
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 57.87 పాయింట్లు లేదా 0.070 శాతం నష్టంతో.. 82,102.10 వద్ద, నిఫ్టీ 32.85 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 25,169.50 వద్ద నిలిచాయి.
ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, బనారస్ బీడ్స్, బ్రాండ్ కాన్సెప్ట్స్, రెఫెక్స్ ఇండస్ట్రీస్, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అదానీ టోటల్ గ్యాస్, హరియోమ్ పైప్ ఇండస్ట్రీస్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, షా మెటాకార్ప్, ఎల్టీ ఫుడ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)