మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 335.97 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో.. 83,871.32 వద్ద, నిఫ్టీ 120.60 పాయింట్లు లేదా 0.47 శాతం లాభంతో 25,694.95 వద్ద నిలిచాయి.
గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, యాత్ర ఆన్లైన్, వీనస్ రెమెడీస్, జువారీ ఇండస్ట్రీస్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎం & బీ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, హెచ్ఎల్ఈ గ్లాస్కోట్, తమిళనాడు పెట్రోప్రొడక్ట్స్, లార్డ్స్ క్లోరో ఆల్కలీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


