breaking news
Warangal District Latest News
-
పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరికలు
నర్సంపేట: ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన కందికట్ల వీరేశ్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్లో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నెక్కొండ: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చంద్రుగొండ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, నెక్కొండ, నర్సంపేట మార్కెట్ చైర్మన్లు రావుల హరీశ్రెడ్డి, పాలాయి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, మాజీ జెడ్పీటీసీ బక్కి కవిత, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, నాయకులు పెండ్యాల హరిప్రసాద్, కేవీ. సుబ్బారెడ్డి, కుసుమ చెన్నకేశవులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ఆలస్యమే!
ఈసారీ..గీసుకొండ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసే ప్రక్రియ ఈ ఏడాది కూడా ఆలస్యం కానుంది. వంద శాతం సబ్సిడీపై 2016లో ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సకాలంలో ఏఒక్క ఏడాది కూడా చెరువులకు చేప పిల్లలు చేరిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు టెండర్లకు సంబంధించి ప్రభుత్వం, మత్స్యశాఖ ఊసెత్తకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిద్ధంకాని మత్స్యశాఖ.. జూన్ నెల ముగుస్తున్నా ఇప్పటి వరకు చేపపిల్లల పంపిణీ టెండర్లకు మత్స్యశాఖ సిద్ధం కాలేదని తెలుస్తోంది. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ ఏడాది ఆలస్యంగా టెండర్లను పిలవడంతో ప్రయోజనం ఉండదని అంటున్నారు. టెండర్ల విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి (డీఎఫ్ఓ) నాగమణిని శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. సరైన సమయంలో వదిలితేనే ఎదుగుదల.. ఆలస్యంగా ఉచిత చేపపిల్లలు పంపిణీ చేయడంతో తగిన లబ్ధి చేకూరడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. చెరువుల్లో సరైన సమయానికి చేపపిల్లలు వదలకపోవడంతో చేపల్లో ఎదుగుదల లేక ధర రావడం లేదని అంటున్నారు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు ఎదగాలంటే చేపపిల్లలను ఆగస్టులోపు చెరువుల్లో వదలాల్సి ఉంటుందని, అప్పుడే నాలుగు నెలల్లో పెరిగి చేతికొస్తాయని చెబుతున్నారు. అలాంటి చేపలకే మార్కెట్లో మంచి ధర వస్తుందని, వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కానీ, గతంలో చాలా ఆలస్యంగా చేపపిల్లను పంపిణీ చేయడంతో సరిగా ఎదుగుదల లేక మత్స్యకారులకు పెద్దగా లాభం జరగలేదు. గత ఏడాది సగం చేపపిల్లలే పంపిణీ గత వర్షాకాలం జిల్లాలో సుమారు 1.93 కోట్ల చేపప్లిలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, అందులో సగమే ఆలస్యంగా పంపిణీ చేశారని మత్య్ససంఘాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది రెండు ఏజెన్సీలు టెండర్లను దక్కించుకుని చేపపిల్లలను అందించాయి. అయితే, చేపపిల్లలు చాలా చిన్న సైజులో నాసిరకంగా ఉండడం, అదును దాటిన తర్వాత ఆలస్యంగా చెరువుల్లో పోయడంతో పెద్దగా ఎదగలేదని మత్స్యసంఘాల వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు నష్టం తప్ప లాభం రాదని చెబుతున్నారు. సొంతంగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చేపపిల్లల పంపిణీ ప్రతీ ఏడాది ఆలస్యం అవుతుండడంతో పలు మత్స్యసంఘాల వారు నీరు చేరిన జలాశయాల్లో సొంత ఖర్చుతో చేపపిల్లలను కొనుగోలు చేసి పోస్తున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి పెద్ద సైజు (ఫింగర్ లింగ్స్) చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదలడానికి మత్స్యకారులు సిద్ధం అవుతున్నారు. నగదు బదిలీ చేయాలి..టెండర్లు పిలవడం, చేపపిల్లల పంపిణీ ప్రతి ఏడాది ఆలస్యం అవుతోంది. దీనికి బదులు ప్రతీ మత్స్య సంఘాలకు చేపపిల్లలకు బదులుగా నగదు బదిలీ చేస్తే నాణ్యమైన చేపపిల్లలను కొనుగోలు చేసి సకాలంలో చెరువుల్లో పోసుకుంటాం. దీని వల్ల చేపల దిగుబడి కూడా అధికంగా పెరుగుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించాలి. – కొత్తగట్టు కోటేశ్వర్, ఊకల్ మత్స్యసంఘం అధ్యక్షుడుజిల్లాలో మొత్తం చెరువులు: 702మొత్తం చెరువుల నీటి విస్తీర్ణం: 12,910 హెక్టార్లు చెరువుల్లో వదలాల్సిన చేపపిల్లలు : 1.90 కోట్లు మత్స్య సంఘాలు : 184మత్స్య సంఘాల్లోని సభ్యులు: 15,741 మందిజిల్లా సమాచారం.. -
రుణాల కింద భరోసా డబ్బుల జమ
నర్సంపేట: రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడిన వెంటనే పలువురు బ్యాంకర్లు పంట రుణం బకాయిలతోపాటు ఇతర బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. దీంతో కొందరు రైతులు చేసేదేమి లేక అప్పుల కింద భరోసా డబ్బులు వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది మాత్రం పెట్టుబడికి ఇబ్బందిగా ఉందని, నగదు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రైతు భరోసా నిధులను పంట రుణాలకు జమ చేసుకోవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కొందరు బ్యాంకర్లు రైతులకు డబ్బులు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పెట్టుబడి రెండుసార్లు.. జిల్లాలో వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాలను విత్తారు. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పెట్టిన విత్తనాలు మొలకెత్తడం లేదు. మొలిసిన మొక్కలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. దీంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ వర్షాకాలంలో పెట్టుబడులు పెరిగిపోనున్నాయి. వీరందరికి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ఉపయోగంగా మారింది. బ్యాంకర్లు మాత్రం భరోసా నిధులను బాకీల కింద జమ చేసుకోవడంతో జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఆదేశించినా.. రైతులకు అందుతున్న రైతు భరోసా నిధులను బాకీల కింద జమ చేసుకోవద్దని వ్యవసాయ అధికారులతోపాటు జిల్లా అధికారులు బ్యాంకర్లకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో సమావేశాలు కూడా నిర్వహించారు. రైతు భరోసా నిధులను పంట రుణ బకాయిల కింద జమ చేసుకుంటే రైతులు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలో గ్రామాల వారీగా రైతులు, భరోసా నిధుల వివరాలు.. అధికారుల ఆదేశాలను పట్టించుకోని బ్యాంకర్లు పంటలకు పెట్టుబడి ఎలా అని రైతుల ఆందోళనఈ పక్క ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగ రైతు పేరు ధరావత్ రమేశ్. చెన్నారావుపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఈయనకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడాదికి ఎకరాకు రూ.5వేల చొప్పున ఐదు ఎకరాలకు రూ.25వేలు రైతుబంధు డబ్బులు పడేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.30 వేలు జమయ్యాయి. దివ్యాంగుల సంఘం తరఫున ఎస్బీఐలో రూ.లక్ష రుణం తీసుకున్నాడు. దీంతో గతేడాది రూ.30 వేలు, ఈ ఏడాది రూ.30 వేల రైతు భరోసా డబ్బులను రుణం కింద అధికారులు జమ చేసుకున్నారు. దీంతో పంటల పెట్టుబడికి అప్పులు తేవాల్సిన పరిస్థితి ఆయన ఏర్పడింది. ఈ పరిస్థితి రమేశ్ ఒక్కడిదే కాదు.. అనేక మంది రైతులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.మండలం గ్రామాలు రైతులు నగదు(రూ.కోట్లలో) నర్సంపేట 16 12,551 10.02 చెన్నారావుపేట 11 11,834 11.20 దుగ్గొండి 18 14,805 13.32 ఖానాపురం 51 8,962 9.09 నల్లబెల్లి 24 14,108 14.71 నెక్కొండ 18 15,377 15.27 గీసుకొండ 16 14,004 12.91 ఖిలా వరంగల్ 11 6,058 4.40 పర్వతగిరి 14 14,890 16.69 రాయపర్తి 18 2,00,80 24.58 సంగెం 17 15,519 15.37 వరంగల్ 8 2,421 1.50 వర్ధన్నపేట 12 14,575 17.40 మొత్తం 234 1,65,184 166.46 -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరా జన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అని లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని వివరించారు. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకులు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన.. -
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
వరంగల్ స్పోర్ట్స్: అంతర్జాతీయ ఒలింపిక్ డే ను పురస్కరించుకొని వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన రన్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద అసోసియేషన్ జిల్లా చైర్మన్ జంగా రాఘవరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఒలింపిక్ టార్చ్తో కాళోజీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ముగింపు స మావేశంలో జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తల్లి దండ్రులు తమ పిల్లలకు ఆస్తులకు బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు క్రీడల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంచాలని, దురదృష్టవశాత్తు అత్యధిక శాతం పాఠశాలలు, కళాశాలలకు కనీస మైదానాలు లేకపోవడం శోచనీయమన్నారు. మైదానాలున్న విద్యాసంస్థలకు మాత్రమే అనుమతిస్తూ వ్యాయామ ఉపాధ్యాయులను తప్పనిసరి నియమించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, స్వతహాగా క్రీడాకారుడైన సీఎం నేతృత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా క్రీడలు, యువజన అధికారి గుగులోత్ అశోక్కుమార్, వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అజీజ్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, శ్యామల పవన్కుమార్, డాక్టర్ పి.రమేశ్రెడ్డి, తోట శ్యాంప్రసాద్, మహ్మద్ కరీం, రామప్ప అకాడమీ చైర్మన్ చంద్రమోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు సడలించాలి
● టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ విద్యారణ్యపురి: టీచర్ల సర్దుబాటు నిబంధనలను సడలించడంతోపాటు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని యూనియన్ వరంగల్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు, పూర్వప్రాథమిక తరగతులు ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, అసంబద్ధంగా ఉన్న గురుకులాల పనివేళలను సవరించాలని పే ర్కొన్నారు. సమావేశంలో యూనియన్ బాధ్యులు తాటికాయల కుమార్, సుజనప్రసాద్రావు, ఎస్ఏ.రవూఫ్, పాక శ్రీనివాస్, నామోజు శ్రీనివాస్, విజయ్, కె.రమేశ్, గుండు కరుణాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పచ్చని ప్రకృతిని రక్షించాలి● జిల్లా సంక్షేమ అధికారి జయంతి కేయూ క్యాంపస్ : పచ్చని ప్రకృతిని రక్షించాలని జిల్లా సంక్షేమ అఽధికారి జయంతి అన్నా రు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్విని యోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంవారోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ మైదానంలో మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. టీజీ ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డ్రగ్స్ విషయంలో యువతలో సరైన అవగాహన పెరగాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఎకై ్సజ్ సీఐ తిరుపతి, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ స్వామి, అధ్యాపకురాలు నహేదా, నర్సింగ్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీపీఓ ఇన్చార్జ్ ప్రవీణ్, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, ఉమెన్ హబ్ కోఆర్డినేటర్ కల్యాణి, సఖీ అడ్మిన్ హైమావతి, నషా ముక్త్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను శిక్షించాలిహన్మకొండ: ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని స్వగృహంలో ఆదివారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రజలు భారీగా మద్దతు పలికి అధికారం ఇస్తే గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూలదోశారని ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉపయోగించుకొని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. రాజరిక వంశ పారంపర్య పాలనను చిరకాలం కొనసాగించడానికి, ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడం కోసం వేలాది మంది ఫోన్లను బీఆర్ఎస్ పాలకులు ట్యాప్ చేసి దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా ఎన్నికై న ప్రజాస్వామ్య ద్రోహులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, ప్రముఖ సామాజిక వేత్త బొమ్మినేని పాపిరెడ్డి, రాచకొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ
సంగెం: మండలంలోని కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించినట్లు హనుమకొండ డిపో మేనేజర్ ధరమ్సింగ్ తెలి పారు. ఆదివారం ఆయన ఎస్సై నరేశ్తో కలిసి కొత్తగూడెంలో బస్సును ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం రోజుకు రెండు ట్రిప్పులు నడుస్తుందన్నారు. వరంగల్, ఖిలావరంగల్, స్తంభంపల్లి, వెంకటాపూర్, కాట్రపల్లి, కుంటపల్లి, సంగెం, తిమ్మాపూర్, గాంధీనగర్, కొత్తగూడెం తదితర గ్రామాల ప్రజలకు బస్సు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఏసీపీ సురేందర్, పంచాయతీ కార్యదర్శి రంజిత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు జనగాం రమేశ్, జగన్నాథచారి, పాషా, రాంరెడ్డి, గాలి చేరాలు, ఎనబోతుల సదయ్య, సాంబయ్య, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. తండా అభివృద్ధికి కృషిచేయాలినర్సంపేట రూరల్: రాజకీయ పార్టీలకు అతీతంగా పుట్టి పెరిగిన తండా అభివృద్ధికి కృషిచేయాలని భూపాలపల్లి జిల్లా క్రైం డీఎస్పీ భూక్యా నారాయణ సూచించారు. నర్సంపేట మండలంలోని భోజ్యానాయక్తండాలో కోర్ కమిటీ (ఆత్మీయ సమ్మేళనం) సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బంజారా సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు తండా పండుగలను ఘనంగా జరుపుకోవాలన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా మఽధిర సీఐ సాగర్, మహబూబాబాద్ జిల్లా సీఐ శంకర్, హెడ్కానిస్టేబుల్ భూక్యా జంపయ్య, ఎల్ఎఐసీ బిజినెస్ అసోసియేట్ నాథం, టీచర్ ఆర్జ్య, హైదరాబాద్ పాలిటెక్నిక్ లెక్చరర్ అజ్మీరా శ్రీనివాస్, గ్రామానికి చెందిన 102 మంది ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారికి రూ.కోటితో రథం హన్మకొండ కల్చరల్ : కంచి కామాక్షి అమ్మవారి రథం మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి రూ.కోటి వ్యయంతో రథం తయారు చేయించడానికి ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం దేవాలయ కార్యాలయంలో వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకుడు శేషు పాల్గొన్నారు. అమ్మవారి గుడి చుట్టూ మాడవీధుల నిర్మాణం జరుగుతున్నందున ఇకపై అమ్మవారికి నిర్వహించే వాహన, రథసేవలు మాడవీధుల గుండానే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం టేకు కర్రతో రథం తయారు చేయించడానికి మండలి తీర్మానించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతికి కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి మహాపూజ అనంతరం భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేయాలని, ఇందుకు శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి దాతలు విరాళం అందించాలని విజ్ఞప్తి చేశారు. అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు, పార్నంది నరసింహమూర్తి పాల్గొన్నారు. నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రజల నుంచి రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరా జన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అని లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని వివరించారు. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకులు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన.. -
క్లైమాక్స్కు ‘దత్తత దందా’
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ విచారణ క్లైమాక్స్కు చేరుకుంది. ఇటు పోలీసులు, అటు అధికారులు వేర్వేరుగా చేసిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గతంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా సంక్షేమ విభాగంలోని వీహబ్లో ఉద్యోగం పొంది ఏడాదికిపైగా విధులు నిర్వర్తించిన సిక్కుల సుజాతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగానే దత్తత వ్యవహారంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో సంబంధమున్న సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలకు అవకాశముంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారే, కొన్ని నెలల క్రితం ఓ దత్తత విషయంలో నిబంధనలు అతిక్రమించి మెమో అందుకున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ‘మంత్రి’ దగ్గరికి వెళ్లి జిల్లా పాలనాధికారిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం పోకుండా చూసుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మరోమారు సదరు మంత్రితోపాటు ఓ ఎమ్మెల్యే నుంచి కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి ఈ విచారణను నీరుగార్చేలా చేశారనే టాక్ ఉంది. ఈ కేసు విషయంలో కలెక్టర్ సత్యశారద పారదర్శక విచారణ నివేదిక తెప్పించుకుంటున్నా.. ఆలోపే బ్రేక్ వేయాలనుకుంటుండడం గమనార్హం. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ దందాలో 8 మందిని పోలీసులు విచారించారు. అసలే పాఠశాల లేని, అది కూడా నర్సంపేట కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు రూపొందించడంతో విస్మయం చెందారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈమెయిల్ ఇవ్వడంపై అనుమానాలు.. నకిలీ సర్టిఫికెట్ల దందాపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టరేట్ కార్యాలయం నుంచి విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని వచ్చిన సంబంధిత విభాగాధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారా నిబంధనల ప్రకారం దత్తత కోరుకునే దంపతుల దరఖాస్తు సమయంలో వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ మెయిల్ ఐడీ కూడా ఇవ్వొచ్చు. అయితే వీరు మాత్రం పాప రావడానికి ఎంత వరుసలో ఉన్నాం, ఇంకెంత మంది ముందున్నారు, పాప రెఫరల్ వచ్చే సమాచారం కోసం సదరు అధికారితోపాటు అప్పుడు ఈ విభాగంలో పనిచేసే ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ వ్యక్తిగత ‘ఈ–మెయిల్స్’ ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కారా నుంచి వచ్చే సమాచారం తమ మెయిల్కు రాగానే మీకు పాప మరో వారం రోజల్లో వస్తుంది, మాకేం చేస్తారనే మాటమంతీ జరిగి ఉండొచ్చని విచారణ చేసిన పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే, విచారణ జరుగుతుండగానే బాలరక్షా భవన్లో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏడు నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట నుంచి రావడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు బలపడేలా చేసింది. గతంలోనే చైల్డ్ హెల్ప్లైన్లో నకిలీ అనుభవ సర్టిఫికెట్ ఇచ్చి అర్హత జాబితాలో ఎక్కడో మూలకు ఉన్నా కూడా అక్కడి అధికారుల అండదండలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి. త్వరలో కలెక్టర్కు నివేదిక.. దత్తత దందాపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. ఈ నివేదిక ఒకట్రెండు రోజుల్లో కలెక్టర్ వద్దకు చేరుతుంది. అలాగే, బాలరక్షాభవన్లో చైల్డ్ హెల్ప్లైన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి రాజీనామా అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాకే తదుపరి నిర్ణయం ఉంటుంది. – రాజమణి, వరంగల్ జిల్లా సంక్షేమ విభాగాధికారి 8 మందిని విచారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అసలు లేని పాఠశాల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లపై విస్మయం ఓవైపు విచారణ.. మరోవైపు ఓ ఉద్యోగి రాజీనామాతో అనుమానాలు -
ఆర్టీసీ మహాసభను జయప్రదం చేయాలి
హన్మకొండ: ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాసభను జయప్రదం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ అధ్యక్షుడు గొలనుకొండ వేణు, కార్యదర్శి మాదారపు సాంబయ్య పిలుపునిచ్చారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్లను హనుమకొండలోని వరంగల్ –1, వరంగల్ –2 డిపోల వద్ద సంఘం నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24న బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ జరుగనుందని చెప్పారు. వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బీసీ ఉద్యోగులందరూ తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి శ్రీనివాస్, వరంగల్ –1 డిపో అధ్యక్షుడు దుంపేటి యాదగిరి, సెక్రటరీ పోతరాజు రమేష్, వరంగల్ –2 డిపో అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి శ్రీధర్ ఆర్టీసీ బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)లో ఇంజనీరింగ్ విభా గం కొందరు అధికారులు, కాంట్రాక్టర్లకు కల్పతరువుగా మారింది. సాధారణంగా ప్రభుత్వ ఖజానాకు మేలు జరిగేలా పోటీ పద్ధతిన తక్కువ కోట్ చేసి టెండర్లు వేసేలా చూడాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లను సిండికేట్ చేసి ఎక్సెస్ కోట్ చేసి టెండర్లు వేయిస్తున్నారు. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ చక్రం తిప్పుతూ తమకు అనుకూలమైన వారికి పనులు దక్కేలా చూస్తున్నారు. సిండికేట్గా మారిన కాంట్రాక్టర్లు పనులు పంచుకుని ప్లాన్ ప్రకారం టెండర్లు వేస్తుండగా.. కీలక ప్రజాప్రతినిధి, కొందరు కార్పొరేటర్ల సిఫారసుల మేరకు ఆ పనులు దక్కేలా అధికారులు పావులు కదుపుతున్నారు. తప్పిదారి ఇతరులెవరైనా టెండర్లు వేస్తే.. టెండర్లు తెరిచింది మొదలు అగ్రిమెంట్ వరకు చుక్కలు చూపిస్తూ తప్పుకునేలా చేస్తున్నారు. ఇదే పద్ధతిన ఆరు నెలల్లో సుమారు రూ.210 కోట్లకు పైగా విలువ చేసే పనుల టెండర్ల ఖరారు జరిగిందని ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. పనుల వివరాలపై అంతా గోప్యం.. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వివిధ గ్రాంట్ల కింద అభివృద్ధి పనులకు ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలుస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో సుమారు రూ.210 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారైనట్లు బల్దియాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు రూ.68 కోట్ల విలువైన 75 పనులకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్ 5 నుంచి 12 వరకు రూ.28 కోట్లతో 32 పనులకు టెండర్లు జరిగాయి. మే 27 నుంచి ఈనెల 11 వరకు సుమారు రూ.12.15 కోట్ల విలువైన 12 పనులకు బల్దియా ఇంజనీరింగ్ విభాగం టెండర్లు నిర్వహించింది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లే అయినప్పటికీ కమీషన్లకు కక్కుర్తిపడి కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు సాంకేతికంగా సహకరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. కాగా ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ఖరారు, పనులు పొందిన కాంట్రాక్టర్, తిరస్కరణకు గురైన కాంట్రాక్టర్ల వివరాలు, పనుల నిర్వహణ, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన సమాచారం విషయంలో గోప్యతను పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవే అంశాలను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్కు చేసిన ఫిర్యాదులో పేర్కొనడం బల్దియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. న్యూస్రీల్ప్రతీ పనికి ఓ రేటు.. భారీగా కమీషన్కొందరు ఇంజనీర్లు ప్రతీ పనికి ఓ రేటును నిర్ణయిస్తుండగా.. ఆ మేరకు కొందరు కాంట్రాక్టర్లు చెల్లించి ఏ పనులైనా టెండర్ల ద్వారా దక్కించుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఇది రెండు రకాలుగా సాగుతుండగా.. మిగిలిన కాంట్రాక్టర్లందరినీ పక్కనపెట్టి మంచి ధరకు కాంట్రాక్టును అప్పగిస్తే సదరు ఇంజనీర్కు 10–20 శాతం, అందరితో పోటీపడి టెండరు దక్కించుకుంటే వేర్వేరు స్థాయిల్లోని ఇంజనీర్లు, ఆడిట్ అధికారులకు వేర్వేరు శాతాల్లో కమీషన్లు ముట్టజెప్పుతున్నారట. సహాయ ఇంజనీరుకు 3–4, డిప్యూటీ ఈఈకి 2–3, ఈఈకి 1–3, హెచ్డీకి 0.5, డీఓ(డ్రాఫ్టింగ్ ఆఫీసర్) 0.5, ఆడిట్లో 2, చెక్ సెక్షన్లో 2–4, ఎగ్జామినర్కు 1–2 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వీరంతా కలిసి కొంత మొత్తాన్ని ప్రతినెలా ఉన్నతాధికారులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. కాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో కొందరు ఏళ్ల తరబడిగా తిష్టవేసి అక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇదివరకే ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉన్నతాధికారులు ఏ మేరకు స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు..! ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో ‘సిండికేట్’ అభివృద్ధి పనులకు రాజకీయ రంగు అనుకున్నోళ్లకే పనులు వచ్చేలా సిఫారసులు జీడబ్ల్యూఎంసీ వ్యవహారంపై ‘విజిలెన్స్’కు ఫిర్యాదులు -
క్లైమాక్స్కు ‘దత్తత దందా’
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ విచారణ క్లైౖమాక్స్కు చేరుకుంది. ఇటు పోలీసులు, అటు అధికారులు వేర్వేరుగా చేసిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గతంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా సంక్షేమ విభాగంలోని వీహబ్లో ఉద్యోగం పొంది ఏడాదికిపైగా విధులు నిర్వర్తించిన సిక్కుల సుజాతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగానే దత్తత వ్యవహారంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో సంబంధమున్న సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలకు అవకాశముంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారే, కొన్ని నెలల క్రితం ఓ దత్తత విషయంలో నిబంధనలు అతిక్రమించి మెమో అందుకున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ‘మంత్రి’ దగ్గరికి వెళ్లి జిల్లా పాలనాధికారిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం పోకుండా చూసుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మరోమారు సదరు మంత్రితోపాటు ఓ ఎమ్మెల్యే నుంచి కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి ఈ విచారణను నీరుగార్చేలా చేశారనే టాక్ ఉంది. ఈ కేసు విషయంలో కలెక్టర్ సత్యశారద పారదర్శక విచారణ నివేదిక తెప్పించుకుంటున్నా.. ఆలోపే బ్రేక్ వేయాలకోవడం గమనార్హం. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది అసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ దందాలో 8 మందిని పోలీసులు విచారించారు. అసలే పాఠశాల లేని, అది కూడా నర్సంపేట కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు రూపొందించడంతో విస్మయం చెందారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈమెయిల్ ఇవ్వడంపై అనుమానాలు.. నకిలీ సర్టిఫికెట్ల దందాపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టరేట్ కార్యాలయం నుంచి విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని వచ్చిన సంబంధిత విభాగాధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారా నిబంధనల ప్రకారం దత్తత కోరుకునే దంపతుల దరఖాస్తు సమయంలో వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ మెయిల్ ఐడీ కూడా ఇవ్వొచ్చు. అయితే వీరు మాత్రం పాప రావడానికి ఎంత వరుసలో ఉన్నాం, ఇంకెంత మంది ముందున్నారు, పాప రెఫరల్ వచ్చే సమాచారం కోసం సదరు అధికారితోపాటు అప్పుడు ఈ విభాగంలో పనిచేసే ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ వ్యక్తిగత శ్రీఈ–మెయిల్స్శ్రీ ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కారా నుంచి వచ్చే సమాచారం తమ మెయిల్కు రాగానే మీకు పాప మరో వారం రోజల్లో వస్తుంది, మాకేం చేస్తారనే మాటమంతీ జరిగి ఉండొచ్చని విచారణ చేసిన పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే, విచారణ జరుగుతుండగానే బాలరక్షా భవన్లో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏడు నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట నుంచి రావడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు బలపడేలా చేసింది. గతంలోనే చైల్డ్ హెల్ప్లైన్లో నకిలీ అనుభవ సర్టిఫికెట్ ఇచ్చి అర్హత జాబితాలో ఎక్కడో మూలకు ఉన్నా కూడా అక్కడి అధికారుల అండదండలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి. త్వరలో కలెక్టర్కు నివేదిక.. దత్తత దందాపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. ఈ నివేదిక ఒకటిరెండు రోజుల్లో కలెక్టర్ వద్దకు చేరుతుంది. అలాగే, బాలరక్షాభవన్లో చైల్డ్ హెల్ప్లైన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి రాజీనామా అంశాన్ని కలెక్ట ర్ దృష్టికి తీసుకెళ్లాకే తదుపరి నిర్ణయం ఉంటుంది. – రాజమణి, జిల్లా సంక్షేమ విభాగాధికారి 8 మందిని విచారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అసలు లేని పాఠశాల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లపై విస్మయం ఓవైపు విచారణ.. మరోవైపు ఓ ఉద్యోగి రాజీనామాతో అనుమానాలు -
భద్రకాళి అమ్మవారికి రూ.కోటితో రథం
హన్మకొండ కల్చరల్ : కంచి కామాక్షి అమ్మవారి రథం మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి రూ.కోటి వ్యయంతో రథం తయారు చేయించడానికి ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం దేవాలయ కార్యాలయంలో వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకులు శేషు పాల్గొన్నారు. అమ్మవారి గుడి చుట్టూ మాడవీధుల నిర్మాణం జరుగుతున్నందున ఇకపై అమ్మవారికి నిర్వహించే వాహన, రథసేవలు మాడవీధుల గుండానే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం టేకు కర్రతో రథం తయారు చేయించడానికి మండలి తీర్మానించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతికి కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి మహాపూజ అనంతరం భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేయాలని, ఇందుకు శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి దాతలు విరాళం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు, పార్నంది నరసింహమూర్తి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానం 26 నుంచి శాకంబరీ ఉత్సవాలపై సమావేశం -
ఉద్రిక్తత.. ఉత్కంఠ
హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకొచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకుల ఆందోళన, పరామర్శలతో సుబేదారి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఆయనకు బెయిల్రావడంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. – వరంగల్ క్రైం/కాజీపేట రూరల్ ఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్ శంషాబాద్లో అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు.. బీఆర్ఎస్, విద్యార్థి నేతల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం బెయిల్ రావడంతో కార్యకర్తల ఆనందోత్సాహం – 8లోu -
డయేరియా మరణాలను అరికట్టాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: డయేరియా మరణాలను అరికట్టాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఫోర్స్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా నివారణకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున గ్రామాల్లో క్లోరినేషన్ చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్, డీడబ్ల్యూఓ రాజమణి, సుజన్తేజ, భవాని, అనిల్కుమార్ పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి ముందస్తుగా వరి నార్లు పోసుకునేందుకు రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి, పత్తి కొనుగోళ్లలో ఈ టోకెన్ సిస్టం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పత్తి, మిరప పంటల దిగుబడి, మార్కెటింగ్లో నాణ్యత పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. -
పథకాలు పటిష్టంగా అమలు చేయాలి
హన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ చైర్పర్సన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు రైతులకు అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, క్యాన్సర్ స్క్రీనింగ్, పీఎంఆర్ఎఫ్ ప్రయోజనాల అమలుపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’పై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, బాల్యవివాహాలు నివారించేలా గ్రామాల్ని తీర్చిదిద్దాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. ఐసీడీఎస్ ద్వారా బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు. దిశ కమిటీ సమావేశానికి సంబంధించి వచ్చే విడతలో రైల్వే, దేవాదాయ, పర్యాటక, యూనివర్సిటీ అధికారులు కూడా పాల్గొనాలని ఎంపీ సూచించారు. అన్ని శాఖలు తమ తమ పథకాల అమలు వివరాలతో హాజరుకావాలన్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని, పల్లె, బస్తీ దవాఖానల నిర్మాణంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం చూడాలన్నారు. శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించాలని, ఆశ వర్కర్ల ఖాళీల భర్తీకి జిల్లా స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గ్రేటర్ అభివృద్ధి వివరాలు వెల్లడించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో ఉండాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కమిటీ సభ్యులు బండ రామలీల, డీఆర్డీఓ పీడీ శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య ఇతర శాఖల అధిపతులు పాల్గొన్నారు. జిల్లాను అగ్రభాగంలో నిలపాలి ‘దిశ’ సమావేశంలో ఎంపీ కడియం కావ్య -
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
ఏటూరునాగారం అభయారణ్యంలోని కొండేటివాగుమేడారం–తాడ్వాయి మధ్యలో ఇటీవల కనిపించిన అడవి దున్న (ఫైల్) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్ లైఫ్ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. 17 కిలోమీటర్లు దారి.. అడవులను జంగిల్ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్ఎస్తాడ్వాయి హట్స్ సమీపం నుంచి కాటాపూర్ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్ కాజ్వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేలా.. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్ఎస్ తాడ్వాయి హట్స్లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్ఎస్ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్ వరకు జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.రెండు నెలల్లో అందుబాటులోకి.. ఎస్ఎస్తాడ్వాయిలోని జంగిల్ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. – రమేశ్, ఎఫ్డీఓ, ఏటూరునాగారంజంగిల్ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డున్యూస్రీల్తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణంబోన్ల నడుమ జంతువుల్ని.. డెన్ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను.. ఆక్వేరియంలో చేపల్ని జూ పార్క్లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెట్టే లేడికూనల్ని చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్లైఫ్ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్ఎస్తాడ్వాయి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ -
వాగ్దానాలు నెరవేర్చాలి..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి.. నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వకుంటే సర్కారు మెడలు వంచుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివా రం వరంగల్ ఉర్సుగుట్ట వద్ద పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యదర్శి సీహెచ్.రంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధంపై మాట్లాడుతూ.. అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలస్తీనాను దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఈ చర్య ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నద ని చెప్పారు. సమావేశంలో నాయకులు జి.నాగయ్య, బాబు, రత్నమాల, ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కుమారస్వామి, సాంబయ్య, శ్రీధర్, మధుకర్, ప్రశాంత్, వలదాసు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ తనిఖీ వరంగల్ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలోని క్వాలిటీ కంట్రో ల్ ల్యాబ్ను గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం 31వ డివిజన్ గాయత్రి కాలనీలో నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించారు. వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ను తనిఖీ చేశారు. ఆయా విభాగాల ఫైళ్లను పరిశీలించి, ఉద్యోగులు, అధికారుల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
పర్వతగిరి: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వరంగల్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బి.వెంకటచంద్రప్రసన్న సూచించారు. ఈ మేరకు మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రిన్సిపాల్ పి.అపర్ణ ఆధ్వర్యంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరిచి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 (ఏ) ప్రకారం ఉచిత న్యాయ సలహాల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. సదస్సులో చీఫ్ లీగల్ అడ్వైజర్ సురేశ్, పర్వతగిరి సీఐ బి.రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వనమహోత్సవానికి మొక్కలను సిద్ధం చేయాలినెక్కొండ: వర్షాలు కురవగానే చేపట్టనున్న 11వ విడత వనమహోత్సవానికి అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆదేశించారు. నెక్కొండ, పనికర గ్రామాలను శనివారం ఆమె సందర్శించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నెక్కొండ గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. ఆమె వెంట ఎంపీఓ దయాకర్, పంచాయతీ కార్యదర్శులు సదానందం, నరేశ్ ఉన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలినర్సంపేట: ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. నర్సంపేట పట్టణం అంగడి బజారులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్వెండర్స్ ఫుడ్ ఫెస్టివల్ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రకాల తిను బండారాలను రుచి చూశారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, నాయకులు పాల్గొన్నారు. కుంటలో పశువులకాపరి గల్లంతుసంగెం: ప్రమాదవశాత్తు కుంటలో పడి పశువులకాపరి గల్లంతైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలం రామారం గ్రామానికి చెందిన కొంగరి వెంకటయ్య (70) ఇరవై ఏళ్ల క్రితం మండలంలోని ఆశాలపల్లి గ్రామానికి వచ్చి పశువులను కాస్తున్నాడు. భార్య మల్లమ్మతో కలిసి ముగ్గురు కూతుళ్లు నాగలక్ష్మి, రేణుక, రజితను పెంచి పెళ్లి చేశాడు. గ్రామానికి చెందిన బొల్లబోయిన స్వామి గేదెలను మేపడానికి వెళ్లిన వెంకటయ్య గ్రామానికి చెందిన నల్లకుంటలో ప్రమాదవశాత్తుపడి గల్లంతయ్యాడు. కాగా, మొరం అక్రమ తవ్వకాలతో కుంటలో సుమారు 30 అడుగుల మేర గుంతలు ఏర్పడి నీటితో నిండాయి. జాలర్లు వలలతో ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. రెండు ట్రాక్టర్ మోటార్ల ద్వారా నీటిని తోడుతూ వెంకటయ్య ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.153.47 కోట్లు జమఖిలా వరంగల్: రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమచేస్తోందని కలెక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1,52,975 మంది రైతులకు రూ.153.47 కోట్ల పెట్టుబడి సాయం అందించిందని ఆమె తెలిపారు. -
ఆలయ వ్యవహారాలు ధర్మబద్ధంగా నిర్వహించాలి
హన్మకొండ కల్చరల్: ఆలయ వ్యవహారాలు ధర్మబద్ధంగా నిర్వహించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సూచించారు. వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఈఓ శేషుభారతి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం మండలి చైర్మన్గా, తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీశ్, మోత్కూరి మ యూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు సభ్యులుగా, దేవాలయ ముఖ్చ అర్చకుడు పార్నంది నరసింహమూర్తి ఎక్స్–అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పరిశీలకులు అద్దంకి విజయ్కుమార్, మట్వాడ సీఐ గోపి, సిబ్బంది, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
డయేరియా మరణాలు అరికట్టాలి
న్యూశాయంపేట: డయేరియా మరణాలను అరికట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఫోర్స్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డయేరియా నివారణకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున గ్రామాల్లో క్లోరినేషన్ చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజ య్కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, వర్ధన్నపేట మున్సి పల్ కమిషనర్ సుధీర్, డీడబ్ల్యూఓ రాజమణి, సుజన్తేజ, భవాని, అనిల్కుమార్ పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి ముందస్తుగా వరి నార్లు పోసుకునేందుకు రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి, పత్తి కొనుగోళ్లలో ఈ టోకెన్ సిస్టం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పత్తి, మిరప పంటల దిగుబడి, మార్కెటింగ్లో నాణ్యత పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంటమార్పిడి, కూరగాయల సాగు, కందులు ఇతర పంటలు వేసేందుకు శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించాలని పేరొన్నారు. సమావేశంలో ఉద్యాన అధికారి అనసూయ, మార్కెటింగ్ అధికారి సురేఖ, సహకారశాఖ అధికారి నీరజ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025ఏటూరునాగారం అభయారణ్యంలోని కొండేటివాగుమేడారం–తాడ్వాయి మధ్యలో ఇటీవల కనిపించిన అడవి దున్న (ఫైల్) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్ లైఫ్ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. 17 కిలోమీటర్లు దారి.. అడవులను జంగిల్ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్ఎస్తాడ్వాయి హట్స్ సమీపం నుంచి కాటాపూర్ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్ కాజ్వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేలా.. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్ఎస్ తాడ్వాయి హట్స్లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్ఎస్ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్ వరకు జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.రెండు నెలల్లో అందుబాటులోకి.. ఎస్ఎస్తాడ్వాయిలోని జంగిల్ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. – రమేశ్, ఎఫ్డీఓ, ఏటూరునాగారంజంగిల్ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డున్యూస్రీల్తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణంబోన్ల నడుమ జంతువుల్ని.. డెన్ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను.. అక్వేరియంలో చేపల్ని జూ పార్క్లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెత్తే లేడికూనల్ని చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్లైఫ్ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్ఎస్తాడ్వాయి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ -
ఆధునిక ప్రపంచానికి యోగా ఓ వరం
ఖిలా వరంగల్: ఆధునిక ప్రపంచానికి అందించిన మహాద్భుతమే యోగా అని, చారిత్రాత్మక ప్రదేశంలో యోగా చేయడం సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తుందని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని నాలుగు కీర్తితోరణాల మధ్య శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్, పురా వస్తుశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన కలెక్టర్ సత్యశారద, పద్మశ్రీ అవార్డు గ్రహీత సో మ్లానాయక్ జ్యోతి ప్రజ్వాలన చేసి యోగా ప్రారంభించారు. ఈసందర్భంగా 1,000 మంది సాధకులు, అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ తనువు, మనస్సు ఆత్మను ఏకం చేసే సా ధనమే యోగా అన్నారు. కార్యక్రమంలో కా ర్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, పోశాల పద్మ, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ అనసూయ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆయుష్ జిల్లా ఇన్చార్జ్ మైదం రాజు, డీపీఆర్ఓ అయూబ్ అలీ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, సీపీఓ గోవిందరాజన్, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్లు బండి నాగేశ్వర్రావు, ఫణికుమార్, యోగా గురువు అమృతవల్లి, నోడల్ ఆఫీసర్ రాజేందర్, పురావస్తుశాఖ అధికారి కృష్ణారెడ్డి, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద – మరిన్ని ఫొటోలు 9లోu -
కారు ఢీకొని రైతు మృతి
గీసుకొండ : మోపెడ్పై పొలం వద్దకు వెళ్తున్న రైతును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దస్రు తండాకు చెందిన రైతు ఆంగోత్ దస్రు (60) శనివారం మధ్యాహ్నం తన మోపెడ్ (వాహనం)పై వెళ్తున్నాడు. వరంగల్–నర్సంపేట రహదారిపై మూల ములుపు తిరిగే క్రమంలో వెనక నుంచి (వరంగల్ వైపు) అతివేగంగా వచ్చిన కారు దస్రు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అతడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే వేగంతో కారు మోపెడ్ను ముందుకు తోసుకుంటూ వంద మీటర్ల దూరం వరకు వెళ్లగా మంటలు చెలరేగి మోపెడ్ దగ్ధమైంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని గీసుకొండ ఎస్సైలు కుమార్, ప్రశాంత్ సందర్శించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుమార్ తెలిపారు. -
వెలిశాల.. శోకసంద్రం
రవి అంతిమ యాత్రలో పాల్గొన్న అభిమానులు టేకుమట్ల: మూడు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియలు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో శుక్రవారం ముగిశాయి. రంపచోడవరంలో గురువారం రాత్రి పోస్టుమార్టం అనంతరం రవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించగా శుక్రవారం ఉదయం 8:30 గంటలకు వెలిశాలకు చేరుకుంది. ఉద్యమ గీతాలతో కవులు, కళాకారులు, ఉద్యమకారులు ఉద్యమాల బిడ్డా, నిను మరవదు ఈ గడ్డ అంటూ నివాళులర్పించారు. కాగా, రవి మృతదేహాన్ని వెలిశాలకు తీసుకొస్తున్న సమయంలో చిట్యాల, చల్లగరిగలో వాహనాన్ని ఆపి పలువురు నివాళులర్పించారు. ఎరుపెక్కిన వెలిశాల.. గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పెద్దఎత్తున ఎర్రజెండాలు, రవి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన పార్థివ దేహం వెలిశాలకు చేరుకోగానే ఉద్యమ గీతాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన అంతిమయాత్ర కూతవేటు దూరానికే సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఉద్యమ నినాదాలు, గీతాలు, డప్పు కళాకారుల దరువులకు వెలిశాల దద్ధరిల్లింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప ఉద్యమ గీతాలు, నృత్యాలతో విప్లవానికి చావు లేదనే విధంగా ఆడి పాడారు. అంతిమ యాత్ర ప్రారంభం నుంచి చివరి అంకం వరకు ఉద్యమ గీతాలు, నృత్యాలతో హోరెత్తించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు గాజర్ల రవికి అంతిమ వీడ్కోలు తెలిపేందుకు మాజీ మావోయిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, కవులు, గాయకులు, ప్రజలు, అభిమానులు తరలిరావడంతో వెలిశాల జన సంద్రమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షా కనుసన్నల్లో పని చేస్తున్నాడని భారత్ బచావో అధ్యక్షుడు, తెలంగాణ సిద్ధాంతకర్త గాదె ఇన్నయ్య, విమలక్క మండిపడ్డారు. హక్కులు సాధించుకోవాలంటే పోరాడాలని అమ్మే నేర్పిందని గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అన్నారు. కష్టమున్న చోట ఎదురించి పోరాడమని వెలిశాల చెప్పిందని అన్నారు. దొరలు, పెత్తందార్లు చేసే అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం గాజర్ల కుటుంబం పోరాడిందని.. ఆ క్రమంలో పోలీసులు పెట్టిన చిత్రహింసలు వెలిశాల ప్రజలకు తెలుసన్నారు. చివరికి అన్నయ్య రవన్న మృతదేహాన్ని సైతం రంపచోడవరం ఆస్పత్రిలో చూపించకుంటే పోలీసులను ప్రశ్నిస్తేనే చూపించారని అన్నారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న.. గాజర్ల రవి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు వేలాది మంది నడుమ జరిగిన అంతిమయాత్ర అనంతరం రవి చితికి సోదరుడు అశోక్ నిప్పంటించారు. మావోయిస్టు నేత గాజర్ల రవికి కన్నీటి వీడ్కోలు ఎర్రజెండాలతో ఎరుపెక్కిన గ్రామం తరలివచ్చిన ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు -
కనీస ప్రమాణాలు పాటించాలి..
హన్మకొండ అర్బన్: జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు కనీస ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరెట్లో జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు ఆశ్రయం పొందుతున్న బాల బాలికలకు వసతి, భోజనం, విద్యా, వైద్యంతో పాటు సరైన వసతులు కల్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోబోయే చర్యల గురించి వివిధ శాఖల టోల్ ఫ్రీ నంబర్లను డిస్ప్లే చేయాలని సూచించారు. ఈనెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్, ఆరుగురు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకావాలని అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, బాల రక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్.అవంతి, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం.మౌనిక, మేనేజర్ ఎ.మాధవి, జిల్లా ఇన్స్పెక్షన్న్ కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, సిస్టర్ జెస్సీ సిరియాక్, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి 23 నుంచి బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ -
ప్రజలకు నిజాయితీగా సేవలందించాలి..
వరంగల్ క్రైం: ప్రజలకు నిజాయితీగా సేవలందించడం ద్వారా పోలీసుల పట్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన తోట వీరస్వామి, పోచయ్య, ఎం.రమేశ్, ఎం.సుధాకర్, పి.రమేశ్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈసందర్భంగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను సీపీ అలంకరించి అభినందించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా, నమ్మకాన్ని కలిగించడంతో పాటు, నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని సూచించారు. భద్రకాళి బోనాలు వాయిదాప్రకటించిన మంత్రి కొండా సురేఖ హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఈనెల 22న ప్రతిష్టాత్మకంగా బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల భద్రకాళి బోనాలకు సంబంధించి కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, అమ్మవారికి మాంసాహార బోనాలు సమర్పించనున్నారని పలు మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచురితమైన దృష్ట్యా ఈకార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలనుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టి కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టిస్తారమోనని, కార్యక్రమంలో అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారనే అనుమానంతో బోనాల నిర్వహణ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం, వేదపండితుల సలహా మేరకు ప్రజాప్రతినిధుల సూచనల ఆధారంగా తగిన సమయంలో బోనాలను వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. కాగా.. ఈవిషయమై దేవాలయ ఈఓ శేషుభారతిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. మంత్రి ఆదేశం మేరకు బోనాల ఏర్పాట్లు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కాలేజీ వార్షిక నివేదిక విడుదల కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి సంబంధించి 2024–2025 వార్షిక నివేదికను కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, పీఆర్ఓ వి.హరికుమార్, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకుడు డాక్టర్ ఆర్.ఆదిరెడ్డి వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎంహన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు.. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 21న (శనివారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. శనివారం ఉద యం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు, సలహాలు, సూచనలందించాలని కోరారు. రుద్రేశ్వరుడిని దర్శించుకున్న పద్మశ్రీ సోమలాల్ నాయక్హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయాన్ని శుక్రవారం పద్మశ్రీ సోమలాల్ నాయక్ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కాగా.. శనివారం దేవాలయంలో జిల్లా యంత్రాంగం నిర్వహించే యోగా వేడుకలకు సోమలాల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. -
అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
న్యూశాయంపేట: ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి అధికారులు సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని, కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తమదని వరంగల్ జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, కోచైర్పర్సన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో ఎంపీ పోరిక బలరాంనాయక్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ కేంద్రం నిధులతో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాలో ఆస్పత్రుల పనితీరును మెరుగుపరచాలని సూచించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గాల వారీగా పరిష్కరించిన సమస్యలను అధికారులు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. దిశ చైర్మన్ పోరిక బలరాంనాయక్, కో–చైర్పర్సన్ కడియం కావ్య వరంగల్ జిల్లా అభివృద్ధి మానిటరింగ్ సమావేశం -
యోగాతో మానసిక ప్రశాంతత
వరంగల్ లీగల్: ప్రతీ రోజు యోగా సాధన చేయడం వల్ల శారీరక ఉత్తేజంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ప్రాంగణంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో యోగా మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా నిర్మలా గీతాంబతో పాటు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు శోభ బృందం ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు యోగాసనాలు వేసి, శ్వాస పద్ధతులు నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, జనరల్ సెక్రటరీ రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్లీజ్ మేడం..
పరకాలలో పనిచేయలేకపోతున్నా..!సెలవుపై వెళ్లిన కమిషనర్ వెంకటేష్ ఫిబ్రవరిలో బాధ్యతల స్వీకరణ.. గత ఫిబ్రవరిలో పరకాల మున్సిపల్ కమిషనర్గా సీహెచ్.వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వివిధ అభివృద్ధి పనుల్లో రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల అతిజోక్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే విధంగా అధికార పార్టీకి చెందిన నాయకులు చిన్న చిన్న విషయాలను సైతం స్థానిక ముఖ్యప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లడం, కార్యాలయంలో కొందరు ఉద్యోగుల ప్రవర్తన ఇబ్బందికరంగా మారి ఉన్నతాధికారులకు సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి న పరిస్థితులు ఎదుర్కొన్నారు. వీటిపై ఆయన కొంత మనస్తాపం చెందినట్లు సమాచారం. ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో కలెక్టర్ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన కోరిక మేరకు దీర్ఘకాలిక సెలవులకు కలెక్టర్ అనుమతి ఇవ్వడంతో ఇన్చార్జ్ కమిషనర్గా టౌన్ప్లానింగ్ అధికారి సుష్మకు శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు తనసెల్ఫోన్ సిమ్ను కూడా అందజేసి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా మరికొద్ది రోజుల్లో వార్డు అధికారులంతా తమ సొంత శాఖకు వెళ్లిపోనున్న దృష్ట్యా రెండోసారి ఇన్చార్జ్ కమినర్గా బాధ్యతలు చేపట్టిన సుష్మకు ఓ సవాల్ అనే చెప్పొచ్చు.పరకాల: ఒకవైపు ఉన్నతాధికారుల ఒత్తిళ్లు.. మరోవైపు స్థానిక రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అతిజోక్యం వెరసి పరకాల మున్సిపల్ కమిషనర్ పోస్టు ఓ ముళ్ల కిరీటమైంది. ఇక్కడ పనిచేయడమంటేనే అధికారులకు ఓ సవాల్గా మారింది. పదేళ్ల పరకాల మున్సిపల్ చరిత్రలో 12 మంది కమిషనర్లు మారడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. రెండు వారాల క్రితమే సెలవుపై వెళ్లి వచ్చిన పరకాల మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేష్ మళ్లీ సెలవుపై వెళ్తూ తన బాధ్యతలను టౌన్ప్లానింగ్ అధికారి సుష్మకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు శుక్రవారం ఆయన.. కలెక్టర్ స్నేహ శబరీష్ను స్వయంగా కలిసి స్థానికుడిగా తాను పరకాల మున్సిపల్ను కోరుకుని తప్పిదం చేసినట్లు అయ్యిందని, పూర్తిస్థాయిలో తన ఉద్యోగానికి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ఇక్కడినుంచి బదిలీ చేయాలని కోరినట్లు తెలిసింది. కలెక్టర్ ఎదుట మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గోడు దీర్ఘకాలిక సెలవుకు అంగీకరించిన కలెక్టర్ ఇన్చార్జ్ కమిషనర్గా టీపీఓ సుష్మకు బాధ్యతలు కమిషనర్లపై రాజకీయ పెత్తనం.. ప్రజల్లో విమర్శలు -
చిట్టి చేతులు.. గట్టి సంకల్పం
విద్యారణ్యపురి: ‘ఆధునిక సమాజంలో అభివృద్ధి పేరిట మానవాళి చర్యలతో పర్యావరణానికి నష్టం కలుగుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవాళిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. జీవవైవిద్యానికి కూడా ముప్పువాటిల్లుతోంది’ అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉపక్రమించింది. అందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’ కార్యక్రమాన్ని రూపొందించింది. పర్యావరణ పరిరక్షణ దిశగా విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏకో క్లబ్లు ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు నెలాఖరులోపు ఎకో క్లబ్లు ఆగస్టు 31 లోపు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్లను నూతనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ పాఠశాలలోనూ ఏకోక్లబ్ల నిర్మాణం కార్యకలాపాలు ఇలా ఉండనున్నాయి. ● నీటి నిలువ క్లబ్: నీటి పొదుపు, సంరక్షణపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ● నేల నిర్వహణ క్లబ్: నేల సంరక్షణ స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై దృష్టి ● శక్తి నిర్వహణ క్లబ్: శక్తి వనరుల సమర్థవంతమైన వినియోగం ● వ్యర్థ నిర్వహణ క్లబ్ వ్యర్థాల తగ్గింపు, రీసైక్లింగ్, జీవ వైవిధ్య క్లబ్: జీవ వైవిద్య సంరక్షణ, పరిరక్షణ. ● పాఠశాలల్లో విద్యార్థులతో ఎకో క్లబ్ కమిటీల ఏర్పాటు ఒక్కో ఎకోక్లబ్లో చురుకై న 10 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో పాఠశాలలో 50 మంది విద్యార్థులను ఈకార్యక్రమంలో భాగస్వాములను చేస్తారు. వీరంతా పర్యావరణ పరిరక్షణకు వివిధ కార్యక్రమాలు నిర్వహించా ల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు హెచ్ఎంలను ఇప్పటికే ఆదేశించారు. విద్యార్థులకు అవగాహన సదస్సులు.. ఎకో క్లబ్ల ద్వారా విద్యార్థులకు వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. శక్తి ఆదా విద్యుత్ ఇతర శక్తి వనరులు ఎలా ఆదా చేయాలనేది, నీటి వృథాను అరికట్టి సంరక్షణ పద్ధతులను తెలియజేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై అవగాహన కల్పిస్తారు. తదితర కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయనున్నారు. పీఎంశ్రీ స్కూళ్లకు నిధుల మంజూరు.. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 492 పాఠశాలలు ఉండగా.. అందులో 145 ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 634 పాఠశాలలున్నాయి. అందులో 142 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కాగా.. ఏకోక్లబ్ ఫర్ మిషన్లైఫ్ కార్యక్రమాల నిర్వహణకు హనుమకొండ, వరంగల్ జిల్లాలోని పీఎం శ్రీ స్కూల్స్కు ఒక్కో స్కూల్కు రూ.10 వేల చొప్పున నిధులు కూడా మంజూరయ్యాయి. వరంగల్ జిల్లాలో 14 పీఎం శ్రీస్కూళ్లకు, హనుమకొండ జిల్లాలో 16 పీఎంశ్రీ స్కూళ్లకు ఒక్కో స్కూల్కు రూ.10 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. మిగతా పాఠశాలల్లో ఎకో క్లబ్లను ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు మంజూరు కాతేదు. అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఎకో క్లబ్లను అన్ని పాఠశాలల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. సంవత్సరం పొడవునా నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఎప్పటికప్పుడు ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్కు సంబంధించిన పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. – సుజన్తేజ, కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్, వరంగల్ గతంలోకంటే మరింత మెరుగ్గా.. పాఠశాలల్లో ఎకో క్లబ్ల విద్యార్థుల ద్వారా కమిటీలను ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణకు కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్య తకు చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈక్లబ్ల ద్వారా అవగాహన పెంచుకుని మొక్కలను కూడా నాటి సంరక్షించాల్సి ఉంటుంది. పీఎం శ్రీ స్కూల్స్కు నిధులు మంజూరు ఇచ్చినందున ఆ నిధులను కూడా కార్యక్రమాల నిర్వహణకు ఆయా స్కూల్స్ ఏకో క్లబ్లు వినియోగించుకోవచ్చు. – శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్, హనుమకొండప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’ పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఒక్కో పీఎం శ్రీ స్కూల్కు రూ.10 వేలు -
పచ్చదనం పరిఢవిల్లేలా..
నెక్కొండ: వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం జిల్లాలోని 337 నర్సరీల్లో 32,02,510 మొక్కలను పెంచుతున్నారు. ఈసారి 31,04,272 మొక్కలు నాటేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఏ ప్రాంతాల్లో ఎన్ని నాటాలో ఆయా మండలాల అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది 70 నుంచి 80 రకాల మొక్కలు నాటనున్నారు. నర్సరీల్లో పెంచుతున్న పలు రకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను కాపాడేందుకు ఉపాధి హామీ పథకం కింద సంరక్షకులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. నాటిన ఒక్కో మొక్కకు రూ.150 ఖర్చుచేసి రెండేళ్ల వరకు కాపాడనున్నారు. మొత్తం 26 శాఖలు పచ్చదనం పరిఢవిల్లేలా కృషిచేయనున్నాయి. ఒక్కో నర్సరీకి రూ.1.40 లక్షల ఖర్చు ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లాలోని 323 పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. వీటితోపాటు అటవీ శాఖ రెండు, జీడబ్ల్యూఎంసీ నాలుగు, నర్సంపేట మున్సిపాలిటీ 7, వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఒకటి చొప్పున నర్సరీలు ఉన్నాయి. మొత్తం 337 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో నర్సరీలో సుమారు 10 వేల మొక్కలు పెంచే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం నర్సరీకి సుమారు రూ.1.40 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. నర్సరీల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు.. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎండ నుంచి సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సరీలకు షేడ్నెట్స్ ఏర్పాటు చేయడంతోపాటు రోజుకు రెండుసార్లు నీటిని అందిస్తున్నారు. ఈ ఏడాది అన్ని నర్సరీలు డీఆర్డీఓ, అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులు ఆయా నర్సరీలను పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. జూలై మొదటి వారం నుంచి విద్యాసంస్థలు, వసతిగృహాలు, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వనమహోత్సవానికి అధికారుల ప్రణాళికలు జిల్లాలోని 337 నర్సరీల్లో 32,02,510 మొక్కలు సిద్ధం జూలై మొదటి వారం నుంచి నాటేందుకు సన్నాహాలు 26 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగంప్రతీ ఇంటికి ఆరు మొక్కలు అందజేస్తాం.. వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఇందుకోసం 337 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం. జూలై మొదటి, రెండు వారాల్లో మొక్కలు నాటుతాం. వీటితోపాటు ప్రతి ఇంటికి ఆరు పండ్లు, పూలు, ఔషధ మొక్కలు అందజేస్తాం. ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వనమహోత్సవ లక్ష్య సాధనకు కృషిచేస్తాం. – కౌసల్యాదేవి, డీఆర్డీఓ -
నేడు శిల్పాల ప్రాంగణంలో యోగా దినోత్సవం
ఖిలా వరంగల్: త్రికోటలోని శిల్పాల ప్రాంగణంలో శనివారం యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగా దినోత్సవానికి మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద హాజరవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఆసనాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.137.74 కోట్లు జమ ఖిలా వరంగల్: జిల్లాకు చెందిన రైతుల ఖాతాల్లో మూడో విడత రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 13 మండలాలకు చెందిన 1,48,581 మంది రైతులకు రూ.137.74 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. డీఆర్డీఏ ఏపీడీగా కృష్ణవేణి గీసుకొండ: గీసుకొండ ఎంపీడీఎ వి.కృష్ణవేణికి డిప్యుటేషన్పై డీఆర్డీఏ ఏపీడీగా బాధ్యతలను అప్పగిస్తూ జెడ్పీ సీఈఓ జి.రాంరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గీసుకొండ మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ)గా విధులు నిర్వర్తిస్తున్న పి.శ్రీనివాస్కు ఎంపీడీఓగా పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఎన్సీసీతో నాయకత్వ లక్షణాలు వర్ధన్నపేట: ఎన్సీసీతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని 4(టీ) ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ వినోద్కుమార్ ఆర్య పేర్కొన్నారు. వర్ధన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 27 మంది ఎన్సీసీ కేడెట్లకు శుక్రవారం ఆయన ఉచిత యూనిఫామ్ కిట్లు అందజేసి మాట్లాడారు. ఎన్సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందని, క్రమశిక్షణ, నిరంతర సాధనతో యువత దేశానికి ఆదర్శగా నిలవాలని సూచించారు. పాఠశాల మొదటి బ్యాచ్లో ఉత్తీర్ణత సాధించిన 22 మంది ఎన్సీసీ విద్యార్థులకు ‘ఏ’ సర్టిఫికెట్లను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగా అనిల్కుమార్, ఎన్సీసీ ఆఫీసర్ మనుజేందర్రెడ్డి, యూనిట్ అడ్జెటెంట్ ఆర్కే శర్మ, జీసీఐ శీతల్రాణా, ట్రైనింగ్ ఐసీ అశోక్కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు వాణి, అశోక్, కుమార స్వామి, దేవయ్య, లలిత్ కుమార్, రజని తదితరులు పాల్గొన్నారు. నిజాయితీగా సేవలందించాలి వరంగల్ క్రైం: ప్రజలకు నిజాయితీగా సేవలందించడం ద్వారా పోలీసులపై సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన తోట వీరస్వామి, పోచయ్య, ఎం.రమేశ్, ఎం.సుధాకర్, పి.రమేశ్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈసందర్భంగా సీపీ చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందించారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుంచి ఈనెల 22 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి పి.భాగ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ఒకటో తరగతిలో 60 సీట్లు, ఐదో తరగతిలో 62 సీట్లు కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈనెల 26న కలెక్టరేట్ సమావేశ మందిరంలో డ్రా తీయనున్నట్లు వివరించారు. దరఖాస్తులను వరంగల్, నర్సంపేట సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయాల్లో సమర్పించాలని, పూర్తి వివరాలకు సంబంధిత కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై కేసు గీసుకొండ: గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు గీసుకొండ సీఐ ఎ.మహేందర్ తెలిపారు. ఎలుకుర్తిహవేలిలో కొందరు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై కుమార్ వెళ్లారు. గంజాయి సేవిస్తున్న మార్త విశాల్, అల్లం రఘు, నర్సింగోజ్ హరీశ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించి వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో కేసు నమోదు చేశామన్నారు. -
అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
న్యూశాయంపేట: ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి అధికారులు సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని, కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తమదని జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, కోచైర్పర్సన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కలెక్టరేట్లో ఎంపీ పోరిక బలరాంనాయక్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ కేంద్రం నిధులతో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కేంద్ర పభుత్వ పరిధిలోని 29 శాఖల పనితీరుతోపాటు వరంగల్ జిల్లాలో సాగు నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రాజెక్టులకు నిధులు తెచ్చి జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్తామని చెప్పారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాలో ఆస్పత్రుల పనితీరును మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేవశించారు. ట్రాన్స్జెండర్లు గౌరవంగా బతికేందుకు సాయం అందించాలని కోరారు. వరి, ఇతర పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎయిడెడ్ పాఠశాలల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గాల వారీగా పరిష్కరించిన సమస్యలను అధికారులు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెస్తాం దిశ చైర్మన్ పోరిక బలరాంనాయక్, కోచైర్పర్సన్ కడియం కావ్య కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి మానిటరింగ్ కమిటీ సమావేశం -
వెలిశాల.. శోకసంద్రం
టేకుమట్ల: మూడు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ అంత్యక్రియలు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో శుక్రవారం ముగిశాయి. రంపచోడవరంలో గురువారం రాత్రి పోస్టుమార్టం అనంతరం రవి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించగా శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్వగ్రామమైన వెలిశాలకు చేరుకుంది. ఉద్యమ గీతాలతో కవులు, కళాకారులు, ఉద్యకారులు ఉద్యమాల బిడ్డా, నిను మరువదు ఈ గడ్డ అంటూ నివాళులర్పించారు. కాగా, రవి మృతదేహాన్ని వెలిశాలకు తీసుకొస్తున్న సమయంలో చిట్యాల, చల్లగరిగలో వాహనాన్ని ఆపి పలువురు నివాళులర్పించారు. ఎరుపెక్కిన వెలిశాల.. గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పెద్దఎత్తున ఎర్రజెండాలు, రవి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన పార్థీవ దేహం వెలిశాలకు చేరుకోగానే ఉద్యమ గీతాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన అంతిమయాత్ర కూతవేటు దూరానికే సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఉద్యమ నినాదాలు, గీతాలు, డప్పు కళాకారుల దరువులకు వెలిశాల దద్దరిల్లింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప ఉద్యమ గీతాలు, నృత్యాలతో విప్లవానికి చావు లేదనే విధంగా ఆడి పాడారు. అంతిమ యాత్ర ప్రారంభం నుంచి చివరి అంకం వరకు ఉద్యమ గీతాలు, నృత్యాలతో హోరెత్తించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు గాజర్ల రవికి అంతిమ వీడ్కోలు తెలిపేందుకు మాజీ మావోయిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, కవులు, గాయకులు, ప్రజలు, అభిమానులు తరలిరావడంతో వెలిశాల జన సంద్రమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షా కనుసన్నల్లో పని చేస్తున్నాడని భారత్ భచావో అధ్యక్షుడు, తెలంగాణ సిద్ధాంతకర్త గాదె ఇన్నయ్య, విమలక్క మండిపడ్డారు. హక్కులు సాదించుకోవాలంటే పోరాడాలని అమ్మే నేర్పిందని గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అన్నారు. కష్టమున్న చోట ఎదిరించి పోరాడమని వెలిశాల చెప్పిందని అన్నారు. దొరలు, పెత్తందారులు చేసే అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం గాజర్ల కుటుంబం పోరాడిందని.. ఆ క్రమంలో పోలీసులు పెట్టిన చిత్రహింసలు వెలిశాల ప్రజలకు తెలుసన్నారు. చివరికి అన్నయ్య రవన్న మృతదేహాన్ని సైతం రంపచోడవరం ఆస్పత్రిలో చూపించకుంటే పోలీసులను ప్రశ్నిస్తేనే చూపించారని అన్నారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న గాజర్ల రవి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన అంతిమయాత్ర అనంతరం గాజర్ల రవి అలియాస్ గణేశ్ సోదరుడు అశోక్ అలియాస్ ఐతు చితికి నిప్పంటించారు. మావోయిస్టు నేత గాజర్ల రవికి కన్నీటి వీడ్కోలు ఎర్రజెండాలతో ఎరుపెక్కిన గ్రామం తరలివచ్చిన ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు -
జిలెటిన్స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం
పర్వతగిరి: వ్యవసాయ భూమిలోని బండరాళ్లను పగులగొట్టడానికి ఎలాంటి అనుమతి లేకుండా ఉపయోగిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం ప్రకారం.. కొంకపాక గ్రామ శివారు గోపనపల్లి గ్రామానికి చెందిన ఓరైతు తన వ్యవసాయ పొలంలో బండరాళ్లను పగులగొట్టడానికి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నాడని సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం పోలీసులు తనిఖీలు చేసి 90 జిలెటిన్స్టిక్స్, 39 డిటోనేటర్లతోపాటు కంప్రెషర్ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ యజమాని పవన్కల్యాణ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చిట్టి చేతులు.. గట్టి సంకల్పం
విద్యారణ్యపురి: ఆధునిక సమాజంలో అభివృద్ధి పేరిట మానవాళి చర్యలతో పర్యావరణానికి నష్టం కలుగుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవాళిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. జీవవైవిద్యానికి కూడా ముప్పువాటిల్లుతోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉపక్రమించింది. అందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని రూపొందించింది. పర్యావరణ పరిరక్షణలో నూతన దిశగా విద్యార్థులను భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు నెలాఖరులోపు ఎకోక్లబ్లు ఆగస్టు 31 లోపు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్లను నూతనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ పాఠశాలలోనూ ఎకోక్లబ్ల నిర్మాణ కార్యకలాపాలు ఇలా ఉండనున్నాయి. నీటి నిల్వ క్లబ్: నీటి పొదుపు, సంరక్షణపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. నేల నిర్వహణ క్లబ్: నేల సంరక్షణ స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై దృష్టి శక్తి నిర్వహణ క్లబ్: శక్తి వనరుల సమర్థవంతమైన వినియోగం ● వ్యర్థ నిర్వహణ క్లబ్ వ్యర్థాల తగ్గింపు, రీసైక్లింగ్, జీవ వైవిధ్య క్లబ్: జీవ వైవిధ్య సంరక్షణ, పరి రక్షణ. ● పాఠశాలల్లో విద్యార్థులతో ఎకోక్లబ్ కమిటీల ఏర్పాటు ఒక్కో ఎకోక్లబ్లో చురుకై న 10 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో పాఠశాలలో 50మంది విద్యార్థులను ఈకార్యక్రమంలో భాగస్వాములను చేస్తారు. వీరంతా పర్యావరణ పరిరక్షణకు వివిధ కార్యక్రమాలు నిర్వహించా ల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాల విద్యాశాఖ అధికారులు హెచ్ఎంలను ఇప్పటికే ఆదేశించారు. విద్యార్థులకు అవగాహన సదస్సులు ఎకో క్లబ్ల ద్వారా విద్యార్థులకు వివిధ అవగాహన సదస్సులను నిర్వహిస్తారు. శక్తి ఆదా విద్యుత్ ఇతర శక్తి వనరులు ఎలా ఆదా చేయాలనేది, నీటి వృథాను అరికట్టి సంరక్షణ పద్ధతులను తెలియజేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై అవగాహన కల్పిస్తారు. తదితర కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు. పీఎంశ్రీ స్కూళ్లకు నిధులు.. హనమకొండ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 492 పాఠశాలలు ఉండగా.. అందులో 145 ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 634 పాఠశాలలున్నాయి. అందులో 142 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కాగా.. ఏకోక్లబ్ ఫర్ మిషన్లైఫ్ కార్యక్రమాల నిర్వహణకుగాను హనుమకొండ, వరంగల్ జిల్లాలోని పీఎం శ్రీ స్కూల్స్కు ఒక్కో స్కూల్కు రూ.10 వేల చొప్పున నిధులు కూడా మంజూరయ్యాయి. వరంగల్ జిల్లాలో 14 పీఎం శ్రీస్కూళ్లకు, హనుమకొండ జిల్లాలో 16 పీఎంశ్రీ స్కూళ్లకు ఒక్కో స్కూల్కు రూ.10 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. మిగతా పాఠశాలల్లో ఎకోక్లబ్లను ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిల్లో కార్యక్రమాల నిర్వహణకు నిధులు మంజూరు అనేది లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’ పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఒక్కో పీఎం శ్రీ స్కూల్కు రూ.10 వేల చొప్పున నిధులు గతంలో కంటే మరింత మెరుగ్గా.. పాఠశాలల్లో ఎకో క్లబ్ల విద్యార్థుల ద్వారా కమిటీలను ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణకు కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. సహజ సిద్ధంగా ప్రకృతిని యథావిధిగా ఉండేలా పర్యావరణ సమతుల్యతకు చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈక్లబ్ల ద్వారా అవగాహన పర్చుకోవడం మొక్కలను కూడా నాటడం చేయాల్సి ఉంటుంది. వాటిని సంరక్షించాల్సి ఉంటుంది. పీఎం శ్రీ స్కూల్స్కు నిధులు మంజూరు ఇచ్చినందున ఆ నిధులను కూడా కార్యక్రమాల నిర్వహణకు ఆయా స్కూల్స్ ఎకో క్లబ్లు వినియోగించుకోవచ్చును – శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్, హనుమకొండఅన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసుకోవచ్చు..ఎకోక్లబ్లను అన్ని పాఠశాలల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. సంవత్సరం పొడవునా నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఎప్పటికప్పుడు ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్కు సంబంధించిన పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. – సుజన్తేజ, కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్, వరంగల్ -
కొలతల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలి
దుగ్గొండి/నల్లబెల్లి: ప్రభుత్వ కొలతల ప్రకారమే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. దుగ్గొండి మండలం తొగర్రాయి, నల్లబెల్లి మండలంలోని నందిగామ, రేలకుంట, రంగాపురం, మూడుచెక్కలపల్లి, ముచ్చింపుల గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ముచ్చింపులలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ కొలతల ప్రకారం కాకుండా ఇళ్లు నిర్మించుకుంటే బిల్లులు ఇచ్చేటప్పుడు సమస్యలు వస్తాయన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేస్తానని, అర్హులకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బిల్లులను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమచేస్తోందని పేర్కొన్నారు. తొగర్రాయిలో జరిగిన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నర్సంపేటఅధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, దుగ్గొండి మండల అధ్యక్షుడు ఎర్రల్ల బాబు, గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ శారద, నల్లబెల్లి మండలంలో జరిగిన కార్యక్రమాల్లో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ, నాయకులు చిట్యాల తిరుపతిరెడ్డి, మాలోత్ రమేశ్ పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ముగిసిన బడిబాట
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈనెల 6నుంచి ప్రారంభమైన బడిబాట గురువారం ముగిసింది. చివరిరోజు వివిధ పాఠశాలల్లో విద్యార్ధులకు క్రీడలను నిర్వహించారు. నడికూడ పాఠశాలలో విద్యార్థుల క్రీడాపోటీలను జెడ్పీ సీఈఓ విద్యాలత పాల్గొని ప్రారంభించారు. దామెర మండలం ఊరుగొండ ఉన్నతపాఠశాలలో క్రీడలను కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడలను ఎంఈఓ నెహ్రూ ప్రారంభించారు. మొత్తంగా బడిబాట ముగిసేనాటికి హనుమకొండ జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 3,228మంది విద్యార్థులు నూతనంగా నమోదు అయ్యారు. అందులో ఒకటవ తరగతిలో 1,133మంది ప్రవేశాలు పొందారని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. -
బనకచర్లతో ఎడారవ్వనున్న ఉమ్మడి జిల్లా
హన్మకొండ: గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఏడారిగా మారుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల గురించి తెలియని రేవంత్రెడ్డి తెలంగాణ నీటి వనరులను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. చిన్న పగుళ్ల సాకు చూపి కాళేశ్వరం కూలిపోయిందన్నారని. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే రైతుల పొలాలను ఎండగొట్టిందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తాగు, సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించుకున్న, అభివృద్ధి చేసుకున్న పాకాల, గణపురం, లక్నవరం రిజర్వాయర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని పడుతున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నా మంత్రులు సీతక్క, సురేఖ, ఎమ్మెల్యేలు కనీసం నోరు మెదపడం లేదని తూర్పారబట్టారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు నీటి దోపిడీకి గోదావరి బనకచర్ల కడుతుంటే రేవంత్ రెడ్డి ఎలా అడ్డుకుంటాడని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, నాయకులు ఉడతల సారంగపాణి, జోరిక రమేశ్, తాళ్లపెళ్లి జనార్దన్ గౌడ్, నార్లగిరి రమేశ్, పులి రజనీకాంత్, బండి రజనీ కుమార్, శోభన్ కుమార్, నయీముద్దీన్, సల్వాజీ రవీందర్ రావు, జానకి రాములు, అఫ్జల్, రామ్మూర్తి, మూటిక రాజు, రాజ్ కుమార్, శరత్ చంద్ర, వీరస్వామి, రాకేశ్, శ్రవణ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి -
డ్రెయినేజీ పనుల్లో నాణ్యత డొల్ల!
వరంగల్ అర్బన్: గ్రేటర్లో అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మకై ్క ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నా.. కనీసం క్షేత్రస్థాయిలో వర్క్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది కూడా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజల ప్రయోజనాల కంటే తమకు కావాల్సిన కాంట్రాక్టర్ల స్వలాభం, నాలుగు కాసులు వెనుకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకు మచ్చుకు ఒక్క ఉదాహరణే వరంగల్ దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ నుంచి కొత్తవాడ బైపాస్ రోడ్డులోని డ్రెయినేజీ నిర్మాణం. నాణ్యతకు తిలోదకాలు బల్దియా నిధులు రూ.50లక్షలతో 500 మీటర్ల డ్రెయినేజీ నిర్మాణానికి టెండర్లు పిలించారు. ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని ఒప్పందాలు పూర్తి చేసుకున్న చాలా నెలల తర్వాత పనులు మొదలు పెట్టారు. పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు కడుతుండగానే మరో వైపు పగుళ్లు, రంధ్రాలు పడుతున్నాయి. అంతా క్రషర్ మెటీరియలే.. ప్రభుత్వ నిబంధనల మేరకు గోదావరి ఇసుక, నాణ్యమైన కంకర, సిమెంట్తో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మించాలి. కానీ, సదరు కాంట్రాక్టర్ ఇసుకకు బదులుగా క్రషర్లో వెలువడే రోబో ఇసుక, కంకర చూర, నాణ్యత లేని కంకర ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రెయినేజీ ఒకవైపు కడుతుండగానే మరోవైపు రంధ్రాలు పడి నీళ్ల ఊటలు వస్తున్నాయి. నెలలు గడవకముందే ఈ నిర్మాణం పూర్తిగా ఛిద్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కమిషనర్ కళ్లెం వేసేనా? బల్దియాకు తాజాగా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ విధుల్లో చేరారు. నగరంలో దారి తప్పిన అభివృద్ధి పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తా.. దేశాయిపేట ఫిల్టర్బెడ్ నుంచి 80 ఫీట్ల రోడ్డు వరకు జరుగుతున్న డ్రెయినేజీ పనుల నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తా. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. – రంగనాథ్, బల్దియా డీఈ కమిషనర్ గారూ.. క్వాలిటీ పరిశీలించండి 500 మీటర్ల పనులకు రూ.50 లక్షలు కేటాయింపు ఇసుకకు బదులు క్రషర్ రోబో చూర నాసిరకం కంకర, సిమెంట్ దారి తప్పిన గ్రేటర్ అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లకు ఇతోధికంగా సహకరిస్తున్న ఇంజనీర్లు -
లారీ, బైక్ ఢీ.. కాంగ్రెస్ నాయకుడి దుర్మరణం
● ఎల్కతుర్తిలో ఘటనఎల్కతుర్తి: లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ సమీపంలోని హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి చోటు చే సుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన బాషబోయిన రవి(45) వ్యక్తిగత పని నిమిత్తం బైక్పై హనుమకొండకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఎల్కతుర్తి సమీపంలోని కార్మెల్ స్కూల్ సమీపం వద్దకు రాగానే హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న లారీ.. ఢీ కొట్టింది. దీంతో రవి బైక్పైనుంచి పడి తలకు తీవ్రగాయాలై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, మృతుడు రవి గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సూరారం గ్రామ సర్పంచ్గా పోటీ చేశాడు. అలాగే ఎంపీటీసీగా పోటీచేసి కొద్ది ఓట్లతోనే ఓటమి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. -
పసుపు రైతుల ఆందోళన
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేశారు. ధర పెంచేవరకూ పసుపు అమ్మమని తేల్చిచెప్పారు. ● శాయంపేట: ఈ చిత్రంలో కనిపిస్తున్నది బెంచీలు మోస్తూ కనిపిస్తున్నది శాయంపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు. ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. బరువైన పాత బల్లలను తరగతి గదుల నుంచి వేరే గదులకు మోయిస్తుండడాన్ని గురువారం ‘సాక్షి’ క్లిక్మనిపించింది. కాగా.. పాఠశాల ఆవరణలో చెత్త నిండి దుర్వాసన వస్తోంది. దోమలు విజృంభిస్తున్నాయి. అదేవిధంగా మండలంలోని పెద్దకోడెపాక ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం అందించిన స్కూల్ యూనిఫామ్ నాసిరకంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇష్టారీతిన కుట్టడంతో యూనిఫామ్ వేసుకునేందుకు ఇబ్బందవుతోందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. -
వృత్తి నైపుణ్యం సాధించాలి
● సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు విధుల్లో రాణించాలంటే నైపుణ్యం సాధించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. యూనిట్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. డ్యూటీ మీట్లో విభాగాల వారీగా రాణించిన కమిషనరేట్ పరిధి పోలీసులను జోనల్ స్థాయిలో నిర్వహించే మీట్కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈఏడాది రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ పోటీలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు వృత్తినైపుణ్యం సాధించడం ద్వారా, నేరస్తులను త్వరగా గుర్తించడంతో పాటు, ప్రజలకు సత్వరమే న్యాయం అందించగలమన్నారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్ అదనపు డీసీపీ రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్తో పాటు, జోనల్కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్షయ రహిత జిల్లాగా మారుద్దాంఎంజీఎం: ప్రజల భాగస్వామ్యంతో క్షయరహిత జిల్లాగా మారుద్దామని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.సాంబశివరావు అన్నారు. గురువారం టీబీ అలర్ట్ ఇండియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పిల్లలో క్షయ వ్యాధి నివారణ గురించి ఐఎంఏ హాల్లో శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. డివిజన్, మండల స్థాయిలో పిల్లల్లో క్షయను గుర్తించడంపై అవగాహన, చైతన్యకార్యక్రమాలు నిర్వహించాలన్నారు. క్షయ అంటువ్యాధి అని ప్రీవలెన్స్ రేట్ రోజురోజుకూ అధికమవుతోందన్నారు. ఎవరికై నా క్షయ లక్షణాలు కనిపిస్తే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సాయంతో పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, క్షయ వ్యాధి నియంత్రణ ప్రోగ్రాం అధికారి ఆచార్య తదితరులు పాల్గొన్నారు. న్యాయ విజ్ఞానానికి ఇ–లైబ్రరీ దోహదంవరంగల్ లీగల్: న్యాయ విజ్ఞానానికి ఇ–డిజిటల్ లైబ్రరీ ఎంతో ఉపయోగకరమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తెలిపారు. వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ఇ–లైబ్రరీని గురువారం అమె ప్రారంభించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.పట్టాభిరామరావు, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, జనరల్ సెక్రటరీ రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, జాయింట్ సెక్రటరీ ముసిపెట్ల శ్రీధర్గౌడ్, లేడీ జాయింట్ సెక్రటరీ రేవూరి శశిరేఖ, లైబ్రరీ సెక్రటరీ గుండా కిషోర్కుమార్, ట్రెజరర్ సిరుమల్ల అరుణ, తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా రూ.126.80 కోట్లు జమహన్మకొండ: హనుమకొండ జిల్లా రైతుల ఖా తాల్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరో సా కింద రూ.126.80కోట్లు జమ చేసినట్లు జి ల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్ తెలిపా రు. వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులకు పెట్టుబడి సాయంగా జిల్లాలోని 14 మండలాలకు చెందిన 1,35,765 రైతులకు రూ. 126,80,04,861 జమ చేసినట్లు తెలిపారు. మండలాల వారీగా వివరాలు.. మండలం రైతులు జమైన సొమ్ము భీమదేవరపల్లి 10493 11,46,09,577 ధర్మసాగర్ 11433 11,51,59,864 ఎల్కతుర్తి 11321 10,78,32,732 హనుమకొండ 1230 73,19,256 హసన్పర్తి 13475 10,98,42,270 ఐనవోలు 12520 12,43,15,115 కమలాపూర్ 15501 14,22,97,512 కాజీపేట 5480 3,89,36,293 వేలేరు 8052 9,05,51,910 ఆత్మకూరు 10169 8,56,54,862 దామెర 7528 7,21,11,422 నడికూడ 10376 9,85,11,112 పరకాల 7242 6,39,24,143 శాయంపేట 10945 9,69,38,793 -
శిథిలావస్థలో భవనాలు.. సమస్యల నడుమ చదువులు
సాక్షిప్రతినిధి, వరంగల్/నెట్వర్క్ : సర్కారు బడి సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు ప్రైవేట్తో పోటీ పడలేక.. మరోవైపు మౌలిక వసతుల లేమితో సతమతమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బడిబాట, ఉపాధ్యాయుల ప్రచారాన్ని నమ్మి పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందడం లేదు. చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. పారిశుధ్యం లోపించింది. కొన్ని పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని విద్యార్థుల్లేక మూతబడ్డాయి. ఇంకొన్ని చోట్ల విద్యార్థులున్నప్పటికీ చదువు చెప్పే వారు లేరు. పలు చోట్ల మధ్యాహ్న భోజనం అస్తవ్యస్తంగా మారింది. ఇలా.. జిల్లాలోని ప్రతీ పాఠశాలను ఏదో ఒక సమస్య వేధిస్తున్నట్లు గురువారం ‘సాక్షి’ విజిట్లో తెలిసింది. ప్రధానంగా టాయ్లెట్స్ సమస్య.. పాఠశాలలు పునఃప్రారంభమై వారంరోజులైంది. జిల్లాలో విద్యార్థుల హాజరు 50నుంచి 60శాతం వరకే ఉంటోంది. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా టాయ్లెట్స్ సమస్య విద్యార్థులను వేధిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి ద్వారా చేపట్టిన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 492 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలుండగా అందులో 19 స్కూళ్లలో అసలే టాయ్లెట్స్ లేవు. మరికొన్నిచోట్ల సరిపడా లేవు. 154 పాఠశాలల్లో కిచన్ షెడ్లు లేవు. దీంతో మధ్యాహ్నం వంటకు ఇబ్బందులు తప్పటంలేదు. జిల్లాలో 41 పాఠశాలల్లో అసలే విద్యార్థులు లేరు. ● కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అయోధ్యపురంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 32 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు టీచర్లు ఉండగా.. బోధనకు కేవలం రెండు తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక గది శిథిలావస్థకు చేరుకుంది. ● విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టిసింగ్ ప్రాథమిక ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 347మంది విద్యార్థులు న్నారు. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పాఠశాలలో హెచ్ఎంతో పాటు మరో ఏడుగురు ఎస్జీటీలు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మరో ఐదుగురిని వర్క్ అడ్జెస్ట్మెంటు కింద గత ఏడాదిలో కేటాయించారు. 2 నుంచి 5వ తరగతి వరకు రెండు సెక్షన్ల చొప్పున ఉన్నాయి. దీంతో మరో ఇద్దరు ఉపాధ్యాయుల అవసరం ఉందని భావిస్తున్నారు. అలాగే హనుమకొండలోని సుబేదారి యూపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో అసంపూర్తి మరుగుదొడ్లు దర్శనమిస్తున్నాయి. గతంలో మన ఊరు–మనబడి కింద పనులు చేపట్టి వదిలేశారు. కొద్దిరోజుల క్రితం అమ్మ ఆదర్శ పథకం కింద మళ్లీ అవే పనులను చేపట్టారని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.. లోపల బేసిన్స్ వేశారు. చుట్టూ టైల్స్ వేయాల్సింది. అదేవిధంగా కిచెన్ షెడ్డు లేదు. పాఠశాలలో 1నుంచి 7వ తరగతి వరకు 50మంది వరకు విద్యార్థులున్నారు. హెచ్ఎం, నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. టీచర్లుంటే విద్యార్థుల్లేరు.. విద్యార్థులుంటే టీచర్లు లేరు పలుచోట్ల మూతబడిన పాఠశాలలు అధ్వానంగా మూత్రశాలలు పారిశుద్ధ్యం అస్తవ్యస్తం హసన్పర్తి: ఇది చింతగట్టు క్యాంప్లోని ప్రాథమిక పాఠశాల. గతేడాది ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహించారు. ఈఏడాది ఆవిద్యార్థులు మరో పాఠశాలలో చేరారు. దీంతో పాఠశాల మూత పడింది. 1980లో ఎస్సారెస్పీ ప్రాజెక్టు సందర్భంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కాగా.. అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేకపోవడంతో చింతగట్టు క్యాంప్లో విధులు నిర్వహించిన ఉద్యోగులంతా తమ పిల్లలతో పాఠశాల కిటకిటలాడింది. ఇక్కడి ఉద్యోగుల బదిలీ అనంతరం విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గింది. విద్యార్థులు లేక ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై ఇతర పాఠశాలకు వెళ్లారు. వేలేరు: ఇది వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల. దీనికి ప్రహరీ లేక పశువులు సంచరిస్తున్నాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాయ్స్ టాయిలెట్స్ కూడా అధ్వానంగా మారాయి. పాఠశాలలో వంటగది లేక రేకుల షెడ్డు కిందనే వండుతున్నారు. -
కలెక్టరేట్లో వివిధ శాఖల పరిశీలన
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం సందర్శించారు. రెవెన్యూ, ఇతర విభాగాలను స్వయంగా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టరేట్లోని మహిళా క్యాంటీన్కు వెళ్లి అక్కడ న్యూస్ పేపర్లపై ఆహార పదార్థాలు ఉంచడం చూసి ఇలా.. ఉంచితే వాటి రంగు ఆహారపదార్థాలకు అంటుతుందని, ఆరోగ్యానికి హానికరమన్నారు. క్యాంటీన్లో అన్ని రకాల తినుబండారాలు, స్నాక్స్ నాణ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆదాయం ఎంత వస్తుంది? ఖర్చులు ఏంటి అనే విషయాల్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ గణేశ్, ఏఓ గౌరీ శంకర్, తదితరులు ఉన్నారు. -
ప్రవీణ్కు ఆర్మీ అధికారుల గౌరవ వందనం
శాయంపేట: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అరికిల్ల ప్రవీణ్ కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్మీ క్యాంపు నుంచి ముగ్గురు ఆర్మీ అధికారులు మైలారం గ్రామానికి చేరుకుని ప్రవీణ్ కుటుంబ సభ్యులకు జాతీయ జెండా(ఫ్లాగ్) అందజేశారు. అనంతరం ప్రవీణ్ అంతిమయాత్రలో పాల్గొని తిరిగి వెళ్లిపోయారు. శునకం.. కన్నీటిపర్యంతం ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్ ప్రవీణ్ అంతిమసంస్కారాలకు సిద్ధం చేస్తున్న క్రమంలో పెంపుడు శునకం.. శవ పేటికపై తలపెట్టి కన్నీటి పర్యంతమై విశ్వాసం చాటుకుంది. -
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
వర్ధన్నపేట: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య హెచ్చరించారు. వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్గఢ్ పరిధిలోని విత్తన, ఎరువుల డీలర్లతో వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు గురువారం నిర్వహించిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. రైతులకు విత్తన, ఎరువుల డీలర్లు అన్ని రకాలుగా సహకరించాలని సూచించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించకూడదని, రైతులకు కచ్చితంగా రశీదులు అందజేయాలి స్పష్టం చేశారు. మండల వ్యవసాయ అధికారి విజయ్కుమార్ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు.వ్యాపారులు విడి విత్తనాలను విక్రయించకూడదని, మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేసేలా రైతులను ప్రోత్సహించకూడదన్నారు. ఎస్సైలు చందర్, రాజు, విత్తన డీలర్లు, షాపుల యజమానులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య -
సేవ చేయడం అదృష్టంగా భావిస్తా
రాయపర్తి: తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించి, సంక్షేమ పథకాలను అందేలా చూస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన తీసుకురాగా.. ఇప్పుడు ఇచ్చేది మొదటి విడత మాత్రమేనని రెండో విడతలో అర్హులందరికీ ఇళ్లు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నమ్మకంతో తనను గెలిపించినందుకు నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రూ.14 కోట్లతో మండల కేంద్రంలో మంజూరైన గోదాం పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పెర్కవేడు, కొత్తూరు, కొత్తతండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ తొర్రూరు అధ్యక్షుడు హామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, టీఎం కృష్ణమాచార్యులు, నంగునూరి అశోక్, పెండ్లి మహేందర్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, వనజారాణి, మందాటి సుదర్శన్రెడ్డి, ఎనగందుల మురళి, కుందూరు రత్నాకర్రెడ్డి పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
ఐదు పాఠశాలల్లో విద్యార్థులు నిల్
దుగ్గొండి: మండల పరిధిలో 7 ఉన్నత పాఠశాలలు, 7 ప్రాథమికోన్నత పాఠశాలలు, 22 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. తొగరురామయ్యపల్లి, కేశవాపురం, బొబ్బరోనిపల్లి, గుడిమహేశ్వరం గ్రామాల పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయుడు చొప్పున ఉండగా విద్యార్థులు అసలే లేరు. చాపలబండ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా విద్యార్థులు లేరు. మిగిలిన అన్ని పాఠశాలలలో సౌకర్యాలు ఉన్నాయి. నాచినపల్లి ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం 20 మంది విద్యార్థులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 40 మందికి చేరింది. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా మరో ఇద్దరు ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
అద్దె ఇంటిలో గేట్పల్లి పాఠశాల
నెక్కొండ: మండలంలోని గేట్పల్లి ప్రాథమిక పాఠశాల అసౌకర్యాలకు నిలయంగా మారింది. ఐదేళ్ల క్రితం పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. ప్రమాదం పొంచి ఉండడంతో చెట్లకిందే విద్యార్థులకు చదువులు కొనసాగాయి. పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకురాలు సలీమా ఇంటి ఆవరణను అద్దెకు తీసుకున్నారు. దీంతో గతేడాది నుంచి అక్కడే విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలలో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు రూ.900 అద్దె చెల్లిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యాంసుందర్ తెలిపారు. ఇప్పటికైనా పాఠశాలకు సొంత భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
భూగర్భ జలాలను సంరక్షించాలి
రాయపర్తి: భూగర్భ జలాలు సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా నోడల్ ఆఫీసర్ డి.చైతన్య పేర్కొన్నారు. తిర్మలాయపల్లి, కొండూరు, బురహాన్పల్లి, కాట్రపల్లి, కొలన్పల్లి, పోతిరెడ్డిపల్లి, కిష్టాపురం, మొరిపిరాల, సన్నూరు, మైలారం, రాయపర్తి, జగన్నాథపల్లి, ఏకేతండా గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన ఇంకుడుగుంతలు, ఫారంపాండ్ తదితర పనులను పరిశీలించి మాట్లాడారు. జల సంచాయ్–జల భాగిరథి కార్యక్రమంలో భాగంగా పనులు పరిశీలించినట్లు తెలిపారు. ఏపీఓ కుమార్గౌడ్, ఈసీ ప్రవీణ్, సీటీఏలు సురేశ్, సుధాకర్, టీఏలు కిషన్రెడ్డి, వెంకన్న, యాకూబ్, సందీప్, పంచాయతీ కార్యదర్శులు వినోద్, విజయేందర్, రాజు, మహేందర్, అంబేడ్కర్, రాకేశ్, ఆస్మా, రాధిక, వెంకటేశ్, ఫీల్డ్అసిస్టెంట్లు యాకలక్ష్మి, సుధాకర్, కవిత, అరుణ, సృజన, దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యాధులు ప్రబలకుండా చూడాలి : డీఎంహెచ్ఓ
నెక్కొండ: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. అలంకానిపేట పీహెచ్సీని గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి మాట్లాడారు. వానాకాలంలో అంటువ్యాధులు వ్యాపించకుండా రోడ్లు, ముఖ్య కూడళ్లు, డ్రెయినేజీల్లో వర్షపు నీరు నిల్వకుండా చూడాలని సూచించారు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇంటింటి సర్వే చేపట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట వైద్యాధికారి అఖిల్, సూపర్వైజర్ రమాదేవి, సిబ్బంది సునీత, దివ్య, అరుణ, సుజాత, ఆశ వర్కర్లు ఉన్నారు. పన్నులు వసూలు చేయాలి : డీపీఓ దుగ్గొండి: గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన అన్నారు. వెంకటాపురం గ్రామ పంచాయతీని గురువారం ఆమె తనిఖీ చేశారు. పన్నుల వసూళ్ల రికార్డులు, జమ–ఖర్చుల రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన గృహాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. గ్రామంలో ప్రతిరోజూ ఉదయమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వర్షాకాలం ప్రారంభమైనందున బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట మండల పంచాయతీ అధికారి మోడెం శ్రీధర్గౌడ్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఉన్నారు. విస్తృతంగా తపాలా సేవలు గీసుకొండ: ప్రజలకు విస్తృతంగా సేవలు అందించడానికి తపాలా శాఖ ముందుకు వస్తోందని వరంగల్ సౌత్ సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పి.వరప్రసాద్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం తపాలా కార్యాలయంలో గురువారం నిర్వహించిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (డీసీడీపీ)లో ఆయన మాట్లాడారు. తపాలా శాఖలోని సేవింగ్, రికరింగ్, టర్మ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ ఖాతాలను ఉపయోగించుకోవాలని కోరారు. స్పీడ్, రిజిస్టర్ పోస్టు, పార్సిల్ బుకింగ్, బీమా పథకాలు ఉన్నాయని పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో గ్రూప్ యాక్సిడెంట్ గార్డు(జీఏడీ) పాలసీలు ఉన్నాయని వివరించారు. ధర్మారం పోస్ట్మాస్టర్ నీలిమ, సిబ్బంది రాజబాబు తదితరులు పాల్గొన్నారు. కోర్టు స్టేను ధిక్కరించిన కాంట్రాక్టర్ గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటలో కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్ మంజూరైంది. సబ్స్టేషన్ నిర్మాణ కోసం గురువారం బోరు వేయడానికి కాంట్రాక్టర్ బోరు బండితో రాగా సదరు భూమి తమ కులస్తులదని, ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించిందని స్థానిక మాలకులస్తులు అడ్డుకున్నారు. వద్దని చెప్పినా బోరు వేయడానికి కాంట్రాక్టర్ రావడంతో వారు 100కు డయల్ చేశారు. పరిశీలించిన పోలీసులు బోరు వాహనాన్ని గీసుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన కాంట్రాక్టర్, ఎన్పీడీసీఎల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని మాలకులస్తులు తెలిపారు. -
39 పాఠశాలలు.. 2,709 మంది విద్యార్థులు
గీసుకొండ: మండలంలో 27 ప్రాథమిక, 12 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 2,709 మంది విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో ఉన్నారు. ఈ ఏడాది బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. కొత్త అడ్మిషన్లను ఇంకా ఆన్లైన్ చేయలేదు. అడ్మిషన్లు కొంతమేరకు పెరుగుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మూత్రశాలు, మరుగుదొడ్ల సమస్య లేదు. గట్టుకిందిపల్లి, నందనాయక్తండా, అనంతారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కోదాంట్లో పది మందిలోపే విద్యార్థులు ఉన్నారు. అనంతారం ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించగా నలుగురు విద్యార్థులే హాజరయ్యారు. -
గొల్లపల్లి పాఠశాలలో 10 మంది విద్యార్థులు..
నల్లబెల్లి: విద్యార్థులు లేరనే కారణంతో గతంలో కొండాయిల్పల్లి, శంషాబాద్, మామిండ్లవీరయ్యపల్లి, లైన్తండా, సాయిరెడ్డిపల్లి, గొల్లపల్లి, రామారావుతండా, బజ్జుతండా, పోచంపల్లి ప్రాథమిక పాఠశాలల, ముచ్చింపుల ఉన్నత పాఠశాలను అధికారులు మూసివేశారు. గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం నార్లగిరి రాజు, ఉపాధ్యాయురాలు రజిత బడిబాటలో కార్యక్రమంలో భాగంగా 10 మంది విద్యార్థులను చేర్పించారు. పాఠశాల పునఃప్రారంభోత్సవానికి కృషిచేసిన హెచ్ఎం, ఉపాధ్యాయురాలిని ఎంఈఓ అనురాధ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు అభినందించారు. విద్యార్థులు లేరనే కారణంతో శంషాబాద్, మామిండ్లవీరయ్యపల్లి, కొండాయిల్, లైన్తండా, సాయిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలు, ఉపాధ్యాయులు లేరనే కారణంతో రామారావుతండా, బజ్జుతండా, పోచంపల్లి ప్రాథమిక పాఠశాలలు, ముచ్చింపుల ఉన్నత పాఠశాలలు ప్రారంభం కాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మూసివేసిన పాఠశాలలను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
టెక్నికల్ పోస్టుల భర్తీలో గందరగోళం
నర్సంపేట రూరల్: నర్సంపేట ఆస్పత్రి, వైద్య కళాశాలలో చేపట్టిన ఔట్సోర్సింగ్ టెక్నికల్ పోస్టుల భర్తీలో గందరగోళం నెలకొంది. గణేశ్ ఏజెన్సీ 50 మందికి నియామకపత్రాలు ఇవ్వగా.. జీఓ వచ్చిన తర్వాతనే వారిని విధుల్లోకి తీసుకుంటామని వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ తిరిగి పంపించిన ఘటన నర్సంపేట ఆస్పత్రిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. గత ఏడాది వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, జిల్లా ఇన్చార్జ్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అటవీ పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వైద్య కళాశాల, ఆస్పత్రిని ప్రారంభించారు. అయితే, 180 టెక్నికల్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ఏడాది నోటిఫికేషన్ ఇవ్వగా సుమారు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పడు దరఖాస్తులు స్వీకరించిన నవోదయ ఏజెన్సీ నిర్వాహకులు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో దరఖాస్తులను కళాశాల సిబ్బంది స్వాఽధీనం చేసుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ఏజెన్సీ రద్దు చేశారు. అప్పటి నుంచి పోస్టుల భర్తీ పెండింగ్లోనే ఉంది. ఇటీవల పోస్టుల భర్తీని గణేశ్ మ్యాన్పవర్ సర్వీస్ ఏజెన్సీకి అప్పగించారు. ఆ ఏజెన్సీ 50 మందికి నియామకపత్రాలు అందించింది. గురువారం ఆ నియామక పత్రాలతో వారు ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలకు చేరుకున్నారు. తమకు జీఓ కాపీ వచ్చిన తర్వాతే సిబ్బందిని తీసుకుంటామని చెప్పడంతో వారు అయోమయంలో పడిపోయారు. 50 మందికి నియామకపత్రాలు ఇచ్చిన గణేశ్ ఏజెన్సీ జీఓ వస్తేనే విధుల్లో చేర్చుకుంటామన్న నర్సంపేట వైద్యకళాశాల ప్రిన్సిపాల్మాకు జీఓ రాలేదు.. నర్సంపేట ఆస్పత్రిలో టెక్నికల్ పోస్టులను ఏజెన్సీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నట్లు మాకు ఎలాంటి జీఓ రాలేదు. ఈనెల 12న కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరాం. కలెక్టర్ వాటికి సంబంధించిన నోట్ఫైల్ తయారుచేసి పంపించాలని కోరగా పంపించాం. కానీ, మాకు టెక్నికల్ పోస్టులను భర్తీ చేయాలని జీఓ రాలేదు. గణేశ్ ఏజెన్సీ వారు ఇచ్చిన నియామకపత్రాలు పట్టుకొని వచ్చిన వారితో మాట్లాడాం. మాకు జీఓ కాపీ వచ్చిన తర్వాతే తీసుకుంటామని చెప్పాం. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తుది నిర్ణయం మేరకే ముందుకు సాగుతాం. – డాక్టర్ మోహన్దాస్, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్మెరిట్ ఆధారంగానే నియామక పత్రాలు .. జీఓ ఆధారంగానే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో 50 టెక్నికల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాం. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో మెరిట్ లిస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించాం, వారు విధుల్లో చేరేందుకు ఆస్పత్రికి వెళ్లగా చేర్చుకోలేదు. జీఓ లేకుంటే ఎలా నియమిస్తాం. – ఓదెల మొగిలి, గణేశ్ ఏజెన్సీ నిర్వాహకుడు -
ముల్కనూరు సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవం
ఎల్కతుర్తి: సహకార రంగంలో పేరుగాంచిన ముల్కనూరు సొసైటీ ఎన్నికలు బుధవారం ఏకగ్రీవమయ్యాయి. ముల్కనూరు సహకార సంఘంలో ఇటీవల ఐదు డైరెక్టర్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఆరు నామినేషన్న్లు ఉపసంహరించుకోగా బుధవారం ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి కె.కోదండరాములు తెలిపారు. ఒకటో డైరెక్టర్ స్థానం అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, రెండో డైరెక్టర్ స్థానం బొల్లంపల్లి కుమారస్వామి, ఐదో డైరెక్టర్ స్థానం గనవేన శ్రీనివాస్, తొమ్మిదో డైరెక్టర్ స్థానం గుర్రాల భాస్కర్రెడ్డి, 15వ డైరెక్టర్ స్థానంలో కాసిరెడ్డి వసంత ఎన్నికై నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, బ్యాంకు అధ్యక్షుడు ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ప్యానల్ విజయకేతనంతో సంబురాలు చేసుకున్నారు. -
ట్రై సిటీలో పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు
ఐదు నెలల్లో 254 మందికి జైలు కేసులు 8,482.. జరిమానా రూ.85,83,769 మైనర్ డ్రైవింగ్ కేసుల్లో జైలుకు 91మంది కోర్టు కానిస్టేబుళ్ల హవారోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం మత్తు అని గుర్తించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ట్రై సిటీ(హనుమకొండ, కాజీపేట, వరంగల్) పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేశారు. సాయంత్రం 6 గంటల దాటితే ప్రధాన రోడ్లపై పోలీసులు ఎటువైపు నుంచి వచ్చి పరీక్షలు చేస్తారో తెలియని పరిస్థితి. ట్రైసిటీలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి నుంచి మే వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 8,482 నమోదు కాగా 85,83,769 రూపాయల వరకు జరిమానాలు చెల్లించారు. దీనిని బట్టి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఏ మేరకు కొరడా ఝుళిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. –వరంగల్ క్రైంమైనర్ల డ్రైవింగ్పై పోలీసుల ప్రత్యేక దృష్టిమైనర్లకు వాహనాలు అప్పగించవద్దని పోలీస్ అధికారులు తల్లిదండ్రులకు పదే పదే చెప్పిన ఎవరూ వినడం లేదు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సన్ప్రీత్ సింగ్ మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు పోలీసులకు పట్టుబడిన మైనర్ డ్రైవింగ్ కేసుల్లో 91 మంది జైలుకు వెళ్లారు. జరిమానాలు.. జైలు జీవితమే..జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ వాహనదారులకు రూ.28,96,960 జరిమానా విధించారు. ఇక కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.30,27,909, వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.26,58,900 జరిమానా విధించారు. దీంతోపాటు అధికంగా మద్యం సేవించిన 260మంది జైలుకు వెళ్లారు. కోర్టు కానిస్టేబుళ్ల హవా..సందట్లో సడేమియాలాగా.. డ్రంకెన్ డ్రైవ్ కేసులు కొంతమంది పోలీస్ అధికారులకు కాసుల వర్షం కురిస్తున్నాయి. మద్యం తాగి పోలీసులకు దొరికిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకునే వారు పోలీసుల డిమాండ్లకు తలొగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇక కోర్టుకెళ్తే అక్కడి కోర్టు కానిస్టేబుళ్లు మరో దందాకు తెరలేపుతున్నారు. వాహనాల కాగితాలు లేవు.. రీడింగ్ ఎక్కువ వచ్చింది..అంటూ భయపెట్టి డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ట్రాఫిక్లో కోర్టు కానిస్టేబుళ్ల పోస్టుకు చాలా డిమాండ్ ఉండడంతో అదే పోస్టులో ఉండటానికి అధికారులు మారినప్పుడల్లా వారి ప్రయత్నాలు చాలా ఖరీదుగా ఉంటాయన్న ప్రచారం ఉంది. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో.. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ప్రధాన ట్రాఫిక్ కూడళ్లతోపాటు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లకు సమీపంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాదారులు అక్కడ అమ్ముడు ఎందుకు...?; ఇక్కడ పరీక్షలు ఎందుకు చేస్తున్నారు అని అసహనం వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. మోతాదుకు మించి మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు మాత్రం జైలు జీవితం తప్పడం లేదు. మొత్తం కేసులు2,620మేఏప్రిల్జనవరిఫిబ్రవరిమార్చి2,7882,774జైలుకు..జనవరి నుంచి మే వరకు ట్రైసిటీలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఇలా.. -
ఆపరేషన్లలో దిట్ట..
గాజర్ల రవి 1985–1986లో వరంగల్లో ఐటీఐ చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు. తన అన్న సారయ్య అప్పటికే క్రియాశీలకంగా నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తుండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. దీంతో 1992లో ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. పోలీసులపై దాడులు చేయడంలో దిట్టగా గాజర్ల రవి పేరొందాడు. ఆయన ఆపరేషన్ నిర్వహిస్తే ఫెయిల్ కాదన్న అభిప్రాయం ఉంది. ● 1994లో ప్రస్తుత జయశంకర్ జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ల్యాండ్మైన్ పేల్చి నలుగురు పోలీసులను చంపిన వారిలో రవి కీలకంగా వ్యవహరించాడు. ● 2001లో ఏటూరునాగారం పోలీస్స్టేషన్పై దాడి ఘటనలో ఉన్నాడు. ఇవే కాక పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలపై జరిపిన అనేక దాడుల్లో రవి కీలకంగా వ్యవహరించాడు. ● 2004లో మావోలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో రవి కూడా ప్రతినిధిగా వ్యవహరించాడు. -
మంత్రి పొంగులేటి, సీఎస్ను కలిసిన కలెక్టర్
హన్మకొండ అర్బన్: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. అలాగే, సచివాలయంలోని సీఎస్ చాంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కూడా మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్గా రాజ్కుమార్ కొనసాగింపుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల డైరెక్టర్గా గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ను మరో సంవత్సరంపాటు కొనసాగిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజ్కుమార్ పదవీకాలం ముగియడతో మళ్లీ ఆయననే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి తన చాంబర్లో రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి రాజ్కుమార్కు ఉత్తర్వులు అందజేశారు. నేటి నుంచి యథావిధిగా పలు రైళ్లు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఇటీవల రద్దు చేయగా.. ఆ రైళ్లు గురువారం నుంచి యథావిధిగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి–రెచ్ని రోడ్డులో చేపట్టిన రైల్వే బ్లాక్ కారణంగా పలు రైళ్లను కొన్ని రోజులు రద్దు చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి యశ్వంత్పూర్–గోరఖ్పూర్ (22534) వెళ్లే ఎక్స్ప్రెస్, పాట్నా–చర్లపల్లి (03253) వెళ్లే ఎక్స్ప్రెస్, చర్లపల్లి–పాట్నా (07255) వెళ్లే ఎక్స్ప్రెస్లను యథావిఽధిగా నడుపనున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. -
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
వీ–హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ హన్మకొండ అర్బన్: జిల్లాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామివేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వీ–హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో ఎస్హెచ్జీలు, మహిళా పారిశ్రామివేత్తలకు ‘ఎంఎస్ఎంఈ ర్యాంప్ ఉమెన్ యాక్సెలరేషన్ పథకం’పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఎంపికై న మహిళా పారిశ్రామివేత్తలు తమ వ్యాపారాలను అభివృద్ధిని చేసుకొని ఆదా యాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందని సూచించారు. ఇందులో భాగంగా టెక్స్టైల్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హస్తకళల రంగాల్లోని వ్యాపారులకు వ్యాపార నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, సరఫరా, బ్రాండింగ్, మార్కెటింగ్ యా క్సెస్, క్రెడిట్ లింకేజీ మద్దతు అందుతుందని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు చెందిన ఔత్సాహిక మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సదస్సులో డీఆర్డీఓ శ్రీనివాస్, ఇండస్ట్రీస్ జీఎం నవీన్కుమార్, వీ–హబ్ టీంసభ్యులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం
ధర్మసాగర్: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రూ.25 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.3.50 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, రూ.27 లక్షల కుడా నిధులతో నిర్మించిన సీసీ డ్రైయిన్, రూ.20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎంపీ కడియం కావ్యతో కలిసి బుధవారం ముప్పారం కేజీబీవీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని, బిల్లుల మంజూరులో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హులకు కచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. డీఈఓ వాసంతి, డీఎంహెచ్ఓ అప్పయ్య, పీఆర్ డీఈ శ్రీనివాస్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఉప్పల్లో చైన్స్నాచింగ్
కమలాపూర్: ఇల్లు కిరాయికి కావాలంటూ వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాక్కెళ్లిన ఘటన ఉప్పల్లో మంగళవారం రాత్రి జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్కు చెందిన సముద్రాల మల్లమ్మ (70) తన భర్తతో కలిసి స్థానిక బస్టాండ్ సమీపంలో నివసిస్తోంది. నాలుగు రోజుల నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి మల్లమ్మ ఇంటి చుట్టూ తిరుగుతూ ఇల్లు కిరాయికి కావాలని అడిగి, రూ.500 అడ్వాన్స్గా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ నెల 17న రాత్రి సుమారు 9 గంటలకు వచ్చి ఇంటి సామాన్లు వస్తున్నాయంటూ నమ్మించాడు. రాత్రి 12 గంటలకు మల్లమ్మను మంచినీళ్లు కావాలని అడిగాడు. మంచినీళ్లు తెచ్చి ఇస్తున్న క్రమంలో ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీసీ షేక్సలీమా, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి, అడిషనల్ క్రైం డీసీపీ బోనాల కిషన్, ఏసీపీ సదయ్య తదితరులు ఇన్స్పెక్టర్ హరికృష్ణతో కలిసి బుధవారం వేర్వేరుగా సందర్శించారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వృద్ధురాలి మెడలోని నాలుగు తులాల పుస్తెలతాడు అపహరణ ఘటనా స్థలిని పరిశీలించిన డీసీపీ, పోలీసు ఉన్నతాధికారులు -
దత్తత దందాపై టాస్క్‘ఫోర్స్’
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దృష్టి సారించారు. తక్కువ వయసున్న పిల్లలను పొందడానికి ఎక్కువ వయసున్న దంపతులను తక్కువ వయసుగా చూపించేందుకు వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎనిమిది మంది పొందిన బర్త్ సర్టిఫికెట్లు నకిలీవని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ధారించడంతో ఈ రాకెట్ వెనుక ఎవరున్నారనే వివరాలు పూర్తిస్థాయిలో తెలుసుకునే దిశగా విచారణ ముమ్మరం చేశారు. ఈ మేరకు హనుమకొండ బాలసముద్రంలోని బాలరక్షాభవన్లో బాలల సంరక్షణ విభాగాధికారులను టాస్క్ఫో ర్స్ పోలీసులు విచారించి, దత్తతకు సమర్పించిన పత్రాలు సేకరించినట్లుగా తెలిసింది. సెలవులో ఉన్న జిల్లా సంక్షేమ విభాగాధికారి రాగానే గురువారం ఆమె సమక్షంలోనే పోలీసుల విచారణ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ విభాగాధికారి, బాలల సంరక్షణ విభాగాధికారి సమక్షంలో వరంగల్ కలెక్టరేట్లో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన దత్తత కోరే జంటలతోపాటు ఆయా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని భావించిన పాఠశాల నిర్వాహకులను పిలిచి విచారించారు. అయితే చాలా మంది పాఠశాలల నిర్వాహకులు ఆ సర్టిఫి కెట్లు తామివ్వలేదని చెప్పారు. దీంతోపాటు గతంలోనే సదరు సర్టిఫికెట్లు సృష్టించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఆర్వోను కోరారు. అలాగే తాము చదవుకున్నా కూడా ఓ అధికారి తమ వద్ద డబ్బులు తీసుకొని సదరు పత్రాలు తెప్పించారని, తక్కువ వయసున్న పిల్లలు వచ్చేలా చూస్తామని చెప్పారని దత్తతకు దరఖాస్తు చేసుకున్న ఓ జంట డీఆర్వో ఎదుట అంగీకరించడంతో నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టైనట్లుగా తెలిసింది. మరో ఆరుగురు పిల్లల దత్తతను కోరేవారినీ విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. మూడేళ్ల డేటాపై కసరత్తు.. తాజాగా ఎనిమిది మంది నకిలీ బర్త్డే సర్టిఫికెట్లు సమర్పించారని విద్యాశాఖ ధ్రువీకరించడంతో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయనే దిశగా జిల్లా సంక్షేమ విభాగాధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాలతో గత మూడేళ్లకు సంబంధించిన దత్తత రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలించడం, పాఠశాలల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ తదితరాలపై పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. దత్తత అనుబంధ విభాగమైన శిశు గృహలోని సిబ్బంది సదరు పత్రాలు ఈ దత్తత దందాను విచారిస్తున్న డీఆర్వోకు అప్పగించనున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇందులో కూడా భారీగా అదే పాఠశాలల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు వస్తే ఈ కేసు మరింత కీలకంగా మారనుంది. ఇప్పటికే ఎనిమిది నకిలీ సర్టిఫికెట్ల సృష్టించినవారిపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. మిగిలిన జిల్లాలోనూ ఈ ఘటనలున్నాయా.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు చేసే దిశగా పోలీసుల విచారణ ఇప్పటికే ఎనిమిది నకిలీవని నిర్ధారించిన విద్యాశాఖ బాలరక్షా భవన్ సిబ్బందిని విచారించిన పోలీసులు బాధ్యులైనవారిపై క్రిమినల్ చర్యల దిశగా అడుగులు -
విద్యతోనే సమాజంలో గౌరవం
ఖిలా వరంగల్: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని, విద్యతోనే సమాజంలో గౌరవ, మర్యాదలు ఉంటాయని కలెక్టర్ సత్యశారద సూచించారు. కరీమాబాద్, మధ్యకోట బాలికల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను డీఈఓతో కలిసి కలెక్టర్ బుధవారం సందర్శించారు. కరీమాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి చదువు సామర్థ్యాలు, పాఠశాల్లో రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నూతన మెనూ ప్రకారం పిల్లలకు పోషకాహారం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలకార్మికులను గుర్తించి బడికి పంపాలి న్యూశాయంపేట: ఇటుక బట్టీలు, బీడీ, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలను తనిఖీ చేసి బాలకార్మికులను గుర్తించి బడికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాలకార్మికులను నియమించుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్పై దృష్టిసారించాలని సూచించారు. బాలకార్మిక వ్యవ స్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 21, 24 తేదీల్లో వరంగల్ ఓసిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యోగా, జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమంల్లో కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, మరుపల్లి రవి, ఎంఈఓ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు మాధవి, కార్మిక శాఖ ఉప కమిషనర్ నారాయణస్వామి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీవైఎస్ఓ టీవీఎల్ఎన్ సత్యవాణి, డీఎం హెచ్ఓ సాంబశివరావు, పురావస్తుశాఖ కన్జర్వేషన్ అసిస్టెంట్ నవీన్, ఎన్వైకే కో–ఆర్డినేటర్ అన్వేశ్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్, సీనియర్ యోగా శిక్షకులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద పలు పాఠశాలల సందర్శన -
నాడు అన్న.. నేడు తమ్ముడు
ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం భూపాలపల్లి/టేకుమట్ల: వెలిశాల తల్లడిల్లింది. ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. 2008లో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్లో చనిపోగా, తాజా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన తమ్ముడు రవి అలియాస్ గణేష్ మృతిచెందాడు. దీంతో మావోయిస్టు ఉద్యమంలో గాజర్ల కుటుంబ ప్రస్థానం ముగిసినట్లయ్యింది. విషయం తెలియడంతో వెలిశాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యమాల బిడ్డ–నిను మరువదు పోరు గడ్డ అంటూ పలువురు ఉద్యమకారులు రవితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమానికి పురుడు పోసిన ఘటన.. వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల మల్లయ్య– కనకమ్మలకు ఐదుగురు కుమారులు రాజయ్య, సమ్మ య్య, సారయ్య, రవి, అశోక్. మల్లయ్య వ్యవసాయం, గౌడ కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. 1987లో గుమ్మడవెల్లి కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో గాజర్ల సారయ్య చైర్మన్ బరిలో నిలిచి గెలుపొందాడు. అయినప్పటికీ అప్పటి పెత్తందారులు బ్యాలెట్ బాక్స్లను గల్లంతు చేసి ఓడినట్లుగా అధికారులతో ప్రకటింపజేశారు. దీంతో సారయ్య మందమర్రిలో ఉండే తన అన్న సమ్మయ్య దగ్గరికి వెళ్లి ఉపాధి కోసం చూస్తాడు. అక్కడ కూడా అతనిపై అక్రమ కేసులు మోపడంతో 1990లో పూర్తిస్థాయిలో నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లాడు. సారయ్య అలియాస్ ఆజాద్గా గుర్తింపు పొందాడు. ఆయన బాటలోకి గాజర్ల రవి, అశోక్ వెళ్లారు. 2008లో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య అలియాస్ ఆజాద్ చనిపోయాడు. తాజాగా రవి కూడా ఎన్కౌంటర్లో మృతిచెందా డు. అశోక్ మాత్రం 2016లో పోలీసుల ఎదుట లొంగిపోయి, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత రవి మృతి 33 ఏళ్ల క్రితం ఎర్రజెండా పట్టి అజ్ఞాతంలోకి.. సెంట్రల్ కమిటీ సభ్యుడి హోదాలో మరణం వెలిశాలలో ముగిసిన అన్నల శకం మూగబోయిన వెలిశాల.. ఎన్కౌంటర్లో రవి మృతి చెందిన విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో ఇద్దరు ఉద్యమకారులు నేలకొరిగారంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు రవితో గడిపిన సమయాలను నెమరువేసుకుంటున్నారు. నేడు అంత్యక్రియలు... ఎన్కౌంటర్లో రవి మృతి చెందాడని ఏపీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం గాజర్ల కుటుంబీకులకు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్న సమ్మయ్య, అశోక్(ఐతు)లు రవి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరి వెళ్లారు. గురువారం తెల్ల వారుజామున తిరిగి వెలిశాలకు వచ్చే అవకాశం ఉండగా, రవి అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి. ఆపరేషన్లలో దిట్ట.. గాజర్ల రవి 1985–1986లో వరంగల్లో ఐటీఐ చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు. తన అన్న సారయ్య అప్పటికే క్రియాశీలకంగా నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తుండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. దీంతో 1992లో ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. పోలీసులపై దాడులు చేయడంలో దిట్టగా గాజర్ల రవి పేరొందాడు. ఆయన ఆపరేషన్ నిర్వహిస్తే ఫెయిల్ కాదన్న అభిప్రాయం ఉంది. 1994లో ప్రస్తుత జయశంకర్ జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ల్యాండ్మైన్ పేల్చి నలుగురు పోలీసులను చంపిన వారిలో రవి కీలకంగా వ్యవహరించాడు. 2001లో ఏటూరునాగారం పోలీస్స్టేషన్పై దాడి ఘటనలో ఉన్నాడు. ఇవే కాక పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలపై జరిపిన అనేక దాడుల్లో రవి కీలకంగా వ్యవహరించాడు. 2004లో మావోలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో రవి కూడా ప్రతినిధిగా వ్యవహ రించాడు. -
చినుకు.. చింత
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025● ఈ ఫొటోలోని రైతు నెక్కొండ మండలంలోని పనికర గ్రామానికి చెందిన మెండే రమేష్. తనకున్న ఎకరం చేనులో పత్తి విత్తనాలు విత్తనాడు. నీరందకపోవడంతో సగం గింజలు మొలకెత్తకుండా పోయాయి. దీంతో మొలకెత్తని స్థానాల్లో మళ్లీ విత్తనాలు విత్తనాలు నాటాడు. గత రెండు వారాలుగా వర్షాలు కురవకపోవడంతో మొలకలు ఎండకు మాడిపోతున్నాయి. గత ఏడాది పత్తి సాగు చేయగా ఎర్ర గులాబీ పురుగు ఆశించి తీవ్ర నష్టం వాటిల్లిందని రమేష్ వాపోయాడు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే భూమి చదును చేసి మొక్కజొన్న సాగు చేస్తానని చెప్పుతున్నాడు.● వ్యవసాయ బావి నుంచి పైపులు ఏర్పాటు చేసుకొని పత్తి మొక్కలకు నీరు పెడుతున్న ఈ రైతు పేరు జిడ్డి దుర్గయ్య. ఇతనిది చెన్నారావుపేట మండలం అక్కల్చెడ గ్రామం. రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని కురిసిన కొద్ది పాటి వర్షాలకు పత్తి గింజలను నాటా డు. వర్షాలు లేకపోవడంతో పత్తి మొక్కలు ఎండిపోతుండగా సమీపంలోని రైతుకు చెందిన వ్యవసాయ బావి నుంచి నీటిని పైపుల ద్వారా తీసుకుని మొక్కలను తడుపుతున్నాడు. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బావిలో సరిపడా నీరు లేక గంట మాత్రమే మోటారు నడిచేపరిస్థితి ఉంది.న్యూస్రీల్ -
ఫొటో క్యాప్చర్ జరుగుతోందా?
హసన్పర్తి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఫొటో క్యాప్చర్ జరుగుతోందా అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులను ప్రశ్నించారు. పెంబర్తిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం కలెక్టర్ స్వయంగా పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. పనులు ఏవిధంగా జరుగుతున్నాయని అడిగారు. రోజువారీగా మేసీ్త్రకి కూలి ఇచ్చి ఇళ్లు నిర్మించుకుంటున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దశల వారీగా ఫొటోలు తీయాలని సూచించారు. ఆ మేరకు బిల్లులు కూడా చెల్లింపులు జరుగుతాయని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణశాఖ పీడీ రవీందర్ నాయక్, డీఈఈ సిద్దార్థ నాయక్, నాయబ్ తహసీల్దార్ రహీం, ఎంపీడీఓ కర్ణాకర్, మాజీ సర్పంచ్ పూల, యూత్ కాంగ్రెస్ నాయకుడు చరణ్, కారోబార్ సదానందం పాల్గొన్నారు. భూభారతితో సమస్యల పరిష్కారం: కలెక్టర్ భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా సూదన్పల్లిలో నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తెల్లకాగితంపై భూములు కొనుగోలు చేశామని, ఇప్పటివరకు పట్టాదారుగా పేర్లు నమోదు కాలేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏదైనా సమస్య ఉంటే లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన -
మొక్కుబడిగా బడిబాట..!
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తూ.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నా తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల నిర్వహించిన బడిబాటలో పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈనెల19వ తేదీతో (గురువారం) ముగియనుంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలతోపాటు వివిధ అంశాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. బడిబాటలో భాగంగా ర్యాలీలు, ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తించడం వారి పేర్లు నమోదు చేసుకోవటం వంటివి చేసి పాఠశాలల్లో చేర్పించాలనే ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ప్రభ్వుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. బడిబాట ముగింపు దశకు వచ్చినా అనుకున్న మేర విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదనేది స్పష్టమవుతోంది. అసలు విద్యార్థులు లేని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోటికి సర్దుబాటు తప్పదని భావిస్తున్నారు. గురుకుల పాఠశాలల ప్రభావం.. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోసం బడిబాట నిర్వహించినా గురుకులాల్లోనే ఎక్కువగా విద్యార్థులు చేరుతున్నారనేది స్పష్టమవుతోంది. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు కూడా అందుబాటులో ఉండటంతో అందులో చేర్పిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వైపు వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమ రీ తరగతులు ప్రారంభించారు. హనుమకొండలో 16, వరంగల్లో 13 పాఠశాలల్లో ప్రారంభించి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఏ మేరకు ప్రవేశాలు పొందుతారనేది వేచి చూడాల్సిందే. హనుమకొండ జిల్లాలో 4,131 మంది ప్రవేశాలు హనుమకొండ జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బడిబాట కార్యక్రమం కూడా ముగియ వచ్చినా.. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల్లో కలిపి మొత్తంగా 4,131మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో ఒకటో తరగతిలోనే 2,074మంది ప్రవేశం పొందారు. హనుమకొండ జిల్లాలో 492 ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో 41 ప్రభుత్వ పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. బడిబాట కార్యక్రమం ద్వారా కనీసం పది మంది విద్యార్థులు చేరితే ఆయా పాఠశాలలను తెరిపిస్తామని డీఈఓ అవకాశం కల్పించారు. దీంతో ఏడు పాఠశాలల్లోనే కొద్దిమంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా వాటిని తెరిచారు. విద్యార్థుల నమోదు లక్ష్యం నెరవేరేనా! ప్రభుత్వ స్కూళ్లపై గురుకులాల ప్రభావం హనుమకొండ జిల్లాలో 4,131 మంది.. వరంగల్లో 3,896 మంది విద్యార్థుల నమోదు వరంగల్ జిల్లాలో 3,896 మంది విద్యార్థులు వరంగల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం వరకు 3,896 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అనుకున్న మేర విద్యార్థుల నమోదు ప్రక్రియ కావడం లేదనేది స్పష్టమవుతోంది. జిల్లాలో ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు 568 ఉండగా అందులో అసలు విద్యార్థులే లేని పాఠశాలలు 135 ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలు గు పాఠశాలలే తెరుచుకున్నాయి. అసలే విద్యార్థులు లేని పాఠశాలల టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. -
వైద్యకళా శాలలకు
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuమార్గదర్శకాలు పాటించని మెడికల్ కాలేజీలు ● కనీస వసతులు కరువు ● కొత్త మెడికల్ కాలేజీలతోపాటు కేఎంసీకీ షోకాజ్ ● 50నుంచి 70శాతం ఖాళీలతో నడుస్తున్న వైనం ● ఒక్క కేఎంసీలోనే ఖాళీగా 130 వైద్యపోస్టులు ● ప్రశ్నార్థకంగా కాలేజీల నిర్వహణ న్యూస్రీల్ -
మరుగుదొడ్ల అక్రమాలపై విచారణ
కమలాపూర్ : వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు అందిన ఫిర్యాదుతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది మంగళవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 2016 నుంచి 2019 వరకు మొత్తం 562 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం చేయలేదని, కొందరికి రూ.6 వేలు ఇచ్చి మిగతా రూ.6 వేలు చెల్లించకుండా అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల సంతకాలు ఫోర్జరీ చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు కమలాపూర్కు చెందిన పుల్ల అన్వేష్ ఫిర్యాదు చేశాడు. వందశాతం మరుగుదొడ్లు పూర్తయ్యాయని అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందజేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించాడు. దీనిపై క్షేత్రస్థాయి విచారణ చేసి దోచుకున్న సొమ్మంతా రికవరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్తో పాటు జిల్లా అధికారులకు గతేడాది ఫిర్యాదు చేశాడు. అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది కమలాపూర్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైందా? మంజూరైతే నిర్మించుకున్నారా? నిర్మించుకుంటే డబ్బులు వచ్చాయా? వస్తే ఎన్ని ముట్టాయి? తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాక విచారణ నివేదికను డీఆర్డీఓతో పాటు కలెక్టర్కు అందజేస్తామని డీఆర్డీఓ కార్యాలయ ఏఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
రామన్నపేట : వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీజీఈసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్, క్యాంప్ ఆఫీసర్ బైరి ప్రభాకర్ తెలిపారు. మొదటిరోజు 362 మంది విద్యార్థులు హెల్ప్లైన్ సెంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. అధికారుల పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్రమబద్ధంగా కొనసాగిందని తెలిపారు. రైతు భరోసా రూ.84.01 కోట్లు జమహన్మకొండ: వానాకాలం పెట్టుబడి సాయం రైతు భరోసా హనుమకొండ జిల్లాలో మంగళవారం 1,17,028 మంది రైతుల ఖాతాల్లో రూ.84.01 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో.. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని రైతులకు మంగళవారం వరకు రైతుభరోసా నిధులు రూ.94కోట్ల వరకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇప్పటివరకు 1,29,542 మంది రైతులకు పెట్టుబడి సాయం జమైనట్లు పేర్కొన్నారు. వేదపాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులుహన్మకొండ కల్చరల్ : వరంగల్ శ్రీభద్రకాళి వేదపాఠశాలలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్, దేవాలయం ఈఓ శేషుభారతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. వేదపాఠశాలలో ప్రవేశానికి విద్యార్థులకు మాతృభాషలో చదవడం, రాయడం వచ్చి, 8నుంచి 12సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉపనయన సంస్కారం, ఉపాకర్మోత్సర్జనము పూర్తయినవారు అర్హులని పేర్కొన్నారు. అలాగే సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం కంఠస్థమయి ఉండి స్వయంగా అనుష్టానం చేసుకోగల వారు, 10 సంస్కృత శబ్ధములు (7 విభక్తులు) కంఠస్థం అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. వరంగల్లోని శ్రీభద్రకాళి దేవస్థానంలోని వేదపాఠశాల కార్యాలయంలో నేటినుంచి దరఖాస్తులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను 25వ తేదీవరకు అందజేయాలని కోరారు. పోలీస్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించొద్దువరంగల్ క్రైం: పోలీస్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. హనుమకొండ, సుబేదారి, ఏనుమాముల పోలీస్స్టేషన్లతోపాటు సీసీఎస్, టాస్క్ఫోర్స్, యాంటీడ్రగ్స్ విభాగాల్లో బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్లు శివకుమార్, రంజిత్, రాఘవేందర్, సత్యనారాయణరెడ్డి, సతీష్లు మంగళవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ వారికి సూచించారు. సహితా విద్యా దినోత్సవంవిద్యారణ్యపురి : బడిబాటలో భాగంగా మంగళవారం సహిత విద్యాదినోత్సవాన్ని నిర్వహించగా హనుమకొండ మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. భవిత కేంద్రంలో విద్యార్థులకు కల్పి స్తున్న సదుపాయాలను వివరించారు. భవిత కేంద్రానికి సరఫరా చేసిన రూ.2లక్షల విలువచేసే సామగ్రిని డీఈఓ పరిశీలించారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, ఎంఈఓ నెహ్రూ ఉన్నారు. -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
ఎంజీఎం : సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో హనుమకొండ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కడిపికొండ పీహెచ్సీకి చెందిన డాక్టర్లు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా 15 రోజులపాటు పిల్లలు అతిసార వ్యాధి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, జింక్ ట్యాబెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో తప్పకుండా డ్రై డే పాటించేలా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. టీబీ చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని, వారి పోషణకు సంబంధించిన అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్, అదనపు డీఎంహెచ్ఓ, ఇన్చార్జ్ మలేరియా అధికారి డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారి ఇక్తాదర్ అహ్మద్, ఎన్సీడీ, మాతా శిశు సంక్షేమ రక్ష ప్రోగ్రాం అధికారి మంజుల, వైద్యాధికారులు పాల్గొన్నారు.హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య -
నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి
శాయంపేట : ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిర్వాహకులు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని డీఈఓ వాసంతి సూచించారు. మండలంలోని మాందారిపేట శివారులోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పాఠశాలలోని వంట గదిని, పప్పు దినుసులు, ప్రయోగశాల, మరుగుదొడ్లు, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీని పరిశీలించారు. వేసవి సెలవులకు వెళ్లిన విద్యార్థులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంఈఓ భిక్షపతి, స్పెషల్ ఆఫీసర్ మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. డీఈఓ వాసంతి -
మారని ‘తూర్పు’ పోలీసుల తీరు
మరోసారి వివాదంలో వరంగల్ ఖాకీలుసాక్షి, వరంగల్ : వరంగల్ డివిజన్ పోలీసుల తీరు మారడం లేదు.. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తమ స్టేషన్ పరిధితోపాటు హద్దులు దాటి మరీ వరంగల్ తూర్పులోని ముఖ్య నేతకు బందోబస్తుగా వెళ్లడం దుమారం రేపుతోంది. గతంలో స్టేషన్ ఘన్పూర్లోని ఆలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఎస్కార్ట్గా వ్యవహరించిన మిల్స్ కాలనీ సీఐ మల్లయ్యను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే ఇటీవల వరంగల్ తూర్పులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొండా మురళికి పోలీసుస్టేషన్లో తమ విధులు వదిలి బందోబస్తుగా వెళ్లిన వరంగల్ డివిజన్లోని ఏసీపీ, సీఐ, ఎస్సైల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని సీరియస్గా తీసుకున్న వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ వివరణ ఇవ్వాలంటూ మూడు రోజులక్రితం మెమో జారీచేయడం ఖాకీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ఆయా పోలీసు అధికారులు సీపీకి వివరణ ఇచ్చారు. వారిచ్చిన వివరణ ఆధారంగానే తదుపరి చర్యలుంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఏసీపీ పాల్గొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
ఎన్ఎంసీ గండం!
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎంజీఎం: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆనంతరం అప్పటి ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటికే ఉన్న కాకతీయ మెడికల్ కళాశాలకు అదనంగా జనగామ, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్లలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా.. ఓ మెడికల్ కళాశాలకు ఏర్పాటు చేయడానికి ఎంతమంది సిబ్బంది ఉండాలి...? ఆ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల సంఖ్య ఎంత...? దానికి అనుగుణంగా ఎలాంటి పరికరాలు ఉండాలి...? అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు నియామకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయలేదు. వైద్యవిద్యార్థుల బోధనకు కావాల్సిన హాస్టల్ వసతులు? వైద్యానికి అవసరమైన పరికరాలు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేసి ఇవన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మెడికల్ కళాశాల స్థాపనకు ప్రభుత్వం ముందడుగు వేయాలి. కానీ, అలాంటి విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా అరకొర వసతులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కళాశాలను నెలకొల్పి కొనసాగుతున్న క్రమంలో వసతుల కొరతను గుర్తించిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సీరియస్ అయ్యింది. కేఎంసీతోపాటు ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ప్రస్తుతం ప్రభుత్వానికి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. కేఎంసీలో లోపాలపై సీరియస్.. వైద్య కళాశాలల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఖాళీలు, లోపాలపై సీరియస్ అయ్యింది. ఎప్పుడో స్థాపించిన కాలేజీలోనూ నిబంధనల మేరకు వసతులు లేకపోవడం చూసి ఆశ్చర్యానికి గురైన ఎన్ఎంసీ.. నోటీసులు జారీ చేసింది. యూజీఎంఎస్ఆర్–2023 నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరు, విద్యార్థులకు సరిపడా రోగులు, ప్రాక్టికల్స్కు కావాల్సిన మృతదేహాలు, ఇతర పరికరాలు, డిజిటల్ రికార్డింగ్, సీసీటీవీల ఏర్పాటు వంటి వాటిపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాల కల్పన, క్లినికల్ ట్రెయినింగ్ వంటి అంశాల్లో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలలను కొనసాగించడమో.. రద్దు చేయడమో నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని ఆదేశించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. నేడు తేలనున్న భవితవ్యం..ప్రభుత్వ వైద్య కళాశాల భవితవ్యం నేడు (బుధవారం)తేలనుంది. గుర్తించిన లోపాలు, షోకాజ్ నోటీసులపై సంజాయిషీ ఇవ్వాలని, ఇందుకోసం బుధవారం ఢిల్లీకి రావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈలను ఆదేశించింది. ఆ లోపాలను సరిచేస్తామని అన్ని కళాశాలలనుంచి హామీ పత్రాలు ఇవ్వనున్నారు. కానీ, వాటికి కూడా సంతృప్తి చెందక సీట్లు తగ్గిస్తారా? జరిమానాలు విధిస్తారా..? మందలించి వదిలేస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో పూర్తి వివరాలు సమర్పించేందుకు అన్ని జిల్లాల, మెడికల్ కళాశాలల డీన్లు/ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో డీఎంఈ సోమ, మంగళవారాల్లో సమావేశమై కళాశాలల సమగ్ర సమాచారం సేకరించారు. 130కి పైగా కీలక పోస్టులు ఖాళీ1955వ సంవత్సరంలో 50 సీట్లతో ప్రారంభమైన కాకతీయ మెడికల్ కళాశాల ప్రస్తుతం 250 ఎంబీబీఎస్, 100కుపైగా పీజీ సీట్లు, ఐదు సూపర్ స్పెషాలిటీ సీట్లతో కొనసాగుతోంది. కళాశాలలో వైద్యవిద్య బోధించేందుకు 22 విభాగాల బోధన సిబ్బందితో మరో 10 విభాగాల బోధనేతర సిబ్బంది పనిచేయాలి. మొత్తం ఈ విభాగంలో 250మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులకు బోధన చేయాలి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఉంటారు. ప్రస్తుతం కేఎంసీ అనుబంధంగా కొనసాగుతున్న ఎంజీఎం, సీకేఎం, ఆర్ఈహెచ్, జీఎంహెచ్ టీబీ ఆస్పత్రులు ఉన్నాయి. కేఎంసీలో ప్రొఫెసర్ స్థాయిలో 10కిపైగా, అసోసియేట్ స్థాయిలో 35కు పైగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో సుమారు 90కిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వైద్యవర్గాలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న కేఎంసీ పరిస్థితి ఈ విధంగా ఉంటే రెండు, మూడేళ్ల క్రితం ఏర్పడిన నూతన కళాశాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. -
మారని ‘తూర్పు’ పోలీసుల తీరు
● మరోసారి వివాదంలో వరంగల్ ఖాకీలు సాక్షి, వరంగల్: వరంగల్ డివిజన్ పోలీసుల తీరు మారడం లేదు.. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తమ స్టేషన్ పరిధితోపాటు హద్దులు దాటి మరీ వరంగల్ తూర్పులోని ముఖ్య నేతకు బందోబస్తుగా వెళ్లడంపై దుమారం రేపుతోంది. గతంలో స్టేషన్ఘన్పూర్లోని ఆలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఎస్కార్ట్గా వ్యవహరించిన మిల్స్కాలనీ సీఐ మల్లయ్యను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే ఇటీవల వరంగల్ తూర్పులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొండా మురళికి పోలీసుస్టేషన్లో తమ విధులు వదిలి బందోబస్తుగా వెళ్లిన వరంగల్ డివిజన్లోని ఏసీపీ, సీఐ, ఎస్సైల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని సీరియస్గా తీసుకున్న వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ వివరణ ఇవ్వాలంటూ మూడు రోజుల క్రితం మెమో జారీచేయడం ఖాకీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ఆయా పోలీసు అధికారులు సీపీకి వివరణ ఇచ్చారు. వారిచ్చిన వివరణ ఆధారంగానే తదుపరి చర్యలుంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఏసీపీ పాల్గొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
మొక్కుబడిగా బడిబాట
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తూ.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నా తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల నిర్వహించిన బడిబాటలో పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈనెల 19వ తేదీతో (గురువారం) ముగియనుంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలతోపాటు వివిధ అంశాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. బడిబాటలో భాగంగా ర్యాలీలు, ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తించడం వారి పేర్లు నమోదు చేసుకోవడం వంటివి చేసి పాఠశాలల్లో చేర్పించాలనే ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ప్రభ్వుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. బడిబాట ముగింపు దశకు వచ్చినా అనుకున్న మేర విద్యార్థులు ప్రభు త్వ పాఠశాలల్లో చేరడం లేదనేది స్పష్టమవుతోంది. అసలు విద్యార్థులు లేని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోటికి సర్దుబాటు తప్పదని భావిస్తున్నారు. గురుకుల పాఠశాలల ప్రభావం.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోసం బడిబాట నిర్వహించినా గురుకులాల్లోనే ఎక్కువగా విద్యార్థులు చేరుతున్నారనేది స్పష్టమవుతోంది. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు కూడా అందుబాటులో ఉండటంతో అందులో చేర్పిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆకర్షణీయమైన ప్రకటనలతో అటువైపు కూడా వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించారు. హనుమకొండలో 16, వరంగల్లో 13 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఏ మేరకు ప్రవేశాలు పొందుతారనేది వేచి చూడాల్సిందే. అనుకున్నస్థాయిలో నమోదుకాని విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం వరకు 3,896 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అనుకున్న మేర విద్యార్థుల నమోదు ప్రక్రియ కావడం లేదనేది స్పష్టమవుతోంది. జిల్లాలో ప్రైమరీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు 568 ఉండగా అందులో అసలు విద్యార్థులే లేని పాఠశాలలు 135 ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలు గు పాఠశాలలే తెరుచుకున్నాయి. అసలే విద్యార్థులు లేని పాఠశాలల టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. విద్యార్థుల నమోదు లక్ష్యం నెరవేరేనా! ప్రభుత్వ స్కూళ్లపై గురుకులాల ప్రభావం జిల్లాలో 3,896 మంది విద్యార్థుల నమోదు -
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
వరంగల్ అర్బన్: అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ నగరవాసులకు మెరుగైన సేవలు అందించాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు తమతమ విభాగాల పనితీరును వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల మరమ్మతులు పక్కాగా చేపట్టాలని మేయర్, కమిషనర్ ఆదేశించారు. అనంతరం సఫాయిమిత్ర కార్మికులకు పీపీఈ కిట్లను వారు పంపిణీ చేశారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి
న్యూశాయంపేట: నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని చెల్లించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ఆర్ఓబీ తదితర అభివృద్ధి పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ఇన్నర్ రింగ్రోడ్డు పనులను ప్రాధాన్యతతో కొనసాగించాలన్నారు. టెక్స్టైల్ పార్కు అభివృద్ధిలో భాగంగా గ్రీన్ కవరింగ్ ఏర్పాటుకు హార్టికల్చర్, ఫారెస్ట్ అనుసంధాన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. టెక్స్టైల్ పార్కులో వరద ముంపు నివారణకు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని సాంకేతికంగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించడానికి ఉపాధి శాఖ, జీఎం ఇండస్ట్రీయల్, డీఆర్డీఓ సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. స్కిల్ డెవలప్మెంట్పై ఇప్పటివరకు నాలుగు బ్యాచ్లకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆర్ఓబీ పనులను ఆగస్టు చివరి వరకు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, జోనల్ మేనేజర్ స్వామి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, గీసుకొండ, సంగెం, నెక్కొండ, పర్వతగిరి తహసీల్దార్లు, నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
షరతులు వర్తిస్తాయి!
సాక్షి, వరంగల్: నర్సంపేటలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో 2025–26 సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లను షరతులతో కూడిన మంజూరు చేస్తూ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) నిర్ణయించింది. అయితే, ఆధార్ ఎనబుల్డ్ బయోమెట్రికల్ అటెండెన్స్ సిస్టం (ఏఈబీఏఎస్ రికార్డు డాటా) ప్రకారం అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన ఫ్యాకల్టీ, రెసిడెంట్, ట్యూటర్ కొరతను అధిగమించడం, ఎక్స్పైరీ అయిన బ్లడ్బ్యాంకు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడం, అదనపు పడకల ఏర్పాటు, శవపరీక్షల కోసం శవాల కొరత ఉండడం వంటి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ మేరకు నాలుగు నెలల్లోగా సమాధానం ఇవ్వాలని షరతుతో ఈ సీట్లు మంజూరు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్కు ఈ నెల 9వ తేదీన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పంపిన లేఖలో పేర్కొంది. మీ కళాశాల సమర్పించిన వార్షిక డిక్లరేషన్ రిపోర్టును సంబంధిత విభాగం సమీక్షించింది. అనుభవజ్ఞులు కూడా మీ కళాశాలలో లోపాలు ఉన్నట్లు మరోసారి గుర్తించారు. అయితే, కళాశాల సమర్పిచిన సమగ్ర నివేదిక సంతృప్తికరంగా లేదు. ఒకవేళ ఈ నాలుగు నెలల సమయంలో ఆ లోపాలను అధిగమించకపోతే 2023 మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ క్లాజ్ 8, చాప్టర్ త్రీ ప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. అదే సమయంలో బోర్డు ఇచ్చిన ఉత్తర్వులతో కళాశాల సంతృప్తి చెందకపోతే ఈ లేఖ అందిన 60 రోజుల్లోపు కమిషన్ ముందు అప్పీల్ చేయవచ్చని సూచించింది. ఇప్పటికే నర్సంపేట వైద్య కళాశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి 50 సీట్ల అనుమతుల కోసం ఆన్లైన్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. రెండో సంవత్సరం విద్యార్థుల కోసం పరికరాలు.. నర్సంపేటలోని వైద్యకళాశాల గతేడాది నవంబర్లో ప్రారంభమైంది.గత విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మళ్లీ కళాశాల ప్రారంభంలో రెండో సంవత్సరం విద్యార్థులు చదివేందుకు కావాల్సిన పరికరాలతోపాటు ఇతర సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరికరాలు మరో రెండు నెలల్లో కళాశాలకు రానున్నాయి. లోపాలను అధిగమిస్తాం.. ఈ ఏడాది నూతనంగా వచ్చే విద్యార్థులకు 50 ఎంబీబీఎస్ సీట్లను అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు కేటాయించింది. 10 సీట్లు నేషనల్ కోటా, 40 సీట్లు రాష్ట్ర కోటాలో విద్యార్థులను తీసుకోనున్నారు. నూతన భవనంలో ఈ కళాశాల నిర్వహిస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. యూజీఎంఈబీ గుర్తించిన లోపాలను అధిగమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాం. – డాక్టర్ మోహన్దాస్, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నర్సంపేట వైద్యకళాశాలకు యూజీఎంఈబీ పచ్చజెండా ఈ విద్యాసంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచన నాలుగు నెలల్లోగా అధిగమించకపోతే కఠిన చర్యలని హెచ్చరిస్తూ లేఖ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ముందుకెళ్తామంటున్న ప్రిన్సిపాల్ 167 మందికి 102 మంది సిబ్బంది.. నర్సంపేట ప్రభుత్వ వైద్యకళాశాలలో 27 మంది ప్రొఫెసర్లకు 16 మంది, 30 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు 19 మంది, 58 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు 26 మంది ఉన్నారు. 16 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు 16 మందికి, 23 మంది సీనియర్ రెసిడెంట్లకు 15 మంది, ఏడుగురు ట్యూటర్స్కు నలుగురు, ఆరుగురు హౌస్సర్జన్లకు ఆరుగురు ఉన్నారు. మొత్తం 167 మందికి 102 మంది సిబ్బంది ఉన్నాయి. మొత్తం 65 ఖాళీలున్నాయి. అయితే, తాజాగా ఎన్ఎంసీ నుంచి ఆదేశాలతో వీటిని భర్తీ చేసే దిశగా కళాశాల ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. -
యంగ్ ఇండియా స్కూల్తో నాణ్యమైన విద్య
వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లతో వర్ధన్నపేటకు కేటాయించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఈ మేరకు స్కూల్ నిర్మాణానికి వర్ధన్నపేట గువ్వలబోడు ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గువ్వలబోడులోని 118 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్తోపాటు మున్సిఫ్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నా ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయారని వివరించారు. స్థానిక దళిత, గిరిజన రైతులు ముందుకు వచ్చి భూములు ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. గువ్వలబోడు ప్రాంతం నిర్మాణాలకు అనువుగా ఉండడంతోపాటు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభమై, విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గ విద్యాభివృద్ధికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మైలురా యిగా నిలుస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు -
‘ఆత్మ’ కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు
దుగ్గొండి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మరో ముందడుగు వేస్తోంది. ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆత్మ కమిటీలు కొన్ని సంవత్సరాలుగా ఆనవాళ్లు లేకుండా పోయాయి. వీటితో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం పెంచేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం ఆత్మ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వ్యవసాయ డివిజన్ను బ్లాక్గా పరిగణించి రైతులు, అధికారులతో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేసింది. యువజన సంఘాలు, మహిళా మండలి సభ్యులు, ఎరువుల దుకాణాల డీలర్లు తదితరుల భాగస్వామ్యంతో 20 నుంచి 24 మందితో కమిటీ ఏర్పాటు అయ్యేది. కన్వీనర్గా ఏడీఏ, మిగిలిన వారు సభ్యులుగా వ్యవహరించేవారు. డివిజన్కు ముగ్గురిని తీసుకుని జిల్లా కమిటీ ఏర్పాటు చేసేవారు. రైతులకు ఆధునిక వ్యవసాయంపై సలహాలు, సూచనలు ఇవ్వడం, వ్యవసాయ శిక్షణ శిబిరాలు, క్షేత్రస్థాయి పర్యటనలు, విజ్ఞాన యాత్రలు నిర్వహింది. 2019 నుంచి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో అప్పటి నుంచి ఆత్మ కమిటీలు కనుమరుగయ్యాయి. ఈసారి ప్రభుత్వం మళ్లీ ఆత్మ కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు పంటల సాగులో సలహాలు సూచనలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో కమిటీలు పూర్తిచేసి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నారు. కమిటీల్లో 24 నుంచి 28 మందికి అవకాశం.. మొదట నియోజకవర్గస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిన అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. నియోజకవర్గ, జిల్లాస్థాయి కమిటీల్లో 24 నుంచి 28 మందికి అవకాశం ఉంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు ప్రాధాన్యం కల్పిస్తారు. కమిటీల్లో వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, సెరికల్చర్, విత్తన డీలర్లు, శాస్త్రవేత్తలకు చోటు కల్పిస్తారు. వ్యవసాయ శాఖ అధికారులు కమిటీలపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఆదేశాలు రాగానే కమిటీలు ఏర్పాటు చేస్తాం.. ఆత్మ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కమిటీలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 28 మంది సభ్యులతో మొదట నియోజకవర్గ కమిటీలు, ఆ తర్వాత జిల్లా కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఆదేశాలు రాగానే కమిటీలు ఏర్పాటు చేస్తాం. నూతనంగా ఏర్పాటయ్యే కమిటీలు రైతులకు సాగులో మెళకువలు, సాంకేతిక వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణపై నిరంతరం సలహాలు ఇస్తాయి. – అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి ఆత్మ కమిటీల లక్ష్యాలు.. పంటల సాగులో రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం. రైతులకు శిక్షణ, మార్గదర్శకత్వం ఇవ్వడం. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం. రైతుల ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం. రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలకు అవకాశం జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు -
ఇళ్ల నిర్మాణానికి మేసీ్త్రలు సహకరించాలి
నర్సంపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మేసీ్త్రలు సహకరించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కమిటీ సభ్యులు, మేసీ్త్రలకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,176 ఇళ్లకు మంజూరు పత్రాలు అందించామని, మరో మూడు వేల ఇళ్లకు త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మొరం (మట్టి) కోసం లబ్ధిదారులు తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధిక మొత్తంలో ఉపాధి దొరుకుతున్న మేసీ్త్రలు ప్రభుత్వం, లబ్ధిదారులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ వెంటవెంటనే విడతల వారీగా బిల్లులు మంజూరు అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. సదస్సులో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
ఆత్మకూరు: రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం రైతు నేస్తం కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి రైతులతో పాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. సాగుచేసే సమయానికి సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక నిధులు ఇస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రూ.78వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆత్మకూరు మండలంలోని రైతులకు 11,201 మంది రైతులకు రూ.10.12 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు బీమా ద్వారా 44 మంది రైతులకు రూ.2.20 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయంలో మెలకువలు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, ఏడీఏ రవీందర్, ఆర్డీఓ నారాయణ, ఆత్మకూరు ఏఎంసీ చైర్పర్సన్ బీరం సునంద సుధాకర్రెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఏఓ యాదగిరి, ఎంపీఓ విమల, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, వాసు, మాజీ సర్పంచ్లు రాజు, రవికుమార్, రవీందర్గౌడ్, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు వినతి.. మండలంలోని తిరుమలగిరికి చెందిన రైతులు కదిరిక సాంబయ్య రూ.70 వేలు, కదిరిక పద్మ రూ.లక్ష15వేలు రైతు బంధు తమకు రాలేదని కలెక్టర్ స్నేహ శబరీష్కు వినతిపత్రం ఇచ్చారు. సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించమని ఏఓ యాదగిరికి కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి ‘రైతు నేస్తం’ కార్యక్రమ వీక్షణ -
ఐదు నియోజకవర్గ స్థానాలకు 11 నామినేషన్లు
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్లో సోమవారం ఐదు నియోజకవర్గ (డైరెక్టర్) స్థానాలకు 11 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారి కోదండ రాములు తెలిపారు. 1వ నియోజకవర్గంలో 2 నామినేషన్లు. ఒకటి అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, రెండు దొంగల చిన్న వెంకట్రాజం. 2వ నియోజకవర్గంలో 2 నామినేషన్లు. బొల్లంపల్లి కుమారస్వామి, కడారి ఆదామ్. 5వ నియోజకవర్గంలో 2 నామినేషన్లు రాగా ఇందులో.. గనవేన శ్రీనివాస్, కూన కనకయ్య, 9వ నియోజకవర్గంలో గుర్రాల భాస్కర్రెడ్డి, మార్పాటి జయపాల్రెడ్డి, బోయినపల్లి రత్నాకర్రావు ఉన్నారు. 15వ నియోజకవర్గంలో 2 నామినేషన్లు. ఒకటి కాసిరెడ్డి వసంత, కంకల భాగ్య ఉన్నారు. కాగా అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి వర్గం నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయల్దేరి సొసైటీ బ్యాంకుకు చేరుకుని నామినేషన్ వేశారు. దీంతో ఎన్నికల సందడి మొదలైంది. కాగా.. నేడు(మంగళవారం) నామినేషన్ల పరిశీలన, బుధవారం ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఏప్రిల్ 24న ఎన్నికల నగారా మోగిన విషయం విదితమే. కాగా గ్రామంలో ఎన్నికల సందడి మొదలైంది. 27న పోలింగ్, అదేరోజు ఎన్నికల కౌటింగ్, పలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.● నేడు పరిశీలన, రేపు ఉపసంహరణ -
కమిషనర్ బిజీబిజీ
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నూతన కమిషనర్గా తాజాగా బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్పాయ్ సోమవారం రోజంతా బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను, జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్న్స్ జడ్జి డాక్టర్ కె.పట్టాభి రామారావును, వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్న్స్ జడ్జి వీబీ.నిర్మలా గీతాంబను వారి కార్యాలయాల్లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం వరంగల్ నగరంలో మంత్రి సురేఖ క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణిని జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కలిసి పూల మొక్క బహూకరించారు. కొద్దిసేపు బల్దియా పరిపాలనా వ్యవహారాలపై చర్చించుకున్నారు. తదుపరి గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రీవెన్స్ సెల్ దరఖాస్తుల పరిష్కారం సిటిజన్ చార్టర్ అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. బల్దియా ఆవరణలో కొనసాగుతున్న కౌన్సిల్ హాల్ ఆధునికీరణను మేయర్తో కలిసి పర్యవేక్షించారు. త్వరగా అందుబాటులోకి తీసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. బల్దియా వింగ్ అధికారులు, జేఏసీ నాయకులు, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది కమిషనర్కు పూల మొక్కలు, బోకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరిక లేకుండా గడిపారు. -
రైతు భరోసాకు వేళాయె
హన్మకొండ: రైతు భరోసాపై అన్నదాతలకు ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసాను ప్రారంభించింది. యాసంగిలో రైతు భరోసా పూర్తిగా అందించకపోవడంతో రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న క్రమంలో వానాకాలం సాగుకు రైతు భరోసా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు సోమవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాను ప్రారంభించారు. వానాకాలంలో రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని ఈ సీజన్లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. హనుమకొండ జిల్లాలోని 14 మండలాలు, 163 గ్రామాల్లో 1,58,368 మంది రైతులుండగా.. వీరికి రూ.157,23,45,433ల పెట్టుబడి సహాయాన్ని రైతు భరోసాగా అందించనున్నారు. ఖాతాల్లో జమ కానున్న సొమ్ము సోమవారం మొదటి రోజు 1,17,160 మందికి రూ.84,08,32,604లు జమ చేసేందుకు జాబితా ట్రెజరీకి చేరింది. వీరికి మంగళవారంలోపు రైతుల ఖాతాల్లో సొమ్ము జమకానుంది. ప్రభుత్వం రైతు భరోసాగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేయనున్నారు. ఏడు రోజుల్లో రైతులందరి ఖాతాల్లో సొమ్ము జమకానుంది. దీంతో ఈ సీజన్లో రైతులకు సమయానికి పెట్టుబడి సహాయం అందనుంది. ఈసారి ముందుగానే వర్షాలు కురవడంతో సాగు పనులు మొదలయ్యాయి. మెట్ట పంటల విత్తనాలు విత్తుతున్నారు. మాగాణి వరి సాగుకు రైతులు నార్లు పోస్తున్నారు. వరి సాగు పనులు క్రమంగా ముమ్మరం కానున్నాయి. ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయం రైతు భరోసాను ఆశించకుండానే మెట్ట పంటల కోసం రైతులు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. వరి సాగు రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నార్లు పోస్తున్నారు. ప్రభుత్వం అందించే సహాయం వరి నాట్లకు, మెట్ట పంటలకు వేసే ఎరువుల కొనుగోలుకు ఉపయోగపడనుంది. మండలాల వారీగా రైతు భరోసా వివరాలు జిల్లాలో 1,58,368 మంది అన్నదాతలు రైతులకు అందనున్న పెట్టుబడి సాయం రూ.157,23,45,433 మొదటి రోజు 1,17,160 మందికి రూ.84,08,32,604లు ట్రెజరీకి జాబితా మండలం గ్రామాలు రైతులు రైతు భరోసా (రూ.లు) ఆత్మకూరు 12 8,616 10,12,47,552 భీమదేవరపల్లి 12 11,991 14,82,54,604 ధర్మసాగర్ 13 13,841 15,43,47,774 ఎల్కతుర్తి 13 12,864 13,34,10,048 హనుమకొండ 06 2,200 91,86,182 హసన్పర్తి 18 17,390 13,65,12,568 ఐనవోలు 10 14,671 16,54,97,201 కమలాపూర్ 16 17,008 16,74,67,961 కాజీపేట 10 8,576 5,97,01,636 వేలేరు 07 8,937 11,35,54,703 దామెర 10 8,616 8,70,64,411 నడికూడ 12 11,090 1,11,14,4716 పరకాల 11 8,222 7,51,26,762 శాయంపేట 13 11,761 1,09,82,9315 -
మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuవరంగల్ పోలీస్ కమిషనరేట్లో పోస్టింగ్లకు పోటాపోటీ ● ప్రజాప్రతినిధులనుంచి లేఖలు, సిఫార్సులు ● లూప్లైన్లో ఎంట్రీ.. ఎస్హెచ్ఓగా కీలక ఠాణాలపై కన్ను ● పైరవీలు, సిఫార్సు లేఖలపై పోలీస్ ఉన్నతాధికారి సీరియస్? ● పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా బదిలీలు, పోస్టింగులు గ్రేటర్ వరంగల్లోని కీలక ఠాణాల కోసం పైరవీలు, లేఖల సిఫారసులు ఉన్నతాధికారులకు తెప్పిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి ఆరోపణలు, వివాదాస్పదంగా ఉన్న పలువురు ఇన్స్పెక్టర్లు ఇతర జిల్లాలకు వివిధ పోస్టింగ్లలో భాగంగా వెళ్లారు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో తిరిగి మళ్లీ ఏదో ఒక కారణం.. పైరవీతో కమిషనరేట్లో ఎంటర్ అవుతున్నారు. వచ్చిరాగానే కీలక ఠాణాలు ఎంపిక చేసుకుని పావులు కదుపుతుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. డీసీఆర్బీ, పీసీఆర్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ తదితర విభాగాల్లో ఉన్న కొందరు ఆ విభాగాలకు సంబంధించిన పనులు చేయకుండా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ లేఖలు, సిఫారసులు చేయించడం పట్ల పోలీసు ఉన్నతాధికారి చికాకు పడినట్లు తెలిసింది. చేసే పని సరిగా చేయకుండా పైరవీలు చేయించడాన్ని సీరియస్గా భావించిన సదరు అధికారి కొందరిని గట్టిగానే మందలించారన్న వార్త పోలీసు సర్కిళ్లలో వైరల్గా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ‘లేఖ’ల పంచాయితీ నడుస్తోంది. ప్రధానంగా వరంగల్ నగర పోస్టింగ్ల ప్రయత్నాలు మామూలుగా లేవు. నగరానికి దూరంగా, లూప్లైన్లో ఉన్న కొందరి కుర్చీల పరుగు సహచర పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పోటాపోటీగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఒక దశలో ఇటు రాజకీయ నాయకులు, అటు పోలీస్ ఉన్నతాధికారులకు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టింగ్ పట్టడమే కాదు తెచ్చుకున్న స్థానాన్ని కాపాడుకునేందుకు కొందరు పోలీస్ ఇన్స్పెక్టర్లు పడరాని పాట్లు పడుతున్నారు. మరికొందరైతే బదిలీలకు కొద్ది రోజుల ముందు కమిషనరేట్లో ఎంటరై లూప్లైన్ సీటు సంపాదించి.. ఆ వెంటనే ఆ పనిచేయకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోస్టింగ్ల కోసం పావులు కదుపుతున్నారు. ఎక్కడ ఎవరూ ఏం మిస్టేక్ చేస్తారా? అని మరీ లేఖలు తీసుకుని కాచుకు కూర్చుంటున్నారు. దీంతో ఠాణాలలో ఎస్హెచ్ఓలుగా పనిచేసే పలువురు అభద్రతాభావానికి గురవుతున్నారన్న చర్చ ఆ శాఖలో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉంది. పోలీసుల పోస్టింగ్లపై ‘అఽధికార’ మార్కు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పలువురు పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఏసీపీల బదిలీ వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ మార్కు ఉందన్న చర్చ ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునుంచే ఇక్కడ పోస్టింగ్ల కోసం పోటాపోటీగా పావులు కదుపుకుంటున్నారన్న చర్చ ఉంది.. ఒక ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) పదవీకాలం ఏడాదిన్నరైనా పూర్తికాక ముందే ఆ పోస్టింగ్లు కొట్టేందుకు వారి సహచరులే ప్రజాప్రతినిధులను కాకా పట్టిన వైనం అప్పట్లో బహిరంగంగానే మాట్లాడుకున్నారు. కాగా, ఈ పోస్టింగ్ల ప్రయత్నాల్లో గత ప్రభుత్వం హయాంలో పనిచేసిన కొందరు దూరంగా ఉంటుండగా.. మరికొందరు ఇప్పటికీ కీలక పోస్టింగ్లు పొందుతున్నారు. కోరుకున్న చోట కొ లువు చేయాలనుకునే కొందరు సీఐలు ఆ ఠాణాల్లో ఖర్చీఫ్ (లేఖ)లు వేసుకుని పోస్టింగ్లపైనే దృష్టిపెట్టడం వల్ల వారు పనిచేస్తున్న విభాగాల్లో పనులు పెండింగ్ పడుతున్నాయి. వీటికి కారణాలేమైనా.. బదిలీలు, పోస్టింగ్లు జరిగినప్పుడల్లా ఆ అంశంపై పోలీస్శాఖలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా కీలక ఠాణాలు, సర్కిళ్లలో పోస్టింగ్ల కోసం సీఐల మధ్య ‘కుర్చీలాట’ సాగడం.. గత ఆరు నెలల వ్యవధిలో జరిగిన బదిలీల సందర్భంగా చాలామందికి స్థానచలనం కలగడం, తిరిగి మళ్లీ పోస్టింగ్లు పొందడం హాట్టాపిక్ అవుతోంది. న్యూస్రీల్చికాకు తెప్పిస్తున్న పైరవీలు, లేఖలు -
వినతులు త్వరగా పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో గ్రీవెన్స్లో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు మొత్తం 145 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, సీపీఓ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని శాఖల అధికారులు రావాల్సిందేకలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా రావాల్సిందేనని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణికి హాజరైన కలెక్టర్ స్నేహ శబరీష్ పోలీస్, ఫారెస్ట్ శాఖ నుంచి అధికారులు వచ్చారా? అంటూ ప్రత్యేకంగా ఆరా తీశారు. వారు రాలేదని అధికారులు తెలపడంతో హాజరు రిజిస్టర్ ఇవ్వమని సంబంధిత అధికారులు నుంచి తీసుకొని పరిశీలించారు. శాఖల వారీగా ఎవరెవరు వచ్చారు? అని పరిశీలించిన కలెక్టర్ ఇకపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు కూడా ప్రజావాణికి హాజరుకావాలని ఆదేశించారు. అధికారులు సకాలంలో హాజరుకావడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ -
కలెక్టర్ను కలిసిన టీఎన్జీఓస్ నాయకులు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను టీఎన్జీఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కేంద్ర సంఘం నేతలు రామునాయక్, పెన్షనర్ల సంఘం నేతలు సర్వర్ హుస్సేన్, గోవర్దన్, జిల్లా టీఎన్జీఓస్ నాయకులు సురేశ్, శ్రీనివాస్, రాజీవ్, ప్రణయ్, ఫాతిమా, సురేఖ, నాగరాణి, చైతన్య, రవళిక, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి టీజీఈసెట్ కౌన్సెలింగ్రామన్నపేట: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రై వేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో డిప్లొ మా విద్యార్థులకు రెండో సంవత్సరం బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీఈసెట్ కౌన్సెలింగ్ నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, టీజీఈసెట్ క్యాంప్ ఆఫీసర్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఈనెల 17 నుంచి 19 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ (స్లాట్ బుక్ చేసిన అభ్యర్థులకు), 17 నుంచి 21 వరకు ఆప్షన్ల ఎంపిక (కళాశాలు, కోర్సులు), 21న ఆప్షన్ల ఫ్రీజింగ్, 25వ తేదీలోపు సీట్ల తాత్కాలిక కేటాయింపు, 25 నుంచి 29 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్సెస్సీ మెమో, డిప్లొమా సర్టిఫికెట్, స్లడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, టీసీ, తదితర సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని వివరించారు. మరిన్ని వివరాలకు htttps://tgecet.nic.in వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు. జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు తనుశ్రీహసన్పర్తి: జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు హసన్పర్తికి చెందిన శీలం తనుశ్రీ ఎంపికై ంది. ఈనెల 11, 12వ తేదీల్లో బాక్సింగ్ అసోిసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన అండర్–17 బాక్సింగ్ పోటీల్లో తనుశ్రీ పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈసందర్భంగా హసన్పర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తనుశ్రీని స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, ప్రధానోపాధ్యాయురాలు సుమాదేవి, ఉపాధ్యాయులు ఎల్లయ్య, పార్థ సారథి అభినందించారు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై విజిలెన్స్ ఆరాకాజీపేట రూరల్: కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న గ్యాంగ్ ఉమెన్లపై వేధింపులకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ అధికారులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సోమవారం రైల్వే సంఘాల నాయకులు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగాల్లో విధుల్లో ఉన్న గ్యాంగ్ ఉమెన్లపై కావాలనే వేధింపులకు పాల్పడుతూ, డ్యూటీలో వర్క్ టార్గెట్ ఇవ్వడ, ఉద్దేశ్యపూర్వకంగా హాజరు వేయకపోవడం, విధులకు విరుద్ధంగా సమయపాలన లేకుండా పని చేయిస్తున్న కొందరు ఇంజనీరింగ్ అధికారులపై సికింద్రాబాద్ రైల్వే విజిలెన్స్ విభాగాధికారులు ఆరా తీస్తున్నట్లు నాయకులు తెలిపారు. మొరాయించిన సర్వర్.. రిజిస్ట్రేషన్లకు బ్రేక్కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం ఈ–కేవైసీ ఆధా ర్ సర్వర్ మొరాయించింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు సర్వర్ పని చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎదురుచూశారు. తిరిగి 12.30 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రతీ రోజు సాయంత్రం 5.30 నిమిషాలకు ముగియాల్సిన రిజిస్ట్రేషన్లు 6.30 నిమిషాల వరకు కొనసాగాయి. -
అనుమతి లేని విద్యాసంస్థలపై కొరడా
కాజీపేట అర్బన్: అనుమతి లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. హంటర్ రోడ్డులోని విశాల్మార్ట్ ఎదురుగా ఉన్న నారాయణ హైస్కూల్ను కాజీపేట మండల విద్యాశాఖ అధికారి బండారి మనోజ్కుమార్ సోమవారం సీజ్ చేశారు. ఎంఈఓ మనోజ్కుమార్ తెలిపి న వివరాల ప్రకారం.. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడిపిస్తున్న నారాయణ హైస్కూల్ను మూసేసి యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశామన్నారు. గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాల సీజ్ విద్యారణ్యపురి: హనుమకొండ రాంగనర్లో అనుమతి లేకుండా నడుపుతున్న మెరీడియన్ హై స్కూల్ను సోమవారం సీజ్ చేసినట్లు హనుమకొండ మండల విద్యాశాఖ అధికారి గుగులోతు నెహ్రూ తెలిపారు. ఆహైస్కూల్ను ఇటీవల ఓసారి సీజ్ చేసినప్పటికీ మళ్లీ సీజ్ను తొలగించుకుని కొనసాగిస్తుండడంతో కాజిపేట ఎంఈఓ బి.మనోజ్కుమార్తో కలిసి వెళ్లి మరోసారి సీజ్ చేసినట్లు నెహ్రూ తెలిపారు. నగరంలోని డబ్బాల జంక్షన్ సమీపంలోని ఏకశిల హై స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని ఓగదిలో పుస్తకాల్ని స్టోర్గా కూడా ఉపయోగించుకుంటున్నట్లు గుర్తించామని, ఆ పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేసినట్లు ఎంఈఓ నెహ్రూ తెలిపారు. నగరంలోని పలు స్కూళ్లు సీజ్ విద్యాశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు -
సంస్కృతిని చాటి చెప్పే శక్తి సాహిత్యానికే ఉంది
నర్సంపేట: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప శక్తి సాహిత్యానికి ఉందని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ అన్నారు. చెన్నారావుపేట మండలంలోని అక్కల్చెడ గ్రామానికి చెందిన ప్రముఖ యువ రచయిత, గాయకుడు పడిదం రాజేందర్ రాసిన అస్మక రాజ్యమే నా తెలంగాణ అనే గేయ కావ్య పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాచీన చరిత్రను జల్లెడ పట్టి నేటి ఆధునిక వ్యవస్థను వర్ణిస్తూ తనదైన శైలిలో భావవ్యక్తీకరణ తెలియజేసిన గొప్ప రచయిత రాజేందర్ అని కొనియాడారు. ఇలాంటి అనేక పాటలు రాసి రాష్ట్రం, దేశంలో గొప్ప కవి,రచయితగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కవి గాయకుడు డాక్టర్ శరత్చమర్, యోచన, రామంచ భరత్, తాళ్ల సునీల్, రేలా కుమార్, జూపాక శివ, గాదెపాక బాబు, మారముళ్ల ఆనందం, వేదాంత్ మౌర్య, జనగాం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ రవీందర్ -
పరిష్కారం ఎప్పుడో?
పక్క ఫొటోలోని వృద్ధులు వర్ధన్నపేట డీసీతండాకు చెందిన బానోతు అంబాలి, డాక్య దంపతులు. వీరు కష్టపడి సంపాదించిన 4 ఎకరాల భూమిని నలుగురు కొడుకులకు రాసిచ్చారు. ఇప్పుడు వృద్ధాప్యంలో వారి బాగోగులు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అన్నం కూడా పెట్టడం లేదని, మాకు న్యాయం చేసి ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకున్నారు.న్యూశాయంపేట: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం ఎప్పుడోనని బాధితులు వాపోతున్నారు. సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో, కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో దరఖాస్తు చేసుకున్నా... పరిష్కారం చూపడం లేదని అంటున్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, హౌసింగ్ పీడీ గణపతిలతో కలిసి ప్రజావాణి వినతులు స్వీకరించారు. మొత్తం 127 దరఖాస్తులు రాగా ఆయాశాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంవత్సరకాలంలో ప్రజల నుంచి ఇప్పటివరకు 11,221 దరఖాస్తులు రాగా 10,349 దరఖాస్తులు పరిష్కరించగా 872 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని కూడా అధికారులు త్వరగా పరిష్కరించాలన్నారు. ఒకవేళ పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారుడికి అర్థం అయ్యేలా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఓ ప్రెసిడెంట్, సీఈఓ రాంరెడ్డి, జనరల్సెక్రటరీ ఫణికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డీసీఓ నీరజ, డీపీఓ కల్పన, డీఎంఅండ్హెచ్ఓ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్ ఉన్నారు. సమష్టి కృషితో సత్ఫాలితాలు .. అధికారుల సమష్టి కృషితో సత్ఫాలితాలు సాధిస్తూ, అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు అందించి జిల్లాను ముందువరుసలో ఉంచుదామని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్గా డాక్టర్ సత్యశారద బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సత్కరించారు. జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవే, నేషనల్ హైవే, విమానాశ్రయం, నర్సంపేట జిల్లా ఆస్పత్రి తదితర ప్రతిష్టాత్మక కార్యక్రమాలను శ్రీకారం చుట్టి తుది దశకు తీసుకురావడం జరిగిందన్నారు. భవిష్యత్లో ఇదే స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని కోరారు.ప్రజావాణిలో మొరపెట్టుకున్న దరఖాస్తుదారులు గ్రీవెన్స్లో 127 వినతులు పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఇందిరమ్మ ఇల్లు రాలేదని..
● వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన పర్వతగిరి: మండలంలోని చెరువుకొమ్ముతండాలో సోమవారం ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో గ్రామానికి చెందిన ధారావత్ సుమన్ అనే వ్యక్తి వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. అధికారులు, స్థానిక నాయకులు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చే వరకు దిగేది లేదని సుమన్ స్పష్టం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సుమన్ నచ్చజెప్పి కిందికి దించారు. అనంతరం ఎస్సై బోగం ప్రవీణ్ పోలీస్స్టేషన్కు తరలించారు. బాధితుడు సుమన్ మాట్లాడుతూ గతంలో తన ఇల్లు విద్యుదాఘాతంతో కాలిపోయిందని, అర్హులైన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని అన్నారు. -
పాకాల ఆయకట్టు కింద త్వరగా నాట్లు వేయాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఖానాపురం: పాకాల ఆయకట్టు కింద త్వరగా నాట్లు వేసుకోవాలని రైతులకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. సోమవారం మండలంలోని ఖానాపురం, అశోక్నగర్, బుధరావుపేట గ్రామాల్లోని రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీసీలో సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావులు రైతులకు పంటల సాగుపై పలు సూచనలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ సంధ్యారాణి కూడా ప్రభుత్వ సూచనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సౌజన్య, తహసీల్దార్ రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హరిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఏఓ బోగ శ్రీనివాస్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
వర్షాకాలం జరభద్రం!
నర్సంపేట: వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. పట్టణం, గ్రామాల్లో అపరిశుభ్రత వాతావరణంతో పలు రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యాధులను అరికట్టాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లా 70 శాతం గ్రామీణ ప్రాంతంగా విస్తరించి ఉండడంతో వర్షాకాలంలో నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలుపుతూ ఇప్పటికే జ్వర సర్వే ప్రారంభించి హైరిస్క్ ప్రాంతాలను కూడా గుర్తించింది. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలతో పాటు మున్సిపాలిటీలో సీజనల్ వ్యాధుల నివారణకు తగు సూచనలు చేస్తుంది. మొదలైన జ్వర సర్వే... జిల్లాలో జ్వర సర్వేను వైద్య ఆరోగ్యశాఖ జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, సూపర్ వైజర్లు ఇంటింటికి తిరుగుతూ నిల్వ నీటిని తొలగించుకోవాలని, లార్వను గుర్తిస్తూ నివారణ చర్యలు చేపడుతున్నారు. అన్ని రకాల పరీక్షల కిట్లు, మందులు అందుబాటులో ఉంచి కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వైద్య శిబిరాలు, మందులు, నమూనాల సేకరణ, పరిశుభ్రత తదితర అంశాలను పర్యవేక్షిస్తూ జ్వరపీడితులను గుర్తిస్తున్నారు. పట్టణంలోని మురికి నీరు నిల్వ స్థలాలను గుర్తించి ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి ఉండే ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను గుర్తిస్తూ హైరిస్క్ ప్రాంతాలుగా నమోదు చేసుకొని అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అన్ని జాగ్రత్తలు చేపడుతున్నాం.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే సర్వేలు నిర్వహిస్తూ ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తున్నాం. నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. ఎక్కడైనా అనారోగ్య సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటే ఆయా ప్రాంతాల్లో ఆస్పత్రుల సిబ్బందికి సమాచారం ఇస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాం. – ప్రకాశ్ డిప్యూటీ డీఎంహెచ్ఓమొదలైన సీజనల్ వ్యాధులు అప్రమత్తమైన యంత్రాంగం ముందు జాగ్రత్తలు మేలంటున్న వైద్యులు జిల్లాలో నమోదైన కేసుల వివరాలు సంవత్సరం డెంగీ మలేరియా 2023 160 7 2024 321 7 2025 18 5 -
‘లేఖల’ పంచాయితీ!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ‘లేఖ’ల పంచాయితీ నడుస్తోంది. ప్రధానంగా వరంగల్ నగర పోస్టింగ్ల ప్రయత్నాలు మామూలుగా లేవు. నగరానికి దూరంగా, లూప్లైన్లో ఉన్న కొందరి కుర్చీల పరుగు సహచర పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పోటాపోటీగా చేస్తు న్న ఈ ప్రయత్నాలు ఒక దశలో ఇటు రాజకీయ నాయకులు, అటు పోలీస్ ఉన్నతాధికారులకు చికా కు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టింగ్ పట డమే కాదు తెచ్చుకున్న స్థానాన్ని కాపాడుకునేందుకు కొందరు పోలీస్ ఇన్స్పెక్టర్లు పడరాని పాట్లు పడుతున్నారు.మరికొందరైతే బదిలీలకు కొద్ది రోజు ల ముందు కమిషనరేట్లో ఎంటరై లూప్లైన్ సీటు సంపాదించి.. ఆ వెంటనే ఆ పనిచేయకుండా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పోస్టింగ్ల కోసం పావులు కదుపుతున్నారు. ఎక్కడ ఎవరూ ఏం మిస్టేక్ చేస్తారా? అని మరీ లేఖలు తీసుకుని కాచుకు కూర్చుంటున్నారు. దీంతో ఠాణాలలో ఎస్హెచ్ఓలుగా పని చేసే పలువురు అభద్రతాభావానికి గురవుతున్నారన్న చర్చ ఆ శాఖలో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉంది. పోలీసుల పోస్టింగ్లపై ‘అఽధికార’ మార్కు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఏసీపీల బదిలీ వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ మార్కు ఉందన్న చర్చ ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి మరుసటి రోజునుంచే ఇక్కడ పోస్టింగ్ల కోసం పోటాపోటీగా పావులు కదుపుకుంటున్నారన్న చర్చ ఉంది.. ఒక ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) పదవీకాలం ఏడాదిన్నరైన పూర్తికాక ముందే ఆ పోస్టింగ్లు కొట్టేందుకు వారి సహచరులే ప్రజాప్రతినిధులను కాకా పట్టిన వైనం అప్పట్లో బహిరంగంగానే మాట్లాడుకున్నా రు. కాగా, ఈ పోస్టింగ్ల ప్రయత్నాల్లో గత ప్రభుత్వం హయాంలో పనిచేసిన కొందరు దూరంగా ఉంటుండగా.. మరికొందరి ఇప్పటికీ కీలక పోస్టింగ్లు పొందుతున్నారు. కోరుకున్న చోట కొలువు చేయాలనుకునే కొందరు సీఐలు ఆ ఠాణాల్లో ఖర్చీఫ్ (లేఖ)లు వేసుకుని పోస్టింగ్లపైనే దృష్టిపెట్టడం వల్ల వారు పనిచేస్తున్న విభాగాల్లో పనులు పెండింగ్ పడుతున్నాయి. వీటికి కారణాలేమైనా.. బదిలీలు, పోస్టింగ్లు జరిగినప్పుడల్లా ఆ అంశంపై పోలీస్శాఖలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా కీలక ఠాణాలు, సర్కిళ్లలో పోస్టింగ్ల కోసం సీఐల మధ్య ‘కుర్చీలాట’ సాగడం.. గత ఆరు నెలల వ్యవధిలో జరిగిన బదిలీల సందర్భంగా చాలామందికి స్థానచలనం కలగడం, తిరిగి మళ్లీ పోస్టింగ్లు పొందడం హాట్టాపిక్ అవుతోంది. చికాకు తెప్పిస్తున్న పైరవీలు, లేఖలు.. గ్రేటర్ వరంగల్లోని కీలక ఠాణాల కోసం పైరవీలు, లేఖల సిఫారసులు ఉన్నతాధికారులకు తెప్పిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి ఆరో పణలు, వివాదాస్పదంగా ఉన్న పలువురు ఇన్స్పెక్టర్లు ఇతర జిల్లాలకు వివిధ పోస్టింగ్లలో భాగంగా వెళ్లారు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో తిరిగి మళ్లీ ఏదో ఒక కారణం.. పై రవీతో కమిషనరేట్లో ఎంటర్ అవుతున్నారు. వచ్చిరాగానే కీలక ఠాణాలు ఎంపిక చేసుకుని పావులు కదుపుతుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. డీసీఆర్బీ, పీసీఆర్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ తదితర విభాగాల్లో ఉన్న కొందరు ఆ విభాగాలకు సంబంధించిన పనులు చేయకుండా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ లేఖలు, సిఫారసులు చేయించడం పట్ల పోలీసు ఉన్నతాధికారి చికాకు పడినట్లు తెలిసింది. చేసే పని సరిగా చేయకుండా పైరవీలు చేయించడాన్ని సీరియస్గా భావించిన సదరు అధికారి కొందరిని గట్టిగానే మందలించారన్న వార్త పోలీసు సర్కిళ్లలో వైరల్గా మారింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పోస్టింగ్లకు పోటాపోటీ ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు, సిఫారసులు లూప్లైన్లో ఎంట్రీ.. ఎస్హెచ్ఓగా కీలక ఠాణాలపై కన్ను పైరవీలు, సిఫార్సు లేఖలపై పోలీస్ ఉన్నతాధికారి సీరియస్? పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా బదిలీలు, పోస్టింగులు -
భూభారతితో సమస్యల పరిష్కారం
పర్వతగిరి: భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. సోమవారం పర్వతగిరిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించి రైతుల నుండి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ భారతితో భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్నాయక్, తహసీల్దార్ వెంకటస్వామి, రైతులు పాల్గొన్నారు. మోహన్రావు సేవలు చిరస్మరణీయం నర్సంపేట రూరల్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రి స్థల దాత దొడ్డ మోహన్రావు సేవలు చిరస్మణీయమని నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్ అన్నారు. నర్సంపేట మెడికల్ కళాశాల ఆడిటోరియంలో సూపరింటెండెంట్ కిషన్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సిబ్బందితో కలిసి మోహన్రావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ మోహన్దాస్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మించేందుకు భూమిని కొనుగోలు చేసి దానం చేసిన మహోన్నతమైన వ్యక్తి దొడ్డ మోహన్రావు అన్నారు. ఇవే కాకుండా ఎన్నో సేవలు చేశారని, వారు భౌతికంగా లేకపోయిన ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 57శాతం ఉత్తీర్ణతవిద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో సెకండియర్ జనరల్ విభాగంలో 1,847 మంది విద్యార్థులకు గాను 977 మంది (57.9శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు డీఐఈఓ శ్రీధర్సుమన్ తెలిపారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో బాలురు 1,104 మందికి గాను 562 మంది (50.91శాతం), బాలికలు 743 మందికి గాను 415 మంది (55.86శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు తెలి పారు. ఒకేషనల్ కోర్సులో 244 మందికి 157 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అదేవిధంగా ఫస్టియర్ జనరల్ విభాగంలో 2,820 మందికి గాను 1,780 మంది విద్యార్థులు (63.12 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. ఒకేషనల్ కోర్సులో 317 మందికి గాను 241 మంది ఉ త్తీర్ణత సాధించినట్లు డీఐఈఓ తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం ● కొండా దంపతులపై టీపీసీసీ చీఫ్కు ఫిర్యాదు వరంగల్: పార్టీని నమ్ముకున్న తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా కొండా సురేఖ దంపతులు అన్యాయం చేస్తున్నారని వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు ఏకరువు పెట్టారు. సోమవారం తూర్పు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈసందర్భంగా పలువురు ఆయనతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కాదని గత ఎన్నికల్లో, గెలిచిన తర్వాత పార్టీలో వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వివరించారు. ఈవిషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భద్రకాళీ దేవాలయ ట్రస్ట్బోర్డులో సైతం గెలిచిన తర్వాత వచ్చిన వారికి అవకాశం కల్పించారే తప్ప సీనియర్లను విస్మరించారని ఫిర్యాదు చేశారు. కాగా.. ‘తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు కల్పిస్తాం’ అని మహేష్కుమార్గౌడ్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంటల రాజు, మాజీ కార్పొరేటర్లు జన్ను అరుణ్, దూపం సంపత్, బిల్ల శ్రీకాంత్, జన్ను రవి, కరాటే ప్రభాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరిమి పరమేశ్, అర్బన్ అధ్యక్షుడు సలీం, వరుణ్, తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
నల్లబెల్లి: రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పని చేసి ఘన విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నల్లబెల్లి, రంగాపూర్, రుద్రగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసిన వారికి దశలవారీగా బిల్లులు చెల్లిస్తామన్నారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తాహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీఓ నర్సింహమూర్తి, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్, మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, నాయకులు మాలోత్ రమేష్, వైనాల అశోక్, ఇస్తారి శేఖర్, తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇల్లు దుగ్గొండి: నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తిమ్మంపేట గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరి కిరణ్రెడ్డి, ఒలిగె నర్సింగరావు, దంజ్యానాయక్, శివాజి, తిరుపతి పాల్గొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి -
కట్టయ్య మృతి తీరని లోటు
నర్సంపేట: సైన్స్ మనిషి కంట కట్టయ్య మృతి తీరని లోటని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో కంచ కట్టయ్య యాది సభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కంచె ఐలయ్యలు పాల్గొని కట్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూఢ నమ్మకాలు వద్దు సైన్స్ ముద్దు అనే దిశగా ప్రయాణించి అందరికీ ఆదర్శంగా ఉ న్నారన్నారు. కంచ కట్టయ్య మృతి బాధాకరమన్నా రు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, కార్పొరేషన్ చైర్మన్ బెల్ల య్యనాయక్,మట్టి మనిషి కొల్లూరి సత్తయ్య, డాక్టర్ ప్రసాద్రావు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తోట కూర వజ్రేష్యాదవ్, గద్వాల ఇన్చార్జ్ సరితతిరుపతయ్య, బిషప్ జోసఫ్ డిపోజ, ఉస్మానియా యూని వర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ రవీందర్యాదవ్, ప్రొ ఫెసర్ రామయ్య, సీపీఎం రాష్ట్ర నాయకులు రాములు, వీరన్నయాదవ్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య -
పార్టీలకు ‘స్థానిక’ జోష్!
మంత్రి పొంగులేటి ప్రకటనతో పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి ● వారంలో నోటిఫికేషన్ ఉంటుందన్న సంకేతాలు ● నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత ● ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ● ఆతర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ● అధికార పార్టీలో మళ్లీ మొదలైన ఆశావహుల ప్రయత్నాలు ● ‘స్థానిక’ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తం సాక్షి ప్రతినిధి, వరంగల్: పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ జోష్ వచ్చింది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు.. ఎన్నికల వేడిని రగిలించాయి. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అత్యధికంగా గెలిచేలా సిద్ధంగా ఉండాలి’ అని నాయకులకు మార్గనిర్దేశం చేసిన మంత్రి ధనసరి సీతక్క పరోక్షంగా ‘స్థానిక’ ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏకంగా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. సోమవారం జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీంతో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ తదితర పా ర్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ని పార్టీల ఆశావహులు పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు! మంత్రుల వ్యాఖ్యలు, ఇదే అంశంపై సోమవారం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంటామనడంతో ‘స్థానిక’ ఎన్నికల నగారా ఖాయమన్న చర్చ జరుగుతోంది. 2019 ఏప్రిల్ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 27న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలు, బూత్లు, ఓటర్ల లిస్టులను ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీ చైర్మన్ పదవులు కేటాయించారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఎస్సీ పురుషుడు/మహిళ, వరంగల్ రూరల్ (వరంగల్) జనరల్, జనగామ అన్ రిజర్వుడ్ కోటాలో పురుషుడు/మహిళ, జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ మహిళ, ములుగు అన్ రిజర్వుడ్ పురుషుడు/మహిళ, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఈసారి నిర్వహించనున్న ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే పరిగణనలోకి తీసుకుంటారా? లేక కొత్త నిబంధనలు తీసుకొస్తారా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలుజిల్లా పేరు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలు స్థానాలు స్థానాలువరంగల్ అర్బన్ 07 07 86 వరంగల్ రూరల్ 16 16 178 భూపాలపల్లి 11 11 106 ములుగు 09 09 72 మహబూబాబాద్ 16 16 198 జనగామ 12 12 140 మొత్తం 71 71 780సర్పంచ్ ఎన్నికలకు సమయం ఉంది.. వాస్తవానికి గతంలో సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగి.. తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగితే, మే, జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల తంతు జరిగింది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరిపించే అవకాశం ఉందనడంతో సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్, సభ్యుల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి వరంగల్లో మంగపేట మండలం, ఏకగ్రీవమైన 305 పంచాయతీలు మినహా 1,403 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా గతేడాది జూలైలోనే అధికారులు పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 1,705 జీపీల్లో 15,056 వార్డుల్లో 22,45,394 మంది ఓటర్లను గుర్తించిన అధికారులు ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు ఎన్నికలకు విముఖత వ్యక్తం చేయడంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కాగా.. తాజాగా ఎన్నికల ప్రస్తావన తెర మీదకు రావడంతో అన్ని పార్టీల ఆశావహులతో సందడి మొదలైంది. -
నేడు ‘గ్రేటర్’ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ చక్కటి వేదిక అని, వినియోగించుకోవాలని కోరారు. లా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు ఆరో సెమిస్టర్, ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు టెన్త్ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఫీజు చెల్లించేందుకు ఈనెల 20 వరకు గడువు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసీం ఇక్బాల్ తెలిపారు. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 23 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్లో చూడవచ్చని వారు సూచించారు. శ్రీరాం అష్టావధానం విజయవంతంవిద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర తెలుగు అవధానంలో ‘తె అక్షర ముష్టికా కథనం’ అనే సరికొత్త అంశాన్ని కంది శంకరయ్య ప్రవేశపెట్టగా చేపూరి శ్రీరాం విజయవంతంగా పూరించారు. అంశం అచ్చుల్లో ఉండగా సరైన హల్లులతో పూరించారు. అనంతరం చేపూరి శ్రీరాంను విద్యావికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ, శతావధాని, చెన్నూరు డిగ్రీ కాళాశాల ప్రిన్సిపాల్ వెంకట రమణ పట్వర్ధన్, శతాశధాని మురళి అభినందించారు. ఈసందర్భంగా పద్యకవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజా మనోహర్బాబు, దహగం సాంబమూర్తి, నున్నపురాజు రమేశ్వర్రాజు, అక్కెర కరుణాసాగర్, కొండా యాదగిరి, గుంటి విష్ణుమూర్తి, వెలుగు ప్రభాకర్, సిద్దంకి బాబు పాల్గొన్నారు. గవర్నర్ చేతుల మీదుగా సీపీ సన్ప్రీత్సింగ్కు అవార్డువరంగల్ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్క్రాస్ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ విజయ్చందర్రెడ్డికి అవార్డు ఎంజీఎం: తెలంగాణ వ్యాప్తంగా నిబద్ధతతో వైద్య సేవలందించిన అత్యుత్తమ 500 మంది వైద్యులను గౌరవిస్తూ ఓ ప్రైవేట్ టీవీ ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ డాక్టర్ అవార్డు–500 కార్యక్రమం నిర్వహించగా.. హనుమకొండకు చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి ఎంపికయ్యారు. వైద్యవృత్తిలో నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన విజయ్చందర్రెడ్డి కేఎంసీలో ప్రొఫెసర్గా, ఆర్వీఎం కళాశాలలో హెచ్ఓడీగా, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్గా ప్రజలకు సేవలందిస్తూ వచ్చారు. ఐఎంఏ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, దక్షిణ భారతదేశ ఆర్థోపెడిక్ సర్జన్ల సంఘం ప్రెసిండెంట్గా బాధ్యతలు సైతం నిర్వర్తిస్తున్నారు. ఈఅవార్డును ఆదివారం హైదరాబాద్లో ఆయన స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు దక్కిన ఈ గుర్తింపు యువ వైద్యుల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు. -
1886లో నిజాం కాలంలో నిర్మాణం..
ప్రస్తుతం మరమ్మతులు పూర్తి చేసుకున్న ఈ కలెక్టర్ క్యాంపు కార్యాలయం 1886లో అప్పటి నిజాం అధికారి జార్జి పామర్రు సారథ్యంలో నిర్మించారు. ఈ భవనం వయస్సు దాదాపు 138 సంవత్సరాలు పై మాటే. ఈ భవనంలో దాదాపు 40 మందికి పైగా కలెక్టర్లు నివాసం ఉన్నారు. కలెక్టర్ బంగ్లా కొత్తది నిర్మించడంతో పాత బంగ్లాను హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రస్తుతం బదిలీ అయిన కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని మరమ్మతులు చేయించారు. దెయ్యం.. భయం గతంలో ఉన్న కలెక్టర్లలో కొందరు ఈ భవనంలో తాము స్వయంగా దెయ్యం అనుభవాలు చవిచూశామని చెప్పడం అప్పట్లో కొంత చర్చనీయాంశమైంది. అయినప్పటికీ ఈ భవనానికి రాకపోకలు, అధికారులు నివాసం ఉండడం యథావిధిగా సాగాయి. ప్రస్తుతం ఈ భవనం అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు సందర్శించే అవకాశం కలుగుతుంది. -
మల్లన్న ఆలయంలో మిథున సంక్రమణ పూజలు
ఐనవోలు: మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు మాస సంక్రమణ పూజలు నిర్వహించారు. సూర్యుడు సంవత్సర కాలంలో 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటాడు. కాగా.. ఆదివారం వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆలయంలో మిథున సంక్రమణ పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం మేలుకొలుపు, నిత్య ఆరాధనలు పూర్తయిన తర్వాత మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, కల్యాణం, ఒగ్గు పూజారులచే పెద్ద పట్నం తదితర కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఉపప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి, అర్చక సిబ్బంది పాల్గొన్నట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. -
నాటక రంగాన్ని భావితరాలకు అందించాలి
హన్మకొండ కల్చరల్ : నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని, కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు సహకరించాలని కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. సాయంత్రం వరంగల్ పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియంలో ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈగ మల్లేశం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభించారు. అతిథులుగా కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, డా.శ్రీరామోజు సుందరమూర్తి, రచయిత వడ్డేపల్లి నర్సింగరావు, వేదిక సలహాదారు పొగాకు రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఆర్ మూర్తి పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా రంగస్థల కళాకారులు కుసుమ సుధాకర్, సాదుల సురేశ్ను ఘనంగా సన్మానించారు. అనంతరం హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు అమ్మ చెక్కిన బొమ్మ, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ వారి కిడ్నాప్ నాటిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు జేఎన్ శర్మ, బిటవరం శ్రీధరస్వామి, సుధాకర్, విజయరాజ్, జూలూరు నాగరాజు, సంజయ్బాబు, ఆకుల సదానందం ఓడపల్లి చక్రపాణి పాల్గొన్నారు. కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం ముగిసిన జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు -
పాలనలో తనదైన మార్క్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూనే.. ప్రాధాన్యం కలిగిన విద్య, వైద్యంతోపాటు ఉమ్మడి వరంగల్ వాసుల ఏళ్లనాటి కల మామునూరు విమానాశ్రయ పనులు ముందుకు తీసుకెళ్లడంలో కలెక్టర్ సత్యశారద తన మార్క్ చూపెడుతున్నారు. కలెక్టర్గా ఆమె సోమవారం నాటికి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికానుంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు గురుకుల పాఠశాలల్లో ‘ఫిర్యాదుల పెట్టె’లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గురుకులాలను సందర్శించిన సమయంలో ఫిర్యాదుల పెట్టెలను తెరిచి విద్యార్థుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈకార్యక్రమానికి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు వచ్చాయి. స్ఫూర్తి కార్యక్రమం ద్వారా పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచారు. అలాగే, గ్రీవెన్స్కు వచ్చే సీనియర్ సిటిజన్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల వరంగల్లో జరిగిన ప్రపంచ అందాల భామల పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేశారు. చారిత్రక వరంగల్ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా పర్యవేక్షించారు. పలు అంశాల్లో ప్రత్యేక చొరవ.. ● కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సత్యశారద తొలి రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఎంజీఎంపై దృష్టిసారించారు. డుమ్మా కొట్టే వైద్యులకు అప్పటి సూపరింటెండెంట్ వి.చంద్రశేఖర్ ద్వారా నోటీసులు కూడా ఇప్పించారు. రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే కొందరు నర్సుల తీరు కూడా మార్చుకోవాలని ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి హెచ్చరించారు. ● ఉమ్మడి వరంగల్ వాసుల ఏళ్లనాటి కల నెరవేర్చే దిశగా కలెక్టర్ అడుగులు వేస్తున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే మామునూరు విమానాశ్రయం కోసం అవసరమయ్యే అదనపు 253 ఎకరాల భూసేకరణ సర్వేను పలు దఫాలుగా రెవెన్యూ అధికారులతో చేయించారు. భూనిర్వాసితులను ఒప్పించడంలో ఆమె విజయవంతమయ్యారని కలెక్టరేట్ వర్గాలంటున్నాయి. అలాగే, ఇన్నర్ రింగ్రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసితులతో సమీక్షలు చేస్తూ భూసేకరణ కొలిక్కి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ● కలెక్టర్గా రాకముందు సీసీఎల్ఏలో పనిచేసిన అనుభవం ఉండడంతో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. భూభారతి సదస్సుల్లో స్వయంగా పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు. ● వరంగల్ బస్టాండ్తో పాటు జిల్లా సమీకృత కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచాలని ఇప్పటికే అధికారులను పలుమార్లు ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది ఎంజీఎంలో మెరుగైన వైద్యసేవలకు ప్రత్యేక చొరవ మామునూరు విమానాశ్రయం ముందుకెళ్లేలా చర్యలు ఫిర్యాదుల పెట్టెలతో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి -
భూ కబ్జాదారుల ఆగడాలకు ఒకరి బలి
ఖిలా వరంగల్: భూ కబ్జాదారుల ఆగడాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మిల్స్కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన పోలపాక కుమారస్వామి (55) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారసత్వంగా సంక్రమించిన భూమిని అమ్ముకోగా, మిగిలిన 14 గుంటల భూమిని ముగ్గురు.. బండి కుమారస్వామి, పులి రజనీకాంత్, తాళ్ల మల్లేశం కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. ఆ భూమి తనదేనని పోలెపాక కుమారస్వామి పత్రాలతో వెళ్తే ఎస్సీ, ఎస్టీ పేరుతో దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్ప డ్డారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కుమారస్వామి ఈనెల 9న తన భూమి వద్దకు వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 80 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే బంధువులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి కుమారుడు రాంకుమార్ ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి -
దొంగలకు ముకుతాడు పడేనా?
బల్దియా ప్రధాన కార్యాలయం గేటుకు కట్టిన తాడు బల్దియా ప్రధాన కార్యాలయం ఆధునికీకరణలో భాగంగా ఆవరణలో గత ఏడాది కిందట గేట్లు ఏర్పాటు చేసి, రంగులు వేశారు. కానీ ఆ గేట్లకు గొళ్లాలు పెట్టడం మరిచిపోయారు. దీంతో కార్యాలయంలోని పరికరాలు దొంగలపాలవుతున్నాయి. చేసేది లేక సెక్యూరిటీ గార్డులు రాత్రి సమయంలో, సెలవు రోజుల్లో గేట్లకు ఇలా తాళ్లు కట్టి ఉంచుతున్నారు. మరి ఈ తాళ్లు దొంగలకు ముకుతాళ్లు వేసేనా? అన్నది బల్దియా అధికారులకే తెలియాలి. – వరంగల్ అర్బన్ -
వరంగల్కు కేటీఆర్ చేసిందేంటో చెప్పాలి
హన్మకొండ చౌరస్తా: గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పదేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ వరంగల్ నగర అభివృద్ధికి చేసిందేంటో చెప్పాలని, లేదంటే 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు తేడా తెలియని మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్.. భద్రకాళి చెరువు పూడికతీతను పరిశీలించడం హాస్యాస్పదం అన్నారు. కమీషన్ల కోసమే చెరువు అభివృద్ధి పనులంటూ ఆరోపించడం చూస్తుంటే దొంగలే దొంగ అంటున్న సామెత గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా బయట తిరగరన్నారు. తన సొంత ఊరు వడ్డ్డేపల్లి రైతుల భూములను లాక్కోవాలని చూసిన వినయ్భాస్కర్కు మా గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. నాడు కేసీఆర్ పాలనలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని వ్యతిరేకించిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, నేడు వత్తాసు పలకడం సిగ్గుచేటని అన్నారు. సమావేశంలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీటీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
భూ కబ్జాదారుల ఆగడాలకు ఒకరి బలి
ఖిలా వరంగల్: భూ కబ్జాదారుల ఆగడాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మిల్స్కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. కరీమాబాద్ చెందిన పోలెపాక కుమారస్వామి (55)ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారసత్వంగా సంక్రమించిన భూమిని అమ్ముకోగా, మిగిలిన 14 గుంటల భూమిని ముగ్గురు బండి కుమారస్వామి, పులి రజనీకాంత్, తాళ్ల మల్లేశం కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. ఆ భూమి తనదేనని పోలెపాక కుమారస్వామి పత్రాలతో వెళ్తే ఎస్సీ, ఎస్టీ పేరుతో దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కుమారస్వామి ఇటీవల తన భూమి వద్దకు వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 80 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి కుమారుడు రాంకుమార్ ఫిర్యాదు మేరకు మిల్స్కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా చేరుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణ కట్టలో పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. సుమారుగా 10 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి సీతక్క దృష్టిసారించి భక్తుల కావాల్సిన సౌకర్యాలను దేవాదాయశాఖ అధికారులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పూజారులు కోరారు. -
‘రోటా’తో రోగాలకు చెక్
గీసుకొండ: పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు పలు రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. వాటిలో రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు రక్షణ కవచంగా ఉంటోంది. ముఖ్యంగా చిన్నారులు నీళ్ల విరేచనాలు, వాంతులు (డయేరియా), జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం లాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వీటిని నిరోధించడం కోసం రైటా వైరస్ వ్యాక్సిన్ (టీకా) పిల్లలకు వేస్తే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా తీవ్రమైన విరేచనాల కారణంగా చిన్నపిల్లల్లో 37 నుంచి 96 శాతం మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. వ్యాక్సిన్ వేయిస్తే వాటికి చెక్ పెట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. మూడు డోసులుగా వ్యాక్సిన్.. శిశువు పుట్టిన 6,10, 14 వారాలకు ఈ వ్యాక్సిన్ను వేస్తారు. 6వ వారం మొదటి, 10వ వారం రెండు, 14వ వారం మూడో డోస్ను ఇస్తామని వైద్యులు చెబుతున్నారు. ఇది నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్. వ్యాక్సిన్ ప్రతి వాయిల్ (సీసా)లో రెండు డోస్లు ఉంటాయి. సీసా మూత తీసిన తర్వాత నాలుగు గంటల్లోపు ఈ వ్యాక్సిన్ను ఇద్దరు చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ వాయిల్లో 4 ఎంఎల్ ఉండగా ఇద్దరిలో ఒక్కొక్కరికి 2 ఎంఎల్ ఇస్తారు. నీడిల్ లేని సిరంజి ద్వారా వ్యాక్సిన్ను తీసుకుని చిన్నపిల్లలకు నోటి (ఓరల్) ద్వారా ద్రవ రూపంలో ఈ వ్యాక్సిన్ను అందిస్తారు. గతంలో ఒక వాయిల్లో 2 ఎంఎల్గా వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా ఒక డోస్గా వేసేవారు. ప్రస్తుతం 4 ఎంఎల్ ఉండే వాయిల్ను అందుబాటులోకి తెచ్చా రు. దీంతో ఇద్దరు పిల్లలకు 2 ఎంఎల్ చొప్పున వ్యాక్సిన్ వేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు.. రోటా వైరస్ అనేది అతిసారం, వాంతులను కలిగించే ఇన్ఫెక్షన్. ఇది పేగు వైరస్. చిన్నపిల్లల్లో సులభంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన పిల్లలు చాలా వరకు కొన్ని రోజుల్లోనే కోలుకుంటారని, కొందరికి ఇది ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ముందస్తుగా ఇలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి రోటా వైరస్ టీకా వేయించాలని సూచిస్తున్నారు. అందుబాటులో వ్యాక్సిన్.. జిల్లాలోని ప్రతీ హెల్త్ సబ్సెంటర్లో వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచినట్లు డిప్యూడీ డీఐఓ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. సబ్సెంటర్లలో ప్రతీ బుధ, శనివారాల్లో పిల్లలకు వ్యాక్సిన్ వేస్తారన్నారు. వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి, సీకేఎం ఆస్పత్రితోపాటు జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ప్రతీ రోజు వ్యాక్సిన్ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. టీకా వేసే కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు శనివారం ప్రారంభించారు. నగరంలోని దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్, గీసుకొండ మండలంలోని కొమ్మాల, సింగ్యతండాల్లో ఆయన వ్యాక్సిన్ వేసే కేంద్రాలను పరిశీలించారు. వైద్యుల సలహా మేరకు అర్హులైన పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. టీకాతో వాంతులు, విరేచనాలు, జ్వరం తదితర వ్యాధుల నివారణ శిశువు పుట్టిన 6,10,14 వారాల సమయంలో ఇవ్వాలి జిల్లాలో చిన్నారులకు ప్రారంభమైన వ్యాక్సినేషన్ -
పాలనలో తనదైన మార్క్
సాక్షి, వరంగల్: జిల్లాలో ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తూనే.. ప్రాధాన్యం కలిగిన విద్య, వైద్యంతోపాటు ఉమ్మడి వరంగల్ వాసుల ఏళ్లనాటి కల మామునూరు విమానాశ్రయ పనులు ముందుకు తీసుకెళ్లడంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద తన మార్క్ చూపెడుతున్నారు. కలెక్టర్గా ఆమె సోమవారం నాటికి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికానుంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు గురుకుల పాఠశాలల్లో ‘ఫిర్యాదుల పెట్టెలు’ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గురుకులాలను సందర్శించిన సమయంలో ఫిర్యాదుల పెట్టెలను తెరిచి విద్యార్థుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు వచ్చాయి. స్ఫూర్తి కార్యక్రమం ద్వారా పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచారు. అలాగే, గ్రీవెన్స్కు వచ్చే సీనియర్ సిటిజన్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల వరంగల్లో జరిగిన ప్రపంచ అందాల భామల పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేశారు. చారిత్రక వరంగల్ ప్రాధాన్యతను ప్రపంచానికి చాటేలా పర్యవేక్షించారు. ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స.. వరంగల్కే కాదు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రికి చికిత్స చేయడంలో కాస్త సఫలమయ్యారు. రోజు వేలాది మంది ఇక్కడికి వైద్య పరీక్షలకు వస్తారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సత్యశారద తొలి రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఎంజీఎంపై దృష్టిసారించారు. డుమ్మాకొట్టే వైద్యులకు అప్పటి సూపరింటెండెంట్ వి.చంద్రశేఖర్ ద్వారా నోటీసులు కూడా ఇప్పించారు. రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే కొందరు నర్సుల తీరు కూడా మార్చుకోవాలని ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి హెచ్చరించారు. ఇలా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి ఎంజీఎం పాలనలో మార్పు తీసుకొచ్చారు. నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రిపై ఫోకస్.. రూ.56 కోట్లతో నర్సంపేటలో 220 పడకలతో నిర్మించిన జిల్లా ఆస్పత్రితో పాటు 50 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలను గతేడాది సెప్టెంబర్లో అందుబాటులోకి తీసుకురావడంలో కలెక్టర్ తనదైన ముద్రవేశారు. అంతకుముందే ఈ నిర్మాణ పనులు జరిగినా.. ఆమె వచ్చాక వారానికోసారి ఈ పనులను సమీక్షించారు. గతేడాది సెప్టెంబర్ 19న అందుబాటులోకి తీసుకురావడంలో అందరూ అధికారులను సమన్వయం చేయడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా నర్సంపేట నియోజకవర్గవాసులకు కార్పొరేట్ తరహా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యానికి పెద్దగా ఇబ్బంది లేకుండా చేశారు. ఎయిర్పోర్ట్ భూసేకరణకు సర్వే.. ఉమ్మడి వరంగల్ వాసుల ఏళ్లనాటి కల నెరవేర్చే దిశగా కలెక్టర్ అడుగులు వేస్తున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే మామునూరు విమానాశ్రయం కోసం అవసరమయ్యే అదనపు 253 ఎకరాల భూసేకరణ సర్వేను పలు దఫాలుగా రెవెన్యూ అధికారులతో చేయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపిస్తే గతేడాది నవంబర్లో నష్టపరిహారం కోసం రూ.205 కోట్లు మంజూరుకు అనుమతిచ్చింది. అయితే అక్కడి భూనిర్వాసితులతో మూడు దఫాలుగా సమావేశమైన కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని జిల్లా చర్చల కమిటీ తమకున్న విచక్షణాధికారాలతో ఎకరాకు రూ.1,20 కోట్లు చెల్లిస్తామంది. వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4,887 చెల్లిస్తామని ఇదే ఫైనల్ అని కలెక్టర్ సత్యశారద తేల్చి చెప్పారు. దీంతో కొందరు రైతులు ఇప్పటికే తమ సమ్మతి తెలిపారు. ఇలా భూనిర్వాసితులను ఒప్పించడంలో ఆమె విజయవంతమయ్యారని కలెక్టరేట్ వర్గాలంటున్నాయి. అలాగే, ఇన్నర్ రింగ్రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసితులతో సమీక్షలు చేస్తూ భూసేకరణ కొలిక్కి వచ్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. భూ భారతిపై తనదైన ముద్ర.. కలెక్టర్గా రాకముందు సీసీఎల్ఏలో పనిచేసిన అనుభవం ఉండడంతో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి సదస్సుల్లో స్వయంగా పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు. రైతులకు ఉన్న సమస్యలపై అక్కడే నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అలాగే, వరంగల్ నగర అభివృద్ధి పనులపై అన్ని విభాగాలతో సమీక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు. వరంగల్ బస్టాండ్తో పాటు జిల్లా సమీకృత కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచాలని ఇప్పటికే అధికారులను పలుమార్లు ఆదేశించారు. ఎంజీఎంలో మెరుగైన వైద్యసేవలకు ప్రత్యేక చొరవ మామునూరు విమానాశ్రయం ముందుకెళ్లేలా చర్యలు ఫిర్యాదుల పెట్టెలతో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి కలెక్టర్గా డాక్టర్ సత్యశారద బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
నల్లబెల్లి: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని నారక్కపేట, రాంపూర్, మేడపల్లి గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, వైనాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ చేతుల మీదుగా సీపీ సన్ప్రీత్సింగ్కు అవార్డు వరంగల్ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్క్రాస్ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. పోగొట్టుకున్న ఫోన్ల అందజేత నెక్కొండ: పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి బాధితులకు పోలీస్ స్టేషన్లో ఆదివారం అందించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల నుంచి దరఖాస్తులు తీసుకుని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేశామని చెప్పారు. సీపీఆర్ఎస్ ఆదేశాల మేరకు సుమారు లక్ష రూపాయల విలువైన ఫోన్లను గుర్తించి దిలీప్, కట్టయ్య, విజయ్పాల్, వినయ్, రాజుకు అందించామని ఎస్సై పేర్కొన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్సై అభినందించారు. శ్రీరాం అష్టావధానం విజయవంతం విద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర తెలుగు అవధానంలో ‘తె అక్షర ముష్టికా కథనం’ అనే సరికొత్త అంశాన్ని కంది శంకరయ్య ప్రవేశపెట్టగా చేపూరి శ్రీరాం విజయవంతంగా పూరించారు. అంశం అచ్చుల్లో ఉండగా సరైన హల్లులతో పూరించారు. అనంతరం చేపూరి శ్రీరాంను విద్యావికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ, శతావధాని చెన్నూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణపట్వర్ధన్, శతావధాని మురళి అభినందించారు. అవధానంలో సహృదయ సాహితీ అధ్యక్షుడు గిరిజా మనోహర్బాబు, దహగం సాంబమూర్తి, విశ్రాంత డీఈఓ నున్నపురాజు రమేశ్వర్రాజు, అక్కెర కరుణాసాగర్, కొండా యాదగిరి, గుంటి విష్ణుమూర్తి, వెలుగు ప్రభాకర్, సిద్ధంకి బాబు పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ నెక్కొండ: పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చంద్రుగొండలోని ఓ ఇంట్లో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం పోలీసులు దాడులు చేశారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన యాదగిరి, నాగరాజు, సురేశ్, శివకష్ణ, కుమారస్వామి పేకాడుతుండగా అరెస్టు చేశామని ఎస్సై చెప్పారు. వారి నుంచి రూ.2,070 నగదుతోపాటు నాలుగు సెల్ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
పార్టీలకు ‘స్థానిక’ జోష్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ జోష్ వచ్చింది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు.. ఎన్నికల వేడిని రగిలించాయి. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అత్యధికంగా గెలిచేలా సిద్ధంగా ఉండాలి’ అని నాయకులకు మార్గనిర్దేశం చేసిన మంత్రి ధనసరి సీతక్క పరోక్షంగా ‘స్థానిక’ ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏకంగా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. సోమవారం జరిగే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీంతో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ని పార్టీల ఆశావహులు పోటీ చేసేందుకు మళ్లీ పావులు కదుపుతున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు! మంత్రుల వ్యాఖ్యలు, ఇదే అంశంపై సోమవారం కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంటామనడంతో ‘స్థానిక’ ఎన్నికల నగారా ఖాయమన్న చర్చ జరుగుతోంది. 2019 ఏప్రిల్ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 27న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికల, అధికార యంత్రాంగం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలు, బూత్లు, ఓటరు లిస్టును సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీ చైర్మన్ పదవులు కేటాయించారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఎస్సీ పురుషుడు/మహిళ, వరంగల్ రూరల్ (వరంగల్) జనరల్, జనగామ అన్ రిజర్వుడ్ కోటాలో పురుషుడు/మహిళ, జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ మహిళ, ములుగు అన్ రిజర్వుడ్ పురుషుడు/మహిళ, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఈసారి నిర్వహించబోయే ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే పరిగణనలోకి తీసుకుంటారా? లేక కొత్త నిబఽంధనలు తీసుకొస్తారా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు సమయం ఉంది.. వాస్తవానికి గతంలో సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగి.. తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగితే, మే, జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల తంతు జరిగింది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరిపించే అవకాశం ఉందనడంతో సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్, సభ్యుల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి వరంగల్లో మంగపేట మండలం, ఏకగ్రీవమైన 305 పంచాయతీలు మినహా 1,403 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా గతేడాది జూలైలోనే అధికారులు పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 1,705 జీపీల్లో 15,056 వార్డుల్లో 22,45,394 మంది ఓటర్లను గుర్తించిన అధికారులు ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు ఎన్నికలకు విముఖత వ్యక్తం చేయడంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కాగా.. తాజాగా ఎన్నికల ప్రస్తావన తెర మీదకు రావడంతో అన్ని పార్టీల ఆశావహులతో సందడి మొదలైంది. 2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు మంత్రి పొంగులేటి ప్రకటనతో పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి వారంలో నోటిఫికేషన్ ఉంటుందన్న సంకేతాలు నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆతర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీలో మళ్లీ మొదలైన ఆశావహుల ప్రయత్నాలు ‘స్థానిక’ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తంజిల్లా పేరు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలు స్థానాలు స్థానాలువరంగల్ అర్బన్ 07 07 86 వరంగల్ రూరల్ 16 16 178 జేఎస్.భూపాలపల్లి 11 11 106 ములుగు 09 09 72 మహబూబాబాద్ 16 16 198 జనగామ 12 12 140 మొత్తం 71 71 780 -
నాటక రంగాన్ని భావితరాలకు అందించాలి
హన్మకొండ కల్చరల్ : నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని, కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు సహకరించాలని కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. సాయంత్రం వరంగల్ పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియంలో ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈగ మల్లేశం పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభించారు. అతిథులుగా కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, డాక్టర్ శ్రీరామోజు సుందరమూర్తి, రచయిత వడ్డేపల్లి నర్సింగరావు, వేదిక సలహాదారు పొగాకు రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఆర్ మూర్తి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రంగస్థల కళాకారులు కుసుమ సుధాకర్, సాదుల సురేశ్ను ఘనంగా సన్మానించారు. అనంతరం హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు అమ్మ చెక్కిన బొమ్మ, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ వారి కిడ్నాప్ నాటిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు జేఎన్ శర్మ, బిటవరం శ్రీధరస్వామి, సుధాకర్, విజయరాజ్, జూలూరు నాగరాజు, సంజయ్బాబు, ఆకుల సదా నందం, ఓడపల్లి చక్రపాణి పాల్గొన్నారు. కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మలేశం ముగిసిన జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు -
గిరిజనుల సంక్షేమానికి కృషి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్వతగిరి: గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ మేరకు మండలంలోని సోమారం, గోరుగుట్టతండా, జగ్గుతండాలో రూ.2.20 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా, ఆరోగ్యం, విద్య తదితర సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, తండాల్లో వసతులు కల్పిస్తామని తెలిపారు. త్వరితగతిన అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్నాయక్, నాయకులు రాఘవులు, భాస్కర్, మహ్మద్అలీ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు దేవాలయానికి వచ్చిన కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కలెక్టర్తో పాటు ఆమె తల్లిదండ్రులు, కూతురు, కుమారుడు ఉన్నారు. పూజల అనంతరం అర్చకులు మహదాశ్వీచనం అందజేశారు. ఈఓ శేషుభారతి వారికి అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. ట్రాన్స్కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ విజేత నల్లగొండ హన్మకొండ: తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025–2026 శుక్రవారం ముగిసింది. బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు పోటీ పడగా, వరంగల్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల జట్టు విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో, నల్లగొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. కబడ్డీ ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు పోటీపడగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో కబడ్డీలో 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్లో 9 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్ట జుజీజ్చి బి.అశోక్ కుమార్, టి.మధుసూదన్, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, కన్వీనర్ ఎ.విజేందర్రెడ్డి, సభ్యులు ఎండీ యాకూబ్ పాషా, సునీల్ కుమార్, ఇ.ప్రేమ్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి, వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ పాల్గొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య సంగెం: కుమారుడు రోడ్డు ప్రమాదం చేశాడని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీఆర్ఎన్ తండాకు చెందిన గుగులోత్ వెంకట్రాం (37)కు భార్య అనిత, ఇద్దరు కుమారులున్నారు. మే 29న ఆయన పెద్ద కుమారుడు లోకేశ్ పల్లారుగూడ గ్రామానికి చెందిన కక్కెర్ల చిరంజీవి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. చిరంజీవి ఎడమకాలు విరిగి ఆస్పత్రిలో చేరాడు. తన కుమారుడిని ఢీకొట్టిన లోకేశ్పై చర్య తీసుకోవాలని ఈనెల 12న సంగెం పోలీస్స్టేషన్లో చిరంజీవి తల్లి సరోజన ఫిర్యాదు చేసింది. కుమారుడిపై కేసు నమోదైందని మనస్తాపం చెందిన వెంకట్రాం శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన భార్య అనిత.. వెంకట్రాం కిందపడి ఉండి నోటి నుంచి నురగలు వస్తున్నట్లు గమనించింది. వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆయన మృతి చెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
పరకాల: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన, ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నందున విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈఓ కె.వాసంతి కోరారు. కొత్త విద్యాసంవత్సరంలో బడిబాటలో భాగంగా పరకాలలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ వాసంతి, ఆర్డీఓ కె.నారాయణ, మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్ చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఈఓ వాసంతి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నందున విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి అవసరమైతే దాతల సహాయం తీసుకోవాలని ఉపాధ్యాయులను, పాఠశాలల అభివృద్ధి కమిటీలను కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ రమాదేవి, మాజీ కౌన్సిలర్ ఉమాదేవి, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు చక్రవర్తుల మధు, కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలినడికూడ: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ వాసంతి అన్నారు. బడిబాటలో భాగంగా.. శుక్రవారం మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ వాసంతి పాల్గొని విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ హనుమంతరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసంతి సాముహిక అక్షరాభ్యాసం చేయించిన డీఈఓ, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ -
‘పింగిళి’లో నాణ్యమైన విద్య
హన్మకొండ అర్బన్: వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తాజా మాజీ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శుక్రవారం ఉదయం పింగిళి కళాశాల 2025–26 అడ్మిషన్ల పోస్టర్ను కలెక్టర్ ప్రావీణ్య క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పింగిళి కళాశాలలోని సైన్స్, ఆర్ట్స్, కామర్స్ మొదలైన అన్ని విభాగాల్లో బోధనను అందిస్తున్న అధ్యాపకులకు అత్యధిక విద్యార్హతలు, దశాబ్దాల సుదీర్ఘ బోధనానుభవం ఉండడం వల్ల నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కళాశాలలో విద్యార్థినులకు కావాల్సిన అన్ని రకాల వసతులు, అత్యాధునిక బోధన ఉండడంతో విద్యార్థినులు చేరి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, దోస్త్, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ సురేశ్ బాబు, అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులపై టోల్ భారంహన్మకొండ: ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ భారం పెరిగింది. ఈనెల 8 నుంచి టోల్ గేట్ల వద్ద రేట్లు పెంచడంతో ఆమేరకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. వరంగల్ రీజియన్ బస్సులు నడిచే రెండు రూట్లలో టోల్ గేట్లు ఉన్నాయి. హనుమకొండ – ఏటూరునాగారం రూట్లో ములుగు సమీపంలో, హనుమకొండ – హైదరాబాద్ రూట్లో రఘునాథపల్లి, బీబీనగర్ వద్ద టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్కు రూ.10 చొప్పున ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న చార్జీలపై ప్రతీ బస్సుకు హైదరాబాద్ రూట్లో రూ.20 చొప్పున, ఏటూరునాగారం రూట్లో రూ.10 చొప్పున, హనుమకొండ – జనగామకు రూ.10 చొప్పున, జనగామ – హైదరాబాద్ రూట్లో తిరిగే బస్సులకు రూ.10 చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచింది. రేపు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానంవిద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అష్టావధాని చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం ఈనెల 15న(ఆదివారం) ఉదయం పదిగంటలకు హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నారు. కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముఖ్య అతిథిగా సహృదయ సాహితీ అధ్యక్షుడు గిరిజామనోహరబాబు, విశిష్ట అతిథిగా దహగాం సాంబమూర్తి, విశ్రాంత విద్యాశాఖ అధికారి రామేశ్వర రాజు పాల్గొంటారని నిర్వాహకులు కొండా యాదగిరి, వెలుగు ప్రభాకర్ తెలిపారు. అనంతరం పద్యకవి సమ్మేళనం నిర్వహిస్తారు. హనుమకొండ డీఎండబ్ల్యూఓగా గౌస్ హైదర్!న్యూశాయంపేట: హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి (డీఎండబ్ల్యూఓ)గా కేఏ.గౌస్ హైదర్ను ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఫారిన్ సర్వీస్లో భాగంగా వ్యవసాయ శాఖ నుంచి డిప్యుటేషన్పై మైనార్టీ సంక్షేమశాఖకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు హనుమకొండ మైనార్టీ సంక్షేమాధికారిగా మంగళవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు, ఈమేరకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు హనుమకొండ డీఎండబ్ల్యూఓగా విధులు నిర్వర్తిస్తున్న డి.మురళీధర్రెడ్డి మే నెలాఖరున ఉద్యోగ విరమణ పొందడంతో డీఎండబ్ల్యూఓ పోస్టు ఖాళీ ఏర్పడింది. తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతికి షోకాజ్ నోటీస్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.లింగయ్యకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. లింగయ్య తన పట్ల అమర్యాదకరంగా మాట్లాడి అవమానపర్చారని తెలుగు విభాగం విశ్రాంత ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ఈఏడాది ఏప్రిల్లో రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. లింగయ్య ఇచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. -
కళాకారులను ప్రోత్సహించాలి
హన్మకొండ కల్చరల్: కళాకారులను ప్రొత్సహించాలని, కళారంగాన్ని కాపాడుకోవాలని అందుకు కళాపోషకులు ముందుకు రావాలని కేయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు–2025 శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈమేరకు వరంగల్ పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో ఆచార్య బన్న అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నాటక పోటీలు ప్రారంభించారు. అలాగే పారితోషిక దాతగా వ్యవహరించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా కవి గిరిజామనోహరబాబు, బండారు ఉమామహేశ్వర్రావు, వేదిక సలహాదారు సంజయ్బాబు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, మాడిశెట్టి రమేశ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం చిలుకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్ వారి మా ఇంట్లో మహాభారతం, నిజామాబాద్ తన్మయి ఆర్ట్స్ వారి చదువు నాటక ప్రదర్శనలు అలరించాయి. కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య ప్రారంభమైన ఆహ్వాన నాటిక పోటీలు -
కళాకారులను ప్రోత్సహించాలి
హన్మకొండ కల్చరల్: కళాకారులను ప్రొత్సహించాలని, కళారంగాన్ని కాపాడుకోవాలని అందుకు కళాపోషకులు ముందుకు రావాలని కేయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు–2025 శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈమేరకు వరంగల్ పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో ఆచార్య బన్న అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నాటక పోటీలు ప్రారంభించారు. అలాగే పారితోషిక దాతగా వ్యవహరించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా కవి గిరిజామనోహరబాబు, బండారు ఉమామహేశ్వర్రావు, వేదిక సలహాదారు సంజయ్బాబు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, మాడిశెట్టి రమేశ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం చిలుకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్ వారి మా ఇంట్లో మహాభారతం, నిజామాబాద్ తన్మయి ఆర్ట్స్ వారి చదువు నాటక ప్రదర్శనలు అలరించాయి. కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య ప్రారంభమైన ఆహ్వాన నాటిక పోటీలు -
‘ప్రీప్రైమరీ’లో ఆంగ్ల విద్య
విద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు మరో అడుగు ముందుకు పడింది. ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య(ఇంగ్లిష్ మీడియం)ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశాలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తున్నారు. ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడంతో విద్యార్థి ఆ పాఠశాలలోనే పూర్తిస్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు ఈవిద్యాసంవత్సరం 2025–26 నుంచి అనుమతులిస్తూ ఇటీవల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలో 29 స్కూళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 13 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. ఈమేరకు హైదరాబాద్ నుంచే ఎంపిక చేసిన పీఎస్ల, యూపీఎస్ల జాబితాలను ఆయా జిల్లాల విద్యాశాఖల అధికారులకు పంపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 31 పీఎస్లలో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. మిగతా మూడు జిల్లాలు మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాలకు అవకాశం కల్పించలేదు. 12 మంది చేరిక హనుమకొండ ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని పాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీలో 12 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు చేర్పించారు. శుక్రవారం వీరికి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయంచారు. కార్యకమంలో ఎంఈఓ నెహ్రూనాయక్, గొల్లపెల్లి పీఎస్లో ఇద్దరు, రాంనగర్ పీఎస్లో ఇద్దరు చిన్నారులు ప్రీప్రైమరీ విద్యలో ప్రవేశాలు పొందారు. వీరికి కూడా టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ అడ్మిషన్లు హనుమకొండ జిల్లాలో 16.. వరంగల్ జిల్లాలో 13 పాఠశాలలు నాలుగేళ్లు నిండిన బాలలకు ప్రవేశాలు పాలెం ప్రభుత్వ పీఎస్లో 12మంది చిన్నారుల చేరిక ఎస్సీఈఆర్టీ నిపుణులతో సిలబస్ రూపకల్పన యూకేజీ మాత్రమే.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. యూకేజీ విద్యార్థుల పాఠాలకు సిలబస్ను కూడా ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు రూపకల్పన చేసినట్లు సమాచారం. యూకేజీ చిన్నారుల కోసం పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ప్రీప్రైమరీలో చేరిన చిన్నారుల విద్యాబోధనకు ఒక్కో స్కూల్కు ఒక్కో వలంటీర్ను, చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు ఒక ఆయాను కూడా నియమిస్తారని తెలుస్తొంది. కాగా.. ఒక్కో స్కూల్ ప్రీప్రైమరీలో 30 మంది చిన్నారులకు ప్రవేశాలకు ఉండనుందని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది.ఈ స్కూళ్లలోనే ప్రీప్రైమరీ.. హనుమకొండ జిల్లాలో ఎంపీపీఎస్లు: పరకాల, ఎంపీపీఎస్ సీతారాంపూర్, మాణిక్యాపూర్, కొప్పూరు, (ఎస్సీ కాలనీ) ముల్కనూరు, భావుపేట కే శ్వాపూర్. ఎంపీయూఎస్లు: మైలారం, ప్రగతి సింగారం, రతన్గిరి. ప్రభుత్వ పీఎస్ లు: కాజీపేట, గొల్లపల్లి, పాలెం, రాంనగర్. వరంగల్ జిల్లాలో.. ఎంపీపీఎస్లు: స్వామిరావుపల్లి, లక్కమారిపల్లి, తొగర్రాయి, రామతీర్థం, లింగాపురం, కొండూరు, కొత్తూరు, బుర్హాపల్లి, పైడిపల్లి, జీపీఎస్ శుంభునిపేట. ఎంపీయూపీఎస్లు: రేకంపల్లి, లెంకాలపల్లి, గన్నారం పాఠశాలల్లో ప్రీౖప్రైమరీ విద్యను అందిస్తున్నారు. -
‘గ్రేటర్’ గాడిన పడేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్: బల్దియా కొత్త కమిషనర్ చౌహత్ బాజ్పాయ్కి నగరంలోని పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు కలెక్టరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న జీడబ్ల్యూఎంసీ, కుడా ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా... క్షేత్రస్థాయిలో కొన్ని విభాగాల్లో కోరలు చాస్తున్న అవినీతి, అక్రమాల వల్ల చెడ్డ పేరు వస్తోంది. పార్కులు, చెరువులు, నాలాల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు నగరంలో విచ్చలవిడిగా సాగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. భవన నిర్మాణదారుల సంఘం ఏకంగా సీఎం పేషీలోనే ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్కు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని ఒప్పించి కాంట్రాక్టర్ల సిండికేట్కు ఎక్సెస్ టెండర్పై పనులు దక్కేలా ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చక్రం తిప్పుతుండడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్తోపాటు కుడా వైస్ చైర్పర్సన్గా ఉన్న అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్పాయ్ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే పాలన గాడిన పడుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కడికెళ్లినా తిరిగి ఇక్కడికే... జీడబ్ల్యూఎంసీలో పని చేయడానికి అలవాటు పడిన అధికారులు ఎక్కడికి వెళ్లినా కొద్దిరోజులే. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మళ్లీ బల్దియాకే వస్తున్నారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీలో ఓ విభాగానికి కీలకాధికారిగా ఉన్న ఒకరు అతడి పదవికి ముప్పు వస్తుందంటే చాలు.. పాదరసంలా పావులు కదుపుతారు. ఈ టాలెంట్తోనే 22 నెలల కిందటి వరకు ఏడాదికోసారి రెన్యువల్ చేయించుకుని నాలుగేళ్లు గడిపిన ఆయన.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొద్ది రోజులు పనిచేశారు. పదోన్నతిపై ఆయన తిరిగి 2024 అక్టోబర్ చివరి వారంలో ‘రాజా’లాగా బల్దియాలోని కీలకపోస్టులో చేరారు. ఆయన ఉన్న సమయంలోనే బల్దియా నిధుల దుర్వినియోగంతోపాటు పెద్ద సంఖ్యలో జరిగిన ఔట్ సోర్సింగ్ కార్మికుల నియామకాల్లో రూ.లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ, స్పెషల్ బ్రాంచ్లు విచారణ చేపట్టాయి. ● జూనియర్ అసిస్టెంట్గా చేరి ట్యాక్స్ ఆఫీసర్స్థాయి వరకు ఎదిగిన మరో అధికారి సైతం ‘బల్దియా’ను వదల అన్నారు. ప్రమోషన్కు ముందు.. తర్వాత కొద్ది మాసాలు మాత్రమే ఇతర మున్సిపాలిటీలకు వెళ్తూ వెంటనే జీడబ్ల్యూఎంసీకి రావడం ఇతడికి పరిపాటి. ఎన్నికల నిబంధనల మేరకు ట్యాక్స్ ఆఫీసర్గా వర్ధన్నపేట మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఇటీవల మళ్లీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పదవిలో చేరారు. ● పీహెచ్సీ వర్కర్ నుంచి టీఓ వరకు ఎదిగిన ఒకరు ‘గ్రేటర్’ను వదలడం లేదు. హెల్త్అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్గా ఇక్కడే పనిచేసి.. కమిషనర్ పదోన్నతిపై భూపాలపల్లి, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో కొద్ది రోజులు మాత్రమే పనిచేసిన సదరు అధికారి పన్నుల విభాగం కీలక అధికారిగా చేరారు. ● ఇంజనీరింగ్ విభాగంలో చిన్న ఉద్యోగిగా విధుల్లో చేరిన ఒకరు ఓ ఉన్నతస్థాయి అధికారిగా ఎదిగి ఇక్కడే ఉద్యోగ విరమణ చేశారు. ● ‘కుడా’లో డిప్యూటీ ఈఈ నుంచి ఎస్ఈ వరకు ఇక్కడి పనిచేస్తున్న ఓ అధికారి వరంగల్ను వదలడం లేదు. ఇలా చాలామంది ఉన్నారు. కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కొరడా ఝుళిపించేనా.. జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’లో ఇష్టారాజ్యం.. పలు విభాగాలపై అవినీతి ఆరోపణలు ప్రతి పనికి రేట్ ఫిక్స్ చేసి వసూళ్లు.. అభివృద్ధి ఉన్నా అవినీతితో చెడ్డపేరు బల్దియాలో ఏళ్ల తరబడిగా అధికారుల తిష్ట.. ఎక్కడికి బదిలీ చేసినా పదోన్నతులపై ఇక్కడికే..అవినీతి ఆరోపణల్లో పలు విభాగాలు.. ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ తదితర శాఖలపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. వరంగల్ నగరం చుట్టూ విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాన్ లేఅవుట్ ప్లాట్లను ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో గొలుసుకట్లు చెరువులు, జీడబ్ల్యూఎంసీ స్థలాలు, కీలకమైన నాలాలను ఆక్రమించి వెంచర్ల వేయడంతో పాటు ఇండ్లు నిర్మించుకున్న వారికి అనుమతులు ఇచ్చి పెద్దమొత్తంలో వసూలు చేశారన్న ఫిర్యాదులపై ‘విజిలెన్స్’ విచారణకు ఆదేశించారు. ఆరు నెలల వ్యవధిలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్వహించిన సుమారు రూ.314 కోట్ల ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ కాంట్రాక్టర్లను మిలాఖత్ చేసి 4.99 శాతం ఎక్సెస్ టెండర్ పనులు దక్కేలా చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పెద్దమొత్తంలో అందరూ కలిసి వాటాలు పంచుకున్నారన్న ప్రచారం ఉంది. -
ప్రయాణికులపై టోల్ భారం
హన్మకొండ: ఆర్టీసీ ప్రయాణీకులపై టోల్ భారం పెరిగింది. ఈనెల 8 నుంచి టోల్ గేట్ల వద్ద రేట్లు పెంచడంతో ఆమేరకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. వరంగల్ రీజియన్ బస్సులు నడిచే రెండు రూట్లలో టోల్ గేట్లు ఉన్నాయి. హనుమకొండ – ఏటూరునాగారం రూట్లో ములుగు సమీపంలో, హనుమకొండ – హైదరాబాద్ రూట్లో రఘునాథపల్లి, బీబీనగర్ వద్ద టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్కు రూ.10 చొప్పున ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న చార్జీలపై ప్రతీ బస్సుకు హైదరాబాద్ రూట్లో రూ.20 చొప్పున, ఏటూరునాగారం రూట్లో రూ.10 చొప్పున, హనుమకొండ – జనగామకు రూ.10 చొప్పున, జనగామ – హైదరాబాద్ రూట్లో తిరిగే బస్సులకు రూ.10 చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచింది. -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, మలేరియా అధికారి రజిని, డీబీసీడీఓ పుష్పలత తదితర అధికారులు పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడానికి ఈనెల 15 నుంచి 30 ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జనమన్) నిర్వహణపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల్లో గిరిజనులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. -
ప్రీరౖపెమరీలో ఆంగ్ల విద్య
విద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు మరో అడుగు ముందుకు పడింది. ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య(ఇంగ్లిష్ మీడియం)ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశాలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తున్నారు. ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడంతో విద్యార్థి ఆ పాఠశాలలోనే పూర్తిస్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు ఈ విద్యాసంవత్సరం 2025–26 నుంచి అనుమతులిస్తూ ఇటీవల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. యూకేజీ మాత్రమే.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. యూకేజీ విద్యార్థుల పాఠాలకు సిలబస్ను కూడా ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు రూపకల్పన చేసినట్లు సమాచారం. యూకేజీ చిన్నారుల కోసం పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ప్రీప్రైమరీలో చేరిన చిన్నారుల విద్యాబోధనకు ఒక్కో స్కూల్కు ఒక్కో వలంటీర్ను, చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు ఒక ఆయాను కూడా నియమిస్తారని తెలుస్తొంది. కాగా.. ఒక్కో స్కూల్ ప్రీప్రైమరీలో 30 మంది చిన్నారులకు ప్రవేశాలకు ఉండనుందని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో 29 స్కూళ్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 13 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. ఈమేరకు హైదరాబాద్ నుంచే ఎంపిక చేసిన పీఎస్ల, యూపీఎస్ల జాబితాలను ఆయా జిల్లాల విద్యాశాఖల అధికారులకు పంపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 31 పీఎస్లలో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. మిగతా మూడు జిల్లాలు మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాలకు అవకాశం కల్పించలేదు. 12 మంది చేరిక.. హనుమకొండ ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని పాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీలో 12 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు చేర్పించారు. శుక్రవారం వీరికి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయంచారు. కార్యకమంలో ఎంఈఓ నెహ్రూనాయక్, గొల్లపల్లి పీఎస్లో ఇద్దరు, రాంనగర్ పీఎస్లో ఇద్దరు చిన్నారులు ప్రీప్రైమరీ విద్యలో ప్రవేశాలు పొందారు. వీరికి కూడా టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు. ఈ స్కూళ్లలోనే ప్రీప్రైమరీ.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ అడ్మిషన్లు హనుమకొండ జిల్లాలో 16.. వరంగల్ జిల్లాలో 13 పాఠశాలలు నాలుగేళ్లు నిండిన బాలలకు ప్రవేశాలు పాలెం ప్రభుత్వ పీఎస్లో 12మంది చిన్నారుల చేరిక ఎస్సీఈఆర్టీ నిపుణులతో సిలబస్ రూపకల్పనవరంగల్ జిల్లాలో.. ఎంపీపీఎస్లు: స్వామిరావుపల్లి, లక్కమారిపల్లి, తొగర్రాయి, రామతీర్థం, లింగాపురం, కొండూరు, కొత్తూరు, బుర్హాపల్లి, పైడిపల్లి, జీపీఎస్ శుంభునిపేట. ఎంపీయూపీఎస్లు: రేకంపల్లి, లెంకాలపల్లి, గన్నారం.హనుమకొండ జిల్లాలో ఎంపీపీఎస్లు: పరకాల, ఎంపీపీఎస్ సీతారాంపూర్, మాణిక్యాపూర్, కొప్పూరు, (ఎస్సీ కాలనీ) ముల్క నూరు, ముల్కనూరు, భావుపేట కేశ్వాపూర్. ఎంపీయూపీఎస్లు: మైలారం, ప్రగతి సింగారం, రతన్గిరి. ప్రభుత్వ పీఎస్లు : కాజీపేట, గొల్లపల్లి, పాలెం, రాంనగర్. -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
న్యూశాయంపేట: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, మలేరియా అధికారి రజిని, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడానికి ఈనెల 15 నుంచి 30 ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జనమన్) నిర్వహణపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గిరిజనులు అధికంగా ఉండే గ్రామాలను ఎంపిక చేసి ప్రజలకు ఆధార్కార్డు, కుల ధ్రువీకరణపత్రం, ఆయుష్మాన్ భారత్ కార్డు, రేషన్కార్డు, కిసాన్కార్డులు అందించాలని ఆదేశించారు. అర్హులతో దరఖాస్తులు చేయించాలని కలెక్టర్ సూచించారు. ఈవీఎం గోదాముల తనిఖీ వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులోని జిల్లా వేర్హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ డాక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. ఇంకుడు గుంతలను నిర్మించాలి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఇళ్ల నుంచి వెలువడే నీరు, వర్షపు నీరు, మురుగు నీరు భూగర్భంలో ఇంకే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్కు ఏర్పాట్లు చేయాలి జిల్లాలో ఈ నెల 16న ప్రారంభించనున్న 21 రైతునేస్తం కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరి గిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం..
వరంగల్ అర్బన్: నగరాభివృద్ధికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో ఆమె కమిషనర్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కమిషనర్ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్లో మున్సిపల్ కమిషనర్గా కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. మున్సిపల్ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టం చేశారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యం, భవన నిర్మాణ అనుమతులకు జారీ చేసే విధానం, శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్య, చెత్త తరలింపు వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు, తదితర అంశాలను విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కమిషనర్ను డిప్యూటీ కమిషనర్లు ప్రసూనారాణి, రవీందర్, (అడ్మిన్)రాజేశ్వర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, సిటీ ప్లానర్లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్, పీఆర్ఓ ఆయుబ్ అలీ డిప్యూటీ కమిషనర్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు పిలుపునిచ్చిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఉద్యోగ బాద్యతల స్వీకరణ -
‘గ్రేటర్’ గాడిన పడేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్: బల్దియా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి సొంత విభాగంలో పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు కలెక్టరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ల ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని విభాగాల్లో కోరలు చాస్తున్న అవినీతి, అక్రమాల వల్ల చెడ్డ పేరు వస్తోంది. పార్కులు, చెరువులు, నాలాల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు నగరంలో విచ్చలవిడిగా సాగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. భవన నిర్మాణదారుల సంఘం ఏకంగా సీఎం పేషీలోనే ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్కు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని ఒప్పించి కాంట్రాక్టర్ల సిండికేట్కు ఎక్సెస్ టెండర్పై పనులు దక్కేలా ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చక్రం తిప్పుతుండడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్తోపాటు ‘కుడా’ వైస్ చైర్మన్గా ఉన్న అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్పాయ్ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే పాలన గాడిన పడుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కడికెళ్లినా తిరిగి ఇక్కడికే.. జీడబ్ల్యూఎంసీలో పని చేయడానికి అలవాటు పడిన అధికారులు ఎక్కడికి వెళ్లినా కొద్దిరోజులే. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మళ్లీ ‘బల్దియా’కే వస్తున్నారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీలో ఓ విభాగానికి కీలకాధికారిగా ఉన్న ఒకరు అతడి పదవికి ముప్పు వస్తుందంటే చాలు.. పాదరసంలా పా వులు కదుపుతారు. ఈ టాలెంట్తోనే 22 నెలల కిందటి వరకు ఏడాదికోసారి రెన్యువల్ చేయించుకుని నాలుగేళ్లు గడిపిన ఆయన.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొద్ది రోజులు పని చేశారు. పదోన్నతిపై ఆయన తిరిగి 2024 అక్టోబర్ చివరి వారంలో ‘రాజా’లా బల్దియాలోని కీలకపోస్టులో చేరారు. ● జూనియర్ అసిస్టెంట్గా చేరి ట్యాక్స్ ఆఫీసర్ స్థాయి వరకు ఎదిగిన మరో అధికారి సైతం ‘బల్దియా’ను వదల అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ట్యాక్స్ ఆఫీసర్గా వర్ధన్నపేట మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఐదు రోజుల కిందటే మళ్లీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పదవిలో చేరారు. వీరితోపాటు మరికొందరు ఇక్కడే తిష్టవేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణల్లో పలు విభాగాలు.. ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ తదితర శాఖలపై అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏకంగా మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని సైతం మెప్పించి పనులు కానిచ్చారన్న ఫిర్యాదులున్నాయి. వరంగల్ నగరం చుట్టూ విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాన్ లేఅవుట్ ప్లాట్లను ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్వహించిన సుమారు రూ.314 కోట్ల ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ కాంట్రాక్టర్లను మిలాఖత్ చేసి 4.99 శాతం ఎక్సెస్ టెండర్ పనులు దక్కేలా చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. బల్దియా కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న చాహత్ బాజ్ పాయ్కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కొరడా ఝుళిపించాల్సిందే.. జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’లలో ఇష్టారాజ్యం.. పలు విభాగాలపై అవినీతి ఆరోపణలు బల్దియాలో ఏళ్ల తరబడిగా అధికారుల తిష్ట ఎక్కడికి బదిలీ చేసినా పదోన్నతులపై ఇక్కడికే..నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాంఅధికారులకు పిలుపునిచ్చిన కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ అర్బన్: నగరాభివృద్ధికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్ కమిషనర్ చాహాత్ బాజ్ పేయి పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మునిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా చాహాత్ బాజ్ పేయి ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కమిషనర్ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్లో మున్సిపల్ కమిషనర్గా కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉందని మున్సిపల్ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టం చేశారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్గా స్నేహ శబరీష్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా బాధ్యతలు స్వీకరించిన స్నేహ శబరీష్ను అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ ఓ వై.వి గణేశ్, డీఆర్డీఏ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, అధికారులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు దేవాలయానికి వచ్చిన కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కలెక్టర్తో పాటు ఆమె తల్లిదండ్రులు, కూతురు, కుమారుడు ఉన్నారు. పూజల అనంతరం అర్చకులు మహదాశ్వీచనం అందజేశారు. ఈఓ శేషుభారతి వారికి అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. -
రసాయన ఎరువులు తగ్గించాలి
సంగెం: అవసరం మేరకే పంటలకు రసాయన ఎరువులు వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.ఉమారెడ్డి సూచించారు. వంజరపల్లి, కాపులకనిపర్తి గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ఆదా చేసి భావితరాలకు అందించాలన్నారు. పంటల మార్పిడి పాటించి సుస్థిర ఆదాయం పొందాలని, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. వరినారు మడుల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, అపరాలు, కూరగాయల సాగు గురించి వివరించారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న, అశ్విని, శ్రావణ్, ఏఓ యాకయ్య, ఏఈఓలు రాజేందర్, లావణ్య, రైతులు పాల్గొన్నారు. -
కమిషనరేట్లో వరుస దొంగతనాలు
● ఒక్కో పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులు పెండింగ్ ● స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగి పోతున్న బాధితులు ● కనిపించని పోలీస్ పెట్రోలింగ్.. ● సమీక్షలకే అధికారులు పరిమితం కమిషనరేట్ పరిధిలో చోరీలు ఇలా..● ఈ ఏడాది జనవరి 21న హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తూరుజెండా, సుభాష్కాలనీలో తాలం వేసిన ఓ ఇంట్లో దొంగలు పడి 178 గ్రాముల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. ఇదే నెలలో కొత్తూరుజెండాలో రూ.3.50 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఇదే పోలీస్స్టేషన్ పరిధి కాకాజీ కాలనీలోని ఓ ఆస్పత్రిలో ఏప్రిల్ 8న బ్యాగులో బంగారం పెట్టి స్నానింగ్కు వెళ్లి వచ్చే సరికి బ్యాగు అపహరణకు గురైంది. అందులో 7 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ● ఏప్రిల్ 5న హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధి నయీంనగర్లో 5 తులాల బంగారం, రూ.50 వేల నగదు దొంగతనం జరిగింది. ● మామునూరు పోలీస్స్టేషన్ పరిధి బొల్లికుంట, సింగారంలో ఏప్రిల్లో రూ.15 లక్షల నగదు, రూ.2.50 లక్షల విలువైన బంగారు అభరణాలు చోరీకి గురయ్యాయి. ● మే నెలలో ఖానాపూర్ మండల కేంద్రంలో చోరీ జరిగి రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పోయాయి. అలాగే.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధి కృష్ణాకాలనీలో రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధి వెంకటేశ్వర కాలనీలో రూ.17 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ● ఈనెల 8న మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధి పడమర కోటలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తన ప్రేయసిని సంతోష పెట్టడానికి తన ఇంట్లోనే చోరీ చేసి 16 తులాల బంగారం ఎత్తుకుపోయి పోలీసులకు చిక్కిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే పోలీస్స్టేషన్ పరిధి గణేశ్నగర్లో ఈనెల 11న చోరీ జరిగి 7 తులాల బంగారం, 70 తులాల వెండి ఆభరణాలు పోయాయి. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ట్రైసీటీల్లో ఎక్కడ ఎప్పడు దొంగతనం జరుగుతుందో.. ఎంత నష్టపోవాల్సి వస్తుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగలతోపాటు స్థానిక దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి, ఒకటి రెండు రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. కమిషనరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక్క హన్మకొండ పోలీస్స్టేషన్ పరిధిలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు 35 చోరీలు జరిగాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో చోరీలు రాత్రి పూట ఎక్కువగా జరిగేవి. అయితే ఇటీవల రాత్రి, పగలు తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు కేవలం పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మిగితా సమయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఇంకా రికవరీ కాలేదు. జాడలేని పెట్రోలింగ్ ఒకపక్క జోరుగా చోరీలు జురుగుతుంటే మరో పక్క పోలీస్ పెట్రోలింగ్ జాడ లేకుండా పోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీస్ ఉన్నత అధికారులు ప్రతీ సమీక్ష సమావేశంలో విజుబుల్ పోలీసింగ్ పెంచాలని కింది స్థాయి అధికారులకు పదే పదే చెబుతున్నా.. చాల మంది అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికారుల ఆదేశాలను అలా విని ఇలా వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు తిరగడం లేదు. స్థానిక దొంగలు ఇలాంటి విషయాలను పసిగట్టి ఆ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తమై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఫలితం లేకుండా పోతోంది. పోలీస్ ఉన్నతాధికారులు కేవలం సమీక్షలకే పరిమితం అవ్వడం వల్లే క్షేత్ర స్థాయిలో అధికారులు దొంగలను పట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు దృష్టిసారించేనా..? కమిషనరేట్ పరిధిలో చోరీలతో పాటు చైన్స్నాచింగ్లు, ద్విచక్ర వాహనాలు పదుల సంఖ్యలో పోతున్నాయి. అధికారులు రికవరీ మాత్రం నామమాత్రంగా చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను పోగొట్టుకున్న బాధితులు పోలీస్స్టేన్ల చుట్టూ తిరుగుతున్నా అధికారులు కేసులు నమోదు చేయడం లేదు. వెతుకుతున్నాం.. దొరికితే అప్పగిస్తాం.. కేసులు పెడితే కోర్టు నుంచి రికవరీ చేసుకోవాల్సి ఉంటుందని భయపెట్టి కేసుల నమోదులో జాప్యం చేస్తున్నారు. నెలల తరబడి తిరిగినా కేసులు నమోదు చేయకపోవడంతో బాధితులు వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మధ్యలోనే వదిలేస్తున్నారు. నగరంలోని చాల పోలీస్స్టేషన్ల పరిధిలో ఎన్ని చోరీలు జరిగినా వాటి రికవరీ విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టడం లేదనే విషయం ఉన్నత అధికారుల సమీక్షల్లో వెల్లడయినా చర్యలు లేకపోవడంతో రికవరీ ఎక్కడ వెసిన గొంగ ళి అక్కడే అన్న చందంగా తయారైంది. -
హనుమకొండ కలెక్టర్గా స్నేహ శబరీష్
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ అయ్యా రు. ఆమె స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న స్నేహ శబరీష్ను కలెక్టర్గా నియమించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈమె గతంలో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా పని చేశారు. స్నేహ శబరీష్ ములుగు జిల్లా ఎస్పీగా పని చేస్తున్న శబరీష్ సతీమణి. గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇక్కడి నుంచి బదిలీ అయిన 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పి.ప్రావీణ్య 2019–20లో కరీంనగర్ ట్రెయినీ కలెక్టర్గా, కొద్ది రోజులు జీహెచ్ఎంసీ లో అడిషనల్ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వా త 2021 సెప్టెంబర్ 3 నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. 2023లో వరంగల్ కలెక్టర్గా ఉన్న గోపి బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో అదే ఏడాది మార్చి 13న ప్రావీణ్య నియమి తులయ్యారు. కాగా హనుమకొండ కలెక్టర్గా ఉన్న సిక్తా పట్నాయక్ 2024 జూన్ 16న బదిలీ కాగా.. ఆమె స్థానంలో వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్యను నియమించిన ప్రభుత్వం.. వరంగల్ కలెక్టర్గా సత్య శారదను నియామకం చేశారు. సుమారు ఏడాదిగా హనుమకొండ కలెక్టర్గా పనిచేసిన ప్రావీణ్య అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ముందు కు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. బల్దియా కమిషనర్పై బదిలీ వేటు.. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన చాహత్ బాచ్పాయ్ని నియమించారు. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అశ్విని తానాజీ వాకడేను 2023లో వరంగల్ అడిషనల్ కలెక్టర్ నుంచి బదిలీ చేసి వరంగల్ మున్సి పల్ కమిషనర్గా నియమించారు. బల్దియా అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపుల విషయంలో జాప్యం చేయడం తదితర ఆరోపణలు ఎదుర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీ, స్మార్ట్సిటీ పనుల్లో అవినీ తి, అక్రమాలు, టెండర్లు లేకుండా పనుల కేటా యింపు, బిల్లుల చెల్లింపుల్లో పర్సెంటేజీలు తదిత ర విషయాల్లో కీలక ప్రజాప్రతినిధికి వంతపాడారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను కరీంనగర్ అడిషనల్ కలెక్టర్గా నియమించారన్న ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా నియమితులైన చాహత్ బాచ్పాయ్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సతీమణి. సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య బదిలీ బల్దియా కమిషనర్గా చాహత్ బాజ్పాయ్ అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు.. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్గా నియామకం -
విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్
విద్యారణ్యపురి: వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. వివిధ చోట్ల స్కూళ్లను మామిడి తోరణాలు, పూలు, బెలూన్లతో అలంకరించి పిల్లలకు తొలిరోజే గొప్ప అనూభూతి కలిగేలా ఆహ్వానం పలికారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందజేసి స్వాగతించారు. ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశాలు కూడా నిర్వహించారు. కొందరు తమపిల్లలతోపాటు పాఠశాలలకు వచ్చారు. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన చిన్నారులు మారాం చేస్తుండగా బుజ్జగించడం కనిపించింది. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ హనుమకొండ జిల్లాలో 477, వరంగల్ జిల్లాలో 558 పాఠశాలల్లో తొలిరోజు హాజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. హనుమకొండ పోచంపల్లి పాఠశాలలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ ప్రావిణ్య, డీఈఓ వాసంతి, కమలాపూర్ భీంపెల్లిలో జెడ్పీసీఈఓ విద్యాలత, ఎలకతుర్తి మండలం వల్బాపూర్ జెడ్పీఎస్ఎస్లో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రా యి జెడ్పీహెచ్ఎస్, పల్లారిగూడెం యూపీఎస్లను జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ కె.సుభాష్ సందర్శించారు. వరంగల్ కృష్ణాకాలనీ ప్రభుత్వ పాఠశాలలో 300ల మంది విద్యార్థులకు 150 మంది, హనుమకొండ పోచంపెల్లి పాఠశాలలో 180 మందికి 100 మంది హాజరయ్యారు. వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ పలు పాఠశాలలను సందర్శించి పర్యవేక్షించారు. పునఃప్రారంభమైన పాఠశాలలు మామిడి తోరణాలతో అలంకరణ విద్యార్థులకు పూలతో స్వాగతం తొలిరోజు 30శాతం వరకే విద్యార్థుల హాజరు -
బాలలను పనిలో పెట్టుకోవద్దు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు విద్యారణ్యపురి: బాలలను పనిలో పెట్టుకోవద్దు.. వారితో పనిచేయించుకునేవారు చట్టపరంగా శిక్షార్హులవుతారని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు అన్నారు. ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన హనుమకొండలోని జెడ్పీహాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్ల వయసు వరకు బాలకార్మికులే.. ఆ వయసు వారు పనుల్లో కనబడి తే దగ్గరలోని సామాజిక సహాయ సంస్థలకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో హనుమకొండ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జడ్జి క్షమాదేశ్పాండె, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.రాము, గవర్నమెంట్ ప్లీడర్ కె.నర్సింహారావు, అసిస్టెంట్ కమిషన ర్ ఆఫ్ లేబర్ నారాయణ స్వామి, డీడబ్ల్యూఓ జయంతి, కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, ఎఫ్ఎంఎం ఎన్జీఓ డైరెక్టర్ సహాయసిస్టర్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్ఐ పి.ఫిలిప్రాజ్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. లోక్ అదాలత్ను వినియోగించుకోవాలివరంగల్ క్రైం: ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాల ని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు. చిన్న కేసులతో కక్ష పెంచుకుని కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని పేర్కొన్నా రు. పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, రాజీపడదగిన కేసుల్లో ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, రాజీపడాలని అనుకునే వారు పోలీస్ అధికారులను సంప్రదించాలని కోరారు. -
ఉత్సాహంగా 5కే రన్
ఎంజీఎం : నేషనల్ సర్జన్స్ డేను పురస్కరించుకొని ఏఎస్ఐ వరంగల్ బ్రాంచ్ ఐఎంఏ వరంగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ, కేఎంసీ ఎన్ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యాన గురువారం కేఎంసీ నుంచి ఐఎంఏ హాల్ వరకు 5కే రన్ నిర్వహించారు. ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోహన్దాస్, ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ ఈ రన్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా సర్జన్ల పాత్రను సమాజానికి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్జన్ డాక్టర్లు శ్రీనివాస్గౌడ్, నాగేందర్, విద్యాసాగర్, రూప, కార్తీక్, కేఎంసీ ఎన్ఎస్ ఎస్ కోఆర్డినేటర్, పీజీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. సెర్ప్ ఏపీడీగా వెంకటేశ్వర్లు హన్మకొండ అర్బన్ : హనుమకొండ డీఆర్డీఏ పరిధి సెర్ప్ అదనపు డైరెక్టర్గా బొజ్జ వెంకటేశ్వర్లును నియమిస్తూ ఆ సంస్థ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యాన చేపట్టిన సాధారణ బదిలీల్లో ట్రాన్స్ఫర్ చేశారు. గతంలో వెంకటేశ్వర్లు జిల్లాలో డీపీఎంగా కొంతకాలం పనిచేశారు. కేయూలో నేటినుంచి జాతీయ వర్క్షాప్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీజువాలజీ విభాగం ఆధ్వర్యాన ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం అఽధిపతి ఆచార్య జి.షమిత తెలిపారు. ‘హ్యాండ్ ఆన్ మాలిక్యూలర్ డాకింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ టెక్నిక్స్’ అనే అంశంపై జువాలజీ సెమినార్ హాల్లో నిర్వహించే ఈ వర్క్షాప్ ప్రారంభం సమావేశంలో కేయూ వీసీ ప్రతాప్రెడ్డితోపాటు సైన్స్ డీన్ జి.హనుమంతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామి డాల ఇస్తారి, కన్వీనర్ వై.వెంకయ్య, బీఓఎస్ ఈసం నారాయణ పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలుపాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రామన్నపేట : విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషితో టీజీఈసెట్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అన్నారు. టీజీఈసెట్–2025లో ఉత్తమ ప్రతిభ కబర్చి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను గురువారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా కళాశా ల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ స్ఫూర్తిదాయక ప్రదర్శన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్లో వారు మరిన్ని విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను తెలి పారు. వరంగల్–1 డిపో సూపర్ లగ్జరీ బస్(సర్వీస్ నంబర్ 92222) ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయలుదేరి 28న ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం చేరుకుంటుంది. విఘ్నేశ్వరుడి దర్శనం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి చేరుకుంటుందన్నారు. ఇక్కడ దర్శనం అనంతరం సాయంత్రం 7 గంటలకు అరుణాచలానికి చేరుకుంటుందని ఒక ప్రకటనలో వివరించా రు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 29న మధ్యాహ్నం బయలుదేరి 30న ఉదయం శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం, తర్వాత బీచుపల్లి హనుమాన్ దర్శనం అనంతరం హనుమకొండకు బయలుదేరుతుందన్నారు. ఈ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,500 నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చ ని, పూర్తి సమాచారానికి 9063407493, 7780565971, 9866373825, 9959226047 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
జీజేసీలో సైన్స్గ్రూపులకు మోక్షం
ఆత్మకూరు: మండలకేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల 2009లో మంజూరైంది. అధునాతన పక్కాభవనంలోకి 2018లో మారింది. 2009 నుంచి 16 ఏళ్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు సైన్స్ గ్రూపులకొరకు ఎదురు చూస్తున్నారు. సైన్స్ గ్రూపులు మంజూరు చేయాలని ‘సాక్షి’ పలుమార్లు కథనాలను ప్రచురించింది. మే 6న కూడా ‘కలగా మారిన సైన్స్ గ్రూపులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని గత నెల 30 వరకు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయిన ప్రిన్సిపాల్ బి.ఎన్.రెడ్డి పలుమార్లు ఇంటర్మీడియట్ అధికారుల దృష్టికి, గత నెల 13న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కళాశాలలో సైన్స్ గ్రూపుల మంజూరుకు ఉత్తర్వులు ఇప్పించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సైన్స్ గ్రూపుల అవసరాన్ని గుర్తించి పలుమార్లు కథనాలు ప్రచురించిన ‘సాక్షి’ని అభినందించారు. అడ్మిషన్లు ప్రారంభం... మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా మంజూరైన సైన్స్ గ్రూపులు బైపీసీ, ఎంపీసీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సి పాల్ డి.రమాదేవి తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 16 ఏళ్ల కల నెరవేరింది అడ్మిషన్లు ప్రారంభం -
ఆన్లైన్ జీరో పర్మిట్ అమలుచేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ పనులకు సంబంధించి చిన్న తరహా ఖనిజాలైన కంకర, మట్టి కోసం ఆన్లైన్ జీరో పర్మిట్ అమలు చేయాలి.. ఈ విధానంపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో మైనింగ్, టీజీఎండీసీ, రెవెన్యూ, పోలీస్, రవాణా తదితర శాఖల అధికా రులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంజనీరింగ్ శాఖల అధికారులు ప్రభుత్వ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఆన్లైన్ జీరో పర్మిట్కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించడం వల్ల అక్రమ ఖనిజ రవాణాను అరికట్టవచ్చని చెప్పారు. వాగుల్లో ఇసుక వెలికితీత, అక్రమ రవాణాపై పరిపాలనా పరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా నికి ఇసుక అవసరం ఎంతో ఉందని, సాండ్ బజార్ ద్వారా ఆన్లైన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నా రు. ధర్మసాగర్, హసన్పర్తి, ఆత్మకూరు మండలా ల్లో సాండ్ బజార్ కోసం ఐదు ఎకరాల చొప్పున స్థలం గుర్తించాలని, శుక్రవారం నుంచి లబ్ధిదారులకు కూపన్లు ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ‘భోజన’ పథకం పక్కాగా అమలుచేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ, డీఆర్డీఓ, వైద్య ఆరోగ్య, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన స్టీరింగ్, మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 470 పాఠశాలలు ఉండగా 324 స్కూళ్లకు వంట గదిలు అందుబాటులో ఉన్నాయని, మిగతా వాటికి నిర్మించాల్సి ఉందని, ప్రతిపాదనలు త్వరగా పంపించాలని డీఆర్డీఓ మేన శ్రీనును ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో అవసరమైన వంట సామగ్రికి రూ.50 లక్షలు వెచ్చించినట్లు పేర్కొన్నారు. వంట కార్మికులకు కనీసం మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అన్ని పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి సిలిండర్లు సరఫరా చేయాలని తెలిపారు. మూడు నెలలకోసారి ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో డీఈఓ వాసంతి, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆపద సమయంలో సిద్ధంగా ఉండాలి హన్మకొండ: విపత్తు, ప్రమాదాలు వంటి ఆపద సమయాల్లో సహాయం అందించేందుకు ఆపద మిత్రలు సిద్ధంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ఆదేశాల మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యాన ఆపద మిత్రలకు హనుమకొండలో ని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుకోని ప్రమాదాలు జరిగినా.. విపత్తులు సంభవించినా వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రకృతి విపత్తులు, ఆపద సమయాల్లో కాపాడటం, సహాయం చేయడంపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను పదిమందికి నేర్పించాలని పేర్కొన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు మాట్లాడుతూ మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో 126 మంది, పరకాలలో 131 మంది వలంటీర్లకు 12 రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆపద మిత్ర వలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, పరకాల మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ జయశ్రీ, సైకాలజిస్ట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అస్తవ్యస్తంగా వార్డుల విభజన
నర్సంపేట: నర్సంపేట సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీలో వార్డుల విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల 8 గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. కాగా, రాజకీయ పార్టీలతో పాటు విలీన గ్రామాల ప్రజలు ఓట్లు రెండు, మూడు వార్డుల్లో ఉండడాన్ని అంగీకరించడం లేదు. గతంలో 24 వార్డులు ఉండగా వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్తో మున్సిపాలిటీలో మహేశ్వరం, మగ్ధుంపురం, రాజపల్లి, రాములునాయక్తండా, పర్శనాయక్తండా, నాగుర్లపల్లి, మాదన్నపేట, ముత్తోజిపేట విలీనమయ్యాయి. దీంతో ఓటర్ల సంఖ్య 40,561, వార్డుల సంఖ్య 30కి చేరింది. దీని ద్వారా మున్సిపాలిటీ అధికారులు చేసిన వార్డుల విభజనపై విమర్శలు వస్తున్నాయి. రెండుమూడు వార్డుల్లో ఒక గ్రామ ఓటర్లు ఒక్కో గ్రామానికి చెందిన ఓటర్లను రెండు మూడు వార్డుల్లో కేటాయించడంతో గందరగోళం నెలకొంది. మున్సిపాలిటీలో విలీనమైన మగ్ధుంపురంలో 2,026 మంది ఓటర్లు ఉండగా కొన్ని ఓట్లు పదో వార్డులో కలిపారు. మిగిలిన 1,420 ఓట్లను మగ్ధుంపురం 11వ వార్డుగా అధికారులు ఏర్పాటు చేశారు. మరికొన్ని ఓట్లను రాజపల్లిలో కలిపి 12వ వార్డుగా చేశారు. మహేశ్వరంలోని 2,993 ఓట్లను కొన్ని రాములుతండాలో కలిపి 13వ వార్డుగా ఏర్పాటు చేశారు. 1,451 ఓట్లతో మహేశ్వరం పేరుతో 14వ వార్డు విభజించారు. మరో 589 ఓట్లను పట్టణంలోని 25వ వార్డు పోచమ్మగుడి ఏరియాలో చేర్చారు. మాదన్నపేటలో 2006 ఓట్లు ఉండగా 1,489 ఓట్లతో 1వ వార్డు చేశారు. మిగిలిన ఓట్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. అభ్యంతరాల వెల్లువ.. వార్డుల విభజన విషయంలో వినతులను స్వీకరించిన మున్సిపాలిటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు విలీన గ్రామాల నుంచి కూడా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. విలీన గ్రామాల్లోని ఓటర్లకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని బుధవారం పలువురు వినతిపత్రాలు అందించారు. కొత్త వార్డులను సవరించాలని పలు పార్టీల నాయకులు సమర్పించిన వినతిపత్రాలను అధికారులు పరిశీలించి చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీరస్వామి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల వివరాలు.. ప్రాంతం పురుషులు మహిళలు మొత్తం నర్సంపేట టౌన్ 13,987 15,324 29,311 ముగ్ధుంపురం 967 1,059 2,026 మహేశ్వరం 1,458 1,535 2,993 రాములునాయక్తండా 240 256 496 రాజపల్లి 573 594 1,167 మాదన్నపేట 744 754 1,498 నాగుర్లపల్లి 448 468 916 పర్శనాయక్తండా 247 259 506 ముత్తోజిపేట 761 885 1,646 -
ఎయిర్పోర్ట్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
న్యూశాయంపేట: మామునూరు ఎయిర్పోర్ట్ రోడ్ల కనెక్టివిటీ కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గురువారం ఆమె పర్యటించారు. రోడ్ల నిర్మాణం చేపట్టే ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరుపల్లి నుంచి నేషనల్హైవే వరకు, నక్కలపల్లి నుంచి గాడిపల్లి–గాడిపల్లి బైపాస్ వరకు రోడ్ల స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపడానికి త్వరితగతిన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ అధికారి రమేశ్, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, ఇరిగేషన్ డీఈ మధుసూదన్, తహసీల్దార్ నాగేశ్వర్రావు, అధికారులు పాల్గొన్నారు. భూనిర్వాసితులకు త్వరితగతిన పరిహారంఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములిచ్చిన భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారాన్ని త్వరితగతిన చెల్లించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్రోడ్డు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రాజీవ్ మెగా టౌన్షిప్ లేఔట్ అనుమతుల పురోగతి తదితర అంశాలపై కలెక్టరేట్లో గురువారం కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గొర్రెకుంట, ఏనుమాములతోపాటు ఖిలా వరంగల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రింగ్రోడ్డు భూ నిర్వాసితులకు త్వరితగతిన పరిహారాన్ని చెల్లించాలన్నారు. మెగా టెక్స్టైల్ పార్కులో రాజీవ్ మెగా టౌన్షిప్ ఏర్పాటుకు లేఔట్ అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కేఎంటీపీ జోనల్ మేనేజర్ స్వామి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, కుడా పీఓ అజిత్రెడ్డి, తహసీల్దార్లు నాగేశ్వర్రావు, రాజ్కుమార్, మహ్మద్ ఇక్బాల్, రియాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : కలెక్టర్ సత్యశారద
వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన వసతులతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మండలంలోని ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించిన ందుకు విద్యార్థులు, ఉపాధ్యాయలను అభినందించారు. ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు చదువుతోపాటు స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, వర్ధన్నపేట తహసీల్దార్ విద్యాసాగర్, ఎంఈఓ శ్రీధర్, ఎంపీడీఓ అరుంధతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బడిబాటను విజయవంతం చేయాలి ఖిలా వరంగల్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మండల పరిధి గుంటూరుపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సత్యశారద, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. ఈనెల 6వ తేదీ నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల పునఃప్రారంభమైన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, బడిబయట ఉన్న విద్యార్థులను గుర్తించి తిరిగి బడికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అంతకుముందు నూతనంగా బడిలో చేరిన విద్యార్థులకు అడ్మిషన్ ఫారాలు అందించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఓ రమేశ్, ఎస్సైలు శ్రీకాంత్, కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జల దోపిడీపై రైతులు చైతన్యం కావాలి
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట: రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడీపై ప్రజలు, రైతులు చైతన్యం కావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్రంతో కలిసి తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసే దేవాదుల, సీతారామ, రామప్ప–పాకాల, రంగాయ చెరువు లాంటి ప్రధాన ప్రాజెక్టులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను బుధవారం ఘోష్ కమిషన్ ముందుకు పిలిపించి రాక్షసానందం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీ విజయం సాధిస్తుందని పెద్ది ధీమా వ్యక్తం చేశారు. -
సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు
● పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రామన్నపేట: విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషితో టీజీఈసెట్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అన్నారు. గురువారం కళాశాల ఆవరణలో టీజీఈసెట్–2025లో ఉత్తమ ప్రతిభ కబర్చి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణమని, ఈ స్ఫూర్తిదాయక ప్రదర్శన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
మోగిన బడిగంట
విద్యారణ్యపురి: వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలతో ఘన స్వాగతం పలికారు. పలు పాఠశాలలను మామిడి తోరణాలు, అరటి ఆకులు, పూలు, బెలూన్లతో అలంకరించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కూడా నిర్వహించారు. పలు పాఠశాలలను సందర్శించిన కలెక్టర్, అధికారులు వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాల, ఖిలా వరంగల్ మండలం గుంటూరుపల్లి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించారు. విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. అదేవిధంగా సంగెం మండలం మొండ్రాయిలోని జెడ్పీహెచ్ఎస్, పల్లారుగూడలోని యూపీఎస్ను జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ కె.సుభాష్ పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అలాగే, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. వరంగల్లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి ఎంఈఓ గంపా అశోక్కుమార్, ఉపాధ్యాయులు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ పలు పాఠశాలలను పర్యవేక్షించారు. జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు మొదటి రోజు యూనిఫాం, పుస్తకాల పంపిణీ -
సర్కారు స్కూళ్లను బలోపేతం చేయాలి
● జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్తేజ గీసుకొండ/నర్సంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థులను చేర్పిస్తే బంగారు భవిష్యత్ ఉంటుందని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) సుజన్తేజ అన్నారు. గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి, చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలతో గురువా రం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు. గంగదేవిపల్లి పాఠశాల హెచ్ఎం అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ పదో తరగతిలో విద్యా ర్థులు అత్యధిక మార్కులు సాధించారని పేర్కొన్నా రు. అదేవిధంగా చెన్నారావుపేటలో జరిగిన బడిబాట కార్యక్రమంలో ఏఎంఓ సుజన్తేజ, మండల విద్యాశాఖ అధికారి బైరి సరళ, మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఎమ్మార్సీ కార్యాలయంలో పాఠ్యపుస్తకాలు, రికార్డులను పరిశీలించారు. -
ఉత్సాహంగా 5కే రన్
ఎంజీఎం: నేషనల్ సర్జన్స్ డేను పురస్కరించుకొని ఏఎస్ఐ వరంగల్ బ్రాంచ్ ఐఎంఏ వరంగల్ డిపార్టమెంట్ ఆఫ్ సర్జరీ, కేఎంసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యాన గురువారం కేఎంసీ నుంచి ఐఎంఏ హాల్ వరకు 5కే రన్ నిర్వహించారు. ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోహన్దాస్, ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ ఈ రన్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా సర్జన్ల పాత్రను సమాజానికి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్జన్ డాక్టర్లు శ్రీనివాస్గౌడ్, నాగేందర్, విద్యాసాగర్, రూప, కార్తీక్, కేఎంసీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, పీజీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారం
దుగ్గొండి: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూముల సమస్యలు పరిష్కారమవుతాయని నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి అన్నారు. మండలంలోని ముద్దునూరు, పోలారం గ్రామాల్లో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దునూరు రెవెన్యూ సదస్సును ఆర్డీఓ ఉమారాణి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సాదాబైనామా, ఆర్ఓఆర్లో తప్పులు సరిచేయడం, సర్వేనంబర్ మిస్సింగ్ లాంటి సమస్యలు పరిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ రాజేశ్వర్రావు, డీటీ ఉమ, ఆర్ఐలు రాంబాబు, మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలిసంగెం: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈస్ట్జోన్ డీసీసీ అంకిత్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను గురువారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. డీసీపీ వెంట మామునూరు ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్ ఉన్నారు.నకిలీ పత్తి విత్తనాల పట్టివేతనర్సంపేట: నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ఫో ర్స్ పోలీసులు పట్టుకున్న సంఘటన చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూనె స్వామి బీజీ త్రీ బీటీ నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నాడు. కిలోకు రూ.మూడు వేల చొప్పున గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు 14 కిలోల వరకు విత్తనాలు విక్రయించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి నాలుగు కిలోల విత్తనాలను అతడి నుంచి స్వాధీనం చేసుకుని చెన్నారావుపేట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి గోపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు నూనె స్వామిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నారావుపేట ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు.అంగన్వాడీలు మెరుగైన సేవలందించాలివర్ధన్నపేట: చిన్నారుల బంగారు భవిష్యత్కు అంగవాడీ కేంద్రాలే పునాదులని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేటలోని ఫిరంగిగడ్డ అంగన్వాడీ కేంద్రంలో గురువారం అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులకు మెరుగైన సేవలందించాలని కార్యకర్తలను సూచించారు. అంగన్వాడీల్లో చేరిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించేలా చూడాలని అధికారులు, తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజమణి, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, వర్ధన్నపేట సీడీపీఓ దేహోర తదితరులు పాల్గొన్నారు.నేటినుంచి జాతీయ వర్క్షాప్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో జూవాలజీ విభాగం ఆధ్వర్యాన ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం అఽధిపతి ఆచార్య జి.షమిత తెలిపారు. ‘హ్యాండ్ ఆన్ మాలిక్యూలర్ డాకింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ టెక్నిక్స్’ అనే అంశంపై జువాలజీ సెమినార్ హాల్లో నిర్వహించే ఈ వర్క్షాప్ ప్రారంభం సమావేశంలో కేయూ వీసీ ప్రతాప్రెడ్డితోపాటు సైన్స్ డీన్ జి.హనుమంతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామి డాల ఇస్తారి, కన్వీనర్ వై.వెంకయ్య, బీఓఎస్ ఈసం నారాయణ పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నిజాం కాలం నాటి మర్కజీ హైస్కూల్
ప్రొఫెసర్ జయశంకర్ ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే.. విద్యారణ్యపురి: వివిధ రంగాల్లో ఉన్నతస్థానాలకు ఎదగిన ఎంతో మంది మేధావులను అందించింది హనుమకొండలోని మర్కజీ ప్రభుత్వ ఉన్నతపాఠశాల. నిజాం కాలంలో 1940లో ప్రారంభించిన ఈ పాఠశాల తొలుత ఊర్దూ మీడియంగా, తర్వాత తెలుగు మీడియంగా, ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఈ పాఠశాలలోనే ఉర్దూమీడియంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు వివిధ దేశాల్లో, రాష్ట్రంలో వివిధ ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. ఈ స్కూల్లో ప్రస్తుతం 676 మంది విద్యార్థులు ఉండగా, 26మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 284 మంది చదువుతుండగా 10 మంది టీచర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు కలిగిన ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. -
విత్తన విక్రయాల్లో నిబంధనలు పాటించాల్సిందే..
నెక్కొండ: విత్తనాలు, పురుగుమందుల విక్రయాల్లో వ్యాపారులు నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ అన్నారు. మండలంలోని పలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల షాపులను బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేట్టారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న వరి విత్తనాలు, పురుగుల మందులను పరిశీలించారు. ఈసందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. విక్రయాలకు సిద్ధంగా ఉన్న విత్తన బ్యాగులపై సరైన ముద్రణ లేక, పురుగుల మందుల ప్రిన్సిపల్ లైసెన్స్ లేని కారణంగా విక్రయాలు నిలిపి వేశామని తెలిపారు. వరి విత్తన బ్యాగులపై సరైన లేబుల్ ముద్రణ లేని కారణంగా 190 బస్తాల విత్తనాలను విక్రయాలను నిలిపి వేశామన్నారు. వీటి విలువ సుమారు రూ.1,94,500 ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సర్టిఫికెట్ లైసెన్స్ లేకుండా విక్రయాలకు సిద్ధంగా ఉన్న రూ.1,85,600 విలువైన పురుగుల మందులను గుర్తించినట్లు తెలిపారు. వీటిని విక్రయించొద్దని ఆదేశాలు ఇచ్చామన్నారు. నిబంధలను పాటించని వారిపై శాఖ పరమైన కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీలో ఏఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. డీఏఓ అనురాధ