
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 693.86 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 81,306.85 వద్ద, నిఫ్టీ 213.65 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 24,870.10 వద్ద నిలిచాయి.
కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం, చెంబాండ్ కెమికల్స్ లిమిటెడ్, ఏజెడ్ఎమ్ఓ లిమిటెడ్, ఫోసెకో ఇండియా, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, వండర్ ఎలక్ట్రికల్స్, ఫోర్స్ మోటార్స్, వింటా ల్యాబ్స్, డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)