శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 400.76 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టంతో 85,231.92 వద్ద, నిఫ్టీ 129.95 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 26,062.20 వద్ద నిలిచాయి.
అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, మాగెల్లానిక్ క్లౌడ్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, మాలు పేపర్ మిల్స్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), జైప్రకాష్ పవర్ వెంచర్స్, కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


