
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 368.48 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో.. 80,235.59 వద్ద, నిఫ్టీ 97.65 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో.. 24,487.40 వద్ద నిలిచింది.
టాప్ గెయినర్స్ జాబితాలో.. యాత్ర ఆన్లైన్, డబ్ల్యుఎస్ ఇండస్ట్రీస్, NDL వెంచర్స్, రికో ఆటో, సోనాటా సాఫ్ట్వేర్ కంపెనీలు చేరాయి. మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా), మార్క్సాన్స్ ఫార్మా, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), పిక్స్ ట్రాన్స్మిషన్స్, ఆస్ట్రల్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)