సుంకాల ప్రభావం.. స్టాక్‌ మార్కెట్ల పతనం | Stock market August 28 closing Tariff worries drag Sensex 706 pts, Nifty 24501 | Sakshi
Sakshi News home page

సుంకాల ప్రభావం.. స్టాక్‌ మార్కెట్ల పతనం

Aug 28 2025 3:59 PM | Updated on Aug 28 2025 4:16 PM

Stock market August 28 closing Tariff worries drag Sensex 706 pts, Nifty 24501

బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా ఎగుమతులపై 50 శాతం సుంకాల ప్రభావంతో భారత స్టాక్స్ నష్టాల్లో గురువారం ముగిశాయి.  బీఎస్ఈ సెన్సెక్స్ 705.97 పాయింట్లు (0.87 శాతం) క్షీణించి 80,080.57 వద్ద, నిఫ్టీ 50 211.15 పాయింట్లు లేదా 0.85 శాతం క్షీణించి 24,500.9 వద్ద స్థిరపడ్డాయి.

బీఎస్ఈలో హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, టైటాన్, ఎల్అండ్‌టీ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర​్‌గా నిలిచాయి.
 
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 1.27 శాతం, 1.45 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 1 శాతానికి పైగా క్షీణించాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement