లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market September 10 Sensex adds 324 pts, Nifty at 24973 | Sakshi
Sakshi News home page

ఐటీ, బ్యాంక్ షేర్ల ర్యాలీ.. లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Sep 10 2025 3:58 PM | Updated on Sep 10 2025 4:18 PM

Stock Market September 10 Sensex adds 324 pts, Nifty at 24973

బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూల నోట్‌లో ముగిశాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్ లో ర్యాలీతో లాభాల్లో  స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 323.83 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 81,425.15 వద్ద ముగిసింది. 
ఎన్ఎస్ఈ నిఫ్టీ 104.50 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 24,973.10 వద్ద ముగిసింది.

భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4.50 శాతం లాభపడ్డాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్ షేర్లు 2.46 శాతం వరకు పడిపోయాయి.

నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.83 శాతం, 0.73 శాతం లాభంతో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు వరుసగా 2.63 శాతం, 2.09 శాతం లాభంతో స్థిరపడ్డాయి. ఎంఆర్ఎఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్ కంపెనీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.28 శాతం నష్టంతో స్థిరపడింది.

మార్కెట్ విస్తృతి  సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఎన్‌ఎస్‌ఈలో 3,128 ట్రేడెడ్ స్టాక్స్ లో 1,835 గ్రీన్‌లో ముగిశాయి. 1,210 రెడ్‌లో ముగిశాయి. మరోవైపు 83 షేర్లలో మార్పులేదు. ఎన్ఎస్ఈలో లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.14 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement