breaking news
Warangal District Latest News
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు
● జిల్లా వ్యవసాయాధికారి కూనమల్ల అనురాధరాయపర్తి: తడిసి రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి కూనమల్ల అనురాధ తెలిపారు. మండలంలోని గట్టికల్, మైలారం, ఊకల్, కొండాపురం, రాయపర్తి గ్రామాల్లో తుపాను ధాటికి దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో నీటి నిల్వలు లేకుండా పాయలు చేసి నీటిని బయటకు పంపించాలని సూచించారు. నేలవాలిన వరిని కట్టలుగా కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రం, ఏఈఓలు సాయి, మనస్విని, రైతులు, తదితరులు పాల్గొన్నారు. పంటనష్టం సర్వే తనిఖీ వర్ధన్నపేట: మోంథా తుపాను ప్రభావంతో మండలంలో జరిగిన పంటనష్టం వివరాల సేకరణపై వ్యవసాయ అధికారులు చేస్తున్న సర్వేను జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుపాను కారణంగా మండలంలో ప్రధానంగా కోతకు వచ్చిన వరి పంట నేలమట్టమైందన్నారు. పంట నష్టాన్ని యాప్ ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వే చేస్తున్నారని తెలిపారు. తద్వారా రైతులకు నష్టపరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక, రైతులు పాల్గొన్నారు. -
వరద బాధితులను ఆదుకుంటాం
హసన్పర్తి: మోంథా తుపాను బాధితులను ఆదుకుంటామని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. హసన్పర్తి మండలం వంగపహాడ్, బైరాన్పల్లిలో ఆదివారం కలెక్టర్ పర్యటించారు. వరదలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. వరదలతో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో దెబ్బతిన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మోంథా తుపానుతో నష్టపోయిన పంట వివరాల నివేదికను వెంటనే అందించాలని ఆదేశించారు. రైతుల సర్వే నంబర్లతోపాటు క్షేత్రస్థాయిలో ఏ మేరకు నష్టం జరిగిందనే అంచనా వేసి నివేదిక రూపొందించాలని సూచించారు. అనంతరం వంగపహాడ్–బైరాన్పల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. -
కలెక్టరేట్ గ్రీవెన్స్ రద్దు
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాల వివరాల సేకరణలో అధికారులు, సిబ్బంది, నిమగ్నమై ఉన్నందున గ్రీవెన్స్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు. పాల బిల్లులు చెల్లించాలి ● నిర్వాహకులతో పాడి రైతుల వాగ్వాదం ఖానాపురం: పాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాలకేంద్రం వద్ద నిర్వాహకులతో రైతులు వాగ్వాదానికి దిగిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ధర్మరావుపేట గ్రామానికి చెందిన సుమారు 40 మంది రైతులు విజయ డెయిరీ పాల కేంద్రంలో పాలు పోస్తున్నారు. గత నాలుగు నెలలుగా రైతులకు నెలనెలా డబ్బులు అందించడం లేదు. దీంతో గ్రామంలోని పాలకేంద్రం వద్ద నిర్వాహకులతో రైతులు వాగ్వాదానికి దిగారు. అందరికీ మొత్తం బిల్లులు చెల్లించాలని రైతులు పట్టుబట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కార్యక్రమంలో పాడి రైతులు రవి, బిచ్య, యాకుబ్, సంపత్రావు, దేవేందర్, అనిల్, ప్రశాంత్ పాల్గొన్నారు. క్రీడాపోటీల ఏర్పాట్ల పరిశీలన రాయపర్తి: ఈనెల 6నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న జోనల్ లెవెల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ క్రీడల ఏర్పాట్లను జెడ్ఓ విద్యారాణి, డీసీఓ అపర్ణ ఆదివారం పరిశీలించారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో క్రీడలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. టోర్నమెంట్లో 14 పాఠశాలల నుంచి 1,190 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు వివరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని ప్రిన్సిపాల్ సరితకు సూచించారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ముమ్మరంగా పారిశుద్ధ్య పనులువరంగల్ అర్బన్: వరద బాధితులను ఆదుకుంటామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని ఎన్టీఆర్కాలనీ, రామన్నపేట, సంతోషిమాత కాలనీ ఫేజ్–1, ఫేజ్–2, గంగపుత్ర కాలనీ, డీఆర్నగర్, ఎస్ఆర్ఆర్ తోటలో ఆదివారం కమిషనర్ చాహత్బాజ్పాయ్తో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదలతో దెబ్బతిన్న ఇళ్ల వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాధితులను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు చెప్పారు. నీరు కలుషితం కాకుండా చూడాలి నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. హనుమకొండ పరిధి వడ్డేపల్లి ఫిల్టర్బెడ్, ధర్మసాగర్ రిజర్వాయర్లను మేయర్ ఆకస్మికంగా సందర్శించి నీటి సరఫరాను పరిశీలించారు. భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి చెరువుల నీరు రిజర్వాయర్లో ప్రవేశించడంతో కొద్దిగా రంగు మారిందని, రెండు రోజుల్లో నీటి రంగు సాధారణ స్థితికి వస్తుందన్నారు. నీరు కలుషితం కాకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మేయర్ తెలిపారు. వాస్తవ సమాచారాన్ని నమోదు చేయాలి వరదతో నష్టపోయిన గృహాలు, కోల్పోయిన వస్తువుల వాస్తవ సమాచారాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 28వ డివిజన్లో మేయర్ పర్యటించి సమాచార నమోదు ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నాలాలపై ఆక్రమణలను తొలగించాలని సంబంధిత విభాగాలకు సూచిస్తానని తెలిపారు. మేయర్ వెంట డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్ఐ అశోక్ పాల్గొన్నారు. -
నాసిరకం విత్తనాలతో మోసపోయాం
● న్యాయం చేయాలని అన్నదాతల నిరసనవర్ధన్నపేట: నాసిరకం వరి విత్తనాలతో మోసపోయామని అన్నదాతలు ఆందోళనకు దిగిన సంఘటన వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుమారు పది మంది రైతులు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాపులో విత్తనాలు కొనుగోలు చేశారు. పంట కోసే సమయానికి దిగుబడి రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. గింజ పరిమాణం తక్కువగా ఉండి తాలు శాతం ఎక్కువగా ఉన్న విత్తనాల కారణంగా తాము నష్టపోయామని సదరు ఫర్టిలైజర్ యజమానితో వాగ్వాదానికి దిగారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని నమ్మించి నాసిరకం విత్తనాలను తమకు అంటగట్టి దుకాణ నిర్వాహకులు నిండా ముంచారని వాపోయారు. నకిలీ విత్తనాలతో మోసపోయిన తమకు న్యాయం చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించిన ఫర్టిలైజర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ● మొక్కజొన్న, వరి, పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభంనెక్కొండ: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు భవాని కాటన్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో నష్టపోయిన వరి, ఇతర పంటల రైతులను సర్కారు అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ తుపాను ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీసీఎస్ఓ కిష్టయ్య, సివిల్ సప్లై డీఎం సంధ్యారాణి, మార్కెటింగ్ డీఎం సురేఖ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, రెతులు, తదితరులు పాల్గొన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు నర్సంపేట: పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తి తీసుకురావాలని సూచించారు. నర్సంపేట పట్టణంలోని ఉమామహేశ్వర ఇండస్ట్రీస్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులు, వ్యాపారులను ఆయన ఆదేశించారు. -
వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
● రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్ హన్మకొండ/ఎంజీఎం: వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్ వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన హనుమకొండ, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎ.అప్పయ్య, బి.సాంబశివరావుతో కలిసి నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అమరావతినగర్లో వైద్య శిబిరాన్ని పరిశీలించారు. మూడు రోజులుగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలు, నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలను వడ్డేపల్లి వైద్యాధికారి మాలికను అడిగి తెలుసుకున్నారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి జీడబ్ల్యూఎంసీ తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం హనుమకొండ డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారుల సమీక్షలో రవీంద్రనాయక్ మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ టి.మదన్మోహన్రావు, టీబీ నియంత్రణాధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారులు ఇక్తదార్ అహ్మద్, జ్ఞానేశ్వర్, మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, వరంగల్ డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొమురయ్య, మోహన్ సింగ్, విజయకుమార్, ఉదయరాజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్లో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
సంగెం: మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రతంగా ఉండడంపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని గవిచర్ల మోడల్ స్కూల్ ఆవరణలోని బాలికల వసతి గృహాన్ని ఆదివారం సందర్శించి తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాల్లో ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు, చీమల పుట్ట ఉండడాన్ని చూసి వెంటనే శుభ్రం చేయించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఇలా ఉంటే పాములు, తేళ్లు, విష పురుగులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. హాస్టల్లోని టమాటాలు, చామగడ్డలు కుళ్లిపోయి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు తాజాగా ఉండాలని, అల్లంను ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసి వాడాలని, మెనూ పాటించాలని సూచించారు. మంచి నూనె ఎక్కువగా వాడుతున్నారని, తగ్గించాలని చెప్పారు. హాస్టల్లో ఫిర్యాదుల బాక్స్ చాలా చిన్నది ఉందని, పెద్దసైజ్ రెడ్ కలర్ బాక్స్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ మంచిగా చదువుకుని ఉన్నతంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డీడీ పుష్పలత, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, వార్డెన్ రాధిక, ఏఎన్ఎం మంజుల, తదితరులు పాల్గొన్నారు. టెక్స్టైల్ పార్కు వద్ద నాలా నిర్మాణం టెక్స్టైల్ పార్కులోని కంపెనీలకు వరద ఇబ్బందులు తలెత్తకుండా నాలా నిర్మాణం చేపట్టనున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. సంగెం – గీసుకొండ మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఆదివారం సందర్శించారు. ఇటీవల భారీ వర్షాలు, మోంథా తుపాను వల్ల బొల్లికుంట, సంగెం మండలాల్లోని కాట్రపల్లి, వెంకటాపూర్ తదితర చెరువుల వరద ప్రభావాన్ని పరిశీలించారు. ఎంతమేర నాలా నిర్మాణాన్ని చేపట్టాలనే అంశాలపై అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంగెం, గీసుకొండ తహసీల్దార్లు రాజ్కుమార్, రియాజొద్దీన్, ఇరిగేషన్ ఈఈ సునీత తదితరులు పాల్గొన్నారు. -
కళాశాలలను నడపలేకపోతున్నాం..
ఒప్పుకున్న మేరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలి. రూ.1200 కోట్లలో రూ. 300 కోట్లు చెల్లించింది. మిగిలిన రూ.900 కోట్లు చెల్లించాలి. ఆతర్వాత ఇంకా చాలా బకాయిలున్నాయి వాటిని దశలవారీగానైనా చెల్లించవచ్చునని చెప్పాం. అయినా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులతో కళాశాలలను నడపలేకపోతున్నాం. తప్పనిపరిస్థితుల్లోనే కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తున్నాం. – ఉపేందర్రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు ● -
వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్ హన్మకొండ/ఎంజీఎం: వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్ వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన హనుమకొండ, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎ.అప్పయ్య, బి.సాంబశివరావుతో కలిసి నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అమరావతినగర్లో వైద్య శిబిరాన్ని పరిశీలించారు. మూడు రోజులుగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలు, నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలను వడ్డేపల్లి వైద్యాధికారి మాలికను అడిగి తెలుసుకున్నారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి జీడబ్ల్యూఎంసీ తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం హనుమకొండ డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారుల సమీక్షలో రవీంద్రనాయక్ మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ టి.మదన్మోహన్రావు, టీబీ నియంత్రణాధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారులు ఇక్తదార్ అహ్మద్, జ్ఞానేశ్వర్, మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, వరంగల్ డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొమురయ్య, మోహన్ సింగ్, విజయకుమార్, ఉదయరాజ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
హౌరా బ్రిడ్జిని మరిపించేలా..
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా సమీపంలో ఉన్న హౌరా బ్రిడ్జిని తలపించేలా ఇనుప గడ్డర్లతో నూతన మోడల్లో రైల్వే లైన్పై బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడం, నిత్యం వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ గడ్డర్ల పనులు సకాలంలో పూర్తి చేసి రైల్వేలైన్పై ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. రైల్వే లైన్పై నిలిచిన పనులు.. రైల్వే లైన్కు ఇరువైపులా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. రైల్వే విద్యుత్లైన్పై పనులు చేపట్టాలంటే జీఎం స్థాయిలో ముందస్తు అనుమతులు ఆలస్యం అవుతున్నాయి. దీంతో పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రజాప్రతినిధుల చొరవతో రైల్వేశాఖ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు చకచకా సాగుతాయనే ఆశాభావాన్ని పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. -
వరద బాధితులను ఆదుకుంటాం
పంట నష్టం నివేదికను అందించండి ● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్హసన్పర్తి: మోంథా తుపాను బాధితులను ఆదుకుంటామని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. హసన్పర్తి మండలం వంగపహాడ్, బైరాన్పల్లిలో ఆదివారం కలెక్టర్ పర్యటించారు. వరదలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. వరదలతో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో దెబ్బతిన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. త్వరలోనే నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మోంథా తుపానుతో నష్టపోయిన పంట వివరాల నివేదికను వెంటనే అందించాలని ఆదేశించారు. రైతుల సర్వే నంబర్లతోపాటు క్షేత్రస్థాయిలో ఏ మేరకు నష్టం జరిగిందనే అంచనా వేసి నివేదిక రూపొందించాలని సూచించారు. అనంతరం వంగపహాడ్–బైరాన్పల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వ్యవసాయాధికారులు, రైతులు ఉన్నారు. -
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: వరద బాధితులను ఆదుకుంటామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని ఎన్టీఆర్కాలనీ, రామన్నపేట, సంతోషిమాత కాలనీ ఫేజ్–1, ఫేజ్–2, గంగపుత్ర కాలనీ, డీఆర్నగర్, ఎస్ఆర్ఆర్ తోటలో ఆదివారం కమిషనర్ చాహత్బాజ్పాయ్తో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదలతో దెబ్బతిన్న ఇళ్ల వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు బాధితులను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు చెప్పారు. నీరు కలుషితం కాకుండా చూడాలి నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. హనుమకొండ పరిధి వడ్డేపల్లి ఫిల్టర్బెడ్, ధర్మసాగర్ రిజర్వాయర్లను మేయర్ ఆకస్మికంగా సందర్శించి నీటి సరఫరాను పరిశీలించారు. భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి చెరువుల నీరు రిజర్వాయర్లో ప్రవేశించడంతో కొద్దిగా రంగు మారిందని, రెండు రోజుల్లో నీటి రంగు సాధారణ స్థితికి వస్తుందన్నారు. నీరు కలుషితం కాకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మేయర్ తెలిపారు. వాస్తవ సమాచారాన్ని నమోదు చేయాలి వరదతో నష్టపోయిన గృహాలు, కోల్పోయిన వస్తువుల వాస్తవ సమాచారాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 28వ డివిజన్లో మేయర్ పర్యటించి సమాచార నమోదు ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నాలాలపై ఆక్రమణలను తొలగించాలని సంబంధిత విభాగాలకు సూచిస్తానని తెలిపారు. మేయర్ వెంట డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్ఐ అశోక్ పాల్గొన్నారు. -
వేయిస్తంభాల ఆలయంలో పూజలు
వైభవంగా తులసీధాత్రినారాయణ కల్యాణం హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం ఉదయం నుంచి ప్రాతఃకాల పూజలు, నిత్యాహ్నికం నిర్వహించారు. రుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం శివభక్తులు కరుణాకర్, దీప్తి దంపతుల సౌజన్యంతో శ్రీరుద్రేశ్వరస్వామికి లక్ష శివనామాలు, 21 రకాల పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. మహానివేదన జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉదయం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, ఆదిత్యశర్మ, చెరుకుమల్లి శ్రీవాత్సవాచార్యులు దేవాలయంలో తులసి, ధాత్రినా రాయణ కల్యాణం నిర్వహించారు. వేదికపై ధాత్రినారాయణస్వామి(ఉసిరిక చెట్టు), లక్ష్మీస్వరూపమైన (తులసి చెట్టు)ను ప్రతిష్ఠించారు. కలశస్థాపన, గణపతిపూజ, పుణ్యాహవచనం చేసి లక్ష్మీనారాయణ స్వరూపమైన తులసి, ఉసిరి మొక్కలకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని స్వామివారికి సామూహిక రుద్రాభిషేకాలు, లక్ష తులసీదళార్చన చేయనున్నట్లు ఉపేంద్రశర్మ తెలిపారు. -
ఎంజీఎం సూపరింటెండెంట్ బాధ్యతల స్వీకరణ
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్గా శనివారం ఈఎన్టీ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంజీఎంలో వైద్య సేవల లోపాలపై వరుసగా వస్తున్న కథనాలపై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూపరింటెండెంట్ కిశోర్పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మంచిర్యాల సూపరింటెండెంట్గా కొనసాగుతున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డిను ఎంజీఎం సూపరిండెంట్గా నియమిస్తూ డీఎంఈ నరేంద్రకుమార్ గత నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనను ఎంజీఎం ఆర్ఎంఓలు వసంత్కుమార్, అశ్విన్, శశికుమార్, ఏడీ శ్రీనివాస్ కలిసి అభినందనలు తెలిపారు. -
రికార్డుస్థాయిలో వర్షపాతం
సాక్షి, వరంగల్: జిల్లాలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్లలో అక్టోబర్ నెలలో కురిసిన అతి భారీ వర్షపాతం ఇదేనని వాతావరణ విభాగాధికారులు తెలిపారు. ఈ అక్టోబర్లో 353.2 మిల్లీమీటర్ల జిల్లా సగటు వర్షపాతం నమోదైతే.. బుధవారం ఉదయం (అక్టోబర్ 29వ తేదీ) 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు ఒక్క రోజులోనే 246.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని వారు పేర్కొన్నారు. అక్టోబర్లో జిల్లా సగటు వర్షపాతం 2021లో 38.2 మిల్లీమీటర్లు, 2022లో 142.6 మిల్లీమీటర్లు, 2023లో 10.9 మిల్లీమీటర్లు, 2024లో 88.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. మొంథా తుపాను ప్రభావంతో ఒక్కసారిగా ఈ ఏడాది అక్టోబర్లో 353.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో 29 శాతం వాన అదనం.. జూన్లో 153.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 113.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో 271.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 312.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే జూన్లో 26 శాతం లోటు వర్షపాతం ఉండగా, జూలైలో 15 శాతం అదనంగా వర్షం కురిసింది. ఆగస్టు ఒకటి నుంచి 31వ తేదీ వరకు 248.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 390.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సెప్టెంబర్లో 174.9 మిల్లీమీటర్ల వర్షం కురవల్సి ఉండగా 245.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తగా చూసుకుంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో 854 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,102.4 మిల్లీమీటర్లు కురిసింది. అంటే 29 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. -
ఒడ్డున పడని కష్టాలు..
సాక్షిప్రతినిధి, వరంగల్: అకాల వర్షం.. వరదలతో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల కష్టాలు ఒడ్డుకు చేరడం లేదు. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ నగరం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఉప్పొంగిన వరదలు ప్రజలను అతలాకుతలం చేశాయి. వరదలతో గండ్లు పడిన చెరువులు, జలమయమైన జనావాసాలు, దెబ్బతిన్న రహదారులతో జనజీవనానికి కలిగిన అంతరాయాలు ఇప్పుడిప్పుడే తొలగుతున్నాయి. వరద ప్రభావిత నాలుగు జిల్లాల్లో చాలా చోట్ల మునిగిపోయిన పంటచేలు ఇంకా తేలలేదు. రికార్డుస్థాయిలో కురిసిన వర్షాల వల్ల వరద దెబ్బ నుంచి వరంగల్ మహానగరం ఇంకా తేరుకోవడం లేదు. ముంపునకు గురైన 78 కాలనీల్లో చాలా వరకు కాలనీలు ఇంకా నీరు, బురదమయంగానే ఉన్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల పర్యటన తర్వాత వరద నష్టం అంచనాకు అధికారయంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. పంట నష్టం ఇంకా పెరిగే అవకాశం... భారీ వర్షం, వరదలకు వరి, పత్తి సహా పలు పంటలకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులు తడిసిపోయాయని రైతులు ఇంకా కన్నీరుమున్నీరవుతున్నారు. క్షేత్రస్థాయి సర్వేకు వెళ్లిన అధికారులతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కాగా, మోంథా ప్రభావంతో సుమారు 1,29,228 మంది రైతులకు చెందిన 2.16 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 80,500 మంది రైతులకు చెందిన 1,30,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు నేలమట్టమయ్యాయి. హనుమకొండ జిల్లాలోనే 34,820 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. జనగామ జిల్లాలో 25,796 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇలా మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 2.62 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సీఎం పర్యటన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుండగా ఆ అంచనా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వరదలకు పంటలు కాకుండా 221 చోట్ల ఆర్అండ్బీ, పీఆర్ రోడ్లు తెగిపోయినట్లు చెబుతున్నారు. ఎన్పీడీసీఎల్ వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 65 చోట్ల విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతినగా చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుపాను ప్రభావం వల్ల ఉమ్మడి వరంగల్లో నష్టం రూ. వెయ్యికోట్లకుపైనే ఉంటుందన్న చర్చ జరగుతోంది రెండు రోజుల్లో సీఎం రేవంత్కు నివేదికలు... సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఉరుకులు, పరుగుల మీద వరద నష్టం అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న అన్ని శాఖల అధికారులు సోమవారం నాటికి నివేదికలు సిద్ధం చేసేలా కలెక్టర్లు ఫాలోఅప్ చేస్తున్నారు. కలెక్టర్లతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆరా తీస్తున్నారు. నివేదికలు పూర్తి కాగానే ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమీక్ష తర్వాత.. సీఎంను కలిసి నివేదించనున్నారు. ‘మోంథా’ షాక్ నుంచి ఇంకా తేరుకోని జనం నష్టం అపారం.. సాయం ఏమాత్రం? క్షేత్రస్థాయికి వ్యవసాయ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు వరద నష్టం అంచనాల్లో అధికారులు, సిబ్బంది -
రైతులు ఆందోళనకు గురికావొద్దు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద నెక్కొండ/పర్వతగిరి: మోంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళనకు గురికావొద్దని, ప్రభుత్వం పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ, వెంకటాపురం, పర్వతగిరి మండలం చింతనెక్కొండలో శనివారం కలెక్టర్ పర్యటించి వర్షానికి దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రోడ్లు, కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటలను సర్వే చేసి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడొద్దని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని భరోసా ఇచ్చారు. అలాగే, నెక్కొండ పీహెచ్సీ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. వర్షాలతో ప్రజలు వ్యాధులబారిన పడకుండా గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ సాంబశివరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా రోడ్లు, భవనాల అధికారి రాజేందర్, నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, పీఆర్ డీఈ మోహన్రావు, ఐబీ డీఈ సంతోష్, నెక్కొండ తహసీల్దార్ రాజ్కుమార్, నెక్కొండ ఎంపీడీఓ లావణ్య, పర్వతగిరి ఏఓ ప్రశాంత్, చింతనెక్కొండ పంచాయతీ కార్యదర్శి యాకూబ్ ఉన్నారు. వరద నష్టాలపై నివేదికలు ఇవ్వండిన్యూశాయంపేట: భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టాలపై శాఖల వారీగా నివేదికలు తయారు చేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖిలావరంగల్, వరంగల్లో ఇంటింటికి వెళ్లి నష్టం వివరాలను నమోదు చేసి సోమవారం నాటికి నివేదిక సమర్పించాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025వాతావరణం జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది. సాయంత్రం సమయంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.అప్రమత్తతే ఆయుధం ప్రస్తుత పరిస్థితిలో పంటలను ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.గ్రేటర్ మహానగరం జలదిగ్బంధమైన వేళ.. మేమున్నామంటూ కదిలారు పోలీసులు, అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది. జల విలయాన్ని ఛేదిస్తూ వేలాది మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి సేవలందించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. బల్దియా కార్మికులు అయితే ఒకవైపు వరద ఉధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఎన్పీడీసీఎల్ సిబ్బంది రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించారు. దుప్పట్లు, వాటర్ బాటిళ్లు, ఆహారం పంపిణీ చేసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు దాతలు. మానవత్వంతో కదిలివచ్చిన వీరందరి ‘సేవలకు సలాం’ పలుకుతూ ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ అర్బన్/వరంగల్క్రైం/హనుమకొండ/కాజీపేట అర్బన్వరంగల్ నగరంలో.. ఇటీవల కురిసిన వర్షానికి న్యూరాయపుర మొత్తం మునిగిపోయింది. కాలనీలోని ఓ వ్యక్తి అనారోగ్యం బారిన పడ్డాడు. కనీసం బయటికి రాలేని పరిస్థితి. ఇంటి చుట్టూ నీళ్లు. సమాచారం అందుకున్న హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్సిబ్బంది అతడి ఇంటికి చేరుకున్నారు. బాధితుడిని స్ట్రెచర్పై పడుకోబెట్టి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఎంజీఎంకు తరలించారు. తనను కాపాడిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.ఈ ఫొటో చూడండి.. హనుమకొండలోని టీవీ టవర్ కాలనీకి చెందిన అలేఖ్య గురువారం రాత్రి అమెరికాకు వెళ్లాల్సి ఉంది. బుధవారం కురిసిన వర్షానికి ఆమె ఇంటి చుట్టూ వరద. బయటికి వెళ్లలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోప్ సాయంతో ఆమె ఇంటికి చేరుకున్నారు. అలేఖ్యతోపాటు కుటుంబ సభ్యులకు లైఫ్ జాకెట్లు ధరింపజేసి రోప్ సాయంతో ఇంటిలో నుంచి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె అమెరికా వెళ్లేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. ప్రకృతి విపత్తుల సమయంలో గ్రేటర్ వరంగల్ మహా నగరాన్ని రక్షించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) మేమున్నామంటోంది. అత్యవసర సమయాల్లో మెరుపు వేగంతో రంగంలోకి దిగి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను రక్షిస్తోంది. తాజా గా మోంథా తుపాను కారణంగా వరంగల్ మహానగరం అతలాకుతలమైంది. ఈనేపథ్యంలో బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది 30 మంది, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం హైదరాబాద్కు చెందిన ఎస్డీఆర్ఎఫ్, టీజీఎఫ్డీకి సంబంధించిన సుమారు వంద మంది రక్షకులు సేవలందించారు. వరదలో చిక్కుకున్న సుమారు 400 మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించి శెభాష్ అనిపించుకున్నారు. వరంగల్ నగరంలోని 45 వరద ప్రభావిత ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు మెరుపు వేగంతో స్పందించాయి. ఆస్తి, ప్రాణ నష్టం, రవాణా సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించి అందరి మన్ననలు పొందాయి. పోలీసుల సేవాభావం.. పలు కాలనీల్లో వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ భవన్లో ఓ వివాహ వేడుక కోసం వచ్చిన సుమారు 150 మంది వరదలో చిక్కుకున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. కాపువాడ, గోకుల్నగర్, టీవీ టవర్ కాలనీ, గోపాల్పూర్ భగత్సింగ్ నగర్ వంటి ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఒకదశలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ నేరుగా రంగంలోకి దిగి ట్రాక్టర్పై వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. విద్యార్థినులకు ఆపన్నహస్తం..రెండేళ్ల క్రితం 2023, జూలై 27న కురిసిన వర్షానికి హంటర్రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల భవనం మొదటి అంతస్తులోకి వర్షపు నీటితోపాటు పాములు, తేళ్లు వచ్చాయి. భవనం టెర్రాస్పై బిక్కుబిక్కుమంటూ రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థినులు వేచి చూశారు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ సాయంతో విద్యార్థినులను రక్షించారు. ఈ ఏడాది అక్టోబర్ 29న అదే పరిస్థితి ఎదురైంది. మోంథా తుపాను కారణంగా డిగ్రీ కళాశాల భవనం పూర్తిగా జలమయమైంది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు సుమారు 12 గంటల పాటు విద్యార్థినులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ సారథ్యంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బోట్ల సాయంతో 470 మంది విద్యార్థులను రక్షించి పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తమను రక్షించిన వారికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. వరద పోటెత్తినా.. విద్యుత్ పునరుద్ధరణవర్షం దంచికొడుతున్నా.. రాత్రింబవళ్లు వినియోగదారులకు కరెంట్ సరఫరాను అందించారు విద్యుత్ సిబ్బంది. నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగి కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. వరద నీటిలో వెళ్లి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు సరఫరా నిలిపివేసి ప్రత్యామ్నా య మార్గంలో విద్యుత్ సరఫరా అందించారు. వర్షం, వరద నీటిలో స్తంభం పైకి ఎక్కుతుంటే.. కాళ్లు పట్టు కోల్పోతున్నా.. విద్యుత్ సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.సల్లగా బతకమని ఆశీర్వదించింది.. సమ్మయ్యనగర్లో ఇళ్లు, చుట్టూ భారీగా వరద నీరు నిలిచిందని అందిన సమాచారంతో వరద నీటిలోకి వెళ్లాను. ఆ ఉధృతికి నాకే భయం వేసింది. కానీ, ధైర్యం చేసుకొని ముందుకు సాగాను. ఓ మహిళను తాడు సాయంతో ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాను. ఆమె నన్ను ‘సల్లగా బతుకు’ అని ఆశీర్వదించింది. – వి.శ్రీకాంత్, డీఆర్ఎఫ్ అటు ట్రాఫిక్, ఇటు రెస్క్యూ.. వర్షం కురుస్తున్నంతసేపు సమస్య తీవ్రత ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు తక్షణ సేవలందించాం. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు తీసుకున్నాం. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జేసీబీ, ట్రాక్టర్లతో వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. – పునాటి నరసింహారావు, ఏసీపీ, హనుమకొండ గర్భిణిని ఒడ్డుకు చేర్చాం.. 28వ డివిజన్ హంటర్ రోడ్డులోని సాయినగర్ కాలనీలో గర్భిణి వరదల్లో చిక్కుకుందని తెలియడంతో డీఎఫ్ఓ శంకర్ లింగం ఆదేశాలతో ముందుకు సాగాం. అదే సమయంలో ఏసీపీ శుభం ప్రకాశ్, మట్టెవాడ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బందితో బయటకు తీసుకొచ్చి ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చాం – సీహెచ్.అశోక్, డీఆర్ఎఫ్ -
మొక్క మొక్కకో కర్ర!
దుగ్గొండి: మోంథా తుపాను రైతును నిలువునా ముంచేసింది. వరి, పత్తి, అరటి, మిరప తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాత దశలో ఉన్న మిరప తోటలు నేలవాలడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే, ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. శ్రమ అయినా సరే తోటను కాపాడుకోవాలని సంకల్పించాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన రైతు ఆవుల నర్సింహారెడ్డి మీటరు పొడవు ఉన్న కర్రలను సమకూర్చాడు. తన మిరప తోటలో నేలవాలిన ప్రతి మొక్కకు ఒక కర్రను కట్టాడు. ఇలా తనకున్న ఎకరం తోటను కాపాడుకోవడానికి రోజుకు ఆరుగురు కూలీలతో రెండు రోజులపాటు కర్రలను పాతి తోటను బతికించాడు. దుగ్గొండి–గిర్నిబావి ప్రధాన రహదారి పక్కన శివాజీనగర్ సమీపంలో ఉన్న ఈ తోటను అటువైపు వెళ్తున్న వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
జలంలోనే ‘నగర’జనం
హన్మకొండ/వరంగల్ అర్బన్/ఖిలా వరంగల్/రామన్నపేట: వర్షం వీడినా నగరవాసులు ఇంకా జలంలోనే జనం ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాకా వర్షం తగ్గుముఖం పట్టింది. అయినా.. లోతట్టు కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. వరంగల్ పరిధిలోని శివనగర్, ఎన్ఎన్నగర్, డీకేనగర్, కాశికుంట, సాకరాశికుంట, వాంబేకాలనీల్లో వరదనీరు ఉధృతి ఇంకా వీడలేదు. దీంతో 34,35,40,41,42,32,33 డివిజన్లలోని పలు కాలనీలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ధాటికి ఇంటిముందు, ఇంట్లో పార్క్ చేసిన బైక్లు, కార్లు నీటిలో తెలియాడాయి గురువారం ఉదయం వర్షం వీడిన తర్వాత మరమ్మతుల కోసం మెకానిక్ల వద్ద క్యూ కడుతూ కనిపించారు. తాగునీటికి ఇక్కట్లు ముంపు కాలనీల్లోని భవనాలపై తలదాచుకున్న వారికి తాగునీరు, ఇతర అవసరాల ఇక్కట్లు తప్పలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం మధ్యాహ్నం బల్దియా అధికారులు ట్రాక్టర్ల లో శుద్ధనీటిని తెచ్చి ఇంటికో క్యాన్ అందించారు. శివనగర్ జలదిగ్బందంలో చిక్కింది. రహదారులపై 5 ఫీట్ల ఎత్తుతో వరదనీరు ప్రవహిస్తోంది. వరంగల్ అండర్ బ్రిడ్జి క్రింది నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఖిలా వరంగల్ కోట ఉత్తరద్వారం నీటిలో మునిగింది. మధ్యకోటలోని పంటపొలాలు, ఆకుకూరతోటలు నీట మునిగాయి. గురువారం ఉదయం మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఎన్ఎన్నగర్, రామన్నపేట ప్రాంతాలను సందర్శించారు. నీటిలో చిక్కన ప్రజలను సురక్షితంగా పునరవాస కేంద్రాలకు తరలింపు చర్యలు తీసుకున్నారు. నీటమునిగిన రామన్నపేట సంతోషిమాత కాలనీతో పాటు హంటర్, పోతన రోడు మీదుగా నీరంతా 29వ డివిజన్ రామన్నపేటకు చేరుకుంది. ఇళ్లలోకి మోకాళ్ల లోతు రావడంతో ఆయా కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. రాత్రింతా విద్యుత్ సౌకర్యం సైతం నిలిచిపోవడం భవనాలపైకి నిద్రపోవాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్ హంటర్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు బొందిగవాగు దాటి పోతన రోడ్డు మీదుగా ఎంజీఎం వైపు హంటర్ రోడ్డుమీదుగా రైల్వేస్టేషన్, శివనగర్వైపు ప్రయాణాలు సాగుతుంటాయి. బొందిగ వాగు నుంచి 12 మోరీల జంక్షన్ వరకు సుమారు ఏడు ఫీట్ల లోతుతో అత్యంత వేగంగా వరద ప్రవాహం కొనసాగిన నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఈ ప్రాంతంగా గుండా రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. నిలువునా ముంచిన బొందివాగు నగరంలో కీలకమైన బొందివాగు నాలా సమీప కాలనీల ప్రజల పెను శాపంగా మారింది. బుధవారం అర్ధరాత్రి దాటినే తర్వాత బొంది వాగు పొంగి పొర్లడంతో హంటర్ రోడ్డంతా జలసంద్రమైంది. ఎన్టీఆర్ నగర్, సాయినగర్, బృందావన కాలనీ, భద్రకాళీ నగర్, సంతోషిమాత కాలనీతోపాటు పోతన నగర్ రోడ్డుకు సమీపంలోని పలు కాలనీలు నీట మునిగాయి. క్షణ క్షణం పెరుగుతున్న వరద తో పేద,మధ్య, సంపన్నులు తేడా లేకుండా దాబాలపై, పై అంతుల్లో రాత్రంతా గడిపారు. తెల్లవారు జామున స్థానిక కార్పొరేటర్ గందె కల్ప న నవీన్, బల్దియా, పోలీస్ యంత్రాంగం వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలను బోట్ల ద్వారా వెళ్లి అందజేశారు. హనుమకొండ పరిధిలో.. భారీ వర్షానికి రాంపూర్, సోమిడి చెరువులు నిండి మత్తడి పోయడంతో ఆ వరద వడ్డేపల్లికి చెరువులోకి చేరింది, వడ్డేపల్లి చెరువు మత్తడి పోస్తూ చెరువుకు సమాంతరంగా మత్తడి నీరు బయటకు వెళ్తుండడంతో ఆ వరద నీరు గోపాల్పూర్ చెరువులోకి చేరింది. గోపాల్పూర్ చెరువులోకి భారీ వరద చేరడంతో చెరువు కట్టపై నుంచి, 100 ఫీట్ల రోడ్డుపై నీరు పొర్లడంతో కాలనీలోకి వరద వచ్చి చేరింది. వరద నీరు సులువుగా వెళ్లేందుకు నిర్మించిన డక్ట్ అండ్ డ్రైన్కు ఏర్పాటు చేసిన జాలీకి చెత్తాచెదారం అడ్డుపడడంతో వరద నీరు నాలా ద్వారా ప్రవహిస్తూ పొంగిపొర్లడంతో గురువారం వేకువజామున 4 గంటలకు 100 ఫీట్ల రోడ్డుపై నుంచి గోపార్పూర్ చెరువు కింద ఉన్న వివేక్నగర్ కాలనీలోకి చేరింది. ఉదయం 4 గంటల తర్వాత గంటగంటకు వరద నీరు పోటెత్తడంతో పాటు నాలా ఉప్పొంగడంతో అమరావతినగర్, టీవీ టవర్ కాలనీ, కుడా కాలనీ, విద్యానగర్, సమ్మయ్యనగర్, ఇంజనీర్స్ కాలనీ, గోపాల్పూర్ ప్రాంతంలోని కాలనీలు, రాజాజీ నగర్, నందితారే నగర్, రాంనగర్లోని వరద నీరు చేరి కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హనుమకొండ, వరంగల్ పరిధిలో తగ్గని వరద నీళ్లల్లోనే పలు కాలనీలు బాధితులకు తాగునీటికి ఇక్కట్లు -
హనుమకొండలో 15 కాలనీల్లో తీవ్ర వరద ప్రభావం
● కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: హనుమకొండ పరిధిలో 15 కాలనీలు వరద ముంపునకు గురయ్యాయని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ప్రధానంగా గోకుల్ నగర్, ఇందిరమ్మ కాలనీ, పోచమ్మకుంట, హనుమకొండ చౌరస్తా, ఎన్జీవోస్ కాలనీ రోడ్, భగత్ సింగ్ కాలనీ, పోస్టల్ కాలనీ, జవహర్ కాలనీ, భీమారం మెయిన్ రోడ్, కాపు వాడ, వివేక్ నగర్, అమరావతి నగర్, సమ్మయ్య నగర్, ప్రగతి నగర్, తిరుమల్ నగర్ లు వరద నీటి ముంపునకు గురయ్యాయని వివరించారు. అదేవిధంగా జిల్లాలో 920 చెరువులకు గాను 500 చెరువులు మత్తడి పోస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 10 ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. హనుమకొండ పరిధిలో ముంపు ప్రభావం ఉన్న కాలనీల నుంచి 896 మందిని ఖాళీ చేయించి 12 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆర్ అండ్బీ పరిధిలోని 12రోడ్లు, పంచాయతీరాజ్కు సంబంధించి 21 రోడ్లు దెబ్బతిన్నట్లు వివరించారు. జిల్లాలో వరి పంట 33348 ఎకరాలు, పత్తి 750 ఎకరాలు, మొక్కజొన్న 620 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. 229.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు.. హనుమకొండ జిల్లాలో ఈ నెల 29న ఉదయం 8:30 నుంచి 30వ తేదీ (గురువారం) 8:30 గంటల వరకు జిల్లాలో సగటున 229.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిందని కలెక్టర్ తెలిపారు. భీమదేవరపల్లి మండలంలో 390.6 మిల్లీ మీటర్లు, వేలేరులో 313.8, కాజీపేట 313.6, ధర్మసాగర్ 312.8, హనుమకొండ 310.8, ఎల్కతుర్తిలో 295.4, హసన్పర్తిలో 252.4, ఐనవోలులో 208.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు. బోట్లు వచ్చాయి.. ప్రాణాలు నిలిచాయి!● ఊపిరి పీల్చుకున్న సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు ● సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ● పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరీష్ -
నష్టం కొండంత
మోంథా.. ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్లో నీట మునిగిన వరిని చూపుతున్న రైతు● నేలవాలిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలు ● పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ● పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ● నిలిచిన విద్యుత్ సరఫరా ● మూగజీవాల మృత్యువాతమొంథా తుపాను ప్రభావంతో హనుమకొండ జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కుండపోత భారీ వర్షం కురిసింది. పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు, రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల్లో చేతికి అందివచ్చిన వరి నేలవాలి తీవ్రనష్టం వాటిల్లింది. పత్తిలో నీరు నిలిచింది. వాగులు పొంగిపొర్లాయి. చెరువులు మత్తడి దుంకాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలని, గూడు కోల్పోయిన వారికి ఇళ్లు మంజూరు చేయాలని బాధితులు, పలు పార్టీల నాయకులు కోరారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఎల్కతుర్తి: మండలంలోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఉట్కూరి ప్రభాకర్గౌడ్కు చెందిన కోళ్లఫామ్లోని 7 వేల కోడిపిల్లలు తుపాను తాకిడికి మృత్యువాత పడ్డాయి. చింతపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో ఇళ్ల గోడలు కూలి నిలువ నీడ లేకుండా పోయింది. గోపాల్పూర్లో ఓ లేగదూడ మృత్యువాత పడింది. మరో మూడు పశువులు వాగులో పడి కొట్టుకుపోయాయి. ఎల్కతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో కాలనీలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఎల్కతుర్తి నుంచి ముల్కనూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై వరదనీరు భారీగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాల్లో చేతికి అందివచ్చిన వరి నేలవాలింది. భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్–కొత్తకొండకు వెళ్లే రహదారి బ్రిడ్జి వరద నీటికి ధ్వంసమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
వర్ష బీభత్సం
కమలాపూర్: మోంథా తుపాను రైతులను ఆగం చేసింది. కమలాపూర్ పెద్ద చెరువు మత్తడి బ్రిడ్జితో పాటు వంగపల్లి, దేశరాజుపల్లి, కన్నూరు బ్రిడ్జీ ల వద్ద బ్రిడ్జిలను తాకుతూ ప్రవహించిన వరద నీరు రోడ్లపై నుంచి ప్రవహించింది. ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. పెద్ద చెరువు మత్తడి ప్రవాహ ఉధృతిలో ఒక కారు చిక్కుకుపోగా.. అందులో ప్రయాణిస్తున్న వారికి ప్రాణాపాయం తప్పింది. శంభునిపల్లి వాగు ఉగ్రరూపం దాల్చడంతో సమీపంలోని ప్రాథమిక పాఠశాలను వరద నీరు ముంచెత్తింది. పలు ఇళ్లల్లోకి వరద చేరింది. వంగపల్లిలో మంద రాజు అనే కౌలు రైతుకు చెందిన సుమారు రూ.1.50 లక్షల విలువైన రెండు పాడి ఆవులు వరదలో మునిగి మృతి చెందాయి. మండలవ్యాప్తంగా 2 వేలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మండల వ్యాప్తంగా 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కొట్టుకుపోయిన కల్వర్టు.. పరిశీలించిన మంత్రి
ఎల్కతుర్తి: మొంథా తుపాను ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారి వర్షానికి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్–కొత్తకొండకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలోని కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కల్వర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెగిపోయిన ప్రదేశం వైపు వాహనాదారులు వెళ్లకుండా రోడ్డు పూర్తిగా క్లోజ్ చేయాలని పోలీసులకు సూచించారు. దెబ్బతిన్న కల్వర్టు ప్రాంతంలో హైలెవల్ బ్రిడ్జ్జి నిర్మించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రమాదవశాత్తు కల్వ ర్టులో పడి మృతి చెందిన కొత్తపల్లి గ్రామానికి చేందిన నాగేంద్రం కుటుంబీకులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వాగులో పడి గల్లంతైన ఇద్దరు బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలు శాఖల ఉన్నతాధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాహనదారులు వెళ్లకుండా రోడ్డును బ్లాక్ చేయండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
తుపాను ప్రభావంతో 25 గొర్రెల మృత్యువాత
నర్సంపేట రూరల్ : చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన గొర్రెలు మేత కోసం బుధవారం ఉదయం అడవికి వెళ్లాయి. మోంథా తుపాన్ ప్రభావంతో అడవిలోనే 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో బాధితుడికి సుమారు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల, మేకల పెంపకందార్ల సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ డిమాండ్ చేశారు. జువైనల్ హోంకు బాలుడి తరలింపు ఖానాపురం: మండలంలోని ఓ తండాకు చెందిన నాలుగు సంవత్సరాల బాలికపై ఇదే తండాకు చెందిన బాలుడు లైంగిక దాడికి పాల్పడిన విషయం విధితమే. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా బాలుడిని అదుపులోకి తీసుకొని వరంగల్లో నగరంలోని జువైనల్ హోంకు గురువారం తరలించినట్లు తెలిసింది. ఇందిలా ఉండగా.. మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన అంగన్వాడీ సెంటర్ టీచర్ మూడు పద్మను విధుల నుంచి తొలగించినట్లు డీడబ్ల్యూఓ రాజమణి గురువారం తెలిపారు. అంగన్వాడీ సెంటర్ విధుల్లో నిర్లక్ష్యం వహించడం, అధికారులకు విషయం తెలపకుండా సెంటర్ను మరొకచోటుకు మార్చడంతోపాటు పలు సంఘటనలకు కారణం కావడంతో కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు డీడబ్ల్యూఓ తెలిపారు. డీఈని నిలదీసిన రైతులు వర్ధన్నపేట : వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు నిర్వహణ లోపం ఉందని, కేవలం వర్షం పడి చెరువు నిండినప్పుడే అధికారులు రావడం ఏమిటని నీటి పారుదల శాఖ డీఈ రాజును కోనారెడ్డి చెరువు వద్ద రైతులు గురువారం నిలదీశారు. కట్టకు రివిట్మెంట్ లేకపోవడంతో చెరువు నిండిన సమయంలో కోతకు గురయ్యే ప్రమాద ఉందని, కట్ట వెంట ఉన్న జంగిల్ కటింగ్ కూడా చేయకపోవడంతో కట్ట బలహీన పడే అవకాశం ఉందని రైతులు తెలిపారు. మత్తడి వద్ద పేరుకుపోయిన మట్టిని తొలగించకపోవడంతోపాటు మత్తడి రాళ్లను సరిచేయకపోవడంపై ప్రశ్నించారు. చెరువు నిండినప్పుడు మాత్రమే అధికా రులు హడావుడి చేస్తూ సందర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్ఏ–1 పరీక్షల వాయిదా కాళోజీ సెంటర్ : తీవ్ర వర్ష ప్రభావం కారణంగా విద్యార్థులు పాఠశాలకు చేరుకునే అనుకూల పరిస్థితులు లేనందున నేడు(శుక్రవారం) 31వ తేదీ, నవంబర్ 1 శనివారం నిర్వహించాల్సిన ఎస్ఏ–1 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డీఈఓ రంగయ్య నాయుడు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలను సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. కొట్టుకుపోయిన కల్వర్టు.. పరిశీలించిన మంత్రి పొన్నం ఎల్కతుర్తి: మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారి వర్షానికి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్–కొత్తకొండకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలోని కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కల్వర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెగిపోయిన ప్రదేశం వైపు వాహనాదారులు వెళ్లకుండా రోడ్డు పూర్తిగా క్లోజ్ చేయాలని పోలీసులకు సూచించారు. దెబ్బతిన్న కల్వర్టు ప్రాంతంలో హైలెవల్ బ్రిర్జి నిర్మించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రమాదవశాత్తు కల్వర్టులో పడి మృతి చెందిన కొత్తపల్లి గ్రామానికి చేందిన నాగేంద్రం కుటుంబీకులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వాగులో పడి గల్లంతైన ఇద్దరు బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలు శాఖల ఉన్నతాధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. -
రైతులు ఆందోళన చెందొద్దు
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట/నెక్కొండ/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం పర్యటించారు. బుధవారం కురిసిన వర్షంతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తి నష్టం జరగడంతో బాధితులను కలిసి భరోసా కల్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీఓ ఉమారాణితో కలిసి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం వేర్వేరుగా మాట్లాడారు. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో వరంగల్–నర్సంపేట రహదారిని నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. నర్సంపేట–నెక్కొండ, నెక్కొండ–కేసముద్రం, నర్సంపేట–గూడూరు రోడ్డులను 10 మీటర్ల వెడల్పుతో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ లావణ్య, ఎస్సై మహేందర్, ఎంపీఓ దయాకర్, పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, లావుడ్యా తిరుమల్, ఆవుల శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
న్యూశాయంపేట: ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదుకోవాలని, మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మోంథా తుపాన్ సహాయక చర్యలపై గురువారం జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద తదితర అధికారులు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తుపాన్ నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. తుపాన్ ప్రభావిత, ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారుల సెలవులు రద్దు చేయాలన్నారు. 24గంటలు అత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. శుక్రవారం(నేడు) వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తామన్నారు. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణాల రక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్, జిల్లా అధికారులు ప్రజల వెంటే ఉంటూ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. లోతట్లు ప్రాంతాల ప్రజలను తరలించడానికి మరిన్ని పడవలు కావాలని కోరారు. వీసీ అనంతరం కలెక్టర్ సత్యశారద.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. లోతట్లు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఎన్డీఆర్ఎఫ్టీ, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్రెడ్డి నేడు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే పాల్గొన్న మంత్రి సురేఖ, కలెక్టర్ సత్యశారద -
ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలి
● డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్ నెక్కొండ: వరుస వర్షాలకు తోడు మోంథా తూపానుతో గ్రామాలు, గిరిజన తండాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే పకడ్బందీగా చేపట్టాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్ అన్నారు. మండలంలోని నెక్కొండ, అలంకానిపేట పీహెచ్సీల పరిధిలోని పలు గ్రామాల్లో కొనసాగుతోన్న సర్వే, వైద్య శిబిరాలను గురువారం ఆయన సందర్శించి, మాట్లాడారు. ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సర్వే రిపోర్టు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు నివేదించాలని సూచించారు. ప్రసవ సమయం సమీపించిన గర్భిణులకు అత్యవసర వైద్యసేవలు అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రెడ్లవాడలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శంచిన ఆయన రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు రహేలా తన్వీర్, సుమన్, అఖిల్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ముంచిన మోంథా..
శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 మండలాల్లో 10 నుంచి 34 సెంటీ మీటర్ల వరకు వర్షం వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు నష్టం అంచనా వేసే పనిలో వ్యవసాయ అధికారులు భారీ వానకు తెగిన చెరువు కట్టలు సాక్షి, వరంగల్: మోంథా తుపాను బీభత్సంతో జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతి న్నాయి. చేతికొచ్చే సమయంలో పంటలు ఆగమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు కురిసిన వానతో పత్తి గింజ చేనుల్లోనే కిందపడిగా, వరి పంటలు నేలవాలాయి. కల్లాల్లో అరబోసిన మొక్కజొన్నలు తడిసిముద్దయ్యాయి. తుపాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 58,730 ఎకరాల్లో వరి, 16,420 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. వీటితోపాటు మొక్కజొన్న, కూరగాయలు, అరటి.. ఇతర పంటలు కలుపుకొని మొత్తంగా 32,530 మంది రైతులకు చెందిన 75,823 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా. ఎక్కడెక్కడ ఎంత నష్టం.. నర్సంపేట మండలంలో 5,250 ఎకరాల్లో వరి, 40 ఎకరాల్లో పత్తి, 60 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం జరిగింది. దుగ్గొండి మండలంలో 1750 ఎకరాల్లో వరి, 100 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాలలో మొక్కజొన్న, 50 ఎకరాల అరటి తోటలు దెబ్బతిన్నాయి. నెక్కొండ మండలంలో ఆరు వేల ఎకరాల్లో వరి, 900 ఎకరాల్లో పత్తి, 700 ఎకరాల్లో మొక్కజొన్న, 20 ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగింది. చెన్నారావుపేట మండలంలో ఏడు వేల ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పత్తి, 40 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఖానాపురం మండలంలో ఆరు వేల ఎకరాలు, నల్లబెల్లి మండలంలో 2,500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. గీసుగొండ మండలంలో 3 వేల ఎకరాల్లో పత్తి, 850 ఎకరాల్లో వరి, 160 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సంగెం మండలంలో వరి 3,770 ఎకరాల్లో, పత్తి 3,520 ఎకరాల్లో, మొక్కజొన్న 30 ఎకరాల్లో దెబ్బతింది. వర్ధన్నపేట మండలంలో 6,000 ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పత్తి పంట, పర్వతగిరి మండలంలో 8800 ఎకరాల్లో వరి, 2,500 ఎకరాల్లో పత్తి, 25 ఎకరాల్లో కూరగాయలు, 80 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. రాయపర్తి మండలంలో 6,800 ఎకరాల్లో వరి 2,600 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం కలిగింది. వరంగల్ మండలంలో 200 ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో పత్తి, ఖిలా వరంగల్ మండలంలో 180 ఎకరాల్లో పత్తి, 2020 ఎకరాల్లో వరి, 110 ఎకరాల్లో ఆకుకూర తోటలు దెబ్బతిన్నాయి. -
అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
● రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వరద బాధితుల భరోసా ఇచ్చారు. మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జలమయమైన ఎన్ఎన్నగర్, డీకే నగర్, బీఆర్నగర్ ప్రాంతాల్లో ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి సురేఖ సందర్శించి వరద బాధితులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ముంపు పరిస్థితి తలెత్తుతుందని, నగర పరిధిలో లోతుట్టు ప్రాంతాలు ఉండటం, కొన్ని ప్రాంతాలు కబ్జాకు గురికావడం, సరైన ెనాలాలు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు పునరావృత్తమవుతున్నాయని అన్నారు. ఇలాంటి ఇబ్బందులు మళ్లీ రాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో సగటున 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. పర్వతగిరి, కల్లెడ ప్రాంతాల్లో 37 సెం.మీ, నెక్కొండలో 33 సెం.మీ వర్షం కురిసిందని, పర్వతగిరిలో కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎన్పీడీసీఎల్ సీఎండీ పర్యవేక్షించినట్లు తెలిపారు. రాయపర్తి మండలంలో ఓ చెరువు కట్ట తెగిపోయి 50 ఇల్లు దెబ్బతిన్నాయని, పంట పొలాల్లోకి నీరు చేరిందని తెలిపారు. నగరంలోని కొన్ని కాలనీలు నీటిలో ఉన్నాయని, ముంపును అరికట్టకలిగితే రాబోయే 12 నుంచి 16 గంటల్లో నీరు పూర్తిగా వెళ్లిపోయే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ ఇక్బాల్, ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, కార్పొరేటర్లు పల్లం పద్మ, మరుపల్లి రవి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు పాల్గొన్నారు. -
వరద బాధితులకు ఆశ్రయం
● 3,000 మందికి పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక ఏర్పాట్లు వరంగల్ అర్బన్: మహానగర వ్యాప్తంగా జలమయమైన కాలనీల్లోని 3 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. గురువారం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో సహాయక చర్యలను వారు పరిశీలించారు. గోపాల్పూర్, అమరావతి నగర్ సమ్మయ్య నగర్, టీవీ టవర్ కాలనీ, శాంతినగర్, వాజ్పేయి కాలనీ, వరంగల్లోని హంటర్ రోడ్డు, పోతన రోడ్డు, శివనగర్, బీరన్నకుంట తదితర ప్రాంతాలను సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తుపాను దృష్ట్యా బల్దియా పరిధి హనుమకొండలో 4, వరంగల్ పరిధిలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీరు, ఆహారం, రక్షణ కోసం దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
పిడుగుపాటుతో విద్యుత్ శాఖకు భారీ నష్టం
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డినెక్కొండ: మోంథా తుపాన్ కారణంగా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లిందని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్రెడ్డి తెలిపారు. మండలంలోని 133/33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను ఆయన గురువారం రాత్రి సందర్శించి, మాట్లాడారు. బుధవారం మండలంలోని పత్తిపాక 33/11 కేవీ విద్యుత్ సబ్ సేష్టన్ సమీపంలోని గుట్టపై రెండు పిడుగులు పడడంతో విద్యుత్ సరఫరాకు అనుసంధానంగా ఉన్న ఆరు బ్రేకర్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. దీంతో పత్తిపాక, రెడ్లవాడ, నాగారం, లింగగిరి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లలో సరఫరా లినిచిపోయిందన్నారు. దెబ్బతిన్న బేకర్ల విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందిలేకుండా తాత్కాలిక ఏర్పాట్లుతో సరఫరా అందించాలని అధికారులను ఆదేశించారు. వారంలో కొత్త బ్రేకర్లు అమర్చాలని చెప్పారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి మోంథా తుపాన్, భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్ అన్నారు. బుధవారం కురిసిన వర్షం కారణంగా విద్యుత్ శాఖకు కలిగిన అంతరాయాన్ని గురువారం ఆయన పర్యవేక్షించారు. సకాలంలో మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్, నర్సంపేట డీఈ తిరుపతి, ఏడీఈ శ్రీధర్, ఏఈ చిరంజీవి ఉన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బుధవారం మంత్రి వరంగల్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్తో అధికారులతో మాట్లాడారు. రైతులకు నష్టం వాటిల్ల కుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ డీఆర్డీఓ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలు అలర్ట్గా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలి● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: మోంథా తుపాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు ఉండాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లు, చెరువులు, కాల్వ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, భవనాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్న్యూశ్యాయంపేట: భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండలస్థాయి అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్షించారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం 18004253424 టోల్ ఫ్రీనంబర్, 9154252936 నంబర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా అధికారులు సమన్వయంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఉదృతంగా ప్రవహించే వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, చెరువుల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. టెలికాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు నిరీక్ష
దుగ్గొండి: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న నిరీక్ష ఎంపికై ందని ప్రత్యేక అధికారి మంజుల తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నిరీక్ష ప్రతిభ కనబరిచి గోల్డ్మెడల్ సాధించిందని పేర్కొన్నారు. నవంబర్ ఒకటి నుంచి హర్యాణా రాష్ట్రంలోని పానిపట్లో జరగనున్న జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఆమె ఆడనుందని తెలిపారు. ఈ మేరకు నిరీక్షను పాఠశాల ప్రత్యేక అధికారి మంజుల, పీఈటీ లావణ్య, ఉపాధ్యాయులు రమ, సుభాషిణి, అనూష, పుష్పలీల, సరస్వతి, స్రవంతి, సంధ్య, రమ్యశ్రీ, స్పందన, శ్రావణి బుధవారం అభినందించారు. పశువులకు టీకాలు వేయించాలిదుగ్గొండి: రైతులు తమ పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని రాష్ట్ర వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ రజిని సూచించారు. మండలంలోని తిమ్మంపేట గ్రామంలో పశువుల గాలికుంటు టీకాల శిబిరాన్ని ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకాలు వేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. డెయిరీ ఫాం నిర్వాహకులు పాడి గేదెల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గేదెలతో పాటు దూడలకు టీకాలు వేయించాలని, దూడలను బతికించుకోకపోతే డెయిరీ నష్టాల పాలవుతుందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పశువులకు వ్యాధులు సొకే అవకాశం ఉన్నందున పశువైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందించాలని సూచించారు. 280 పాడిగేదెలు, 10 ఆవులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. జిల్లా పశు సంవర్థకశాఖ అఽధికారి బాలకృష్ణ, వైద్యాధికారి బాలాజీ, సిబ్బంది పావని, గోపాలమిత్ర ప్రసాద్, పాడి రైతులు పాల్గొన్నారు. ఉత్సాహంగా సైకిల్ ర్యాలీవరంగల్ క్రైం: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీ ఉత్సహంగా సాగింది. ఈర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్నారు. ఈర్యాలీని అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్, అదాలత్ సెంటర్, హనుమకొండ కలెక్టరేట్ నుంచి తిరిగి ఇదే మార్గం నుంచి నక్కలగుట్ట మీదుగా పొలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుంది. ఈర్యాలీ వరంగల్ పోలీస్ కమిషనర్ సైక్లింగ్ రైడర్స్తో కలిసి పోలీస్ అమర వీరులకు జోహర్లు నినాదాలు చేస్తూ రైడర్స్ను ఉత్సాహపర్చారు. అనంతరం ర్యాలీ పాల్గొన్న సైకిల్ రైడర్లకు పోలీస్ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ర్యాలీలో అదనపు డీసీపీలు, శ్రీనివాస్, ప్రభాకర్, బాలస్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు జితేందర్రెడ్డి, నర్సింహారావు, అనంతయ్య, నాగయ్య, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఏజే పెడల్స్ యాజమాన్యం, ట్రైసిటీ సైకిల్ రైడర్స్, పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, నిట్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. హారతి వేదికకు గొడుగు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన సరస్వతీనది పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్ వద్ద దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇవ్వడానికి ఏడు వేదికలు నిర్మించిన విషయం తెలిసిందే. ఏడు వేదికలపై తొమ్మిది హారతులు పండితులచే ఇచ్చేందుకు పుష్కరాల సమయంలో గద్దెలు నిర్మించగా, పూర్తిస్థాయిలో పైన గొడుగులు, ఇతర పరికరాలు ఏర్పాటు చేయలేదు. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు అప్పటి నుంచి ప్రతీ రోజు గోదావరి హారతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కాగా, మిగిలిన పనులను పూర్తి చేయడానికి గద్దెలపై ఇనుప రాడ్డులతో గొడుగు, పరికరాలు కాళేశ్వరం చేరాయి. -
విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న అతి భారీ వర్షాలతో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతంరెడ్డి, హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్రావు సూచించారు. వర్షాలతో విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో వినియోగదారులు అత్యంత అప్రమత్తతతో ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ భద్రత కోసం పాటించాల్సిన సూచనలు.. ● వర్షాలు పడుతున్న సమయంలో తడి ప్రదేశాల్లో తడిగా ఉన్న చేతులతో స్విచ్లు, మీటర్లు, ప్లగ్లు, వైర్లు తాకొద్దు. ● ఎక్కడైనా తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించినప్పుడు వాటి దగ్గరికి వెళ్లొద్దు. వెంటనే సమీప లైన్న్మన్న్కు లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలి. ● తక్కువ ఎత్తులో వెళ్లే విద్యుత్ తీగల కింద వాహనాలు నడుపొద్దు. పశువులను తీసుకెళ్లవద్దు. ● పిల్లలను విద్యుత్ పరికరాల దగ్గర ఆడనీయకుండా దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ● పొలాల్లో లేదా బోరుబావుల వద్ద పనిచేసే సమయంలో తడి నేలపై నిలబడి విద్యుత్ మోటారు స్విచ్లు ఆన్/ఆఫ్ చేయకండి. ● విద్యుత్ పరికరాల్లో తడినీరు ఉంటే వాటిని వినియోగం నుంచి తొలగించాలి. ● వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటిలో మునిగిన విద్యుత్ పరికరాలను తాకొద్దు. ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ ఎస్ఈలు కె.గౌతంరెడ్డి, పి.మధుసూదన్రావు -
తుపాన్తో తీవ్ర నష్టం
పరకాల: ‘మోంథా’ తుపాన్ కారణంగా పరకాల పట్టణంలోని శ్రీకుంకుమేశ్వరాలయ ప్రాంగణంలో వారం రోజులుగా నిర్మిస్తున్న మహారుద్రయాగ మండపం బుధవారం కుప్పకూలింది. లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న మండపం కూలడంతో వచ్చే నెల 3న నిర్వహించనున్న మహారుద్రయాగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఉత్సవ సమితి ప్రకటించింది. పంటపొలాలు.. పత్తి చేన్లకు తీవ్ర నష్టం పరకాల మండలంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన దశలో పంట పొలాలు వర్షానికి దెబ్బతిన్నాయి. వరికొయ్యలను చూసి రైతు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా తుపాన్ నట్టేట ముంచింది. వరికొయ్యలు నేలమట్టం కాగా, పత్తి రైతులకు కొలుకోలేని దెబ్బతగిలింది. ఇప్పటికే వాతావరణం అనుకూలంగా లేక దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో తుపాన్తో పత్తి బుగ్గలు సైతం తడిసిముద్దయ్యాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేలవాలిన పంటపొలాలు.. తడిసి ముద్దయిన పత్తి -
మహిళలపై వివక్ష ఆందోళనకరం
పరకాల: మహిళలు అనేక రకాలుగా వివక్షకు గురికావడం ఆందోళనకరమని పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ అన్నారు. పరకాల మున్సిపల్ కార్యాలయంలో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ బాధ్యులు మహిళలు, బాలికలపై హింస నివారణపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలు, బాలికల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని తెలిపారు. వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో హింసా రహిత సమాజం సాధ్యమవుతుందన్నారు. మహిళలు ధైర్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని, తల్లిదండ్రులు పిల్లల యోగ క్షేమాలపై తప్పనిసరిగా దృష్టి సారించాలని కమిషనర్ సుష్మ కోరారు. సదస్సులో డాక్టర్ డి.స్వాతి, సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ మహేందర్, మండల పీఓ విమల, ఎస్సై పవన్, మెప్మా ఏడీఎంసీ సతీశ్, సర్వోదయ ప్రాజెక్టు మేనేజర్ కవిరాజ్, కోఆర్డినేటర్ శ్రీలత, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ఉన్నారు.పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ -
ఇబ్బందులు కలగొద్దు
మంత్రి కొండా సురేఖ వరంగల్: మోంథా తుపాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బుధవారం మంత్రి వరంగల్ క్యాంప్ కార్యాలయం నుంచి వరంగల్ కలెక్టర్తో, అధికారులతో మాట్లాడారు. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ డీఆర్డీఓ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలు అలర్ట్గా ఉండాలన్నారు. -
నేడు విద్యాసంస్థలకు సెలవు
విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్: భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు నేడు (ఈనెల 30న) సెలవును ప్రకటించారు. కాగా, గురువారం నిర్వహించే సమ్మిటివ్–1 పరీక్షలను వాయిదా వేసినట్లు డీఈఓలు వాసంతి, రంగయ్య నాయుడు, జిల్లా డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్ బుధవారం తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదోన్నతి పొందిన టీచర్లకు నిర్వహించనున్న శిక్షణలు కూడా వాయిదా వేసినట్లు తెలిపారు. జూనియర్ కళాశాలలకు.. మోంథా తుపాను నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్ సుమన్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. హన్మకొండ అర్బన్: జిల్లాలోని రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు అలాగే వదిలేశారు. రేపు మాపు అంటూ ఆ బియ్యాన్ని గోదాంలకు తరలించకుండా కాలయాపన చేశారు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం చాలావరకు తడిసిపోయాయి. అధికారులకు 6 నెలలుగా చెబుతున్నా పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి దాపురించిందని డీలర్లు వాపోతున్నారు. ఇప్పటికై నా రేషన్ షాపుల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని అధికారులు గోడౌన్కు తరలించాలని డీలర్లు కోరుతున్నారు. హన్మకొండ: హనుమకొండ జిల్లాలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆటోమెటిక్ వెదర్స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. హనుమకొండ జిల్లాలో రాత్రి 10 గంటల వరకు భీమదేవరపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.90 సెంటీమీటర్ల వర్షం కు రిసింది. అత్యల్పంగా వేలేరులో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మసాగర్లో 33.28 సెంటీమీటర్లు, హసన్పర్తిలో 26.95, దామెరలో 24.63, మడికొండలో 22.75, పెద్దపెండ్యాలలో 21.48, కొండపర్తిలో 20.18, కాజీపేటలో 24.50, ఆత్మకూకులో 14.20, పులుకుర్తిలో 13.78, కమలాపూర్లో 14.43, నడికూడలో 10.50, ఎల్కతుర్తిలో 10.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో 92.8 మిల్లీమీటర్లు, హసన్పర్తి నాగారంలో 77, పరకాలలో 80, శాయంపేటలో 71.5, వేలేరులో 3.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలో సగటు వర్షపాతం 229 మిల్లీమీటర్లు నమోదైంది. హన్మకొండ అర్బన్: హనుమకొండ రాంనగర్ శ్రీనివాస హార్ట్ సెంటర్ సమీపంలో బుధవారం భారీ వరదలు ముంచెత్తడంతో ఓ ఇంటిగోడ పూర్తిగా కూలిపోయింది. ఆసమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, సుమారు 8 మంది వృద్ధులు ఆ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో అప్పటికే సుమారు నాలుగు ఫీట్ల వరకు వరద నీరు చేరింది. దీంతో వృద్ధులు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న హనుమకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దశరథ రాంరెడ్డి, సుబేదారి పోలీసులు తాళ్ల సాయంతో వారిని ఎత్తుకొచ్చి వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఐనవోలు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్లో జరుగనున్న రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పంథిని విద్యార్థులు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ మండల కార్యదర్శి కుండె కిరణ్ తెలిపారు. బుధవారం పంథిని ప్రభుత్వ పాఠశాలలో ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ పులి ఆనందం మాట్లాడుతూ.. 19 సంవత్సరాల్లోపు బాలబాలికల విభాగంలో విద్యార్థులు లకావత్ కార్తీక్, కొలిపాక ఆర్య, గోర్కంటి అభిరామ్, బుల్లె వర్ష, దూలం లాస్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవడం అభినందనీయమన్నారు. -
కొండపర్తి కట్టు కాల్వకు గండి
ఐనవోలు: భారీ వర్షానికి కొండపర్తి ఊర చెరువు కట్టు కాల్వకు బుధవారం సాయంత్రం గండి పడింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, పోలీసులు జేసీబీతో కట్టు కాల్వను పునరుద్ధరించినట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఊర చెరువు కట్ట బలంగా లేకపోవడంతో కోతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానిక రైతులు తెలిపారు. ఇరిగేషన్ ఏఈ ప్రశాంత్, డీటీ రాజ్కుమార్, ఆర్ఐ మల్లయ్య, ఎస్సై పస్తం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.పునరుద్ధరించిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు -
ప్రసవానికి ముందే ఆస్పత్రికి తరలించాలి
● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు దుగ్గొండి/నల్లబెల్లి/ఖానాపురం: తుపాను నేపథ్యంలో గ్రామాల్లోని గర్భిణులను ప్రసవానికి ముందే జిల్లా ఆస్పత్రికి తరలించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సూచించారు. దుగ్గొండిలో పీహెచ్సీ, వెంకటాపురంలో ఉపకేంద్రం, నల్ల బెల్లి, ఖానాపురంలోని పీహెచ్సీలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రయాణం అనుకూలంగా ఉండకపోవడంతో గర్భిణులను ముందే సీకేఎం లేదా జీహెచ్ఎంకు తరలించాలని ఆదేశించారు. దుగ్గొండి వైద్యాధికారి కిరణ్రాజు, మెడికల్ ఆఫీసర్ రాకేశ్, సీహెచ్ఓ సలోమి, హెచ్వీ సంధ్యారాణి, ఎల్టీ స్వప్న, హెల్త్ అసిస్టెంట్ చాణక్య, జ్యోతి, ఏఎన్ఎం సరిత, నల్లబెల్లి పీహెచ్సీ వైద్యాధికారి ఆచార్య, పల్లె దవాఖాన డాక్టర్ నిఖిల, హెల్త్ విజిటర్ హెబ్సిబా, హెల్త్ అసిస్టెంట్ కిషన్, ఫార్మసిస్ట్ రంగారావు, ఖానాపురం పీహెచ్సీ సిబ్బంది ఉన్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళిశ్రీపాల్రెడ్డి విద్యారణ్యపురి : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి సూచించారు. హనుమకొండ జిల్లా పరిషత్ సమావేశ హాల్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల శాఖల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టెట్ పై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతి త్వరలోనే ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోసం యత్నిస్తున్నట్లు చెప్పారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మంద తిరుపతిరెడ్డి, ఫలిత శ్రీహరి, నకిరెడ్డి మహేందర్, బాధ్యులు కోమల్రెడ్డి, బెడిదె జగన్మోహన్ గుప్తా, సోమిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎడ్ల ఉపేందర్రెడ్డి, కటకం రఘు, ఉమామహేశ్వర్, యాకూబ్రెడ్డి, మిర్యాల సతీష్రెడ్డి, కొట్టె శంకర్, ఎన్వీఆర్ రాజు, మహ్మద్ అబ్దుల్గఫార్, సుమాదేవి, అనురాధ, సంధ్య, అర్పిత, శోభారాణి, సరిత, రహమత్, కరీంనగర్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జాలి రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబాలతో కలిసి ధర్నా చేస్తాం
న్యూశాయంపేట: రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోతే కుటుంబాలతో కలిసి వచ్చి ధర్నా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరయ్య హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 18 నెలలుగా ప్రభుత్వం పింఛన్ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో విసిగివేసారి నిరసనకు పూనుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర అసోసియేట్ ఉపాధ్యక్షుడు సుధీర్బాబు మాట్లాడుతూ బకాయిలు అందకపోవడంతో మానసిక క్షోభకు గురై ఇప్పటివరకు 20 మంది రిటైర్డ్ ఉద్యోగులు అసువులు బాసారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమంలో బకాయిల సాధన కమిటీ నాయకులు శ్రీధర ధర్మేద్ర, కడారి భోగేశ్వర్, మహబూబ్ అలీ, గఫార్, బాబురావు, సదానందం, వేణుమాధవ్, కృష్ణమూర్తి, కృష్ణకుమార్, సారంగపాణి, సమ్మయ్య, కుమారస్వామి, దామోదర్, చలం, సారయ్య, వనజ, రమాదేవి పాల్గొన్నారు.108, 102 వాహనాల తనిఖీ సంగెం: మండల కేంద్రంలోని 108, 102 వాహనాలను జిల్లా మేనేజర్ గుర్రపు భరత్కుమార్ సోమవారం తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న పరికరాలు, రిజిస్టర్లు, మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సలహాలు, సూచనలు చేశారు. కాల్ సెంటర్ నుంచి కేసు వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి సకాలంలో చేరుకుని క్షతగాత్రులు, బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలించాలన్నారు. విధుల పట్ల సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల కేంద్రంలో 102 వాహన సేవలను గర్భిణులు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో 108 సిబ్బంది మాధవరెడ్డి, రాజ్కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఆర్డీఎఫ్ విద్యార్థినిపర్వతగిరి: కల్లెడ ఆర్డీఎఫ్ వనిత అచ్యుత పాయి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గుగులోతు వెన్నెల.. జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆడెపు జనార్దన్ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించినట్లు జనార్దన్ వివరించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురానికి చెందిన వెన్నెలను ప్రిన్సిపాల్తో పాటు వైస్ ప్రిన్సిపాల్ ఎ.రాజు, అకడమిక్ హెడ్ ప్రవీణ్కుమార్, ఏఓ సతీష్, పీఈటీ కోకిల, అధ్యాపకులు సంతోష్, శ్రీధర్, మహేశ్వర్, జయశంకర్, ధన్య, సైదులు గుంశావలి, శ్రీలత, ధనలక్ష్మి, తిరుమల అభినందించారు. -
అభయ హస్తం అందిస్తున్నాం..
వీరమరణం, ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబాలకు మేం ఉన్నాం అనే ఆత్మీయ అభయహస్తాన్ని అందిస్తున్నాం. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ ఆదేశాలతో కాజీపేట డివిజన్లోని అయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారుల వివరాలను తెలుసుకొని వారి కుటుంబాలను ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తున్నారు. వారి యోగ క్షేమాలను తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వం, శాఖాపరంగా రావాల్సిన లబ్ధికి సంబంధించిన వివరాలను కూడా నివేదికల రూపంలో అందిస్తున్నాం. –పింగిళి ప్రశాంత్రెడ్డి, కాజీపేట ఏసీపీ ● -
వినతులు త్వరగా పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహశబరీష్ హన్మకొండ అర్బన్ : ప్రజావాణి వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్కు వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు దరఖాస్తులు అందజేశారు. మొత్తం 112 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేష్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ పాల్గొన్నారు. -
పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించాలి
● వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి న్యూశాయంపేట: వర్షాలతో పంటకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. పత్తి, ధాన్యం, మొక్కజొన్న వంటి పంటల కొనుగోలుపై హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సోమవారం సాయంత్రం సమీక్షించారు. రాబోయే రెండు రోజులు తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెండు రోజుల పాటు పంట కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లా అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు. డీసీఎస్ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హెల్ప్లైన్ నంబర్ను 79950 50785 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీసీలో జిల్లా అధికారులు రాంరెడ్డి, అనురాధ, నీరజ, కిష్టయ్య, సంధ్యారాణి, సురేఖ, తదితరులు పాల్గొన్నారు. -
41కిలోల ధాన్యం ఉండేలా చూసుకోవాలి
● డీఆర్డీఓ రాంరెడ్డిరాయపర్తి: బస్తాలో 41 కిలోల ధాన్యం ఉండేలా చూసుకోవాలని, ఎక్కువ ఉంటే కేంద్రం నిర్వాహకులను తొలగిస్తామని డీఆర్డీఓ రాంరెడ్డి హెచ్చరించారు. మండలంలోని కొలన్పల్లి, కొండూరు, రాయపర్తి, మైలారం, జేతురాం తండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ జిల్లాలో మొదటగా రాయపర్తి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గతేడాది 24 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఇప్పుడా సంఖ్య 48కి పెరిగిందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసుకొని మట్టి, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. వరి కోసే సమయంలో హార్వెస్టర్లో ఆర్పీఎం స్పీడు 18 నుంచి 20 వరకు ఉండేలా చూసుకోవాలని, దానివల్ల తాలు పొలంలోనే పడిపోతుందని చెప్పారు. దళారులను నమ్మి ధాన్నాన్ని వారికి విక్రయించవద్దని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధరతోపాటు సన్నధాన్యానికి రూ.500 బోనస్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎస్ఓ కిష్టయ్య, సివిల్ సప్లయ్ డీఎం సంధ్యారాణి, డీపీఎం దాసు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, ఏంపీఎ రవీందర్, ఏఓ గుమ్మడి వీరభద్రం, సీసీలు, తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ రామచంర్రారెడ్ది, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, పాలకుర్తి సోమానాథాలయ చైర్మన్ కృష్ణమాచార్యులు, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
‘లక్కు.. కిక్కు’ దక్కింది!
సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్ : వరంగల్ అర్బన్(హనుమకొండ)జిల్లాలోని 67 వైన్స్కు కలెక్టర్ స్నేహ శబరీష్ స్థానిక అంబేడ్కర్ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో టోకెన్ల తీసి దరఖాస్తుదారులకు వైన్స్లు కేటాయించారు. ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా చేపట్టాల్సి ఉండగా ఆలస్యంగా 12.32 నిమిషాలకు ప్రారంభమైంది. దాదాపు గంటన్నర పాటు దరఖాస్తుదారులు వైన్స్ వస్తుందా రాదా అంటూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలోని 67 వైన్స్కు టెండర్ల చివరి తేది 23వ నాటికి 3,175 దరఖాస్తులు రాగా, లక్కీ డ్రాలో వైన్స్ దక్కించుకున్న వారు ‘లక్కు కిక్కు’లో తేలగా దక్కనివారు నిరాశతో వెనుదిరిగారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కాజీపేట, హనుమకొండ, వరంగల్ అర్బన్, ఖిలా వరంగల్ ఎకై ్సజ్ సీఐలు చంద్రమోహన్, దుర్గాభవా నీ, ప్రభాకర్రెడ్డి, రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. నిరాశలో 3,108 మంది దరఖాస్తుదారులు జిల్లాలోని 67 వైన్స్గాను రెండేళ్ల కాలపరిమితితో గత నెల 25న ప్రభుత్వం టెండర్లు ప్రకటించి ఈ నెల 23వ తేదీని చివరి తేదీగా ఖరారు చేసింది. రూ.3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజును నిర్ణయించగా 3,175 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నిర్వహించిన లక్కీ డ్రాలో 67 మందికి వైన్స్ రాగా, 3,108మంది నిరాశతో వెనుదిరిగారు. పదు ల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించిన సిండికేట్రాయుళ్ల పాచికలు ఫలించలేదు. ఫీజు రూపేణా ప్రభుత్వ ఖజానాకు రూ.95.2 కోట్ల ఆదాయం సమకూరింది. కాజీపేట పరిధిలోని కడిపికొండ వైన్స్కు 116 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కమలాపూర్ వైన్స్కు 21 వచ్చాయి. కాగా, కడిపికొండ వైన్స్ ఎందరు దరఖా స్తు చేసుకున్నా మాదే అంటూ గత నిర్వాహకులే చేజి క్కించుకోవడం గమనార్హం. కాగా, వైన్స్ దక్కించుకున్న వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతనషాపులు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. తాము కోరుకున్న స్థలంలో దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.లక్కీ డ్రాలో వైన్స్ రావడంతో అవధుల్లేని ఆనందం రాని వారు నిరాశతో ఇంటిముఖం.. దుకాణాలను కేటాయించిన కలెక్టర్ స్నేహ శబరీష్ 67 వైన్స్ ..3,175 దరఖాస్తులు డిసెంబర్ 1నుంచి నూతన వైన్స్ నిర్వహణ అత్యధికంగా కడిపికొండ 116... అత్యల్పంగా కమలాపూర్ 21 -
మద్యం లాటరీ ప్రక్రియ విజయవంతం
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. వరంగల్ ఉర్సుగుట్ట నాని గార్డెన్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో జిల్లా ఎకై ్సజ్శాఖ సూపరింటెండెంట్ అరుణ్కుమార్ నేతృత్వంలో మొత్తం 57 షాపులకు పారదర్శకంగా లక్కీడ్రా పద్ధతిన లైసెన్స్దారుల ఎంపిక ప్రక్రియను సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై 57 షాపులకు లాటరీ పద్ధతిలో లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఆశావహులు వేలాదిగా తరలిరాగా.. అధికారులు భారీ డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటు చేసి ప్రత్యక్షప్రసారం చేశారు. జిల్లాలో మొత్తం 57 షాపులకు 1,958 దరఖాస్తులు వచ్చాయి. నర్సంపేటలో 22 షాపులకు 755, పరకాలలో 20 షాపులకు 691, వర్ధన్నపేటలో 15 షాపులకు 512 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.58.74కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చింది. జిల్లాలో ఒక్కో దుకాణానికి సరాసరి 16షాపులు తగ్గకుండా దరఖాస్తులు రాగా.. నడికూడ వైన్స్కు 100 దరఖాస్తులు రావటం గమనార్హం. డ్రా పద్ధతిలో దుకాణం దక్కించుకున్న వారు 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఎకై ్సశాఖ అధికారులు ఆదేశించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన షాపులను ప్రారంభించాలన్నారు. నడికూడ 42వ నంబర్ షాపునకు 100 దరఖాస్తులు రాగా, జి.రమణరెడ్డి విజేతగా నిలిశారు. లాటరీ ప్రక్రియలో నర్సంపేటకు చెందిన జి.సాంబలక్ష్మి నర్సంపేట 5వ షాపును దక్కించుకోగా, ఆమె భర్త జి.రాజేశ్వర్రావుకు ఆత్మకూరులో 38వ షాపును లాటరీ డ్రాలో సొంతం చేసుకున్నాడు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్స జ్ శాఖ ఇన్స్పెక్టర్లు తాతాజీ, నరేష్రెడ్డి, స్వరూప, మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రెండు షాపులు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం.. మాది నర్సంపేట పట్టణం. 25 ఏళ్లుగా మద్యం షాపులు నిర్వహిస్తున్నాం. మేమిద్దరం మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోగా, మాకు నర్సంపేట 5వ షాపు, ఆత్మకూరులో 38వ షాపు దక్కాయి. దీన్ని అదృష్టంగా భావిస్తున్నాం. – రాజేశ్వర్రావు, సాంబలక్ష్మి దంపతులు 57 షాపులకు లక్కీడ్రా విజేతలను ప్రకటించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి జిల్లాలో దరఖాస్తులపై రూ.58 కోట్ల ఆదాయం నడికూడ వైన్స్కు అధికంగా 100 దరఖాస్తులు -
పరకాల అభివృద్ధే లక్ష్యం..
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల : ప్రణాళికబద్ధంగా పరకాల పట్టణాన్ని ఆరు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధి రంగంలో పరకాల పట్టణం వెనకబడిందని ఆయన పేర్కొన్నారు. వర్షపు నీరు వెళ్లే డ్రెయినేజి వ్యవస్థను అభివృద్ధి చేయకుండా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సోమవారం పరకాల మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 1,2,13,14 వార్డుల్లో చేపట్టిన డ్రెయినేజి, పారిశుద్ధ్య, రోడ్డు నిర్మాణాలను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వచ్చిన నిధులను సక్రమంగా ఉపయోగించకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయని మండిపడ్డారు. 3,4,6 జోన్లలో మొదటి విడతగా, 1,2,5 జోన్లలో రెండోవిడతగా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. అదే విధంగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, టాప్క్, ఇండోర్ స్టేడియం అభివృద్ధి, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ, ఏఈ రంజిత్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు కట్కూరి దేవేందర్రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు ఐనవోలు : మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టం చేశారు. సోమవారం నందనం రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో రాంనగర్ రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను రవీందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలు లేకుండా, తేమశాతం ఉన్న పంటలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మొక్కజొన్నకు రూ.2,400 చెల్లించనున్నట్లు తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ కూడా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. మండల వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రాంనగర్లో మాత్రమే ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సొసైటీ ఆధ్వర్యంలో ఏడు చోట్ల రాంనగర్, కక్కిరాలపల్లి, పంథిని, పున్నేలు, గర్మిళ్లపెల్లి, ఉడుతగూడెం, ఐనవోలు గ్రామాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్రావు, డైరెక్టర్లు బొమ్మినేని బుచ్చిరెడ్డి, చింత బాబు, మేట చిరంజీవి, కలకోట ఎలేంద్ర, బిర్రు పద్మ, నోడల్ ఆఫీసర్ సునీల్ కుమార్, సొసైటీ సీఈఓ కోతి సంపత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ పాల్గొన్నారు. -
వేటుతో సరి.. పర్యవేక్షణ లేదు మరి!
ఎంజీఎం : వరుస ఘటనలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వార్తల్లోకెక్కుతోంది. ఏదో ఒక ఘటన జరగడం.. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం.. ఈ విషయాన్ని సద్దుమణిగించేందుకు ప్రభుత్వ పెద్దలతోపాటు అధికారులు సూపరింటెండెంట్పై వేటు అని ఓ సందేశాన్ని పంపి అసలు అంశాన్ని పక్కదారి పట్టించడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి శనివారం ఒకే ఆక్సిజన్ సిలిండర్పై ఇద్దరు చిన్నారులను ఎలాంటి వైద్యసిబ్బంది సహాయం లేకుండా తీసుకెళ్లిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూపరింటెండెంట్పై వేటు వేయాలని హెల్త్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో ఆస్పత్రి పాలన మెరుగుపడేనా అంటే సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సేవల మెరుగుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని పట్టించుకోని పెద్దలు తూతూమంత్రంగా ఒక పత్రిక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ టు వరంగల్.. ఆస్పత్రి పాలనలో సూపరింటెండెంట్తోపాటు ఆర్ఎంఓలు, ఆయా విభాగాధిపతులు కీలకం. వీరు వరంగల్లోనే నివాసం ఉంటూ ఆస్పత్రిలో ఆయా విభాగాల వారీగా ఎప్పటికప్పుడు సేవలందిస్తూ సమస్యలను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. కావాల్సిన ఔషధాలు, పరికరాలను సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన సేవలందించాలి. కానీ వీరిలో చాలామంది హైదరాబాద్ నుంచి ఓరుగల్లుకు అప్అండ్డౌన్ చేస్తున్నారు. సమయపాలన పాటించకుండా వచ్చి వెళ్తున్నవారిపై చర్యలు తీసుకోకుండా సూపరింటెండెంట్పై వేటు వేస్తే ఆస్పత్రి ఎలా బాగుపడుతుందన్న చర్చ జరుగుతోంది. కుప్పకూలుతున్న పిల్లల విభాగం.. ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగం అంటే మంచి వైద్యం అందుతుందన్న అభిప్రాయం గతంలో ఉండేది. సాధారణ బదిలీల తరువాత హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన వైద్యులు సరిగ్గా విధులకు రాకపోవడంతో ఈ విభాగం అధ్వానంగా మారిందన్న ఆరోపణలున్నాయి. గత శనివారం పిల్లల విభాగాధిపతి విధులకు రాకపోవడంతోనే ఘటనకు కారణమనే విషయాన్ని గ్రహించిన సూపరింటెండెంట్ ఆమెకు మెమో సైతం జారీ చేశారు. ఏళ్ల తరబడిగా భర్తీకి నోచని ఆర్ఎంఓ పోస్టులు 1,500 పడకల ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని విభాగాల సమన్వయం చేసుకునేందుకు పరిపాలన విభాగంలో సూపరింటెండెంట్కు తోడుగా ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టుతోపాటు ముగ్గురు ఆర్ఎంఓ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. కొన్నేళ్లుగా సివిల్, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉండగా, రెండు నెలల క్రితం డిప్యూటీ సివిల్ సర్జన్గా విధుల్లో చేరిన వైద్యుడే వారానికి రెండు రోజులు ఆస్పత్రికి వస్తున్నారని, వైద్యసిబ్బంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఇక.. ఆస్పత్రికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోవడం వల్ల కనీసం మందులు సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. హెచ్డీఎస్ నిధులనుంచి స్టేషనరీ కొనుగోలు చేస్తున్నారు. పట్టించుకోని మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో సేవలపై స్థానిక మంత్రి సురేఖతోపాటు ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని.. రెండు, మూడు సార్లు సందర్శించి విధులకు హాజరుకాని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎలాంటి మార్పు లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పాలనపై దృష్టి పెడితే తప్ప ఆస్పత్రి గాడిన పడే పరిస్థితి లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎంజీఎంలో వరుస ఘటనలతో కలకలం సూపరింటెండెంట్పై వేటు వేస్తే.. ఆస్పత్రి గాడిన పడుతుందా..? ఆస్పత్రిపై కరువైన ప్రజాప్రతినిధుల దృష్టి ఓవైపు నిధుల కొరత.. మరోవైపు పరికరాల లేమి హైదరాబాద్ నుంచి వరంగల్కు వైద్యుల రాకపోకలు -
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సమ సమాజ సేవకు పోలీసులు పునరంకితం కావాలనే లక్ష్యంతో రాష్ట్ర డీజీపీ క్షేత్రస్థాయిలో పోలీస్ కుటుంబాలను పరామర్శించి వారి సంక్షేమంపై సమీక్ష నిర్వహించాలని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ● ఎన్కౌంటర్లలో వీరమరణం పొందిన పోలీస్ అధికారుల కుటుంబాలను, రిటైర్డ్ సిబ్బంది కుటుంబాలను గ్రామాల్లో పెద్దలు, మహిళలు, విద్యార్థుల సమక్షంలో పూలమాలలతో గౌరవించాలి. ● వారి ఫొటోలను స్థానిక పోలీస్స్టేషన్లతో పాటు, విద్యాసంస్థల్లో ప్రదర్శించాలి. ● అవకాశం ఉన్నచోట వీరమరణం పొందిన పోలీస్ అధికారుల పేర్లను రోడ్లకు, పాఠశాలలకు పెట్టాలి. ● ఇలా చేయడం వల్ల సమాజానికి ఆయా పోలీసులు అందించిన అత్యుత్తమ సేవలు నేటితరానికి తెలియజేసినట్లు అవుతుందని భావన. ● వీరిని స్ఫూర్తిగా తీసుకుని యువత పోలీస్శాఖ వైపు ఉద్యోగ లక్ష్యంతో అడుగులు వేస్తారనేది అంచనా. ● రిటైర్డ్, మరణించిన ఉద్యోగుల సేవలను స్మరించుకోవడంతోపాటు వారి ఉద్యోగ అనుభవాలు, ఆలోచనలను తెలుసుకోవడం. వరంగల్ క్రైం: శాంతియుత సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు.. విధులు సమర్థవంతంగా నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసులు, ఆయా కుటుంబాలు ఇక తమను ఎవరూ పట్టించుకోరు అన్న అపోహను పారదోలేందుకు వారిలో ఆత్మస్థైర్యం నింపి తాము అండగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ‘ఆత్మీయ పలకరింపు’ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నాలుగు మాటలు మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకుని పండ్లు, స్వీట్లు అందిస్తున్నారు. ‘మీరు అందించిన సేవల వల్ల ప్రస్తుత పోలీసులు ఎంతో స్వేచ్ఛతో విధులు నిర్వర్తిస్తున్నారు. మీ సేవలను మరిచిపోం, మీకు అండగా మేం ఉంటాం’ అనే భరోసా ఇస్తున్నారు. డీజీపీ శివధర్రెడ్డి ఆలోచన.. ఆదేశాలతో క్షేత్రస్థాయిల్లో పోలీస్ కుటుంబాలను పలకరిస్తున్న పోలీస్ అధికారులకు మంచి స్పందన వస్తోంది. ముందు వరుసలో ‘కాజీపేట డివిజన్’ డీజీపీ శివధర్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తన పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో క్షేత్ర స్థాయిలో పోలీస్ కుటుంబాల ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ డీఎస్పీ రాజిరెడ్డి, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ డీఎస్పీ జన్ను సంజీవరావు, ఏఎస్సై కటకం సంపత్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో రిటైర్డ్ డీఎస్పీ విలియమ్స్, కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పుల్లా సంజీవరావు ఇలా పలువురు పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకొని వారిని శాలువాలతో సత్కరించారు. ఆత్మీయ పలకరింపు డీజీపీ ఆదేశాలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అమలు సేవలను గుర్తించి వారి అనుభవం.. ఆలోచనలకు ప్రాధాన్యం ముందు వరుసలో కాజీపేట సబ్ డివిజన్ సిబ్బందిరిటైర్డ్, అమరులైన పోలీస్ కుటుంబాలకు భరోసా -
అభయ హస్తం అందిస్తున్నాం..
వీరమరణం, ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబాలకు మేం ఉన్నాం అనే ఆత్మీయ అభయహస్తాన్ని అందిస్తున్నాం. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ ఆదేశాలతో కాజీపేట డివిజన్లోని అయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారుల వివరాలను తెలుసుకొని వారి కుటుంబాలను ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తున్నారు. వారి యోగ క్షేమాలను తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వం, శాఖాపరంగా రావాల్సిన లబ్ధికి సంబంధించిన వివరాలను కూడా నివేదికల రూపంలో అందిస్తున్నాం. –పింగిళి ప్రశాంత్రెడ్డి, కాజీపేట ఏసీపీ ● -
విద్యార్థుల ప్రగతికి అధునాతన సాంకేతిక సేవలు
● డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రగతి కోసం ఇంటర్ బోర్డు పలు అధునాతన సాంకేతిక సేవలను ప్రారంభించిందని ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం గూగుల్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు పలు ఆధునిక సేవలను వివరించారు. కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు మెరుగుదల కోసం ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్) ప్రారంభించినట్లు తెలిపారు. హాజరు విధానాన్ని అధునాతన సాంకేతిక పద్ధతిలో ఇంటర్ విద్యావిభాగం అవలంబిస్తోందని వివరించారు. ఆన్లైన్ ద్వారా టైంటేబుల్, టీచింగ్ డైరీ నమోదుతో అధ్యాపకుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సాంకేతిక సంస్థలతో ఒప్పందం చేసుకొని ఆన్లైన్ తరగతులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కళాశాలల్లో వసతుల మెరుగుదలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గూగుల్ మీట్లో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
వేటుతో సరి.. పర్యవేక్షణ లేదు మరి!
ఎంజీఎం : వరుస ఘటనలతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వార్తల్లోకెక్కుతోంది. ఏదో ఒక ఘటన జరగడం.. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం.. ఈ విషయాన్ని సద్దుమణిగించేందుకు ప్రభుత్వ పెద్దలతోపాటు అధికారులు సూపరింటెండెంట్పై వేటు అని ఓ సందేశాన్ని పంపి అసలు అంశాన్ని పక్కదారి పట్టించడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి శనివారం ఒకే ఆక్సిజన్ సిలిండర్పై ఇద్దరు చిన్నారులను ఎలాంటి వైద్యసిబ్బంది సహాయం లేకుండా తీసుకెళ్లిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూపరింటెండెంట్పై వేటు వేయాలని హెల్త్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో ఆస్పత్రి పాలన మెరుగుపడేనా అంటే సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సేవల మెరుగుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని పట్టించుకోని పెద్దలు తూతూమంత్రంగా ఒక పత్రిక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ టు వరంగల్...: ఆస్పత్రి పాలనలో సూపరింటెండెంట్తోపాటు ఆర్ఎంఓలు, ఆయా విభాగాధిపతులు కీలకం. వీరు వరంగల్లోనే నివాసం ఉంటూ ఆస్పత్రిలో ఆయా విభాగాల వారీగా ఎప్పటికప్పుడు సేవలందిస్తూ సమస్యలను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. కావాల్సిన ఔషధాలు, పరికరాలను సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన సేవలందించాలి. కానీ వీరిలో చాలామంది హైదరాబాద్ నుంచి ఓరుగల్లుకు అప్అండ్డౌన్ చేస్తున్నారు. సమయపాలన పాటించకుండా వచ్చి వెళ్తున్నవారిపై చర్యలు తీసుకోకుండా సూపరింటెండెంట్పై వేటు వేస్తే ఆస్పత్రి ఎలా బాగుపడుతుందన్న చర్చ జరుగుతోంది. కుప్పకూలుతున్న పిల్లల విభాగం.. ఎంజీఎం ఆస్పత్రి పిల్లల విభాగం అంటే మంచి వైద్యం అందుతుందన్న అభిప్రాయం గతంలో ఉండేది. సాధారణ బదిలీల తరువాత హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన వైద్యులు సరిగ్గా విధులకు రాకపోవడంతో ఈ విభాగం అధ్వానంగా మారిందన్న ఆరోపణలున్నాయి. గత శనివారం పిల్లల విభాగాధిపతి విధులకు రాకపోవడంతోనే ఘటనకు కారణమనే విషయాన్ని గ్రహించిన సూపరింటెండెంట్ ఆమెకు మెమో సైతం జారీ చేశారు. ఏళ్ల తరబడిగా భర్తీకి నోచని ఆర్ఎంఓ పోస్టులు 1,500 పడకల ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని విభాగాల సమన్వయం చేసుకునేందుకు పరిపాలన విభాగంలో సూపరింటెండెంట్కు తోడుగా ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టుతోపాటు ముగ్గురు ఆర్ఎంఓ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. కొన్నేళ్లుగా సివిల్, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉండగా, రెండు నెలల క్రితం డిప్యూటీ సివిల్ సర్జన్గా విధుల్లో చేరిన వైద్యుడే వారానికి రెండు రోజులు ఆస్పత్రికి వస్తున్నారని, వైద్యసిబ్బంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఇక.. ఆస్పత్రికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోవడం వల్ల కనీసం మందులు సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. హెచ్డీఎస్ నిధులనుంచి స్టేషనరీ కొనుగోలు చేస్తున్నారు. పట్టించుకోని మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో సేవలపై స్థానిక మంత్రి సురేఖతోపాటు ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని.. రెండు, మూడు సార్లు సందర్శించి విధులకు హాజరుకాని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎలాంటి మార్పు లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పాలనపై దృష్టి పెడితే తప్ప ఆస్పత్రి గాడిన పడే పరిస్థితి లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎంజీఎంలో వరుస ఘటనలతో కలకలం సూపరింటెండెంట్పై వేటు వేస్తే.. ఆస్పత్రి గాడిన పడుతుందా..? ఆస్పత్రిపై కరువైన ప్రజాప్రతినిధుల దృష్టి ఓవైపు నిధుల కొరత.. మరోవైపు పరికరాల లేమీ హైదరాబాద్ నుంచి వరంగల్కు వైద్యుల రాకపోకలు -
వరంగల్
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సమ సమాజ సేవకు పోలీసులు పునరంకితం కావాలనే లక్ష్యంతో రాష్ట్ర డీజీపీ క్షేత్రస్థాయిలో పోలీస్ కుటుంబాలను పరామర్శించి వారి సంక్షేమంపై సమీక్ష నిర్వహించాలని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ● ఎన్కౌంటర్లలో వీరమరణం పొందిన పోలీస్ అధికారుల కుటుంబాలను, రిటైర్డ్ సిబ్బంది కుటుంబాలను గ్రామాల్లో పెద్దలు, మహిళలు, విద్యార్థుల సమక్షంలో పూలమాలలతో గౌరవించాలి. ● వారి ఫొటోలను స్థానిక పోలీస్స్టేషన్లతో పాటు, విద్యాసంస్థల్లో ప్రదర్శించాలి. ● అవకాశం ఉన్నచోట వీరమరణం పొందిన పోలీస్ అధికారుల పేర్లను రోడ్లకు, పాఠశాలలకు పెట్టాలి. ● ఇలా చేయడం వల్ల సమాజానికి ఆయా పోలీసులు అందించిన అత్యుత్తమ సేవలు నేటితరానికి తెలియజేసినట్లు అవుతుందని భావన. ● వీరిని స్ఫూర్తిగా తీసుకుని యువత పోలీస్శాఖ వైపు ఉద్యోగ లక్ష్యంతో అడుగులు వేస్తారనేది అంచనా. ● రిటైర్డ్, మరణించిన ఉద్యోగుల సేవలను స్మరించుకోవడంతోపాటు వారి ఉద్యోగ అనుభవాలు, ఆలోచనలను తెలుసుకోవడం. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని మంత్రి కొండా సురేఖ అన్నారు.మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు.వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశం ఉంది. వరంగల్ క్రైం: శాంతియుత సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు.. విధులు సమర్థవంతంగా నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసులు, ఆయా కుటుంబాలు ఇక తమను ఎవరూ పట్టించుకోరు అన్న అపోహను పారదోలేందుకు వారిలో ఆత్మస్థైర్యం నింపి తాము అండగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ‘ఆత్మీయ పలకరింపు’ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నాలుగు మాటలు మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకుని పండ్లు, స్వీట్లు అందిస్తున్నారు. ‘మీరు అందించిన సేవల వల్ల ప్రస్తుత పోలీసులు ఎంతో స్వేచ్ఛతో విధులు నిర్వర్తిస్తున్నారు. మీ సేవలను మరిచిపోం, మీకు అండగా మేం ఉంటాం’ అనే భరోసా ఇస్తున్నారు. డీజీపీ శివధర్రెడ్డి ఆలోచన.. ఆదేశాలతో క్షేత్రస్థాయిల్లో పోలీస్ కుటుంబాలను పలకరిస్తున్న పోలీస్ అధికారులకు మంచి స్పందన వస్తోంది. ముందు వరుసలో ‘కాజీపేట డివిజన్’ డీజీపీ శివధర్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తన పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో క్షేత్ర స్థాయిలో పోలీస్ కుటుంబాల ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ డీఎస్పీ రాజిరెడ్డి, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ డీఎస్పీ జన్ను సంజీవరావు, ఏఎస్సై కటకం సంపత్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో రిటైర్డ్ డీఎస్పీ విలియమ్స్, కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పుల్లా సంజీవరావు ఇలా పలువురు పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకొని వారిని శాలువాలతో సత్కరించారు. ఆత్మీయ పలకరింపు డీజీపీ ఆదేశాలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అమలు సేవలను గుర్తించి వారి అనుభవం.. ఆలోచనలకు ప్రాధాన్యం ముందు వరుసలో కాజీపేట సబ్ డివిజన్ సిబ్బందిరిటైర్డ్, అమరులైన పోలీస్ కుటుంబాలకు భరోసా -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్/వేలేరు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారంలో, వేలేరు మండలం పీచరలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తూకం, తేమ విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించొద్దని కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ధాన్యంలో 17శాతం లోపు తేమ ఉండేలా రైతులు చూసుకోవాలని కోరారు. ఐకేపీ నిర్వాహకులు బస్తా 41 కిలోలు మాత్రమే తూకం వేయాలని సూచించారు. గత ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల సంక్షేమన్ని పట్టించుకోలేదని అన్నారు. రెండేళ్లలో రూ.1,388 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకు వచ్చానని తెలిపారు. ముప్పారంలో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకున్నామని తెలిపారు. మడికొండ నుంచి నారాయణగిరి, నారాయణగిరి నుంచి కొత్తకొండ వరకు మొత్తం 16.70 కిలోమీటర్ల పొడవు డబుల్ రోడ్డుకు రూ.24.25కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వచ్చే వానాకాలం నాటికి లిఫ్ట్–1 పనులు పూర్తిచేసి వేలేరు మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తానన్నారు. పీచర గ్రామంలో రూ.83 లక్షలతో సీసీ రోడ్ల పనులు పూర్తిచేశామని, 65 ఇందిరమ్మ ఇళ్లు గ్రామానికి ఇచ్చామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వేలేరు వయా శాలపల్లి నుంచి పీచర వరకు రూ.6 కోట్లు, పీచర, వయా మద్దెలగూడెం కొమ్ముగుట్ట వరకు రూ.3 కోట్లు, పీచర నుంచి వావిల్లకుంట తండా వరకు రూ.1కోటి42 లక్షల నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఓ మేన శ్రీను, సివిల్ సప్లయీస్ డీఎం మహేందర్, వ్యవశాయ శాఖ ఏడీ ఆదిరెడ్డి, డీపీఎం రాజేంద్రప్రసాద్, డీఎంపీఎస్ మహేందర్, తహసీల్దార్లు సదానందం, కోమి, ఎంపీడీఓ అనిల్ కుమార్, కవిత, ఏఈఓ నవ్య, నాయకులు కత్తి సంపత్, బిల్లా యాదగిరి పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలి
● వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్నెక్కొండ: ఆర్థిక సైబర్ నేరాలపై పోలీసులు దృష్టి సారించి, నేరగాళ్ల ఆట కట్టించాలని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్ సూచించారు. నెక్కొండ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు కార్యాలయ పరిసరాలు, విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను నెక్కొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే, సర్కిల్ పరిధి నెక్కొండ, చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లలో ఎలాంటి నేరాలు నమోదవుతున్నాయని ఆరా తీశారు. రౌడీషీటర్లు, అనుమానితుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసులు సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లు ఇళ్లను సందర్శించి, వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని చెప్పారు. ఆర్థిక సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల మూలాలపై దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేయాలని డీసీపీ ఆదేశించారు. గంజాయి, పొగాకు, మత్తు పదార్థాల నియంత్రణకు నిరంతరం పని చేయాలన్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. డీసీపీ వెంట నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, నెక్కొండ, చెన్నారావుపేట ఎస్సైలు మహేందర్, రాజేశ్రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళిశ్రీపాల్రెడ్డివిద్యారణ్యపురి: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి సూచించారు. హనుమకొండ జిల్లా పరిషత్ సమావేశ హాల్లో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల శాఖల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్చేశారు. టెట్పైన ఉపాధ్యాయులు ఆందోళన చెందొద్దని, అతిత్వరలోనే ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపునకు యత్నిస్తున్నట్లు చెప్పారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్టీయూటీఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మంద తిరుపతిరెడ్డి, ఫలిత శ్రీహరి, నకిరెడ్డి మహేందర్, బాధ్యులు కోమల్రెడ్డి, బెడిదె జగన్మోహన్ గుప్తా, సోమిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎడ్ల ఉపేందర్రెడ్డి, కటకం రఘు, ఉమామహేశ్వర్, యాకూబ్రెడ్డి, మిర్యాల సతీష్రెడ్డి, కొట్టె శంకర్, ఎన్వీఆర్ రాజు, మహ్మద్ అబ్దుల్గఫార్, సుమాదేవి, అనురాధ, సంధ్య, అర్పిత, శోభారాణి, సరిత, రహమత్, కరీంనగర్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జాలి రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం
హన్మకొండ : హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరి రాత్రి 7:30 రాజీవ్గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. తిరిగి ఉదయం 5గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బయలుదేరి ఉప్పల్ మీదుగా హనుమకొండ, భూపాలపల్లికి వెళ్తుంది. హనుమకొండ–శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చార్జీ రూ.700 లుగా నిర్ణయించారు. బస్సును సోమవారం ప్రారంభించినట్లు వరంగల్–1 డిపో మేనేజర్ అర్పిత తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్ : కపాస్ కిసాన్ యాప్ ద్వారా ప్రస్తుతం పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్ జరుగుతుందని కలెక్టర్ స్నేహశబరీష్ వివరించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి పత్తి, ధాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోళ్లు, తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహశబరీష్ హాజరైన మాట్లాడారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతుల మొబైల్ నంబర్ సేకరించి షెడ్యూల్ ప్రకారం పత్తి కొనుగోలు అయ్యేలా చూస్తున్నామని అన్నారు. కపాస్ కిసాన్ యాప్ లో కౌలు రైతుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల లాగిన్లో అవకాశం కల్పించామన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, డీసీఓ సంజీవరెడ్డి, డీపీఓ రవీంద్రసింగ్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నాయకులు, పెన్షనర్లతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి 2025 సెప్టెంబర్ వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందలేదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీరస్వామి, హనుమకొండ ఎస్టీఓ యూనిట్ జనరల్ సెక్రెటరీ కందుకూరి దేవదాసు, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, చింతగట్టు క్యాంపు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, శ్యాం సుందర్ రెడ్డి, భీమదేవరపల్లి కమిటీ బాధ్యులు రాజిరెడ్డి, లింగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించని ఉద్యోగులు, అధికారులు
వరంగల్ అర్బన్: తాళం వేశారు.. గొళ్లెం మరిచారు అన్న చందంగా మారింది వరంగల్ మహానగర పాలక సంస్థ పరిస్థితి. ప్రజాకార్యకలాపాలు ఈ–ఆఫీస్ ద్వారా కొనసాగిస్తున్న యంత్రాంగం హాజరు విధానంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఔట్సోర్సింగ్ కార్మికులకే బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నారు. కానీ, ఉద్యోగులు, అధికారుల విషయంలో హాజరు పుస్తకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. వారి రాకపోకలపై మేయర్, కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే విమర్శలు ఉన్నాయి. నెల రోజుల్లోగా అందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాలని రెండు నెలల క్రితం హెచ్చరించినా ఇంత వరకు అమలు చేయలేదు. దీంతో వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం, కాజీపేట, కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయాల్లో పనితీరు అస్తవ్యస్తంగా మారింది. సమయపాలన పాటించాలనే నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజలకు తప్పని ఇబ్బందులు అడిగేవారు లేక ప్రధాన కార్యాలయంలో పని చేసే సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వస్తున్న పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2013లో అప్పటి కమిషనర్ వివేక్యాదవ్ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. బయోమెట్రిక్ మిషన్ను ఆన్లైన్కు అనుసంధానం చేయించారు. అధికారులు, ఉద్యోగుల అటెండెన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బల్దియాకు చెందిన ‘అవర్ జీడబ్ల్యూఎంసీ’ వెబ్సైట్ ఏర్పాటు చేయించారు. విధుల్లో చేరేముందు బయోమెట్రిక్ మిషన్పై ఫింగర్ ప్రింట్ వేసిన అధికారులు, ఉద్యోగుల వివరాలు ఎప్పటికప్పుడు ‘ఆన్లైన్’లో నమోదవుతాయి. జీతాలు తీసుకునేందుకు ఈవిధానం ఎంతగానో దోహదపడింది. పౌరులు సైతం ‘అవర్ జీడబ్ల్యూఎంసీ’ వెబ్సైట్లోకి వెళ్లి వారి హాజరును పరిశీలించారు. కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా ఒక్క క్లిక్తో హాజరును తెలుసుకున్నారు. బయోమెట్రిక్ హాజరును లెక్కించాలి.. బయోమెట్రిక్ హాజరును లెక్కిస్తే సిబ్బంది, అధికారులు సమయానికి వస్తారు. పనుల్లో నిమగ్నం కావడం, పరస్పర అవగాహన, సమన్వయం ఉంటుంది. అధికారులు, సిబ్బందిలో బాధ్యత పెరుగుతోంది. నగర పౌరులకు సకాలంలో సేవలు లభిస్తాయి. అధికారులు, ఉద్యోగులు బాధ్యతారహితంగా విధులు నిర్వర్తిస్తున్నారని డిప్యూటీ కమిషనర్లను వివరణ కోరగా.. ఫీల్డ్ మీద విధులు నిర్వర్తిస్తున్నామని, ఒకవేళ ఎవరైనా విధుల్లోకి రాకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానాన్ని తొలుత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కు పరిమితం చేసి దశలవారీగా అన్ని విభాగాలకు విస్తరించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, బల్దియాలోని శాశ్వత ఉద్యోగులు, అధికారులకు బయోమెట్రిక్ అనుసంధానం నుంచి జీతాల లెక్కింపు మినహాయింపు జరుగుతోంది. ఔట్సోర్సింగ్ కార్మికులకు, ఉద్యోగులకు మాత్రమే బయోమెట్రిక్ విధానం వర్తిస్తోంది. దీంతో కొంతమంది సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, అధికారులు చుట్టపుచూపుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని బయోమెట్రిక్పై వేలిముద్రలు వేసి మొహం చాటేస్తున్నారు. చాలామంది తమకు వీలైన సమయంలో కార్యాలయానికి చేరుకుని వేలిముద్రలు వేసి అక్కడి నుంచి నిష్క్రమించి సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారు. మరికొంత మంది పనులు పక్కన పెట్టి కార్యాలయం, ఎదుట ఉన్న చెట్ల కింద, హోటళ్లలో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పడోస్తారో, ఎప్పడు పోతారో, అసలు వస్తారో రారో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. మరికొందరు విధుల్లోకి రాకుండా సంబంధిత వింగ్ అధికారులను మచ్చిక చేసుకుని దర్జాగా జీతాలు పొందుతున్నారని చర్చ జరుగుతోంది. సిబ్బంది లేకపోవడంతో కార్యాలయానికి వివిధ పనుల కోసం వస్తున్న ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. ప్రధాన, సర్కిల్ కార్యాలయాల్లో పర్యవేక్షణ కరువు ఔట్సోర్సింగ్ కార్మికులకే పరిమితమైన బయోమెట్రిక్ అమలుకు నోచుకోని మేయర్, కమిషనర్ ఆదేశాలు -
నీటి సరఫరాలో అవాంతరాల్లేకుండా చూడాలి
వరంగల్ అర్బన్: తాగునీటి సరఫరాలో అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టాలని మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఆదేశించారు. హనుమకొండ కేయూ, దేశాయిపేటలోని ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్లను మేయర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి సరఫరా తీరు, నీటి నాణ్యతను గురించి అధికారులను అడిగి తెలుసుకుని సమర్థంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా నీటి నాణ్య తను పరిశీలించిన అనంతరం మేయర్ మాట్లాడుతూ.. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి వచ్చే రా వాటర్లో సమస్య ఏర్పడిందని వర్షాకాలం ముగింపు సమయంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది కూడా ఈ సమస్య ఉత్పన్నమైందని, శనివారంతో పోలిస్తే ప్రస్తుతం నీటి సరఫరా బాగానే జరుగుతోందన్నారు. పూర్తిగా సమస్యను పరిష్కరించి నేటి (సోమవారం) నుంచి శుద్ధమైన నీటిని సరఫరా చేయనున్నట్లు మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి ఈఈ రవికుమార్, డీఈ సతీశ్, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో వర్ధన్నపేట, దుగ్గొండి మండలాలకు సంబంధించిన భూ భారతి, పీఓబీ రికార్డులు పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే అందుకు కారణాల్ని స్పష్టంగా పేర్కొనాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయకుండా రోజువారీగా పరిశీలన వేగవంతం చేసేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పారదర్శకత కీలకమన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు రాజేశ్వర్, విజయ్సాగర్, కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో బీఫార్మసీ కోర్సులో ఈనెల 28న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జె.కృష్ణవేణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎప్సెట్–2025 మార్గదర్శకాల ప్రకారం.. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుతో కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మసీ కాలేజీలో ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని సూచించారు. వేకెన్సీ సీట్లు 9 ఉన్నాయని.. ట్యూషన్ ఫీజు రూ.45 వేలు, స్పాట్ ఫీజు అర్హత కలిగిన అభ్యర్థులకు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశాలు పొందిన వారు ట్యూషన్ ఫీజు, రీయింబర్స్మెంట్కు అర్హులు కాదని ప్రిన్సిపాల్ కృష్ణవేణి తెలిపారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం నగర ప్రజలు గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ను రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిపాలనాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావొద్దని కోరారు. -
ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!
వరంగల్: పండించిన పత్తిని రైతులు మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితులు కనిపించట్లేదు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈదుస్థితి ఏర్పడింది. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.8,110 ఇస్తామని సీసీఐ వెల్లడించింది. ప్రతీ అదనపు శాతానికి రూ.81 కోత ఉంటుందని ఇప్పటికే పేర్కొంది. అది కూడా 12 శాతం వరకే. అంతకుమించితే కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరబెడదామంటే అనువైన పరిస్థితులు లేవు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మార్కెట్కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. మద్దతు ధర కంటే సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తక్కువగా అమ్మడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు.. సీసీఐ నిర్దేశించిన దానికంటే పత్తిలో తేమ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 60 సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు మార్కెటింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో 28, హనుమకొండలో 3, జనగామలో 15, మహబూబాబాద్ 6, భూపాలపల్లి 5, ములుగులో 3 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా సోమవారం లాంఛనంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాలతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ తెలిపారు. పత్తిలో తేమ శాతం కారణంగా మిగిలిన కేంద్రాలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పత్తిలో తేమ 8 శాతం ఉంటే మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తారు. 9 శాతం ఉంటే రూ.8,028, 10 శాతం ఉంటే రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,866, 12 శాతం ఉంటే 7,785.60 ధర చెల్లిస్తారు. 12 శాతం మించితే కొనుగోలు చేయమంటున్న సీసీఐ నేడు ఏనుమాముల మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గతంలో సీసీఐ కొనుగోలు చేసిన పద్ధతితోనే రైతులకు ఇబ్బందులు ఉండవు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత కేంద్రానికి తీసుకొస్తే తేమ ఎక్కువ ఉందని అంటే రైతు సరుకు వాపస్ తీసుకుపోవాల్సి వస్తోంది. దీని వల్ల రవాణా చార్జీలు అదనంగా భరించాలి. రైతు ఇష్టం ఉన్న కేంద్రంలో అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలో పలుచోట్ల ఈపద్ధతిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పంజాబ్లో గొడవలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. రైతు పట్టా పాస్బుక్, బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకుని కొనుగోలు చేస్తే బాగుంటుంది. – బొమ్మినేని రవీందర్రెడ్డి, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
విద్యారణ్యపురి: విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలని, స్కూళ్లను సెమీ రెసిడెన్షియల్గా మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో తక్కువగా నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం విధ్వంసానికి గురైందన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యనభ్యసించే సాధారణ ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాధారణ ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాట్లకు ఉపక్రమించిందని పేర్కొన్నారు. దీంతో విద్యలో మరింత అంతరాలు పెరిగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, అందరికీ సమాన విద్య అందించాలని డిమాండ్ చేశారు. అధ్యాపక జ్వాల సంపాదకురాలు జి.కళావతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ విలువైన సమయాన్ని యాప్లలో అప్లోడ్ చేసేందుకు కేటాయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. డీటీఎఫ్ నాయకురాలు ఎస్.అనిత మాట్లాడుతూ విధి నిర్వహణలో మహిళా ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్రెడ్డి, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ గంగాధర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీ నివాస్ బాధ్యులు ఎం.రఘుశంకర్రెడ్డి, ఈశ్వర్రెడ్డి ఎ.సంజీవరెడ్డి, డి.రమేశ్, వివిధ జిల్లాల బాధ్యులు గోవిందరావు, యాకయ్య, రాంరెడ్డి, తిరుపతి, భాస్కర్, దేవేందర్రాజు, ఆదిరెడ్డి మాట్లాడారు. డీటీఎఫ్ హనుమకొండ జిల్లా కౌన్సిలర్ ఏలూరు సత్యమ్మ శ్రీరాములపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో సత్యమ్మ నిబద్ధత, అంకితభావంతో పనిచేశారని డీటీఎఫ్ రాష్ట్ర, జిల్లాల బాధ్యులు కొనియాడారు.విద్యాసదస్సులో డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి -
ఉత్సాహంగా హెల్త్ రన్
పబ్లిక్ గార్డెన్ జంక్షన్లో వైద్య విద్యార్థుల ఫ్లాష్మాబ్ ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ఉత్కర్ష–25 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా వైద్యవిద్యార్థులు మహిళల ఆరోగ్యంపై హెల్త్ రన్ నిర్వహించడంతో పాటు ప్లాష్ మాబ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈహెల్త్ రన్ కేఎంసీ ప్రధాన గేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కొనసాగగా.. ఈ రన్ను కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య అనిల్, ఐఎంఏ వైద్యులు, అధ్యాపకులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ చౌరస్తాలో వైద్యవిద్యార్థులు స్కిట్స్, డ్సాన్స్ల ప్రదర్శనతో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం క్విట్, పెయింటింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించగా.. సాయంత్రం వైద్యవిద్యార్థులు నిర్వహించిన షార్ట్ ఫిలింస్ అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్ఐ శ్రీనివాస్, ఐఎంఏ ప్రతినిధులు కూరపాటి రమేశ్, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.మహిళా ఆరోగ్యంపై ఫ్లాష్మాబ్ -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
● ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విద్యారణ్యపురి: సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో టీఎస్యూటీఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులంతా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉపాధ్యాయులు టెట్ గురించి ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు ముందే ఎన్సీటీఈ నిబంధనలు 2010 ఆగస్టు 23 కంటే ముందే నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2023 జూలై నుంచి పీఆర్సీని అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బెనిఫిట్స్ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్, కేజీబీవీల టీచర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు, బి.వెంకటరెడ్డి లక్ష్మారెడ్డి, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.కుమార్, సి.సుజన్ప్రసాద్రావు, చంచాల లింగారావు వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. -
కాకతీయుల శిల్పకళ అద్భుతం
హన్మకొండ: కాకతీయుల శిల్పకళా నైపుణ్యం అద్భుతమని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్వర్మ అన్నారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన హేమంత్వర్మ, అనిత దంపతులు శనివారం హనుమకొండకు చేరుకున్నారు. హోటల్ హరిత కాకతీయలో మధ్యాహ్న భోజనం అనంతరం రామప్పకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నారు. హేమంత్ వర్మను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఆదివారం వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం ఖిలా వరంగల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా హేమంత్వర్మ మాట్లాడుతూ అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనం వేయిస్తంభాల గుడి అని కొనియాడారు. ఎంతో ఘన చరిత్ర గల వేయిస్తంభాల గుడిని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ మూడు కోటల ప్రాకారాలు, వాటి చరిత్రను గైడ్ వివరించారు. వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్రెడ్డి, డీఈలు జి.సాంబరెడ్డి, శెంకేశి మల్లికార్జున్, ఏడీఈ పి.మల్లికార్జున్, ఉద్యోగులు పాల్గొన్నారు.త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్వర్మ -
దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో వర్ధన్నపేట, దుగ్గొండి మండలాలకు సంబంధించిన భూ భారతి, పీఓబీ రికార్డులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పరిష్కరించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పారదర్శకత కీలకమన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు రాజేశ్వర్, విజయ్సాగర్, కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. -
నేడు మద్యం షాపులకు లాటరీ
ఉర్సు గుట్ట నానిగార్డెన్లో ఏర్పాట్లు పూర్తి ఖిలా వరంగల్: జిల్లాలోని 57 మ ద్యంషాపులకు నేడు (సోమవా రం) ఉర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్లో లాటరీ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎకై ్సజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ డి. అరుణ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎకై ్సజ్ శాఖ పరిధిలోని ఏ–1 మద్యం షాపులకు 2025–2027 కాల పరిమితికి దరఖాస్తు ప్రక్రియ గడువు ఈనెల 23న ముగిసిన విషయం విధితమే. జిల్లాలోని 57 మద్యం షాపులకు 1,958 దరఖాస్తులకు రూ.60కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. లాట రీ ప్రక్రియ కలెక్టర్ సత్యశారద సమక్షంలో ఉద యం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలి పారు. ఉదయం 9.30 గంటలలోపు దరఖాస్తుదారుడు లేదా అతను సూచించిన ప్రతినిధి హాజరు కావాలన్నారు. రశీదు, ఎంట్రీపాస్ ఒరి జినల్ వెంట తీసుకుని రావాలని తెలిపారు. నేటి ప్రజావాణి రద్దున్యూశాయంపేట: కలెక్టరేట్లో నేడు (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిపాలన పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావొద్దన్నారు. క్షుద్రపూజల కలకలంవర్ధన్నపేట: ఆధునిక, సాంకేతిక యుగంలో సైతం ప్రజలు మూఢనమ్మకాలతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వర్ధన్నపేట పట్టణ పరిధిలోని డీసీతండా శివారు ఎస్సారెస్పీ కాల్వ సమీపంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మేకను బలిచ్చి మద్యం, కోడిగుడ్డు, పసుపు కుంకుమ, జీడి గింజలు, నిమ్మకాయలు తదితర వాటితో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లను ఆదివారం తెల్ల వారుజామున గిరిజనులు గుర్తించారు. క్షుద్రపూజలను అధికారులు అడ్డుకుని ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. తండాలు, గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచడానికి జాగృతి కళా బృందాలచే అవగాహన కల్పించాలని కోరుతున్నారు. వనదేవతలకు మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో వచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. భక్తుల రద్దీతో మేడారం సందడిగా మారింది. హేమాచలక్షేత్రంలో కోలాహలం మంగపేట: మండలపరిధిలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో కోలాహలంగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరుతో పాటు తదితర ప్రాంతాల నుంచి స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రా వడంతో హేమాచల క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. అనంతరం లక్నవరం, బొగత, మేడారాన్ని సందర్శించి వనదేవతలను దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలను జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. -
ఆరబెట్టలేక.. అమ్ముకోలేక !
