శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 447.55 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 84,929.36 వద్ద, నిఫ్టీ 150.85 పాయింట్లు లేదా 0.58 శాతం లాభంతో 25,966.40 వద్ద నిలిచాయి.
ఆర్వీ లాబొరేటరీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్, జీ లెర్న్, ప్రెసిషన్ కామ్షాఫ్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఉగార్ షుగర్ వర్క్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, భగీరధ్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్, అవధ్ షుగర్ & ఎనర్జీ, ది వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


