మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 324.96 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 84,625.99 వద్ద, నిఫ్టీ 121.40 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టంతో 25,910.05 వద్ద నిలిచాయి.
ఫిజిక్స్ వాలా లిమిటెడ్, సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ, బ్యాంగ్ ఓవర్సీస్, పన్సారి డెవలపర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్, పావ్నా ఇండస్ట్రీస్, సాండ్స్ పవర్ స్విచ్, పయనీర్ ఎంబ్రాయిడరీస్, రీటాన్ టీఎంటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


