మంగళవారం ఉదయం.. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ 103.16 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 84,798.70 వద్ద, నిఫ్టీ 27.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,969.85 వద్ద నిలిచాయి.
ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, ఓరియంట్ టెక్నాలజీస్, ఓరియంట్ సెరాటెక్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పావ్నా ఇండస్ట్రీస్, మోదీ రబ్బర్ లిమిటెడ్, ప్రకాష్ స్టీలేజ్, నందని క్రియేషన్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


