సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 290.38 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 83,506.66 వద్ద, నిఫ్టీ 83.00 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 25,575.30 వద్ద నిలిచాయి.
గల్లంట్ ఇస్పాట్, బ్లిస్ జీవీఎస్ ఫార్మా, లుమాక్స్ ఆటో టెక్నాలజీస్, ఇండిగో పెయింట్స్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరగా.. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా, కామత్ హోటల్స్ ఇండియా, పెన్నార్ ఇండస్ట్రీస్, అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రూవరీస్, ఎస్హెచ్ కేల్కర్ & కంపెనీ వంటివి నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


