరి 1, 2025న సూచీ ప్రారంభ విలువతో పోలిస్తే ఏడాది ముగిసే నాటికి(డిసెంబర్ 12 వరకు) నిఫ్టీ సుమారు 18.5% నికర వృద్ధిని నమోదు చేసింది. ఇది ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ), దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) నుంచి భారీ నిధుల ప్రవాహానికి, స్థూల ఆర్థిక వ్యవస్థలో ఆశాజనకమైన వృద్ధి అంచనాలకు నిదర్శనం.సంవత్సరం మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) నిఫ్టీ సూచీలో సుమారు 4% తగ్గుదల కనిపించింది. అందుకు ప్రధానంగా అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ఆందోళనలు కారణం అయ్యాయి. అయితే, ఏప్రిల్ నుంచి సంవత్సరం చివరి వరకు నిఫ్టీ స్థిరంగా కదలాడుతూ పండుగ సీజన్, కార్పొరేట్ ఆదాయాల ఆశాజనక అంచనాలతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను తాకింది.నిఫ్టీ కదలికలపై ప్రభావం చూపిన కీలక అంశాలుభౌగోళిక-రాజకీయ అంశాలుఎర్ర సముద్రంలో కొనసాగిన ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీశాయి. ఇది ముడి చమురు ధరలను పెంచి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తెచ్చింది. తద్వారా నిఫ్టీ ఏడాది ప్రారంభంలో తగ్గుదలకు కారణమైంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నికల ప్రభావం వాటి ఆర్థిక విధానాలపై ప్రభావం చూపవచ్చనే అనిశ్చితి నెలకొనడం వల్ల స్వల్పకాలికంగా మార్కెట్లో అస్థిరత ఏర్పడింది.దేశీయ ఆర్థిక పరిస్థితులు2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి అంచనాలు 6.8% - 7.0% మధ్య ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దాంతో దేశీయ డిమాండ్లో స్థిరత్వం మార్కెట్ సెంటిమెంట్ను బలోపేతం చేసింది.ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల నుంచి ఆశాజనకమైన త్రైమాసిక ఆదాయాలు (క్యూ1 నుంచి క్యూ3 వరకు) నిఫ్టీకి మద్దతునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరమైన వృద్ధి బ్యాంకింగ్ సూచీని కొత్త శిఖరాలకు చేర్చింది.అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ 2025 ద్వితీయార్థంలో ఆర్బీఐ కీలక రేట్లలో మార్పులు చేయడం వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.యూఎస్ సుంకాలు, వాణిజ్య విధానాలుయూఎస్, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా అనేక అంతర్జాతీయ తయారీ కంపెనీలు తమ దృష్టిని భారతదేశం వైపు మళ్లించాయి. ఈ ‘చైనా ప్లస్ వన్’ వ్యూహం కారణంగా భారతదేశ ఎగుమతి ఆధారిత రంగాల్లో (ముఖ్యంగా కెమికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్) బలమైన వృద్ధి అంచనాలు నిఫ్టీ వృద్ధికి దోహదపడ్డాయి.ఫెడ్ వడ్డీ రేట్ల స్థిరీకరణ2025 చివరిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటానికి, భారత మార్కెట్లోకి ఎఫ్ఐఐల ప్రవాహం పెరగడానికి దారితీసింది.జీఎస్టీ సవరణలు2025-26 కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాలపై భారీ కేటాయింపులు, తయారీ రంగానికి ఉద్దీపనలు ఇవ్వడం వల్ల క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ వంటి రంగాలు లాభపడ్డాయి. 2025 మధ్యలో జీఎస్టీ కౌన్సిల్ కొన్ని కీలకమైన రంగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించింది. ఈ నిర్ణయం వినియోగదారుల ఖర్చులకు ఊతమివ్వడం, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం ద్వారా మార్కెట్కు సానుకూల అంశంగా మారింది.ఇదీ చదవండి: చాట్జీపీటీలో డిస్నీ పాత్రలు -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు తగ్గి 25,736కు చేరింది. సెన్సెక్స్(Sensex) 81 పాయింట్లు నష్టపోయి 84,332 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 11-12-2025(time: 9:20 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock market: మూడోరోజూ డీలా
