రూ.125 కోట్ల డీల్.. ఇక్సిగోకి మెజారిటీ వాటాలు | Ixigo Acquires Majority Stake in Spain Company | Sakshi
Sakshi News home page

రూ.125 కోట్ల డీల్.. ఇక్సిగోకి మెజారిటీ వాటాలు

Feb 15 2026 4:07 PM | Updated on Feb 15 2026 4:46 PM

Ixigo Acquires Majority Stake in Spain Company

స్పెయిన్‌కి చెందిన ట్రెయిన్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫాం అయిన ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సొల్యూషన్స్‌ (ట్రెనెస్‌)లో మెజారిటీ వాటాలను ట్రావెల్‌ అగ్రిగేటర్‌ ఇక్సిగో కొనుగోలు చేయనుంది. 60 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 125 కోట్లుగా (11.70 మిలియన్‌ యూరోలు) ఉంటుంది.

యూరోపియన్‌ ఓటీఏ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు స్క్వాడ్‌ యాజ్‌ సరీ్వస్‌ అనే ఇంకో స్పానిష్‌ సంస్థలో కూడా 45.02 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కూడా ఇక్సిగో బోర్డు ఆమోదం తెలిపింది. దీని విలువ రూ. 4.83 కోట్లుగా ఉంటుంది. ఎస్‌క్యూఏఏఎస్‌ సంస్థ ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంబంధ సేవలను అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement