శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 344.52 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 84,211.88 వద్ద, నిఫ్టీ 93.90 పాయింట్లు లేదా 0.36 శాతం నష్టంతో 25,797.50 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ఈప్యాక్ ప్రిఫ్యాబ్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆరో గ్రీన్టెక్ లిమిటెడ్, రాజశ్రీ పాలీప్యాక్, సెక్మార్క్ కన్సల్టెన్సీ వంటి కంపెనీలు చేరాయి. అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్, సిక్కో ఇండస్ట్రీస్, Xelpmoc డిజైన్ అండ్ టెక్, కెల్టన్ టెక్ సొల్యూషన్స్, సాగర్ సిమెంట్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


