శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 152.29 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో.. 84,630.96 వద్ద, నిఫ్టీ 36.00 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 25,915.15 వద్ద నిలిచాయి.
ILandFS ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, ఆర్వి ఎన్కాన్, ఐపీసీఏ లాబొరేటరీస్, పైన్ ల్యాబ్స్ లిమిటెడ్, కెఆర్బిఎల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టోలిన్స్ టైర్స్, ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, వెల్త్ ఫస్ట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్, ఆల్కార్గో టెర్మినల్స్, మాస్టర్ ట్రస్ట్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