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత, బ్లూ చిప్(అధిక వెయిటేజీ) షేర్లలో షేర్లలో విక్రయాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 504 పాయింట్లు నష్టపోయి 85,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు కోల్పోయి 26,032 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి.ఒక దశలో సెన్సెక్స్ 589 పాయింట్లు కోల్పోయి 85,053 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు పతనమై 25,998 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఫైనాన్సియల్, సర్విసెస్, బ్యాంకులు, ఇండ్రస్టియల్స్, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెలికం, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.49%, 0.14% నష్టపోయాయి. జపాన్ కీలక వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్లలో అమ్మకాలు, క్రిప్టో కరెన్సీ పతనంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి.వరుస అయిదు ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ.9,642 కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. మంగళవారం ఒక్కరోజే రూ.3,642 కోట్ల షేర్లను అమ్మేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు(–1.25%), రిలయన్స్ ఇండస్ట్రీస్(–1.25%), ఐసీఐసీఐ బ్యాంకు(–1.25%), ఎల్అండ్టీ(–1%), యాక్సిస్ బ్యాంకు (–1.29%)శాతం నష్టపోయి ఇండెక్సు పతనానికి ప్రధాన కారణమయ్యాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 503.62 పాయింట్లు లేదా 0.59 శాతం నష్టంతో.. 85,138.27 వద్ద, నిఫ్టీ 143.55 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 26,032.20 వద్ద నిలిచాయి.సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ, టిప్స్ ఫిల్మ్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, ఆల్పా లాబొరేటరీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీతి ఇంటర్నేషనల్, జేహెచ్ఎస్ స్వెండ్గార్డ్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, విజి ఫైనాన్స్ లిమిటెడ్, ష్రెనిక్, అనిక్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market Updates: గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 27 పాయింట్లు తగ్గి 26,146కు చేరింది. సెన్సెక్స్(Sensex) 146 పాయింట్లు నష్టపోయి 85,488 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 02-12-2025(time: 9:33 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆల్టైమ్ గరిష్ఠాలను చేరిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 97 పాయింట్లు పెరిగి 26,299కు చేరి ఆల్టైమ్ గరిష్టాలను తాకింది. సెన్సెక్స్(Sensex) 335 పాయింట్లు పుంజుకొని 86,018 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 01-12-2025(time: 09.39am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.71 పాయింట్లు లేదా 0.016 శాతం నష్టంతో 85,706.67 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్లు లేదా 0.048 శాతం నష్టంతో 26,202.95 వద్ద నిలిచాయి.సుదీప్ ఫార్మా లిమిటెడ్, నెక్టార్ లైఫ్ సైన్సెస్, మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్, 63 మూన్స్ టెక్నాలజీస్, రికో ఆటో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మాగెల్లానిక్ క్లౌడ్, యాథార్త్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్, ఇండో యుఎస్ బయో-టెక్, క్రియేటివ్ ఐ, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 37 పాయింట్లు లేదా 0.04 శాతం నష్టపోయి 85,683 వద్ద ఉండగా, నిఫ్టీ 25 పాయింట్లు లేదా 0.10 శాతం తగ్గి 26,190 వద్ద ఉంది.బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండు సూచీలు గురువారం ఇంట్రాడే ట్రేడింగ్ లో తాజా ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. మొదటిసారిగా సెన్సెక్స్ 86,000, నిఫ్టీ 26,300 స్థాయిలను అధిగమించాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం పడిపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ ఆల్టైమ్ హిట్!
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ సరికొత్త రికార్డు గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఇండెక్స్ 26,295.55 వద్ద కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. 2024 సెప్టెంబర్ 27 నాటి దాని మునుపటి రికార్డు గరిష్ట స్థాయి 26,277 హిట్ను అధిగమించింది. కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకునేందుకు నిఫ్టీ 50 ఇండెక్స్కు 287 సెషన్లు పట్టింది.ఉదయం 9:41 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 189 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 85,799 వద్ద ఉంది. నిఫ్టీ 52 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 26,251 వద్ద ట్రేడవుతున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం పెరిగాయి.సెక్టార్లలో, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగి ఎన్ఎస్ఈలో ప్రధాన లాభం పొందింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 0.35 శాతం లాభపడి రెండో స్థానంలో నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.4 శాతం పెరిగి 59,802.65 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. -
లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలలోకి వచ్చాయి. భారత బెంచ్ మార్క్ సూచీలు క్రితం రోజు నష్టాల నుంచి పుంజుకొని లాభాల్లో కదులుతున్నాయి. ఉదయం 9.30 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 298 పాయింట్లు లేదా 0.35 శాతం లాభపడి 84,885 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 100 పాయింట్లు లేదా 0.39 శాతం పెరిగి 25,985 వద్ద ట్రేడవుతున్నాయి.టాటా మోటార్స్ పీవీ, ట్రెంట్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ ఎం ఈరోజు సెన్సెక్స్ లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. భారతీ ఎయిర్ టెల్, హెచ్యూఎల్, టీసీఎస్ మాత్రమే నష్టపోయాయి. డిసెంబర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై మదుపరులు ఆశావాద దృక్పథంతో ప్రపంచ మార్కెట్లు వరుసగా మూడవ రోజు లాభాలను కలిగి ఉన్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం పెరిగాయి.రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.7 శాతం లాభంతో ర్యాలీలో ముందంజలో ఉంది. నిఫ్టీ పీఎస్యూూ బ్యాంక్ ఇండెక్స్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 0.8 శాతం వరకు లాభపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ లూజర్..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నవంబర్ సిరీస్కు సంబంధించి నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల నెలవారీ గడువు ముగింపు ఒత్తిడితో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 క్షీణించాయి.సెషన్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 313.7 పాయింట్లు లేదా 0.37 శాతం నష్టపోయి 84,587.01 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 74.7 పాయింట్లు లేదా 0.29 శాతం తగ్గి 25,884.8 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లో ట్రెంట్, టాటా మోటార్స్ పీవీ, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్గా మిగిలిపోగా బీఈఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎటర్నల్ టాప్ గెయినర్స్ లో చోటు దక్కించుకున్నాయి.రంగాలవారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకులు వరుసగా 1.62 శాతం, 1.44 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ 0.57 శాతం, నిఫ్టీ మీడియా 0.8 శాతం క్షీణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.36 శాతం, 0.19 శాతం లాభపడ్డాయి. -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 13.64 పాయింట్ల లాభంతో 84,914.35 వద్ద, నిఫ్టీ 7.00 పాయింట్ల లాభంతో.. 25,966.50 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ క్రౌన్ లిఫ్టర్స్, జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, పావ్నా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు చేరగా.. బీఐఎల్ వ్యాపార్ లిమిటెడ్, RKEC ప్రాజెక్ట్స్, విన్నీ ఓవర్సీస్ లిమిటెడ్, అగ్రి-టెక్ (ఇండియా), క్యాపిటల్ ట్రస్ట్ వంటి కంపెనీలు నష్టాల బాట పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 445.06 పాయింట్లు లేదా 0.52 శాతం నష్టంతో 84,786.86 వద్ద, నిఫ్టీ 108.65 పాయింట్లు లేదా 0.42 శాతం నష్టంతో.. 25,959.50 వద్ద నిలిచాయి.RKEC ప్రాజెక్ట్స్, జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, విఎల్ఎస్ ఫైనాన్స్, NRB ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మంగళం డ్రగ్స్ & ఆర్గానిక్స్, మాగెల్లానిక్ క్లౌడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, సుమిత్ వుడ్స్, యూరో ప్యానెల్ ప్రొడక్ట్స్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 400.76 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టంతో 85,231.92 వద్ద, నిఫ్టీ 129.95 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 26,062.20 వద్ద నిలిచాయి.అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, మాగెల్లానిక్ క్లౌడ్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, మాలు పేపర్ మిల్స్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), జైప్రకాష్ పవర్ వెంచర్స్, కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస లాభాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు సెషన్ల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్ సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 26,145కు చేరింది. సెన్సెక్స్(Sensex) 120 పాయింట్లు నష్టపోయి 85,518 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 21-11-2025(time:9:25am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market: 26వేల మార్కుపైన ముగిసిన నిఫ్టీ
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 446.21 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో.. 85,632.68 వద్ద, నిఫ్టీ 139.50 పాయింట్లు లేదా 0.54 శాతం లాభంతో 26,192.15 వద్ద నిలిచాయి.సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, లగ్నమ్ స్పింటెక్స్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, ప్రీమియర్ పాలీఫిల్మ్, వాస్వానీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. మాగెల్లానిక్ క్లౌడ్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ, మంగళం డ్రగ్స్ & ఆర్గానిక్స్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ వంటివి నష్టాలను చవిచూసాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో టెక్ షేర్లు పుంజుకున్న నేపథ్యంలో భారత స్టాక్ సూచీలు ఎగువన పయనిస్తున్నాయి. ఉదయం 9.26 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 134.43 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 85,320.90 వద్ద, ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ 38.65 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 26,091.30 వద్ద ట్రేడవుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మేజర్ ఎన్విడియా బలమైన త్రైమాసిక ఫలితాలను నివేదించింది. వాల్ స్ట్రీట్ ఆదాయాలు, ఆదాయ అంచనాలను అధిగమించింది. పర్యవసానంగా, ఆసియాలోని కీలక సూచీలు 4 శాతం వరకు పెరిగాయి. యూఎస్ బెంచ్ మార్క్ లు 0.1 శాతం నుండి 0.6 శాతం వరకు పెరిగాయి.దేశీయ మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు 0.3 శాతం పెరిగాయి. -
ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 278 పాయింట్లు కోల్పోయి 84,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 25,910 వద్ద నిలిచింది. దీంతో స్టాక్ సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లైంది. సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడవుతూ... ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 393 పాయింట్లు పతనమై 84,558 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 25,876 వద్ద కనిష్టాలు తాకాయి.డిసెంబర్లో యూఎస్ ఫెడరల్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు రేకెత్తడంతో పాటు టెక్నాలజీ రంగంలో అధిక వాల్యుయేషన్ల ఆందోళలనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియాలో జపాన్ 3.33%, కొరియా 3.43%, తైవాన్ 2.58%, హాంగ్కాంగ్ 2%, సింగపూర్, చైనా 1% క్షీణించాయి. యూరప్లో ఫ్రాన్స్ 1.7%, జర్మనీ 1.6%, బ్రిటన్ 1.3% నష్టపోయాయి.⇒ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో తాజాగా పీఈ సంస్థ సయిఫ్ పార్ట్నర్స్ 1.86 శాతం వాటా విక్రయించింది. దీంతో పేటీఎమ్లో సయిఫ్ వాటా 15.33 శాతం నుంచి 13.47 శాతానికి తగ్గింది. షేరుకి రూ. 1,305 సగటు ధరలో రూ. 1,556 కోట్లకు అమ్మివేసింది. పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో 3% పతనమై రూ. 1,293 వద్ద ముగిసింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 324.96 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 84,625.99 వద్ద, నిఫ్టీ 121.40 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టంతో 25,910.05 వద్ద నిలిచాయి.ఫిజిక్స్ వాలా లిమిటెడ్, సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ, బ్యాంగ్ ఓవర్సీస్, పన్సారి డెవలపర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్, పావ్నా ఇండస్ట్రీస్, సాండ్స్ పవర్ స్విచ్, పయనీర్ ఎంబ్రాయిడరీస్, రీటాన్ టీఎంటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు తగ్గి 25,952కు చేరింది. సెన్సెక్స్(Sensex) 185 పాయింట్లు నష్టపోయి 84,764 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 18-11-2025(time: 9:25am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


