అమ్మకాల ఒత్తిడి.. బేర్‌మన్న మార్కెట్లు | Stock market July 28 Sensex sheds 572 pts Nifty at 24680 | Sakshi
Sakshi News home page

అమ్మకాల ఒత్తిడి.. బేర్‌మన్న మార్కెట్లు

Jul 28 2025 3:48 PM | Updated on Jul 28 2025 3:50 PM

Stock market July 28 Sensex sheds 572 pts Nifty at 24680

బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 572.07 పాయింట్లు (0.70 శాతం) క్షీణించి 80,891 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.10 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 24,680.90 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ అనుబంధ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ మాత్రమే 1.23 శాతం వరకు లాభపడగా, మిగతావి నష్టాల్లో స్థిరపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 1.14 శాతం నుంచి 7.31 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.26 శాతం, 0.84 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ రెడ్‌లో స్థిరపడగా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.26 శాతం నష్టంతో ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement