సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 39.78 పాయింట్లు లేదా 0.047 శాతం లాభంతో.. 83,978.49 వద్ద, నిఫ్టీ 41.25 పాయింట్లు లేదా 0.16 శాతం లాభంతో 25,763.35 వద్ద నిలిచింది.
డాల్ఫిన్ ఆఫ్షోర్ ఎంటర్ప్రైజెస్, తంగమైల్ జ్యువెలరీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా, లాంకోర్ హోల్డింగ్స్, బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పంజాబ్ కెమికల్స్ & క్రాప్ ప్రొటెక్షన్, ది గ్రోబ్ టీ కంపెనీ లిమిటెడ్, ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, స్టవ్ క్రాఫ్ట్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


