ఢిల్లీ, సాక్షి: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్ భారత్ - జీ- రామ్- జీ (గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో సోమవారం ప్రవేశపెడుతోంది.
బిల్లులోని ముఖ్యాంశాలు
- ఇక నుంచి గ్రామ పంచాయతీల ద్వారా పనులకు ప్రణాళికలు
- ప్రస్తుత పని దినాలు 100 నుంచి 125కు పెంపు
- వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత రాకుండా ఉపాధి పనులు 60 రోజుల వరకు తాత్కాలికంగా నిలిపివేసే వెసులుబాటు
- వికసిత భారత్ లక్ష్యాలకనుగుణంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో పనుల ప్రణాళికలు
- వారానికోసారి కూలి చెల్లింపు తప్పనిసరి
- ఏబీసీ కేటగిరీలుగా గ్రామ పంచాయతీల విభజన
- కేంద్రం నిర్ధారించిన పారామీటర్స్ ఆధారంగా రాష్ట్రాల వారీగా ఉపాధి హామీ నిధులు కేటాయింపు
- కేటాయింపునకు అదనంగా నిధులు ఖర్చు చేస్తే వాటిని భరించే బాధ్యత రాష్ట్రాలదే.


