శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 94.73 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో 83,216.28 వద్ద, నిఫ్టీ 17.40 పాయింట్లు లేదా 0.068 శాతం నష్టంతో 25,492.30 వద్ద నిలిచాయి.
హెచ్బీ స్టాక్హోల్డింగ్స్ లిమిటెడ్, ఎం అండ్ బీ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఇంటర్ఆర్చ్ బిల్డింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, రోసెల్ టెక్సిస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. బ్లిస్ జివిఎస్ ఫార్మా, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ (ఇండియా), సాత్విక్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, వెంకీస్ షేర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


