నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 15th Dec 2025 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Dec 15 2025 3:39 PM | Updated on Dec 15 2025 3:40 PM

Stock Market Closing Update 15th Dec 2025

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 84.00 పాయింట్లు లేదా 0.099 శాతం నష్టంతో 85,183.66 వద్ద, నిఫ్టీ 19.65 పాయింట్లు లేదా 0.075 శాతం నష్టంతో 26,027.30 వద్ద నిలిచాయి.

కరోనా రెమెడీస్ లిమిటెడ్, తైన్‌వాలా కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ (ఇండియా), టీవీ విజన్, రిఫెక్స్ ఇండస్ట్రీస్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మనీబాక్స్ ఫైనాన్స్ లిమిటెడ్, వెల్స్పన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ కమర్షియల్స్, G-Tec Jainx ఎడ్యుకేషన్, ఎంబసీ డెవలప్‌మెంట్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement