breaking news
Warangal District Latest News
-
సమస్యలతో సావాసం
అభివృద్ధికి దూరంగా మున్సిపాలిటీలుడీసీతండాలోనిర్మాణంలో ఉన్న వాటర్ట్యాంకు● నర్సంపేట, వర్ధన్నపేటలో వసతులు కరువు ● అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు, తాగునీటి సరఫరా ● విలీనగ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానం ● నూతన పాలకవర్గాలపైనే ప్రజల ఆశలునిర్మాణ దశలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్నిరుపయోగంగా దోభీఘాట్ భవనంపైపులైన్ నిర్మాణంతో దెబ్బతిన్న సీసీ రోడ్డునర్సంపేట/వర్ధన్నపేట: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. నర్సంపేట, వర్ధన్నపేటలో పాలకవర్గాలు కొలువుదీరాయి. కాలనీల్లోని ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గుంతలమయమైన రహదారులు, అస్తవ్యస్తమైన డ్రెయినేజీలు, వీధిదీపాలు, తాగునీటి సరఫరాతోపాటు పైపులైన్ల లీకేజీలను పట్టించుకునే వారు కరువయ్యారు. ముఖ్యంగా విలీన గ్రామాల్లోని పరిస్థితి అధ్వానంగా తయారైంది. కనీస వసతులకు నోచుకోలేదు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడే అభివృద్ధి పనులు చేపట్టారని ప్రజలు పేర్కొంటున్నారు. నూతనంగా కొలువుదీరిన పాలకవర్గాలు సమస్యలు పరిష్కరించాలని నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల ప్రజలు కోరుతున్నారు. వర్ధన్నపేటలో సమస్యలు.. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ప్రాంగణంలో 2023లో రూ.2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయ నిర్మాణ పనులు ప్రారంభించారు. మూడు సంవత్సరాలు దాటినా పనులు పూర్తి కాలేదు. మూడు సంవత్సరాల క్రితం రాయపర్తి మండలం సరిహద్దులో తెట్టెకుంటా తండా సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మానవ వ్యర్థాలతో ఎరువు తయారు చేసే రీసైక్లింగ్ యూనిట్ను ప్రారంభించలేదు. సంగెపు వాగు పక్కన దోభిఘాట్ భవనాన్ని ఏర్పాటు చేసి యంత్రసామగ్రిని సైతం బిగించి వదిలేశారు. విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదు. రజకులకు సౌకర్యాలు కల్పించలేదు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో డీసీతండాలో సెంట్రల్ లైటింగ్ నిరుపయోగంగా మారింది. తాగునీటి సమస్య తీర్చడానికి అమృత్ పథకం కింద రూ.34.08 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి. 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంగెపు వాగు ఒడ్డున గ్రౌండ్ లెవల్ దశలో వాటర్ ట్యాంకు, డీసీతండా వద్ద 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నీటి సరఫరాకు 50 కిలోమీటర్లకు పైపులైన్ల పనులు చేపట్టారు. ఇప్పటివరకు 40 శాతం మేర మాత్రమే పనులు అయ్యాయి. మున్సిపాలిటీలో 10 మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఉన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో 10 మంది కార్మికులు, వాహనాలను నడిపేందుకు డ్రైవర్లు, ఒక ఎలక్ట్రీషియ న్, స్వీపర్లు, కామాటి సిబ్బంది అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వర్ధన్నపేటలో ఇళ్లు, ఇతర పన్నుల ఆదాయం రూ.1.20 కోట్లు ఉంది. ఇందులో కేవలం పన్నుల వసూళ్లు 70 శాతం దాటడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పట్టణ ప్రగతి కుంటుపడే ప్రమాదముంది. -
కొత్త పాలకవర్గానికి సమస్యల స్వాగతం
● నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పరకాల మున్సిపాలిటీ ● రూ.15 కోట్ల ఆదాయం.. అంతకు మించి వ్యయం ● వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణకే సగానికి పైగా ఖర్చు ● నిధులతో పనుల ఆరంభం.. నిధుల కొరతతో అర్ధంతరంఅసంపూర్తిగా ట్యాంక్ బండ్ నిర్మాణం సగరవీధిలో రోడ్డుపై పేరుకుపోయిన చెత్తపరకాల: పరకాల మున్సిపాలిటీ కొత్త పాలకవర్గానికి పట్టణాభివృద్ధి ఓ సవాలుగా మారబోతోంది. ఏటా మున్సిపల్ ఆదాయం రూ.15 కోట్లు వస్తున్నప్పటికీ.. అంతకు మించి మున్సిపల్ ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య పనులకు సగానికిపైగా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు టఫిడ్కో ద్వారా మంజూరైన రూ.10 కోట్ల నిధులతో చేపట్టాల్సిన సీసీ రోడ్ల పనులు జరుగకపోవడంతో పరకాల పట్టణాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. మూడేళ్ల కాలంలో పరకాలలో టఫిడ్కో ద్వారా చేపడుతున్న డ్రెయినేజీ పనులు తప్ప ఒక్క చోట కూడా సీసీ రోడ్డు పోయలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం.. రెండేళ్ల కాలంలోనే నలుగురు కమిషనర్లు మారడం.. ము న్సిపాలిటీ పాలకవర్గం ముగియడంతో పరకాల పట్టణాభివృద్ధిపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు పట్టుపోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నా యి. దీంతో పరకాల పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా పట్టణాభివృద్ధి రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నట్లుగా మా రింది. కొత్త పాలకవర్గం పెండింగ్ సమస్యల పరి ష్కారంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారి స్తుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. షెడ్డు వేయాలి.. పరకాలలో కూరగాయలు, మాంసం దుకాణాలకు మార్కెట్లో షెడ్లు వేసినట్లే చేపలు అమ్ముకోవడానికి షెడ్డు నిర్మించాలి. గతంలో ఎమ్మెల్యే చెప్పినప్పటికీ కూరగాయల మార్కెట్లో చేపల విక్రయాలను అక్కడి దుకాణాల నిర్వాహకులు అడ్డుకోవడంతో రోడ్లపై అమ్ముకోవాల్సి వస్తోంది. కొత్త కౌన్సిలర్లు జోక్యం చేసుకుని చేపల మార్కెట్ నిర్మించాలి. –సాంబలక్ష్మి, చేపల వ్యాపారి నిధులు మంజూరై నాలుగేళ్లు.. పరకాలలో మా వాడ అభివృద్ధికి దూరంగా ఉంది. కనీసం వాడకు సీసీ రోడ్డు కాదు కదా.. డ్రెయినేజీ కూడా గతి లేదు. సీసీ రోడ్డుకు రూ.8 లక్షల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు చెప్పడం.. అప్పటి చైర్పర్సన్ సోదా అనిత శంకుస్థాపన చేయడంతో ఎంతో సంబురపడ్డాం. కానీ, నిధులు మంజూరై నాలుగేళ్లయినా ఎలాంటి పని జరగలేదు. – కేశెట్టి వెంకటేశ్వర్లు, లక్కంవాడ డ్రెయినేజీ కడతామంటే గోడలు కూలగొట్టుకున్నాం.. మా వాడకు రోడ్డు పోస్తాం. డ్రెయినేజీ కట్టిస్తామంటే ఎంతో ఆశగా ఇళ్ల గోడలు, గదులు కూలగొట్టుకున్నాం. కానీ, ఏమైందో తెలియదు. సీసీ రోడ్ల పనులు చేయకపోవడంతో వర్షకాలంలో ఇంటి ఎదుట బురద, డ్రెయినేజీ నీరు నిలిచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. – మొలుగూరి వెంకటలక్ష్మి, లక్కంవాడ -
కాంగ్రెస్లో కట్టప్పలు ఉన్నారు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హసన్పర్తి: కాంగ్రెస్లో ఉన్న కట్టప్పల వల్లే పార్టీ వర్ధన్నపేట మున్సిపాలిటీలో రెండు వార్డులు కోల్పోయిందని స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం 1,.2, 56 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీకీ మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలకతీతంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలో విలీనమైన తండాలను తిరిగి పంచాయతీలుగా ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. తనకు కూడా తిట్లు వచ్చన్నారు. కార్యక్రమంలో హసన్పర్తి, హనుమకొండ తహసీల్దార్లు కిరణ్, రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, డివిజన్ల అధ్యక్షులు కొంక హరిబాబు, కనపర్తి కిరణ్, ఎరుకొండ శ్రీనివాస్, నాయకులు సురేందర్రెడ్డి, వెంకటస్వామి, సింగులాల్, వెంకటేశ్వర్లు, రవి, రవీందర్, రాజేష్, పెద్దమ్మ నర్సింహరాములు, సురేష్ పాల్గొన్నారు. -
నర్సంపేటలో డంపింగ్ యార్డు సమస్య
నర్సంపేట గ్రామ పంచాయతీ 2011లో నగర పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్నతీకరణ చెందింది. పట్టణంలో 60 వేల జనాభాతోపాటు 41 వేల మంది ఓటర్లు ఉన్నారు. చెత్త డంపు సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మల్లంపల్లి వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న అసైన్మెంట్ భూమిలో ఓ వ్యక్తి అక్రమంగా మట్టిని తరలించడంతో ఏర్పడిన గుంతలో చెత్తను వేశారు. దీంతో పట్టణ సమీప ప్రజలు అభ్యంతరాలు చెప్పడంతో పాకాల రోడ్డులో చెత్తను డంపు చేస్తున్నారు. ఇక్కడ 3,500 మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉంది. ఈ స్థలంలో చెత్తను తగులబెట్టడంతో పొగ వెదజల్లుతోంది. రాకపోకలు సాగించే వాహనదారులో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఐదు సంవత్సరాలుగా చెత్తను డంపు చేస్తున్నా గత పాలకవర్గం పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానం.. నర్సంపేట పట్టణంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలమయమైన రోడ్లతో వాహనదారులు, పాదచారులకు పాట్లు తప్పడం లేదు. డ్రెయినేజీలు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పలు కాలనీల్లో పైపులైన్ లీకేజీలతో నీరంతా మురుగు కాల్వల్లో కలుస్తోంది. నూతన పాలకవర్గం దృష్టిసారించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం.. నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రధాన సమస్య చెత్త డంపు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. బయోమైనింగ్ మిషన్ ద్వారా చెత్తలో ఉన్న రకరకాల వ్యర్థాలను వేరుచేస్తూ.. దుర్వాసన రాకుండా యంత్రాలను సమకూర్చుకుంటున్నాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. – పెండెం శ్రీలక్ష్మీరామానంద్, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డులో డంపుచేసిన చెత్త -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే నాయిని వినతి హన్మకొండ చౌరస్తా: జిల్లాలో రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కోరారు. హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డిని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న రహదారి పనులు, నూతన రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రికి అందించారు. నియోజకవర్గంలో దెబ్బతిన్నాయని, ప్రజల రాకపోకలకు కష్టతరంగా మారుతోందని ఎమ్మెల్యే నాయిని, మంత్రికి వివరించారు. ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి, సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఆర్ఆండ్బీ శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ విద్యారణ్యపురి: జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు సంబంధించిన మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెట్టుబడులు, రుణాల వసూళ్లపై సమీక్షించారు. -
ప్రైవే2 చేతుల్లోకి డిపో
గురువారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపో త్వరలో పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లనుంది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వరంగల్ రీజియన్కు మంజూరు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు వరంగల్–2 డిపోకు కేటాయించారు. ఈ బస్సుల్లో కొన్నింటిని ఇతర డిపోలకు సర్దుబాటు చేశారు. మిగిలిన బస్సులను సైతం ఈ నెలాఖరువరకు ఇతర డిపోలకు పంపి ఖాళీ చేయనున్నారు. దీంతో వరంగల్–2 డిపో పూర్తిగా ప్రైవేట్ సంస్థ జేబీఎం చేతుల్లోకి వెళ్లనుంది. 2025 జనవరి నాటికి వరంగల్–2 డిపోలో 69 ఆర్టీసీ సొంత బస్సులు, 44 అద్దె బస్సులు నడిచేవి. 2024 డిసెంబర్లో వరంగల్కు రీజియన్కు కేటాయించి 112 ఎలక్ట్రిక్ బస్సులు వరంగల్–2 డిపోకు చేరుకున్నాయి. జనవరిలో ఈ బస్సుల రవాణా సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు తిరిగిన ఆర్టీసీ సంస్థ సొంత బస్సుల్లో కొన్నింటిని వరంగల్–1, హనుమకొండ డిపోకు సర్దుబాటు చేశారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు 12 సొంత బస్సులు, 44 అద్దె బస్సులను వరంగల్–2 డిపో నడుపుతోంది. అయితే తమకు స్థలం సరిపోవడం లేదని, ఒప్పందం మేరకు తమకు డిపో మొత్తం పూర్తిగా అప్పగించాలని జేబీఎం అర్టీసీ అధికారులపై ఒత్తిడి పెంచింది. దీంతో డిపోను వారికి పూర్తి స్థాయిలో అప్పగించేందుకు వరంగల్ రీజియన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డ్రైవర్లను బట్టి బస్సుల కేటాయింపు.. డిపోను జేబీఎం సంస్థకు అప్పగిస్తున్న క్రమంలో ప్రస్తుతం నడుస్తున్న సంస్థ బస్సులను ఇతర డిపోలకు సర్దుబాటు చేయాల్సిన అవసరముంది. ఈ మేరకు ముందుగా డ్రైవర్లను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు డ్రైవర్ల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. దాదాపుగా నగరంలోని మరో రెండు డిపోలైన వరంగల్–1, హనుమకొండ డిపోకు డ్రైవర్లు వెళ్లే అవకాశముంది. ఈ డ్రైవర్ల సంఖ్యను బట్టి ఆయా డిపోలకు 12 బస్సులను కేటాయించనున్నారు. అద్దె బస్సులు 44 ఉన్నప్పటికీ వాటి పార్కింగ్, నిర్వహణ, మరమ్మతులు అద్దె బస్సుల యజమానులు చూసుకుంటున్నారు. దీంతో వీటిని వరంగల్–2 డిపో ఆధ్వర్యంలోనే నడుపనున్నారు. స్థలం సరిపోక.. ప్రస్తుతం వరంగల్–2 డిపో ద్వారా 112 ఎలక్ట్రిక్ బస్సులు రవాణా సేవలు అందిస్తున్నాయి. మెదక్ రీజియన్కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులు అక్కడ అవసరం లేకపోవడంతో ఈ క్రమంలో మూడు ఎలక్ట్రిక్ బస్సులను వరంగల్ రీజియన్కు ఇవ్వడంతో వాటిని కూడా వరంగల్–2 డిపోకు కేటాయించారు. దీంతో మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 115కు చేరింది. దీంతో ఈ బస్సుల సంఖ్య పెరగడం, ఆర్టీసీ బస్సులు కూడా డిపోలోనే ఉండడంతో స్థలం సరిపోవడం లేదని జేబీఎం సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకే గ్యారేజీలో సంస్థ బస్సులు, జేబీఎం బస్సులు మరమ్మతు, నిర్వహణ పనులు చేయాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం వరంగల్–2 డిపోను పూర్తిగా జేబీఎంకు అప్పగిస్తోంది.WGL-2 BUS DEPOTJBMఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారుల నిర్ణయం టేకోవర్ చేయనున్న జేబీఎం.. ఖాళీ కానున్న బస్సులు ఇతర డిపోలకు డ్రైవర్ల సర్దుబాటు.. ఆప్షన్లు కోరిన అధికారులు కేటాయింపునకు అనుగుణంగా బస్సుల సర్దుబాటు -
నిలిచిన పనులివే..
● టఫిడ్కో ద్వారా మంజూరైన రూ.10 కోట్లతో సీసీ రోడ్ల పనులు ● రూ.1కోటి నిధులతో మోడ్రన్ వైకుంఠధామం నిర్మాణం ● రూ.4.50 కోట్ల నిధులతో చేపట్టిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు ● రూ.1.60 కోట్లతో చిరువ్యాపారస్తుల కోసం చేపట్టిన భవన పనులు ● రూ.3.56 కోట్ల ఖర్చు చేసి పరకాల దామెర చెరువును మినీ ట్యాంక్బండ్గా సుందరీకరించలేదు. ● రూ.80లక్షలు ఖర్చు చేసి బోటు కొనుగోలు చేసి మున్నాళ్ల ముచ్చటగా మార్చారు.(బోటు లక్నావరం తరలించారు) ● రూ.90 లక్షలు ఖర్చు చేసి కొన్న చెత్త క్లీనింగ్ వెహికిల్ నిరుపయోగం. ● పరకాల బస్టాండ్, కూరగాయాల మార్కెట్, కొత్త మున్సిపల్ కార్యాలయ వద్ద జంక్షన్ల నిర్మాణం ● చేపల మార్కెట్కు ఎలాంటి షెడ్డు లేక.. చేపల వ్యాపారస్తులకు. వాహనాదారులకు ఇబ్బందిగా మారింది. ● నాలుగేళ్ల క్రితం పరకాాల అమరధామం పార్క్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు నిరుపయోగంగా మారియి. ● పారిశుద్ధ్య సిబ్బంది కొరత కారణంగా కాలనీల్లోని డ్రెయినేజీల్లో నెలకోసారి డ్రెయినేజీలు తీయట్లేదు. నెలకోసారి రోడ్లు ఊడుస్తుండడంతో దుమ్ము కారణంగా పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేక రోడ్డుపై నిలిచిన నీరు -
చిత్తడి నేలలను పరిరక్షించాలి
● సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: చిత్తడి నేలల పరిరక్షణ, అభివృద్ధిలో పరస్పర సమన్వయం అవసరమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. జిల్లా అటవీశాఖాధికారి అనూజ్ అగర్వాల్ మెంబర్ కన్వీనర్గా పాల్గొన్న గత సమావేశం అనంతరం జరిగిన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గుర్తించిన రెండు వెట్ల్యాండ్స్కు సంబంధించిన కీలక సమాచారం, పత్రాలు వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్నట్లు డీఎఫ్ఓ వివరించారు. ముసలమ్మకుంట (వరంగల్ రేంజ్), వెంకటాపూర్ పెద్దచెరువు (నర్సంపేట రేంజ్)కు సంబంధించిన రెవెన్యూ, సాగునీరు, మత్స్య, పర్యాటక శాఖల నుంచి అవసరమైన నివేదికలు అందాల్సి ఉన్నట్లు తెలిపారు. వెట్ల్యాండ్స్కు సంబంధించి పత్రాలు, సంబంధిత శాఖల సమ్మతి పత్రాలు త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పర్యటించి పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘సర్’పై సమీక్ష స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మ్యాపింగ్పై కలెక్టరేట్లో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, తహసీల్లార్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మ్యాపింగ్ ప్రకియను వేగవంతం చేయాలని సూచించారు. సేంద్రియ సాగుపై శిక్షణ ఇవ్వాలిఖిలా వరంగల్: సేంద్రియ సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు అనురాధతో కలిసి వ్యవసాయ విస్తరణ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్, క్రాప్బుకింగ్ యూరియా నిల్వలు, విక్రయాలు, రైతుబీమా, ఇతర పథకాలపై కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ విస్తరణాధికారులు సర్వేనంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని, పెండింగ్ రైతుల వివరాలు సేకరించి ఐడీ క్రియేట్ చేయాలన్నారు. -
రేపు సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 20వ తేదీన సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే అథ్లెట్లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. వేయిస్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదో రోజు బుధవారం ముగిశాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన యాగాన్ని పూర్తిచేసి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈసందర్భంగా గంగు ఉపేంద్రశర్మ, ఆలయ ఈఓ అనిల్కుమార్ మాట్లాడుతూ.. ఐదురోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో సహకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, నగర సీపీ సన్ప్రీత్సింగ్, పరోక్షంగా సహకరించిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దాతలు వద్దిరాజు వెంకటేశ్వర్లు, సీతారాంరెడ్డి, కృష్ణవేణి, వేముల సత్యమూర్తి, అయినవోలు వెంకట సత్యమోహన్, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, సేవా సమితి మహిళా సభ్యులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు పక్కన చేపల విక్రయాలు -
పెళ్లి పండుగ మొదలు..
జనగామ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లికళ సంతరించుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత నేటి (గురువారం) నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో కుటుంబాలు పండుగ జోరులో ఉన్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కార్యాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. జోరుగా వ్యాపారం.. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారు, వెండివ్యాపార సంస్థలు, పూల దుకాణాలు, బ్యాండ్ బాజా, సన్నాయి మేళా బృందాలు, మేకప్ ఆర్టిస్టులు, పెళ్లిలతో సంబంధం ఉన్న చిన్నచిన్న వ్యాపారాల వరకు గిరాకీ బాగా పెరిగింది. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు ముందుగానే బుక్ అయిపోవడంతో చివరి నిమిషంలో ముహూర్తాలు పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు పట్టణ పరిధిలో హాళ్లు దొరకకపోవడంతో దూర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లను ఆశ్రయిస్తున్నారు. బడ్జెట్ ఖర్చుపై ఆలోచనలు.. పెళ్లిళ్లకు బడ్జెట్ మాత్రం కుటుంబాలను బాగా ఆలోచింపజేస్తోంది. బంగారం, వెండి ధరలు అంచనాలకు మించి పెరగడంతో సాధారణ, పేద, మధ్యతరగతి వారికి గత ఏడాది వేసుకున్న అంచనాలు పెరిగి పోయాయి. దీంతో ఆభరణాల కొనుగోళ్లు సగానికి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటినుంచి శుభ ఘడియలు రెండు నెలల్లో ముహూర్తాలు కొన్నే..లిమిటెడ్ ముహూర్తాలు ఫిబ్రవరిలో 19, 20, 21, 22, 25, 26, మార్చిలో 5, 6, 7, 8, 11, 12 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. అంటే.. రెండు నెలలు కలిపి మొత్తం 12 ముహూర్తాలే ఉన్నాయి. మార్చి 19న ఉగాది సందర్భంగా కొత్త పంచాంగం విడుదలైన తర్వాత ఏప్రిల్ నెలలో వచ్చే శుభ ముహూర్తాలు తేదీలను ప్రకటిస్తారు. – శ్రీనివాసశర్మ, శ్రీసంతోషిమాత ఆలయ ప్రధాన అర్చకుడు, జనగామ -
ఎంత ఖర్చు చేసినా గెలవకపాయె!
సాక్షి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో రూ.లక్షల్లో ఖర్చు చేసి ఓడిపోయిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కక్కలేక మింగలేని పరిస్థితి ఉంది. రాజకీయాల్లో పదవులు దక్కించుకోవాలన్న ఆతృతతో ఉన్న ప్లాట్లు, భూములు అమ్మి వచ్చిన డబ్బులతోపాటు అప్పులు తెచ్చి ఓటర్లకు పంచిన నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వెళ్లి అడుగుదామంటే ఓటర్ల దృష్టిలో పరువుపోయే పరిస్థితి. ఓటమితో వచ్చిన బాధ కంటే ఇప్పుడు అప్పులు ఎలా తేర్పాలన్న టెన్షన్ ఓడిపోయిన అభ్యర్థులకు పట్టుకుంది. ఇలాంటి వారు చాలా మంది ఓటమి తర్వాత ఇళ్ల నుంచి బయటకురాలేక లోలోపల కుమిలిపోతున్నారు. ఓడిన అభ్యర్థులు ఖర్చు చేసింది రూ.20 కోట్లపైనే.. జిల్లాలోని నర్సంపేటలో 30 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులు ఉన్నాయి. మొత్తం 42 వార్డుల్లో 170 మంది పోటీ చేశారు. వీరిలో 42 మంది గెలవగా, 128 మంది ఓటమి చెందారు. ఇందులో దాదాపు 86 మంది రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ముగ్గురు ఇండిపెండెంట్లతోపాటు ప్రధాన పార్టీలకు చెందిన మిగిలిన 81 మంది రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు, ఆపైన ఖర్చు చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కేవలం గెలవని అభ్యర్థులే రూ.20 కోట్ల వరకు వెచ్చించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పైసలు పోయినా మంచిదే పదవి దక్కితే చాలు అని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలతోపాటు ముగ్గురు స్వతంత్రులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. కరపత్రాలు మొదలు మందు, బిర్యానీ ఇతర ఖర్చులకు వెచ్చించారు. ప్రణాళిక ప్రకారం డబ్బులు వెచ్చించడం తెలియక, రాజకీయ అనుభవం లేక చాలామంది ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీ 170 మందిలో 42 మంది అభ్యర్థులే విజయం చేసిన అప్పులు తీర్చేదెలాగో తెలియక ఆందోళననర్సంపేటలోని ఓ ముఖ్యమైన వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు పెట్టారు. తెల్లారితే పోలింగ్ అనగా ఒకరిని మించి మరొకరు అక్కడి ఓటర్ల ప్రాధాన్యతను బట్టి రూ.3,000 నుంచి రూ.5,000 వరకు పంపిణీ చేశారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో తమ సామర్థ్యానికి మించి రూ.లక్షల్లో అప్పులు తెచ్చి మరీ ప్రజలకు ఇచ్చారు. అయితే గెలిచిన అభ్యర్థికి సంతోషమున్నా... ఓడిన ఇద్దరికి చేసిన అప్పులు ఎలా తేర్పాలన్న బాధ పట్టుకుంది. వర్ధన్నపేటలోని ఓ వార్డులో పార్టీ టికెట్ దక్కించుకున్న ఓ అభ్యర్థి తనకున్న ప్లాట్ను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులను ప్రచారం, మద్యానికి ఖర్చు పెట్టారు. ఓట్లరకు పంపిణీ చేసే సమయంలో డబ్బులు చాలకపోవడంతో తెలిసినవారి నుంచి రూ.10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేశారు. ఇప్పుడు ఓడిపోవడంతో లబోదిబోమంటున్నాడు. -
47 ఏళ్ల జ్ఞాపకాలు పదిలం
● నాచినపల్లి పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం దుగ్గొండి: వారంతా వృద్ధులు.. 47 ఏళ్ల క్రితం పాఠశాల విద్య అనంతరం విడిపోయారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. మళ్లీ ఒక్కచోట కలుసుకున్నారు. మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1977–78 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన వారంతా ప్రముఖ ఆర్థోపెడిక్ కాళీప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం కలుసుకున్నారు. పాఠశాలలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం అనంతరం కలుసుకోవడంతో మళ్లీ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. కష్టసుఖాలు పంచుకున్నారు. కాసేపు పిల్లలుగా మారి అల్లరి చేశారు. ప్రతి సంవత్సరం కలుసుకోవాలని తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు డాక్టర్ సీహెచ్.రవీందర్, జంగా జనార్దన్రెడ్డి, అంచూరి సదానందం, అండృ సాంబరెడ్డి, ఉప్పుల అనిల్రెడ్డి, మహ్మద్యాకూబ్, పద్మజ, విజయజ్యోతి, అరుణకుమారి, వేణుగోపాల్, నర్సింహా చారి, ఐలయ్య, బ్రహ్మానందం, రమేశ్బాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
● హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారదవిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 18,590 మంది, ద్వితీయ సంవత్సరం 20,004 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరి కోసం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 14నుంచి నిర్వహించనున్న టెన్త్ వార్షిక పరీక్షలకు జిల్లాలో 64 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 12,079 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఇంటర్ విద్యాధికారి గోపాల్, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో.. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఈనెల 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఐఈఓ శ్రీధర్సుమన్ మాట్లాడుతూ.. జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు.. ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,210 మంది, ఒకేషనల్ విద్యార్థులు 793 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ 5,356 మంది, ఒకేషనల్ 807 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 92402 05555కు ఫోన్ చేయాలని కోరారు. -
అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్కమలాపూర్: విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఉపాధ్యాయులకు సూచించారు. గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ముఖగుర్తింపు విధానంలో హాజరు నమోదును పరిశీలించారు. ఆరు, పదో తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. లెట్స్ ఎన్రిచ్ అవర్ ఇంగ్లిష్ పాఠ్యాంశ బోధనను పరిశీలించి ఆంగ్ల ప్రావీణ్యంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతులను పరిశీలించిన కలెక్టర్ ఐదో తరగతి విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడించారు. పాఠశాలలో అసంపూర్తిగా, నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. తరగతి గదులు ఉన్నా విద్యార్థులను బయట కూర్చోబెట్టడం సరికాదని హెచ్చరించారు. పాఠశాల వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై కూడా కలెక్టర్ ఆరా తీసి మాట్లాడారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ప్రత్యేక దృష్టి సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, తహసీల్దార్ సురేశ్కుమార్, ఎంపీడీఓ గుండె బాబు, ఎంఈఓ శ్రీధర్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నైతిక విజయం బీఆర్ఎస్దే
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నైతిక విజయం సాధించిందని, అధికార కాంగ్రెస్ అనైతిక విధానాలు అవలంబించి గద్దెనెక్కిందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ విమర్శించారు. వర్ధన్నపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో 12వ వార్డు అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించి.. వెంటనే అధికారులు యూ టర్న్ తీసుకుని 7 ఓట్లతో ఓడిపోయారని ప్రకటించడం శోచనీమన్నారు. అదేవిధంగా 5వ వార్డు సభ్యురాలు రెబల్గా తమ పార్టీ నుంచి గెలుపొందగా బలవంతంగా మభ్యపెట్టి కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకుందని వాపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కంటే 374 ఓట్లు అధికంగా వచ్చాయని వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను పట్టణ ప్రజలు ఎంతో ఆదరించారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని అన్నారు. సమావేశంలో మున్సిపల్ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నారంలో అరూరి అరెస్ట్ పర్వతగిరి: అరూరి రమేష్ను మండలంలోని అన్నారం షరీఫ్ శివారులో పర్వతగిరి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయార్రావుతో కలిసి తొర్రూరుకు అరూరి బయలుదేరారు. అన్నారం షరీఫ్ శివారులో ఆయనను ఎస్సై ప్రవీణ్ అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఆయన వెంట నాయకులు చీమల భిక్షపతి, రంగు కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ రాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్రెడ్డి, చింతల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, పర్వతగిరిలోని దయాకర్రావు నివాసంలో ఆయన సతీమణి ఉషాదయాకర్రావును తొర్రూరు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రస్థాయి గణిత సదస్సుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాళోజీ సెంటర్: గణిత విద్య పునర్నిర్మాణం, ఆవిష్కరణలు, అనుసంధానం, ప్రభావం అంశాలపై ప్రతిఏటా పరిశోధన పత్రాలు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఎన్ఇపీ –2020 కోరుతోంది. అందులో భాగంగా ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 29 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా, వరంగల్ జిల్లా నుంచి ఖిలా వరంగల్ మండలం కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోగు అశోక్ ఎంపికయ్యారు. ఏడేళ్లుగా వరుసగా రాష్ట్రస్థాయి సదస్సుకు ఎంపికవుతూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను డీఈఓ రంగయ్య నాయుడు, ఏఎంఓ సుజన్ తేజ, డీఎస్ఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఖిలా వరంగల్ ఎంఈఓ ప్రసాద్, హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. కాగా, ఈనెల 19న హైదరాబాద్లో జరగనున్న సదస్సుకు హాజరు కావాలని అశోక్కు ఆహ్వానం అందింది. మహిళల కోసం ఆరోగ్య మహిళా క్లినిక్లు గీసుకొండ: మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్లను ఏర్పాటు చేసిందని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. గీసుకొండ, పర్వతగిరి మండలాల్లో అందుతున్న వైద్య సేవలను మంగళవారం పరిశీలించారు. ఎలుకుర్తిలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ క్లినిక్ల ద్వారా రక్తహీనత, అధిక బరువు, క్యాన్సర్, హైపర్ టెన్షన్, షుగర్, జననేంద్రియాలు వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. పీహెచ్సీల వైద్యులు ఉదయరాజు, మౌనిక, సీసీ నాగరాజు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ పర్వతగిరి: పర్వతగిరి పీహెచ్సీని డీఎంహెచ్ఓ సాంబశివరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు, రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉదయ్రాజ్, డాక్టర్ మౌనిక, ఫార్మసీ ఆఫీసర్ రాజేందర్, పీహెచ్ఎన్ నిర్మల, హెల్త్ సూపర్వైజర్ వసంత, స్టాఫ్ నర్సులు రజిత, కల్పన, తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగు లాభదాయకం
ముల్కనూర్ సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డిఎల్కతుర్తి: ఆయిల్పామ్ సాగు ఎంతో లాభదాయకమని ముల్కనూరు సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు కోపరేటివ్ రూరల్ క్రెడిట్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆయిల్పామ్ దేశంలో మంచి డిమాండ్ ఉందన్నారు. అంతకు ముందు జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్ మాట్లాడారు. ఆయిల్పామ్ సాగును విస్తరించాలని రైతులకు సూచించారు. వరంగల్, దామెర ప్రాంతాలకు చెందిన ఆయిల్పామ్ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ఆయిల్పామ్ పంటలను పరిశీలించారు. అధికారులు అనసూయ, శ్రీనివాస్, భవానీప్రసాద్, శంకర్, పద్మ పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోగు అశోక్ రాష్ట్రస్థాయి గణిత సదస్సుకు ఎంపికయ్యారు. వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్ తేజ, డీఎస్ఓ కట్ల శ్రీనివాస్, ఖిలా వరంగల్ ఎంఈఓ ప్రసాద్, హెచ్ఎం అభినందించారు. 19న హైదరాబాద్లో జరగనున్న సదస్సుకు రావాలని అశోక్కు ఆహ్వానం అందింది. -
కాంగ్రెస్ ‘తీన్మార్’
● జనగామ, తొర్రూరు, డోర్నకల్ సైతం కాంగ్రెస్ కైవసం ● లాటరీ పద్ధతిలో జనగామ, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జనగామ/తొర్రూరు/డోర్నకల్: జనగామ పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాటకీయంగా సాగాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపిరామ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం హాల్లో ప్రారంభమైన ప్రక్రియలో మొదట చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ సభ్యుల ఓటింగ్లో ఆ పార్టీకి చెందిన 12 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓటుగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి చేతులు ఎత్తడంతో మొత్తం 16 ఓట్లు వచ్చాయి. వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు రాగా, 13 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి వారికి కూడా 16 ఓట్లు రావడంతో టెన్షన్ నెలకొంది. ఇరుపక్షాలకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి గోపిరామ్ లాటరీ విధానాన్ని అమలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, పోలీసుల సమక్షంలో మొదట తీసిన చీటీలో బాలమణి పేరు రావడంతో ఆమె లక్కీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మద్దతుదారుడు 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన ఇద్దరితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అలాగే, తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు గెలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓట్లు వేశారు. దీంతో ఓట్లు సమానం కావడంతో ఇరు పార్టీలు సూచించిన వార్డు సభ్యులపేర్లతో చీటీలు వేసి లాటరీ తీయగా వచ్చిన పేర్లను ప్రకటించారు. ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తూనం శ్రావణ్ కుమార్ చైర్మన్గా, సోమ రజినీ వైస్ చైర్పర్సన్గా ఎంపికై నట్లు ఆర్డీఓ ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డోర్నకల్లో మొత్తం 15 వార్డుల్లో 11మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, నలుగురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండగా మంగళవారం అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండేటి రాజకుమారిని, వైస్ చైర్పర్సన్గా మాదా లావణ్య పేర్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ నుంచి ఎవరిని ప్రతిపాదించక పోవడంతో వారిద్దరిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. -
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పురపాలన అంతా మహిళల చేతుల్లోకి వెళ్లిపోయింది. సోమవారం, మంగళవారం.. జరిగిన ఎన్నికల్లో వారికే పెద్దపీట దక్కింది. వాస్తవానికి అన్నిచోట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు సోమవారం జరగాల్సి ఉంది. కోరం లేని కారణంగా డోర్నకల్.. సరిసమానమైన మెజారిటీ, గొడవలు, ఉద్రిక్తతతో జనగామ, తొర్రూరు ఎన్నికలను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ రెండు రోజుల్లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో సగానికి పైగా పదవులను మహిళలు సాధించారు. 12 చైర్పర్సన్ స్థానాల్లో 7 స్థానాలను మహిళలు గెలుచుకున్నారు. వైస్ చైర్మన్ స్థానాల్లో 8 మంది మహిళలే దక్కించుకున్నారు. వారంతా కూడా సోమ, మంగళవారాల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలకు 12 కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోగా.. ఇందులో అత్యధికంగా మహిళలే కావడంపై చర్చ జరుగుతోంది. జనరల్ స్థానాల్లోనూ సమీకరణల్లో భాగంగా అనూహ్యంగా చైర్పర్సన్ పదవులు ‘ఆమె’ను వరించాయి. ములుగు మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వు కాగా అక్కడ చింతనిప్పుల చంద్రకళ చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నారు. మహబూబాబాద్ ఎస్టీ జనరల్ అయినప్పటికీ ఇక్కడ ఎస్టీ మహిళ గుగులోత్ జ్యోతికి పురపీఠం వరించింది. మరిపెడలో వీసారపు ప్రగతి, కేసముద్రంలో బానోత్ సునీత, నర్సంపేటలో పెండెం శ్రీలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్నికలు జరిగిన జనగామ బీసీ జనరల్కు రిజర్వు కాగా, ఇక్కడ లాటరీ ద్వారా 22వ వార్డు కౌన్సిలర్ కడకంచి బాలమణిని చైర్పర్సన్గా అదృష్టం వరించింది. డోర్నకల్ ఎస్సీ జనరల్ కాగా ఇక్కడా మహిళకు అవకాశం ఇవ్వడంతో కుండేటి రాజకుమారి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా వైస్ చైర్పర్సన్లుగా లావణ్య (డోర్నకల్), నీల రాజమ్మ (స్టేషన్ఘన్పూర్), నేనావత్ షీభారాణి (వర్ధన్నపేట), హతియా షాహీన్ (ములుగు), దివ్య (పరకాల), సునీత (మరిపెడ), అల్లం రమ (కేసముద్రం)కు చాన్స్ దక్కింది. బీఆర్ఎస్ గెలుస్తుందనుకున్న తొర్రూరు మున్సిపాలిటీ కూడా లాటరీలో కాంగ్రెస్కే దక్కగా, అక్కడ 14వ వార్డు కౌన్సిలర్ సోమ రజిని వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. జ్యోతి మహబూబాబాద్బాలమణి జనగామబానోత్ సునీత కేసముద్రంరాజకుమారి డోర్నకల్ వీసారపు ప్రగతి మరిపెడపెండెం శ్రీలక్ష్మి నర్సంపేట– సాక్షిప్రతినిధి, వరంగల్చంద్రకళ ములుగుగెలిపించింది, గెలిచింది ‘ఆమె’నేగ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన నారీమణులు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎన్నికల నిర్ణేతలుగా నిలిచారు. ఇదే సమయంలో అత్యధిక మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ పీఠాలను అధిష్టించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17.. మూడు తేదీల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పురుషులకంటే 1.09 లక్షల మంది మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగాప్రచురించిన ఓటర్ల జాబితాలో నూ భూపాలపల్లి మినహా అంతటా వారిదే ఆధిక్యం ఉంది. మొత్తం 12 బల్దియాలలో 3,35,244 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 1,72,087 కాగా, పురుషులు 1,63,088. ఇందులో 1,27,004 మంది పురుషులు ఓట్లేయగా, మహిళలు 1,35,238 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. నీల రాజమ్మ స్టేషన్ఘన్పూర్సునీతారెడ్డి మరిపెడజనగామ ఎమ్మెల్యే పల్లా ఎంపీ కిరణ్కుమార్రెడ్డి ఎంపీ వద్దిరాజు రవిచంద్రఅల్లం రమ కేసముద్రంషీభారాణి వర్ధన్నపేటఏకు దివ్య పరకాలలావణ్య డోర్నకల్ రజిని తొర్రూరు ఆసియాషాహీన్ ములుగుచైర్ పర్సన్లుఓరుగల్లు మున్సిపల్ పీఠాలపై మహిళలదే పై‘చేయి’.. మున్సిపల్ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశం 12 మున్సిపాలిటీలకు ఏడు చోట్ల మహిళలే చైర్పర్సన్లు 8 మున్సిపాలిటీల్లో వారే వైస్ చైర్పర్సన్లు.. ‘ఆమె’కు కలిసొచ్చిన ‘లక్కీ’ వైస్ చైర్ పర్సన్లు ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్.. మహిళలకు దక్కిందెక్కడ.. -
ఇదేం తీరు?
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తి హవేలి ప్రభుత్వ ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాలల నిర్వహణ తీరుపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాల (పీఎస్)ను మంగళవారం సందర్శించి విద్యార్థులకు మధ్యాహ్నం వండిపెట్టే బియ్యంలో పురుగులు ఉండడమే కాకుండా కూర సరిపోకపోవడం, అందరికీ సరిపోయేలా వంటకాలు లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం అరుణకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని, వంటలు వండే వారిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు పాఠశాలల ఆవరణ పరిశుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో అటెండెన్స్ రిజిస్టర్లో ముగ్గురు ఉపాధ్యాయులు ఉదయం, మధ్నాహ్నం హాజరు సంతకాలను ఒకేసారి పెట్టడంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎంఈఎ రవీందర్ను ఆదేశించగా ఆయన కలెక్టర్కు సమర్పించారు. టెన్త్ క్లాస్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్తేజ, ఎంపీఓ శ్రీనివాస్, సర్పంచ్లు తుమ్మనపెల్లి స్వప్న, జన్ను దివ్యభారతి, హెచ్ఎం రంగనాథ్, పంచాయతీ కార్యదర్శులు నల్లెల్ల స్వప్న, నరేష్, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య తదితరులు ఉన్నారు. రెండో విడత సర్పంచ్ల శిక్షణ కార్యక్రమం పరిశీలన జిల్లాలోని నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం, రాయపర్తి మండలాలకు చెందిన సర్పంచ్లకు గ్రామపంచాయతీ పాలనపై రెండో విడతలో భాగంగా గంగదేవిపల్లిలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ మేరకు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సత్యశారదతో పాటు పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ వెస్లీ వేర్వేరుగా పరిశీలించారు. పాఠశాలల నిర్వహణపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం హెచ్ఎంకు షోకాజ్ నోటీసు టెన్త్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపైనా అసంతృప్తి ఉపాధ్యాయుల హాజరు తీరుపై అసహనం -
మెరిసిన ఆరెపల్లె..!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఆరెపల్లె గ్రామపంచాయతీ బాలల స్నేహపూర్వక పంచాయతీ (చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ (సీఎఫ్పీ))గా రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2023–24 సంవత్సరానికి గాను ఈ గుర్తింపును గ్రామం సాధించినట్లు తాజాగా పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచిక పేర్కొంది. రాష్ట్రస్థాయిలో గ్రామం ప్రశంసనీయమైన 89.95 సూచీ సాధించింది. దీంతో జాతీయ పంచాయతీ అవార్డులు –2025 కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామం పేరును కేంద్రానికి నామినేట్ చేసింది. పంచాయతీ ఇండెక్స్ (పీఏఐ) కింద మొత్తం 9 విభాగాల్లో జాతీయ అవార్డుల కోసం ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ప్రతీ విభాగంలో రాష్ట్రం నుంచి ఒక్కో గ్రామ పంచాయతీని జాతీయ అవార్డు కోసం ఎంపిక చేసి పంపించగా, వాటిలో ఆరెపల్లి గ్రామం స్నేహపూర్వక పంచాయతీగా నిలిచింది. గ్రామానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్పంచ్ తుమ్మనపెల్లి స్వప్న, పంచాయతీ కార్యదర్శి నల్లెల్ల స్వప్న హర్షం వ్యక్తం చేశారు. కాగా, గ్రామాన్ని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వెస్లీ, కలెక్టర్ సత్యశారద మంగళవారం వేర్వేరుగా సందర్శించారు. గ్రామంలోని అంగన్వాడీ, పూర్వ ప్రాథమిక పాఠశాలలో బాలలకు అందుతున్న పౌష్టికాహారం, వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రం, శానిటేషన్, నర్సరీలను పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని, అన్ని రికార్డులు సరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో కేంద్ర బృందం గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉందని వెస్లీ చెప్పారు. రాష్ట్ర స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా గుర్తింపు జాతీయ పంచాయతీ అవార్డు కోసం నామినేట్ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, పంచాయతీ రాజ్శాఖ డిప్యూటీ కమిషనర్ -
ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు
ఐనవోలు: మల్లికార్జునస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ మాడవీధుల్లో స్వామి, అమ్మవార్లు పర్వత వాహనసేవపై ఊరేగారు. గవ్యాంత పూజలు, రుద్రహోమం, చండీహోమం, మృగయాత్ర, నిత్య ఉపాసన, బలిహరణ, మహా పూర్ణాహుతి, చూర్మోత్సవం, వసంతోత్సవం, త్రిశూల స్నానం తదితర కార్యక్రమాలను ఒగ్గుపూజారులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో సకలదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. ముగింపునకు చిహ్నంగా పరివార దేవతలకు ఉద్వాసన పలికారు. వేదమంత్రాల మధ్య ధ్వజారోహణ చేసి శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు అర్చకులు ప్రకటించారు. అనంతరం ఆశీర్వచనం, పండితులను సన్మానించారు. రాత్రి ఒగ్గు పూజారులు పవళింపు సేవ, పుష్పోత్సవం, ఏకాంత సేవలు జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఈఓ కందుల సుధాకర్, ఉపప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్వినాయక్ శర్మ, అర్చకులు భానుప్రసాద్శర్మ, నరేశ్శర్మ, మధు శర్మ, శ్రీనివాస్, దేవేందర్, జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
సర్ మ్యాపింగ్ 47శాతం పూర్తి
న్యూశాయంపేట: జిల్లాలోని వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మ్యాపింగ్ 47.79శాతం పూర్తి అయిందని, మిగిలిన ప్రక్రియ నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పాల్గొన్నారు. నక్షా లేని గ్రామాల్లో రీసర్వే జిల్లాలోని నక్షా లేని గ్రామాల్లో రీసర్వే నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు, అధి కారులు, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ తీన్మార్
జనగామ/తొర్రూరు/డోర్నకల్: జనగామ పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాటకీయంగా సాగాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపీరామ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం హాలులో ప్రారంభమైన ప్రక్రియలో మొదట చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ సభ్యుల ఓటింగ్లో ఆ పార్టీకి చెందిన 12 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓటుగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి చేతులు ఎత్తడంతో మొత్తం 16 ఓట్లు వచ్చాయి. వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు రాగా 13 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి వారికి కూడా 16 ఓట్లు రావడంతో టెన్షన్ నెలకొంది. ఇరుపక్షాలకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి గోపీరామ్ లాటరీ విధానాన్ని అమలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, పోలీసుల సమక్షంలో మొదట తీసిన చీటీలో బాలమణి పేరు రావడంతో ఆమె లక్కీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మద్దతుదారుడు 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్నికై న ఇద్దరికీ ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అదేవిధంగా తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి 9 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు గెలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓట్లు వేశారు. దీంతో ఓట్లు సమానం కావడంతో ఇరు పార్టీలు సూచించిన వార్డు సభ్యులపేర్లతో చీటలు వేసి లాటరీ తీయగా వచ్చిన పేర్లను ప్రకటించారు. ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తూనం శ్రావణ్ కుమార్ చైర్మన్గా, సోమ రజిని వైస్ చైర్పర్సన్గా ఎంపికైనట్లు ఆర్డీఓ ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డోర్నకల్లో మొత్తం 15 వార్డుల్లో 11మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, నలుగురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండగా మంగళవారం అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండేటి రాజకుమారిని, వైస్ చైర్పర్సన్గా మాదా లావణ్య పేర్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ నుంచి ఎవరిని ప్రతిపాదించకపోవడంతో వారిద్దరిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. జనగామ, తొర్రూరు, డోర్నకల్ సైతం కాంగ్రెస్ కైవసం లాటరీ పద్ధతిలో జనగామ, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక -
సంఘమేశ్వరుడి కల్యాణం
సంగెం: మండల కేంద్రంలోని సంఘమేశ్వరాలయంలో ఆదివారం రాత్రి సంఘమేశ్వరస్వామి, గంగాభవానీ పార్వతిదేవి వివాహం వైభవంగా జరిగింది. అర్చకులు అప్పె నాగార్జున శర్మ వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ తంతు నిర్వహించారు. సంఘమేశ్వరుడి తరఫున ఆలయ కమిటీ చైర్మన్ మునుకుంట్ల సరిత, కోటేశ్వర్, పార్వతీదేవి తరఫున సర్పంచ్ పేర్ల లలిత, రమేశ్ దంపతులు కల్యాణం చేపట్టారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చిన కల్యాణాన్ని తిలకించారు. ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే కుంటపల్లిలోని రామలింగేశ్వరాలయంలో పురోహితుడు అప్పె గోపీకృష్ణ శర్మ శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇందూరి శివారెడ్డి, రాణి, సర్పంచ్ పెంతల సువర్ణ, సురేందర్, తదితరులు హాజరై పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, మేకపోతుల బండ్లతో ప్రదక్షిణ చేశారు. -
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారి టి.సుమ ఆధ్వర్యంలో సోమవారం చైర్మన్ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పా ర్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా పాలకుర్తి సారంగపాణి పేరును మాలోతు దేవేందర్ ప్రతి పాదించగా, బెజ్జం పాపారావు బలపరిచారు. వైస్చైర్పర్స న్గా షీభారాణిని నూనావత్ కమిలి ప్రతిపాదించగా తిరుపెల్లి వాణి బలపరిచారు. బీఆర్ఎస్ తరపున గుజ్జ వీరన్న పేరును తీసుకు రాగా ఎన్నికల అధికారి అభ్యంతరం తెలుపుతూ తమకు బీఫామ్ అందజేయలేదని, పార్టీ తరఫున పోటీ చేయడానికి కుదరదని తెలపడంతో బీఆర్ఎస్ సభ్యులు ఎన్నికల అధికారితో వాగ్వాదానికి దిగారు. అయినా నిబంధనలకు లోబడి నిర్వహిస్తామని తెలపడంతో చివరకు ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిగా గుజ్జ వీరన్నను బానోతు జ్యోతి ప్రతిపాదించగా, సిలువేరు రమ బలపరిచారు. అనంతరం చేతులెత్తే పద్ధతిన చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. సారంగపాణికి ఇండిపెండెంట్ సభ్యురాలు షీభారాణి, ఎక్స్అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే నాగరాజుతో కలిపి ఏడుగురు కావడంతో చైర్మన్గా సారంగపాణిని ప్రకటించారు. -
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటాలి
● సీపీ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: సైబరాబాద్ కమిషనరేట్లో నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న నాలుగో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ క్రీడల్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు సత్తా చాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో, క్రీడా గ్రామంలో ఎగురవేసే వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడా పతకాన్ని సోమవారం సీపీ సన్ప్రీత్ సింగ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, క్రీడాకారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఈ పోటీల్లో పాల్గొనే పోలీస్ క్రీడాకారులకు సీపీ చేతుల మీదుగా ట్రాక్ సూట్తో పాటు స్పోర్ట్స్ షూ, టీ షర్ట్ అందజేశారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ క్రీడాకారులు తమ సత్తా చూపాలని, పోలీసులు శాంతి భద్రతల్లోనే కాదు క్రీడల్లో కూడా రాణించగలరని చూపాలన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి శాఖాపరమైన గుర్తింపు ఉంటుందని సీపీ తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ నాగయ్య, ఆర్ఐ సతీశ్, ఆర్ ఎస్సై శ్రవణ్కుమార్, క్యాంపు క్లర్క్ వేణుగోపాల్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రకృతిని రక్షిస్తూ వైజ్ఞానికంగా ఎదగాలి
ప్రకృతి కవి జయరాజు నర్సంపేట రూరల్: ప్రకృతిని రక్షిస్తూ వైజ్ఞానికంగా ఎదగాలని ప్రముఖ ప్రకృతి కవి, రచయిత, కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత జయరాజు అన్నారు. విజ్ఞాన దర్శిని, దినెహ్రు సెంటర్ నేచర్ ఫౌండేషన్ సంస్థలు ప్రారంభించిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర సోమవారం నర్సంపేటకు చేరింది. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాలని, ప్లాస్టిక్ను వీలైనంత వరకు నిషేధించాలన్నారు. ముఖ్యంగా తిను పదార్ధాల చోట పూర్తిగా నిషేధించాలన్నారు. ఎక్కువగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా శాస్త్రవేత్త రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ సంగీత్ సాగర్, వైస్ ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ కాళోజీ సెంటర్: ఖిలావరంగల్ మండలం లోతుకుంట జీపీ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న మనుపాటి రవిపై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. రవి విధులకు గైర్హాజరై కోర్టు పనులపై వెళ్లినప్పటికీ టీచర్ అటెండెన్స్ రిజిస్టర్లో హాజరైనట్లు సంతకం చేశారని, ఈ ఆరోపణపై విచారణ జరపగా రుజువు కావడంతో ఎంఈఓ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. రాష్ట్రస్థాయి గేమ్స్మీట్కు తరలిన విద్యార్థులు కాళోజీ సెంటర్: హైదరాబాద్ దోమగూడలోని ప్రభుత్వ వ్యాయామ పాఠశాలలో నేడు (మంగళవారం) జరగనున్న రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల గేమ్స్మీట్కు జిల్లా విద్యార్థులు తరలివెళ్లారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సమ్మిళిత విద్యావిభాగం సిబ్బందితో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. ఈ మేరకు సోమవారం డీఈఓ రంగయ్యనాయుడు జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు, 14 మంది తల్లిదండ్రులు, 10 మంది సమ్మిళిత విద్యా ప్రత్యేక బోధకులు రాష్ట్ర స్థాయి గేమ్స్మీట్లో పాల్గొననున్నట్లు డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఏఎంఓ సుజన్తేజ, జీసీడీఓ ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు ● డీఐఈఓ శ్రీధర్ సుమన్కాళోజీ సెంటర్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ సెంటర్లో సీసీ కెమెరాలు, గోడ గడియారం, డ్యుయల్ డెస్క్లతో పాటు మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సులో 5,210 మంది, ఒకేషనల్ కోర్సులో 793 మంది, మొత్తం 6,003 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ కోర్సులో 5,356 మంది, ఒకేషనల్ కోర్సులో 807 మంది, మొత్తం 6,163 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షల విధుల్లో ఇన్విజిలెటర్లు 380 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 1, సిట్టింగ్ స్క్వాడ్ 4, కస్టోడియన్స్ వరంగల్ 2, నర్సంపేట 2, చీఫ్ సూపరింటెండెట్లు 26, అడిషనల్ సీఎస్ 7, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 26, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 19 నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం హాల్టికెట్ ఇవ్వని పక్షంలో ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోని పరీక్షకు హాజరు కావచ్చన్నారు. విద్యార్థులకు ఏమైన ఇబ్బందులు ఎదురైతే 99668 88118, 89770 81640 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. -
ఎన్నిక ఇలా..
నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్గా పెండెం శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్గా గంధం నరేందర్ను కాంగ్రెస్ సభ్యులతో పాటు సీపీఎం, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల అధికారి, ఆర్డీఓ పోలం ఉమారాణి ఎంపికై న చైర్పర్సన్, వైస్ చైర్మన్లను ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో 30వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి 21, బీఆర్ఎస్ 6, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ 1 అభ్యర్థులు గెలుపొందారు. శుక్రవారం ఎంపిక ప్రక్రియను ఆర్డీఓ ఉమారాణి ప్రారంభించగా ఎక్స్ అఫిషియో అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన ఓటును వినియోగించుకోవడంతో 25 ఓట్లు లక్ష్మికి రావడంతో చైర్మన్గా ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు అన్ని పార్టీల నుండి ఎంపిక అయిన కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. -
హస్తం.. నవ ఉత్సాహం !
ఓరుగల్లులోని తొమ్మిది మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి..వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్గా సారంగపాణికి చేతులెత్తి మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ సభ్యులుహనుమకొండ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరైన సభ్యులుసాక్షిప్రతినిధి, వరంగల్ : తొమ్మిది మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ ప్రకారం సోమవారం ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఇందులో హంగ్లో ఉన్న వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్తోపాటు పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, స్టేషన్ఘన్పూర్, మరిపెడ, ములుగును కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. డోర్నకల్లో స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కౌన్సిలర్లు సకాలంలో ఎన్నికల కేంద్రానికి చేరని కారణంగా ఎన్నిక వాయిదా వేశారు. బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా తొర్రూరులో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్అఫీషియో ఓట్లతో మెజార్టీ సరి సమానం కావడం... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అక్కడి ఎన్నికనూ వాయిదా వేశారు. జనగామలో ఎన్నిక ప్రక్రియ మొదలైనప్పటినుంచే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా రెండు పార్టీలకు సరిసమానమైన సీట్లు ఉండడం.. ఇతర కారణాలను చూపుతూ ఎన్నికను వాయిదా వేశారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్లో మొత్తం 12 మున్సిపాలిటీలకు తొమ్మిదింటికే ఎన్నికలు జరగ్గా.. ఆ మూడు మున్సిపాలిటీలకు మంగళవారం (నేడు) ఎన్నికలు జరగనున్నాయి. తొమ్మిది పురపాలికలపై కాంగ్రెస్ జెండా... కలిసొచ్చిన ‘ఎక్స్ అఫీషియో’.. కాంగ్రెస్కు ఏడు స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ఎక్స్ అఫీషియో ఓట్లతో ఆ సంఖ్యను అధిగమించింది. కాగా, సోమవారం 9 మున్సిపాలిటీల్లో ఆ పార్టీ అభ్యర్థులు త్రివర్ణ జెండా ఎగురవేశారు. ములుగులో 12 గెలుచుకున్న కాంగ్రెస్ నుంచి చంద్రకళ చైర్మన్గా ఎన్నికయ్యారు. నర్సంపేటలో 21 సొంతగా గెలుచుకున్న కాంగ్రెస్ పెండెం శ్రీలక్ష్మికి చైర్పర్సన్గా అవకాశమిచ్చింది. పరకాల నుంచి పావుశెట్టి సునీల్, మరిపెడలో ప్రగతి, స్టేషన్ఘన్పూర్లో వినయ్కుమార్, భూపాలపల్లిలో కొమురయ్య కాంగ్రెస్ నుంచి చైర్మన్లుగా ఎన్నికయ్యారు. హంగ్గా ఉన్న మహబూబాబాద్, వర్ధన్నపేట, కేసముద్రంలో ఎక్స్అఫీషియో ఓట్లతో కాంగ్రెస్కు చెందిన గుగులోతు జ్యోతి, పాలకుర్తి సారంగపాణి, బానోతు సునీత చైర్మన్గా ఎన్నికయ్యారు. ఉద్రిక్తంగా సాగిన మున్సిపల్ ఎన్నికల తంతు హంగ్లోని రెండింటినీ కై వసం చేసుకున్న కాంగ్రెస్ మొత్తం 9 పురపాలికలకు జరిగిన ఎన్నికలు.. తొర్రూరు, జనగామ, డోర్నకల్ ఎన్నికలు నేటికి వాయిదా.. డోర్నకల్లో స్పష్టమైన మెజార్టీ.. మరో రెండింటిపైనా హస్తం గురి?సోమవారం జరగాల్సిన డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. స్పష్టమైన మెజార్టీ ఉన్న వాయిదా పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం ఇతర కారణాల వల్ల కొందరు ఆ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కావడానికి విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు గైర్హాజరుగా కాగా, డోర్నకల్ ఎన్నిక వాయిదా పడినట్లు చెబుతున్నారు. కాగా, డోర్నకల్తో పాటు మంగళవారం జరిగే ఎన్నికల సందర్భంగా తొర్రూరు, జనగామను సైతం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సోమవారం తొర్రూరు, జనగామలో ఆద్యంతం మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఉద్రిక్తంగా జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తొర్రూరు, జనగామలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల తీరుపై పలుమార్లు ఆందోళనకు దిగారు. ఒక దశలో లాఠీచార్జ్ కూడా జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో చివరకు వాయిదా పడగా.. డోర్నకల్తో పాటు జనగామ, తొర్రూరును దక్కించుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం సైతం ఈ విషయంలో సీరియస్గా ఉండడంతోపాటు హంగ్ మున్సిపాలిటీలు తొర్రూరు, జనగామకు ఇన్చార్జ్లను సోమవారం సాయంత్రం నియమించింది. తొర్రూరుకు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జనగామకు ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వ్యవహరించనున్నారు. -
చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ కుట్ర
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బకొట్టాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కుట్రపూరిత ఆలోచనలు చేసినా.. వారి ఆటలు సాగడం లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. చైర్మన్ పదవిని దక్కించుకోవద్దనే ఆలోచనతో బీఆర్ఎస్ బ్రోకర్లతో బేరసారాలు చేసిందని ఆరోపించారు. పరకాల నియోజకవర్గంలో రౌడీయిజాన్ని ఉక్కుపాదంలా అణచివేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో 13 మందిని గెలిపించిన పరకాల పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పరకాల మున్సిపాలిటీని నూతన పాలకవర్గం మెచ్చేలా పాలన కొనసాగేందుకు కృషిచేస్తానని స్పష్టం చేశారు. మున్సిపల్ గెలుపుతో పరకాల ఎమ్మెల్యేగా తనపై మరింత బాధ్యత పెరిగిందని, పరకాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. గత రెండేళ్లలో పట్టణాభివృద్ధికి తాను చేస్తున్న తీరుకు తీర్పుగా పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారన్నారు. కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, మాజీ ఎంపీపీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఆయా శాఖల అధికారులు, తహసీల్దార్లు వేగంగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. వినతుల పరిష్కారంలో ఆలస్యం చేయవద్దని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 89 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ వై.వి గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ● మారని ఎంజీఎం ఏఎంసీ తీరు ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర విభాగాల పని తీరు పూర్తిగా అధ్వానంగా మారుతోంది. రెండు నెలల క్రితం డీఎంఈ ఆస్పత్రిని పరిశీలించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. దానికి తోడు రోజురోజుకూ సేవలు మరింత అధ్వానంగా మారుతున్నాయి. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఏఎంఎసీ, ఐఎంసీ విభాగాల్లో నిత్యం పడకల్లో ఒక్కరు లేదా ఇద్దరు పేషెంట్లను ఉంచుతున్నారు. కొన్ని సందర్భాల్లో స్ట్రెచర్లపై, వీల్ చైర్లపైనే వైద్యం అందిస్తున్నారు. ఇలా వైద్యం పొందే వారు జ్వరం, స్వల్ప అస్వస్థతలో వచ్చే వారు కాదు. ప్రాణపాయస్థితిలో ఉన్న వారే ఎక్కువ మంది. పరిస్థితిని బట్టి చూస్తే ఎంజీఎం ఆస్పత్రిలో ఏ మేర వైద్యసేవలు అందుతున్నాయో అర్థమవుతోంది. ఈ విషయాన్ని రోగుల సహాయకులు పరిపాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆ సమయాల్లో విధులు నిర్వర్తించాల్సిన డీఎంఓ, డీఎస్ఓఓలు కానరావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలు పర్యవేక్షించాల్సిన ఆర్ఎంఓలు చాంబర్లు దాటి వార్డులకు రావట్లేదని వారంతా వాపోతున్నారు. -
ఘనంగా నాగవెల్లి సదస్యం
హన్మకొండ కల్చరల్: వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరీరుద్రేశ్వరస్వామికి నాగవెల్లి సదస్యం నిర్వహించారు. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్, ప్రణవ్ ప్రత్యేక పూజలు చేశారు. మహాలక్ష్మి సూక్త మహా యాగం నిర్వహించారు. అనంతరం వేదస్వస్థితో రుద్రేశ్వరస్వామి రుద్రేశ్వరీ అమ్మవారికి నాగవెల్లి, నీలవేణి మహాలక్ష్మి గౌరీ పూజలు నిర్వహించారు. 11మంది వేదపండితులు వేదస్వస్తి పఠనం చేశారు. నాగవెల్లి కార్యక్రమంలో దాత వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరి దంపతులు, మండువ శేషగిరిరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. నేడు అన్నపూజ.. మంగళవారం ఉదయం రుద్రేశ్వరస్వామికి అన్న పూజ నిర్వహించనున్నట్లు అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ జరుగుతుందని, అన్నపూజలో పాల్గొనేవారు రూ. 5,116 చెల్లించి రశీదు పొందవచ్చని ఆలయ ఈఓ అనిల్కుమార్ తెలిపారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్పార్క్ (స్కీమ్ ఫర్ ప్రమోషనల్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో నేషనల్ వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. ఆరు రోజుల పాటు ‘నానోథెరానోస్టిక్స్–2 ట్రాన్స్లేషనల్ మెడిసిన్ వైపు ఒక అడుగు’ అంశంతో నిర్వహించనున్న నేషనల్ వర్క్షాప్ను కెనడా యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా ప్రొఫెసర్లు సురేశ్ గడ్డె, లీషేంగ్ వాంగ్, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడా రు. మారుతున్న కాలానుగుణంగా రోగి స్థితిని బట్టి పరిశోధనలతో ట్రాన్స్లేషన్ మెడిసిన్స్ తోడ్పడుతాయన్నారు. మెడిసిన్ రంగంలో నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు వేదికగా వర్క్షాప్ నిలవాలన్నారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు శ్రీనివాసరావు, పీవీ.శ్రీలక్ష్మి, సంతోశ్, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: సైబరాబాద్ కమిషనరేట్లో నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న నాలుగో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ క్రీడల్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు సత్తా చాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో, క్రీడా గ్రామంలో ఎగురవేసే వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడా పతకాన్ని సోమవారం సీపీ సన్ప్రీత్ సింగ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, క్రీడాకారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఈ పోటీల్లో పాల్గొనే పోలీస్ క్రీడాకారులకు సీపీ చేతుల మీదుగా ట్రాక్ సూట్తో పాటు స్పోర్ట్స్ షూ, టీ షర్ట్ అందజేశారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ క్రీడాకారులు తమ సత్తా చూపాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నాగయ్య, ఆర్ఐ సతీశ్, ఆర్ ఎస్సై శ్రవణ్కుమార్, క్యాంపు క్లర్క్ వేణుగోపాల్, క్రీడాకారులు పాల్గొన్నారు. హన్మకొండ చౌరస్తా: వ్యాక్సినేషన్ కోసం వచ్చే గర్భిణులు, బాలింతలతో దురుసుగా ప్రవర్తించవద్దని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన గత బుధవారం నిర్వహించిన వ్యాక్సినేషన్ సెషన్ల వివరాలు పరిశీలించారు. సెంటర్కు వచ్చే వారితో మర్యాదగా మెసులుకోవాలని, సమయపాలన పాటించాల న్నారు. టీకా, పోలియో చుక్కల కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని, సిబ్బందిని నియమించాలని టీకా సెంటర్ సిబ్బంది డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. -
పరకాల.. ప్రశాంతం
పరకాల: చైర్మన్..వైస్ చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మెజార్టీ కంటే అదనంగా మరో సీటును 13 వార్డులను కాంగ్రెస్ గెలుచుకోవడంతో పరకాల మున్సిపల్ కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారంతో పాటు చైర్మన్ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల సమయం నుంచి పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా.. చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ పరకాల మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అదే విధంగా ఎవరూ ఊహించని విధంగా మొదటిసారిగా కౌన్సిలర్గా గెలిచిన 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఏకు దివ్య పేరు తెరమీదికి రావడమే ఆలస్యం ఆమె వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ కోసం పార్టీలో ఆరుగురు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడటంతో చివరకు దివ్యను వైస్ చైర్మన్గా పార్టీ పెద్దలు నిర్ణయించడంతో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్.అంజయ్య ధ్రువీకరణ పత్రం అందజేశారు. నేరుగా కార్యాలయానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు రాష్ఠ్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం పరకాల మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారత్సోవానికి మున్సిపల్ సమావేశ మందిరంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్డీఓ కె.నారాయణ, మున్సిపల్ కమిషనర్ అంజయ్య పర్యవేక్షణలో కొత్త కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్గా ఎన్నిక చేపట్టారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి క్యాంపులో ఉన్న 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో నేరుగా కార్యాలయానికి 10:50 గంటలకు చేరుకున్నారు. కొంత ఆలస్యంగా 11:05 గంటలకు బీఆర్ఎస్ ఐదుగురు కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు చేరుకున్నారు. ఒక్క 5వ వార్డు కౌన్సిలర్లు (బీఆర్ఎస్) హాజరుకాలేదు. ప్రమాణ స్వీకరాత్సోవాన్ని 12 గంటలకు పూర్తి చేశారు. అరగంట తర్వాత 12.30 గంటలకు మున్సిపల్ చైర్మన్గా పావుశెట్టి సునీల్ను చైర్మన్ అభ్యర్థిగా 19వ వార్డు కొయ్యడ శ్రీనివాస్ ప్రతిపాదించగా 16వ వార్డు అభ్యర్థి బండి శ్రీధర్ బలపర్చడంతో మిగతా 10 మంది ఆయనకు ఓటు వేశారు. దీంతో చైర్మన్గా పావుశెట్టి సునీల్ ఎన్నికై న ట్లు ఆర్డీఓ నారాయణ ప్రకటించారు. చైర్మన్గా ప్రమాణస్వీకారం చేసిన సునీల్కు మున్సిపల్ కమి షనర్ అంజయ్య ధ్రువీకరణ పత్రం అందజేశారు. చైర్మన్ ఎన్నిక తర్వాత 1 గంటకు వైస్ చైర్మన్ను ఎన్నికోవాల్సిన అధికారులు.. వైస్ చైర్మన్ ఎన్నిక వా యిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు 1.15 నిమిషాలకు బయటకు వె ళ్లిపోగా 2.18 గంటలకు నాటకీయ పరిణామాల మ ధ్య వైస్ చైర్మన్గా దివ్య ఎంపికైనట్లు ప్రకటించారు. -
వైస్ చైర్మన్ ఎన్నికలో నాటకీయం
పరకాల: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య వైస్ చైర్మన్గా ఏకు దివ్యను ఎన్నుకున్నారు. ఆమె ఎన్నికతో ఒక్కసారిగా బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీల నాయకులతో మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా అని చెప్పడంతోనే తాము బయటకు వెళ్లిపోయాయమని కానీ, మధ్యాహ్నం 1.52 గంటలకు ఫోన్ ద్వారా మెసేజ్ చేసి కోరం లేకుండానే వైస్ చైర్మన్ ఎన్నిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో పరకాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. మున్సిపల్ కార్యాలయ గేట్లు నెడుతూ లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏసీపీ సతీశ్బాబు, సీఐ క్రాంతికుమార్ జోక్యం చేసుకొని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లను ఆర్డీఓతో మాట్లాడుకోవాలని నచ్చజెప్పారు. దీంతో కార్యాలయం లోపలికి వచ్చిన బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు తాము లేకుండా వైస్ చైర్మన్ నియామకం ఎలా చేస్తారని, ఈ అక్రమ ఎన్నికపై ఎన్నికల కమిషన్, కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మొదటి సమావేశంలోనే మోసం: బీజేపీ పరకాల మున్సిపల్ ఏర్పడ్డ చరిత్రలో మొదటిసారి అక్రమ పద్ధతిలో వైస్ చైర్మన్ను ఎన్నుకున్నారు. కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ ఉన్న తర్వాత వాయిదా వేస్తున్నట్లు అధికారులు మొదట ఎందుకు ప్రకటించి బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లను తప్పుదోవ పట్టించి బయటకు వెళ్లేలా చేశారు. బయటకు వెళ్లిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వైస్ చైర్మన్గా ఏకు ది వ్యను ఎన్నుకున్నారు. కాంగ్రెస్ మోసాలకు నిదర్శనంగా వైస్ చైర్మన్ ఎన్నికను భావిస్తున్నాం. అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలికారు. వాయిదా వేసినట్లే వేసి.. వైస్ చైర్మన్ ఎన్నికతో వివాదం ఆందోళనకు దిగిన బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు పరకాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత -
మున్సిపాలిటీలు, రిజర్వేషన్లు, పార్టీల వారీగా రేసులో ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతంలో గంటగంటకో పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్కు 7, బీఆర్ఎస్కు ఒకచోట స్పష్టమైన మెజార్టీ వచ్చింది. వర్ధన్నపేట, మహబూబాబాద్, కేసముద్రం, జనగామలో హంగ్ ఏర్పడింది. హంగ్లో రెండు కాంగ్రెస్కు, రెండు బీఆర్ఎస్కు అనుకూలమన్న చర్చ ఫలితాల ఆధారంగా జరిగింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల ప్రకారం ‘ఎక్స్ అఫీషియో’ నిబంధనల మేరకు హంగ్ మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే పరిస్థితి నెలకొనగా.. క్లియర్ మెజార్టీ ఉన్న తొర్రూరుపై సందిగ్ధం నెలకొంది. సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నిక కానుండగా.. జనగామ, తొర్రూరు టాస్తో వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం కలకలం రేపుతోంది. పావులు కదుపుతున్న కాంగ్రెస్ పెద్దలు.. పరకాల, ములుగు, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, మరిపెడ, నర్సంపేట క్లియర్గా కాంగ్రెస్ సొంతం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్కు దక్కనుందని గెలిచిన వార్డు సభ్యుల గణాంకాలు వెల్లడించాయి. మహబూబాబాద్, జనగామ, వర్ధన్నపేట, కేసముద్రంలో స్పష్టమైన మెజార్టీ లేక హంగ్లో చేరాయి. దీంతో ఎలాగైనా అత్యధిక స్థానాలను కై వసం చేసుకోవాలని భావించిన అధికార కాంగ్రెస్.. మంత్రులు, ముఖ్యనేతలను రంగంలోకి దింపిది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇన్చార్జ్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్వర్వులను అనుకూలంగా మార్చుకుని ‘హంగ్’లలో ‘ఎక్స్అఫీషియో’ అస్త్రాన్ని ప్రయోగించాయి. దీంతో స్పష్టమైన మెజార్టీ ఉన్న ఏడు మున్సిపాలిటీలకు తోడు హంగ్లో ఉన్న నాలుగింటిని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. చివరకు బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న తొర్రూరు ఎన్నికను టాస్కు తెచ్చి వాయిదా వేసి ఆ తర్వాత కాంగ్రెస్ స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. స్పష్టమైన మెజార్టీ ఉన్న ఏడు మున్సిపాలిటీలతో పాటు హంగ్లో ఉన్న వర్ధన్నపేట, మహబూబాబాద్, కేసముద్రం కలిపి మొత్తం 10 మున్సిపాలిటీలను సోమవారం తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎక్స్అఫీషియోతో ఫలితాలు తారుమారు ‘ఎక్స్అఫీషియో’ నిబంధనలు తెరపైకి వచ్చాక మున్సిపల్ ఎన్నికల పోరు రసకందాయంలో పడింది. ఎక్స్అఫీషియో ఓట్ల నమోదు తర్వాత ఫలితలు తారుమారయ్యాయి. జనగామ మున్సిపల్ పరిధిలో 30 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 12, ఆ పార్టీ మద్దతుతో గెలిచిన సీపీఎం ఒక స్థానంతో 13 రాగా, బీఆర్ఎస్ కూడా 13 స్థానాలను గెలుచుకుంది. 5, 8, 15, 23 వార్డులో స్వతంత్రులు గెలిచారు. ఇందులో 8, 23 వార్డులకు సంబంధించి అభ్యర్థులు బీఆర్ఎస్ పక్షాన ఉండగా, 5, 15 వార్డులకు చెందిన అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతునివ్వడంతో రెండు పార్టీలకు 15ః15 వార్డులున్నాయి. దీంతో రెండు పార్టీలు ఎక్స్అఫీషియో ఓట్లపై ఆశలు పెట్టుకోగా.. కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఓట్లు ఒకే కాగా, తలా 16 అయ్యాయి. దీంతో ఇక్కడ సోమవారం జరిగే ఎన్నికల సందర్భంగా టాస్ ఖాయం కానుండగా.. ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ లోపాయికారి ఒప్పందాలతో రెండు పార్టీలకు చెందిన ఒక్కరు, ఇద్దరు కౌన్సిలర్లు చేతులు ఎత్తకుండా ఉంటే మెజార్టీ స్థానాలున్న పార్టీకి చైర్మన్ పదవి దక్కే అవకాశం కూడా ఉంది. అలాగే, తొర్రూరు మున్సిపాలిటీ 16 వార్డుల్లో 9 గెలుచుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ ఖాయమనుకున్న తరుణంలో ఎడుగురు కౌన్సిలర్లున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఇక్కడ ఎక్స్ అఫీషియోలుగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఖాతాలో పడిందనుకున్న తొర్రూరు కూడా టాస్కు చేరనుంది. ఎన్నిక ప్రక్రియ.. బలాబలాల ప్రదర్శన తర్వాత సమానంగా ఉంటే ఇక్కడ కూడా వాయిదా వేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. -
పెన్సిల్ మొనపై శివలింగం
హసన్పర్తి: శివలింగం ప్రతిమను పెన్సిల్ మొనపై చెక్కి ఓ యువకుడు తన భక్తిని చాటుకున్నాడు. గోపాలపురం అరుణోదయ కాలనీకి చెందిన కళాకారుడు తాటికొండ శ్రీజిత్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్ మొనపై 2.5 మిల్లీమీటర్ల ఎత్తులో శివలింగం, 2 మిల్లీమీటర్ల ఎత్తులో మరో శివలింగాన్ని రూపొందించాడు. ఒక్కో శివలింగం ప్రతిమను చెక్కడానికి అరగంట సమయం పట్టిందని ఆయన తెలిపాడు. గతంలో శ్రీజిత్ వివిధ కళాఖండాలు చెక్కి అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించాడు. మిల్లీమీటర్ల సైజులో కళాఖండాలు రూపొందిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. శ్రీజిత్ ఎస్సార్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. -
లచ్చమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి
● కేఏఎన్పీఎస్ కన్వీనర్ లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షురాలు సరోజన కమలాపూర్ : ఇంటిబాట పునరుద్ధరణ కోసం ప్రాణత్యాగం చేసిన మొగిలిచెర్ల లచ్చమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి (కేఏఎన్పీఎస్) ఆల్ ఇండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజన డిమాండ్ చేశారు. తమ ఇంటి బాటను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ లచ్చమ్మ కుటుంబ సభ్యులు చేపట్టిన రిలే దీక్షలు 75వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా చలో కమలాపూర్ పిలుపులో భాగంగా ఆదివారం న్యాయపోరాట కమిటీ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. లచ్చమ్మ ఇంటి బాటను కబ్జా చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మొగిలిచెర్ల భిక్షపతిని వెంటనే సస్పెండ్ చేయాలని, లచ్చమ్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం లచ్చమ్మ కుటుంబ సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో ట్రైబల్ డెమొక్రటిక్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు పోరిక ఉదయ్సింగ్, గిరిజన మహిళా సంఘం నాయకురాలు సునీత, నాయకులు మోహనకృష్ణ, బండారి మల్లేశ్, రాజు, గుండె ప్రమోద్, జె.చక్రవర్తి, మొగిలిచెర్ల విలాస్, శిరీష పాల్గొన్నారు. -
నేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం
పరకాల: పరకాల మున్సిపల్ కొత్త పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి పరకాల మున్సిపల్ సమావేశ మందిరంలో కమిషనర్ ఎస్.అంజయ్య పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 22 మంది కౌన్సిలర్లు (13 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 3 బీజేపీ) హాజరుకానున్నారు. అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్కు చైర్మన్, వైస్చైర్మన్ పదవులు దక్కనున్నాయి. చైర్మన్ పదవికి పావుశెట్టి సునీల్, వైస్చైర్మన్ పదవికి కొయ్యడ శ్రీనివాస్, బండి శ్రీధర్, పసుల లావణ్య, పొరండ్ల మౌనిక, బొచ్చు మాధవీలత, అల్లె దశరథం పోటీ పడుతున్నారు. వైస్ చైర్మన్ పదవికి పోటీ పెరిగిపోవడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పెద్దలు క్యాంపులో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తూనే, కౌన్సిలర్లు క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో ఉదయం 10.30 గంటకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. పరకాల ఆర్టీఓ డాక్టర్ కె.నారాయణ మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్త కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు చైర్మన్, వైస్చైర్మన్, నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల పరిధిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గూమిగూడడం నేరమని పరకాల సీఐ క్రాంతి కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం లోపలికి ఎన్నికై న కౌన్సిలర్లు, కార్యాలయ ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉంటుంది. బయట వ్యక్తులు, ఎంపికై న వారి కుటుంబ సభ్యులు, పార్టీల నాయకులు, కార్యకర్తలకు అనుమతి లేదు. అదేవిధంగా అక్రిడిటేషన్, ఐడీ కార్డులు కలిగిన మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుంది. – ఎస్.అంజయ్య, మున్సిపల్ కమిషనర్ పరకాల మున్సిపల్ కార్యాలయంలో అధికారుల ఏర్పాట్లు క్యాంపు నుంచి నేరుగా చేరుకోనున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు -
పారదర్శకంగా..వేగంగా..
● ధ్రువపత్రాల జారీలో మధ్యవర్తుల జోక్యానికి చెక్ ● ఇక నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల విచారణ ● త్వరలో అందుబాటులో పేపర్లెస్ సేవలుసంగెం: రెవెన్యూశాఖలో పౌరసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు కొ త్త వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పౌరసేవల దరఖాస్తుల విచారణ కాగిత రహితం (పేపర్ లెస్)గా చేపట్టనుంది. ఆయా దరఖాస్తుల విచారణతో పా టు ఇచ్చే నివేదిక ప్రక్రియ మొత్తం ఇక ఆన్లైన్లో కొనసాగనుంది. ఇందుకోసం గ్రామ పాలనాధికారులకు కొత్తగా మొబైల్ యాప్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో మొబైల్ యాప్ పనితీరును రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో ఈ యాప్ ఆచరణలో సాంకేతికంగా తలెత్తుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకనుగుణంగా మార్పులు, చే ర్పులు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో అడ్డంకులన్నీ అధిగమించి పూర్తిస్థాయిలో రాష్ట్రంలో అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇలా.. మీసేవ కేంద్రాల్లో కులం, ఆదాయ తదితర సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసిన తర్వాత నిర్వాహకులు వి వరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వివరాలన్నీ తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తాయి. దరఖాస్తులను డౌ న్లోడ్ చేసుకుని, వాటి ఆధారంగా ఆర్ఐ, లేదా నా యబ్ తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సి బ్బందితో కలిసి విచారణ చేయాల్సి ఉంటుంది. కాని స్టేషనరీ కొరత కారణంతో రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోకుండా మీ సేవ కేంద్రాల నిర్వాహకుల నుంచి దరఖాస్తులను తెప్పించుకుని విచారణ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్ఐ, నాయబ్ తహసీల్దార్ల సెక్షన్లకు దరఖాస్తులు వెళ్లే క్రమంలో కొన్ని దరఖాస్తులు దొరకకుండా మిస్సింగ్ అయిన సందర్భాలూ ఉన్నాయి. కొత్త యాప్ వినియోగం ఇలా.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత చిరునామా ఆధారంగా ఆటోమేటిక్గా సంబంధిత జీపీఓల వ్యక్తిగత లాగిన్లోకి వెళ్తాయి. ఈ వివరాల ఆధారంగా సదరు జీపీఓ విచారణ పూర్తి చేసి ఆన్లైన్లో నివేదిక ఇస్తూ దరఖాస్తులను ఆర్ఐ లాగిన్ కు పంపిస్తారు. ఆర్ఐ కూడా ఇదేవిధంగా విచారణ చేసి నాయబ్ తహసీల్దార్ లాగిన్కు, అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్ దరఖాస్తు వెళ్తుతుంది. ఈ ప్రక్రి య మొత్తం కాగిత రహితంగా జరగనుంది. తహసీల్దార్ ఆమోదం అనంతరం మీసేవ కేంద్రం ద్వా రా దరఖాస్తుదారుడు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పు లేనప్పుటికీ వాటిపై విచారణ పద్దతిలో మాత్రమే ప్రభుత్వం మార్పు తీసుకురానుంది. -
భంభం భోలే..
వరంగల్సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026భంభం భోలే శంఖం మోగెలే.. అంటూ శివనాస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో శైవక్షేత్రాల్లో ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. అర్చకులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగెం మండలంలోని సంఘమేశ్వరాలయంలో ఏర్పాటు చేసిన మంచు లింగంను భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. చెన్నారావుపేట మండలంలోని సిద్ధేశ్వరాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట పట్టణంలోని శివాంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి, ద్వారకపేటలోని వేణుగోపాల వేంకటేశ్వరస్వామి, శిర్డీ సాయిబాబా ఆలయం, అయ్యప్పస్వామి దేవాలయాలతో పాటు వరంగల్లోని కాశీవిశ్వేశ్వరాలయం, శంభు లింగేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిపించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాగారాలు ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. – సాక్షి నెట్వర్క్ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఆలయాల్లో శివపార్వతుల కల్యాణం -
కేయూలో నేటినుంచి జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్: కేయూ పోలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో సరళీకరణ అనంతరం జనరంజక విధానాలు’ అనే అంశంపై ఈనెల 16, 17 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు డైరెక్టర్, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. ఈనెల 16న ఉదయం 10 గంటలకు కేయూలోని సెనేట్ హాల్లో జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్రెడ్డి పాల్గొననుండగా ప్రముఖ సామాజికవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు కంచ అయిలయ్య కీలకపోన్యాసం చేస్తారని తెలిపారు. వివిద చోట్ల నుంచి ప్రతినిధులు హాజరై పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. పొలిటికల్ సైన్స్ విభాగాఽ దిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య తెలిపారు. పీజీ కోర్సుల సిలబస్లో ఇక మార్పులు కేయూ క్యాంపస్: యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. జాతీయ పీజీ ప్రోగ్రామ్స్ ఫ్రేమ్వర్క్స్కు అనుగుణంగా కేయూలోని నాన్ప్రొఫెషనల్ పీజీ కోర్సుల్లో సిలబస్ను మార్పులు చేయబోతున్నారు. ఈమేరకు యూనివర్సిటీ అధికారులు నిర్ణయించి అన్ని విభాగాల అధితపతులను, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లను ఇటీవల వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆదేశించారు. పీజీ కోర్సుల్లో మూడో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్లలో రీసెర్చ్ మెథడాలజీ, రీసెర్చ్ ప్రాజెక్టు పాఠ్యాంశాలు తప్పనిసరిగా చేర్చాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఈవిషయంపై ఇటీవల నిర్వహించిన కేయూ అకాడమిక్ స్టాండింగ్ కమిటీలో కూడా నిర్ణయించినట్లు రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 14న ఉత్తర్వులు వెలువరించారు. కాగా, నాన్ ప్రొఫెషనల్ పీజీ కోర్సులన్నింటిలో 2026–27లో పీజీ రీసెర్చ్ ప్రాజెక్ట్ గైడ్షిప్ పూర్తి పనిభారం (వా రానికి 16 పీరియడ్లు కలిగిన) కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, పార్ట్టైం అధ్యాపకులకు కూడా కేటాయించేందుకు నిర్ణయించినట్లు రిజి స్ట్రార్ ఈనెల14న ఉత్తర్వులు వెలువరించారు. పెన్సిల్ మొనపై శివలింగం హసన్పర్తి: శివలింగం ప్రతిమను పెన్సిల్ మొ నపై చెక్కి ఓ యువకుడు తన భక్తిని చాటుకున్నా డు. గోపాలపురం అరుణోదయ కాలనీకి చెందిన కళాకారుడు తాటికొండ శ్రీజిత్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్ మొనపై 2.5 మిల్లీమీటర్ల ఎత్తులో శివలింగం, 2 మిల్లీమీటర్ల ఎత్తులో మరో శివలింగాన్ని రూ పొందించాడు. ఒక్కో శివలింగం ప్రతిమను చెక్కడానికి అరగంట సమయం పట్టిందన్నారు. గతంలో శ్రీజిత్ వివిధ కళాఖండాలు చెక్కి అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించాడు. మిల్లీమీటర్ల సైజులో కళాఖండాలు రూపొందిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. శ్రీజిత్ ఎస్సార్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఒకరిపై కేసు నర్సంపేట రూరల్: దాడి చేసిన కేసులో ఒకరిపై కేసు నమోదు చేసినట్లు చెన్నారావుపేట ఎస్సై రాజేష్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామానికి చెందిన రాజన్ననాయక్ అనే వ్యక్తి ఇస్లావత్ రాజును ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేయలేదని రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టి ఆ రోడ్డుగుండా వెళ్లనివ్వడం లేదు. పైగా రాజుపై దాడి చేయడంతో చెన్నారావుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రాజన్ననాయక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మున్సిపాలిటీలు, రిజర్వేషన్లు, పార్టీల వారీగా రేసులో ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతంలో గంటగంటకో పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్కు 7, బీఆర్ఎస్కు ఒకచోట స్పష్టమైన మెజార్టీ వచ్చింది. వర్ధన్నపేట, మహబూబాబాద్, కేసముద్రం, జనగామలో హంగ్ ఏర్పడింది. హంగ్లో రెండు కాంగ్రెస్కు, రెండు బీఆర్ఎస్కు అనుకూలమన్న చర్చ ఫలితాల ఆధారంగా జరిగింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల ప్రకారం శ్రీఎక్స్ అఫీషియోశ్రీ నిబంధనల మేరకు హంగ్ మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే పరిస్థితి నెలకొనగా.. క్లియర్ మెజార్టీ ఉన్న తొర్రూరుపై సందిగ్ధం నెలకొంది. సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నిక కానుండగా.. జనగామ, తొర్రూరు టాస్తో వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం కలకలం రేపుతోంది. పావులు కదుపుతున్న కాంగ్రెస్ పెద్దలు.. పరకాల, ములుగు, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, మరిపెడ, నర్సంపేట క్లియర్గా కాంగ్రెస్ సొంతం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్కు దక్కనుందని గెలిచిన వార్డు సభ్యుల గణాంకాలు వెల్లడించాయి. మహబూబాబాద్, జనగామ, వర్ధన్నపేట, కేసముద్రంలో స్పష్టమైన మెజార్టీ లేక హంగ్లో చేరాయి. దీంతో ఎలాగైనా అత్యధిక స్థానాలను కై వసం చేసుకోవాలని భావించిన అధికార కాంగ్రెస్.. మంత్రులు, ముఖ్యనేతలను రంగంలోకి దింపిది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇన్చార్జ్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్వర్వులను అనుకూలంగా మార్చుకుని ‘హంగ్’లలో ‘ఎక్స్అఫీషియో’ అస్త్రాన్ని ప్రయోగించాయి. దీంతో స్పష్టమైన మెజార్టీ ఉన్న ఏడు మున్సిపాలిటీలకు తోడు హంగ్లో ఉన్న నాలుగింటిని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. చివరకు బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న తొర్రూరు ఎన్నికను టాస్కు తెచ్చి వాయిదా వేసి ఆ తర్వాత కాంగ్రెస్ స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. స్పష్టమైన మెజార్టీ ఉన్న ఏడు మున్సిపాలిటీలతో పాటు హంగ్లో ఉన్న వర్ధన్నపేట, మహబూబాబాద్, కేసముద్రం కలిపి మొత్తం 10 మున్సిపాలిటీలను సోమవారం తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎక్స్అఫీషియోతో ఫలితాలు తారుమారు ‘ఎక్స్అఫీషియో’ నిబంధనలు తెరపైకి వచ్చాక మున్సిపల్ ఎన్నికల పోరు రసకందాయంలో పడింది. ఎక్స్అఫీషియో ఓట్ల నమోదు తర్వాత ఫలితలు తారుమారయ్యాయి. జనగామ మున్సిపల్ పరిధిలో 30 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 12, ఆ పార్టీ మద్దతుతో గెలిచిన సీపీఎం ఒక స్థానంతో 13 రాగా, బీఆర్ఎస్ కూడా 13 స్థానాలను గెలుచుకుంది. 5, 8, 15, 23 వార్డులో స్వతంత్రులు గెలిచారు. ఇందులో 8, 23 వార్డులకు సంబంధించి అభ్యర్థులు బీఆర్ఎస్ పక్షాన ఉండగా, 5, 15 వార్డులకు చెందిన అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతునివ్వడంతో రెండు పార్టీలకు 15ః15 వార్డులున్నాయి. దీంతో రెండు పార్టీలు ఎక్స్అఫీషియో ఓట్లపై ఆశలు పెట్టుకోగా.. కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఓట్లు ఒకే కాగా, తలా 16 అయ్యాయి. దీంతో ఇక్కడ సోమవారం జరిగే ఎన్నికల సందర్భంగా టాస్ ఖాయం కానుండగా.. ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ లోపాయికారి ఒప్పందాలతో రెండు పార్టీలకు చెందిన ఒక్కరు, ఇద్దరు కౌన్సిలర్లు చేతులు ఎత్తకుండా ఉంటే మెజార్టీ స్థానాలున్న పార్టీకి చైర్మన్ పదవి దక్కే అవకాశం కూడా ఉంది. అలాగే, తొర్రూరు మున్సిపాలిటీ 16 వార్డుల్లో 9 గెలుచుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ ఖాయమనుకున్న తరుణంలో ఎడుగురు కౌన్సిలర్లున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఇక్కడ ఎక్స్ అఫీషియోలుగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఖాతాలో పడిందనుకున్న తొర్రూరు కూడా టాస్కు చేరనుంది. ఎన్నిక ప్రక్రియ.. బలాబలాల ప్రదర్శన తర్వాత సమానంగా ఉంటే ఇక్కడ కూడా వాయిదా వేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. -
నేడే ముహూర్తం
● నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ● ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు సమావేశం ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు వర్ధన్నపేట: పురపోరు తుది అంకానికి చేరుకుంది. నేడు (సోమవారం) మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకోనున్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నేడు (సోమవారం) ఉదయం 10 గంటల వరకు పాలకవర్గ సభ్యులు చేరుకోవాల్సి ఉంటుంది. అనంతరం పాలకవర్గ సభ్యులకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై అవగాహన కల్పిస్తారు. తదుపరి ఉదయం 11 గంటలకు చైర్మన్ ఎన్నికై న తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. వర్ధన్నపేట పీఠం ‘హస్తం’దే.. వర్ధన్నపేట మున్సిపాల్టీలో 12 వార్డులకు ఎన్నిక జరగగా 6 బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలుపొందారు. ఐదుగురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వారు గెలుపొందగా 5వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శీభారాణి గెలుపొందారు. ఎక్స్అఫిషియో ఓటు ఎమ్మెల్యే నాగరాజు నమోదు చేసుకోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలం సమానంగా మారింది. దీంతో శీభారాణి మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇంత వరకు ఉత్కంఠగా మారిన వర్ధన్నపేట చైర్మన్ గిరికి తెరపడింది. శీభారాణి మద్దతుతో కాంగ్రెస్ బలం ఏడుకు పెరగడంతో కాంగ్రెస్ పీఠం వర్ధన్నపేట మున్సిపాలిటీ దక్కించుకున్నట్లయింది. శీభారాణి గత మున్సిపల్ ఎన్నికల్లో ఇదే వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఒక్క ఓటుతో స్వతంత్ర అభ్యర్థి బానోతు అనితపై ఓడిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన ఆధిపత్యాన్ని చాటుకున్నట్లయింది. శీభారాణికి కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆమె తన మద్దతు తెలిపినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెకు చైర్పర్సన్ కావాలని కోరినట్లు తెలిసింది. చైర్పర్సన్ లేదా వైస్ చైర్మన్గా అవకాశం ఉంటుందని ప్రచారం కొనసాగుతోంది. -
బంజారాల మార్గదర్శి సేవాలాల్
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ● జిల్లావ్యాప్తంగా ఘనంగా సేవాలాల్ జయంతిగీసుకొండ: సేవాలాల్ జయంతి సందర్భంగా జిల్లాలోని సంగెం, వర్ధన్నపేట, గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, పర్వతగిరి తదితర మండలాల వ్యాప్తంగా సేవాలాల్ చిత్రపటాలకు నివాళులర్పించారు. గీసుకొండ మండలం విశ్వనాథపురంలో ఆదివారం నిర్వహించిన జయంతి వేడుకలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పాల్గొని మాట్లాడారు. సద్గురు శ్రీ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం ఆదర్శనీయమని, బంజారాల ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలుస్తారన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి సేవాలాల్ గిరిజన హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. ఆయన కృషిని మరువలేమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మనపెల్లి శ్రీనివాస్, సర్పంచ్ దరావత్ జ్యోతి, నాయకులు తిరుపతి, కూసం రమేశ్, వీరాటి రవీందర్రెడ్డి, భద్రునాయక్, మణిగోపాల్, జన్ను రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక టికెట్పై రెండు సినిమాలు..
ప్రస్తుతం నాకు 83 సంవత్సరాలు. నా చిన్నతనంలో శివరాత్రి పండుగ రోజున ఇంట్లోనే శివుడి ఫొటోకు పూజలు చేసేవారం. ఇంటి చుట్టు పక్కన స్నేహితులు, కుటుంబ సభ్యులం కబుర్లు చెప్పుకుంటూ జాగరణ ఉండేవారం. 30 ఏళ్ల నుంచి ఆలయాలను సందర్శిస్తున్నాం. నిద్రరాకుండా ఉండాలంటే సినిమా టాకీసుల్లో ఒక టికెట్పై రెండు సినిమా ప్రదర్శనలు ఉండేవి. టాకీసు, టీవీల్లో అలనాటి పౌరాణిక సినిమాలు చూసేది. ప్రస్తుతం కాలం మారింది. ఇప్పటితరం వాళ్లు బిజీ అయిపోయారు. – సిద్ధోజు సుదర్శన్, తిలక్రోడ్డు, వరంగల్ -
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
విద్యుత్ దీపాల వెలుగుల్లో వేయిస్తంభాల ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం వేయిస్తంభాల ఆలయంలో శనివారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, భరత్శర్మ, శ్రీమన్నారాయణ, ప్రద్యుమ్నశర్మ, అర్చకుడు ప్రణవ్ ఉదయం 5 నుంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవమూర్తులకు నందివాహనసేవ, ఎదురుకోళ్లు నిర్వహించారు. అనంతరం శ్రీసూర్యనారాయణ దేవాలయంలో శ్రీరుద్రేశ్వరీశ్రీరుద్రేశ్వరస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవవిగ్రహాల ముందు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి జ్యోతివెలిగించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం ప్రదోషకాల పూజ నిర్వహించారు. -
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ వారీగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, శాతాలు ఇలా..
స్వతంత్రులు ఇతరులుబీజేపీబీఆర్ఎస్కాంగ్రెస్13,341 38.31% 12,057 34.63% 2416 6.94% 7007 20.12%13,949 40.59% 14,638 42.59% 2789 8.11% 2,991 8.70%18,483 37.20% 17070 34.36% 1,270 2.56% 12,858 25.88%4,919 31.39% 7612 48.57% 728 4.64% 2411 15.38%6,743 48.97% 6,149 44.65% 436 3.16% 422 2.92%3,363 37.79% 4,378 49.19% 251 2.82% 908 8.18%4,723 40.24% 5,449 46.42% 198 1.69% 1,368 11.65%8,267 38.39% 8,267 38.39% 3735 17.35% 1,064 4.71% 3,418 30.44% 4999 44.53% 1669 14.86% 1,141 8.99%3,978 43.82% 3,709 40.86% 740 8.15% 650 7.16%7,718 46.46% 7,992 48.11% 713 4.29% 188 1.31%13,753 39.39% 17,358 49.72% 1,645 4.71% 2,152 6.16%సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లులో రసవత్తరంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోరులో బీఆర్ఎస్కు కొద్ది తేడాతో తీరనినష్టం జరిగింది. అధికార పార్టీకి ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు అడ్వాంటేజ్గా ఉంటాయన్న చర్చ ఉన్నప్పటికీ.. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఓట్లను విశ్లేషిస్తే బీఆర్ఎస్ గట్టిపోటీనే ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో ఓటింగ్ సరళిని ఈ విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం ఓట్ల వ్యత్యాసమే ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన కొన్నిచోట్ల ఓటుశాతం ఎక్కువగా ఉన్నా వార్డులను గెలిచేలా పనిచేయలేదు. అయితే తొర్రూరు మున్సిపాలిటీలో ఓటుశాతం తగ్గినా, వార్డులు పెరిగాయి. స్వల్ప వ్యత్యాసమే... ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ మొత్తానికి మొత్తం గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి ఒక్క స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ సారి జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,278 ఓట్లకు 2,62,283 ఓట్లే పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పోలైన ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం తేడా ఉండగా, ఈ తేడాలో 140 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంటే, బీఆర్ఎస్ 88లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా మెజార్టీ మున్సిపాలిటీలు చేజారిపోయాయి. చెదిరిన బీఆర్ఎస్ కంచుకోటలు.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోటలు చెదిరిపోయాయి. స్టేషన్న్ఘన్పూర్, నర్సంపేట, డోర్నకల్, భూపాలపల్లి తదితర మున్సిపాలిటీలలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఆయాచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఈ మున్సిపాలిటీల్లో 10 నుంచి 14 శాతం వరకు బీఆర్ఎస్కు తక్కువ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఆ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరిపెడ, ములుగులలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు దరిదాపుల్లో లేకుండా పోయారు. నర్సంపేటలో 40,968 ఓట్లకు 34,908 కోట్లు పోల్ కాగా అందులో బీఆర్ఎస్కు 13,756 (39.39 శాతం) ఓట్లు వస్తే కాంగ్రెస్కు 17,358 (49.72 శాతం) ఓట్లు వచ్చాయి. స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్కు 48.57 శాతం ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 31.39 శాతం, డోర్నకల్లో కాంగ్రెస్కు 49.19 శాతం, బీఆర్ఎస్కు 37,79 శాతమే వచ్చాయి. భూపాలపల్లిలో పోలైన 34,367 ఓట్లలో కాంగ్రెస్కు 14,638 (42.59 శాతం) ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 13,949 (40.59 శాతం), ములుగులో కాంగ్రెస్కు 44.53 శాతం వస్తే బీఆర్ఎస్కు 30.44 శాతమే ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. ఓటు శాతం పెరిగినా సీట్లు పెరగలే.. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 65,712 ఓట్లకు 49,681 పోల్కాగా.. ఇక్కడ బీఆర్ఎస్కు 18,483 (37.20 శాతం), కాంగ్రెస్కు 17,070 (34.36 శాతం) ఓట్లు వచ్చాయి. ఆ మేరకు వార్డులను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకపోవడం వల్ల హంగ్ ఏర్పడింది. పరకాలలో 38.39 శాతం ఓట్లు కాంగ్రెస్కు, 39.32 శాతం బీఆర్ఎస్కు వచ్చినా ఆ బల్దియా హస్తగతం అయ్యింది. వర్దన్నపేటలో బీఆర్ఎస్ 43.82 శాతం ఓట్లను సాధించగా, కాంగ్రెస్కు 40.86 శాతమే వచ్చాయి. కానీ ఆ మేరకు బీఆర్ఎస్కు వార్డులు దక్కకపోగా ఫలితాలు హంగ్ దిశగా వచ్చాయి. అలాగే జనగామలో సుమారు 4 శాతం ఓట్లు అధికంగా సాధించినా హంగ్ను ఎదర్కునే పరిస్థితి ఏర్పడింది. పోలైన ఓట్ల ప్రకారం 1.65 శాతం బీఆర్ఎస్ అభ్యర్థులకు తక్కువ వచ్చినా.. అక్కడ 16 వార్డుల్లో 9 గెలుచుకున్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా నియామకం లేకపోవడంతో వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. యూనివర్సిటీలో అన్నివిభాగాలు, వర్సిటీ కాలేజీలు కలిపి 409 పోస్టులు మంజూరు ఉంది. 77 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 187 మంది పార్ట్టైం అధ్యాపకులు, 176 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా వివిధ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో పేపర్వైజ్గా కూడా కొందరిని నియమించారు. అయినా ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. దీంతో పార్ట్టైం లెక్చరర్ల నియమాకానికి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 100 మంది నియామకం.. కేయూపరిధిలో 130 మంది పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అనుమతి లభించింది. ఇందుకు కేయూ పాలకమండలి కూడా ఆమోదించింది. పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి ఏర్పాటు చేసిన కమిటీ కూడా అధికారులకు నివేదిక సమర్పించింది. స్టాండింగ్ కమిటీలో కూడా చర్చించారు. 130 మంది పార్ట్టైం లెక్చరర్లను నియమించాల్సిండగా.. అందులో 100 మంది నియామకానికి ఈనెల 16న వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో నియామకం లేనట్టే.. కేయూలోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో 27 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించారు. కానీ, రెండు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటివరకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేయలేదు. దీంతో ఆ కళాశాలల్లో పార్ట్టైం లెక్చరర్ల నియామకం ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే, జర్నలిజం విభాగంలో ముగ్గురు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించినా ఈ నోటిఫికేషన్లో ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఈ విషయంపై రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా ఈనెల 16న పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ధ్రువీకరించారు. ● 16న నోటిఫికేషన్ ఇవ్వనున్న అధికారులు ● వివిధ విభాగాల్లో 100 పోస్టుల భర్తీకి నిర్ణయం ‘బల్దియా’ఎన్నికల్లో పోరాడి ఓడిన బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య 2.61 శాతమే ఓట్లతేడా చాలాచోట్ల అధికంగా వచ్చినా ఆ మేరకు దక్కని సీట్లు పరకాల, నర్సంపేట, ములుగులో దరిచేరనీయని హస్తం మున్సిపల్ ఎన్నికలపై నేతల పోస్టుమార్టం.. పార్టీలో సాగుతున్న అంతర్మథనం -
సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి
ఎంజీఎం: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆర్బీఎస్కే బృందాల వైద్యాధికారులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పీహెచ్సీ, డైక్ సెంటర్కు రెఫర్ చేసే విద్యార్థుల వివరాలను వేర్వేరుగా రిజిస్టర్లలో నమోదు చేయాలని, అలాగే పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు పరీక్షల నిమిత్తం వెళ్లేప్పుడు ఒకరోజు ముందుగానే వారికి సమాచారం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుర్తించిన తీవ్ర పోషణ లోపం, మధ్యమస్థాయి పోషణ లోపం ఉన్న పిల్లలకు అసెస్మెంట్ నిర్వహించి ఫాలో చేయాలన్నారు. ఈ సంవత్సరం 2,163 మంది పిల్లలను డైక్ సెంటర్కు రెఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆర్బీఎస్కే వైద్యులు దుర్గాప్రసాద్, కుమారస్వామి, రవీందర్, కవిత, ప్రతాప్రెడ్డి, ప్రణతి, మధు, క్రాంతికుమారి, ఫార్మసిస్టులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఈనెల 17 నుంచి 23వ వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరం (నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు)లో కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి, ఎన్ఎస్ఎస్ వలంటీర్ బాలంకి కార్తికేయ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.రమణ తెలిపారు. హన్మకొండ కల్చరల్: వరంగల్కు చెందిన కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళి రాసిన కథాసంపుటి ‘నిర్వాణ’ ప్రథమ బహుమతికి ఎంపికై ంది. విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నిర్వాణ కథాసంపుటికి ప్రథమ బహుమతి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన సాహితీవేత్తలు రామా చంద్రమౌళిని శనివారం అభినందించారు. -
క్యాంపునకు కాంగ్రెస్ కౌన్సిలర్లు
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా ఎంపికై న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు క్యాంపులో భాగంగా శనివారం ఆంధ్రకు తరలివెళ్లారు. 30వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు 21మంది మెజార్టీ ఉన్నప్పటికీ ముందుజాగ్రత్తగా గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. ఆదివారం వారిని తిరిగి తీసుకురానున్నట్లు తెలిసింది. సందడిగా ఊరి పండుగగీసుకొండ: మండలంలోని మరియపురంలో ఊరి పండుగను గ్రామస్తులు శనివారం సందడిగా జరుపుకున్నారు. వర్షాకాలం పంటకాలం ముగిసిన తర్వాత ఊరి పండుగ చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు పండుగ సందర్భంగా గ్రామానికి తరలివచ్చి తమ బంధువులతో ఆత్మీయతను పంచుకున్నారు. క్రైస్తవ మత స్థాపకుడు ఏసుక్రీస్తు తల్లి మేరీమాతను ప్రత్యేక పల్లకి వాహనంపై గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతీ కుటుంబంలో బంధువులు, పిల్లాపాపలు సందడి చేశారు. వేడుకల్లో సర్పంచ్ తిరుమలరెడ్డి అర్పిత, ఆమె భర్త దిలీప్రెడ్డి, మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, చర్చి ఫాదర్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక అతిథులుగా మనుగొండకు చెందిన సామాజిక సేవకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి సతీమణి స్వప్న, ఆయన సోదరుడు మర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సరిత హాజరయ్యారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రమేశ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓ ఎస్గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్కు చెందిన కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళి రాసిన కథాసంపుటి ‘నిర్వాణ’ ప్రథమ బహుమతికి ఎంపికై ంది. విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నిర్వాణ కథాసంపుటికి ప్రథమ బహుమతి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన సాహితీవేత్తలు రామా చంద్రమౌళిని శనివారం అభినందించారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి ఎంజీఎం: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆర్బీఎస్కే బృందాల వైద్యాధికారులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పీహెచ్సీ, డైక్ సెంటర్కు రెఫర్ చేసే విద్యార్థుల వివరాలను వేర్వేరుగా రిజిస్టర్లలో నమోదు చేయాలని, అలాగే పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు పరీక్షల నిమిత్తం వెళ్లేప్పుడు ఒకరోజు ముందుగానే వారికి సమాచారం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుర్తించిన తీవ్ర పోషణ లోపం, మధ్యమస్థాయి పోషణ లోపం ఉన్న పిల్లలకు అసెస్మెంట్ నిర్వహించి ఫాలో చేయాలన్నారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు వినికిడి యంత్రాలను అందించేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కౌమారదశ బాలబాలికలకు వివిధ అంశాలపై అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 2,163 మంది పిల్లలను డైక్ సెంటర్కు రెఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆర్బీఎస్కే వైద్యులు దుర్గాప్రసాద్, కుమారస్వామి, రవీందర్, కవిత, ప్రతాప్రెడ్డి, ప్రణతి, మధు, క్రాంతికుమారి పాల్గొన్నారు. -
కేయూలో పార్ట్టైం లెక్చరర్ల నియామకం!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా నియామకం లేకపోవడంతో వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. యూనివర్సిటీలో అన్నివిభాగాలు, వర్సిటీ కాలేజీలు కలిపి 409 పోస్టులు మంజూరు ఉంది. 77 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 187 మంది పార్ట్టైం అధ్యాపకులు, 176 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా వివిధ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో పేపర్వైజ్గా కూడా కొందరిని నియమించారు. అయినా ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. దీంతో పార్ట్టైం లెక్చరర్ల నియమాకానికి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 100 మంది నియామకం.. కేయూపరిధిలో 130 మంది పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అనుమతి లభించింది. ఇందుకు కేయూ పాలకమండలి కూడా ఆమోదించింది. పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి ఏర్పాటు చేసిన కమిటీ కూడా అధికారులకు నివేదిక సమర్పించింది. స్టాండింగ్ కమిటీలో కూడా చర్చించారు. 130 మంది పార్ట్టైం లెక్చరర్లను నియమించాల్సిండగా.. అందులో 100 మంది నియామకానికి ఈనెల 16న కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో నియామకం లేనట్టే.. కేయూలోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో 27 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించారు. కానీ, రెండు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటివరకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేయలేదు. దీంతో ఆ కళాశాలల్లో పార్ట్టైం లెక్చరర్ల నియామకం ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే, జర్నలిజం విభాగంలో ముగ్గురు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించినా ఈ నోటిఫికేషన్లో ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. నోటిఫికేషన్ వస్తే ఏ విభాగంలో ఎంతమంది పార్ట్టైం లెక్చరర్లను నియమిస్తారనే విరాలు తెలియనుంది. ఈ విషయంపై కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా ఈనెల 16న పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ధ్రువీకరించారు. 16న నోటిఫికేషన్ ఇవ్వనున్న అధికారులు వివిధ విభాగాల్లో 100 పోస్టుల భర్తీకి నిర్ణయం -
రాణి చేతిలోనే వర్ధన్నపేట
మున్సిపల్ చైర్మన్ పదవిలో కీలకంగా స్వతంత్ర అభ్యర్థి శీభారాణిసాక్షి, వరంగల్: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైనా అధికారం ఇంకా దోబుచులాడుతోంది. జనరల్ రిజర్వేషన్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందా.. లేక బీఆర్ఎస్ దక్కించుకుంటుందా అన్న ఉత్కంఠ అక్కడి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరు జెండా ఎగురవేయాలన్న స్వతంత్ర అభ్యర్థి నేతావత్ శీభారాణి మద్దతు అవసరం. 2020, జనవరి 22న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఒక్క ఓటు తేడాతో ఓడిన ఆమె.. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి వాలీబాల్ గుర్తుతో ఇంటింటి ప్రచారం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మగ్నిపై 47 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. గత ఎన్నికల్లో ఓడిన శీభారాణి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో ఎక్కడాలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే, 12 వార్డులున్న వర్ధన్నపేటలో బీఆర్ఎస్కు ఆరు, కాంగ్రెస్కు ఐదు రావడంతో ఇరు పార్టీలకు ఇప్పుడు స్వతంత్య్ర అభ్యర్థి శీభారాణి అవసరం ఏర్పడింది. మద్దతు కోసం వెళ్లిన కాంగ్రెస్ నేతలకు ‘చైర్మన్’ పీఠం ఇవ్వాలని ఆమె షరతు విధించారు. అయితే, అదంతా కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడాల్సిన విషయం కావడంతో ఆమెకు పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వలేదనే ప్రచారం ఉంది. అధికారం కావాలనుకుంటే రాణి మద్దతు తప్పనిసరి కావడంతో బీఆర్ఎస్ కూడా ఆమెకు చైర్మన్ గిరి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల వరకు శీభారాణి బీఆర్ఎస్లోనే ఉండడంతో ఆమె మద్దతు తమకే ఉంటుందన్న ధీమాలోనే గులాబీ శ్రేణులు ఉన్నాయి. శీభారాణి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శిబిరంలో చేరిందని హస్తం పార్టీ శ్రేణులు అంటుండగా, బలవంతంగా కాంగ్రెస్ నాయకులు చేర్చుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్లా సాగుతున్న ఈ హైడ్రామాకు సోమవారం తెరపడే అవకాశం ఉంది. ఆరోజు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉండడంతో శీభారాణి మద్దతు ఎవరికనేది తేలిపోనుంది. ఏదిఏమైనా వర్ధన్నపేట మున్సిపల్ అధికారం ‘రాణి’ చేతిలోనే ఉండడంతో ఆమెకు ఎనలేని గౌరవం దక్కిందని చెప్పొచ్చు. ఎక్స్అఫీషియో ఓటు నిబంధనలతో బీఆర్ఎస్కు దెబ్బ కాంగ్రెస్ నుంచి చైర్మన్ రేసులో ఉన్న ఈగ దామోదర్ ఓడిపోవడంతో అదే పార్టీ నుంచి గెలిచిన పాలకుర్తి సారంగపాణికి మార్గం సుగమమైంది. అయితే కాంగ్రెస్కు శీభారాణి మద్దతిస్తే చైర్మన్ పదవి ఆమెకు వెళ్లే అవకాశం ఉండడంతో హస్తం పార్టీలోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి గుజ్జ వీరన్న, సిలువేరు కుమారస్వామి చైర్మన్ రేసులో ఉన్నారు. ఒకవేళ గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన శీభారాణి ఆపార్టీలోకి వస్తే ఇక్కడా పరిస్థితులు మారే అవకాశముంది. ఇక్కడి చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుకు అవకాశం ఉండడంతో ఇప్పుడున్న ఐదు ఓట్లకు మరో ఓటు కలిసి ఆరు ఓట్లు అవుతాయి. అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి శీభారాణి మద్దతిస్తే ఏడు ఓట్లు అవుతాయి. ఒకవేళ ఆమె బీఆర్ఎస్ పంచన చేరితే కాంగ్రెస్ ఆరుతో ఆగి బీఆర్ఎస్ సంఖ్య ఏడుకు చేరుకుంటుంది. ఈ చైర్మన్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఎమ్మెల్యే నాగరాజు.. ఇండిపెండెంట్ అభ్యర్థి శీభారాణి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉండేలా చూసుకుంటున్నారు. ఎక్స్అఫీషియో ఓటుకు వర్ధన్నపేట మున్సిపాలిటీ నుంచి ఎమ్మెల్యే నాగరాజు ఒక్కరే ఉన్నట్లు తెలిసింది. ఎందుకంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలతో ఇక్కడ ఎమ్మెల్సీలకు అవకాశం లేకపోవడంతో ఎక్స్అఫీషియోపై బీఆర్ఎస్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఓటరై ఉంటేనే అవకాశం ఉంటుందనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఓటు హక్కు లేకుండా పోయింది. దీంతో వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం ఖరారైంది. అలాగే, వరంగల్ ఎంపీ కడియం కావ్యకు ఇక్కడ ఎక్స్అఫీషియో ఓటుకు అవకాశమున్నా అంతగా ఆమె అవసరం లేకపోవడంతో రాజకీయ ప్రాధాన్యంలో భాగంగా తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్అఫీ షియో ఓటు నమోదు చేసుకున్నారని సమాచారం. ఆమె ఎవరికి మద్దతు ఇస్తే వారికే అధికారం ఖాయం చైర్మన్ గిరి ఇవ్వాలంటూ కాంగ్రెస్కు షరతు తనవైపునకు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ యత్నం కాంగ్రెస్కు ఎక్స్అఫీషియో ఓటుతో కలిసొచ్చే అవకాశం అయినా శీభారాణి మద్దతుంటేనే హస్తానికి అధికారం -
తీరని నష్టం..!
కొద్దితేడా.. ‘బల్దియా’ఎన్నికల్లో పోరాడి ఓడిన బీఆర్ఎస్బీఆర్ఎస్కాంగ్రెస్ 39.21 శాతం 41.82 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లులో రసవత్తరంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోరులో బీఆర్ఎస్కు కొద్ది తేడాతో తీరనినష్టం జరిగింది. అధికార పార్టీకి ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు అడ్వాంటేజ్గా ఉంటాయన్న చర్చ ఉన్నప్పటికీ.. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఓట్లను విశ్లేషిస్తే బీఆర్ఎస్ గట్టిపోటీనే ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో ఓటింగ్ సరళిని ఈ విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం ఓట్ల వ్యత్యాసమే ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన కొన్నిచోట్ల ఓటుశాతం ఎక్కువగా ఉన్నా వార్డులను గెలిచేలా పనిచేయలేదు. అయితే తొర్రూరు మున్సిపాలిటీలో ఓటుశాతం తగ్గినా, వార్డులు పెరిగాయి. స్వల్ప వ్యత్యాసమే... ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ మొత్తానికి మొత్తం గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి ఒక్క స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ సారి జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,278 ఓట్లకు 2,62,283 ఓట్లే పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పోలైన ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం తేడా ఉండగా, ఈ తేడాలో 140 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంటే, బీఆర్ఎస్ 88లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా మెజార్టీ మున్సిపాలిటీలు చేజారిపోయాయి. చెదిరిన బీఆర్ఎస్ కంచుకోటలు... మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోటలు చెదిరిపోయాయి. స్టేషన్న్ఘన్పూర్, నర్సంపేట, డోర్నకల్, భూపాలపల్లి తదితర మున్సిపాలిటీలలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఆయాచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఈ మున్సిపాలిటీల్లో 10 నుంచి 14 శాతం వరకు బీఆర్ఎస్కు తక్కువ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఆ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరిపెడ, ములుగులలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు దరిదాపుల్లో లేకుండా పోయారు. నర్సంపేటలో 40,968 ఓట్లకు 34,908 కోట్లు పోల్ కాగా అందులో బీఆర్ఎస్కు 13,756 (39.39 శాతం) ఓట్లు వస్తే కాంగ్రెస్కు 17,358 (49.72 శాతం) ఓట్లు వచ్చాయి. స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్కు 48.57 శాతం ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 31.39 శాతం, డోర్నకల్లో కాంగ్రెస్కు 49.19 శాతం, బీఆర్ఎస్కు 37,79 శాతమే వచ్చాయి. భూపాలపల్లిలో పోలైన 34,367 ఓట్లలో కాంగ్రెస్కు 14,638 (42.59 శాతం) ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 13,949 (40.59 శాతం), ములుగులో కాంగ్రెస్కు 44.53 శాతం వస్తే బీఆర్ఎస్కు 30.44 శాతమే ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య 2.61 శాతమే ఓట్లతేడా చాలాచోట్ల అధికంగా వచ్చినా ఆ మేరకు దక్కని సీట్లు పరకాల, నర్సంపేట, ములుగులలో దరిచేరనీయని హస్తం -
వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
నర్సంపేట: సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ ఖాతాదారుల సేవలతో పాటు రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముంబై సెంట్రల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవీ.మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ను నూతన హంగులతో తీర్చిదిద్దగా, బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్ అధ్యక్షతన మురళీకృష్ణతో పాటు హైదరాబాద్ జోనల్ ముఖ్య అధికారి ధరమ్సింగ్ నాయక్, వరంగల్ రీజినల్ ముఖ్య అధికారి కృష్ణమోహన్, వరంగల్ జిల్లా నాబార్డు డీడీఎం టి.రవి, ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ఫౌండేషన్ డైరెక్టర్ ఏఎస్ కె.శర్మ ముఖ్యఅతిథులుగా హాజరై శనివారం ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ రుణ వితరణ కార్యక్రమం చేపట్టారు. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సెంట్ అగ్రిగోల్డ్ లోన్, సెంట్ ఫుడ్ ప్రొడక్షన్ ప్లస్ రైస్ మిల్లు, సెంట్ జీఎస్టీ, సెంట్ తనాఖా వ్యాపార రుణంతో పాటు వివిధ పథకాలపై రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ రకాల వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన బ్యాంక్ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రీజినల్ కార్యాలయం అధికారులు సాంబయ్య, రాజారాం, శ్రీకాంత్, నర్సంపేట బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ తనుశ్రీ, సిబ్బంది ఉజ్మ, మౌనిక, సాదిక్, గోల్డ్ అప్రైజర్ వీరభద్రయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంకు ముంబై సెంట్రల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీకృష్ణ -
మహాశివరాత్రి శోభ
మహా శివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించారు. వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.ఖిలా వరంగల్ : చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని మధ్యకోటలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆలయంలో ఉద యం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ ఆధ్వర్యంలో ధర్మకర్తలు, ప్రధాన పూజారి శిలమంతుల శంభులింగం నేతృత్వంలో ఉదయం 11గంటలకు మహాభిల్వార్చన, ధ్వజారోహణం, గణపతి పూజ, అఖండదీపారాధన, మహాభిషేకం, కంకణధారణ, రుద్రహోమాన్ని నిర్వహించారు. ముస్తాబైన ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు చారిత్రకమైన స్వయంభు శంభులింగ్వేరస్వామి దేవస్థానం విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబైంది. ఆల య ప్రాంగణంలో చలువ పందిళ్లు, విద్యుత్ లైటింగ్, తాగునీటి సౌకర్యాల ఏర్పాట్లతో పాటు క్యూలైన్లకు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు గణపతి పూజ, మహాన్యాసపూర్వక మహాభిషేకాలు నిర్వీరామంగా జరుగనున్నాయి. సాయంత్ర 7.09 నిమిషాలకు పార్వతీ ప రమేశ్వర కల్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు పూజారి శంభులింగం తెలిపారు. విద్యుత్ అలంకరణలో శివాలయం వరంగల్ : కాశిబుగ్గలోని చారిత్రాత్మక కాశీవిశ్వేశ్వర రంగనాథ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవతా రూపాల మాస్కులు ధరించి ఆలయం ముందు నృత్యాలు, ప్రదర్శనలు ఇచ్చారు. శివరాత్రి సందర్భంగా ఆలయ ఆవరణతో పాటు దేవాలయ గర్భగుడి, గోపురం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. శివరాత్రి జాగరణ చేసే వారి కో సం ఆలయ పక్కనే గల స్థలంలో భక్తిపరమైన కార్యక్రమాలను సోమవారం తెల్లవారుజాము వరకు ఏర్పాటు చేసినట్లు పూర్వ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
మున్సిపాలిటీల వారీగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, శాతాలు ఇలా..
మున్సిపాలిటీ మొత్తం పోలైనవి బీఆర్ఎస్ శాతం కాంగ్రెస్ శాతం బీజేపీ శాతం స్వతంత్రులు/ శాతం ఇతరులుపరకాల 26,818 21,533 8,467 39.32 8,267 38.39 3735 17.35 1,064 4.71 నర్సంపేట 40,968 34,908 13,753 39.39 17,358 49.72 1645 4.71 2,152 6.16 వర్థన్నపేట 10,526 9,077 3,978 43.82 3,709 40.86 740 8.15 650 7.16 జనగామ 44,045 34,821 13,341 38.31 12,057 34.63 2416 6.94 7007 20.12 స్టేషన్ఘన్పూర్ 18,550 15,670 4,919 31.39 7612 48.57 728 4.64 2411 15.38 మహబూబాబాద్ 65,712 49,681 18,483 37.20 17070 34.36 1,270 2.56 12,858 25.88 తొర్రూరు 21,451 16,611 7,718 46.46 7,992 48.11 713 4.29 188 1.31 మరిపెడ 13,687 11,738 4,723 40.24 5,449 46.42 198 1.69 1,368 11.65 డోర్నకల్ 10,869 8,900 3,363 37.79 4,378 49.19 251 2.82 908 8.18 కేసముద్రం 15,963 13,750 6,743 48.97 6,149 44.65 436 3.16 422 2.92 భూపాలపల్లి 52,726 34,367 13,949 40.59 14,638 42.59 2789 8.11 2,991 8.70 ములుగు 13,963 11,227 3,418 30.44 4999 44.53 1669 14.86 1,141 8.99 -
21వ వార్డులో అంచనాలు తలకిందులు..
నర్సంపేట: నర్సంపేటలోని 30 వార్డుల్లో 21వ వార్డు గురించి చర్చ నడిచింది. ఇదే వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. కాస్ట్లీ వార్డుగా నిలిచింది. ఒక్కో ఓటుకు అత్యధికంగా రూ.8వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది. కౌంటింగ్ సమయంలో ప్రతీ ఒక్కరు ఇదే వార్డుపై చర్చించడం కనిపించింది. చివరగా కాంగ్రెస్ అభ్యర్థి ఓర్సు అంజలిపై బీఆర్ఎస్ అభ్యర్థి శివరాత్రి స్వామిని గెలుపు వరించింది. దీంతో అంచనాలు తలకిందులయ్యాయి. ఏడో వార్డులో అత్యధికం.. ఒకటో వార్డులో అత్యల్పంనర్సంపేట ఏడో వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి గంధం నరేందర్ 692 అత్యధిక ఓట్ల మెజార్టీ, అత్యల్పంగా ఒకటో వార్డు అభ్యర్థి 15 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 30 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఏడో వార్డు నుంచి పోటీ చేసిన నరేందర్కు 920 ఓట్లు రాగా తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్కు చెందిన మోతె తిరుపతిరెడ్డికి 228 ఓట్లు రాగా.. నరేందర్ గెలుపొందారు. ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మేఘనకు 669 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 654 ఓట్లు పోలయ్యాయి. దీంతో 15 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. నర్సంపేటలో కౌంటింగ్ ఆలస్యం..అధికారుల నిర్లక్ష్యంతో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఆలస్యమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫలితాలు గంట వ్యవధిలోనే వచ్చినప్పటికీ నర్సంపేటలో మాత్రం గంటన్నర ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దీంతో ఒక దశలో ఉత్కంఠత నెలకొంది. అధికారులు మాత్రం స్పందించకపోవడంతో మీడియా ప్రతినిధులతోపాటు అభ్యర్థులు సైతం అసహనం వ్యక్తం చేశారు. మూడు రౌండ్లు ఫలితాలు ప్రకటించే క్రమంలో రౌండ్ రౌండ్కు మధ్య చాలా సమయం పట్టింది. అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వైపు దూసుకురావడంతో వెంటనే పోలీసు అధికారులు అప్రమత్తమై సర్దిచెప్పి తిరిగి పంపారు. నోటాకు 70 ఓట్లుమున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నర్సంపేటలో పలువురు ఓటర్లు నోటాకు సైతం ఓటు వేశారు. 30 వార్డుల పరిధిలో 70 ఓట్లు నోటాకు పోలయ్యాయి. రెండో వార్డులో నాలుగు, నాలుగులో రెండు, ఐదులో రెండు, 6లో ఒకటి, 7లో రెండు, 8లో ఒకటి, 9లో మూడు, 10లో రెండు, 11లో ఒకటి, 14లో రెండు, 15లో రెండు, 16లో మూడు, 17లో 8, 18లో ఒకటి, 19లో ఒకటి, 20లో 11, 22లో 5, 23లో నాలుగు, 24లో మూడు, 25లో రెండు, 26లో రెండు, 27లో 4, 28లో మూడు, 30లో ఒకటి చొప్పున పోలయ్యాయి. అప్పుడు భార్య.. ఇప్పుడు భర్తవర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వర్ధన్నన్నపేట 8 వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి ఇప్పడు గెలుపొందారు. గతంలో ఆయన సతీమణి సుజాత బీఆర్ఎస్ తరఫున ఏడో వార్డు నుంచి పోటీ చేసి కౌన్సిలర్గా గెలుపొందారు. -
పంట ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవాలి
దుగ్గొండి: పంట ఉత్పత్తులను రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో దళారులు లేకుండా నేరుగా విక్రయించుకోవాలని స్పైసెస్ బోర్డు ఆప్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతిశ్ సూచించారు. గిర్నిబావి గ్రామ పంచాయతీ ఆవరణలో గిర్నిబావి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పసుపు, మిరప రైతులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు, మిరప పంటల ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలు, ఆరబెట్టడం, గ్రేడింగ్, ప్యాకింగ్ చేయడం, నిల్వ చేసే విధానాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు నేరుగా కొనుగోలుదారులతో అనుసంధానమైతే మంచి ధరలు పొందవచ్చన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సంరక్షణ, పోస్టు హార్వెస్టు మేనేజ్మెంట్కు స్పైసెస్ బోర్డు పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సదస్సులో సర్పంచ్ పెండ్లి వెంకటేశ్వర్లు, రైతు ఉత్పత్తి సంఘం బాధ్యులు పెండ్యాల లలిత, కరుణాకర్, సిరిపల్లి గిరిబాబు, బోర్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కళాశాలల్లో డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రతాప్రెడ్డి విడుదల చేశారు. కాంగ్రెస్ 140బీఆర్ఎస్ 88బీజేపీ 08సీపీఐ 04సీపీఎం 05ఇండి/ఇతరులు 15 -
నెక్కొండలో నగదు, నగలు చోరీ
నెక్కొండ: మండల కేంద్రంలోని మహ్మద్రహీం ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. మహ్మద్రహీం ఈనెల 11న బంధువుల ఇంటికి భార్యతో కలిసి వెళ్లాడు. ఈనెల 12 రాత్రి ఇంటి తాళంర పగులగొట్టి దొంగలు బీరువాలోని 5 తులాల బంగారం, 18 తులాల వెండి ఆభరణాలు, రూ. 3 లక్షల నగదు దొంగలు అపహరించుకెళ్లారని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. గవిచర్లలో.. సంగెం: మండలంలోని గవిచర్లలో దొంగలు చోరీకి పాల్పడారు. గ్రామానికి చెందిన గాలి కొమురమ్మ, సారంగం దంపతులు, కుటుంబ సభ్యులు గురువారం దుగ్గొండి మండలం దేశాయిపల్లిలో కొమురమ్మ తల్లి సంవత్సరీకం కోసం వెళ్లారు. శుక్ర వారం ఇంటికి వచ్చే సరికి తాళం పగులగొట్టి కనిపించింది. రెండు తులాల బంగారు నెక్లెస్, అర్ధతులం కమ్మలు, గున్నాలు, 22 తులా ల వెండి పట్టీలు, రూ.లక్ష నగదును అపహరించుకుని పోయారని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
నర్సంపేట: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణ అభివృద్ధికి కృషిచేస్తామని చైర్పర్సన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ప్రకటించిన పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పేర్కొన్నారు. నర్సంపేటలో శుక్రవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలోనే నర్సంపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. 25వ వార్డు నుంచి 386 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం వెనుక ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నాయని ఆమె వెల్లడించారు. కార్మికులకు అండగా ఉంటా...నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో పూర్వం కమ్యూనిస్టులకు గట్టిపట్టు ఉందని, పేదల పక్షాన పోరాడిన కమ్యూనిస్టులకు అండగా నిలి చిందని పదో వార్డు నుంచి 70 ఓట్ల మెజార్టీతో గెలిచిన హన్మకొండ శ్రీధర్ అన్నారు. ప్రజలు, కార్మికులకు అండగా ఉంటానని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. బడుగు బలహీనవర్గాలు, కార్మిక, కర్షకుల కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకే తనను ఆదరించి గెలిపించారని, ఎలాంటి సమస్యలు ఉన్నా అందరి సహాయసహకారాలతో పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. కాగా, శ్రీధర్ తండ్రి 2004లో నర్సంపేట గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సీపీఎం నుంచి వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిచేయడానికి జిల్లా యంత్రాంగం పనిచేసిందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు అభ్యర్థులు, వారి ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసు బందోబస్తు కల్పించామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధి కారులు, ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ది అధికార దుర్వినియోగం● వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అగ్రహం వ్యక్తం చేశారు. వర్ధన్నపేట మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిరసిస్తూ శుక్రవారం ఆయన వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అరగంట పాటు కిలోమీటరు మేర వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే ఏసీపీ అంబటి నర్సయ్య పోలీస్ సిబ్బందితో బలవంతంగా అరూరి రమేశ్ను రాయపర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినా కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. చివరకు పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను చెదరగొట్టారు. స్వతంత్ర అభ్యర్థి శీభారాణిని కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకునే క్రమంలో లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ 12వ వార్డు అభ్యర్థి గుండె స్వప్నిక 7 ఓట్లతో గెలిచిందని అధికారులు తెలిపిన వెంటనే మాట మార్చి.. కాంగ్రెస్ అభ్యర్థి తిరుపల్లి వాణి 13 ఓట్లతో గెలుపొందిందని ప్రకటించడం అన్యాయమన్నారు. రీకౌంటింగ్ చేస్తే తమ అభ్యర్థికి అవే ఓట్లువస్తే అభ్యంతరం చెప్పేవారం కాదన్నారు. -
ఎట్టకేలకు పదోన్నతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్న అధ్యాపకులకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. క్యాస్ పదోన్నతులకు సంబంధించి గతేడాది డిసెంబర్ 30న కేయూ పాలకమండలి ఆమోదించింది. వర్సిటీలో అన్ని విభాగాలు కలిపి 45మంది అధ్యాపకులకు పదోన్నతులు లభించాయి. ఇందులో 29మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్గా వై.నర్సింహారెడ్డికి, మేథమెటిక్స్ విభాగం ప్రొఫెసర్ మల్లారెడ్డికి సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. వివిధ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న ఎన్.రమణ, కె.కిశోర్కుమార్, కె.భిక్షాలు, టి.జగన్మోహన్రావు, ఎల్పీ రాజ్కుమార్, కె.అయిలయ్య, ఎం.స్వర్ణలత, వి.స్వరూపరాణి, బి.నాగరాజుకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. 2010లో వివిధ విభాగాల్లో నియమితులైన 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పలు కారణాలతో కొన్నేళ్లుగా పదోన్నతి కల్పించలేదు. ఎట్టకేలకు వీరందరికీ అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సెలక్షన్ గ్రేడ్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సీనియర్ స్కేల్తో పదోన్నతులు కల్పించారు. ఈ ఉత్తర్వులు అందజేతలో అకుట్ అధ్యక్షుడు బి.వెంకట్రామ్రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పరిశోధనల పరంగా ముందుకెళ్లాలి.. కేయూలో అకడమిక్ పరంగా, నాణ్యమైన విద్యాబోధన, పరిశోధనల కోసం కృషి చేయాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి పదోన్నతులు పొందిన అధ్యాపకులను కోరారు. శుక్రవారం వివిధ విబాగాల, కళాశాలల అధ్యాపకులకు రిజిస్ట్రార్ రామచంద్రంతో అకుట్ అధ్యక్షుడు బి.వెంకట్రామ్రెడ్డితో కలిసి పదోన్నతుల ఉత్తర్వులు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్సిటీ ప్రతిష్టను పెంచేలా అధ్యాపకులంతా కృషి చేయాలని సూచించారు. ఏళ్ల నిరీక్షణకు తెర హర్షాతిరేకాల్లో కేయూ అధ్యాపకులు -
ఓరుగల్లు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు.. ఏడుచోట్ల మెజార్టీ
శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పరకాలలో రంగులు చల్లుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కోయడ శ్రీనివాస్, కార్యకర్తలు12 మున్సిపాలిటీలకు ఏడు పీఠాలు పక్కా కాగా.. మరో నాలుగింటిపైన కాంగ్రెస్ గురి పెట్టింది. స్వతంత్రులు, ఎక్స్ అఫీ షియో ఓట్ల ద్వారా తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. పరకాల, భూపాలపల్లి, డోర్నకల్, మరి పెడ, ములుగు, నర్సంపేట, స్టేషన్ఘన్పూర్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మహబూబాబాద్లో 36 వార్డులకు 13 చోట్ల కాంగ్రెస్ సొంతగా గెలవగా, మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంలు తలా మూడు గెలిచాయి. నాలుగు చోట్ల గెలిచిన స్వతంత్రుల మద్దతు కూడగడుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ 12, బీజేపీ ఒక్కటి గెలవడం వల్ల కాంగ్రెస్కే పీఠం దక్కనుంది. వర్ధన్నపేటలో 12 వార్డులకు ఆరు బీఆర్ఎస్ గెలవగా, ఐదు గెలిచిన కాంగ్రెస్ ఒక ఇండిపెండెంట్ను కలుపుకుంది. దీంతో హంగ్ ఏర్పడగా.. ఎక్స్ అఫీషియో ఓటుతో గట్టెక్కాలని కాంగ్రెస్ భావిస్తోంది. కేసముద్రంలో 16 వార్డులకు తలా 8 రావడంతో ఇక్కడా హంగ్ నుంచి గట్టెక్కేందుకు ఎక్స్ అిఫీషియో అస్త్రాన్ని ఉపయోగించే యోచనలో కాంగ్రెస్ ఉంది. తొర్రూరులో 16 వార్డులకు 9 వార్డులను గెలుచుకున్న బీఆర్ఎస్ ఆ పీఠం దక్కించుకోనుంది. జనగామలో 30 వార్డులకు బీఆర్ఎస్ సొంతంగా 13 గెలుచుకోగా, ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టింది. కాంగ్రెస్ 12, సీపీఎం 1 గెలవగా మరో ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో రెండు పార్టీలకు తలా 15 అవుతుండడంతో ఇక్కడ అన్ని పార్టీల ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ విద్యార్థులకు ఇటీవల ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా ఆ విభాగం బీఓఎస్గా బాధ్యతలు నిర్వర్తించే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక ప్రాక్టికల్స్ పరీక్షలకు ఇంటర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించడంపై ఆరోపణలు వచ్చాయి. ఆవిభాగంలో ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణ వ్యవహారంలో ఆరోపణలకు సంబంధించిన అంశాలు వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వీసీ ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం ఈ నెల 10న ఓ విచారణ కమిటీని నియమించారు. ఇది శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈవిచారణ కమిటీ చైర్మన్గా యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, సభ్యులుగా పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజు, అకడమిక్ బ్రాంచ్ అసిస్టెంట్ త్వరగా సమర్పించాలి. ఈవిచారణ కమిటీ పరీక్షల విభాగంనుంచి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్ నియమాక పత్రం ఆర్డర్ కాపీ (కాన్ఫిడెన్షియల్ కాపీ) బయటికి ఎలా లీక్ అయిందనే విషయంపై కూడా విచారణ జరపాలని అలాగే ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణపై కూడా వచ్చిన ఆరోపణలపై ఈ విచారణ కమిటీ విచారణ జరపాల్సిం ఉంది. సాద్యమైనంత త్వరంగా వి చారణ పూర్తిచేసి తనకు రిపోర్ట్ సమర్పించాల్సి ందిగా రిజిస్ట్రార్ విచారణ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చి నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ (శనివారం) వారంతపు యార్డు బంద్, 15న(ఆదివారం) వారంతపు సెలవు ‘మహా శివరాత్రి పండుగ’, 16న(సోమవారం)శివరాత్రి తెల్ల వార్లు జాగరణ, 17న(మంగళవారం) అమావాస్య మార్కెట్ బంద్ ఉంటుందని, ఈనా లుగు రోజులు మార్కెట్ యార్డుల్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. ఈవిషయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతులు, వ్యాపారులు, కార్మికులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావొద్దని సూచించారు. 18వ తేదీ బుధవారం మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ సోలార్ గ్రామాల్లో సోలార్ పలకల బిగింపును మార్చి 31 నాటికి పూర్తి చేసి సంపూర్ణ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 9 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, రెడ్ కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్ పరిధి 37 గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. డైరెక్టర్ టి.మధుసూదన్, సీఈలు వెంకటరమణ, శ్రవణ్కుమార్, అశోక్, జీఎంలు శ్రీనివాస్, మల్లికార్జున్, డీఈలు అమర్నాథ్, అనిల్కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో పాంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు శైవాగమోక్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఒగ్గు పూజారుల మేలు కొలుపుతో స్వామి మేల్కొనగా అర్చకులు వేద మంత్రాలతో నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉదయం ఉత్సవమూర్తులతో సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. సాయంత్రం మృత్ సంగ్రహణ, అంకురార్పణ, అగ్ని మదన–అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవ జాతర ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు. అనంతరం రాత్రి చంద్ర ప్రభ వాహనసేవ విద్యుత్ దీప కాంతుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఈఓ కందుల సుధాకర్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాల్గొన్నారు.4. స్టేషన్ ఘన్పూర్1. ములుగు 2. భూపాలపల్లి3. పరకాల7. డోర్నకల్క్యాంపులకు తరలిన కౌన్సిలర్లు... హైదరాబాద్, వరంగల్లోనే మకాం.. పన్నెండు మున్సిపాలిటీల్లో శుక్రవారం ఉదయం నుంచే కౌంటింగ్ మొదలై ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తం అయ్యారు. ఆయా మున్సిపాలిటీల్లో ఆధిక్యత పెరిగి విజయావకాశాలున్న కౌన్సిలర్లను ఒక్కచోట చేర్చేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఇన్చార్జ్లను నియమించారు. ఫలితాల వెల్లడైన వెంటనే ఒక్కో మున్సిపాలిటీకి చెందిన క్యాంపు ఇన్చార్జ్లు వారికి నిర్దేశించిన ప్రాంతాలకు గెలిచిన వారిని తరలించారు. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డుల్లో కాంగ్రెస్ 140, బీఆర్ఎస్ 88, బీజేపీ 8 వార్డులు కై వసం చేసుకోగా, సీపీఐ 4, సీపీఎం 5, ఇతరులు, ఇండిపెండెంట్లు 15 చోట్ల గెలుపొందారు. స్పష్టమైన మెజార్టీ ఉన్న ఏడింటితో పాటు కనీసం మరో మూడు మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేయడం లక్ష్యంగా క్యాంపులు నిర్వహిస్తోంది. అలాగే ఆయా పార్టీల కౌన్సిలర్లు చెదిరిపోకుండా మిగతా పార్టీలు కూడా క్యాంపులకు తరలించారు. 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనుండగా.. అందుబాటులో ఉండేలా క్యాంపులు ఏర్పాటు చేశారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిలాలోని 12 మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ల పర్యవేక్షణలో హైదరాబాద్, వరంగల్లోని రిసార్టులు, ఫంక్షన్ హాళ్లు, హోట ళ్లలో బస చేసినట్లు తెలిసింది. చేజారకుండా..పరకాల: పరకాల మున్సిపాలిటీలో 13 స్థానాలతోకాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఆ పార్టీ కౌన్సిలర్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి క్యాంపునకు తరలించారు. ఈనెల 16న చైర్మన్ ఎన్నిక సమయానికి అభ్యర్థులందరూ పరకాల మున్సిపల్ కార్యాలయానికి నేరుగా చేరుకుంటారు. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించింది. మొత్తం 12 మున్సిపాలిటీలకు 7చోట్ల స్పష్టమైన ఆధిక్యతను సాధించిన ఆ పార్టీ ఆయా మున్సిపల్ పీఠాలను దక్కించుకోనుంది. ఓట్ల లెక్కింపులో వచ్చిన వార్డు సభ్యుల ఆధిక్యతను బట్టి తొర్రూరు మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండా ఎగురనుంది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొనగా, మహబూబాబాద్, జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం మున్సిపల్ పీఠాల కోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వర్ధన్నపేట, కేసముద్రంలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య నువ్వా నేనా? అన్న రీతిలో ఉండగా... వర్ధన్నపేటను ఎక్స్ అిఫీషియో ఓటుతో గెలిచే యత్నాల్లో ఉన్నారు. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఒక్క వార్డు ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మిత్రపక్షాలు, ఇండిపెండెంట్ల మద్దతు తర్వాత సమానంగా మారినట్లు ఆ పార్టీ వర్గాలు చెబు తున్నాయి. మహబూబాబాద్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉన్నా.. ఇక్కడ అధికార పార్టీ అడ్వాంటేజీ తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. కాగా, పంచా యతీ ఎన్నికల్లో బలం పెంచుకున్న బీజేపీ జనగామ, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఖాతా తెరవలే దు. 240 వార్డులకు పోటీచేసి ఎనిమిది గెలిచింది. సీపీఐ 4, సీపీఎం 5, స్వతంత్రులు/ ఇతరులు 15 వార్డుల్లో గెలుపొందారు. పరకాలలో ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్న కలెక్టర్ స్నేహ శబరీష్, నర్సంపేటలో కలెక్టర్ సత్యశారదకలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్ న్యూశాయంపేట/హన్మకొండ అర్బన్: వరంగల్ జిల్లా పరిధి నర్సంపేట, వర్ధన్నపేట, హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీల్లో శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, స్నేహ శబరీష్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తిచేయడానికి జిల్లా యంత్రాంగం పనిచేసిందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు అభ్యర్థులు, వారి ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్ బందో బస్తు కల్పించామని చెప్పారు. ఎన్నికల్లో భాగస్వాములైన అందరికీ కలెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షిప్రతినిధి, వరంగల్: 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు దరిదాపులకు కూడా రాని పరిస్థితి. అదే 2026 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారింది. గులాబీ పార్టీకి కంచుకోటలాంటి మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరం అయ్యాయి. తొర్రూరు తర్వాత వర్ధన్నపేట, జనగామ, కేసముద్రం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ప్రభావం కనిపించినా మిగతా చోట్ల ఇబ్బందికరంగానే మారింది. చాలాచోట్ల బీఆర్ఎస్ నేతలు గెలుపు కోసం శ్రమించినా ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వరంగల్లో 9 మున్సిపాలిటీలు 200 వార్డులు ఉన్నాయి. 200 వార్డులకు 134 బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ 33, బీజేపీ 10, సీపీఐ 4, సీపీఎం 2, ఇతరులు/స్వతంత్రులు 17 వార్డుల్లో గెలిచా రు. ఈ లెక్కన మొత్తం 9 మున్సిపాలిటీలపై గులాబీ జెండానే ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల నాటికి కొత్తగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్, ములుగు, కేసముద్రం కలిపి మొత్తం 12 మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో 260 వార్డులకు 140 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, బీఆర్ఎస్ 88, బీజేపీ 8, సీపీఐ 4, సీపీఎం 5, ఇతరులు/స్వతంత్రులు 15 గెలుచుకున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో మాత్రమే స్పష్టమైన మెజార్టీ రాగా, పాత 9 మున్సిపాలిటీల్లో ఏడు చోట్ల కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులే అత్యధికంగా గెలుపొందారు. కేసముద్రం, జనగామ, వర్ధన్నపేటలో నువ్వా, నేనా? అన్నరీతిలో వార్డులను బీఆర్ఎస్ దక్కించుకుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ను ఓటర్లు ఆదరించారు. ఫలితాలపై పోస్టుమార్టం.. గత ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది మున్సిపాలిటీలను గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు ఒకటి, రెండు స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 12 మున్సిపాలిటీలకు పరకాల, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, డోర్నకల్, మరిపెడ, భూపాలపల్లిలో కాంగ్రెస్, తొర్రూరులో బీఆర్ఎస్ క్లియర్ మెజార్టీని సాధించాయి. గట్టిగా పోరాడిన జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్ హంగ్లో చేరడంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు పోస్టుమార్టం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, గత ఎన్నికలకు ఇప్పటికీ ఓట్లు, సీట్లు తగ్గడంపై కూడా సమీక్షించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. కాగా, ఎక్స్అఫీషియో ఓట్లతోనైనా హంగ్ స్థానాలను కై వసం చేసుకునే దిశగా పార్టీ హైకమాండ్తో స్థానిక నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ● ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి ఎంజీఎం: ఎంజీఎంలోని కోబాల్ట్ /క్యాన్సర్ భవనం పక్కన ఉన్న ఎలక్ట్రికల్ డీపీ నిర్మాణంపై కోతి పడడంతోనే ఈనెల 12న ఉదయం ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాలో ఊహించని అంతరాయం ఏర్పడిందని హాస్పిటల్ గ్రేడ్–1 ఎలక్ట్రీషియన్ టి.వినోద్కుమార్ నివేదిక సమర్పించినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి తెలిపారు. ఈనెల 12న ఎంజీఎంలో విద్యుత్ సరఫరాకు అంతరాయంపై 13వ తేదీన పత్రికల్లో వచ్చిన వార్తపై అయన స్పందించారు. కోతి పడిందని ఎన్పీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని దాదాపు గంటలో విద్యుత్ను పునరుద్ధరించినట్లు వివరించారు. ఈసమయంలో ఆస్పత్రి సేవలు, అల్ట్రాసౌండ్ స్కాన్లు, ఎంఆర్ఐ, ఎక్స్రే తదితర పరికరాలు జనరేటర్ విద్యుత్ సరఫరాతో అంతరాయం లేకుండా పనిచేసినట్లు వివరించారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సీటీ స్కాన్ సరఫరాకు కనెక్ట్ కాలేదని తెలిపారు. ఎన్పీడీసీఎల్ విద్యుత్ పునరుద్ధరణ అనంతరం సేవలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు. లెప్రసీ వ్యాధిపై అపోహలు వీడాలి.. తొలి దశలోనే గుర్తించి 6 నెలలు ఎండీటీ చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ‘స్పర్శ్‘ లెప్రసీ అవగాహన పక్షోత్సవం ముగింపు నిర్వహించారు. ఎంజీఎం హాస్పిటల్లోని తాత్కాలిక హాస్పిటలైజేషన్ వార్డులో నిర్వహించిన ఈకార్యక్రమంలో హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్యతో కలిసి హరీశ్చంద్రారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ అశ్విని, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి ఎస్.శ్రీనివాస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల డీపీఎంఓలు సతీశ్రెడ్డి రవీందర్, అనుపమ, వెంకన్న, జయరాజ్, నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి, ఎం.ఎన్.ఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏడు ‘పుర’ పీఠాలు పక్కా.. మరో నాలుగింటిపై కాంగ్రెస్ గురి.. 5. నర్సంపేటమొత్తం వార్డులు260తొర్రూరుపై గులాబీ జెండా.. నాలుగు చోట్ల హంగ్ ‘హంగ్’లోని మరో మూడింటిపై కాంగ్రెస్ గురి వర్ధన్నపేట, కేసముద్రంలో నువ్వా, నేనా? జనగామపై బీఆర్ఎస్ పట్టు ఎక్స్అఫీషియో ఓట్లతో గట్టెక్కేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ల వ్యూహం హంగ్ ‘పుర’ పీఠాల కోసం ఆ రెండు పార్టీల పోటాపోటీ ఓట్ల లెక్కింపు కేంద్రాలనుంచి క్యాంపులకు కౌన్సిలర్లు.. అడ్డాగా ఫంక్షన్హాళ్లు, రిసార్టులు..వార్డుల వారీగా పార్టీల బలాబలాలు మున్సిపాలిటీలు మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సీపీఐ సీపీఎం స్వతంత్రులు/ వార్డులు ఇతరులు పరకాల 22 06 13 03 – – – నర్సంపేట 30 06 21 01 – 01 01 వర్ధన్నపేట 12 06 05 – – – 01 జనగామ 30 13 12 – – 01 04 స్టేషన్ ఘన్పూర్ 18 05 13 – – – – మహబూబాబాద్ 36 11 13 01 03 03 05 తొర్రూరు 16 09 07 – – – – మరిపెడ 15 05 09 – – – 01 డోర్నకల్ 15 04 11 – – – – కేసముద్రం 16 08 08 – – – – భూపాలపల్లి 30 10 16 02 01 01 ములుగు 20 05 12 01 – – 02పరకాల మున్సిపల్ విజేతలు వీరే.. -
నాంపల్లి కోర్టుకు మంత్రి కొండా సురేఖ
రామన్నపేట: 2023 శాసనసభ ఎన్నికల్లో మట్టెవాడ పోలీస్స్టేషన్లో ధర్నా సందర్భంగా నమోదైన కేసులో గురువారం మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆమె వెంట టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు అయూబ్ మహ్మద్, వాసీం అయూబ్ ఉన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలతోపాటు హనుమకొండలోని పలు పరీక్ష కేంద్రాలను కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్ సందర్శించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కోలో చేర్చాలని, ‘కుడా’ నిధులతో దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. వేయిస్తంభాల ఆలయ ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ గురువారం రాత్రి ‘కుడా’ చైర్మన్ను కలిసి దేవాలయ అభివృద్ధి పనులపై, శివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న ఫ్రాంకింగ్ మిషన్లు పనిచేయడం లేదు. సుమారు నెల రోజులుగా బ్యాంకులో లోన్లు, ఆస్తికి తగ్గట్లు దస్తావేజుపై స్టాంప్ డ్యూటీ ఫ్రాంకింగ్ మిషన్ల ద్వారా అందడం లేదు. వరంగల్ ఆర్ఓ, వరంగల్ రూరల్, వరంగల్ ఫోర్ట్, జనగామ, స్టేషన్ ఘన్పూర్లోని ఫ్రాంకింగ్ మిషన్లు పని చేయక తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తక్షణమే మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకు రుణ దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎం: విద్యుత్ అంతరాయం కారణంగా ఎంజీఎం ఆస్పత్రి అత్యవసర విభాగంలోని సీటీ స్కాన్ పరికరం సేవలు 40 నిమిషాల పాటు నిలిచిపోయాయి. సీటీ స్కాన్ పరికరానికి జనరేటర్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. కానీ, సాంకేతిక లోపాల వల్ల సీటీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. సీటీ స్కాన్ పరికరానికి జనరేటర్ అందుబాటులో లేని విషయం పరిశీలిస్తున్నామన్నారు. రోగులకు సేవల్లో అంతరాయం కలగకుండా మెరుగైన వైద్యసేవలందిస్తామన్నారు. కాగా, గతంలో ఎంజీఎంలోని అన్ని అత్యవసర విభా గాలకు జనరేటర్తో 24 గంటల సేవలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ కార్యాచరణకు నోచుకోలే దు. న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ) కళాశాలల్లో ప్రవేశానికి రేపు (శనివారం) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ జె.సతీశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు నగరంలోని వరంగల్(జీ1), హనుమకొండ కేయూ క్రాస్రోడ్, బాలురకు వరంగల్(జీ2) వరంగల్, దూపకుంటరోడ్డు, శంభునిపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు కేంద్రాల్లో కలిపి 1,038 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. -
‘మేడారం’ ఆదాయం రూ.13,51,76,275
హన్మకొండ కల్చరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వతేదీ సోమవారం హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న గురువారం ప్రారంభమైంది. చివరిరోజు లభించిన ఆదాయం.. ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది. జాతర ఆదాయం రూ.13,51,76,275 మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు. ఏటా పెరుగుతున్న ఆదాయం 1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది. గత(2024) జాతర ఆదాయం రూ,12,71,79,280 2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తుత జాతరలో 486 గ్రాముల 500మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రాముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రేట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు. పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399 ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ల ద్వారా) రూ. 21,36,607 గత జాతరకంటే అదనంగా 288 హుండీల ఏర్పాటు అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలు -
నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్ అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్
ఒకవైపు ట్వంటీ–20 వరల్డ్ కప్లో వివిధ దేశాల జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ మాదిరిగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలనుంచి వివిధ జట్ల మాదిరిగా వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్లుగా పోటీచేసిన అభ్యర్థులు విజయం కోసం అహోరాత్రులు శ్రమించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఫలితాల మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాల్బాల్కు కొట్టే పరుగుల మాదిరిగా ఓట్ల కౌంటింగ్లో రౌండ్రౌండ్కు ఫలితాలు మారుతూ అభ్యర్థులను టెన్షన్ పెట్టనున్నాయి. ఈ క్రమంలో నేడు జరిగే మున్సిపాలిటీ–ట్వంటీ–26 ఓట్ల లెక్కింపులో గెలిచేదెవరు?.. ఓడేదెవరో తేలనుంది. – సాక్షిప్రతినిధి, వరంగల్ మున్సిపాలిటీలు: 12 వార్డులు: 260 అభ్యర్థులు: 1,073ఇతరులు:314260 -
కదం తొక్కిన కార్మిక లోకం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నినదిస్తూ కార్మిక లోకం కదం తొక్కింది. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్, హనుమకొండలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. సమ్మె సందర్భంగా వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. సమ్మెకు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ తదితరులు సంఘీభావం ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళన అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు అందించారు. -
గెలిచేదెవరు..?
నేడు మున్సిపల్ ఓట్ల లెక్కింపు ● నర్సంపేట, వర్ధన్నపేటలో పాగాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమా ● గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ ● ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు షురూ సాక్షి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుండడంతో ఆయా పార్టీలతోపాటు స్వతంత్య్ర అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. నామినేషన్ నుంచి ఎన్నికలు ముగిసే వరకు గెలుపుకోసం కష్టపడ్డ అభ్యర్థులతోపాటు, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మేమంటే మేము గెలుస్తున్నామనే ధీమాలో ఉన్నా.. ఓటరు నాడీ ఎటువైపు ఉందో నేడు తేలనుంది. ఈ మేరకు నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్, వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్కుల్లోని ఓట్లను లెక్కిస్తేగానీ ఉత్కంఠకు తెరపడదు. ఈ లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు నుంచి ప్రారంభం కానుంది. కాగా, నర్సంపేటలోని 30 వార్డుల్లో 120 మంది, వర్ధన్నపేటలోని 12 వార్డుల్లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చైర్మన్ అభ్యర్థుల్లో టెన్షన్ బీసీ మహిళకు రిజర్వ్ అయిన నర్సంపేట ము న్సిపల్ చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన పెండెం శ్రీలక్ష్మి, బీఆర్ఎస్ నుంచి ఆశావహులుగా ఉన్న నాగెల్లి పద్మ, నాగిశెట్టి పద్మలకు కౌన్సిలర్గా గెలవడం తప్పనిసరిగా మా రింది. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ జనరల్ రిజ ర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈగ దామోదర్, పాలకుర్తి సారంగపాణి, బీఆర్ఎస్ నుంచి సిలు వేరు కుమారస్వామి, తుమ్మల యాకయ్య, గుజ్జ వీ రన్నలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి తాము విజ యం సాధిస్తేనే వీరికి మార్గం సుగమం కానుంది. ఓవైపు తమ గెలుపు, ఇంకోవైపు పార్టీ గెలుపు ఈ చైర్మన్ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడం కోసం చైర్మన్ ఎన్నికయ్యేంత వరకు క్యాంపులు నిర్వహించేందుకు ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చేజిక్కుతుందా.. మళ్లీ గుబాళిస్తుందా.. 2020 జనవరి 22న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నర్సంపేటలో 24 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులుంటే 24 టీఆర్ఎస్ గెలవగా, ఎనిమిది కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఇతరులు ముగ్గురు గెలిచారు. అయితే ఈసారి నర్సంపేటలో శివారు గ్రామాల విలీనంతో ఆరు వార్డులు పెరిగి 30 వార్డులకు, వర్ధన్నపేట యధావిధిగా 12 వార్డుల కు జరిగాయి. ఈ ఎన్నికల్లో గతంలోలాగా నే మెజార్టీ సీట్లు సాధించి అధికారాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంటుందా, లేదా కాంగ్రెస్ గతంలోకన్నా మెరుగైనా సీట్లు సాధించి చైర్మన్ పీఠం చేజిక్కించుకుంటుందా.. అన్నది నేడు తేలనుంది. గతంలో ఒక స్థానం స్థానం గెలిచిన బీజేపీ ఈసారి మెరుగైన స్థానాలు గెలుచుకుంటామనే ధీమాతో ఉంది. చేతులెత్తే పద్ధతిలో.. ఫిబ్రవరి 16 తేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉండనుంది. సమావేశం ప్రారంభమైన గంటలోపు మొత్తం సంఖ్యలో సగం మంది సభ్యులు హాజరు కావాలి. ఉదాహరణకు నర్సంపేటలో 30 మంది వార్డు సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు ఉంటే మొత్తం 31 అవుతారు.. ఎన్నికకు 16 మంది హాజరుకావాల్సి ఉంటుంది. పార్టీలు జారీ చేసిన విప్లను అధికారులు ఎన్నికలు జరిగే హాల్లో చదివి వినిపిస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు బహిరంగంగా వార్డు సభ్యులు చేతులెత్తడం ద్వారా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16న ఎన్నికకు సరిపడా కోరం లేకపోయినా.. లేదా ఎన్నికలు విఫలమైనా.. తిరిగి 17న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఎన్నిక జరగని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తే మరో తేదీని ఖరారు చేస్తుంది.ఈ నెల 16న జరిగేచైర్మన్, వైస్ చైర్మన్ల ఓటింగ్లో ఎక్స్అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నమోదుకు అవకాశం ఉండడం వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసిరానుంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావల్సిన మెజార్టీకి కాస్తా దూరంలో ఉంటే ఇతర పార్టీల నుంచి సభ్యులను తమ వైపునకు తిప్పుకునే బదులు ఎక్స్ అఫీషియో ఓట్లతో చేజిక్కించుకునే అవకాశముంది. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ కడియం కావ్య, నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాంనాయక్కు అవకాశముంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ నెల 14 వరకు ఎక్స్ ఆఫీషియో సభ్యుల నమోదుకు అవకాశం ఉండడంతో వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఉదయం 8గంటలకు లెక్కింపు షురూ‘పుర’ ఓట్ల లెక్కింపు ఇలా.. వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. మొత్తం 4 టేబుళ్లు, 3 రౌండ్లు, నలుగురు రిటర్నింగ్ అధికారులు, నలుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 100 మంది సిబ్బంది పాల్గొననున్నారు. తొలుత బ్యాలెట్ బాక్స్ల్లోని ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. ఇక్కడ తొలి ఫలితం 10.30కు వెలువడే అవకాశముంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పూర్తి ఫలితాలొస్తాయి. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆరు రౌండ్లు, పది టేబుళ్లు, పది మంది రిటర్నింగ్ అధికారులు, పది మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పది మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 30 మంది అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఇతర సిబ్బంది ఉండనున్నారు. ఇక్కడ కూడా ఫలితం 10.30 నుంచి 11.00 గంటల మధ్య తేలనుంది. మొత్తం ఫలితాలు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య వెల్లడవుతాయి. -
గ్రీన్ఫీల్డ్ హైవే రైతులతో ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన జిల్లాలోని సంగెం మండలానికి చెందిన రైతులతో కలెక్టర్ సత్యశారద తన ఛాంబర్లో గురువారం ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన 8 మంది రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్ రాజ్కుమార్, పర్యవేక్షకులు విశ్వప్రసాద్, సంబంధిత రైతులు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధి జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం నుంచి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్ప్రీత్ సింగ్ తెలి పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా.. 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్, సీఆర్పీసీ–163 ప్రకారం.. ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నిషేధం నేడు (శుక్రవారం) ఉద యం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. కొమ్మాల జాతర వేలం ఖరారు గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర వేలం గురువారం ఖరారు చే సినట్లు ఈఓ ప్రసాద్ తెలిపారు. గత జాతరతో పోలిస్తే రూ.1,90,500 అధిక ఆదాయం సమకూరిందని తెలిపారు. కొబ్బరికాయలు విక్రయానికి రూ.6,07,000, కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడానికి రూ.2.82 లక్షలు, తలనీలాలు పోగు చేసుకోవడానికి రూ.31వేలు, పుట్నాలు, పేలాలు విక్రయించడానికి రూ.23,500గా వేల ఖరారైనటుల తెలిపారు. కార్యక్రమంలో దేవా దాయశాఖ స్పెషల్ ఆఫీసర్ వై.రత్నాకర్రెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివా సాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్ర, సిబ్బంది ప్రేమ్కుమార్, వీరస్వామి, అనురాధ పాల్గొన్నారు. రేపు సీఓఈలో ప్రవేశానికి పరీక్ష న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ) కళాశాలల్లో ప్రవేశానికి రేపు (శనివా రం) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వ రంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ జే.సతీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు నగరంలోని వరంగల్(జీ1), హనుమకొండ కేయూ క్రాస్రోడ్, బాలురకు వరంగల్(జీ2) వరంగల్, దూపకుంటరోడ్, శంభునిపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు కేంద్రాల్లో కలిపి 1,038 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పని చేయని ఫ్రాంకింగ్ మిషన్లు కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న ఫ్రాంకింగ్ మిషన్లు పని చేయట్లేదు. సుమారు నెల రోజులుగా బ్యాంకులో లోన్లు, ఆస్తికి తగ్గట్లు దస్తావేజుపై స్టాంప్ డ్యూటీ ఫ్రాంకింగ్ మిషన్స్ ద్వారా అందడం లేదు. దీంతో ఫ్రాంకింగ్ అవసరం ఉన్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్లోని వరంగల్ ఆర్ఓ, వరంగల్ రూరల్, వరంగల్ ఫోర్ట్, జనగామ, స్టేషన్ ఘన్పూర్లోని ఫ్రాంకింగ్ మిషన్లు పని చేయక హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తక్షణమే ఫ్రాంకింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకు నుంచి లోన్లు తీసుకునేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి చింతలపల్లి రైల్వే గేట్ మూసివేత సంగెం: మండలంలోని సంగెం–చింతలపల్లి రైల్వే లెవల్ క్రాసింగ్ నంబర్ 67 గేట్ను మరమ్మతుల నిమిత్తం మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ట్రాక్ మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్–సంగెం ప్రధాన రహదారిలో ఈ రైల్వే గేట్ ద్వారా ప్రయాణించే ప్రభుత్వ, ప్రైవేట్ వాహనదారులు ఇతర మార్గాల ద్వారా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకుని సహకరించాలని కోరారు. -
కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
నర్సంపేట: నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఎన్నికల అబ్జర్వర్ కె.శివకుమార్ సందర్శించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు వ్యవస్థ, స్ట్రాంగ్ రూమ్ భద్రత, తదితర అంశాలను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సంబంధిత ఎన్నికల అధికారులు అబ్జర్వర్కు కౌంటింగ్ ఏర్పాట్లపై వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇండస్ట్రీయల్ నర్సింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ సత్యశారద నర్సంపేట/వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అధికా రులను ఆదేశించారు. నర్సంపేట వ్యవసాయ మా ర్కెట్లో, వర్ధన్నపేట ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్లో వా ర్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ టేబుల్స్, అభ్యర్థుల గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులకు, మీడియా సౌకర్యాలు పరిశీలించారు. అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట పో లీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించా రు. వాహనాల పార్కింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, మొత్తం 6 రౌండ్లలో, 10 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారా ణి, ఆర్డీఓ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సీఐ సాయన్న, డీ ఆర్డీఓ రామిరెడ్డి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ విజ యసాగర్, మున్సిపల్ కమిషనర్ సుఽధీర్కుమార్, సీఐ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. -
‘మేడారం’ ఆదాయం రూ.13,51,76,275
హన్మకొండ కల్చరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వతేదీ సోమవారం హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న గురువారం ప్రారంభమైంది. చివరిరోజు లభించిన ఆదాయం.. ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది. ఏటా పెరుగుతున్న ఆదాయం 1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది. గత(2024) జాతర ఆదాయం రూ,12,71,79,280 2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదా యం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రా ముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తు త జాతరలో 486 గ్రాముల 500మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రాముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రేట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు. పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399 ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ల ద్వారా) రూ. 21,36,607 గత జాతరకంటే అదనంగా 288 హుండీల ఏర్పాటు అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలుజాతర ఆదాయం రూ.13,51,76,275 మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు. -
వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కోలో చేర్చాలి
● ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కోలో చేర్చాలని, ‘కుడా’ నిధులతో దేవాల య పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి అన్నారు. వేయిస్తంభాల ఆలయ ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ గురువారం రాత్రి ‘కుడా’ చైర్మన్ను కలిసి దేవాలయ అభివృద్ధి పనులపై, శివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈసందర్భంగా వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. గుడి చు ట్టూ ఉన్న షాపులను, గృహాలను పరిహారం కట్టించి తొలగిస్తామని, కొంతమంది గృహ యజమానులు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. -
సబ్స్టేషన్ ఏర్పాటుతో రైతుల జీవితాల్లో వెలుగులు
● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నల్లబెల్లి: ఈ ప్రాంత పోడు రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కొండాపూర్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాలు చేశామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని కొండాపూర్ గ్రామాంలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ను టీఎస్ ఎన్పీడీసీఎల్ ఈఈ వెంకట్రామ్తో కలిసి గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోఓల్టేజీ సమస్యతో గతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. దశాబ్దాల కాలంగా రైతాంగాన్ని వేధిస్తున్న విద్యుత్ సమస్యలకు ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన గిరిజనేతర రైతులకు రెండు పంటలకు సాగు నీరు అందించేందుకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్తోపాటు రవాణ సౌకర్యం మెరుగుపర్చేందుకు మురళీ నగర్, గణేష్ నగర్ గ్రామాలకు నూతన రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేసిన ఇంజనీరింగ్ అధికారులను అభినందించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తాహసీల్దార్ ముప్పు కృష్ణ, సర్పంచ్ అబ్బరబోయిన లలితసురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, నర్సంపేట డీఈ తిరుపతి, కన్స్ట్రక్షన్ డీఈ జాటోత్ హర్జీ, ఏడీఈలు లక్ష్మణ్, జానాకిరాంరెడ్డి, రవి, కుమార్, ఏఈలు మధుకర్, తరుణ్, వరస్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు
హన్మకొండ కల్చరల్: హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఏడో రోజు బుధవారం రూ. 61,16,218 ఆదాయం లభించిందని మేడారం జాతర ఈఓ వీరస్వామి వెల్లడించారు. నోట్ల ద్వారా రూ.1,97,313, నాణెల ద్వారా రూ.58,26,635, విదేశీ కరెన్సీ ద్వారా రూ.92,270 కలిపి మొత్తం ఆదాయం రూ. రూ.61,16,218 లభించినట్లు తెలిపారు. కాగా, గతవారం రోజులుగా నిర్వహించిన లెక్కింపులో మొత్తం రూ.13,25,83,269 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అదేవిధంగా దేవాదాయశాఖ జ్యువెల్లరీ వెరిఫికేషన్ ఆఫీసర్ కట్టా అంజనీదేవి ఆధ్వర్యంలో హుండీల్లో లభించిన బంగారం, వెండిని తూకం వేయించి లెక్కించారు. 486 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 31 కిలోల 700గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు. గురువారం లెక్కింపు కొనసాగుతుందని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు. -
విభజనలో గందరగోళం
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల విభజనలో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల కేటాయింపులో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాచ్మెన్లు, స్వీపర్ల కేటాయింపులో సమ ప్రాధాన్యం కొరవడిందని అధికారులు, ఉద్యోగులు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన జరిగిన క్రమంలో పూర్వ వరంగల్ సర్కిల్ పరిధి ఉద్యోగులను నూతన జిల్లాల వారీగా విభజించారు. జిల్లాల విభజన క్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఈ రెండు జిల్లాల మధ్య మరోసారి ఉద్యోగుల విభజన చేయాల్సి వచ్చింది. కాలయాపన.. జిల్లాల విభజన సమయంలో అన్ని స్థాయి అధికారులు, ఉద్యోగులను విభజించిన యాజమాన్యం, వాచ్మెన్, స్వీపర్ పోస్టులను విభజించలేదు. ఈ ఉద్యోగుల విభజనకు ముందుగా టీజీ ఎన్పీడీసీఎల్ ఫైనాన్స్ సీజీఎం చైర్మన్గా వరంగల్ అర్బన్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కన్వీనర్గా, సంబంధించిన సర్కిల్ ఎస్ఈలు సభ్యులుగా కమిటీ వేశారు. ఈ కమిటీ కాలయాపన చేయడంతో చాలా రోజులుగా విభజన ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం ఎన్పీడీసీఎల్ ఆడిట్ సీజీఎం చైర్మన్గా మరోసారి విభజన కమిటీని యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వాచ్మెన్, స్వీపర్ల విభజన ప్రక్రియ చేపట్టగా విభజనలో అసమతుల్యత నెలకొంది. దీంతో వాచ్మెన్, స్వీపర్ల విభజన ప్రక్రియపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కోల్పోయిన సమ ప్రాధాన్యం టీజీ ఎన్పీడీసీఎల్ జారీ చేసిన ఎన్ఓఓ (సీజీఎం–హెచ్ఆర్డీ) ఎంఎస్ నంబర్ 138 ప్రకారం వాచ్మెన్ పోస్టులు హనుమకొండ సర్కిల్కు 22, వరంగల్ సర్కిల్కు 14 కేటాయించారు. అదే విధంగా ఎన్ఓఓ (సీజీఎం–హెచ్ఆర్డీ) ఎంఎస్ నంబర్ 164 ప్రకారం.. స్వీపర్ పోస్టులు హనుమకొండ సర్కిల్కు 16, వరంగల్ సర్కిల్కు 15 కెటాయించారు. ఇక్కడి వరకు భాగానే ఉన్న ఉద్యోగుల విభజనలో అధికారులు అవలంబించిన విధానంతో సమస్య తలెత్తింది. వాచ్మెన్, స్వీపర్ల సర్వీస్ సీనియార్టీ జాబితాను వేర్వేరుగా రూపొందించాల్సి ఉండగా.. ఇద్దరివీ కలిపి సీనియార్టీ జాబితాను రూపొందించి ఉద్యోగుల విభజన చేయడంతో సమ ప్రాధాన్యం కోల్పోయింది. రెండు సర్కిళ్లలో కలిపి మొత్తం 11 మంది వాచ్మెన్లు, 34 మంది స్వీపర్లు ప్రస్తుతం పని చేస్తున్నారు. హనుమకొండ సర్కిల్లో 22 వాచ్మెన్ పోస్టులుండగా.. నలుగురిని మాత్రమే కేటాయించారు. వరంగల్ సర్కిల్కు 14 వాచ్మెన్ పోస్టులుండగా ఏడుగురిని కేటాయించారు. స్వీపర్ పోస్టులు హనుమకొండ సర్కిల్లో 16 ఉండగా.. 23 మందిని కేటాయించారు. వరంగల్ సర్కిల్లో 15 పోస్టులుండగా.. 11 మంది ఉద్యోగులను కేటాయించారు. పొంతనేది? హనుమకొండకు మంజూరైన పోస్టులు లేకున్నా.. అదనంగా ఏడుగురు స్వీపర్లను కేటాయించారు. వరంగల్ సర్కిల్లో మంజూరైన పోస్టులకంటే నలుగురిని తక్కువగా కేటాయించారు. ఇక్కడున్న పోస్టులకు, పని చేస్తున్న ఉద్యోగులకు పొంతన లేకుండా పోయింది. హనుమకొండ సర్కిల్లో అధిక వాచ్మెన్ పోస్టులుండగా.. వాచ్మెన్లను నియమించాల్సి ఉండగా.. స్వీపర్లను అధిక సంఖ్యలో నియమించారు. దీంతో ఇక్కడ వాచ్మెన్ల కొరత నెలకొంది. స్వీపర్లు మహిళలు కావడంతో వాచ్మెన్ విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగుల విభజన మేరకు సర్కిల్కు కేటాయించిన వారికి పోస్టింగ్లు ఇచ్చి వారిని హనుమకొండ నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ.. వరంగల్ ఎస్ఈ లేఖ రాశారు. అయితే హనుమకొండ సర్కిల్ అధికారులు వారిని రిలీవ్ చేయలేదు. ఉద్యోగుల విభజన ఆమోదయోగ్యంగా లేదని హనుమకొండ సర్కిల్లోని పలువురు అధికారులు, ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాచ్మెన్, స్వీపర్ల సర్వీస్ సీనియార్టీని లెక్కించి వేర్వేరుగా జాబితా రూపొందించి విభజన చేస్తేనే సమ న్యాయం జరుగుతుందని అధికారులు, ఉద్యోగులు తెలిపారు. వాచ్మెన్, స్వీపర్లను కలిపి ఒకే సీనియార్టీ సర్కిళ్లకు కేటాయింపులో కుదరని సమ ప్రాధాన్యం ఒక సర్కిల్కు వాచ్మెన్లు ఎక్కువ, మరో సర్కిల్కు స్వీపర్లు ఎక్కువ వాచ్మెన్ల కొరతతో ఎదురవనున్న ఇబ్బందులు ఎన్పీడీసీఎల్ ఉద్యోగుల విడుదలకు ఎస్ఈ అభ్యంతరం -
ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్ ప్రశాంతం ఉమ్మడి వరంగల్లో 3.35 లక్షల మందికి ఓటేసింది 2,58,930
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ ఎంపికయ్యారు. కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఎన్ఐటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ వద్ద ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీహెచ్డీ చేస్తున్న అశోక్కుమార్ సదస్సులో ‘ది లైఫ్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ ఠాకూర్ దేవ్ సింగ్’ అంశంపై పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఈసందర్భంగా అశోక్కుమార్ను గైడ్ రవికుమార్, ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్, క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, కోచ్లు అభినందించారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని బుధవారం తెలంగాణ జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారి, బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కట్టా అంజనీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు అలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. అదేవిధంగా మహాశిరాత్రిని పురస్కరించుకుని వరంగల్కు చెందిన న్యాయవాది చండ్రపాటి చిదంబరనాథ్శర్మ దంపతుల ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహించే మహారుద్రయాగాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. వరంగల్ క్రైం: అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భవన నిర్మాణ రంగంలో వాడే బ్రాండెడ్ కంపెనీ గోల్డ్మెడల్ను పోలిన నకిలీ వైర్లు విక్రయిస్తున్నాడో వ్యాపారి. పక్కా సమాచారంతో డబ్బాల సమీపంలోని అర్భుద ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీలో టాస్క్ఫోర్స్ పోలీసులు, హనుమకొండ పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రూ.3.59 లక్షల నకిలీ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. షాప్ యజమాని కంతి లాల్ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాజు, ఎస్సై భానుప్రకాశ్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: ఈ నెల 14 నుంచి 5 రోజుల పాటు వేయిస్తంభాల ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ను ఆలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆహ్వానించారు. హనుమకొండలోని కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహశబరీష్ను బుధవారం కలిసి ఆహ్వానపత్రిక అందించి ఉత్సవాలకు హాజరవ్వాలని కోరారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. అదేవిధంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు చలువ పందిళ్లు, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ వరంగల్ జోన్ డీసీ రామల సునీతను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కాజీపేట రూరల్: కాజీపేట మండలం కడిపికొండకు చెందిన నేషనల్ ఐరన్ క్లబ్ జిమ్ కోచ్ కమ్ చైర్మన్ ఎండీ.జాఫర్ మాస్టర్ పంజాబ్ హరిద్వార్లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్లో ప్రథమ స్థానం నిలిచి గోల్డ్ మెడల్ను కై వసం చేసుకున్నారు. 59 కేజీల విభాగంలో జరిగిన నేషనల్ పవర్లిఫ్టింగ్ కాంపిటీషన్లో 317 1/2 కిలోల టోటల్ చేసి తెలంగాణ నుంచి జాఫర్ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ను సాధించి రికార్డును బ్రేక్ చేశారు. పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల పరిధిలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలుపరకాల: పరకాలలో పోలింగ్ ముగిసిన అనంతరం 5 రూట్లలోని 44 పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్సులను అధికారుల సమక్షంలో సాయంత్రం 5.30 గంటలకు సీల్ వేసి భారీ బందోబస్తుతో తరలించారు. పోలీస్ ఎస్కార్ట్తో గణపతి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. కౌంటింగ్ కూడా ఇదే కళాశాలలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాత్రి 7గంటల వరకు అన్ని బ్యాలెట్ బాక్సులను తరలించారు. సాక్షిప్రతినిధి, వరంగల్ : పుర పోరులో ఉమ్మడి వరంగల్ పట్టణవాసులు ఓట్లెత్తారు. ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9.30 గంటల వరకు మందకొడిగా సాగింది. ఆ తర్వాత 10 గంటల నుంచి ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులుదీరారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు అప్పుడప్పుడు లాఠీలు ఊపారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా చెదురు ముదురు ఘటనలు మినహా ఎన్నికల ఘట్టానికి తెరపడడంతో జిల్లాల ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం ఉమ్మడి వరంగల్లో బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీల్లో 200 వార్డులుండగా.. ఏకగ్రీవమైన 18 మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలతో పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంకంటే 13.38 శాతం పెరిగింది. స్ట్రాంగ్ రూముల్లో భవితవ్యం.. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపాలిటీల వారిగా పోలింగ్ బాక్సులను ఒకేచోట చేర్చిన అధికారులు భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్రూములకు తరలించారు. మొత్తం బ్యాలెట్ పేపర్లతో కూడిన బాక్సులను మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్రూముల్లో భద్రపర్చారు. శుక్రవారం (13వ తేదీన) ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవిత్యం తేలనుంది. కాగా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద రెండు జిల్లాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటుకు ఆదేశించారు. కాగా, స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉన్న ఓటర్లు తీర్పు ఎక్కడెక్కడ ఎవరిని వరిస్తుందోనన్న టెన్షన్ అభ్యర్థులో నెలకొంది. కాగా, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రజలు, నిర్వహించిన అధికారులకు కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు అభినందనలు తెలిపారు. పరకాల మండలంలోని మోడల్ పోలింగ్ కేంద్రం, పరకాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ స్నేహ శబరీష్, నర్సంపేటలో వరంగల్ కలెక్టర్ సత్యశారద, ఓటు వేసి వస్తున్న వృద్ధురాలు, పరకాలలో ర్యాంపు లేక ఇబ్బంది పడుతూ దిగుతున్న దివ్యాంగుడు పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సుల తరలింపు స్ట్రాంగ్రూముల్లో భద్రం... రేపు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు -
మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం
మున్సిపాలిటీ మొత్తం పోలైన పోలింగ్ శాతం (గంటల్లో) ఓట్లు ఓట్లు 7–9 9–11 11–1 1–3 3–5 పరకాల 26,784 21,476 9.67 22.04 53.51 70.15 80.18 నర్సంపేట 40,968 34,908 12.49 34.16 57.64 74.71 85.21 వర్ధన్నపేట 10,526 9,077 13.02 35.51 61.68 77.72 86.23 జనగామ 44,045 34,821 10.19 26.50 46.65 65.10 79.06 స్టేషన్ ఘన్పూర్ 18,550 15,670 11.53 33.32 56.38 74.13 84.47 మహబూబాబాద్ 65,712 49,681 10.58 32.33 51.40 66.62 75.60 తొర్రూరు 21,451 16,730 8.77 28.92 52.58 68.93 77.79 మరిపెడ 13,687 11,683 16.32 43.23 66.22 79.65 85.36 కేసముద్రం 15,963 13,750 13.36 39.84 65.14 79.50 86.14 డోర్నకల్ 10,869 8,900 13.11 36.96 58.87 73.00 81.88 భూపాలపల్లి 52,726 31,007 12.32 29.97 47.80 56.69 58.81 ములుగు 13,963 11,227 10.19 33.35 58.12 72.84 80.41 -
డీజిల్ షెడ్డులో ఫిల్టరేషన్ ప్లాంట్ ప్రారంభం
ప్రారంభించిన రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణన్ కాజీపేట రూరల్: కాజీపేట డీజిల్ లోకో షెడ్లో ఆయిల్ ఫిల్టరేషన్ ప్లాంట్, ఒరాలింగ్ మిషన్ టెస్టింగ్ జనరేటర్ను బుధవారం సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) గోపాలకృష్ణన్ ప్రారంభించారు. అనంతరం డీఆర్ఎం ఇంటర్నల్ సెక్షన్లను తనిఖీ చేసి డీజిల్షెడ్ అభివృద్ధి, సమస్యలను స్థానిక రైల్వే షెడ్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కాజీపేట జంక్షన్ అమృత్ భారత్ పునరాభివృద్ధి పనులను డీఆర్ఎం తనిఖీ చేసి అధికారులతో మాట్లాడారు. డీఆర్ఎం వెంట సికింద్రాబాద్ ఏడీఆర్ఎం సంజీవరావు ఉన్నారు. వినతి అందజేత కాజీపేట డీజిల్ లోకో షెడ్డుకు వచ్చిన రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణన్ను రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్, డీజిల్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కె.జానీమియా, పాక వేదప్రకాశ్ సన్మానించి వినతిపత్రం అందించారు. షెడ్డులో మహిళా కార్మికుల కోసం వసతి గదులను నిర్మించాలని, డీజిల్షెడ్ నుంచి మెయిన్ రోడ్డు కళాతోరణం వరకు రోడ్డు మరమ్మతు చేయాలని, డీజిల్ కాలనీకి మిషన్ భగీరథ వాటర్ను సరఫరా చేయాలని, డీజిల్ ఇన్స్టిట్యూట్ కమ్యూనిటీ హాల్ను ఏసీగా ఆధునికీకరించాలని, లోకోలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 130 పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. డీఆర్ఎం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు జానీమియా తెలిపారు. -
పోలీసులపై బీజేపీ అధ్యక్షుడి అసహనం
నర్సంపేట: పట్టణంలోని పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం పలు పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పదో వార్డు బీజేపీ అభ్యర్థి తాళ్లూరి వసంతకుమారి పోలింగ్ బూత్లో తిరుగుతుండగా కానిస్టేబుళ్లు బీజేపీకి అనుబంధంగా ఉన్న చీర కట్టుకుని ఎన్నిసార్లు తిరుగుతావని ప్రశ్నించారు. రవికుమార్ అక్కడకు చేరుకుని చీర విషయంలో అభ్యంతరాలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు మరికొన్ని పోలింగ్ బూత్ల వద్ద కానిస్టేబుళ్ల లాఠీలకు మేకులు ఉండడాన్ని చూసి నిలదీశారు. ఓటు వేయడానికి వచ్చే వారిని ఈ విధంగా భయటపెట్టడం సరికాదని, లాఠీలను వెంటనే తీసి వేయాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వెంట బీజేపీ నాయకుడు కంభంపాటి పుల్లారావు ఉన్నారు. -
పోటెత్తిన ఓటర్లు
నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో 85.42 శాతం పోలింగ్ నమోదుసాక్షి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసింది. నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డుల నుంచి 120 మంది, వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల నుంచి 50 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్స్ల్లో నిక్షిప్తమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన పోలింగ్ చాలాచోట్ల సాయంత్రం ఐదు గంటల వరకు ముగిసింది. కొన్ని పోలింగ్ బూతుల్లో అప్పటికే క్యూలైన్లలో నిలిచిన ఓటర్లకు అవకాశం ఇవ్వగా సాయంత్రం 6.30 వరకు జరిగింది. ఈ రెండు మున్సిపాలిటీల్లోని 42 వార్డుల్లో 51,494 మంది ఓటర్లుంటే 43,985 (85.42 శాతం) మంది ఓటు వినియోగించుకున్నారు. పురుషులు 21,021 మంది (84.93 శాతం), 22,961 (85.87 శాతం) మంది మహిళలు ఓటేశారు. పురుషులు 70 మంది, మహిళలు 100 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం.. నర్సంపేటలో 60, వర్ధన్నపేటలోని 20వ పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. పటిష్ట పోలీసు బందోబస్తుతో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పెద్దగా ఎక్కడ గొడవలు జరగలేదు. అలాగే, పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్ సౌకర్యం కల్పించారు. యువత, మహిళలు ఉత్సాహంగా ఓటేసిన అనంతరం కొన్ని బూతుల్లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద చేతికి సిరా చుక్క చూపిస్తూ సెల్ఫీలు దిగడం కనిపించింది. కొన్ని వార్డుల్లో పార్టీల కండువాలు కప్పుకొని తిరుగుతున్న నాయకులను పోలీసులు చెదరగొట్టారు. బీఆర్ఎస్కు చెందిన వ్యక్తి డబ్బులు పంచుతున్నాడని పట్టుకున్నారు. నర్సంపేటలోని 144 బ్యాలెట్ బాక్స్లను వ్యవసాయ మార్కెట్ యార్డు స్ట్రాంగ్రూం, వర్ధన్నపేటలోని 52 బ్యాలెట్ బాక్స్లను మున్సిపల్ కార్యాలయ స్ట్రాంగ్రూంకు పటిష్ట బందోబస్తు మధ్య తరలించారు. ఈ ఓట్లను శుక్రవారం లెక్కించనున్నారు. ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. వార్డులు, ఓటర్లు, పోలైన ఓట్ల వివరాలు.. మొత్తం వార్డులు 42 పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓట్లు 51,494 24,751 26,739 4 పోలైన ఓట్లు 43,985 21,021 22,961 3 పోలింగ్ శాతం 85.42 84.93 85.87 75 నర్సంపేట మున్సిపాలిటీ (30 వార్డులు).. మొత్తం ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు 40,968 19,642 21,323 3 పోలైన ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు 34,908 16,638 18,268 2 (85.21%) (84.71%) (85.67%) (66.67%) వర్ధన్నపేట మున్సిపాలిటీ (12 వార్డులు) మొత్తం ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు 10,526 5109 5416 1 పోలైన ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు 9077 4383 4693 1 (86.23 %) (85.79%) (86.65%) (100%) -
పర్యావరణంపై అవగాహన కోసమే..
వర్ధన్నపేట : హరిత పోలింగ్ స్టేషన్ను పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యశారద నర్సంపేట : పర్యావరణ హిత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యశారదకలెక్టర్ డాక్టర్ సత్యశారద నర్సంపేట/వర్ధన్నపేట: ఓటర్లకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు హరిత, పర్యావరణ హిత పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం కలెక్టర్ నర్సంపేట, వర్ధన్నపేటలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. నర్సంపేటలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హరిత పోలింగ్ స్టేషన్, బొందబడి ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటుచేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిత్యావసర వస్తువుల తయారీ ప్రదర్శనలు ఏర్పాటుచేసి, పునర్వినియోగ ప్రాధాన్యం చాటి చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని వివరించే సందేశాలు ప్రజల్లో చైతన్యం రేకెత్తించాయి. వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన హరిత పోలింగ్ కేంద్రం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఓటర్లను ఆకట్టుకుంది. అక్కడ సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద పెన్తో పాటు ఓటు రిస్ట్ బాండ్లను ఓటర్లకు కలెక్టర్ సత్యశారద అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ శాతం పెంచేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు.. మన బాధ్యత కూడా అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, మున్సిపల్ కమిషనర్ సుధీర్కుమార్, ఎంపీడీఓ వెంకటరమణ, నోడల్ ఆఫీసర్లు భాగ్యలక్ష్మి, పుష్పలత ఉన్నారు. -
వెబ్కాస్టింగ్తో పోలింగ్ ప్రక్రియ పరిశీలన
న్యూశాయంపేట: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూం నుంచి నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో మున్సిపల్ పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 80 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కార్యాలయం, రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం కూడా నేరుగా పర్యవేక్షించినట్లు తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆమె వెల్లడించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
కాళోజీ సెంటర్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ బుధవారం ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు 92 మంది జనరల్ విద్యార్థులకు 90 మంది, ఒకేషనల్లో 184 మందికి 184 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది జనరల్ విద్యార్థులకు 27 మంది హాజరైనట్లు తెలిపారు. డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల పర్యవేక్షించారని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం రైతులకు మేలుఖానాపురం: ప్రకృతి వ్యవసాయ విధానంతో రైతులకు మేలు కలుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధాన ఆచరణ ప్రాజెక్టులో భాగంగా మంగళవారిపేటలో బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భూమి, పర్యావరణం, సమస్త జీవరాశికి హాని కలిగించని విధానానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద పలు యూనిట్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఇందులో కృషి, సఖీ చొప్పున ఇద్దరు మహిళలను ఎంపికచేసి ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ముందుగా మండల కేంద్రంలో ఎరువుల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎరువుల పంపిణీలో యాప్ పనివిధానాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వ్యవసాయ అధికారి శ్రీనివాస్, విస్తరణ అధికారి అంకుషావలీ తదితరులు పాల్గొన్నారు. బొమ్మలతో అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాంగీసుకొండ: పొదుపు సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను బొమ్మలతో అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని ఉమ్మడి వరంగల్ జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమం అమలుతీరును బుధవారం ఆయన మండలంలోని మరియపురం, కొనాయమాకుల గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డి మాట్లాడుతూ పలక, బలపం లేకుండానే కేవలం బొమ్మల ద్వారా అక్షరాలను నేర్చుకునే విధంగా ప్రభుత్వం పుస్తకాలను రూపొందించిందని అన్నారు. 90 రోజుల పాటు జరిగే అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సెర్ప్ సీసీలు, వలంటీర్లు, అక్షరాస్యులైన సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ప్రతీ వీఓలో 60 మంది నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులను చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. సెర్ప్ మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులను అక్షరాస్యులను చేయాలని సూచించారు. సీసీలు నర్సయ్య, సురేశ్, శ్రీలత, రాధిక, శిల్ప, శారద, వీఓఏలు కిరణ్, సాంబరాజు, జ్యోతి, సరస్వతి, రమ, అభ్యాసకులు పాల్గొన్నారు. పాఠశాలలో బాలికపై లైంగిక దాడికి యత్నం పర్వతగిరి: ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై బి.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బుధవారం పాఠశాలకు వెళ్లింది. ఉదయం 9 గంటల సమయంలో తరగతి గదిలో ఎవరూ లేకపోవడంతో ధరావత్ సురేశ్ అనే యువకుడు బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె భయంతో అరవగా సమీపంలో ఉన్న అంగన్వాడీ ఆయా వచ్చి కాపాడింది. ఇంతలోనే సురేశ్ పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్
● గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ల నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలలో 200 వార్డులుండగా ఏకగ్రీవమైన 18 వార్డులు మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలు పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే 13.38 శాతం పెరిగింది. 80.66 % -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నర్సంపేట/వర్ధన్నపేట: అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలు సజావుగా, ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ మేరకు నర్సంపేట, వర్ధన్నపేటలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెక్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, తదితర ఎన్నిక ల సామగ్రి క్రమబద్ధంగా అందేలా చూడాలన్నారు. ప్రతీ బ్యాలెట్ బండిల్పై సీల్, అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సిబ్బందికి తాగునీటి వసతి, వైద్యశిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు తదితర అన్ని మౌలిక సదుపాయాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏమైన సమస్యలు తలెత్తిన సందర్భంలో వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, ఆర్డీఓ సుమా, డీబీసీడీఓ పుష్పలత, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, ఎన్నికల అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సాయిబాబు, రాజు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద వర్ధన్నపేట, నర్సంపేటలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన -
ఎంజీఎంలో రక్తం కొరత !
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఓపీ చిట్టీ నుంచి మొదలుకుని చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతీ విభాగంలో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందే రోగులు మెరుగైన వైద్యసేవలు పొందడానికి రక్తనిధి కేంద్రం సేవలు అత్యంత కీలకం. కానీ, ఈ కేంద్రం సేవల సమస్యలను పరిష్కరించడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో 1,500 పడకలతోపాటు సీకేఎం, జీఎంహెచ్, ఆర్ఈహెచ్, టీబీ ఆస్పత్రులతోపాటు చుట్ట పక్కల ప్రభుత్వ ఆస్పత్రులకు పెద్ద దిక్కుగా ఈ బ్లడ్బ్యాంకు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బ్లడ్బ్యాంకులో 300 యూనిట్ల కంటే ఎక్కువగా రక్తం నిల్వ లేదనే విషయాన్ని గమనిస్తే దీని నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. విధుల్లో వైద్యాధికారి.. ఎంజీఎం ఆస్పత్రి వంటి అతి పెద్ద రక్తనిధి కేంద్రానికి సిబ్బంది కొరత పెద్ద తలనొప్పిగా మారింది క్యాంపుల నిర్వహణ కోసం కౌన్సిలర్లు లేకుండా ఈ రక్తనిధి కేంద్రం కొనసాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నాయకుల జన్మదినం, మానవతా దృక్పథంతో వచ్చే రక్తదాతల సహకారం తప్ప గత కొన్ని నెలలుగా ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం లేదు. గతంలో మోటిటేటర్గా పనిచేసి అత్యత్తుమ అవార్డులు సాధించిన కల్యాణి అనే ఉద్యోగిని పరిపాలనాధికారులు అకారణంగా తొలగించారు. కొన్ని నెలల క్రితం డిప్యుటేషన్పై వచ్చిన కౌన్సిలర్ను సైతం వెనక్కి పంపించేశారు. బ్లడ్బ్యాంకులో ముగ్గురు వైద్యాధికారులు, 12 మంది ల్యాబ్టెక్నీషియన్లు, నలుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, మోటివేటర్, కౌన్సిలర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం ఒకే ఒక్క వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రమే కొనసాగుతున్నారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ నిబంధనలు.. రాష్ట్రంలో వైద్యసేవలను మరింత బలోపేతం చేసేందుకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ సెప్టెంబర్ మాసంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ● ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రాల్లో రక్తం కొరత లేకుండా చూడాలి. ● ప్రైవేట్, స్వచ్ఛంద రక్తసేకరణ కేంద్రాలు తాము సేకరించే రక్త యూనిట్లలో 30 శాతాన్ని జిల్లాలోని ప్రభు త్వ రక్తనిధి కేంద్రాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ● ఈ ప్రక్రియపై ప్రతి నెల నివేదికలను తెలంగాణ రాష్ట్ర రక్త మార్పిడి మండలికి పంపించాల్సి ఉంటుంది. ● ఈ నివేదిక ప్రకారం ఎంజీఎం బ్లడ్బ్యాంకుకు రావాల్సి న రక్తం యూనిట్ల రాకపోవడం వల్ల పేద ప్రజలకు రక్తం కొరత ఏర్పడుతోంది. ● ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలని, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ నిర్ణయాలను ఉల్లంఘిస్తున్న కేంద్రాలపై కొరడా ఝుళిపించాలని పేద ప్రజలకు వేడుకుంటున్నారు. ● ఈ విషయమై సూపరింటెంటెండ్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డిని వివరణ కోరగా సిబ్బందిని నియమించి, రక్తం కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. రక్తనిధి కేంద్రంలో నియామకానికి నోచుకోని కౌన్సిలర్లు.. కానరాని క్యాంపులు కౌన్సిల్ నిబంధనలు పట్టించుకోని ప్రైవేట్ బ్లడ్బ్యాంకులు రక్తం కోసం పరుగులు తీస్తున్న పేద రోగులు ఏటూరునాగారంనుంచి ఇటీవల ఓ కేన్సర్ పేషెంట్ చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చాడు. రక్తం కావాలని సదరు పేషంట్ కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. వారు బ్లడ్బ్యాంకుకు వెళ్తే సిబ్బంది ఒక యూనిట్ మాత్రమే ఇచ్చారు. ఇంకో యూనిట్ కావాలంటే లేదు అని చెప్పారు. దీంతో వారు ప్రైవేట్ బ్లడ్బ్యాంకు వెళ్లి రక్తం ప్యాకెట్ కొనుక్కొని వచ్చారు. ఈ పరిస్థితి ఒక్క కేన్సర్ పేషంట్ది మాత్రమే కాదు.. ఎంజీఎం ఆస్పత్రిలో అనేకమంది రోగులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
నేడే పేట పురపోరు
నర్సంపేటలో 30 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులకు పోలింగ్● ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ● 51,494 మంది ఓటర్ల చేతిలో 170 మంది అభ్యర్థుల భవితవ్యం ● ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి ప్రలోభాల పర్వం ● ఎక్కడైనా గొడవలు జరిగితే రీ పోలింగ్కు అవకాశంసాక్షి, వరంగల్: జిల్లాలోని నర్సంపేటలోని 30 వార్డులు, వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డులకు బుధవారం పోలింగ్ జరగనుంది. ఇన్నాళ్లు ప్రచారం చేసిన నేతల భవితవ్యం ఓటర్లు బ్యాలెట్ బాక్స్ల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లోని 42 వార్డులకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్న ఎన్నికల్లో 51,494 మంది ఓటు వినియోగించుకోనున్నారు. ఈ పోటీల్లో వంద మంది మహిళలు పోటీలో ఉంటే 70 మంది పురుషులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ 170 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే 51,494 మంది ఓటర్లలో ఎక్కువగా 26,739 మంది మహిళల ఉండడంతో వారి ఓటు నిర్ణయాత్మకం కానుంది. నర్సంపేట చైర్మన్ బీసీ మహిళ రిజర్వేషన్, వర్ధన్నపేట చైర్మన్ జనరల్ రిజర్వేషన్ కావడంతో ఆయా మున్సిపాలిటీల్లో ఈ చైర్మన్ గిరిని ఆశించే అభ్యర్థులు ఒక పార్టీ నుంచి ఇద్దరు ఉండడంతో ఆయా వార్డుల్లో రాజకీయ పండుగ వాతావరణం ఉంది. ఇతర వార్డుల్లోనూ గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు విజయాన్ని సవాల్గా తీసుకెళ్లి ముందుకెళ్తున్నారు. నేడు జరిగే ఎన్నికల్లో ఎక్కడైనా గొడవలు జరిగి రీ పోలింగ్ తప్పదనుకుంటే గురువారం నిర్వహిస్తారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో, నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులకు బ్యాలెట్ బాక్స్లు తరలించి శుక్రవారం లెక్కించనున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు.. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. నర్సంపేట, వర్ధ న్నపేట మున్సిపాలిటీల్లో హరిత, సాలిడ్ వెస్ట్ మేనే జ్మెంట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పగటిపూటే పంపిణీ.. ఇటు నర్సంపేట, అటు వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఓటర్లను అన్ని పార్టీల నేతలు ప్రసన్నం చేసుకున్నారు. ఎప్పుడైనా ఎన్నికల సమయంలో రాత్రిపూటనే ఎక్కువగా నగదు, మద్యం, చీరలతో పాటు ఇతర బహుమతులు పంపిణీ చేసే నేతలు ఈసారి ఎంచక్కాగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాన్ని ముగించేశారు. సాధారణ వార్డుల్లో రూ.వెయ్యి నుంచి రూ.2,500 వేల వరకు ఓటుకు పంపిణీ చేస్తే, చైర్మన్ పీఠం ఆశిస్తున్న వార్డుల్లో మాత్రం రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు ఓటుకు ఖరీదు కట్టారు. అసలు డబ్బే చిక్కలేదు.. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో నిఘా కోసం నియమించిన ఆరు స్టాటిక్ సర్వైలైన్స్ టీమ్స్, నాలుగు ఫ్లయింగ్ స్వ్కా డ్లకు అసలే డబ్బే చిక్కలేదు. మొత్తం 42 వార్డుల్లో గెలవాలన్న తలంపుతో అభ్యర్థులు ఎక్కడా తగ్గకుండా ప్రలోభాలకు తెరలేపినా ఒక్క రూపాయి కూడా ఈ బృందాలకు దొరకలేదు. ఇదిలాఉండగా ముగ్ధుంపుర వాసి గొర్రె ఉపేందర్ ఇంట్లో రూ.6,200ల విలువ చేసే ఆరు బీర్ బాటిల్స్, 750 మిల్లీలీటర్ల ఐదు లిక్కర్ బాటిల్స్ను ఫ్లయింగ్ స్వ్కాడ్ టీమ్ ఈ నెల 6న స్వాధీనం చేసుకొని ఎకై ్సజ్ డిపార్ట్మెంట్కు అప్పగించారు. మరోవైపు పోలీసులు రూ.1,06,071 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో నేడు (బుధవారం) జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ అన్నిశాఖల అ ధికారులు సమన్వయంతో ఎన్ని కలను విజయవంతం చేయాలని కో రారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఎన్నికల కమిషన్ అనుమతించిన ఏదైన గుర్తింపు కార్డును తీసుకెళ్లాలన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, అ భ్యర్థులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు.ఓటేసేందుకు 18 కార్డులు.. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
నాగసుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు
గీసుకొండ: మండలంలోని ఊకల్హవేలిలోని ప్రసిద్ధ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భవమ నవమిని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకులు శ్రీహర్ష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 16 నుంచి అంతర్గత మార్కుల పరిశీలనడీఈఓ రంగయ్య నాయుడు కాళోజీ సెంటర్: జిల్లాలో పదో తరగతి విద్యార్థుల అంతర్గత (ఇంటర్నల్) మార్కుల పరిశీలన ప్రక్రియ ఈనెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మార్కుల విభజన పదో తరగతిలో ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కులు వార్షిక పరీక్షకు కేటాయించగా 20 మార్కులు అంతర్గత మూల్యాంకనానికి కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో 290 పాఠశాలల నుంచి 9,492 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. ఇందులో ప్రభుత్వ జిల్లా పరిషత్, వెల్ఫేర్, మోడల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 5,278 మంది కాగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 4,214 మంది ఉన్నారు. తనిఖీ కోసం 48 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతీ బృందంలో ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించిన ఎఫ్ఏ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. తనిఖీ చేసిన వివరాలను వెంటనే సంబంధిత వెబ్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుందని డీఈఓ తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంకాళోజీ సెంటర్: జిల్లాలోని మోడల్ స్కూల్స్లో 2026–27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మోడల్ స్కూల్స్లో 6వ తరగతిలో కొత్త అడ్మిషన్స్తో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4న ఉంటుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలకు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. టీజీఎంఎస్.తెలంగాణ.జీఓవీ.ఇన్ను సంప్రదించాలన్నారు. రేపు కొమ్మాల జాతరలో బహిరంగ వేలంగీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా పలు పనులు, సేవలు అందించడానికి సీల్డ్ టెండర్/బహిరంగ వేలం పాటలను ఈ నెల 12న (గురువారం) ఆలయం వద్ద నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పి.ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకోవడానికి రూ.లక్ష, కొబ్బరి ముక్కలు, చిప్పలు పోగు చేసుకోవడానికి రూ.50 వేలు, తలనీలాలు సేకరించడానికి రూ.20 వేలు, పుట్నాలు, పేలాలు అమ్ముకోవడానికి రూ. 20 వేలను డిపాజిట్గా చెల్లించి ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో ఆసక్తిగల వారు టెండర్లు దాఖలు చేయవచ్చన్నారు. అదే రోజు మధ్నాహ్నం 12 గంటల తర్వాత వేలం పాటలను నిర్వహిస్తామన్నారు. టెండర్ల కాల పరిమితి ఈ నెల 23 నుంచి మార్చి 27వ తేదీ వరకు ఉంటుందన్నారు. ‘స్కిల్డిజైర్’తో కేయూ ఎంఓయూ కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని స్కిల్డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో మంగళవారం కేయూ ఎంఓయూ కుదుర్చుకుంది. వీసీ కె.ప్రతాప్రెడ్డి సమక్షంలో అవగాహన పత్రాలను రిజిస్ట్రార్ వి.రామచంద్రం, స్కిల్డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ మార్చుకున్నారు. ఈ ఒప్పందం ఒక సంవత్సర కాలం ఉంటుంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరగుపర్చడం కోసం ఎంఓయూ ఉద్దేశమని రిజిస్ట్రార్ తెలిపారు. -
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు నెక్కొండ: దేశవ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు కోరారు. ఈ మేరకు మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి కృష్ణమీనన్రావుకు సమ్మె నోటీస్ హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా చెన్నకేశవులు మాట్లాడుతూ కార్మిక వర్గాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి అదానీ, అంబానీ కార్పొరేట్ సంస్థలకు అనుకూల చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికుల చట్టాలను యథావిధిగా కొనసాగించేంత వరకు దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు తోట వెంకన్న, మనుబోతుల యాకాంబ్రం, కూస వెంకన్న, ఉసిల్ల నర్సయ్య, చీరబోయిన సంతోష్, తోట మహేందర్, అందె స్వామి, కోరే రవి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆదాయం రూ.20.24 కోట్లు
● మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 హన్మకొండ: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్ ఆర్టీసీ రూ.20,24,28,124 ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్ డేస్లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు. ఉద్యోగుల సమష్టి కృషితో... అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో జాతరను విజయవంతం చేశాం. ఏర్పాట్లు మొదలు నుంచి జాతర పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ కష్టించి పని చేశారు. జాతరను విజయవంతం చేసిన అందరికీ అభినందనలు. – దర్శనం విజయ భాను, ఆర్ఎం, వరంగల్ -
ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
పరకాల: పరకాల మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహశబరీష్ తెలిపారు. పరకాలలోని గణపతి డిగ్రీ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరి శీలించారు. పోలింగ్, కౌంటింగ్కు ఎంతమంది పోలీ సులను నియమించారని అదనపు కలెక్టర్ ఎన్.రవి, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్యను అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి సత్యశారద న్యూశాయంపేట: నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు. -
ఎంజీఎంలో రక్తం కొరత!
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఓపీ చిట్టీ నుంచి మొదలుకుని చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతీ విభాగంలో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందే రోగులు మెరుగైన వైద్యసేవలు పొందడానికి రక్తనిధి కేంద్రం సేవలు అత్యంత కీలకం. ఎంజీఎం ఆస్పత్రిలో 1,500 పడకలతోపాటు సీకేఎం, జీఎంహెచ్, ఆర్ఈహెచ్, టీబీ ఆస్పత్రులతోపాటు చుట్ట పక్కల ప్రభుత్వ ఆస్పత్రులకు పెద్ద దిక్కుగా ఈ బ్లడ్బ్యాంకు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బ్లడ్బ్యాంకులో 300 యూనిట్ల కంటే ఎక్కువగా రక్తం నిల్వ లేదనే విషయాన్ని గమనిస్తే దీని నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. ఈ విషయమై సూపరింటెంటెండ్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డిని వివరణ కోరగా ఎంజీఎం బ్లడ్బ్యాంకులో సిబ్బందిని నియమించి, రక్తం కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. విధుల్లో ఒక వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు.. ఎంజీఎం ఆస్పత్రి వంటి అతి పెద్ద రక్తనిధి కేంద్రానికి సిబ్బంది కొరత పెద్ద తలనొప్పిగా మారింది క్యాంపుల నిర్వహణ కోసం కౌన్సిలర్లు లేకుండా ఈ రక్తనిధి కేంద్రం కొనసాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నాయకుల జన్మదినం, మానవతా దృక్పథంతో వచ్చే రక్తదాతల సహకారం తప్ప గత కొన్ని నెలలుగా ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం లేదు. గతంలో మోటిటేటర్గా పనిచేసి అత్యత్తుమ అవార్డులు సాధించిన కల్యాణి అనే ఉద్యోగిని పరిపాలనాధికారులు అకారణంగా తొలగించారు. కొన్ని నెలల క్రితం డిప్యుటేషన్పై వచ్చిన కౌన్సిలర్ను సైతం వెనక్కి పంపించేశారు. బ్లడ్బ్యాంకులో ముగ్గురు వైద్యాధికారులు, 12 మంది ల్యాబ్టెక్నీషియన్లు, నలుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, మోటివేటర్, కౌన్సిలర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం ఒకే ఒక్క వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రమే కొనసాగుతున్నారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ నిబంధనలు.. రాష్ట్రంలో వైద్యసేవలను మరింత బలోపేతం చేసేందుకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ సెప్టెంబర్ మాసంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ● ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రాల్లో రక్తం కొరత లేకుండా చూడాలి. ● ప్రైవేట్, స్వచ్ఛంద రక్తసేకరణ కేంద్రాలు తాము సేకరించే మొత్తం రక్త యూనిట్లలో 30 శాతాన్ని జిల్లాలో ఉన్న ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ● ఈ ప్రక్రియపై ప్రతి నెల నివేదికలను తెలంగాణ రాష్ట్ర రక్త మార్పిడి మండలికి పంపించాల్సి ఉంటుంది. ● ఈ నివేదిక ప్రకారం ఎంజీఎం బ్లడ్బ్యాంకుకు రావాల్సిన రక్తం యూనిట్ల రాకపోవడం వల్ల పేద ప్రజలకు రక్తం కొరత ఏర్పడుతోంది. ● ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలని, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ నిర్ణయాలను ఉల్లంఘిస్తున్న కేంద్రాలపై కొరడా ఝుళిపించాలని పేద ప్రజలకు వేడుకుంటున్నారు. రక్తనిధి కేంద్రంలో నియామకానికి నోచుకోని కౌన్సిలర్లు.. కానరాని క్యాంపులు కౌన్సిల్ నిబంధనలు పట్టించుకోని ప్రైవేట్ బ్లడ్బ్యాంకులు రక్తం కోసం పరుగులు తీస్తున్న పేద రోగులు ఏటూరునాగారం నుంచి ఇటీవల ఓ కేన్సర్ పేషంట్ చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చాడు. రక్తం కావాలని సదరు పేషంట్ కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. వారు బ్లడ్బ్యాంకుకు వెళ్తే సిబ్బంది ఒక యూనిట్ మాత్రమే ఇచ్చారు. ఇంకో యూనిట్ కావాలంటే లేదు అని చెప్పారు. దీంతో వారు ప్రైవేట్ బ్లడ్బ్యాంకు వెళ్లి రక్తం ప్యాకెట్ కొనుక్కొని వచ్చారు. ఈ పరిస్థితి ఒక్క కేన్సర్ పేషంట్ది మాత్రమే కాదు.. ఎంజీఎం ఆస్పత్రిలో అనేకమంది రోగులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడాపోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో హనుమకొండ జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఒలింపిక్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్ హాజరై రెజ్లింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలని సూచించారు. సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలకు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేసి మాట్లాడారు. రెండు రోజులపాటు 45 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపా రు. జిల్లా పరిధిలోని 16 మండలాల నుంచి మూడు వేల మంది క్రీడాకారులు హాజరైనట్లు వివరించారు. పోటీల నిర్వహణకు సహకరించిన ఆయా క్రీడా సంఘాల బాధ్యులు, పీఈటీలు, కోచ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంజీఎం: ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించడానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం తీరును పరిశీలించి మాట్లాడారు. 8 అంశాల్లో మహిళలకు పరీక్షల తీరుపై అవగాహన కలిగించాలని, రెఫర్ కేసులను ఫాలోఅప్ చేస్తూ వారికి తగిన సేవలందించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించి, సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. గర్భిణుల నమోదు, వైద్యపరీక్షలు, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి ప్రోత్సహించడం, ప్రసవానంతరం సేవలందించాలని ఆయన సూ చించారు. వైద్య సేవలకు సంబంధించిన రికా ర్డులు, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని ఆయన సమీక్షించారు. అలాగే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన మరమ్మతు పనులను డీఎంహెచ్ఓ పరిశీలించారు. వైద్యాధికారి మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని స్కిల్డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో మంగళవారం కేయూ ఎంఓయూ కుదుర్చుకుంది. కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి సమక్షంలో అవగాహన పత్రాలను రిజిస్ట్రార్ వి.రామచంద్రం, స్కిల్డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ మార్చుకున్నారు. ఈ ఒప్పందం ఒక సంవత్సర కాలం ఉంటుంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరగుపర్చడం, నైపుణ్యాలను అందించడం, ఉపన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాపులు, పరస్పర జ్ఞానమార్పిడిని ప్రోత్సహించడం ఎంఓయూ ఉద్దేశం అని రిజిస్ట్రార్ తెలిపారు. కార్యక్రమంలో సైన్స్డీన్ జి.హనుమంతు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోలా శంకర్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆదాయం రూ. 20.24 కోట్లు
● మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్ ఆర్టీసీ రూ.20,24,28,124 ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్ డేస్లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు. ఉద్యోగుల సమష్టికృషితో.. అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో జాతరను విజయవంతం చేశాం. ఏర్పాట్లు మొదలు నుంచి జాతర పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేశారు. జాతరను విజయవంతం చేసిన అందరికీ అభినందనలు. – దర్శనం విజయభాను, ఆర్ఎం, వరంగల్ -
రూ.50 వేలు ఇస్తే.. రూ. 2 వేల కమీషన్
● క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోగానే వెంటనే ఇస్తామని బురిడీ.. ● పెట్రోల్ పంపుల్లో మోసాలకు పాల్పడతున్న ఇద్దరి అరెస్ట్ ● నిందితుల వివరాలు వెల్లడించిన పోలీసులు కమలాపూర్: రూ.50 వేలు ఇస్తే.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోగానే వెంటనే రూ. 2 వేలు కమీషన్ ఇస్తామని చెబుతూ పెట్రోల్ పంపుల్లో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం కమలాపూర్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్కు చెందిన రాపోలు శ్రీనివాస్, ఏపీలోని కాకినాడకు చెందిన చింతాడ సాయికుమార్ ఈ నెల 3వ తేదీన కమలాపూర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో పని చేస్తున్న జక్కు రాజ్కుమార్ దగ్గరకు వచ్చారు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవాలి, డబ్బులు ఇస్తే చెల్లించి తిరిగి ఇస్తామని నమ్మించి రూ.50 వేలు అడిగారు. అందుకు రూ.2 వేలు కమీషన్ అవుతుందని రాజ్కుమార్ చెప్పగా అందుకు ఒప్పుకుని రాజ్కుమార్కు క్రెడిట్ కార్డు అని చెప్పి వేరొకరి పేరుపై ఉన్న డెబిట్ కార్డు ఇచ్చారు. దీంతో రాజ్కుమార్.. శ్రీనివాస్కు మొదట రూ.వెయ్యి నగదు ఇవ్వగానే అవి తీసుకుని ఆటోలో వెళ్లిపోగా ఆ తర్వాత శ్రీనివాస్ ఇచ్చిన సాయికుమార్ నంబర్కు ఐదు సార్లు మొత్తం రూ.49 వేలు ఫోన్పే చేయగానే ఆ డబ్బులను శ్రీనివాస్, సాయికుమార్ ఇద్దరు కలిసి శ్రీలంక–ఇంగ్లండ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్కు బెట్టింగ్ పెట్టి నష్టపోయారు. తాను ఇచ్చిన డబ్బుల కోసం రాజ్కుమార్ వారికి పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రాజ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం కమలాపూర్ భారత్ పెట్రోల్ పంపు వద్ద శ్రీనివాస్, సాయికుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. శ్రీనివాస్పై ఇప్పటికే నెక్కొండ, పర్వతగిరి, లింగాలఘణపురం, వర్ధన్నపేట, రఘునాథపల్లి, పరకాల, సుబేదారి తదితర పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయని, మొత్తంగా క్రెడిట్ కార్డు పేరుతో శ్రీనివాస్ మోసాలకు పాల్పడి రూ.8.88 లక్షలు కాజేశాడని తెలిపారు. ఖమ్మం జైలులో ఉన్నప్పుడు శ్రీనివాస్కు సాయికుమార్తో పరిచయం ఏర్పడిందని, జైలు నుంచి విడుదలయ్యాక కమలాపూర్లో మోసానికి పాల్పడ్డారని తెలిపారు. క్రెడిట్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఇన్స్పెక్టర్ నవీన్, ఎస్సై దిలీప్, కానిస్టేబుళ్లు ఉదయ్, భాస్కర్ను ఏసీపీ అభినందించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వివిధ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మతో కలిసి ఉత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీకాన్ఫరెన్్స్ హాలులో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారితో కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. వైద్యాధికారులు, సంబంధిత సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతంచౌహన్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల సమరం నేడే
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడగా.. మంగళవారం పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు జరిగే పోలింగ్లో అభ్యర్థుల భవిష్యత్ తేలనుంది. ఈ నేపథ్యంలో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, స్టేషన్ఘన్పూర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 525 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 106 సమస్యాత్మక, 99 అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన అధికారులు.. ఈ కేంద్రాల్లో పోలింగ్పై ప్రత్యేక నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3,086 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది సామగ్రితో మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 260 వార్డులు.. 1,074 మంది పోటీ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సుమారు వారం రోజులపాటు హోరాహోరీగా జరిగిన ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపవడగా.. ఆఖరి రెండు రోజులు అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. హనుమకొండ, వరంగల్లో మకాం వేసి జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. ఆయా పార్టీల సీనియర్లు, ప్రముఖులు మెజార్టీ సభ్యుల గెలుపే లక్ష్యంగా మంత్రాంగం నిర్వహించారు. కాగా, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1074 మంది బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ 248, సీపీఐ, సీపీఎం 12 వార్డులకు పోటీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి 259 మంది, బీజేపీ అభ్యర్థులు 240 వార్డులకు కౌన్సిలర్లుగా తలపడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు 759 మంది కాగా, మిగతా 315 మంది బీఎస్పీ, ఏఐఎఫ్బీ, రెబల్స్, ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 12 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకునేందుకు సీరియస్గా ప్రయత్నం చేస్తుండగా, బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపాలని భావిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం నేతలు భారీగా ప్రచారం నిర్వహించినా.. గెలుపోటములపై వారు కచ్చితమైన అంచనాలకు రాలేకపోతున్నారు. 13న ఓట్ల లెక్కింపు.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి రీపోలింగ్ జరిపే అవకాశం ఉంటే.. గురువారం ఆ ప్రక్రియ ఉంటుంది. 13న ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 12 చోట్ల శుక్రవారం ఉదయమే మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వరంగల్ పోలీసు కమిషనరేట్లోని నర్సంపేట, పరకాల, జనగామ, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 11 మంది ఏసీపీలు, 125 మంది ఇన్స్పెక్టర్లు కలిపి మొత్తం 1,100 మంది అధికారులు, సిబ్బంది ఈ ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీలు అనుక్షణం పోలింగ్ తనిఖీలు చేయనుండగా, రూట్, జోనల్ అధి కారులు ఎన్ని కల తీరును పర్యవేక్షించనున్నారు. పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల సమాచా రాన్ని వెంటవెంటనే అధికారులకు అందించేవిధంగా ఏర్పాట్లు చేశారు. -
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
నగరాన్ని మంగళవారం పొగమంచు కమ్మేసింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో మంచు దుప్పటి ఏర్పడింది. మంచువానలోని ఈ ప్రకృతి రమణీయత విశేషంగా అలరించింది. ఊటి, అరకులోయను తలపించే ఆహ్లాదకర దృశ్యాలు చూపరులను కనువిందు చేశాయి. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, హన్మకొండ ఉదయం 8.30 : పొగమంచులో రైలు ఉదయం 8.15 : లైట్లు వేసుకొని వెళ్తున్న వాహనదారులుఉదయం 7.48 గంటలు : పొగమంచులో హనుమకొండ కలెక్టరేట్ -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. మొత్తం 118 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ వై.వి. గణేశ్, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్రా, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు పాల్గొన్నారు. ఎస్సెస్సీ శిక్షణ తరగతులపై ప్రత్యేక దృష్టిజిల్లాలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా నిర్వహిస్తున్న ప్రత్యేక కోచింగ్ తరగతులపై మండలాల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో పదో తరగతి పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలకు వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పురోగతిపై అధికారులతో చర్చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సీపీఓ సత్యనారాయణరెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పట్టుబడిన వాహనాలు తీసుకెళ్లండి: సీపీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను భీమారం, సీఆర్పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చినట్లు వివరించారు. వాటిని పోలీస్ స్టేషన్ల వారీగా గుర్తించి సంబంధిత వాహన యజమానులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలు తిరిగి అందజేయనున్నట్లు వివరించారు. మరింత సమాచారం కోసం సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజ్, ఎంటీఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ 87126 85158, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మల్లయ్య 80083 89789 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.చంద్రమౌళి విడుదల చేశారు. పీజీ కోర్సుల్లో మూడో సెమిస్టర్లో 141 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 130 మంది ఉత్తీర్ణత (92శాతం) సాధించినట్లు చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాధికారి కొలిపాక శ్రీనివాస్, వివిధ విభాగాల అఽఽధిపతులు పి.రాజిరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి సురేశ్బాబు, సునీత, రేణుక, సారంగపాణి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ● కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ విజయబాబు ● కేడీసీలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం విద్యారణ్యపురి: టూరిజం కోర్సుల అధ్యయనంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని కేయూ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం రిటైర్డ్ ఆచార్యులు విజయబాబు అన్నారు. సోమవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ‘టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ’ సర్టిఫికెట్ కోర్సును బీసీ విద్యార్థులకు ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. టూరిజంను స్మోక్ లెస్ ఇండస్ట్రీగా అభివర్ణించారు. టూరిజం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. కాగా, ప్రొఫెసర్ విజయబాబును అధ్యాపకులు సన్మానించారు. ఈ సమావేశంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, అధ్యాపకులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఎ.శ్రీనాఽథ్, చరిత్ర విభాగం అధిపతి ఇందిరా దేవి, ఎస్.సమ్మయ్య, రామ్రెడ్డి, బి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ డీఈఓ కార్యాలయం సమగ్ర శిక్షలో ఫైనాన్స్, అ కౌంట్స్ ఆఫీసర్గా (ఎఫ్ఏఓ) డిప్యుటేషన్పై(ఫారిన్ సర్వీ స్) పని చేస్తున్న మధుసూదన్ (జేఏఓ)ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ /సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్కు సెరెండర్ చేస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ ని యమించిన విచారణ కమిటీ నివేదిక ప్రకారం మధుసూదన్ సేవలు సంతృప్తికరంగా లేవని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. మధుసూదన్ తక్షణమే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ సోమవారం మధుసూదన్ను విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా డీఈఓ కార్యాలయం సమగ్ర శిక్షలో ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్గా (ఫుల్ అడిషనల్ చార్జ్గా) హసన్పర్తి మండలం భీమారంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పీజీహెచ్ఎం, హసన్పర్తి మండల ఇన్చార్జ్ విద్యాశాఖాఽధికారిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఎ.శ్రీనివాస్ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి
హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ధర్మాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం దేవాలయంలో ఈ నెల 14 నుంచి 18వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. ఆ సందర్భంగా ఆర్జేసీ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, ధార్మిక భావన కలిగిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఈఓను ఆదేశించారు. కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది మధుకర్, రామకృష్ణ, రజిత, వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, కాళిలింగాచారి పాల్గొన్నారు. ఆర్జేసీ మల్లెల రామకృష్ణారావు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష -
కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్
పరకాల: ‘కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్. ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చకుండా ప్రజలను రేవంత్రెడ్డి మోసం చేశారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారంటీలను బాండ్ పేపర్పై రాసిచ్చి వాటిని అమలు చేయలేక విఫలమయ్యారని, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను చొక్కా పట్టుకొని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం పరకాలలో బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్షోకు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు వేల సంఖ్యలో తరలిరావడంతో అంబేడ్కర్ సెంటర్ కూడలి సభాప్రాంగణాన్ని తలపించింది. కేసీఆర్ను తిట్టడమే లక్ష్యమా? ఈ రోడ్డుషోలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి తెల్లారి లేస్తే కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి పరిపాలనలో పూర్తి విఫలమయ్యారని, అందుకే ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ‘అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయినట్లుగా ‘మార్పు అన్న ప్రజల్లారా.. ఈ రోజు ఆగమయ్యారా లేదా’ అని ప్రజలను ప్రశ్నించారు. ఏ ఓక్క హామీని అమలు చేయని కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండున్నరేళ్ల పాలనలో పరకాల అభివృద్ధికి ఏం చేశావని రేవూరి ప్రకాశ్రెడ్డి ఓట్లు అడుగుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కేసీఆర్తో కొట్లాడి వందల కోట్లతో పరకాల అభివృద్ధికి కృషిచేశారని అందుకే ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన డబ్బు తీసుకుని బీఆర్ఎస్కు ఓటేయాలన్నారు. పరకాల అభివృద్ధి నిర్వీర్యం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గతంలో నర్సంపేటను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ పరకాల నియోజకవర్గ ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి అసలు నర్సంపేటలో ఎన్ని గ్రామాలు.. ఎన్ని తండాలు ఎక్కడున్నాయో కూడా తెలియదన్నారు. పరకాల అభివృద్ధి అంటూ నిర్వీర్యం చేస్తున్నాడన్నారు. పరకాలలో ప్రతీ అభివృద్ధి కార్యక్రమం కేసీఆర్ ఆశీస్సులతో తాను చేపట్టిన అభివృద్ధి పనులే తప్ప రేవూరి ప్రకాశ్రెడ్డి ఏం చేయలేదన్నారు. ప్రభుత్వ నూతన భవనాలకు రంగులు వేసి శిలఫలకాలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ రోడ్ షోలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, పరకాల మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్చార్జ్ వాసుదేవ్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు లింగంపల్లి కిషన్రావు, బీఆర్ఎస్ అభ్యర్థులు, మండల నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారం..భారీ రోడ్ షో వేల సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు -
పోలింగ్ ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షించాలి
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతీ ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అబ్జర్వర్ శివకుమార్నాయుడు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో అబ్జర్వర్లకు మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నర్సంపేట మున్సిపాలిటీలో 8, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 6 క్రిటికల్ పోలింగ్ లోకేషన్స్ గుర్తించారు. ఆయా కేంద్రాల పర్యవేక్షణకు 17 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జీఎం ఇండస్ట్రీస్ నరసింహమూర్తి, మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాలపై నిషేధం మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో సోమవారం సాయంత్రం నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లోకి వస్తుందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో పట్టణాల్లో ఎవరు బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. పోలింగ్ ముగిసేవరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 13న కౌంటింగ్ సందర్భంగా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలన్నారు. రేపు సెలవు మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుటకు గాను ఈ నెల 11న తేదీన సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవు, షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు తెలిపారు. -
పీఎం శ్రీ స్కూళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని పీఎం శ్రీ స్కూల్స్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి తనిఖీలు చేయపట్టనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్ కింద ఎంపికై న 16 పాఠశాలల అభివృద్ధిపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ప్రత్యేక తనిఖీ నిర్వహించిన అనంతరం రూపొందించిన నివేదికల ఆధారంగా ఈ సమీక్ష నిర్వహించామన్నారు. ఇకపై ఆయా పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. డీఈఓ రంగయ్యనాయుడు, డీబీసీడీఓ పుష్పలత, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, డీహెచ్ఎస్ఓ శ్రీని వాస్రావు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్–2026 కార్యక్రమాన్ని జిల్లాలో సోమవారం అధికారికంగా ప్రారంభించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలి రాజు తదితరులు పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా.. అంటున్న అభ్యర్థులు.. ఓట్ల కోసం ఎర వేస్తున్న పార్టీలు
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షిప్రతినిధి, వరంగల్: హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా ఆగిపోయింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులు ప్రచారానికి తెరవేశారు. పట్టణాల్లో సాగిన, మైకుల మోత, ప్రచారహోరు మూగబోయింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సుమారు వారం రోజులుగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1,073 మంది పోటీ చేస్తుండగా.. ఒక్కో వార్డు నుంచి సగటున నలుగురైదుగురు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల తరఫున ఆ పార్టీల అగ్రనాయకులు ప్రచారం నిర్వహించగా.. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎఐఎఫ్బీ, రెబల్స్, ఇండిపెండెట్లు కూడా ప్రచారం సాగించారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించడంతో ఒక్కసారిగా పట్టణాల్లో మైకుల మోత ఆగిపోయింది. పోలింగ్ కేంద్రాలకు నేడు అధికారులు, సిబ్బంది మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మొదలు కానుంది. ఈ మేరకు ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,72,087లు కాగా, పురుషులు 1,63,088లు. ఆ మేరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి అధికారులు, సిబ్బందిని తరలించేందుకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపునకు ఒక్కరోజు ముందునుంచే ఆయా పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ధనసరి సీతక్క తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కూడా విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఆయా నియోజకవర్గాల పరిధి మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. బీజేపీ నుంచి రాష్ట్ర, జిల్లా నాయకులు జె.హుస్సేన్ నాయక్, డాక్టర్ కాళీప్రసాద్, చందుపట్ల కీర్తిరెడ్డి తదితరులు అభ్యర్థుల తరఫున ప్రచారంలో తిరిగారు. అయితే సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో మున్సిపాలిటీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పంపిణీ కార్యక్రమానికి పార్టీలు సోమవారం రాత్రినుంచే తెర తీశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటర్లకు ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,500.. మద్యం, మాంసం కూడా సరఫరా చేయడం చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ అర్బన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయనున్నట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. పరకాల మున్సిపల్ పరిధిలో ఈ నెల 9వ తేదీ (సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 48 గంటలు సైలెన్స్ పీరియడ్ పోలింగ్కు ముందు 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో పరకాల పట్టణ పరిధిలో ఎవరూ బహిరంగ ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని కలెక్టర్ సూచించారు. ఈ నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మద్యం దుకాణాలు బంద్.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 9వ తేదీ (సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసేంత వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలను పూర్తిగా మూసివేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించే ఈ నెల 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసేయాలని తెలిపారు. మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తిజిల్లాలోని పరకాల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకులు కె.శివకుమార్ నాయుడు, హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో నిర్వహించారు. పరకాల మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డులకు 44 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 44 మంది పోలింగ్ అధికారులు, అదనంగా 20 శాతం రిజర్వుతో కలిపి మొత్తం 53 మందిని కేటాయించారు. అవసరాల దృష్ట్యా రిజర్వు సిబ్బందిని కూడా ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి సుష్మ తదితరులు పాల్గొన్నారు. ర్యాండమైజేషన్లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారికె.శివకుమార్ నాయుడు, అధికారులు గెలుపోటములపై లెక్కలు.. విజయమే లక్ష్యంగా పావులు ఆఖరి రోజు హోరెత్తిన ప్రచారం.. రేపు మున్సిపల్ పోలింగ్ నేడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు సామగ్రి, సిబ్బందిఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుమున్సిపాలిటీ డిస్టిబ్య్రూషన్సెంటర్పరకాల గణపతి డిగ్రీ కాలేజీ నర్సంపేట ఏఎంసీ, నర్సంపేట వర్ధన్నపేట మున్సిపల్ ఆఫీస్ జనగామ ఏకశిల బీఈడీ కాలేజీ స్టేషన్ఘన్పూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ భూపాలపల్లి సింగరేణి ఫంక్షన్ హాల్ మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ డోర్నకల్ నిర్మల హైస్కూల్ కేసముద్రం ఏఎంసీ, కేసముద్రం మరిపెడ సెయింట్ అగస్టిన్స్ హై తొర్రూరు ఆర్యభట్ట హై స్కూల్ ములుగు ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ -
కొడవటంచ ఆలయంలో పూజలు..
జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి తొలుత రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారిని మంత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో రావిమొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ పాల్గొన్నారు. -
ఎన్నికల వరకే కాంగ్రెస్ పరుగు
పరకాల: ఎన్నికలప్పుడే కాంగ్రెస్కు ప్రజలు గుర్తుకు వస్తారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తొండ పరుగు ఏనుగు దాకా అన్నట్లుగా ఎన్నికల వరకు కాంగ్రెస్ పరుగెడుతోందని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పరకాల పట్టణంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ర్యాలీ నిర్వహించారు. ఎల్ఐసీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి మీదుగా పరకాల బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ .. బీజేపీతో పరకాల స్మార్ట్సిటీగా మారుతోందని స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో నాడు కేటీఆర్, నేడు రేవంత్రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. కరోనా కష్టకాలం నుంచి దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఐదు కిలోల చొప్పున కేంద్రం ఉచితంగా బియ్యం అందిస్తోందని తెలిపారు. మోదీకి పిల్ల లు లేరని దేశప్రజలే ఆయనకు ఓ కుటుంబమని పేర్కొన్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని, బీజేపీతోనే మార్పు సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్చార్జ్ బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, పరకాల నియోజవర్గ ఇన్చార్జ్ డాక్టర్ పి.కాళీప్రసాద్రావు, పరకాల ఎన్నికల ఇన్చార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సిరంగి సంతోశ్కుమార్, పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో కేసీఆర్, రేవంత్రెడ్డి మోసం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరకాలలో బీజేపీ ఎన్నికల ప్రచార భారీ ర్యాలీ -
విలువలు పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు విలువలను కూడా పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి సూచించారు. యూత్ ఫర్ సేవాసంస్థ ఆధ్వర్యంలో చిగురు కార్యక్రమం పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక, ప్రతిభాపాటవ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా కేయూ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని లక్ష్యాలను సాధించాలని కోరారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ ఆసక్తి, అభిరుచి అనేవి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే శక్తులని పేర్కొన్నారు. తొలుత అతిథులు భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. కేయూ పాలకమండలి సభ్యురాలు బి.రమ, వైస్ ప్రిన్సిపాల్ మమత, ఎంఈఓ శ్రీనివాస్, యూత్ఫర్ సేవా సంస్థ బాధ్యులు ఎ.రవీందర్, మల్లికార్జున్ పాల్గొన్నారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి -
స్థానికేతరులు వెళ్లిపోవాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్క్రైం: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుండడంతో స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి స్టేషన్ ఘన్పూర్, జనగామ, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం ముగియనున్న నేపఽథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయా పార్టీలకు చెందినవారు గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. హన్మకొండ: హనుమకొండ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 9న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి తెలిపారు. వెస్ట్ సిటీ ఫీడర్లోని నెహ్రూనగర్, రాక్ గార్డెన్, మెట్టు గుట్ట, బృందావన్ వెంచర్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. కాశిబుగ్గ, శ్రీనివాస వీధి, మదీనా వీధి, గుడి వెనుక ప్రాంతంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, కాశిబుగ్గ, ఏనుమాముల మార్కెట్ రోడ్, మధురానగర్, సాయి గణేశ్ కాలనీ ప్రాంతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, బీఆర్ నగర్, వినాయకనగర్, అమ్మవారిపేట రోడ్డు, మెడికేర్ ఆస్పత్రి, రాజీవ్నగర్, భట్టుపల్లి రోడ్డు, నాని గార్డెన్స్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. -
ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఆత్మగౌరవం
పరకాల: ‘ఏ కులం, ఏ మతం.. ఇల్లిస్తే ఓటేస్తావా అని ప్రజలను అడగం.. పేదవారైతే ఇళ్లు మంజూరు చేయాలన్న గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నాం.. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథక ంతో పేదల ఆత్మగౌరవం నిలబెట్టాం’ అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాలలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ప్రచార సభ నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఎన్నికల తర్వాత పరకాలకు గోదావరి జలాల తరలింపు కోసం రూ.38 కోట్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.35 కోట్ల నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పరకాల నడిబొడ్డున ఇంటిగ్రేటెడ్ స్కూల్ను పట్టుబట్టి సాధించుకున్నారని తెలిపారు. నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇళ్లు, పరకాల మున్సిపాలిటీకి 405 ఇళ్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. మిగిలిన వారికి రెండో విడత ఏప్రిల్లో మంజూరు చేస్తామని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిలిచిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పరకాలలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ -
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
భూపాలపల్లి జిల్లా చెల్పూరులో జరిగిన సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న సీఎం రేవంత్కొద్ది రోజులుగా పలు కొత్త జిల్లాలను రద్దు చేస్తారని, రెండు జిల్లాలను కలిపి ఒకటి చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ములుగు, భూపాలపల్లిని కలిపి ఒకటే చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దు ప్రచారంపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. జిల్లాలను రద్దు చేయబోమని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయమని ప్రకటించారు. దీంతో భూపాలపల్లి జిల్లా రద్దు అనే ప్రచారానికి చెక్ పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాలకవర్గాలు లేకపోయినా గడిచిన ఏడాదిలో భారీగా విడుదల చేశాం.. -
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
● భారీగా తరలివచ్చిన భక్తజనం ● లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే మేడారంలోని వనదేవతలను దర్శించుకున్న భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పవిత్ర చింతామణి జలపాతం వద్ద భక్తుల సందడి నెలకొంది. వందలాది మంది భక్తులు ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రధాన ఆలయానికి క్యూ కట్టారు. ఉత్సవమూర్తులకు శాంతి కల్యాణం లక్ష్మీనర్సింహస్వామి జన్మదిన నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలోని యాగశాలలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజారి శేఖర్శర్మ శాంతి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీనర్సింహస్వామికి ఆలయ అర్చకులు ముక్కామల శేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు ప్రత్యేక అర్చనలతో వేదమంత్రోచ్ఛరణ నడుమ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. -
ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
నర్సంపేట: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో నర్సంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కార్యక్రమాన్ని వీడియో పవర్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తూ ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలని సూచించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు తమకు అప్పగించిన విధులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో క్రమశిక్షణ సమన్వయం పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో లెక్కింపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ సుమ, మాస్టర్ ట్రైనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
స్థానికేతరులు వెళ్లిపోవాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్క్రైం: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుండడంతో స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి స్టేషన్ ఘన్పూర్, జనగామ, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం ముగియనున్న నేపఽథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయా పార్టీలకు చెందినవారు గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. విలువలను పెంపొందించుకోవాలి కేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు విలువలను కూడా పెంపొందించుకోవాలని కాకతీ య యూనివర్సిటీ వీసీ ప్రతాప్రెడ్డి సూచించారు. యూత్ఫర్ సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక, ప్రతిభాపాటవ పోటీలను చిగురు కార్యక్రమం పేరుతో ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా కేయూ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని లక్ష్యాలను సాధించాలని కోరారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ ఆసక్తి, అభిరుచి అనేవి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే శక్తులని పేర్కొన్నారు. తొలుత అతిథులు భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈసందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. -
ఎఫ్ఎల్ఎస్ అమలుపై పరిశీలన
● నేడు పర్యటించనున్న రాష్ట్రస్థాయి అధికారులు ● 3వ తరగతి విద్యార్థులకు ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ అమలుకాళోజీ సెంటర్ : ప్రాథమిక పాఠశాలల్లో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) అమలు తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ(ఎస్సీఈఆర్టీ)రంగంలోకి దిగింది. నేడు(సోమవారం) రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఫ్యాకల్టీ సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి ప్రత్యేక బృందం జిల్లాలో పర్యటించనుంది. ప్రాథమిక పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్ఎల్ఎస్) సన్నద్ధతను ఈ బృందాలు పరిశీలిస్తాయి. పాఠశాలల్లో మాక్ టెస్టుల నిర్వహణ, ఎస్సీఈఆర్టీ రూపొందించిన ఐటమ్ బ్యాంక్ వినియోగం, ప్రాక్టీస్ పద్ధతులను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తారు. ప్రత్యేక ప్రణాళిక మాక్ టెస్టుల ఫలితాల ఆధారంగా వెనకబడిన విద్యార్థులను టీచర్ సపోర్ట్ లెర్నర్స్ గుర్తించి, వారి కోసం ప్రత్యేక బోధనా ప్రణాళికలు సిద్ధం చేశారా.. లేదా.. అని తెలుసుకుంటారు. పరిశీలన అనంతరం జిల్లాలో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ అమలు చేస్తున్న తీరుపై ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కు ఈనెల 13తేదీలోగా నివేదిక సమర్పిస్తారు. విద్యాబోధనలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకొని తగిన సూచనలు చేయడమే ఈ తనిఖీ ఉద్దేశమని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సామర్థ్యం పెంచడమే లక్ష్యం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రాథమిక నైపుణ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. అందులో భాగంగా అమలు తీరును తెలుసుకునేందుకు సోమవారం జిల్లాలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ జగన్మోహన్ పర్యటిస్తారు. – ఉండ్రాతి సుజన్తేజ, ఏఎంఓ -
కొడవటంచ ఆలయంలో పూజలు..
జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి తొలుత రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారిని మంత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో రావిమొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ నెక్కొండ/నర్సంపేట రూరల్: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ సూచించారు. నెక్కొండ మండలంలోని అజ్మీరా మంగ్యానాయక్ తండా, చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామీణ న్యాయసంరక్షణ మద్దతు కేంద్రాలను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆమె మాట్లాడారు. చాలామంది పేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు న్యాయవ్యవస్థకు దూరంగా ఉండిపోతున్నారని పేర్కొన్నారు. ఈపరిస్థితిని మార్చడానికే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతిఒక్కరూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్, పారా లీగల్ వలంటీర్లు కరుణాకర్, స్వప్న, హరీశ్, నెక్కొండ డీటీ రవికుమార్, ఎస్సై మహేందర్, అజ్మీరా మంగ్యానాయక్ తండా సర్పంచ్ మాలోత్ వెంకటనాయక్, గ్రామ కార్యదర్శి రంజిత్కుమార్, ఆర్ఐ నరేందర్, పీఎల్వీ రాములు, ఉపసర్పంచ్ సుమన్ ఉన్నారు. రెండో విడత ఇంటర్ ప్రాక్టికల్స్ షురూకాళోజీ సెంటర్: జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ రెండో విడత ప్రాక్టికల్స్ శనివారం ప్రారంభమయ్యాయని డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. 25 సెంటర్లలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 585 మంది జనరల్ విద్యార్థులకు 565 మంది, 290 మంది ఒకేషనల్ విద్యార్థులకు 287 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 420 మంది జనరల్ విద్యార్థులకు 401 మంది, 314 మంది ఒకేషనల్ విద్యార్థులకు 305 మంది హాజరైనట్లు తెలిపారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్
న్యూశాయంపేట: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఎక్కడాలోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్పేపర్లు, సీల్స్, స్టేషనరీ, పోలింగ్కు అవసరమైన ఇతర సామగ్రిని కలెక్టర్ శనివారం క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్ట్రాంగ్ రూంలు, పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, మున్సిపల్ కమిషనర్లు సుధీర్కుమార్, భాస్కర్, డీఏఓ ఫణికుమార్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026 – 28వ సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. యాజమాన్యాలు పంపిన జాబితాలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే సమాచార శాఖ వెబ్సైట్ ఐఅండ్పీఆర్.తెలంగాణ.జీఓవీ.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.నేడు నర్సంపేటలో కేటీఆర్ రోడ్షోనర్సంపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ఆదివారం నర్సంపేటలో రోడ్షో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు వరంగల్ రోడ్డు నుంచి పాకాల రోడ్డు వరకు రోడ్షో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఓటరు చైతన్య కరపత్రాల ఆవిష్కరణనర్సంపేట : వినియోగదారుల సమాచార కేంద్రం కమిటీ, స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ముద్రించిన ఓటరు చైతన్య కరపత్రాలను నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్రెడ్డి, మున్సిపల్ భాస్కర్ శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఏసీపీ రవీందర్రెడ్డి, కమిషనర్ భాస్కర్ మాట్లాడారు. ఓటర్లు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. మైకుల వినియోగం, ప్రలోభాలు, తదితరాలపై నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు గిరగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ అభ్యర్థులు బాధ్యతలు, నిధులు, ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు, మోసాలు చోటు చేసుకుంటే సెల్ నంబర్ 7680096877, 9966425375ల్లో, సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఏఎస్ఆర్ సేవా సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్, ఎస్సీ, ఎస్టీ కన్వీనర్ బోయిన వెంకటస్వామి, మొగిలిచర్ల రాము, రవికాంత్, తదితరులు పాల్గొన్నారు. టేకు కలప పట్టివేతనల్లబెల్లి: టేకు కలపను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన మండలంలోని రుద్రగూడెం శివారులో జరిగింది. ఎస్సై గోవర్ధన్ శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో టేకు కలపతో వస్తున్న ఓ వాహనం కనిపించింది. దీంతో అనుమానంతో ఎస్సై వాహనాన్ని ఆపివేసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను తరలిస్తున్నట్లు గుర్తించిన ఎస్సై వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి రూ.57 వేల విలువైన కలపను ఫారెస్టు అధికారులకు అప్పగించారు. -
అధికారంలో లేరు.. హామీలు ఎలా ఇస్తారు?
వర్ధన్నపేట: అధికారంలో లేరు.. ఎన్నికల్లో హామీలు ఎలా ఇస్తారు.. ఎలా తీరుస్తారు అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా, అంబేడ్కర్ సెంటర్, పాత మున్సిపాలిటీ సెంటర్లలో 12 వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శనివారం నిర్వహించిన కార్నర్ షోకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల హామీలను ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేద ప్రజలకు పక్కా ఇళ్లు వర్ధన్నపేటలో ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలో 150 మందికి ఇళ్లు నిర్మించిందని, మరో మూడేళ్లలో మూడు దఫాలుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేస్తుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాదిరిగానే ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. నివేశిత స్థలాలు ఇవ్వడానికి రెవెన్యూ మంత్రిగా, పక్కా ఇళ్ల నిర్మాణాలకు గృహనిర్మాణ శాఖ మంత్రిగా, జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా తాను ఉండడంతో పనులు చకచకా సాగుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరికొన్ని తీపి కబుర్లు చెబుతామన్నారు. పట్టణంలోనే వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని పొంగులేటి స్పష్టం చేశారు. కోనారెడ్డి చెరువు కాల్వకు సీసీ లైనింగ్ చేయడంతోపాటు రిజర్వాయర్ నుంచి ప్రత్యేక కెనాల్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ పాల్గొన్నారు. ప్రతిపక్షాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రశ్న వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులతో కార్నర్ షో -
ప్రజాసమస్యలు పరిష్కరించాలి..
నర్సంపేట పట్టణంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేసే వారికే పట్టం కట్టాలి. ప్రజల సమస్యలను పరిష్కరించేవారిని గెలిపించుకోవాలి. నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి. – డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్గౌడ్, గవర్నర్, వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వాకింగ్ ట్రాక్ నిర్మించాలి..నర్సంపేట పట్టణంలోని పలు వార్డుల నుంచి యువకులు, మేధావులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, మహిళలు తదితరులు మినీ స్టేడియానికి ప్రతిరోజూ వాకింగ్కు వస్తున్నారు. ఈ స్టేడియంలో వాక్సర్స్ కోసం వాకింగ్ట్రాక్ లేదు. చెట్లు, కంకర ఉండడంతో వాకింగ్ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రత్యేకంగా వాకర్స్ కోసం ట్రాక్ సౌకర్యం కల్పించాలి. – రాపాక చంద్రమౌళి, తెలంగాణ కాలనీ సమస్యలపై గళం విప్పాలి..నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం కృషిచేసే వారిని, వార్డుల్లో సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోవాలి. నిస్వార్థంగా పనిచేసే వారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలి. ప్రజాసమస్యలపై మున్సిపాలిటీలో గొంతువిప్పి, వాటిని పరిష్కరించేందుకు కృషిచేయాలి. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయాలి. – కృష్ణమూర్తి, ప్రైవేట్ టీచర్, నర్సంపేట -
నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి
భూపాలపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం 38 కాల్వకు పైపులైన్ ఏర్పాటు, భీంఘన్పూర్ రిజర్వాయర్ ఆధునికీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్ లైనింగ్కు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ఏర్పాట్లు పూర్తి.. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి సీఎం రేవంత్రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను శనివారం పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ బందోబస్తు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు. కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
ఇండిపెండెంట్లే కీలకం!
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై వారు ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులుంటే.. 1,073 మంది కౌన్సిలర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి 260 మంది, బీఆర్ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా 314 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల్లో గుబులురేపుతున్నారు. ఆశించిన పార్టీలో టికెట్లు రాకపోవడంతో కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టఫ్ ఫైట్.. స్వతంత్రుల కారణంగా ఎవరి ఓట్లకు గండిపడుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు రానివారు రంగంలో గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే.. మరో వైపు గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల నేతలు టచ్లో పెట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి ఖర్చులు మోసేందుకు చాటుమాటుగా బేరసారాలు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వతంత్రులను రాజీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అంతర్గత మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. పోటీలో అత్యధికంగా స్వతంత్రులు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ప్రభావం.. ప్రధాన పార్టీలకు గుబులు గెలుపు అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై గురి ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకునే ప్రయత్నం మొదలైన ముఖ్యనేతల బేరసారాలుఎక్కడెక్కడ.. ఎలా ఉంది? హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 100 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులుండగా, బీజేపీ నుంచి 21 కాగా రెబల్స్, స్వతంత్రులు కలిపి 35 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 12 మందికి విజయావకాశాలున్నాయంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులకు 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్ని వార్డులకు అభ్యర్థులను నిలపగా, స్వతంత్రులుగా కూడా 30 మంది తలపడుతున్నారు. ఇందులో ఆరుగురు గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యర్థులను బరిలో నిలపగా, అత్యధికంగా 50 మంది ఇండిపెండెంట్లు (రెబల్స్ కూడా) పోటీలో ఉన్నారు. మొత్తం 50 మందిలో 20 మంది ఈజీగా గెలుస్తారన్న చర్చ జరుగుతోంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 27 వార్డుల్లో కాంగ్రెస్, 3 చోట్ల సీపీఐ, సీపీఎం ఉండగా, బీఆర్ఎస్ నుంచి 29 మంది, బీజేపీ నుంచి 26 మంది పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెబల్స్ కలుపుకుని 45 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపెడుతున్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 82 మంది పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్కు మొత్తం వార్డుల నుంచి అభ్యర్థులుండగా, 13 వార్డులకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. ఇక్కడ 33 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు ఆశించి స్వతంత్రులుగా నిలిచిన నలుగురు గట్టి పోటీ ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 155 మందిలో.. 58 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ 32, మిత్రపక్షాలు నాలుగు చోట్ల, బీఆర్ఎస్ 35, బీజేపీ నుంచి 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 8 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండగా, స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరిపెడ మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు మొత్తం 63 మంది పోటీ చేస్తుండగా, అన్ని వార్డులకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి పోరాడుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు అన్ని వార్డులకు అభ్యర్థులను దింపగా, బీజేపీ 15 చోట్ల పోటీ చేస్తుంది. ఇక్కడ 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 64 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని వార్డులకు అభ్యర్థులను పెట్టగా, బీఆర్ఎస్ 14, బీజేపీ 14 వార్డుల్లో పోటీ పెట్టింది. 21 మంది ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 107 మంది ఉండగా, కాంగ్రెస్ 25, మిత్రపక్షాలు 5 కలిపి 30 వార్డులకు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో, బీజేపీ 25 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపగా 27 మంది స్వతంత్రులు బరిలో నిలిచి పోరాడుతున్నారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 83 మంది బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డులకు పోటీ చేస్తుండగా, 23 మంది ఇండిపెండెంట్లుగా కౌన్సిలర్ కోసం కొట్లాడుతున్నారు. -
అభివృద్ధి చే సేవారికే ఓటు
నిజాయితీ గల అభ్యర్థులను గెలిపిస్తాంనర్సంపేట: మున్సిపాలిటీ అభివృద్ధిపై అవగాహన ఉన్నవారినే గెలిపించుకుంటామని, నీతి నిజాయితీగా పనిచేసే వారిని ఎన్నుకుని సమస్యలు పరిష్కరించుకుంటామని నర్సంపేట పట్టణ ప్రజలు స్పష్టం చేశారు. కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అభివృద్ధి చేసేవారిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. పట్టణంలోని మినీస్టేడియంలో శనివారం ఉదయం జరిగిన ‘సాక్షి’ చర్చా వేదికలో పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.వార్డుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి ‘సాక్షి’ చర్చావేదిక లో నర్సంపేట పట్టణ ప్రజల మనోగతం -
మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి..
నర్సంపేట పట్టణంలోని మినీస్టేడియానికి ప్రతిరోజు 400 నుంచి 500 మంది వాకింగ్ కోసం వస్తుంటారు. మినీస్టేడియంలో ఎలాంటి సదుపాయాలు లేవు. ఓపెన్ జిమ్ములో పరికరాలు నిరుపయోగంగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం లేదు. వాకర్స్ అందరం కలిసి చందాలు వేసుకొని జిమ్ము పరికరాలకు మరమ్మతులు చేసుకున్నాం. నూతన పాలకవర్గం మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి. – వెంగళ భిక్షపతి, వ్యాపారి, నర్సంపేట విద్యావంతులను గెలిపించాలి..త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ అనుభవంతోపాటు మేధావులు, విద్యావంతులను ఎన్నుకోవాలి. వార్డుల్లో ఉన్న సమస్యలపై మున్సిపాలిటీలో గళం విప్పి పరిష్కరించేలా చూస్తారు. సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని నిస్వార్థంగా పనిచేస్తారు. – దేశపాక అశోక్, వాకర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్, నర్సంపేట ప్రజలకు అందుబాటులో ఉండాలి..వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు కృషిచేయాలి. అంతేకాకుడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోవాలి. నర్సంపేటను అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. – గంధం మనోహర్ -
స్వార్థ రాజకీయాలతో అన్యాయం
వాస్తవానికి నాటి పరకాల రాజకీయాలకు.. నేటి రాజకీయాలకు కొంత భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు తోడు ప్రజలు ప్రలోభాలకు గురికావడంతో పరకాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని తనం ప్రజల్లో పెరుగుతోంది. ప్రజలు నాటి పరకాల చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని నేటి మున్సిపల్ ఎన్నికల్లో మంచి తీర్పు ఇవ్వాలి. – రేపాల నర్సింహారాములు, సీనియర్ జర్నలిస్ట్, రచయిత ఉపాధి కల్పించాలి.. పరకాల పట్టణంలో ఉపాధి అవకాశాలు లేక చాలా మంది నిరుద్యోగులు రోడ్లపై తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు రాగానే, ఓటు వేయమని అడిగే నాయకులే కానీ, పట్టణ, వార్డుల సమస్యలపై ఎజెండా లేకపోవడం బాధగా ఉంది. – నూతన్, నిరుద్యోగి, పరకాల -
హామీలకు కట్టుబడి ఉండాలి..
