
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 554.84 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 80,364.49 వద్ద, నిఫ్టీ 198.20 పాయింట్లు లేదా 0.81 శాతం పెరిగి 24,625.05 వద్ద నిలిచాయి.
శ్యామ్ సెంచరీ ఫెర్రస్, జిందాల్ పాలీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, బీఎస్ఎల్, అట్లాంటా, ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పావ్నా ఇండస్ట్రీస్, రాయల్ ఆర్చిడ్ హోటల్స్, ట్రెఝరా సొల్యూషన్స్ లిమిటెడ్, విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా, స్టెర్లైట్ టెక్నాలజీస్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)