దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 119 పాయింట్లు పెరిగి 26,017కు చేరింది. సెన్సెక్స్(Sensex) 408 పాయింట్లు లాభపడి 85,226 వద్ద ట్రేడవుతోంది.
ఎల్ అండ్ టీ, హిందాల్కో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్స్, మారుతి సుజుకీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. విప్రో, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, హెచ్ యూఎల్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ ఎం షేర్లు లాభాల బుకింగ్ లో పతనమయ్యాయి.
Today Nifty position 12-12-2025(time: 9:51 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