వరంగల్: పండించిన పత్తిని మద్దతు ధరకు రైతులు అమ్ముకునే పరిస్థితులు కానరావడం లేదు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈదుస్థితి ఏర్పడింది. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 ఇస్తామని సీసీఐ వెల్లడించింది. ప్రతీ అదనపు శాతానికి రూ.81 కోత ఉంటుందని ఇప్పటికే పేర్కొంది. అది కూడా 12 శాతం వరకే. అంతకుమించితే కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరబెడదామంటే అనువైన పరిస్థితులు లేవు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో మార్కెట్కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. మద్దతు ధర కంటే సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తక్కువగా అమ్మడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. స్లాట్ బుకింగ్.. పత్తి అమ్మేందుకు ఈ సీజన్ నుంచి సీసీఐ కపాస్ కిసాన్ యాప్ను అమలులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రైతులు తమ పత్తిని సీసీఐకి అమ్మాలంటే కచ్చితంగా మార్కెట్ యార్డుకు రాకముందే యాప్ ద్వారా జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అందులో తేదీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే యార్డుకు రావాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొదట పత్తి కొనుగోళ్లు వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏ, బీ కేంద్రాల్లోనే ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు.. సీసీఐ నిర్దేశించిన దానికంటే పత్తిలో తేమ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 60 సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు మార్కెటింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో 28, హనుమకొండలో 3, జనగామ 15, మహబూబాబాద్ 6, భూపాలపల్లి 5, ములుగులో 3 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా సోమవారం లాంఛనంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాలతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ తెలిపారు. పత్తిలో తేమ శాతం కారణంగా మిగిలిన కేంద్రాలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పత్తిలో తేమ 8 శాతం ఉంటే మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తారు. 9 శాతం ఉంటే రూ.8,028, 10 శాతం ఉంటే రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,,866, 12 శాతం ఉంటే 7785.60 ధర చెల్లిస్తారు. పాత పద్ధతితోనే రైతుకు మేలు గతంలో సీసీఐ కొనుగోలు చేసిన పద్ధతితోనే రైతులకు ఇబ్బందులు ఉండవు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత కేంద్రానికి తీసుకువస్తే తేమ ఎక్కువ ఉందని అంటే రైతు సరుకు వాపస్ తీసుకుపోవాల్సి వస్తోంది. దీని వల్ల రవాణా చార్జీలు అదనంగా భరించాలి. రైతు ఇష్టం ఉన్న కేంద్రంలో అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలో పలుచోట్ల ఈపద్ధతిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పంజాబ్లో గొడవలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. రైతు పట్టా పాస్బుక్, బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకునే కొనుగోలు చేస్తే బాగుటుంది. – బొమ్మినేని రవీందర్రెడ్డి, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అకాల వర్షాలతో పత్తిలో అధిక తేమ 12 శాతం మించితే కొనుగోలు చేయమంటున్న సీసీఐ నేడు ఏనుమాముల మార్కెట్లో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
బోధకులు కావలెను!
అనుమతులు ఇచ్చారు.. నియామకాలు మరిచారు..నల్లబెల్లి: ప్రభుత్వం విద్యాశాఖలో పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచాలనే లక్ష్యంతో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) తరగతుల నిర్వాహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. జిల్లాలో మొదటి విడతలో 32 పాఠశాలను ఎంపిక చేసింది. అయితే ఆయా పాఠశాలల్లో బోధకులు, ఆయాలను నియమించకపోవడంతో చిన్నారులకు సరైన సేవలు అందడంలేవు. జిల్లాలో 344 పాఠశాలలు.. జిల్లాలో 344 ప్రాథమిక పాఠశాలలు ఉండగా మొదటి విడతలో 32 ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించింది. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ప్రీప్రైమరీ చిన్నారులకు ఆటపాటలతో విద్యాబుద్దులు చెప్పేదుకు 32 పాఠశాలలో ప్రతీ పాఠశాలకు ఒక బోధకుడు, ఆయా నియామకం చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా ప్రస్తుత ఉపాధ్యాయులే అదనపు బాధ్యతలతో తరగతుల నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకు ఇప్పటికే తరగతుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ వంటి బాధ్యతలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణ వారి భుజాలపై పడడంతో బోధనలో నాణ్యత తగ్గే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికై న జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించి ఆయా పాఠశాలల్లో బోధకులు, ఆయాల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో 32 ప్రీప్రైమరీ పాఠశాలల్లో సిబ్బంది కొరత రెగ్యులర్ ఉపాధ్యాయులతోనే బోధన ఇబ్బందుల్లో చిన్నారులు నియామకాలు త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి -
మోడల్స్కూల్స్ను విద్యాశాఖలో విలీనం చేయాలి
కాళోజీ సెంటర్: తెలంగాణలోని మోడల్ స్కూల్స్ ను రాష్ట్ర విద్యాశాఖలో విలీనం చేయాలని మోడల్ స్కూల్స్ టీచర్స్ ఐక్యవేదిక నాయకులు కోరారు. ఆదివారం మోడల్ స్కూల్స్ సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశం టీఎస్యూటీఎఫ్ సమావేశ మందిరంలో ఎస్.విట్ట ల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు బిరిగల కొండయ్య, అరవింద్ ఘోష్, బత్తిని సత్యనారాయణ గౌడ్, ఆరీఫ్లు మాట్లాడుతూ 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐక్యవేదికను రాష్ట్ర వేదికను బలోపేతం చేయడానికి కృషిచేస్తామన్నారు. ఈ సమావేశంలో జీ.రాజశ్రీ, శశికుమారి, సంధ్య, హైమావతి, రుద్రమదేవి, నీలాంద్రి, డి.బాలకిషన్, కిరణ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న కొండయ్య -
అడవులను సంరక్షించుకోవాలి
● డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ ఖానాపురం: అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ అన్నారు. ఈమేరకు మండలంలోని బుధరావుపేట శివారులోని అటవీ ప్రాంతాన్ని, చిలుకమ్మనగర్ శివారు అటవీ ప్రాంతాలను, పాకాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను నరికివేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎలాంటి చెట్టును ముట్టుకున్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అడవులను నరికివేసి పోడు సాగుకు పాల్పడిన వారిని జైలుకుపంపుతామన్నారు. పాకాలలో అభివృద్ధి పనులు చేస్తూ పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాకాలలో స ఫారీ ఏర్పాటు చేస్తున్నామని, పర్యాటకులు అటవీ ప్రాంతాలను వీక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో పుప్పాల రవికిరణ్, డీఆర్వో రీన, తదితరులు పాల్గొన్నారు. -
అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడి
సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో భోజనాలు.. కాజీపేటలో పిల్లలకు పండ్లు అందజేస్తున్న దాతలు (ఫైల్)కాజీపేట: వారంతా మనలాగే మనుషులు. చుట్టూ అందరూ ఉన్నా..నా అనేవారు లేని వాళ్లు.. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే రెండు మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మవిశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనుషులు.. ఆనందాన్ని పంచే ఆటపాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరు ఉన్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం వారికి అందించగలం.. ‘మేం అనాథలం కాము’ అని వారిలో ఆనందాన్ని నింపగలం.. ఇందుకు కావాల్సిందల్లా కాసింత సమయం.. ఓపిక మాత్రమే. నగరంలోని చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవలి కాలంలో సేవాపథంలో ముందుకు సాగుతున్నారు. ఆదివారాన్ని ఆనందంగా గడుపుతూనే.. దాన్ని మరికొంత మందికి పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనాథలు, మానసిక దివ్యాంగులు, వృద్ధుల మధ్య పుట్టిన రోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. పండ్లు, స్నాక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బాగున్నావా అవ్వ., ఏం చేస్తున్నావు తమ్ముడూ.. ఆరోగ్యం ఎలా ఉంది అన్న అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఒంటరి మనుషుల మోముల్లో చిరునవ్వు నింపుతున్న కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో ఆటాపాట.. పండ్లు.. కడుపు నిండా భోజనం ఇటీవల పెరిగిన సేవా దృక్పథం -
వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్!
పరిపాలనాధికారులపై వేటుకు రంగం సిద్ధం ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో కొన్ని రోజులుగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం ఎలాంటి వైద్య సిబ్బంది సహాయం లేకుండా రెండు, మూడు రోజుల పసికందులను ఆక్సిజన్ సిలిండర్తో ఎక్స్రేకు తీసుకెళ్లిన ఘటనతో పాటు, కొన్ని రోజులుగా వైద్యసేవల నిర్లక్ష్యంపై మంత్రి స్వయంగా ఆరా తీసినట్లు చర్చించుకుంటున్నారు. ఎంజీఎం ఆస్పత్రిని తక్షణమే గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీని సైతం అదేశించినట్లు వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక నుంచి ప్రతీవారం ఎంజీఎం ఆస్పత్రిపై సమీక్ష నిర్వహించి పేదలకు వైద్యసేవలందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఎంఈ ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తొంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రిలో ఏళ్ల తరబడి తిష్టవేసిన మినిస్ట్టీరియల్ సిబ్బందితో పాటు వైద్యసిబ్బంది వివరాల సేకరణకు రంగం సిద్ధమైంది. ప్రొఫెసర్ల గైర్హాజరే అసలు కారణం ఎంజీఎం ఆస్పత్రిలోని ప్రతీ విభాగాన్ని పర్యవేక్షించే వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్కు వస్తూ చుట్టపుచూపుగా సేవలందించడమే ఆస్పత్రిలో సేవల తిరోగమనానికి కారణమని రోగులు పేర్కొంటున్నారు. ప్రొఫెసర్లు విధుల్లోకి రాకపోవడంతో, అసోసియేట్, అసిస్టెంట్లు సైతం విధులపై బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వల్ల పారామెడికల్ సిబ్బందిలో సైతం నిర్లక్ష్యం పెరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పేద రోగికి అందాల్సిన వైద్యం కోసం ఎంజీఎంలో తీవ్ర పాట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది. కలెక్టర్ ఎంజీఎం ఆస్పత్రిపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఎంజీఎంలో పేద ప్రజలకు సేవలు అందని దుస్థితి నెలకొంది. -
నవంబర్ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్ ఇంటర్నల్స్
హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు సెకండియర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు వచ్చే నెల 6నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 99894 17299, 9989 139136 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కేయూ క్యాంపస్: డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో శనివారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై సమీక్షించి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆయనమ మాట్లాడుతూ ప్రతీ పోలీస్టేషన్ పరిఽ ధిలోని రౌడీషీటర్లపట్ల కఠినంగా వ్యవహరిస్తూ నే వారి కదలికలపై దృష్టి పెట్టాలని కోరారు. చోరీలకు పాల్పడిన నిందితులతోపాటు గంజాయి విక్రయదారులపై హిస్టరీ షీట్లను తెరవాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల్లో బాధితులకు సొమ్మును తిరిగి ఇప్పించడంతోపాటు నేరగాళ్లను పట్టుకునేందుకు కృషి చేయాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ అధికారిగా ఎస్సై స్థాయి అధికారి తప్పకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతీ శుక్రవారం పోలీస్టేషన్లలో శ్రమదానం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, అంకిత్కుమార్, ఏఎస్పీ చేతన్నితిన్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. మామునూరు: బాలికలపై జరిగే దాడులు, చట్టపరమైన రక్షణ చర్యలపై మరింత అవగాహన పెంచుకోవాలని వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ అన్నారు. ఈమేరకు శనివారం మామునూరు నవోదయ విద్యాలయంలో వరంగల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఎస్సై కృష్ణవేణి ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్జి కందుకూరి పూజ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, పీసీ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్లో ఉన్న జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయం (జీఎంయూ) ప్రతినిధి బృందం కాకతీయ యూనివర్సిటీని సందర్శించినట్లు శనివారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రొఫెసర్లు బి.వెంకట్రామ్రెడ్డి, పి.మల్లారెడ్డి, ఎం.సదానందం, డాక్టర్ బి.రమ, డాక్టర్ డి.రమేశ్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ రమణ, డాక్టర్ భిక్షాలు, స్టూడెంట్స్ అఫేర్స్ డీన్ మామిడాల ఇస్తారితో జీఎంయూ బృంద సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈబృందంలో గ్లోబల్ ఎంగేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కమ్మీ సంఘీర, కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ చైర్మన్ డాక్టర్ రాబర్ట్ పిటిట్ ఉన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి న్యూశాయంపేట: దివ్యాంగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని వరంగల్ జిల్లా సంక్షేమాధికారి బి.రాజమణి అన్నారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు కలెక్టరేట్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి 10 ఫిర్యాదులు స్వీకరించారు. జెడ్పీ సీఈఓ 1, సివిల్ సప్లయీస్ 3, ఈడీఎం 1, మెప్మా పీడీ 1, డీఎంహెచ్ఓ 1, డీఆర్డీఏకు 3 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను అధికారులకు ఎండార్స్ చేశారు. అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కాసింత సమయం కేటాయిద్దాం..
సమాజంలో అందరూ మనలాగే ఉండరు.. సంతోషంగా బతకాలని ఉన్నా.. అందుకు అవకాశం లేని వారూ ఉన్నారు. మనతోనే సమాజంలో జీవనం సాగిస్తున్నా.. అందరిలా ఆనందం పొందడం లేదు వాళ్లు.. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అన్న వాళ్లు లేని అనాథలు.. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులు కొందరైతే.. కన్నవారి నిరాదరణకు గురైన అమ్మానాన్నలు మరికొందరు. అసలు సమాజాన్ని చూడలేని అంధులు కొందరైతే.. సాటి మనిషి తోడుంటే తప్ప కదల్లేని దివ్యాంగులు ఇంకొందరు. ఇలా వీరంతా మనలాగే మనుషులు. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మ విశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనసులు.. ఆనందాన్ని పంచే మాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరున్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం ఇవ్వగలిగేవే.. మనం చేసే ఖర్చు.. వెచ్చించే సమయం కొంతైనా వారికి ఆనందాన్నివ్వవచ్చు. కాసింత సమయం కేటాయిద్దామనే ఆలోచనలతో ఎంతో మంది ఆశ్రమాలను సందర్శిస్తూ ఒకపూట ఆత్మీయంగా గడుపుతున్నారు. -
‘లక్కు’ దక్కేదెవరికో..
సాక్షిప్రతినిధి, వరంగల్ : 2025–27 ఎకై ్స జ్ టెండర్లలో అదృష్టజాతకులెవరో సోమవారం తేలనుంది. వచ్చే రెండేళ్ల కోసం మద్యం దుకాణాలను నిర్వహించే అవకాశం ఉమ్మడి వరంగల్లో ఎవరికి దక్కనుందో వెల్లడి కానుంది. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున.. 10,493 మంది రూ.314.79 కోట్లు ఫీజు రూపేణా చెల్లించారు. వాస్తవానికి దరఖాస్తుల గడువు ఈ నెల 18 తేదీనే ముగిసినప్పటికీ.. మరో ఐదు రోజులు పొడిగించి 23కు మార్చారు. ఈ నెల 18వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని 294 వైన్స్(ఏ–)షాపులకు 9,754 దరఖాస్తులు రాగా.. 23 వరకు 739 పెరిగి మొత్తం 10,493లకు చేరింది. ఇందులో గౌడ కులస్తులకు కేటాయించిన దుకాణాలకు 2,050 దరఖాస్తులు రాగా, ఎస్సీ రిజర్వుడ్పై 1,023, ఎస్టీలపై 651, ఓపెన్ టెండర్లపై 6,769 వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎకై ్సజ్శాఖ అధికారులు ప్రకటించారు. 10,439 దరఖాస్తుల్లో 294 మందికే వైన్షాపులు దక్కనుండగా, ఆ ‘లక్కీ’ వరించే 294 మంది ఎవరో? అన్న సస్పెన్స్కు రేపు తెరపడనుంది. గతంతో పోలిస్తే తగ్గిన దరఖాస్తులు 2023–25 టెండర్లతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. ఫలితంగా దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినా ఆదాయం ఊహించిన మేర రాలేదు. గత టెండర్ల సందర్భంగా ఉమ్మడి వరంగల్లో 294 షాపులకు 16,039 దరఖాస్తులు రాగా, రూ.320.78 కోట్లు ఆదాయం ప్ర భుత్వానికి సమకూరింది. ఈసారి అదేస్థాయిలో.. అంతకంటే ఎక్కువ కూడా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. దీంతో అదనంగా పెరిగిన అప్లికేషన్ ఫీజు రూ.లక్ష కలిపి దరఖాస్తుల ద్వారా రూ.481 కోట్ల నుంచి రూ.520 కోట్ల వరకు రావొచ్చనుకున్నారు. కానీ, ఈసారి ఆశించిన మేర స్పందన లేక గడువు పొడిగించినప్పటికీ గతంతో పోలిస్తే 5,546 తక్కువ వచ్చాయి. మొత్తం 10,493 దరఖాస్తులు రాగా.. వాటిపై రూ.314.79 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కాగా ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ గత టెండర్లలో మద్యం వ్యాపారం తడాఖా చూపించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉద్యోగులు పలువురు తప్పుకున్నారు. దీంతో టెండర్ షెడ్యూళ్ల సంఖ్య తగ్గగా.. టెండర్లు వేసిన వారిలో మద్యం దుకాణాలు దక్కించుకునే అదృష్ట జాతకులెవరో? ఎవరికి ఆ దుకాణాలు దక్కుతాయో?నన్న చర్చ జోరుగా సాగుతోంది. లక్కీ డ్రాకు విస్తృత ఏర్పాట్లు.. మద్యం షాపులు ఖరారు చేసేందుకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాకు సంబంధించి 67 షాపులకు దాఖలైన 3,175 దరఖాస్తుల నుంచి లక్కీ డ్రా తీసేందుకు అంబేడ్కర్ భవన్ వేదికగా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలో 57 వైన్షాపులకు దాఖలైన 1,958 దరఖాస్తుల నుంచి ఎంపిక చేసేందుకు వరంగల్లోని నాని గార్డెన్స్లో డ్రా తీయనున్నారు. రేపు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ఉదయం 11 గంటల నుంచి డ్రా... కలెక్టర్ల సమక్షంలో తీసేందుకు ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 10,493 దరఖాస్తులు.. ఆదాయం రూ.314.79 కోట్లు జిల్లా వైన్స్లు 18 వరకు వచ్చిన 23 వరకు వచ్చిన (ఏ–4) దరఖాస్తులు దరఖాస్తులుహనుమకొండ 67 3,012 3,175 వరంగల్ 57 1,826 1,958 జనగామ 50 1,587 1,697 మహబూబాబాద్ 61 1,672 1,800 భూపాలపల్లి/ములుగు 59 1,657 1,863 294 9,754 10,493 -
కంచెలు ఏర్పాటు చేయండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవకుండా కంచెలు ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సూచించారు. శనివారం నగర పరిధి గొర్రెకుంట కీర్తినగర్ కోటిలింగాల ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్తో పాటు టౌన్ప్లానింగ్కు చెందిన అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ ప్రభుత్వానికి చెందిన ఓపెన్ స్పేస్లను గుర్తించాలని ఆక్రమణలకు గురవకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఓపెన్ స్పేస్లో బయో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ముఖ్య ఆరోగ్యాధికారికి సూచించారు. గొర్రెకుంట ప్రాంతంలో పర్యటించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కీర్తినగర్లో మరో 2 ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వరంగల్ మ్యూజికల్ గార్డెన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ సంతోశ్బాబు, ఏసీపీ శ్రీనివాస్రెడ్డి డీఈ సతీశ్, టీపీఎస్ శ్రీకాంత్, టీపీబీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి
న్యూశాయంపేట: ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్కుమార్, అధికారులతో కలిసి కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో ఎస్ఐఆర్ పురోగతిపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ మూడు నియోజకవర్గాల్లోని ఎస్ఐఆర్ మ్యాపింగ్లో భాగంగా కేటగిరీ–ఏను బీఎల్ఓ యాప్ ద్వారా ధ్రువీకరిస్తామని, కేటగిరీ సీ, డీని లింక్ ప్రక్రియ ద్వారా పూర్తిచేస్తామన్నారు. ఈఆర్ఓ కార్యాలయంలో ఇద్దరు బూత్స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి మ్యాపింగ్ చేస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎలక్షన్ డీటీ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. రేపు మద్యం షాపులకు లాటరీ ఖిలా వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలోని ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్న ఏ4 మద్యం షాపుల కేటాయింపునకు సోమవారం ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్లో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ డి.అరుణ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ సత్యశారద సమక్షంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే లాటరీ కార్యక్రమానికి దరఖాస్తుదారులు లేదా ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్లు హాజరుకావాలని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల్లోపు ఒరిజినల్ రిసిప్ట్ కం ఎంట్రీ పాస్ తీసుకొని రావాలని ఆయన సూచించారు. కాగా, 2025–2027 కాలపరిమితికి దరఖాస్తుల గడువు ఈనెల 23న ముగిసింది. జిల్లాలోని 57 మద్యం షాపులకు 1,958 దరఖాస్తులు, రూ.60 కోట్లు ఆదాయం వచ్చింది. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి న్యూశాయంపేట: దివ్యాంగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా సంక్షేమాధికారి బి.రాజమణి అన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశపు హాల్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం ప్రతేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి 10 ఫిర్యాదులు స్వీకరించారు. జెడ్పీ సీఈఓ 1, సివిల్ సప్లయీస్ 3, ఈడీఎం 1, మెప్మా పీడీ 1, డీఎంహెచ్ఓ 1, డీఆర్డీఏకు 3 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. అన్ని శాఖల సంబంధిత అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు, వయోవృద్ధుల జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు కేజీబీవీ విద్యార్థిని నల్లబెల్లి: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అజ్మీరా మానస ఎంపికై నట్లు ఎస్ఓ సునీత శుక్రవారం తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానసను ఎస్ఓ సునీత, పీఈటీ సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు అభినందించారు. నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు హర్యాణాలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఉప్పరపల్లి విద్యార్థులు వర్ధన్నపేట: రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం వేణు తెలిపారు. ఈ నెల 23న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ఐ అండర్–14, ఎస్జీఎఫ్ఐ–17 విభాగాల్లో హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహించారు. అండర్–17 విభాగంలో శాగంటి రాంచరణ్ (9వ తరగతి), దాడి సాయిరాం (9వ తరగతి), సీనపల్లి సాయిచరణ్ (పదో తరగతి), అండర్–14 విభాగంలో సీనపల్లి సాకేత్ (8వ తరగతి), జిల్లా వెన్నెల (7వ తరగతి) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈమేరకు శనివారం పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు అభినందించారు. కార్యక్రమంలో పీఈటీ వీరస్వామి, ఉపాధ్యాయులు ఉషారాణి, రాజు, లింగమూర్తి, విజయ్, రూపమణి, రజిత, మాధవరావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గుడిసెవాసులకు న్యాయం చేస్తాం
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● వర్ధన్నపేటలో తహసీల్దార్ కార్యాలయం, పౌరసరఫరాల శాఖ గిడ్డంగి తనిఖీవర్ధన్నపేట: గుడిసెవాసులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం, పౌరసరఫరాల శాఖ గిడ్డంగిని శనివారం ఆమె సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి నిర్వహణ, భూముల వివరాలు, రైతుల సమస్యలపై ఆరా తీశారు. అక్కడే వేచి చూస్తున్న ల్యాబర్తి గ్రామానికి చెందిన బుడిగ జంగాలు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ శివారులో సర్వే నంబర్ 555లో తమ తాతాముత్తాతల కాలం నాటి నుంచి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఆ భూమికి పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టర్ వెంటనే స్పందించి ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి నేరుగా పట్టణంలోని ఫిరంగిగడ్డ ప్రాంతంలో ఉన్న పౌరసరఫరాల గిడ్డంగి వద్దకు తనిఖీ చేయడానికి వెళ్లారు. గిడ్డంగికి తాళం వేసి ఉండడంతో ఒకింత ఆశ్చర్యానికి గురై వెంటనే సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గిడ్డంగి ఇన్చార్జ్తోపాటు సిబ్బందిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ విజయసాగర్, సిబ్బంది ఉన్నారు. గిడ్డంగిని సందర్శించిన డీఎం కలెక్టర్ ఆదేశాలతో డీఎం సంధ్యారాణి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ శ్రుతివర్షిణి గిడ్డంగిని సందర్శించారు. రికార్డులు, స్టాక్ రిజిష్టర్, బియ్యం నిల్వలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని పేర్కొన్నారు. -
పక్వానికి వచ్చాకే కోతలు చేపట్టాలి
● జిల్లా వ్యవసాయాధికారి అనురాధ రాయపర్తి: వరి పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోతలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి కూనమళ్ల అనురాధ సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో హార్వెస్టర్ ఓనర్లు, డ్రైవర్లు, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు, రైతులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి కోసే సమయంలో హార్వెస్టర్ మిషన్లో ఆర్పీఎం స్పీడ్ 18 లేదా 20 పెట్టాలని, బ్టోయర్ ఆన్లో ఉండాలని పేర్కొన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు సీరియల్ ప్రకారం రైతుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. తేమను రోజు పరిశీలించాలని, ప్యాడీ క్లీనర్ను శ్రుభం చేసి ఎఫ్ఎక్యూ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. పత్తి అమ్ముకునేందుకు మూడు రోజుల ముందు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, ఎంఏఓ గుమ్మడి వీరభద్రం, సొసైటీ ఛైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి, సీసీ యాదగిరి, పీఏసీఎస్ సీఈఓ సోమిరెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
కాసింత సమయం కేటాయిద్దాం..
సమాజంలో అందరూ మనలాగే ఉండరు.. సంతోషంగా బతకాలని ఉన్నా.. అందుకు అవకాశం లేని వారూ ఉన్నారు. మనతోనే సమాజంలో జీవనం సాగిస్తున్నా.. అందరిలా ఆనందం పొందడం లేదు వాళ్లు.. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అన్న వాళ్లు లేని అనాథలు.. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులు కొందరైతే.. కన్నవారి నిరాదరణకు గురైన అమ్మానాన్నలు మరికొందరు. అసలు సమాజాన్ని చూడలేని అంధులు కొందరైతే.. సాటి మనిషి తోడుంటే తప్ప కదల్లేని దివ్యాంగులు ఇంకొందరు. ఇలా వీరంతా మనలాగే మనుషులు. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మ విశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనసులు.. ఆనందాన్ని పంచే మాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరున్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం ఇవ్వగలిగేవే.. మనం చేసే ఖర్చు.. వెచ్చించే సమయం కొంతైనా వారికి ఆనందాన్నివ్వవచ్చు. కాసింత సమయం కేటాయిద్దామనే ఆలోచనలతో ఎంతో మంది ఆశ్రమాలను సందర్శిస్తూ ఒకపూట ఆత్మీయంగా గడుపుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
● ఊకల్లో సుబ్రహ్మణ్యస్వామికి పూజలుగీసుకొండ: నాగుల చవితిని పురస్కరించుకొని ఊకల్హవేలిలోని ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని ప్రత్యేకంగా బంతి పూలతో అలంకరించారు. మహిళలు పుట్టలో పాలు పోసి సంతాన ప్రాప్తి కలగాలని, సకల దోషాలు తొలగిపోవాలని మొక్కుకున్నారు. సర్ప శాపానికి గురికాకుండా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. 40 రోజులపాటు సుబ్రహ్మణ్య దీక్షలు చేపట్టిన సుమారు వంద మంది మంగళవాయిద్యాలతో తరలివచ్చి స్వామివారికి దివ్యాభిషేకం చేశారు. అనంతరం దీక్షలు విరమించారు. ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకుడు శ్రీహర్ష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు హారతి ఇచ్చారు. గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తన జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి మొక్కుకున్నారు. ఎంపీఓ పాక శ్రీనివాస్, ఏపీడీ శ్రీవాణి, జీపీఓ కల్యాణిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్, ప్రశాంత్, స్వప్న, సునీత, ప్రవీణ్, ఈసీ శ్రీలత పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వర్రావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, రాజు, కమిటీ సభ్యులు భక్తులకు ఏర్పాట్లు చేశారు. -
డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికో?
సాక్షి, వరంగల్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఉత్కంఠ రేపుతోంది. డీసీసీ పీఠం కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీలో తమ సేవల గురించి ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులకు సమర్పించిన దరఖాస్తుల్లో వివరించారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధన ఆధారంగా ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోత్ పట్నాయక్ వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలు, నాయకులు నుంచి అభిప్రాయాలు సేకరించారు. జిల్లా నుంచే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి ఉన్నారు. ఈ ముఖ్య నేతల మధ్య సయోధ్య అంత పెద్దగా లేకపోవడంతో డీసీసీ పీఠం ఎవరికి వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. కార్యకర్తల అభిప్రాయం మేరకే అధ్యక్షుల ఎంపిక అని ఏఐసీసీ పరిశీలకులు చెబుతున్నారు. తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు ఎవరికీ వారు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో ఉండడం, డీసీసీ అధ్యక్ష ఎంపికలపై ఏఐసీసీతో సంప్రదింపులు జరిపితే క్లారిటీ వస్తుందని ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రస్తుతమున్న డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు మరోసారి అవకాశం ఇవ్వాలని జిల్లాలోని కొందరు ముఖ్యులు ఏఐసీసీ పరిశీలకులకు లిఖితపూర్వకంగా లేఖలు కూడా ఇచ్చారు. ఈమెతోపాటు మీసాల ప్రకాశ్, నవీన్రాజ్, అయూబ్ ఖాన్, పోశాల పద్మ, దేవేందర్రావు, పిన్నింటి అనిల్ రావు, భాషపాక సదానందంతో పాటు మరికొందరు కూడా డీసీసీ రేసులో ఉన్నారు. ఇలా 40 మందికిపైగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మంత్రి, ఎమ్మెల్యే అనుచరులు ఉండడంతో తమవారికే వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు, అబ్జర్వర్లు ఆరుగురి పేర్లను ఫైనల్ చేసి పీసీసీకి, ఢిల్లీ అధిష్టానానికి పంపారు. వర్ధన్నపేట నుంచి ఎర్రబెల్లి స్వర్ణ, బొంపల్లి దేవేందర్రావు, అనిల్రావు పేర్లు వినిపిస్తున్నాయి. 32 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్రావు పేరును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా ప్రతిపాదించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే, కొండా దంపతులు ప్రతిపాదించిన నవీన్రాజ్కు ఐదేళ్ల పాటు కాంగ్రెస్లో ఉండాలన్న నిబంధన అడ్డుగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజనాల శ్రీహరి, పోశాల పద్మకు సైతం ఇదే అడ్డు కానుంది. ఇప్పటి వరకు పార్టీని వీడకుండా ఉన్న వారిలో ఎర్రబెల్లి స్వర్ణ, దేవేందర్రావు, మీసాల ప్రకాశ్తో పాటు మైనార్టీ నాయకుడు అయూబ్ఖాన్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. సాధ్యమైనంత తొందరగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరికీ వచ్చినా అందరిని సమన్వయం చేస్తూ ముందుకు సాగడమనేది కత్తిమీద సామేనని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పీఠం దక్కించుకునేందుకు ఆశావహుల ప్రయత్నాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏఐసీసీ పరిశీలకులు కార్యకర్తలు, ముఖ్య నాయకుల అభిప్రాయాల సేకరణ ఇప్పటికే అధిష్టానం వద్దకు చేరిన తుది జాబితా -
విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి
● జిల్లా అదనపు రెండో ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ బి.వెంకటచంద్ర ప్రసన్నవర్ధన్నపేట: విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా అదనపు రెండో ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ బి.వెంకటచంద్ర ప్రసన్న సూచించారు. వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని పేర్కొన్నారు. అనంతరం కట్య్రాల గ్రామ రైతువేదికలో న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పంటనష్టం, భూమి పట్టాదారు, ఇనామ్ భూములు, కౌలు రైతు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు సురేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ శ్రుతివర్షిణి, తహసీల్దార్ విజయసాగర్, ఏఓ విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికంతో మానసిక ప్రశాంతత
● టీటీడీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కృష్ణమూర్తి దుగ్గొండి: ఆధ్మాత్మిక వాతావరణంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని టీటీడీ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ రాంరెడ్డిగారి కృష్ణమూర్తి అన్నారు. నాచినపల్లి శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం రాత్రి ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. మొదట భక్తులతో భక్తి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామాల్లోని చిన్న చిన్న ఆలయాల్లో నిరంతర కై ంకై ర్యాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధూపదీప నైవేద్యాలు అందని ఆలయాలకు టీటీడీ నుంచి రూ.1001 విరాళంగా అందిస్తామని, ప్రజలు కొంత అందించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వికాస తరంగిణి ఉమ్మడి జిల్లా కార్యదర్శి దయాకర్రెడ్డి, ప్రజ్ఞ కోఆర్డినేటర్ తనూజ, వసంత, వనజ, ఆలయ చైర్మన్ చెన్నూరి కిరణ్రెడ్డి, కార్యదర్శి జటబోయిన సురేశ్, భజన మండలి బాధ్యులు బొమ్మినేని శ్రీనివాసరెడ్డి, నంగునూరి సాంబయ్య, కొమ్మెర కుమారస్వామి, ములుక నర్సింహరాములు, ఆర్చకుడు ఝెదుగిరి రమేశ్మూర్తి, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. -
అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడి
సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో భోజనాలు.. కాజీపేటలో పిల్లలకు పండ్లు అందజేస్తున్న దాతలు (ఫైల్)కాజీపేట: వారంతా మనలాగే మనుషులు. చుట్టూ అందరూ ఉన్నా..నా అనేవారు లేని వాళ్లు.. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే రెండు మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మవిశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనుషులు.. ఆనందాన్ని పంచే ఆటపాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరు ఉన్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం వారికి అందించగలం.. ‘మేం అనాథలం కాము’ అని వారిలో ఆనందాన్ని నింపగలం.. ఇందుకు కావాల్సిందల్లా కాసింత సమయం.. ఓపిక మాత్రమే. నగరంలోని చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవలి కాలంలో సేవాపథంలో ముందుకు సాగుతున్నారు. ఆదివారాన్ని ఆనందంగా గడుపుతూనే.. దాన్ని మరికొంత మందికి పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనాథలు, మానసిక దివ్యాంగులు, వృద్ధుల మధ్య పుట్టిన రోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. పండ్లు, స్నాక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బాగున్నావా అవ్వ., ఏం చేస్తున్నావు తమ్ముడూ.. ఆరోగ్యం ఎలా ఉంది అన్న అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఒంటరి మనుషుల మోముల్లో చిరునవ్వు నింపుతున్న కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో ఆటాపాట.. పండ్లు.. కడుపు నిండా భోజనం ఇటీవల పెరిగిన సేవా దృక్పథం -
ఒక్కేసి పువ్వేసి.. చందమామ
● వైభవంగా నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ ఉత్సవాలు ● భక్తిశ్రద్ధలతో నిమజ్జనం ఒక్కేసి పువ్వేసి చందమామ.. అంటూ యువతులు, మహిళలు పాటలతో సందడి చేశారు పోయి రావమ్మ.. గౌరమ్మ అంటూ దీపావళి (నేతకాని) బతుకమ్మను సాగనంపారు. హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించిన దీపావళి(నేతకాని)బతుకమ్మ వేడుకలు గురువారం ముగిశాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, పురుషులు గ్రామ వీధులగుండా కిలోమీటర్ దూరం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆడి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శరత్, మాజీ ఎంపీటీసీ రజిత, స్థానికులు చేరాలు, రాజయ్య, గాంఽధీ పాల్గొన్నారు. – హసన్పర్తి -
‘ఏసీబీ’ దడ.. ‘సైబర్’ వల
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో కొద్ది రోజుల క్రితం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో దాడులు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరస్తులు నర్సంపేట డివిజన్కు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ను ఏసీబీ పేరిట బెదిరించి రూ.3.50 లక్షలు వసూలు చేశారు. ఫిబ్రవరిలో రవాణాశాఖ వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఆ తర్వాత మహబూబాబాద్ కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. దీంతో రవాణాశాఖ అధికారులు కొందరు ఏసీబీ భయంతో వణికిపోతున్నారని పసిగట్టిన సైబర్ నేరస్తులు.. వరంగల్ ఎంవీఐ, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఆర్టీఓ తుమ్మల జయపాల్రెడ్డిని టార్గెట్ చేయగా, ఆయన రూ.10 లక్షలు సమర్పించుకున్నారు. ఈ నెల 21న మిల్స్కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. ...అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అధికారులకు కంటిమీద కునుకు కరువైంది. కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలువురు అవినీతి అక్రమాల ఆరోపణలపై ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ ఇరుక్కున్నారు. ఈక్రమంలో ప్రతీ పనికి బాధితుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కొన్ని శాఖల అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా రంగంలోకి దిగుతున్న సైబర్ నేరస్తులు ఆ అక్రమార్కులకు వలవేసి రూ.లక్షలు కొల్లగొడుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఆ ఐదు శాఖలే టార్గెట్.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా జరిగిన దాడులను పరిశీలిస్తే.. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్, నీటిపారుదల శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో పని చేసిన ఉన్నతాధికారులు కొందరు ఏసీబీ దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, వాస్తవానికి రెవెన్యూ, రవాణా, పోలీస్, రిజిస్ట్రేషన్శాఖల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని అత్యధికంగా కరప్షన్కు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు తగ్గట్టుగానే ఏసీబీకి చిక్కడం గమనార్హం. డిప్యూటీ తహసీల్దార్ మొదలు ఆర్డీఓ వరకు.. ఎంవీఐ మొదలు డీటీసీ వరకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులపై ఏసీబీ దాడులను ఎదుర్కోవడం అవినీతి అక్రమాలకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. దీంతో వారు ఏసీబీ అధికారులను మచ్చిక చేసుకునేందుకు మార్గాలు వెతుక్కునే క్రమంలో సైబర్ నేరస్తుల వలలో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటుండడం చర్చనీయాంశమవుతోంది. అయినా మార్పులేదు.. రవాణాశాఖలో అదే తీరు రవాణాశాఖలో ఇన్చార్జ్ల పాలన ఇంకా కొనసాగుతుంది. ఓ వైపు ప్రక్షాళన జరుగుతున్నా.. మరోవైపు అవినీతి ఊడలు బారుతోంది. కొందరు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓ కోసం పోటీపడి తెచ్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి తెరవెనుక సీనియర్లు చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టును సీనియర్లు ఉంటే వారికే ఇవ్వాల్సి ఉంది. ఆరోపణలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో 1994 బ్యాచ్కు చెందిన సీనియర్లు ఉన్నా.. 2012 బ్యాచ్కు చెందిన వారిని ఆ పోస్టులో నియమించారు. ఇదిలా ఉంటే చాలాచోట్ల తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు లెర్నింగ్ మొదలు.. ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, లైట్, గూడ్స్ వాహనాల లైసెన్సుల జారీ, తదితరాలపై అంతకు ముందున్న రేట్లకు రెట్టింపు వసూలు చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా వరంగల్ ఘటనతో ‘ఏసీబీ అధికారులు ఎవరికీ ఫోన్ చేయరని.. సైబర్ నేరస్తుల వలలో పడొద్దని.. ఏదైనా ఉంటే టోల్ఫ్రీ నంబర్ 1064కి ఫోన్ చేయాలి’ అని తాజాగా ఏసీబీ అధికార వెబ్సైట్లో అలర్ట్ పెట్టింది.ఏసీబీ తెలంగాణ వెబ్సైట్లో అలర్ట్ నోటిఫికేషన్అవినీతి అధికారులకు కంటిమీద కునుకు కరువు తాయిలాలతో మచ్చిక చేసుకునేందుకు అడ్డదారులు ఇదే అదునుగా రంగంలోకి సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో ఫోన్ బెదిరింపులు.. యూపీఐ ద్వారా వసూళ్లు ఒకేరోజు రూ.10 లక్షలు కాజేత తాజా బాధితుడు మహబూబాబాద్ ఆర్టీఓ సైబర్ నేరస్తులు కాజేసిన రూ.10 లక్షల కథరూ.10 లక్షలు సైబర్ నేరస్తులకు సమర్పించుకున్న తుమ్మల జయపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు అసలేం జరిగిందన్న వివరాలు ఇలా ఉన్నాయి.. జయపాల్ రెడ్డి వరంగల్లో ఎంవీఐగా, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఆర్టీఓగా వ్యవహరిస్తున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో ఉంటున్న ఆయనకు ఈ నెల 15న మధ్యాహ్నం 12.30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి 98868 26656 (ఈ నంబర్ ట్రూ కాలర్లో ఏసీబీ అని వస్తుంది) నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఏసీబీ (అవినీతి నిరోధక బ్యూరో) నుంచి డీఎస్పీగా పరిచయం చేసుకుని, అవినీతి కేసు నమోదు చేశామని జయపాల్ రెడ్డికి తెలియజేశాడు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. ఆ తర్వాత కాల్ చేసిన వ్యక్తి ఫిర్యాదుదారుడికి డబ్బులు పంపాలని చెప్పి మొదట రూ.75 వేలు 77606 40948 మొబైల్ నంబర్కు బదిలీ చేయమని సూచించాడు. ఆ తర్వాత సైబర్ నేరగాడు చెప్పినట్లు జయపాల్ రెడ్డి రూ.75 వేలతో పాటు మరో రూ.25 వేలు పాయల్ మేఘనకు పంపాడు. అనంతరం మరో రూ.లక్ష పంకజ్ కుమార్కు, రూ. 2 లక్షలు దివ్య పేరిట ఉన్న మొబైల్ నంబర్ (97097 65940)కు పంపాడు. మరో రూ.5 లక్షలు బెంగళూరులోని సదాశివనగర్ బ్రాంచ్లో ఓ కాంట్రాక్టర్ పేరుతో ఉన్న ఖాతా నంబర్ 477825001010847701 (ఐఎఫ్ఎస్సీ కోడ్: కే ఏఆర్బీ0000908)కు పంపాడు. మూడు మొబైల్ నంబర్లు (98868 26656, 95919 38585, 98804 72272) ద్వారా మొత్తం రూ.10 లక్షలు జయపాల్ రెడ్డితో ట్రాన్స్ఫర్ చేయించాడు. మోసపోయానని గ్రహించడానికి ఆరు రోజులు పట్టిన జయపాల్రెడ్డి చేసేది లేక తెలియని వ్యక్తులపై చర్య తీసుకోవాలని మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 318(4) బీఎన్ఎస్, 66–డీ ఐటీఏ–2000–2008ల కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
సదర్ సంబురం
యాదవుల తీన్మార్ స్టెప్పులు, డప్పు దరువులతో ఖిలా వరంగల్ కోట గురువారం రాత్రి మార్మోగింది. సదర్ ఉత్సవంలో భాగంగా దున్నపోతుల విన్యాసాలు అలరించాయి. కాళోజీ సెంటర్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో శుక్రవారం నుంచి ఎస్ఏ–1 పరీక్షలు నిర్వహించాలని వరంగల్ డీఈఓ రంగయ్య నాయు డు, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 14,279 మంది, 6 నుంచి పదో తరగతి వరకు 17,936 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు 24,752 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్యాంపస్లోని పరిపాలనా భవనం వీసీ చాంబర్ వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. ఈసందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. న్యూ పీజీ బాయ్స్ హాస్టల్, జగ్జీవన్ హాస్టల్ విద్యార్థులకు సరైన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు తమ సమస్యల్ని పట్టించుకోవట్లేదన్నారు. న్యూ పీజీ హాస్టల్ వద్ద నిర్మించిన డైనింగ్ హాల్ మెస్ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. కామన్ మెస్లోనూ, మహిళా హాస్టల్స్ మెస్లోనూ మెనూ చార్టును అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిచాలన్నారు. తప్పుడు లెక్కలు, అధిక బిల్లుల విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా.. వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అక్కడికి వచ్చి సంఘం బాధ్యులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ధర్నాలో రణదీప్, రాహుల్, సూరజ్, నాగరాజ్, రాజేశ్, సునీల్, పవన్, అనూప్ పాల్గొన్నారు. -
రోడ్ల ఆక్రమణలపై చర్యలు షురూ
నోటీసులు అందినా పట్టించుకోని యజమానులు.. ఇళ్ల కూల్చివేత పరకాల: నోటీసులు జారీ చేసినా పట్టించుకోకుండా రోడ్ల ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ హె చ్చరించారు. పరకాల మున్సిపాలిటీ పరిధి పాత సీఎంఎస్ గోదాం ప్రహరీ నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతో ఆమె స్పందించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్డు ఆక్రమణపై టౌన్ ప్లానింగ్ అధి కారులు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ రోడ్డు ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. నోటీసులు అందినవారు తక్షణమే ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. -
కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం చేసుకోవాలి
వరంగల్ అర్బన్: మహానగరవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ హాళ్లను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం కమిషనర్, టౌన్ ప్లానింగ్, పన్నుల విభాగం అధికారులు హనుమకొండలోని టీఎన్జీఓస్ కాలనీలోని రోజ్ గార్డెన్ను సందర్శించారు. గార్డెన్ను స్వాధీనం చేసుకోవడంతోపా టు బల్దియా పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో సుమారు 60 నుంచి 80 వరకు ఉన్న కమ్యూనిటీ హాళ్లలో సగం వరకు బల్దియా ఆధ్వర్యంలో ఉన్నాయని తెలిపారు. మిగతా సగం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని, వారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాటి జాబితాను అధికారులు నివేదించాలన్నారు. ఎవరైనా హాల్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చని.. ఒక ఫంక్షన్కు రూ.20 వేలు, అదనంగా విద్యుత్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. పురాతన కట్టడాలు.. బావుల్ని పునరుద్ధరించండి నగరంలో స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) పథకం అమలులో భాగంగా పురాతన కట్టడాలు, బావుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం హనుమకొండ‘ కుడా’ కార్యాలయంలో సాస్కి పథకంపై ఆయా విభాగాల అధికారులతో చర్చించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి సీహెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు రవికిరణ్, శివానంద్, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్ స్వాధీనం హన్మకొండ: హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్ను బల్దియా స్వాధీనం చేసుకుంది. గురువారం ఉదయం అధికారులు టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్కు తాళం వేసి వెళ్లారు. సాయంత్రం తాళం తీసి ఈ కమ్యూనిటీ హాల్ను తామే నిర్వహించనున్నట్లు, శుభకార్యాలు, ఈవెంట్లకు అద్దెకు ఇవ్వనున్నట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తామంతా వ్రతాలు, పూజా కార్యక్రమాల్లో ఉండగా.. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు చేరుకుని తాళం వేసినట్లు టీఎన్జీఓస్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొక్కిరాల రవీందర్రావు, కార్యదర్శి కిశోర్ తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడతానని చెప్పారన్నారు. విందుకు రూ.20 వేల చొప్పున చార్జీ విధించాలి కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలి
రాయపర్తి: సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై వచ్చే ప్రచారాన్ని ఎండగట్టి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ తొర్రూరు అధ్యక్షుడు జాటోత్ హామ్యానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ బండి రాజేంద్రప్రసాద్, టౌన్ కోఆర్డినేటర్ ఉబ్బని నవీన్, కోకోఆర్డినేటర్ గుగులోత్ వెంకన్న, అన్ని గ్రామాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి -
రైతులకు ఉపయోగం కపాస్ కిసాన్
దుగ్గొండి: పత్తిని సీసీఐకి అమ్ముకోవడానికి రైతులకు కపాస్ కిసాన్ యాప్ ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని దేశాయిపల్లి, ముద్దునూరు, బంధంపల్లి గ్రామాల్లో పత్తి రైతులకు గురువారం కపాస్ కిసాన్ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్భూమి రికార్డుల ద్వారా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలు యాప్లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్లే స్టోర్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్, భూమి రికార్డులు, పంట రకం, విస్తీర్ణం నమోదు చేయాలన్నారు. పత్తి ఏ రోజు అమ్మాలనుకుంటున్నారో ఆ తేదీ నమోదు చేయాలని సూచించారు. పత్తిని ప్లాస్టిక్ సంచులు, గోనె సంచుల్లో కాకుండా విడిగా తీసుకురావాలని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా పత్తిని క్వింటాలుకు రూ.8,110 చొప్పున విక్రయించుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, ఏడీఏ దామోదర్రెడ్డి, ఏఓ మాధవి, ఏఈఓలు హనుమంతు, విజయ్నాయక్, రాజేశ్, పత్తి రైతులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం, పాఠశాల తనిఖీ.. దేశాయిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ఎంత మంది పిల్ల లు ఉన్నారు, బాలింతలు, గర్భిణుల వివరాలను పరిశీలించారు. పోషకాహారం వండడం లేదని గుర్తించి టీచర్, ఆయాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి చిన్నారులు, గర్భిణులకు భోజనం అందించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు రిజిష్టర్, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. 7వ తరగతి వరకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని హెచ్ఎం రవికుమార్ను ప్రశ్నించారు. నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ విద్యాసంస్థలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రీన్ఫీల్డ్ రైతులతో ఆర్బిట్రేషన్ న్యూశాయంపేట: గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న నెక్కొండ మండలంలోని పత్తిపాక, వెంకటాపూర్ రైతులతో కలెక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్లో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎన్హెచ్ ఇంజనీరింగ్ అధికారి భూక్యా ఈశ్వర్, రైతులు పాల్గొన్నారు. ఈఆర్సీ చైర్మన్లను కలిసిన కలెక్టర్ నగర పర్యటనకు వచ్చిన పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు విశ్వజిత్ఖన్నా, అరవింద్కుమార్ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు.కలెక్టర్ సత్యశారద -
ముగిసిన వైన్స్ దరఖాస్తుల స్వీకరణ
కాజీపేట అర్బన్: వైన్స్ దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 18న చివరి తేదీ ఉండగా.. గడువును 23వ తేదీ వరకు పెంచారు. పెంచిన గడువు చివరి రోజు గురువారం వరంగల్ అర్బన్ 67 వైన్స్కు 139 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ల ప్రకటన నుంచి గురువారం వరకు 3,175 దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా వరంగల్ రూరల్ 63 వైన్స్కు ఆఖరి రోజు గురువారం 103 దరఖాస్తులు రాగా, మొత్తం 1,934 దరఖాస్తులను మద్యం వ్యాపారులు రాత్రి 10:30 గంటల వరకు అందజేశారు. ఈనెల 27న వైన్స్ లక్కీడ్రాగా నిర్ణయించారు. ఆఖరి రోజు వరంగల్ అర్బన్ 139, వరంగల్ రూరల్ 103 -
దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట: స్వల్పకాలిక కోర్సుల్లో (ఐటీ) ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్లేస్మెంట్లో భాగంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి అర్హత గల శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తులు ఆఽహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు తగిన ధ్రువపత్రాలతో వచ్చేనెల 6లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని షరీఫన్ మసీదు దగ్గర ఉన్న జిల్లా మైనారిటీ కార్యాలయం లేదా 9490151718 నంబర్లో సంప్రదించాలని సూచించారు. గీసుకొండ: గంజాయి అమ్ముతున్న వ్యక్తిని గీసుకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. గ్రేటర్ వరంగల్ ధర్మారం శివారులో ఎస్సై కె.కుమార్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా బిహార్కు చెందిన మోహన్కుమార్ చేతిలో కవర్తో వారికి తారసపడ్డాడు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్సై అతడిని పట్టుకుని పరిశీలించారు. కవర్లో 40 గ్రాముల ఎండు గంజాయితోపాటు మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఇన్స్పెక్టర్కు నివేదించగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పర్వతగిరి: సీడ్ పేరుతో నట్టేట ముంచారని రైతులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతగిరిలో సుమారు 200 మంది రైతులకు ఓ కంపెనీ వారు రబీలో వరి విత్తనాలను విక్రయించారు. పండించిన పంటను కంపెనీ ప్రతినిధులే కొనుగోలు చేశారు. ఏడు నెలలుగా రూ.1.30 కోట్లకు రూ.60 లక్షల వరకు చెల్లించారని, మిగతా రూ.70 లక్షలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు తెలిపారు. మోసం చేసిన సీడ్ కంపెనీపై గురువారం పర్వతగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు. గీసుకొండ: పొదుపు సంఘాల మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి సూచించారు. కొనాయమాకుల ప్రగతి మండల సమాఖ్య కార్యాలయంలో సెర్ప్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఫుడ్సేఫ్టీ ఇండియా సహకారంతో గురువారం పీఎం ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫుడ్సేఫ్టీ ఇండియా మేనేజర్ రఘువర్మ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వరలక్మి, ఏపీఎంలు ముక్కెర ఈశ్వర్, రాజ్కుమార్, సమాఖ్య కార్యదర్శి శారద, కోశాధికారి శిల్ప, సీసీలు సురేశ్, రాజయ్య, కుమారస్వామి, నర్సయ్య, శ్రీలత, కృష్ణమూర్తి, రవీందర్ రాజ్, ట్రైనర్ సాగర్, రాణి, జయంతిక, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–25 నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న టెక్ ఫెస్ట్ ఈ ఏడాది రెండు రోజులు శుక్ర, శనివారాల్లో నిర్వహించేందుకు నిర్ణయించారు. శుక్రవారం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ మాధవీలత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు మెకా వెహికిల్ ఎగ్జిబిషన్, నియాన్ క్రికెట్, కిట్ అసెంబ్లీ, సుమో వార్, డ్యాన్స్ ఓ, వరంగల్ రింగ్ వంటి వివిధ రకాల స్పాట్ లైట్, సెమినార్స్తో అలరించనుంది. కాగా, టెక్ఫెస్ట్–25లో దేశవ్యాప్త వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏడు వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. -
విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
కాళోజీ సెంటర్: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) ఉండ్రాతి సుజన్తేజ సూచించారు. జిల్లావిద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం వరంగల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జానపద నృత్యపోటీలు నిర్వహించారు. సుజన్తేజ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తేవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. నెక్కొండ కేజీబీవీ ప్రథమ, చెన్నారావుపేట కేజీబీవీ ద్వితీయ, రాయపర్తి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. న్యాయనిర్ణేతలుగా పరమేశ్వర్, చైతన్య వ్యవహరించారు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, హెచ్ఎం శారదాబాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉపాధికి ప్రణాళికలు
సంగెం: గ్రామాల్లో వలసలను నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించిన పనులను గుర్తించేందుకు అధికారులు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమయ్యే పనులను గుర్తించి తీర్మానాలు చేస్తున్నారు. జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి 2.39 లక్షల జాబ్కార్డులు మంజూ రు చేయగా.. ఇందులో 74,576 యాక్టివ్ జాబ్కార్డులు ఉన్నాయి. మొత్తం 1,23,701 మంది కూలీలు ఉన్నారు. వీరందరికి వంద రోజుల పని కల్పించనున్నారు. కనీసం రోజుకు రూ.300 కూలి పడేటట్లు అధికారులు ప్రణాళికలు రుపొందిస్తున్నారు. వచ్చే నవంబర్ 30 నాటికి అన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తి చేస్తామని ఈజీఎస్ అధికారులు తెలిపారు. చేపట్టే పనులు ఇలా.. జాబ్కార్డులు కలిగి వ్యవసాయ భూములున్న రైతుల కోసం పనులు చేపట్టనున్నారు. జామ, నిమ్మ, మామిడి, దానిమ్మ, సీతాఫల్, డ్రాగన్ప్రూట్, మునగ, కొబ్బరి, అయిల్పామ్, జామాయిల్, గడ్డి పెంపకం, గొర్లషెడ్డు, పశువుల షెడ్ల నిర్మాణం, రైతుల భూములకు వెళ్లేందుకు మట్టి రోడ్డు, ఫారంపాండ్, చేపల చెరువుల తవ్వకం, ఎస్సీ, ఎస్టీల భూముల లేవలింగ్, జంగిల్ కటింగ్, కొత్త బావుల తవ్వకం, పాత బావుల పూడికతీత, ఇంకుడు గుంతలు, కంపోస్ట్ ఎరువుల గుంత, భూమి చుట్టూ కందకాలు, నాడెపు కంపోస్ట్, మట్టి కట్టలు, వ్యక్తిగత నర్సరీల పెంపకం, అజోలా గడ్డి పెంపకం వంటి పనులను అధికారులు గుర్తిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు అవసరం అవుతాయో అలాంటి పనులను గుర్తించేందుకు అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు తీసుకుంటున్నాం. స్థానిక అవసరాలు, రైతుల వ్యక్తిగత అవసరాలను ముందుగానే గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామసభల్లో చేయాల్సిన పనుల వివరాలతో ప్రణాళికలు రుపొందించి జిల్లా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటాం. మంజూరు రాగానే గ్రామాల్లో పనులు చేపట్టి కూలీలకు ఉపాధి హామీ పనులు స్తాం. – కాసర్ల రవీందర్, ఎంపీడీఓ సంగెంగ్రామీణ మండలాలు 11 గ్రామ పంచాయతీలు 325 జాబ్కార్డులు 2.39 లక్షలు యాక్టివ్ కార్డులు 74,576కూలీలు 1,23,701 మంది నవంబర్ 30 వరకు గ్రామసభల తీర్మానాలు కూలీకి రోజుకు రూ.300 చెల్లించనున్న అధికారులు -
వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
గీసుకొండ: అర్హులైన 0–16 ఏళ్ల లోపు వారందరికీ వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని, ఈ విషయంలో అలసత్యం వహించొద్దని డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని హెల్త్ సబ్ సెంటర్, కాశిబుగ్గలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో నిర్వహిస్తున్న వ్యాధినిరోధక టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశా రు. వయసుకు తగిన రీతిలో రూపొందించిన పట్టిక ఆధారంగా టీకా వేయించడానికి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. వైద్యులు, సిబ్బంది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేయాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత విషయాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. డిప్యూటీ డెమో అనిల్కుమార్, హెచ్సీ కిరణ్కుమార్, సదానందం, ఏఎన్ఎం కళావతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ సాంబశివరావు -
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: రైతులు మక్కల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దిగుబడిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తక్కువ ఎరువులను వాడుతూ అధిక దిగుబడులు వచ్చే విధంగా శాసీ్త్రయ కోణంలో వ్యవసాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి నల్లబెల్లి: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని డీపీఎం(డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్) దాసు అన్నారు. స్థానిక మదర్ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కమిటీలకు నిర్వహణ మార్గద్శకాలపై బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు సన్న ధాన్యానికి (ఏ గ్రేడ్) క్వింటాకు రూ.2,389, దొడ్డు రకం ధాన్యానికి (సీ గ్రేడ్) రూ.2,369 ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని, ఐకేపీ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, మండల సమాఖ్య కోశాధికారి మౌనిక, నల్లబెల్లి, దుగ్గొండి ఏపీఎంలు కందిక రమేష్, ఈద రమేష్, సీసీలు యాకుబ్, సాంబయ్య, వెంకటేశ్, కవిత, సుజాత పాల్గొన్నారు. -
ఆవిష్కరణలకు వేదిక ఇన్స్పైర్
కాళోజీ సెంటర్: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన (ఆర్ఎస్బీవీపీ), డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ప్రాజెక్టు కాంపిటిషన్ (డీఎల్ఇపీసీ) ఇన్స్పైర్ మనాక్ ఎగ్జిబిషన్ నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 –26 సంవత్సరానికి థీంగా వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధాన అంశాలను ఎంపిక చేసి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్ణయించారు. ఉప థీంలో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు, గ్రీన్ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదాత్మక గణిత నమూనా (రిక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్), ఆరోగ్యం, పరిశుభ్రత నీటి సంరక్షణ, నిర్వహణ అనే అంశాలను ఎంపిక చేశారు. జిల్లాలోని సైన్స్, గణిత ఉపాధ్యాయులు 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులను సిద్ధం చేయాలి. నవంబర్ ఒకటి నుంచి 30వ తేదీలోపు మూడు రోజులపాటు ఆర్ఎస్బీవీపీ, ఇన్స్పైర్ మనాక్ నిర్వహించాలి. ఇన్స్పైర్ మనాక్ ఆవిష్కరణల ప్రదర్శన.. జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్లో ఇన్స్పైర్ అవార్డు మనాక్ విభాగంలో విద్యార్థులు పాల్గొంటారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో సైన్ ఎగ్జిబిట్లను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సైన్స్ ఫెయిర్కు ఏడు ఉప అంశాలు ఉన్నాయి. ఆవిష్కరణలకు రూపం ఇవ్వడానికి ఒక్కోవిద్యార్థి ఖాతాలో ఇప్పటికే రూ.10వేల చొప్పున జమ చేశారు. ఇందులో పాల్గొనే విద్యార్థులు, గైడ్ టీచర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం ఆమోదించి ఎంపిక చేసిన ఆయా టైటిల్ ప్రకారమే తమ ప్రదర్శనలు, ప్రాజెక్టులను సిద్ధం చేయాలి. జిల్లాస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుల్లో 16 ఎగ్జిబిట్లు రాష్ట్రస్థాయిలో పాల్గొంటాయి. ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయుల ఎగ్జిబిట్లు.. జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్లో విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయుల విభాగం కూడా ఉంటుంది. ఆసక్తిగల ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు సాంకేతిక ఆవిష్కరణలు, సృజనాత్మక భోధనా అభ్యసన పరికరాలను ప్రదర్శించవచు. ఈ విభాగం నుంచి కూడా రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. సైన్స్ సెమినార్స్.. సైన్స్ ఎగ్జిబిట్లతోపాటు ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం అనే అంశంపై ఈ సైన్స్ ఫెయిర్లో సెమినార్ నిర్వహిస్తారు. 6 నుంచి 12 తరగతుల విద్యార్థు పాల్గొంటారు. జిల్లాస్థాయిలో అత్యుత్తమంగా సమర్పించిన ఒక విద్యార్థి రాష్ట్రస్థాయికి ఎంపికవుతాడు. ఒకే వేదికపై రెండు కార్యక్రమాలు.. బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనాక్ ఒకే వేదికపై నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు జిల్లాల వారీగా తేదీలను నిర్ణయించి రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేయాలి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా సైన్స్ అధికారులు, సైన్స్, గణిత ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. నవంబర్లో 3 రోజులపాటు నిర్వహణ 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు అవకాశం వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ అంశాలు ఎంపికజిల్లా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తాం.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఇఆర్టీ), బాల వైజ్ఞానిక ప్రదర్శన(ఆర్ఎస్బీవీపీ) ఆదేశాల మేరకు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను నవంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహిస్తాం. ఇందుకోసం అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పాఠశాలను ఎంపికచేస్తాం. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తాం. – బి.రంగయ్య నాయుడు, డీఈఓ బాలశాస్త్రవేత్తల ఆవిష్కరణలకు వేదిక బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనాక్ అవార్డ్స్ సంయుక్తంగా ఒకే వేదికలో ఒకేసారి నిర్వహిస్తాం. 6 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచనలు, పరిష్కార నైపుణ్యాలు ప్రదర్శించడానికి ఇది ఒక వేదిక. విద్యార్థులు ప్రేరణ పొందడానికి ఈ సైన్స్ ఫెయిర్ దోహదపడుతుంది. నేటి బాలలే రేపటి స్టార్టప్ కంపెనీల స్థాపకులు, నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఇది ఉపయోగపడుతుంది. – డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి -
పాఠశాలల్లో స్వచ్ఛత పక్షోత్సవాలు
కాళోజీ సెంటర్: విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో స్వచ్ఛత పక్షోత్సవాలు ఈనెల 17న ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 344 ప్రాథమిక పాఠశాలలు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు, 134 ఉన్నతపాఠశాలలతోపాటు గురుకుల పాఠశాలలు, కేజీబీవీల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా విదాశాఖ అధికారి సూచనల మేరకు ఎంఈఓలు, హెచ్ఎంలు పక్షోత్సవాలు ప్రారంభించి మొదటి రోజు విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ● 17వ తేదీన పాఠశాలల్లో విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ● 18 నుంచి 21 వరకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ● 22వ తేదీన హరిత దినోత్సవం నిర్వహించాలి. పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించారు. ● 23వ తేదీన పాఠశాలను సమాజానికి చేరువ చేయాలి. స్థానిక ప్రజలు, విద్యావేత్తలతో విద్యార్థులను మమేకం చేయాలి. వారికి స్వచ్ఛత ప్రాముఖ్యత గురించి వివరించాలి. ● 24వ తేదీన హ్యాండ్ వాష్ డే లో భాగంగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మధ్యాహ్న భోజన సమయంలో చేతులను సరిగా కడుక్కోవడం, చేతులను శుభ్రం చేసే విధానాలను విద్యార్థులకు నేర్పించాలి. ● 25వ తేదీన విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించాలి. ● 27వ తేదీన వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించాలి. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. ● 28వ తేదీన పాఠశాల స్థాయిలో విద్యార్థులతో స్వచ్ఛతపై ఎగ్జిబిషన్ డే నిర్వహించాలి. ● 29, 30వ తేదీల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాఠశాల స్వచ్ఛతపై ప్రణాళికలు రూపొందించాలి. ● 31వ తేదీన స్వచ్ఛత పక్వాడ ముగింపు దినోత్సవం నిర్వహించాలి. గ్రామ ప్రముఖులను ఆహ్వానించాలి. కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు ప్రతిరోజూ పోటీలు నిర్వహిస్తే.. విజేతలకు బహుమతులు అందజేయాలి. స్వచ్ఛత పక్వాడ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలి.పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన -
ఇద్దరికీ ఒకటే ఆధార్ నంబర్..
● లెంకాలపల్లిలో వెలుగుచూసిన వైనం ● అయోమయంలో విద్యార్థిని తల్లిదండ్రులు ● గతంలో గుండ్లపహాడ్లో నూ ఇదేతీరు..నల్లబెల్లి: ఆధార్కార్డులో వ్యక్తి పేరు లేదా పుట్టిన తేదీ తప్పుగా ఉంటే సవరించుకోవడం సాధారణం. కానీ, ఏకంగా ఒకే నంబర్ ఇద్దరు వ్యక్తుల పేరున ఉంటే ఏం చేయాలో తెలియక తలమునకలవుతున్నారు.. మండలంలోని లెంకాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు బాలికల తల్లిదండ్రులు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లెంకాలపల్లి గ్రామానికి చెందిన జన్ను రజిత–సాంబయ్య దంపతుల కుమార్తె దివ్య పెద్దాపూర్ ఎంజేపీ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది. అదే గ్రామానికి చెందిన జన్ను లలిత–కోటి దంపతుల కుమార్తె దివ్య నల్లబెల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. జన్ను లలిత–కోటి కుమార్తె దివ్య వివరాలను నల్లబెల్లి కస్తూర్బా గురుకుల విద్యాలయాల్లో యూడైస్లో నమోదు చేసేక్రమంలో ఆధార్ కార్డు నంబర్ 2522 5754 7168 ఎంటర్ చేయగానే జన్ను రజిత–సాంబయ్య కుమార్తె దివ్య వివరాలు వెల్లడవుతున్నాయి. లలిత–కోటి దంపతుల కుమార్తె దివ్య 01–01–2011లో జన్మించగా.. రజిత–సాంబయ్య కుమార్తె దివ్య 22–08–2010న జన్మించింది. కానీ, ఇరువురి పుట్టిన తేదీ ఒకేరోజుగా కార్డులో నమోదు కావడం, ఇరువరికి ఒకే ఆధార్ నంబర్ ఉండడం గమనార్హం. దీంతో సవరణ కోసం స్థానిక ఆధార్ కేంద్రంలో సంప్రదించగా.. హైదరాబాద్లోని కేంద్రానికి వెళ్లాలని సూచించడంతో తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. గతంలో ఇలాంటిదే మండలంలోని గుండ్లపహాడ్లో సైతం వెలుగు చూడడం పాఠకులకు విధితమే. -
అవినీతి చేశారు.. బెనిఫిట్స్ ఆగుతాయ్..!
రిటైర్మెంట్కు దగ్గర ఉన్న అధికారులే సైబర్ నేరగాళ్ల టార్గెట్ మొదట ఫోన్ పే ద్వారా విడతల వారీగా నిందితుడు రూ.4 లక్షల వరకు బదిలీ చేయించున్నాడు. అనంతరం మరో రూ.ఆరు లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో ఎంవీ ఐ జైపాల్ రెడ్డి చాకచాక్యంగా బ్యాంక్ ఖాతా నంబర్ ఇస్తే బదిలీ చేస్తానని చెప్పాడు. దీంతో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం బసవేశ్వరనగర్లోని ఓ బ్యాంక్ ఖాతాను మరుసటి రోజు నిందితుడు పంపించాడు. దీంతో జైపాల్రెడ్డి తన అగ్రికల్చర్ లోన్ అకౌంట్ ద్వారా డబ్బులు పంపారు. ఆ వెంటనే బైపాల్రెడ్డి బెంగళూరులో ఉన్న తన బంధువులు, ఓ ముఖ్యప్రజాప్రతినిధికి సమాచారం అందించాడు. వారిపాటు పోలీసుల సాయంతో నగదు పంపించిన ఫోన్ పే నంబర్ల ఆధారంగా ఓ సెక్యూరిటీ గార్డు, ఓ డెలివరీ బాయ్ని నిందితులుగా గుర్తించారు. బ్యాంక్ ఖాతా కూడా అక్కడే ఏటీఎం సెక్యూరిటీ గార్డుదిగా తేల్చారు. డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వచ్చేవాడు ఎలా ఉంటాడు, నీకు ఎలా పరిచయం అంటూ సెక్యూరిటీ గార్డును ఆరా తీశారు. ప్రతిసారి రూ.50 వేలు నా అకౌంట్లోకి వస్తే రూ.ఐదు వేలు ఇచ్చి రూ.45 వేలు తీసుకుంటున్నాడని, ప్రతిసారి ముఖానికి మాస్క్ ధరించి వస్తాడని సెక్యూరిటీ గార్డు ఎంవీఐ బంధువులకు సమాచారమిచ్చారు. తొలిసారిగా అతడి అసలైన ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేశాడని, డబ్బులు డ్రా చేసేందుకు ఆదివారం వస్తున్నాడనడంతో ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేసే ముందు ఈసారి ముఖానికి మాస్క్ తీయమని చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇలా ఆ ఖాతా నుంచి రూ.40 వేల వరకు డ్రా చేసుకుంటున్న సమయంలో ఆ ప్రధాన నింది తుడి ఫొటో అక్కడున్న సీసీ కెమెరాకు చిక్కింది. దీంతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సాక్షి, వరంగల్: రిటైర్మెంట్కు దగ్గర ఉన్న అధికారులే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వరంగల్ రవాణా శాఖలో ఎంవీఐగా పనిచేస్తున్న జైపాల్రెడ్డికి ఏసీబీ పేరుతో ఫోన్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేసిన సైబర్ నేరగాళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. తొలుత నిందితుడు వరంగల్ రవాణా శాఖ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబుకు ఫోన్ చేసి తాను ఏసీబీ అధికారినని చెబుతూ.. మీ ఆఫీసులో ఎవరు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారని ఆరా తీశాడు. శోభన్బాబు వెంటనే ఎంవీఐ జైపాల్రెడ్డిని ఫోన్ కాన్ఫరెన్స్లోకి తీసుకున్నాడు. దీంతో మీరు అవినీతికి పాల్పడ్డారు.. మీ బెనిఫిట్స్ అన్నీ ఆగుతాయని జైపాల్రెడ్డిని సదరు నిందితుడు బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. గతంలోనూ బెదిరింపులు.. గతంలోనూ వివిధ ప్రభుత్వ విభాగాల్లో రిటైర్మెంట్కు సమీపంలో ఉన్న ఉద్యోగులను ఏసీబీ అధికారినంటూ బెదిరించి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని తెలిసింది. నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బసవేశ్వర పోలీసు స్టేషన్లోనూ ఓ డెలివరీ బాయ్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ప్రధాన నిందితుడు తమకు డబ్బు ఆశ చూపి ఫోన్ పే నంబర్లు, బ్యాంక్ ఖాతాలు వాడుకున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఏసీబీ అధికారి పేరుతో ఫోన్ చేసి రూ.పది లక్షల వరకు కొట్టేశారంటూ ఎంవీఐ జైపాల్రెడ్డి ఏసీబీ అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. వారి సూచనలతో మిల్స్కాలనీ ఠాణాలోనూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. గతంలో నెల్లూరులో పనిచేసిన సమయంలో ఏసీబీ కార్యాలయంలోని ఓ హోంగార్డు తరచూ ఫోన్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగితే రెండు, మూడు సార్లు డబ్బులిచ్చి ఆ తర్వాత జైపాల్రెడ్డి స్వయంగా రెక్కీ చేసి అతడితోపాటు మరో వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.నకిలీ ఏసీబీ అధికారులతో కలకలం ఇటీవల ఆర్టీఏ చెక్పోస్టుల వద్ద ఏసీబీ అధికారుల దాడులు, వరంగల్ నగరం ములుగు రోడ్డులోని మత్స్యశాఖ కార్యాలయంలో ఇటీవల సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం.. ఇదే సమయంలో ఏసీబీ అధికారులంటూ రవాణాశాఖ సిబ్బందికి ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. రిటైర్మెంట్ అధికారులే లక్ష్యంగా డబ్బులు డిమాండ్ చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. సైబర్ నేరగాళ్లు కొత్త తరహా పంథా ఎంచుకోవడంతో చాలామంది అధికారులు రిటైర్మెంట్ ముందు మనకు ఎందుకీ తలనొప్పి అంటూ రూ.లక్షల్లో సమర్పించుకొని మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఏసీబీ అధికారులమంటూ ఫోన్కాల్స్ వరంగల్ ఎంవీఐకి ఫోన్ చేసి డబ్బుల డిమాండ్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేయడంతో చిక్కిన నిందితులు బసవేశ్వరనగర్ పోలీసుల అదుపులో ముగ్గురు నేరగాళ్లు -
వైన్స్ దరఖాస్తులకు నేడు చివరి తేదీ
నర్సంపేట: 2025–27 సంవత్సరానికి వైన్షాపుల నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ నేడు(గురువారం)తో ముగుస్తుందని నర్సంపేట ఎకై ్సజ్ సీఐ నరేష్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 22 షాపులకు ఇప్పటి వరకు 711 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆసక్తి గల వారు నేడు(గురువారం) సాయంత్రం 5 గంటలలోపు హనుమకొండలోని డీపీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నర్సంపేట: పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ను బుధవారం విజిలెన్స్ టీం తనిఖీ చేసి స్టాక్ వివరాలను పరిశీలించింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన స్టాక్తోపాటు పంపిణీ వివరాలు పరిశీలించగా అన్ని రకాలుగా టాలీ అయ్యాయని విజిలెన్స్ టీం సీఐ వసంత్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ సిబ్బంది మామిడాల రమేష్, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం : సాంస్కృతిక కార్యక్రమాలతో పోలీస్ జాగృతి కళాబృందం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులతో సీపీ తన కార్యాలయంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏఏ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను కళాబృందం ఇన్చార్జ్ ఏఎస్సై నాగమణిని సీపీ అడిగి తెలుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ, మూఢనమ్మకాలు, షీ టీం, డయల్–100, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే రీతిలో గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో కథాంశాలతో ప్రదర్శనలు ఇవ్వాలన్నారు. అదే విధంగా కేవలం కథాంశాలే కాకుండా మూడేళ్లుగా సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు జరిగిన నష్టాలపై ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కళాబృందం కార్యాచరణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఏసీపీ ఎస్.బీ 2జాన్ నర్సింహులుకు సీపీ సూచించారు. సీపీతో ముచ్చటించిన వారిలో హెడ్ కానిస్టేబుళ్లు విలియమ్, రత్నయ్య, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ పూల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 14వరకు నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ పర్యవేక్షించారు. డాక్టర్ మంద శ్రీనివాస్, శ్రీదేవి అధ్యాపకులు ఉన్నారు. -
‘పది’కి ప్రణాళిక
వందశాతం ఉత్తీర్ణతకు విద్యాశాఖ కార్యాచరణవిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో పదో తరగతి విద్యార్థులపై ఇప్పటి నుంచే జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 2024–2025లో పదో తరగతిలో విద్యార్థులు 96.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈవిద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఈనెల 8వ తేదీ నుంచే సాయంత్రం 4–15 గంటల తర్వాత మరో గంటపాటు విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టు టీచర్ విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన చేస్తున్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో కలిపి సుమారు 11,500 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. జనవరి 9 వరకు సిలబస్ పూర్తిచేయాలి.. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 9 వరకు పదో తరగతి విద్యార్థులకు సిలబస్ను పూర్తిచేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు కూడా ప్రతి పాఠశాలలోను వంద శాతం నమోదయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.డివాసంతి హెచ్ఎంలను ఆదేశించారు. అవసరమైతే టీచర్లు తల్లిదండ్రులతో, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం హాస్టళ్ల వార్డెన్లతోను మాట్లాడి విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. జనవరిలో ఉదయం, సాయంత్రం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక తరగతులపై సమీక్ష.. సమగ్రశిక్ష రూపొందించిన గణితం, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్కు సంబంధించిన అభ్యాసక దీపికలను కూడా ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అందజేశారు. పాఠ్యాంశాలకు సంబంధించిన వివిధ అంశాలు సులభరీతిన చదువుకొని ప్రశ్నలకు సమాధానాలు రాసేవిధంగా ఈ అభ్యాసక దీపికల్లో ముఖ్యమైన అంశాలతో పొందుపరిచారు. వాటిని విద్యార్థులు చదువుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. వాటిలో కూడా ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేస్తున్నారు. గణితంలో గ్రాఫ్లు, రేఖాగణిత నిర్మాణాలు, సైన్స్లో రేఖాచిత్రాలు, ప్రయోగాలు, సాంఘిక శాస్త్రంలోని మ్యాప్పాయింటింగ్ లాంటివాటిపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు స్వతంత్రంగా పాఠాలు చదవడానికి, ప్రశ్నలకు సమాధానం రాసేందుకు టీచర్లు ప్రొత్సహిస్తున్నారు. ప్రతి పాఠశాలలో వారానికోసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష చేస్తారు. విద్యార్థుల అభ్యసనాల స్థాయిని కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. వారాంతపు పరీక్షలు కూడా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. టీచర్లు కీపేపర్ తయారు చేయాలి.. జిల్లాలో ఈనెల 24 నుంచి ఎస్ఏ–1 పరీక్షలు పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కరబరచాల్సి ఉంటుంది. పరీక్ష తదుపరి ప్రతి సబ్జెక్టు టీచర్ ఆ ప్రశ్నపత్రం ఆధారంగా నమూనా జవాబుపత్రంను కీ(పేపర్) తయారుచేసి విద్యార్థులకు చూపించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. అభ్యాసక దీపికలను సాధన చేయించాలి అభ్యాసక దీపికలను ప్రతిరోజు సాధన చేయించాలి. విద్యాప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకోవాలి. ఉదయం వేళ అధ్యయన అలవాటును ప్రోత్సహించేందుకు వేకప్ కాల్ టీచర్లు చేయాలి. టెన్త్లో జిల్లా వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆయా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైనప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహించి సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థుల పురోగతిని వివరించాల్సి ఉంటుంది. – వాసంతి, హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి హసన్పర్తిలో విద్యార్థుల దత్తత హసన్పర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ, ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వివిధ సబ్జెక్టులు బోధిస్తున్న టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకొని వేకప్ కాల్స్ కూడా చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించేందుకు సమావేశం కూడా నిర్వహించనున్నాం. ప్రతీ హైస్కూ ల్లో విద్యార్థులను వివిధ గ్రూపులుగా విభజించి, వారికి సబ్జెక్టుల వారీగా టీచర్లు ప్రత్యేక శ్రద్ధతో బోధన చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నాం. – ఎ.శ్రీనివాస్, హసన్పర్తి ఎంఈఓ సాయంత్రం వేళ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పాఠశాలల్లో అభ్యాసక దీపికల పంపిణీ హనుమకొండ జిల్లాలో పరీక్షలకు హాజరుకానున్న 11,500 మంది విద్యార్థులు -
పోరాటయోధుడు కొమురం భీమ్
కేయూ క్యాంపస్ : ఆదివాసీల హక్కులు, ఆస్థిత్వం కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీమ్ అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతిని పురస్కరించుకొని రిజిస్ట్రార్ వి.రామచంద్రంతో కలిసి భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కేయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ బి.సురేష్లాల్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజు, డాక్టర్ సుకుమారి, ఎం.నవీన్, వల్లాల పృథ్వీరాజ్ వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 14వరకు నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ పర్యవేక్షించారు. డాక్టర్ మంద శ్రీనివాస్, శ్రీదేవి అధ్యాపకులు ఉన్నారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం అధిపతిగా అదే విభాగం ప్రొఫెసర్ వై.వెంకయ్య నియమితులయ్యారు. బుధవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఆ విభాగం అధిపతిగా విధులు నిర్వర్తించిన ప్రొఫెసర్ జి.షమిత పదవీకాలం పూర్తికావడంతో ఆమె స్థానంలో వెంకయ్యను నియమించారు. రెండేళ్ల పాటు ఆయన విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఆయన కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో వివిధ విభాగాల పరిశోధకులకు బుధవారం ప్రీ పీహెచ్డీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 187 మంది పరిశోధకులకు గాను 180 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణను కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పరిశీలించారు. ప్రొఫెసర్ కె.రాజేందర్, యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, మమత పాల్గొన్నారు. కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్స్లకు గాను బుధవారం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్కు 16 దరఖాస్తులు అందజేశారు. వైన్స్ టెండర్ల ప్రక్రియ వెలువడిన నాటి నుంచి బుధవారం వరకు 3,036 దరఖాస్తులు అందాయి. కాగా పొడిగించిన టెండర్ల గడువు నేటి (గురువారం)తో ముగియనుంది. ఆత్మకూరు : వైద్యసిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. మండలంలోని నీరుకుళ్ల, పెద్దాపూర్, పెంచికలపేట ఉప ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.ప్రజలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు రాజమ్మ, హేమలత, సజీన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బల్దియా ఆవరణలో కోతులను విక్రయించిన కాంట్రాక్టర్
● ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కెమెరాల్లో రికార్డు ● జీడబ్ల్యూఎంసీ అధికారుల వైఫల్యంపై విమర్శలు ● నాలుగున్నరేళ్లలో రూ.2.50 కోట్ల ఖర్చు చేసినా నగర ప్రజలకు తప్పని వానరాల బెడద ఏ కాలనీలో చూసినా వానరాలే..నగరంలో వానరాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు కోతుల భయంతో వణికిపోతున్నారు. మార్కెట్కు వెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకుని వచ్చే సమయంలో దాడి చేస్తున్నాయి. మీదపడి చేతుల్లో ఉన్న కవర్లను, సంచులను లాక్కొనిపోతున్నాయి. ఒకవేళ ఇవ్వకపోతే పెద్దపెట్టున అరుస్తూ గుంపుగా వెంబడిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జారవిడవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో రెండో కాకుండా పదుల సంఖ్యలో ప్రత్యక్షమవుతున్నాయని పేర్కొంటున్నారు. కోతులు ఆకలి, దప్పిక సమయాల్లో ఇళ్లలోకి చొరవడి పండ్లు, కూరగాయలు తదితర సామగ్రిని ఎత్తుకపోతున్నాయి. ఇంటి పనులు చేస్తున్న మహిళలపైన దాడులు చేస్తున్నాయి. దీంతో ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇంటి పరిసరాల్లో ఏమైనా పదార్థాలు చేతుల్లో కనిపిస్తే చాలు మీద పడి కరుస్తూ వాటిని తీసుకెళ్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ అర్బన్: వినడానికి విచిత్రం.. చూస్తే సచిత్రం, కనిపిస్తే ఆందోళనకరం.. ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా.. అదేనండి వరంగల్ మహానగరంలో కోతులు ఇళ్లు, రోడ్లు తేడా లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. నివాసాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు ఎదురు దాడికి దిగేందుకు రంకెలేస్తున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్తకోణం వెలుగు చూడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కోతులను పట్టుకునే కాంట్రాక్టర్ తాజాగా కొన్ని కోతులను బల్దియా ఆవరణ నుంచి అమ్మకానికి పెట్టాడు. ఓ ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసి కారులో తరలించడం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) కెమెరాల్లో రికార్డు కావడం, బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోతిని పట్టుకొని తరలిస్తే రూ.550 ఒక్కో కోతిని పట్టేందుకు జీడబ్ల్యూఎంసీ చెల్లిస్తున్నది అక్షరాలా రూ.550. ఒకవేళ పట్టిన వాటిని ఏటూరునాగారం అడవుల్లో వదిలేయడంతో పెద్ద అవినీతి జరుగుతోంది. చెల్లిస్తున్న పన్నుల నుంచి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు కోతులను పట్టుకునేందుకు బల్దియా బడ్జెట్ కేటాయిస్తోంది. ఈ సొమ్ముతో ఎన్ని కోతులను పట్టుకొని, ఎక్కడ వదిలేస్తున్నారనే వివరాలను రికార్డుల్లో కాకిలెక్కలుగా మారాయి. ఫిర్యాదు వస్తే ఆయా కాలనీల్లో నాలుగైదు పెద్ద బోన్లు, ఐదు బాక్స్ బోన్లు పెడతారు. బోనులో కోతులు పడేందుకు అరటిపండ్లు, పల్లీలు ఎరగా వేస్తారు. వరుసగా రెండు రోజులపాటు వీటిని తినేందుకు కోతులు వస్తాయి. మూడోరోజు బోనులో కోతులు చిక్కుతాయి. ఇందుకోసం బల్దియా ప్రత్యేకంగా వాహనాన్ని సమకూరుస్తుంది. ఇదే తరహాలో కోతులను పట్టుకుంటారు. కానీ, నగరంలో కోతుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పట్టుకున్న కోతులను జీపీఎస్ కలిగి ఉన్న వాహనంలో తరలిస్తూ ఏటునాగారం అడవుల్లో వదిలేయాలి. అటవీ శాఖ అధికారి సంతకం తీసుకుంటున్నామని నమ్మలేని నిజాలు సృష్టిస్తుండడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగున్నర ఏళ్ల కాలంలో సుమారు రూ.2.50 కోట్ల మేరకు నిధులు వెచ్చించినా నగరంలో కోతలు బెడద ఎక్కువగా ఉన్నట్లు జీడబ్ల్యూఎంసీ అధికారులే చెబుతుండడం విశేషం. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణ నుంచి కోతులను తరలిస్తున్న కారు నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ తాజాగా ఐదు కోతులను అమ్మిన మాట వాస్తవమే. సీసీ ఫుటేజీలను పరిశీలించి సదరు వ్యక్తులను విచారించాం. అవి కోతులు కావని, కొండముచ్చులను పట్టుకొని అమ్మినట్లు అంగీకరించారు. విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. – రాజారెడ్డి, సీఎంహెచ్ఓ -
108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ ఉమ్మడి జిల్లా మేనేజర్ నసీరుద్దీన్ కమలాపూర్ : 108 సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు, రోగులకు మెరుగైన సేవలు అందించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా మేనేజర్ నసీరుద్దీన్ సూచించారు. కమలాపూర్ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఉన్న 108 అంబులెన్సును హనుమకొండ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్తో కలిసి బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి, అంబులెన్సులోని సక్షన్ ఆపరేటర్, ఏఈడీ, గ్లూకోమీటర్, మానిటర్, ఆక్సిజన్, థర్మామీటర్ తదితర పరికరాలు, వాటి పనితీరును పరిశీలించారు. 108 వాహన సిబ్బంది మండల ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర కాల్స్ రాగానే వెంటనే స్పందించి 30 సెకన్లలో బయలుదేరి వెళ్లి క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ బండ ఉపేందర్, పైలట్ చేలిక తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
జాగృతి కళాబృందంతో చైతన్యం రావాలి
సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : సాంస్కృతిక కార్యక్రమాలతో పోలీస్ జాగృతి కళాబృందం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులతో సీపీ తన కార్యాలయంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏఏ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను కళాబృందం ఇన్చార్జ్ ఏఎస్సై నాగమణిని సీపీ అడిగి తెలుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ, మూఢనమ్మకాలు, షీ టీం, డయల్–100, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే రీతిలో గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో కథాంశాలతో ప్రదర్శనలు ఇవ్వాలన్నారు. అదే విధంగా కేవలం కథాంశాలే కాకుండా మూడేళ్లుగా సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు జరిగిన నష్టాలపై ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కళాబృందం కార్యాచరణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఏసీపీ ఎస్.బీ 2జాన్ నర్సింహులుకు సీపీ సూచించారు. సీపీతో ముచ్చటించిన వారిలో హెడ్ కానిస్టేబుళ్లు విలియమ్, రత్నయ్య, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ పూల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న ఆలయంలో సహస్ర దీపాలంకరణ
ఐనవోలు : ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా మంగళవారం సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు, సిబ్బంది ముందుగా గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు ఎదురుగా నజర్ పట్నం వేసే ప్రాంతంలో స్వస్తిక్ ఆకృతిలో దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయం చుట్టూ సుమారు నాలుగు వేల దీపాలు వెలిగించినట్లు ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. అర్చకులు రవీందర్, శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, నందనం భాను ప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేష్ శర్మ, దేవేందర్, భక్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
శంకర్ దాదాలు @ ఇందిరమ్మ కాలనీ
హన్మకొండ అర్బన్ : హనుమకొండ 49వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొద్దిరోజులుగా శంకర్దాదాలు రాజ్యమేలుతున్నారు. వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చి ఇల్లు నిర్మించుకున్న వా రు ఒక ముఠాగా ఏర్పడి ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకరి ప్లాట్ ఇంకొకరికి విక్రయించడం, అసలు యజమానిని బెదిరించి మరొక ప్లాట్ ఇవ్వడం వంటివి ఇక్కడ సర్వసాధారణం అయ్యాయని తెలుస్తోంది. ఎవరైనా ఎదురు తిరిగితే భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వరుస ఘటనలతో కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. మేం చెప్పిన చోటే ఇల్లు నిర్మించుకోవాలి.. కాలనీలో బరితెగించిన ఓ ముఠా ఖాళీ ప్లాట్లపై కన్నెస్తోంది. ఆ ప్లాట్ను ఎవరికో ఒకరికి అంటగడుతూ..అసలు ఓనర్ వచ్చి అది తనదంటే బెదిరించి వెళ్లగొడుతున్నారు. గట్టిగా తిరగబడితే ఇంతకాలం ఇక్కడ లేవు.. కాబట్టి ఆ ప్లాట్ వేరే వాళ్లకు ఇచ్చేశాం.. మీకు ఇంకోచోట చూపిస్తాం అంటూ వేరే చోట ప్లాట్ను వీరికి అంటగడుతున్నారు. అక్కడే ఇల్లు నిర్మించుకోవాలని చెబుతున్నారు. అందుకుగాను అటు ప్లాటు ఓనర్నుంచి ఇటు కొత్తగా కొనుగోలు చేసినవారి నుంచి రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇలా ఇద్దరి వద్ద వసూలు చేస్తున్న నగదుతో జల్సాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శృతిమించిన రౌడీయిజం కాలనీలో కొందరు తమకు రాజకీయ నేతలు, పోలీసుల అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ చలామణి అవుతుండటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఓ డీసీసీ మాజీ అధ్యక్షుడి అనుచరుడిని అంటూ కాలనీలో ఓ వ్యక్తి హంగామా చేస్తున్నాడు. కొందరిని ఏకంగా చంపుతానంటూ బహిరంగంగా బెదిరించడం, దేవుడి వద్ద ప్రమాణాలు చేయడం కాలనీలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇటీవల సదరు వ్యక్తి కాలనీలోని కొందరు తన బండికి అడ్డుగా నిలబడ్డారని ఆగ్రహంతో మైనర్లను విచక్షణ రహితంగా చితకబాదిన ఘటన సీసీ ఫుటేజీలతో సహా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పోలీసులు మాత్రం కొందరికి వత్తాసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉదయం రమ్మని చెప్పిన పోలీసులు వారి మీదనే గొలుసు దొంగతనం కేసు పెడతామంటూ బెదిరించినట్లు ఆరోపిస్తున్నారు. ఆ గొలుసు రాత్రిపూట తమకు దొరికిందని ఇస్తామంటే ఉదయం పట్టుకు రమ్మని చెప్పారని, తీరా ఉదయం మాత్రం దొంగతనం చేశారని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్లాట్ల కబ్జాలపై పోలీస్, రెవెన్యూ అధికారులు సీరియస్గా దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్లాట్ల కబ్జా..అడిగితే దౌర్జన్యం.. భౌతిక దాడులు రాజకీయ నేతల పేర్లతో చలామణి పోలీసుల అండ ఉందని ధీమా -
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఈ నెల 19న : హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్ పరిధి శ్రీనివాస్ కాలనీలో నందికొండ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతూ 11 మంది పట్టుబడ్డారు. ఇందులో ప్రముఖ వ్యాపారులతోపాటు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు భీరం సుధాకర్రెడ్డి పట్టుబడ్డారు. 30 ఏళ్ల యువతి కూడా ఉంది. వీరినుంచి రూ.1,27,650 నగదు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న : వరంగల్ సబ్ డివిజన్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ 13మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుడు దోనెపూడి రమేష్బాబు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ తదితరులు ఉన్నారు. వీరినుంచి రూ.3.68లక్షల నగదు, 11సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో కొనసాగుతున్న పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్రెడ్డితో పాటు 11మంది పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. రూ.60,610 నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్లు, ప్రముఖుల ఇళ్లు, పండ్ల తోటలే అడ్డాలు ‘టాస్క్ఫోర్స్’కు పట్టుబడుతున్న రాజకీయ ప్రముఖులు మహిళలు సైతం పట్టుబడుతున్న వైనం దృష్టి సారించని స్థానిక పోలీసులు -
నేటినుంచి కార్తీక మాసోత్సవం..
