సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 566.96 పాయింట్లు లేదా 0.67 శాతం లాభంతో.. 84,778.84 వద్ద, నిఫ్టీ 170.90 పాయింట్లు లేదా 0.66 శాతం లాభంతో 25,966.05 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, భారత్ వైర్ రోప్స్, భాగ్యనగర్ ఇండియా, PSP ప్రాజెక్ట్స్, ఎస్సార్ షిప్పింగ్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరగా.. నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, లాటీస్ ఇండస్ట్రీస్, డెల్ఫి వరల్డ్ మనీ, జీఎం బ్రూవరీస్, శ్యామ్ టెలికాం కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


