నష్టాల్లో ముగిసిన మార్కెట్లు | Stock market July 31 highlights Sensex sheds 296pts Nifty at 24768 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Jul 31 2025 3:43 PM | Updated on Jul 31 2025 4:01 PM

Stock market July 31 highlights Sensex sheds 296pts Nifty at 24768

భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు గురువారం అస్థిర సెషన్ లో ప్రతికూలంగా ముగిశాయి. సెన్సెక్స్ 296.28 పాయింట్లు (0.36 శాతం) క్షీణించి 81,185.58 వద్ద స్థిరపడింది. గురువారం ఈ సూచీ 81,803.27 నుంచి 80,695.15 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 86.70 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 24,768.35 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.70-1.34 శాతం రేంజ్‌లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ షేర్లు 3.61 శాతం వరకు లాభపడ్డాయి.  నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.05 శాతం, 0.93 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మార్కెట్ ధోరణులను అధిగమించి ఇమామీ, హిందుస్థాన్ యూనిలీవర్ నేతృత్వంలో 1.44 శాతం లాభాలతో స్థిరపడింది. నిఫ్టీ ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ సూచీలు 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,153 షేర్లలో 2,418 రెడ్‌లో, 1,598 గ్రీన్‌లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement