 
													శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 465.75 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో.. 83,938.71 వద్ద, నిఫ్టీ 155.75 పాయింట్లు లేదా 0.60 శాతం నష్టంతో 25,722.10 వద్ద నిలిచాయి.
ఫైనోటెక్స్ కెమికల్, లాంకోర్ హోల్డింగ్స్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్, ది గ్రోబ్ టీ కంపెనీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, నెల్కాస్ట్, మాన్ అల్యూమినియం లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
