దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా స్వల్ప నష్టాల్లో ప్రారంభమై.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నిఫ్టీ(Nifty) 90.60 పాయింట్లు నష్టంతో 26,237.95 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 351.07 పాయింట్లు క్షీణించి 85,410.94 వద్ద నిలిచాయి.
రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్, బిపిఎల్ లిమిటెడ్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ లిమిటెడ్, క్రితి న్యూట్రియంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్యుపిడ్ లిమిటెడ్, వివిమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్డెకో హౌసింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు


