మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 503.62 పాయింట్లు లేదా 0.59 శాతం నష్టంతో.. 85,138.27 వద్ద, నిఫ్టీ 143.55 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 26,032.20 వద్ద నిలిచాయి.
సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ, టిప్స్ ఫిల్మ్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, ఆల్పా లాబొరేటరీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీతి ఇంటర్నేషనల్, జేహెచ్ఎస్ స్వెండ్గార్డ్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, విజి ఫైనాన్స్ లిమిటెడ్, ష్రెనిక్, అనిక్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


