మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమాయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 519.34 పాయింట్లు లేదా 0.62 శాతం నష్టంతో 83,459.15 వద్ద, నిఫ్టీ 165.70 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో.. 25,597.65 వద్ద నిలిచాయి.
కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, 3ఎం ఇండియా, తంగమైల్ జ్యువెలరీ, ఎక్సారో టైల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్కేర్, ఫైనోటెక్స్ కెమికల్, ఎస్పీఎల్ ఇండస్ట్రీస్, టీఎస్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