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు విలువ చాలా గొప్పది. అలాంటి ఓటుపైనే దేశ భవిష్యత్.. ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రజలే దేవుళ్లు అని భావించే నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించడంతో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నారు. హామీలకు కట్టుబడి ఉండాలి. – గండ్ర నరేశ్రెడ్డి, సీనియర్ అడ్వకేట్ పిలిస్తే పలికే పాలకులు కావాలి అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడు కావాలని ప్రజలు కోరుకోవాలి. ఓడిపోగానే ప్రజలతో సంబంధం లేదన్న నాయకుల కంటే అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజలకు అండగా నిలిచే నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. – చంద్రశేఖర్, శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధానాచార్యుడు -
పోటీలో అత్యధికంగా స్వతంత్రులు
● చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ప్రభావం ● ప్రధాన పార్టీలకు గుబులు ● గెలుపు అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై గురి ● ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకునే ప్రయత్నం ● మొదలైన ముఖ్యనేతల బేరసారాలు స్వతంత్ర అభ్యర్థులుసాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై వారు ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులుంటే.. 1,073 మంది కౌన్సిలర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి 260 మంది, బీఆర్ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా 314 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల్లో గుబులురేపుతున్నారు. ఆశించిన పార్టీలో టికెట్లు రాకపోవడంతో కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టఫ్ ఫైట్.. స్వతంత్రుల కారణంగా ఎవరి ఓట్లకు గండిపడుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు రానివారు రంగంలో గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే.. మరో వైపు గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల నేతలు టచ్లో పెట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి ఖర్చులు మోసేందుకు చాటుమాటుగా బేరసారాలు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వతంత్రులను రాజీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అంతర్గత మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. హనుమకొండ పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 100 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులుండగా, బీజేపీ నుంచి 21 కాగా రెబల్స్, స్వతంత్రులు కలిపి 35 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 12 మందికి విజయావకాశాలున్నాయంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులకు 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్ని వార్డులకు అభ్యర్థులను నిలపగా, స్వతంత్రులుగా కూడా 30 మంది తలపడుతున్నారు. ఇందులో ఆరుగురు గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యర్థులను బరిలో నిలపగా, అత్యధికంగా 50 మంది ఇండిపెండెంట్లు (రెబల్స్ కూడా) పోటీలో ఉన్నారు. మొత్తం 50 మందిలో 20 మంది ఈజీగా గెలుస్తారన్న చర్చ జరుగుతోంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 27 వార్డుల్లో కాంగ్రెస్, 3 చోట్ల సీపీఐ, సీపీఎంలుండగా, బీఆర్ఎస్ నుంచి 29 మంది, బీజేపీ 26 మంది కౌన్సిలర్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెబల్స్ కలుపుకుని 45 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపెడుతున్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 82 మంది పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్కు మొత్తం వార్డుల నుంచి అభ్యర్థులుండగా, 13 వార్డులకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. ఇక్కడ 33 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు ఆశించి స్వతంత్రులుగా నిలిచిన నలుగురు గట్టి పోటీ ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 155 మందిలో.. 58 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ 32, మిత్రపక్షాలు నాలుగు చోట్ల, బీఆర్ఎస్ 35, బీజేపీ నుంచి 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 8 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండగా, స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరిపెడ మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు మొత్తం 63 మంది పోటీ చేస్తుండగా, అన్ని వార్డులకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి పోరాడుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్,బీఆర్ఎస్లు అన్ని వా ర్డులకు అభ్యర్థులను దింపగా, బీజేపీ 15 చోట్ల పోటీ చేస్తుంది. 11మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 64 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని వార్డులకు అభ్యర్థులను పెట్టగా, బీఆర్ఎస్ 14, బీజేపీ 14 వార్డుల్లో పోటీ పెట్టింది. 21 మంది ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 107 మంది ఉండగా, కాంగ్రెస్ 25, మిత్రపక్షాలు 5 కలిపి 30 వార్డులకు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో, బీజేపీ 25 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపగా 27 మంది స్వతంత్రులు బరిలో నిలిచి పోరాడుతున్నారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 83 మంది బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డులకు పోటీ చేస్తుండగా, 23 మంది ఇండిపెండెంట్లుగా కౌన్సిలర్ కోసం కొట్లాడుతున్నారు. మొత్తం మున్సిపాలిటీలు 12మొత్తం వార్డులు 260బరిలో ఉన్న అభ్యర్థులు 1,073 కాంగ్రెస్ 260బీఆర్ఎస్ 259బీజేపీ 240స్వతంత్రులు 314 -
ఓటు హక్కు ఓ ఆయుధం..
ఎన్నికల సమయం రాగానే.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. –డాక్టర్ ఆకుల సంజీవయ్య, పరకాల సివిల్ ఆస్పత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ కోతులు, కుక్కల నివారణపై హామీ అవసరం పరకాలలో కోతులు, కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వాటి నివారణ చర్యలు తీసుకోవడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారైనా పట్టణ ప్రజలకు కోతులు, కుక్కల నివారణపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. –సుంకరి రామన్న, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు -
బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని శనివారం వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సీనియర్ అసిస్టెంట్ మధుకర్ హనుమకొండ రాంనగర్లోని మంత్రి నివాసంలో మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్బాబు, మున్నూరు కాపు సంఘం నాయకులు గండ్రతి రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 1వ తేదీన గుజరాత్ పీజియన్ క్లబ్ ఆధ్వర్యంలో గుజరాత్లోని భరూచ్లో నిర్వహించిన ఆలిండియా పీజి యన్ షోలో కాజీపేటలోని బాపూజీనగర్కు చెందిన సయ్యద్ షకీర్కు చెందిన పావురాలు గ్రాండ్ చాంపియన్లుగా నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 14 రకాల ఫ్యాన్సీ పీజి యన్ జాతులు ప్రదర్శనలో పాల్గొనగా షకీర్ పది పీజియన్లను పోటీల్లో నిలిపారు. పోటీల్లో పాల్గొన్న పది పీజియన్ జాతుల్లో హంగేరియన్ జెయింట్ హౌస్, లాహోర్ పీజియన్లు ఫిమేల్, మేల్ కేటగిరీలో గ్రాండ్ చాంపియన్ కైవసం చేసుకోవడంతో పాటు మరో ఐదు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి బహమతులు అందుకున్నాయి. హన్మకొండ చౌరస్తా: ‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడం మనందరి బాధ్యత, అంతర్గత విభేదాలు వీడి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి’ అని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య.. సిబ్బందికి సూచించారు. హనుమకొండ 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్, రికార్డులు పరిశీలించిన అనంతరం ఔట్ రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా 44 మంది పిల్లలకు, గర్భిణులకు 62 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గుర్తించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఇటీవల సిబ్బంది మధ్య విభేదాలు తలెత్తుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి ఘటనలు పునరావృతం అయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 9, 10 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ శుక్రవారం తెలిపారు. జేఎన్ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో క్రీడా సంఘాల బాధ్యులు, పీఈటీలతో శనివారం సీఎం కప్ క్రీడా పోటీల సన్నాహక సమావేశం నిర్వహించారు. క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, శ్రీనివాసరెడ్డి, రమేశ్రెడ్డి, సాంబయ్య, రాజేందర్, రామ్రెడ్డి, ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, పీఈ టీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఈటీలు, పీడీలు, కోచ్లు పాల్గొన్నారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
పరకాల: నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఎంతో మంది అమరులైన పోరాటాల గడ్డ పరకాల. 1960లో ఉమ్మడి జిల్లాలోనే మొదటి మున్సి పాలిటీ. కొందరు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కారణంగా అన్యాయానికి గురైంది. 1965లో మేజర్ గ్రామ పంచాయతీగా.. ప్రత్యేక రాష్ట్రంలో మళ్లీ 2018లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. కానీ ఇప్పటికీ అభివృద్ధిలో వివక్షకు గురవుతూనే ఉంది. ఈప్రాంత అభివృద్ధి కో సం పనిచేసే నాయకత్వం అవసరం.’ అని విద్యావేత్తలు, ప్రముఖులు మేధావులు, నిరుద్యోగులు, వ్యాపారులు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ‘ప్రజాతీర్పు.. సమస్యలు–పరిష్కారం’ అంశంపై శనివారం పరకాలలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో చర్చావేదిక నిర్వహించింది. ఇందులో అనేక సమస్యలపై చర్చ జరిగింది. స్వార్థపూరిత రాజకీయాలు వీడి.. పరకాల పట్టణాభివృద్ధికి పట్టం కట్టే నాయకత్వంతో పాటు పాలకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత పట్టణ ఓటర్లపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పరకాలలో పేరుకుపోయిన పారి శుద్ధ్య సమస్యతో పాటు కోట్ల రుపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడం కోసం శ్రమించే పాలకులను.. కొత్త జిల్లాల ఏర్పాటులో పరకాలకు అన్యాయాన్ని ఇప్పటికై నా పాలకులను నిలదీసేంత సత్తాగల నాయకులే రేపటి పరకాల భవిష్యత్ వారసులని అభిప్రాయపడ్డారు. నా డు వ్యాపార వాణిజ్య రంగంలో వరంగల్ తర్వాత రెండో స్థానంలో ఉన్న పరకాలలో నేడు ప్రధాన రహదారుల గుండా అనేక దుకా ణాల షట్టర్లకు టు లెట్ బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయో ప్రశ్నించుకోవాలన్నారు. ఓట్ల కోసం వచ్చే వారిని ఎలాంటి డబ్బు.. మద్యం వంటి ప్రలోభాలకు గురవకుండా.. ప్రశ్నించాల్సిన బాధ్య త ప్రతీ ఓటరుపై ఉందని చర్చా వేదికలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ●స్వార్థపూరిత రాజకీయాలతో పరకాలకు అన్యాయం డబ్బు, ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధిని కోరుకుందాం ‘సాక్షి’ చర్చావేదికలో ప్రముఖులు, పట్టణ ప్రజలు -
అవగాహన అవసరం
నాడు నిజాం పాలకుల నుంచి మొదలు.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరధామం సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి స్ఫూర్తిని ఇచ్చేలా తెలంగాణ జేఎసీ నాయకత్వంలో ఉద్యమాలు చేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత పరకాల జిల్లా కేంద్రం.. రెవెన్యూ డివిజన్ కోసం పోరాటాలు చేయగా.. చివరకు రెవెన్యూ డివిజన్ దక్కింది. రాజకీయాల కోసం ఎన్నికలు కాకుండా పరకాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా. విద్యాసంస్థల అభివృద్ధికి మాజీ సీఎం వైఎస్సార్ను నేటి పాలకులు స్ఫూర్తిగా తీసుకోవాలి. – డాక్టర్ సిరికొండ శ్రీనివాసాచారి, ఎస్వీ విద్యాసంస్థల అధినేత -
నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి
● కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు ● సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా బహిరంగ సభ భూపాలపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం 38 కాల్వకు పైప్లైన్ ఏర్పాటు, భీంఘన్పూర్ రిజర్వాయర్ ఆధునీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్ లైనింగ్ తదితర పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ఏర్పాట్లు పూర్తి.. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి సీఎం రేవంత్రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను శనివారం పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ బందోబస్తు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: వేసవిలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతేడాదిలో తాగునీటి సమస్యలు ఎదురైన గ్రామాలు, తీసుకున్న పునరుద్ధరణ చర్యలు, జిల్లాకు అవసరమైన నీటి సామర్థ్యం, నీటి వనరుల స్థితిగతులపై అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర నివేదికను మిషన్ భగీరథ ఈఈలు, జిల్లా పంచాయతీ అధికారి త్వరితగతిన అందజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు ప్రతీ ఇంటికి తాగునీరు అందుతుందా లేదా? అని క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, ఈఈ రామాంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ డీఈలు, ఏఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పెద్ది’ వల్ల రూ.15కోట్లు నష్టపోయాం
● బోరు బండి కుటుంబ సభ్యుల నిరసన నర్సంపేట: 2016 –17వ సంవత్సరంలో అప్పటి సివిల్ సప్లయీస్ చైర్మన్గా ఉన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి.. నర్సంపేట నియోజకవర్గంలో తమ బోరు బండితో విచ్చలవిడిగా బోర్లు వేయించి మోటార్లు బిగించి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారని నర్సంపేట పట్టణంలోని శ్రీలక్ష్మి బోర్వెల్స్ యజమానులు వీరమల్ల మోహన్రెడ్డి, వెంకట్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బోర్వెల్ షాపు ఎదుట టెంట్ వేసుకొని.. పెద్ది సుదర్శన్రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు మోసం చేశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుటుంబాలతో సహా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బోర్వెల్ యజమానులు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్రెడ్డి వల్ల తమ కుటుంబాలు వీధిన పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బోరు వేసే క్రమంలో తాము చేసిన అప్పులు రూ.15కోట్లు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పిచ్చిన వారికి సమాధానం చెప్పలేక ఎనిమిది నెలలుగా ఇళ్లకు తాళాలు వేసి రహస్యంగా జీవనం గడుపుతున్నామని వాపోయారు. కాగా, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న వేళ నర్సంపేటలో వీరి ఆందోళన వైరల్గా మారింది. -
ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
● ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం నోడల్ ఆఫీసర్ గాయపు లింగారెడ్డిదుగ్గొండి: ప్రభుత్వ పాఠశాలలో వసతులు, పరిశుభ్రత, బోధన విధానం అద్భుతంగా ఉందని, అందుకు ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీం జిల్లా నోడల్ ఆఫీసర్ గాయపు లింగారెడ్డి కొనియాడారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. మాథ్స్, సోషల్, సైన్స్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులను టీమ్ సభ్యులు ఆనంద్మోహన్, నాగార్జున్ రావు, ఎం.రాజు, సంతోష్కుమార్, రమేష్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన నిర్వహణ, పారిశుద్ధ్యాన్ని పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎస్కే.అహ్మద్, సునీత, సంధ్యారాణి, జుమ్మిలాల్, రజినీ, కిరణ్, కరుణ, తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద నర్సంపేట: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రతీ అధికారి బాధ్యతతో, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్యశారద సూచించారు. నర్సంపేట జెడ్పీ సెకండరీ స్కూల్లో పీఓ, ఏపీఓలకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణలో పారదర్శకత, సమర్థత ఎంతో కీలకమని, చిన్న పొరపాటు కూడా జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. శిక్షణ అనంతరం నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పీఎంశ్రీ జెడ్పీ సెకండరీ స్కూల్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యశారద ఆదేశించారు. పట్టణంలోని రైతువేదికలో పీఓ, ఏపీఓలకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని గుర్తుచేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్ల సీలింగ్, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్, అకౌంట్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లు తెరవడం, పోలింగ్ ప్రక్రియ ప్రారంభం వంటి పలు అంశాలను వివరించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు, బ్యాగ్లు, మొబైల్ఫోన్లు, ఇంక్ప్యాడ్ వంటివి అనుమతించవద్దని పేర్కొన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, నర్సంపేట, వర్ధ న్నపేట మున్సిపల్ కమిషనర్లు భాస్కర్, సుధీర్కుమార్, తహసీల్దార్లు రవిచంద్రరెడ్డి, విజయసాగర్, ఎన్నికల అధికారులు, మున్సిపల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన విచారణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్లో అవకతవకలు జరిగాయని, అధికంగా మెస్ బిల్లులు వస్తున్నాయని కొందరు విద్యార్థులు గతంలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కామన్ మెస్లో మెస్ బిల్లులు అధికంగా వచ్చాయని విద్యార్థులు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. విచారణ కమిటీ చైర్మన్గా కేయూ ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ప్రసాద్ వ్యవహరిస్తుండగా పలువురు ప్రొఫెసర్లు సభ్యులుగా ఉండి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణ కమిటీ పలుమార్లు హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్కుమార్ నుంచి వివరాలు రాబట్టినట్లు సమాచారం. అదేవిధంగా ఆయా జాయింట్ డైరెక్టర్లను కూడా కొద్దిరోజుల క్రితమే విచారించారు. ఈవిచారణ కమిటీవేసి నెలరోజులు గడిచిపోయింది అయినా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇష్టారీతిన అడ్వాన్స్లు.. వివిధ హాస్టళ్లు, మెస్ల నిర్వహణకు హాస్టళ్ల డైరెక్టర్ ఇష్టారీతిన నిధులు విడుదల చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అన్ని హాస్టళ్లు, మెస్లలోని 23 మంది జాయింట్ డైరెక్టర్లకు కూడా అడ్వాన్స్ల రూపంలో డబ్బులు విడుదల చేస్తూ వస్తున్నట్లు డైరెక్టర్ రాజ్కుమార్ చెబుతున్నారు. కొందరికి ఎక్కువ మొత్తంలో అడ్వాన్స్లు ఇవ్వడంతో వారుసక్రమంగా వెచ్చించా రా లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామన్మెస్తోపాటు హాస్టళ్ల డైరెక్టర్పరిధి అన్ని మెస్ల, హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్లకు విడుదల చేసి న అడ్వాన్స్ల బిల్లులను విచారణ కమిటీ క్షణ్ణంగా పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు ఉప్పుల సతీశ్ విద్యారణ్యపురి: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పుల సతీశ్ డిమాండ్ చేశారు. టీపీయూస్ రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ను వరంగల్ జిల్లా డీఈఓ రంగయ్యనాయుడుతో ఆవిష్కరించారు. ఈసందర్భంగా సతీశ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలను విడుదల చేయాలన్నారు. అర్హులైన టీచర్లకు పదోన్నతులివ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్తేజ, సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్, ఉల్లాస్ కో–ఆర్డినేటర్ నాగేశ్వర్రావు, టీపీయూఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బత్తిని వెంకటరమణ, జిల్లా జనరల్ సెక్రటరీ ఎ.శేఖర్, బాధ్యులు రవికుమార్, సదానందం, రాములు, జైపాల్రెడ్డి, శ్రీనివాస్రావు, తిరుపతిరావు, రాజు పాల్గొన్నారు. -
పులి.. ఒకటా? రెండా?
● జనగామ జిల్లాలో పశువులపై సాగిస్తున్న వేట ● పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు ● పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు జనగామ: మూడు రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆడనా.. మగనా...? ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్ బెంగాల్ టైగర్గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. కానీ, బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండటం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు అధికారుల సూచనలు ● పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు, సూచనలు చెబుతున్నారు. ● పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం చాలా మంచిది. ● పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్దాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది. ● మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు. ● రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు. ● వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి. ● పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్హెచ్ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి. -
పులి.. ఒకటా? రెండా?
రఘునాథపల్లి మండలం మండెలగూడెం శివారులోని పరిశె రాజుకుచెందిన లేగదూడపై శుక్రవారం తెల్లవారుజామున పెద్ద పులి దాడి చేసి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై దూదిమెట్ల నరేశ్ అటవీశాఖ డీఎఫ్ఓ కొండల్రెడ్డి, సిబ్బందితో వెళ్లి పులి పాదముద్రలుగా నిర్ధారించారు.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సరిహద్దులోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్లో పులి సంచరించినట్లు శుక్రవారం మద్దూరు సీఐ రమేశ్, ఎస్సై ఆసీఫ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాముడు గుర్తించారు. సమీప గ్రామాలైన కట్కూర్, వీఎస్ఆర్ నగర్, బండనాగారం, బంజేరు, మార్మాముల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇచ్చారు.జనగామ: మూడు రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్లు పలు గ్రామాల్లో వార్తలు, ఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆడనా.. మగనా? ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్ బెంగాల్ టైగర్గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. కానీ, బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండడం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో వ్యాఘ్రం జాడలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్ధాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది. మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు. రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు. వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి. పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్హెచ్ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి. -
దూకుడు
వరంగల్శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026గెలుపే లక్ష ్యంగా● ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు ● స్వతంత్రులు కూడా వెరవని వైనం ● ఎన్నికల ప్రచార ఆర్భాటాలకు రూ.లక్షల్లో ఖర్చు ● విజయమే ధ్యేయంగా ప్రధాన పార్టీల ప్రణాళికలు ● ప్రచార మోజులోపడి ఈసీ నిబంధనలకు తూట్లుసాక్షి, వరంగల్: ఎంతైనా సరే అంతిమంగా గెలుపే లక్ష్యమనే ధోరణిలో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. నామినేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకు రూ.లక్షల్లో ఖర్చవుతున్నా ఎక్కడా ఏమాత్రం ఎవరూ తగ్గడం లేదు. ఎంత ఖర్చైనా సరే.. ఏమాత్రం తగ్గేదేలే అన్న ధోరణిలో విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఆయా పార్టీల టికెట్ల కోసం ముఖ్యనేతల వద్ద రూ.లక్షల్లో డిపాజిట్లు పెట్టి కొంతమంది బీఫారాలు పొందారు. ప్రచారం ఇప్పుడు తారాస్థాయికి చేరుతుండడంతో పైసలు వెదజల్లేందుకు వెనుకాడడం లేదు. భారీగా పెరుగుతున్న ప్రచార ఖర్చు ఉదయం, సాయంత్రం వార్డుల్లో ప్రచారం, ప్రముఖులు వచ్చినప్పుడు రోడ్ షోలు, జన సమీకరణకు పంపకాలు, భోజనాలు, ఇతరత్రా ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ప్రచార ఖర్చు భారీగా పెరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారానికి అభ్యర్థులు మూడింతలు ఖర్చుచేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థి వ్యయపరిమితి లక్ష రూపాయలు కాగా, అంతకు ముప్పయింతలు ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల నిఘా వ్యవస్థకు చిక్కకుండా అభ్యర్థులు పైసల మంత్రంతో విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఈ ఎన్నికల ఖర్చు కోసం కొంతమంది అభ్యర్థులు తమ భూములు, ప్లాట్లు అమ్ముకొని జనవరిలోనే డబ్బులు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఖర్చు చేస్తున్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: ప్రజాపాలన దిశగా పేదల సక్షేమం, తూర్పు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు శుక్రవారం వరంగల్ 35వ డివిజన్ శివనగర్లోని ఏసీరెడ్డి నగర్లో జనరల్ ఫండ్ నిధులు రూ.కోటి వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు, మున్నూరుకాపు కమ్యూనిటీహాల్ అభివృద్ధి పనులను మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్తో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, కొత్తపెల్లి శ్రీనివాస్, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్, శ్రీధర్, కేడల పద్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రనేతలకు సవాలే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్చార్జ్లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 10నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు.. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నేతలకు ఈ ఎన్నికలు సవాలే.. ● హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు. ● వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్దన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సవాల్గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్ రెడ్డిలు చైర్మన్ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. ● జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్చార్జ్లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత హనుమాండ్ల ఝాన్సీలు అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లులు ఇన్చార్జ్లుగా ఉన్నారు. ● స్టేషన్ ఘన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డా.తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు. ● భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్)లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు. ● ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జ్లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్నాయక్(బీఆర్ఎస్)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ విప్ దాస్యం వినయభాస్కర్, కాంగ్రెస్ నుంచి సీహెచ్ వెంకటేశ్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్నాయక్.. అభ్యర్థులను బరిలోకి దింపారు. ● డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్)లకు సవాల్గా మారాయి. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పుర పోరు ప్రతిష్టాత్మకం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు.. పకడ్బందీగా గెలుపు కోసం పావులు రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం -
యువ ప్రపంచ క్రికెట్ కప్ మనదే
ఐసీసీ అండర్–19 గెలుపుపై సంబురాలు వరంగల్ స్పోర్ట్స్: జింబాబ్వే దేశంలోని హరారే పట్టణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన అండర్–19 ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఇండియా విజేతగా నిలిచి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే నేతృత్వంలో వైభవ్ సూర్యవంశీ 175 పరుగులు చేసి విజయఢంకా మోగించడంలో కీలకపాత్ర పోషించారు. యువ ప్రపంచకప్ను సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వీట్లు పంచుకుని, బాణసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. సంబురాల్లో మార్నేని ఉదయభానురావు, బండారి ప్రభాకర్, మట్టెడ కుమార్, అనిల్, నాగేశ్, నరేశ్, అవినాశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ముల్కనూరులో శిక్షణ అధికారుల సందడి
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార శాఖకు చెందిన 52మంది నూతనంగా నియమితులైన అసిస్టెంట్ రిజిస్ట్రార్లు శుక్రవారం సందర్శించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో–ఆపరేటివ్ మేనేజ్మెంట్ (ఐసీఎం) 36 వారాల హయ్యర్ డిప్లొమా ఇన్ కో–ఆపరేటివ్ మేనేజ్మెంట్ శిక్షణ పొందుతున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సహకార రంగంలో ఉత్తమంగా పనిచేస్తున్న సంస్థల పని తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ముల్కనూరు సహకార సంఘం అందిస్తున్న వివిధ సేవలు, నిర్వహణ విధానం తదితర అంశాలు తెలుసుకున్నారు. సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి నూతనంగా నియమితులైన ప్రభుత్వ అధికారులతో చర్చించారు. సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై వివరించారు. నూతన అధికారులు అభినందిస్తూ, ఈ శిక్షణ కార్యక్రమం అధికారుల భవిష్యత్ సహకార సేవలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హన్మకొండ అర్బన్: పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న బుధవారం స్థానిక సెలవుగా దినంగా ప్రకటించినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులతో పాటు ఎన్నికల పరిధి దుకాణాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ, విద్యా సంస్థల భవనాలకు ఈనెల 10న, 11 పోలింగ్ రోజున, 13న ఓట్ల లెక్కింపు రోజుల్లో సెలవు దినాలుగా పరిగణించాలని సూచించారు. ఓటర్లు విధిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. -
బిల్లులు రాకుండా ఆపింది ఎమ్మెల్యేనే
● బీఆర్ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ రవీందర్రావు నర్సంపేట: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై ఆరోపణలు సరికాదని, బోర్వెల్ నిర్వాహకులకు బిల్లులు ఆపింది ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే పెద్ది సుదర్శన్రెడ్డి బోర్లు వేయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను సుదర్శన్రెడ్డి చెల్లించాలని అనడం సిగ్గు చేటన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న నర్సంపేటను తగాదాలకు నిలయంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. బోర్వెల్ నిర్వాహకుల నిరసన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. సమావేశంలో మార్కెట్ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, నాయకులు, సంగాని సూరయ్య, బాల్నె వెంకన్న, యువరాజు, రాజ్కుమార్, చంద్రమౌళి, మౌలానా, ఇర్ఫాన్, నాయిని వేణుచంద్, తదితరులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే ● గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు.. పకడ్బందీగా గెలుపు కోసం పావులు ● రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం ● ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్చార్జ్ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా.. సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్చార్జ్లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 10 నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు..ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ పంచాయతీల్లో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళీప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సవాల్గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్ రెడ్డి చైర్మన్ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్చార్జ్లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత హనుమాండ్ల ఝాన్సీ అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డాక్టర్ తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్) వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు. ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిఽథ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జ్లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్నాయక్(బీఆర్ఎస్)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ విప్ దాస్యం వినయభాస్కర్, కాంగ్రెస్ నుంచి సీహెచ్ వెంకటేశ్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్నాయక్.. అభ్యర్థులను బరిలోకి దింపారు. డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్)కు సవాల్గా మారాయి. -
రుద్రేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ రామల సునీత తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈఓ అనిల్కుమార్ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మతో కలిసి వేయిస్తంభాల ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను డీసీ రామల సునీత ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది దేవాలయానికి వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నగరపాలక సంస్థ, విద్యుత్శాఖ, పోలీస్శాఖ, రెవెన్యూ శాఖ, దేవాదాయశాఖ, పురావస్తుశాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ శివరాత్రి ఉత్సవాల్లో ఐదురోజులు జరిగే పూజా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్బాబు, బ్రాహ్మణ సేవా సమితి నాయకులు అ యినవోలు వెంకటసత్యమోహన్, మున్నూరు కాపు సంఘం నాయకులు గండ్రతి రాజు, పద్మశాలి సంఘం నాయకులు గణపతి, వెలమ సంఘం నాయకులు సంపత్రావు, సిబ్బంది మ ధుకర్, రామకృష్ణ, సందీప్శర్మ పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 9, 10 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ శుక్రవారం తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పత్రంతో పా టు, సంబంధిత ఎంపీడీఓ లేదా ఎంఈఓ ధ్రువీ కరించిన ప్రవేశ ఫామ్తో ఉదయం 8గంటలకు జేఎన్ఎస్ వద్ద హజరు కావాలని కోరారు. కేయూ క్యాంపస్: విద్యార్థులు భవిష్యత్లో పారిశ్రామికవేత్తలుగా, ఇన్నోవేటర్లుగా ఎదగాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. కేయూ, హైదరాబాద్లోని టి హబ్ సంయుక్తంగా క్యాంపస్లోని ఆడిటోరియంలో విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేయూ వీసీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్స్ స్థాపనకు టి హబ్, కె హబ్ సమగ్ర శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన వంద మంది విద్యార్థులకు పూర్తి స్థాయి సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతోపాటు అధ్యాపకులు, పరిశోధకులు సైతం నూతన ఆలోచనలు పంచుకోవచ్చన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం హెదరాబాద్ ఏఐసీ టి హబ్ ప్రధాన అధికారి రాజేశ్కుమార్, కేయూ హబ్ డైరెక్టర్ సవితా జ్యోత్స్న, వివిధ సంస్థల ప్రతినిధులు డాక్టర్ వినోద్, సయ్యద్ రాష్యన్, స్వాతి, రిషిత, అరుణ్రెడ్డి, టి హబ్ ప్రతినిధులు చైతన్య శ్రవణ, మహ్మద్హఫీజుద్దీన్, ఏర్ల శ్రవణ, సిద్ధార్థ, బొల్లం కిరణ్ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) ఇంటర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 8వ తేదీ వరకు గడువు ఉందని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ జంగా సతీశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బాలికలకు (హనుమకొండ కేయూ క్రాస్ రోడ్డులోని టెమ్రిస్ వరంగల్–1 బాలికలు), బాలురకు హనుమకొండ హంటర్ రోడ్డులోని కాజీపేట బాలుర కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, జేఈఈ, నీట్, ఎంబీబీఎస్ ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఆయా కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. -
‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీనియర్ నాయకులను ఇన్చార్జ్ లుగా నియమించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్.. వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపైనే పెట్టారు. నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ వరంగల్, మహబూబాబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా ఉన్నారు. వీరికి తోడు మున్సిపాలిటీల వారీగా కోఆర్డినేటర్లను గురువారం నియమించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగామ మున్సిపాలిటీకి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లుకు మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కొలను హనుమంతరెడ్డిని నియమించారు. పరకాలకు టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్టేషన్ఘన్పూర్కు భీమగాని సౌజన్య, భూపాలపల్లికి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు, వర్ధన్నపేటకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ మున్సిపాలిటీకి గాజర్ల అశోక్, మరిపెడకు ఎంపీ పోరిక బలరాంనాయక్, కేసముద్రంకు దూడ వెంకటరమణ, మహబూబాబాద్కు సీహెచ్ వెంకటేశ్, ములుగుకు ఈవీ శ్రీనివాస్రావు, నర్సంపేటకు డాక్టర్ పులి అనిల్కుమార్ను సమన్వయకర్తలుగా టీపీసీసీ నియమించింది. కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. కోఆర్డినేటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా ఇతర సీనియర్లకు భవిష్యత్లో నామినేటెడ్ పోస్టులకు మున్సిపల్ ఎన్నికల విజయాలకు కూడా పార్టీ అధిష్టానం లింకు పెట్టినట్లు సమాచారం. కాగా, టీపీసీసీ నియమించిన సమన్వయకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం వెంటనే రంగలోకి దిగారు. జనగామ, తొర్రూరు, మరిపెడకు ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్ ఉత్తర్వులు జారీచేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభ్యర్థుల గెలుపునకు.. నామినేట్ పదవులకు లింకు -
రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
నల్లబెల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజాప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మూడుచెక్కలపల్లి లింక్ మెయిన్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి దేవాదుల ప్రాజెక్టు పైపులైన్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలతో కుదేలవుతున్న వ్యవసాయ రంగానికి దేవాదుల జలాలు కొత్త ఊపిరినిస్తాయన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 5 వేల ఎకరాలకు ఈనీరు అందుతుందని పేర్కొన్నారు. మండలంలోని చెరువులు జలకళ తంతరించుకుంటాయని హర్షం వ్యక్తం చేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా దేవాదుల ప్రాజెక్టును చేపట్టి రంగాయ, పాకాల చెరువులకు నీరు అందించే ప్రక్రియ ప్రారంభించారని గుర్తు చేశారు. రంగాయ చెరువు పనుల కోసం రూ.311 కోట్లతో అప్పట్లోనే అనుమతులు మంజూరయ్యాయని, గత పాలకులు నిర్లక్ష్యం వ్యవహరించడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయయని విమర్శించారు. ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ పనుల్లో వేగం పెరిగిందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 80 శాతం పనులు పూర్తిచేస్తామని, మిగిలిన పనులు వచ్చే యాసంగి వరకు పూర్తి చేసి నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లోని 32,500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని రైతులకు భరోసా కల్పించారు. నీటి సరఫరాలో ఎలాంటి సాంకేతిక ఆటంకాలు కలగకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ కుమారస్వామి, ఎస్ఈ స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఈఈఈలు నారాయణ, సుదర్శన్, డీఈ యశ్వంత్, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఏఈ జాన్సీరాణి, సర్పంచ్ ఎరుకల లలిత రఘు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, నాయకులు వైనాల అశోక్, ఎర్రబెల్లి రఘుపతిరావు, మాలోత్ రమేశ్, జిల్లా మునేందర్, మాలోత్ చరణ్సింగ్, భూక్య భాస్కర్ పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మూడుచెక్కలపల్లిలో దేవాదుల నీటి విడుదల -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్లోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి ఖమ్మం బైపాస్ రోడ్డు నుంచి అమ్మవారిపేట రోడ్డు వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.1.09 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణ పనులను మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవితో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సంక్షేమం, నగరాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సమస్యలు లేని నగరంగా వరంగల్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, కేడల పద్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు శంకుస్థాపన -
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
● జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు ఖానాపురం: తక్కువ నీటితో ఆయిల్పామ్ ఎక్కువ దిగుబడి సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధరావుపేటలో ఉద్యాన పంటల సాగు–అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం వస్తుందన్నారు. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యానపంటల వైపు మళ్లాలని సూచించారు. ఆయిల్పామ్ సాగులో శాసీ్త్రయ పద్ధతులే కీలకమని పేర్కొన్నారు. నీటి లభ్యతను బట్టి మొక్కలకు తగినంత నీటిని అందిస్తే గెలల బరువు పెరుగుతుందన్నారు. ఎరువుల వినియోగంలో రైతులు నిర్లక్ష్యం వహించకూడదని, ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఖానాపురం అధికారి తరుణ్, సర్పంచ్ పెసరు రాణిగోవర్ధన్రెడ్డి, ఆయిల్పామ్ రైతులు పాల్గొన్నారు. -
21.44 కిలోల గంజాయి స్వాధీనం
ఖానాపురం: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. ఖానాపురంల పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని కోయకొండ గ్రామానికి చెందిన మడకం శ్రీను, కలుగూడ గ్రామానికి చెందిన సలబం రాహుల్ ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. వారు ఒడిశా నుంచి రూ.10,70,700 విలువ చేసే 21.44 కిలోల ఎండు గంజాయిని బ్యాగుల్లో నింపుకొని మహబూబాబాద్ మీదుగా వరంగల్ రైల్వేస్టేషన్కు వెళ్తున్నారని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై రఘుపతి ఖానాపురం శివారులో వాహనాల తనిఖీ చేపట్టగా పోలీసులను చూసి నిందితులు పరార్ అవుతుండగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామన్నారు. భీమరాజు అనే వ్యక్తి రూ.40 వేల కమీషన్ ఇస్తామని చెప్పి 11 గంజాయి ప్యాకెట్లను రైల్వేస్టేషన్కు తరలించాలని చెప్పారని ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో నిందితుల నుంచి గంజాయి, ద్విచక్రవాహనం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ సాయిరమణ, ఎస్సై రఘుపతి, సిబ్బంది సీతారామరాజు, అక్షిత్, రమేశ్, ప్రదీప్, సంతోష్, చందర్, విజయ్, వీరస్వామి, సుమన్, హోంగార్డులు రాజు, ఎర్రయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.వివరాలు వెల్లడించిన నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి


