గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 446.21 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో.. 85,632.68 వద్ద, నిఫ్టీ 139.50 పాయింట్లు లేదా 0.54 శాతం లాభంతో 26,192.15 వద్ద నిలిచాయి.
సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, లగ్నమ్ స్పింటెక్స్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, ప్రీమియర్ పాలీఫిల్మ్, వాస్వానీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. మాగెల్లానిక్ క్లౌడ్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ, మంగళం డ్రగ్స్ & ఆర్గానిక్స్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ వంటివి నష్టాలను చవిచూసాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


