స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on August 19th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Aug 19 2025 9:36 AM | Updated on Aug 19 2025 10:11 AM

stock market updates on August 19th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 24,905కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 144 ప్లాయింట్లు  పుంజుకుని 81,417 వద్ద ట్రేడవుతోంది.

రానున్న దీపావళికల్లా జీఎస్‌టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్‌టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్‌టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్‌ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement