గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి.సెన్సెక్స్ 592.67 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో 84,404.46 వద్ద, నిఫ్టీ 176.05 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో.. 25,877.85 వద్ద నిలిచాయి.
యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రూవరీస్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్ప్లోరేషన్, సార్థక్ మెటల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గీకే వైర్స్, ఓసీసీఎల్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, ZIM లాబొరేటరీస్, షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