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో నేటినుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు (బుధవారం) నుంచి నవంబర్ 20వ తేదీవరకు దేవాలయంలో కార్తీక మాసోత్సవం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈఓ ధరణికోట అనిల్కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. మంగళవారం దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హనుమకొండ పీఎస్ సీఐ మచ్చ శివకుమార్, ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు గట్టు మహేష్బాబుతో కలిసి అనిల్కుమార్, ఉపేంద్రశర్మ ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ శివకుమార్ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగించుకునే మహిళా భక్తుల కోసం మహిళా కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏమైనా ఇబ్బంది ఏర్పడితే డయల్–100కు కాల్ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. గట్టు మహేష్బాబు మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా వస్తుంటారని అన్నారు. అనిల్కుమార్ మాట్లాడుతూ దీపాలు వెలిగించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సాయంత్రం ప్రదోషకాల పూజలు, చతుర్వేదసేవ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో కాకతీయకాలనీ గురుద్వార్ ఆధ్యక్షుడు హరిసింగ్, విజయరాణి, వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, దేవాదాయశాఖ సిబ్బంది మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమాల వివరాలు.. అక్టోబర్ 22న (బుధవారం) కార్తీక శుద్ధపాడ్యమి ఉత్సవాలు ప్రారంభం. 25న శనివారం నాగులచవితి పూజలు. 27న సోమవారం కార్తీక ప్రథమ సోమవారం పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు. నవంబర్ 3న కార్తీకమాస రెండో సోమవారం సామూహిక రుద్రాభిషేకాలు. 5న బుధవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు, సాయంత్రం 6గంటల నుంచి లక్ష దీపోత్సవం. 10న కార్తీకమాస మూడో సోమవారం, 17న కార్తీకమాస నాలుగో సోమవారాల్లో ఉదయం 6గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు. 18న మంగళవారం మాసశివరాత్రి మకరలగ్నంలో ఉదయం 10:35 గంటలకు శ్రీ శివకల్యాణోత్సవం, రూ.1,116 చెల్లించాచి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. వేయిస్తంభాల దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి -
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
వరంగల్ క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాదినుంచి ఇప్పటివరకు దేశంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 191మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్తోపాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ సచిన్ అన్నారావు, కల్నల్ రవి, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, ప్రభాకర్రావు, శ్రీనివాస్, బాలస్వామి, రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్రావుతోపాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆర్ఐ స్పర్జన్ సారథ్యంలో సాయుధ పోలీసులు శోక్ శ్రస్త్ చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలి పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని కొనియాడారు. పోలీసు అమరవీరుల చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారికి ఎలాంటి సమస్య ఉన్నా పోలీస్ విభాగం తరఫున పూర్తి సహకారం ఉంటుందని సీపీ భరోసా ఇచ్చారు. చివరగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి మిషన్ హస్పటల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కమిషనరేట్లో ఘనంగా ప్లాగ్ డే -
వరంగల్
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025వాతావరణం జిల్లాలో ఉదయం చలిగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రజాచైతన్యానికి ‘వల్లంపట్ల’ కృషి వల్లంపట్ల నాగేశ్వర్రావు తన జీవితకాలమంతా ప్రజా చైతన్యం కోసం కృషి చేస్తున్నారని అంపశయ్య నవీన్ కొనియాడారు. దీపావళి సంబురంజిల్లాలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో కొందరు సోమవారం, మరికొందరు మంగళవారం వేడుకలు జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఇళ్లను మామిడి తోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. లక్ష్మీ పూజ, కేదారేశ్వర వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఇంటింటి దీపాలు వెలిగించారు. రాత్రి వేళ చిన్నాపెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా బాణసంచా కాల్చి సందడి చేశారు. –సాక్షి, నెట్వర్క్– మరిన్ని ఫొటోలు 9లోu -
యాజమాన్య పద్ధతులు పాటించాలి
● జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావుఖానాపురం: ఆయిల్పామ్ పంటలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు. మండల కేంద్రంలో ఆయిల్పామ్ పంటలను మంగళవారం ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5,950 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేస్తున్నట్లు తెలిపారు. సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు రోజూ పంటకు రైతులు నీళ్లు పెడుతున్నారని చెప్పారు. వేర్లు అడుగు భాగంలోనే ఉన్నందున అరగంట కంటే ఎక్కువగా నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. నత్రజని, పొటాష్, భాస్వరాన్ని విడతలుగా పదిపదిహేను రోజులకోసారి వేసుకోవాలని పేర్కొన్నారు. వీటితో పాటు ఒరాన్, మెగ్నీషియం సల్ఫేట్ను కొద్ది కొద్దిగా డ్రిప్ల ద్వారా పంటలకు అందజేస్తే మొక్క ఎదుగుదలతో పాటు నాణ్యమైన గెలలు వస్తాయని వివరించారు. రైతులు పంటల సాగులో ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తే సూచనలు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ బోగ శ్రీనివాస్, రైతులు గొల్లపూడి సుబ్బారావు, బొప్పిడి పూర్ణచందర్రావు, రాగం సాంబయ్య, వేముల వెంకటేశ్వర్రావు, పరుచూరి ద్విజేంద్ర, కోగంటి సత్యనారాయణ, పల్లెపాటి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సాస్కి’పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
● సమీక్షలో మేయర్, కమిషనర్వరంగల్ అర్బన్ : స్కీమ్స్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) పథకం అమలుకు నవంబర్ 30లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సాస్కి ప్రతిపాదనలపై ఇంజనీర్లతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సాస్కి పథకంపై అధికారులు వ్యూహాత్మక ప్రణాళికతో స్థలాలను గుర్తించి, తగిన డాక్యుమెంటేషన్తో అన్ని అంశాలను క్రోడీకరించి ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. నైబర్ హుడ్ ప్రణాళిక అంశంలో పాదచారులు నడిచే మార్గాలను అభివృద్ధి చేయడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. స్పాంజ్ సిటీ కాన్సెప్ట్లో భాగంగా నగరంలో స్పాంజ్ పార్క్ ఏర్పాటు చేయడం, అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. సిటీ గ్రీన్లో భాగంగా 50 ఎకరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం తో పాటు పురాతన బావులను పునరుద్ధరించే అంశాలను పొందుపరచాలని మేయర్ అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు రవికుమార్, మాధవీలత, డీఈ శివానంద్ పాల్గొన్నారు. -
శాసీ్త్రయ నృత్యంలో హర్షిణికి అవార్డు
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలికి చెందిన బీటెక్ విద్యార్థిని సిద్ధోజు హర్షిణి శాసీ్త్రయ నృత్యంలో కాకతీయ నంది అవార్డు అందుకున్నారు. రోజా క్రియేషన్స్ వారు నాట్య విపంచి పేరుతో ఆదివారం హనుమకొండలోని వీనస్ ఫంక్షన్హాల్లో కాకతీయ కళోత్సవాల శాసీ్త్రయ నృత్య పోటీలు నిర్వహించారు. ఈ పో టీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన హర్షిణికి నిర్వాహకులు కాకతీయ నంది అవార్డు ప్రకటించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అవార్డును ఆమెకు అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రోజా క్రియేషన్స్ డైరెక్టర్ శ్యాంసుందర్, వేయిస్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, నాట్య గురువు శ్రీవిద్య, హర్షిణి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సర్వేలో పాల్గొనండి న్యూశాయంపేట: తెలంగాణ రైజింగ్ –2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సర్వే ఈనెల 25వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. సర్వేలో భాగస్వామ్యం కావడానికి www.telangana.gov.in/ telanganarising వెబ్సైట్ను సందర్శించి తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రేపు జాబ్మేళా కాళోజీ సెంటర్: ములుగు రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో గురువారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.కల్పన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు శ్రీని అగ్రి ల్యాబ్లో 76 ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన సీ్త్ర, పురుషుల కోసం జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు వరంగల్, హనుమకొండ, కరీంనగర్లో పనిచేయాల్సి ఉంటుందని, రూ.15000 వేతనం, టీఏ, డీఏ రూ.3000 చెల్లిస్తారని తెలిపారు. ఉదయం 11 గంటలకు బయోడేటా, సర్టిఫికెట్ జిరాక్స్లతో హాజరుకావాలని, వివరాలకు 9121075429 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు. బైక్ దొంగల అరెస్ట్ గీసుకొండ: గ్రేటర్ వరంగల్ జాన్పాక రైల్వేగేట్ వద్ద పార్కు చేసిన బైక్ను అపహరించిన దొంగలను సోమవారం అరెస్టు చేసినట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్ల ప్రశాంత్ అనే వ్యక్తి తన బైక్ను రైల్వే గేటు వద్ద పార్కు చేసి పని మీద వెళ్లగా దొంగలు ఎత్తుకుని వెళ్లారు. గొర్రెకుంట క్రాస్రోడ్డు వద్ద ఎస్సై అనిల్కుమార్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా నంబర్ ప్లేటు లేని బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకుని విచారించగా తామే బైక్ దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిందితులు వరంగల్ చార్బౌళికి చెందిన పుల్లగోరు శాంతికుమార్, లేబర్కాలనీకి చెందిన భూక్యా వినయ్ను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ పేర్కొన్నారు. ద్విచక్రవాహనం దగ్ధం నెక్కొండ: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని ద్విచక్రవాహనం దగ్ధమైన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చంద్రుగొండ గ్రామానికి చెందిన బోనగిరి వీరస్వామి నెక్కొండ–నర్సంపేట ప్రధాన రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకులో రెండు లీటర్ల పెట్రోలు డబ్బాలో పోయించుకున్నాడు. అనంతరం తిరుగు ప్రయాణం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రమాదాన్ని గమనించిన వీరస్వామి బైక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. సదరు వాహనదారుడు సిగరెట్ కాల్చడం, డబ్బా నుంచి పెట్రోలు లీకవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం. -
జోరుగా.. మూడు ముక్కలాట
సాక్షి ప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: ప్రభుత్వం నిషేధించిన మూడు ముక్కలాట వరంగల్ పోలీస్ కమిషనరేట్లో జోరుగా సాగుతోంది. రాజకీయ నాయకులు ఇళ్లు, అపార్ట్మెంట్లు, పండ్లతోటలు అడ్డాలుగా ఏర్పాటుచేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, మహిళలు కూడా తామేం తక్కువ అన్నరీతిలో పేకాటలో మునిగి తేలుతున్నారు. ఏకంగా చట్ట సభలకు ప్రాతినిఽథ్యం వహించిన నేతలు సైతం పేకాడుతూ ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడడం గమనార్హం. స్థానిక పోలీసులకు సమాచారం కరువు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాగుతున్న పేకాట సమాచారం స్థానిక పోలీసులకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పేకాట, వ్యభిచారం, గుట్కా, సట్టా, మట్కా తదితర దందాల సమాచారం స్థానిక పోలీసులకు రాకుండా వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో కొనసాగుతున్న టాస్క్ఫోర్స్ పోలీసులకు వస్తుండడం గమనార్హం. దీనిని బట్టి స్థానిక పోలీసులు ఎన్ఫోర్స్మెంట్పై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు కొన్ని పోలీస్ స్టేషన్లలో భూముల పంచాయితీలు తప్ప మరే విషయాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ అధికారులు సైతం మొద్దు నిద్ర వహించడంతో స్థానిక పోలీసులు వారికి ఇష్టమైన అంశాల్లోనే పోలీసింగ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఖరీదైన అపార్ట్మెంట్లలో.. ఖరీదైన అపార్ట్మెంట్లలో పేకాట శిబిరాలు ఇటీవల ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. అపార్ట్మెంట్లలో ఎక్కువ కుటుంబాలు కిరాయికి ఉంటాయి. అందులో పేకాడేందుకు బంధువుల మాదిరిగా ఇంట్లోకి చేరుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి ఆట డబ్బులను ఖర్చులకు తీసి అందులోనుంచి మద్యం, మటన్తోపాటు అన్ని రకాల వంటలు చేసి మూడు ముక్కల ఆటను మజా చేస్తున్నారు. ఇలాంటి శిబిరాల్లో ఎక్కువగా మహిళలు పాల్గొంటున్నట్లు సమాచారం. ఇటీవల పట్టుబడిన మరికొన్ని ఘటనలు.. ● ఈనెల 10న ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి వరంగల్ చౌరస్తాలోని వినాయక గ్రాండ్ హోటల్లో పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీ సులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.27,940 నగదు, 9 సెల్ ఫోన్లు, 5 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ● సెప్టెంబర్ 19న ఎల్కతుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ మామిడి తోటలో పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారినుంచి రూ.15,110 నగదుతోపాటు, 4 సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ● సెప్టెంబర్ 15న కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కటకం సుధాకర్ షాపులో పేకాడు తూ ఏడుగురు పట్టుబడ్డారు. రూ.27,220 నగదు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● సెప్టెంబర్ 15న మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.7,070 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● సెప్టెంబర్ 10న మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడిచేసి ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారినుంచి రూ.7,330 నగదు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● గత నెల 9న కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల సమ్మిరెడ్డి పౌల్ట్రీఫాంలో శిబిరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసి, రూ.22,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.కమిషనరేట్ పరిధిలో రెచ్చిపోతున్న పేకాటరాయుళ్లు రూ.లక్షలు పెట్టి పత్తాలాట అపార్ట్మెంట్లు, ప్రముఖుల ఇళ్లు, పండ్ల తోటలే అడ్డాలు ‘టాస్క్ఫోర్స్’కు పట్టుబడుతున్న రాజకీయ ప్రముఖులు మహిళలు సైతం పట్టుబడుతున్న వైనం దృష్టి సారించని స్థానిక పోలీసులు ఈ నెల 20న : వరంగల్ సబ్ డివిజన్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట అడుతూ 13మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుడు దోనెపూడి రమేష్బాబు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ తదితరులు ఉన్నారు. వీరినుంచి రూ.3.68లక్షల నగదు, 11సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో కొనసాగుతున్న పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్రెడ్డితో పాటు 11 మంది పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. రూ.60,610 నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న : హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్ పరిధి శ్రీనివాస్ కాలనీలో నందికొండ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో పేకాడుతూ 11 మంది పట్టుబడ్డారు. ఇందులో ప్రముఖ వ్యాపారులతోపాటు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు భీరం సుధాకర్రెడ్డి పట్టుబడ్డారు. 30 ఏళ్ల యువతి కూడా ఉంది. వీరినుంచి రూ.1,27,650 నగదు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా.. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట జోరుగా సాగుతోంది. రాజకీయ నాయకుల ఇళ్లు అయితే పోలీసులు రారు అనే ధీమాతో పేకాట శిబిరాలుగా మారుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి పురుషులు, మహిళలు కలిసి మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలకు వెళ్లే పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నప్పటికీ చివరికి కేసులనుంచి తప్పించుకోలేకపోతున్నారు. -
నిర్వహణ భారంగా మారింది..
ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం చెల్లించే కమీషన్ రాకపోవడం, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ ఇవ్వకపోవడంతో దుకాణాల నిర్వహణ భారంగా మారింది. అప్పులు చేసి కుటుంబాలను పోసిస్తున్నాం. ఈ నెలలో పండుగలు వచ్చాయి. మా ఇబ్బందులు అర్థం చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే కమీషన్ చెల్లించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం డీలర్లకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. – గోరంట్ల వెంకట్నారాయణ, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నెక్కొండ మండల అధ్యక్షుడు కేంద్రానిది కపట ప్రేమ.. రేషన్ డీలర్లపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపడం సరికాదు. ఉచిత బియ్యం పంపిణీలో రేషన్ డీలర్లు క్షేత్రస్థాయిలో సేవలందించి ప్రభుత్వాలకు మంచి పేరు తెచ్చారు. అయినా డీలర్లకు అందాల్సిన కమీషన్ డబ్బుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ సెప్టెంబర్ నెలతో కలుపుకొని ఆరు నెలల కమీషన్ రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు నెలల కమీషన్ చెల్లించాల్సి ఉంది. – మోహన్నాయక్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ● కమిషనరేట్లో ఘనంగా ఫ్లాగ్ డేవరంగల్ క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుంచి ఇప్పటివరకు దేశంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్తోపాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఎన్పీడీసీల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కర్నల్ సచిన్ అన్నారావు, కర్నల్ రవి, డీసీపీ అంకిత్కుమార్, అదనపు డీసీపీలు సురేశ్కుమార్, ప్రభాకర్రావు, శ్రీనివాస్, బాలస్వామి, రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్రావుతోపాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆర్ఐ స్పర్జన్ సారథ్యంలో సాయుధ పోలీసులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలి పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహానుభావులని కొనియాడారు. పోలీసు అమరవీరుల చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. అమరుల కుటుంబాలను కాపాడుకోవాలన్నారు. చివరగా పోలీస్ కమిషనరేట్ నుంచి మిషన్ హాస్పిటల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. -
కమీషన్ రాదు.. కష్టాలు తీరవు
సాక్షి, వరంగల్/నెక్కొండ: రేషన్ బియ్యం పంపిణీ చేసి పేదల ఆకలి తీరుస్తున్న రేషన్ డీలర్లు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ రాకపోవడంతో షాపుల నిర్వహణకు వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం డీలర్లకు కేంద్రం నుంచి ఈ నెల అక్టోబర్తో కలుపుకుంటే ఆరు నెలల కమీషన్ పెండింగ్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్, అక్టోబర్ కమీషన్ రావాల్సి ఉంది. జూన్లో ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల బకాయిలకు తోడుగా మరో నాలుగు నెలల బకాయిలు చేరాయి. ఇలా మొత్తం కేంద్రం నుంచి ఏడు నెలల బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల ఏప్రిల్కు సంబంధించి కేంద్రం నుంచి కమీషన్ రేషన్ డీలర్ల ఖాతాలో పడింది. 509 రేషన్ దుకాణాలు.. 2,82,674 మంది లబ్ధిదారులు జిల్లాలో 509 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 2,82,674 మంది రేషన్కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెలా నర్సంపేట, ఏనుమాముల, వర్ధన్నపేట ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం ఆయా షాపులకు లారీల ద్వారా వెళ్తున్నాయి. ఇలా నెలకు 5,382.518 మెట్రిక్ టన్నులు రేషన్ కార్డుదారులకు అందిస్తున్నారు. సుమారుగా ఒక్కో దుకాణంలో 100 నుంచి 120 క్వింటాళ్ల బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. కిలోకు కేంద్రం నుంచి 90 పైసలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 పైసల కమీషన్ డీలర్లకు వస్తుంది. ఈ లెక్కన ఒక దుకాణానికి 100 క్వింటాళ్లు అనుకుంటే రూ.తొమ్మిది వేలు.. ఆరు నెలలకు సంబంధించి కేంద్రం నుంచి రూ.54,000 వరకు ఒక్కో డీలర్కు రావాల్సి ఉంది. అంటే ఆరు నెలలకు సుమారు రూ.2,74,86,000 కమిషన్ రూపంలో డీలర్ల ఖాతాలో జమ కావాల్సి ఉంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రూ.50,90,000 డీలర్లకు బకాయి ఉంది. రూ.3,25,76,000 మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా చేయాల్సి రావడంతో హమాలీ, లేబర్, ఇతర ఖర్చులు మూడింతలయ్యాయి. ఈ మొత్తం ఖర్చు బయట నుంచి అప్పోసప్పో చేసి సొంతంగా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు సర్దుబాటు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బకాయిలు తొందరగా విడుదల చేయాలని డీలర్లు కోరుతున్నారు. రూ.3.25 కోట్ల బకాయిల కోసం రేషన్ డీలర్ల ఎదురుచూపులు కేంద్రం ఆరు నెలలు, రాష్ట్రం రెండు నెలల పెండింగ్ దుకాణాల నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఆందోళన త్వరగా ఖాతాల్లో జమచేసి ఆదుకోవాలని డీలర్ల విజ్ఞప్తి -
మత్తు పదార్థాలపై నిఘా ఉంచాలి
● ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ ● గీసుకొండ పోలీస్స్టేషన్ తనిఖీ గీసుకొండ: పోలీసు అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సమర్థవంతంగా సేవలను అందించాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ (సాంగ్వార్) అన్నారు. మంగళవారం ఆయన గీసుకొండ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా పనిచేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సరిగా నిర్వహించాలని, నిషేధిత మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. మండలంలో దొంగతనాలు, ఈవ్ టీజింగ్, పబ్లిక్ న్యూసెన్స్ జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. టెక్ టీం పని తీరును పరిశీలించారు. పోలీసు సిబ్బందికి డ్యూటీ సమయంలో సరైన విశ్రాంతి, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, విధుల్లో ఉత్సాహాన్ని నింపే చర్యలు చేపట్టాలన్నారు. గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, రోహిత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కిక్కు రాలే.!
సాక్షి ప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తులు, ఆదాయం రెండింతలు వస్తుందనుకున్న ప్రభుత్వ లక్ష్యం ఈసారి నెరవేరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్కు 2023–25 టెండర్లలో 16,039 దరఖాస్తులతో రూ.318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–27కు శనివారం చివరి తేదీగా మొదట ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు 9,754 దరఖాస్తులతో 292.4 కోట్ల ఆదాయం లభించింది. కాగా, గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు, 28.16 కోట్ల ఆదాయం తగ్గింది. కాజీపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ వైన్స్కు అత్యధికంగా 114 దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మూడు వైన్స్లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. చివరి రోజు వరంగల్ అర్బన్లో 1,577, వరంగల్ రూరల్లో 910, జనగామలో 950, మహబూబాబాద్లో 735, భూపాలపల్లిలో 1,036 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు పెంపుదలే కారణం.. వైన్స్ దరఖాస్తులకు నాన్ రీఫండబుల్గా గత టెండర్లలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులు చేసేందుకు మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ముందుకురాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు.రూ.3 లక్షల నాన్ రీఫండ్ ఫీజుతో దరఖాస్తు చేసే బదులు రెండున్నర తులాల బంగారం కొనుగోళ్లకు మధ్య తరగతి కుటుంబాల వారు ఆసక్తి కనబరిచారు. రూ.320.7 కోట్ల టార్గెట్.. 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్కు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న టెండర్ల ప్రక్రియ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల చివరి తేదీ తొలుత నిర్ణయించారు. కాగా, అక్టోబర్ 18 చివరి రోజు వరకు కేవలం 9,754 దరఖాస్తులు, రూ.292.2 కోట్ల ఆదాయం వచ్చింది. గత టెండర్ల రూ. 320.7 కోట్ల ఆదాయ టార్గెట్ను దాటేందుకు ఈనెల 23 చివరి తేదీగా మరోఐదు రోజుల అవకాశం కల్పించింది. ఈనెల 27వ తేదీన లక్కీడ్రా తీయనున్నారు. కాగా, రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో దరఖాస్తుతో పాటు ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఖజానాకు ఆదాయం కిక్కు పొందేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది.జిల్లా వైన్స్ 2023–25 ఆదాయం 2025–27 ఆదాయం దరఖాస్తులు (రూ.కోట్లలో) దరఖాస్తులు (రూ.కోట్లలో) వరంగల్ అర్బన్ 67 5,859 117 3,012 90.3 వరంగల్ రూరల్ 57 2,938 58 1,826 54.7 జనగామ 50 2,492 49 1,587 47.6 మహబూబాబాద్ 61 2,589 51 1,672 50 .1 భూపాలపల్లి 59 2,161 43 1,657 49.7 మొత్తం 294 16,039 318 9,754 292.4వైన్స్ టెండర్ల గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఐదు రోజులు పొడిగించినా ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు ఉన్నాయి. కాగా, మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉంది. 294 షాపులకు 9,754 అర్జీలు, రూ.292 కోట్ల రెవెన్యూ టెండర్ల గడువు 23 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం -
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం. – ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు..
స్టేషన్ఘన్పూర్: పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి మీడియాలో ఏపీ ప్రభుత్వం పోలీసులతో సోదాలు, దాడులు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికారంగంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న దాడి అనాగరికం. పత్రికా స్వాతంత్య్రం అత్యంత కీలకం. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదు. – మంగు జయప్రకాశ్, టీఎస్ యూటీఎఫ్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్ -
వేయిస్తంభాల ఆలయంలో మాసశివరాత్రి పూజలు
హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో ఆదివారం మాసశివ రాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ ఉదయం ప్రభాతసేవ, ఉత్తిష్టగణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో శ్రీ రుద్రేశ్వరిదేవి, శ్రీ రుద్రేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి కళశ స్థాపన, బాసికధారణ, యజ్ఞోపవితధారణ, పాదప్రక్షాళణ, జీలకర బెల్లం, మాంగళ్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి శ్రీరుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. సిబ్బంది మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. హన్మకొండ : అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నక్కలగుట్టలోని మారుతి టవర్స్లో అసోసియేషన్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించి, నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెంటాల కేశవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా నడుముల విజయ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా తిరవరంగం ప్రభాకర్, కోశాధికారిగా రాజ్కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.కృపాకర్ రావు, డీ.వీ.ప్రసాద్, మర్రి రెడ్డి, జి.శ్రీనివాస్, వి.నరేందర్ రెడ్డి, బి.శివశంకర్, స్వరూప, జాయింట్ సెక్రటరీలుగా ఎం.జనార్దన్ రెడ్డి, పి.నరేందర్ రెడ్డి, కె.సత్యనారాయణ రెడ్డి, ఎం.శ్రీనివాసులు, డి.సారంగపాణి, కె.అశోక్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ, ఎస్.మాధవి, పద్మజతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
విజయానికి చిహ్నమే దీపావళి
చెడుపై మంచి సాధించిన విజయంతో ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. నరకాసుర ప్రతిమను దహనం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించిన రోజున ప్రజలందరు ఇంటింటా దీపాలు వెలిగించారని గుర్తుచేశారు. శ్రీరంగనాఽథుడి సన్నిధిలో రంగలీల మైదానంలో 100 ఏళ్లుగా దసరా ఉత్సవాలు, 20 ఏళ్లుగా నరకాసుర వధ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఉత్సవ కమిటీతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం నగర ప్రజలకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పల్లం పద్మ, పోశాల పద్మ, పలు శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథఽనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికై నా సాక్షిపై అక్రమంగా పెట్టిన కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి. – గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – గుగులోత్ భీమానాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో ప్రతిభ
హనుమకొండలో బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారులు దీపావళి పండుగను పురస్కరించుకుని వరంగల్, హనుమకొండ, కాజీపేటలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. కుండీలు, ప్లేట్లు, బాతులు, తాబేలు, దీపం, గిన్నెల వంటి ఆకృతుల్లో తయారైన సంప్రదాయ మట్టి ప్రమిదలతోపాటు బాణసంచా, పూలు,పండ్లను ప్రజలు కొనుగోలు చేశారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు సందడిగా మారాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండవిద్యారణ్యపురి : హైదరాబాద్లోని కూకట్పల్లి పీఎన్ఎం హైస్కూల్లో భారత్ వికాస్ పరిషత్ కమిటీ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయ బృంద గీతాల పోటీల్లో ఓరుగల్లు విద్యార్థులు ప్రతిభ చూపారు. తెలంగాణ రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో 30 పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా తెలుగు, జానపదం విభాగం (రూరల్) వరంగల్లోని నాగార్జున ప్రైమ్ స్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. విజేతలకు మెమోంటో, సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ ఎ.వెంకటేశ్వర్లు, బీవీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుధీర్కుమార్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, బాధ్యులు వెంకటరెడ్డి తదితరులు ఆదివారం అభినందించారు. -
ఉర్సు రంగలీల మైదానంలో నరకాసుర వధ
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం సాయంత్రం నరకాసుర వధ కనులపండువగా జరిగింది. కృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని బాణసంచాతో సంహరించే వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసింది. మైదాన పరిసరాల్లోకి వాహనాలు రాకుండా కిలోమీటర్ల దూరంలోనే నలువైపులా ప్రత్యేక పార్కింగ్ వసతి అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన ఘట్టంగా రథయాత్ర.. ఉర్సు ప్రతాప్నగర్ నుంచి ప్రత్యేక రథంపై కృష్ణుడు, సత్యభామ ఉత్సవ మూర్తులతోపాటు యువతులు ధనస్సు చేతబట్టి శ్రీకష్ణుడు, సత్యభామ వేషధారణతో వచ్చారు. కళాకారుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, భజనల నడుమ వారు రంగలీల మైదానానికి చేరుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి, సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల నరకాసుర ప్రతిమను మేయర్ గుండు సుధారాణి స్విచ్ ఆన్చేసి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పరికరంతో దహనం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు.. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కృష్ణుడు, సత్యభామ నాటకం, నృత్యాలు, పేరిణ, శివతాండం, కూచిపూడి నృత్యాలు విశేషంగా అలరించాయి. జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. భారీ బందోబస్తు.. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఏఎస్పీ శుభంప్రకాశ్ పర్యవేక్షణలో మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత, ఎస్సైలు, 100 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. 58 అడుగుల ప్రతిమను దహనం చేసిన మేయర్ సుధారాణి బాణసంచా మోతతో దద్దరిల్లిన ప్రాంగణం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
విజయానికి చిహ్నమే దీపావళి
చెడుపై మంచి సాధించిన విజయంతో ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. నరకాసుర ప్రతిమను దహనం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించిన రోజున ప్రజలందరు ఇంటింటా దీపాలు వెలిగించారని గుర్తుచేశారు. శ్రీరంగనాఽథుడి సన్నిధిలో రంగలీల మైదానంలో 100 ఏళ్లుగా దసరా ఉత్సవాలు, 20 ఏళ్లుగా నరకాసుర వధ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఉత్సవ కమిటీతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం నగర ప్రజలకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పల్లం పద్మ, పోశాల పద్మ, పలు శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
న్యూశాయంపేట: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ సత్యశారద జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి జరుపుకుంటామన్నారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖశాంతులతో పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాక్షించారు. వికసించిన బ్రహ్మకమలంనర్సంపేట: హిందు సంస్కృతిలో బ్రహ్మకమలం మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. బ్రహ్మకలాలను శివుడికి సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పట్టణంలోని ఎర్ర జగన్మోహన్రెడ్డిఊర్మిళ దంపతుల ఇంట్లో బ్రహ్మ కమలం ఆదివారం రాత్రి వికసించింది. దీంతో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ నర్సంపేట: పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం భక్తి శ్రద్ధల నడుమ పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు దేవేష్మిశ్రా బృందం ఆధ్వర్యంలో కట్కూరి స్వప్నరాంరెడ్డి కుటుంబ సభ్యులు పడిపూజలో పాల్గొని పూజలు చేశారు. అయ్యప్పస్వామిని గురుస్వాములతో అలంకరణ చేసి పసుపు, కుంకుమ, పుష్పాలు, పాలకాయ సమర్పించారు. పంచలోహ విగ్రహాన్ని శిరస్సుపై ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పాలు, పెరుగు, తేనె, పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో శింగిరికొండ మాధవశంకర్, సైఫా సురేష్, దొడ్డ రవీందర్, బండారుపల్లి చెంచారావు, ఇరుకుళ్ల వీరలింగం, పాలకుర్తి శ్రీనివాస్, అనంతుల రాంనారాయణ, మల్యాల రాజు, దొడ్డ వేణు, తదితరులు పాల్గొన్నారు. పాకాలలో పర్యాటకుల సందడిఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు. పాకాల అందాలను వీక్షించి లీకేజీ నీటిలో, పార్కులో సరదాగా గడిపారు. బోటింగ్ చేస్తూ సందడి చేశారు. కష్టపడిన వారికే పదవులు నర్సంపేట: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తకే పదవులు లభిస్తాయని ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోత్ పట్నాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని సిటిజన్ క్లబ్లో ఆదివారం డీసీసీ ఎన్నిక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వారు డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తుంటారన్నారు. జిల్లా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేది డీసీసీలేనన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకుంటే అధిష్టానం పరిశీలిస్తుందన్నారు. ప్రతీఒక్కరూ సమన్వయంతో పని చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ముందుగా నర్సంపేట క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు, ఎమ్మెల్యే మాధవరెడ్డి సమావేశమయ్యారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ పరిశీలకులు రేణుక, ఆదర్శ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథఽనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికై నా సాక్షిపై అక్రమంగా పెట్టిన కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి. –గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి -
కిక్కు రాలే..!
సాక్షి ప్రతినిధి,వరంగల్/కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తులు, ఆదాయం రెండింతలు వస్తుందనుకున్న ప్రభుత్వ లక్ష్యం ఈసారి నెరవేరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్కు 2023–25 టెండర్లలో 16,039 దరఖాస్తులతో 318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–27కు శనివారం చివరి తేదీగా మొదట ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు 9,754 దరఖాస్తులతో 292.4 కోట్ల ఆదాయం లభించింది. కాగా, గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు, 28.16 కోట్ల ఆదాయం తగ్గింది. కాజీపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ వైన్స్కు అత్యధికంగా 114 దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మూడు వైన్స్లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. చివరి రోజు వరంగల్ అర్బన్లో 1,577, వరంగల్ రూరల్లో 910, జనగామలో 950, మహబూబాబాద్లో 735, భూపాలపల్లిలో 1,036 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు పెంపుదలే కారణం.. వైన్స్ దరఖాస్తులకు నాన్ రీఫండబుల్గా గత టెండర్లలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులు చేసేందుకు మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ముందుకురాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు.రూ.3 లక్షల నాన్ రీఫండ్ ఫీజుతో దరఖాస్తు చేసే బదులు రెండున్నర తులాల బంగారం కొనుగోళ్లకు మధ్య తరగతి కుటుంబాల వారు ఆసక్తి కనబరిచారు. రూ.320.7 కోట్ల టార్గెట్.. 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్కు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న టెండర్ల ప్రక్రియ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల చివరి తేదీ తొలుత నిర్ణయించారు. కాగా, అక్టోబర్ 18 చివరి రోజు వరకు కేవలం 9,754 దరఖాస్తులు, రూ.292.2 కోట్ల ఆదాయం వచ్చింది. గత టెండర్ల రూ. 320.7 కోట్ల ఆదాయ టార్గెట్ను దాటేందుకు ఈనెల 23 చివరి తేదీగా మరోఐదు రోజుల అవకాశం కల్పించింది. ఈనెల 27వ తేదీన లక్కీడ్రా తీయనున్నారు. కాగా, రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో దరఖాస్తుతో పాటు ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఖజానాకు ఆదాయం కిక్కు పొందేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఉమ్మడి జిల్లాలో తగ్గిన వైన్స్ దరఖాస్తుల ఆదాయం 294 షాపులకు 9,754 అర్జీలు, రూ.292 కోట్ల రెవెన్యూ టెండర్ల గడువు 23 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వందరఖాస్తుల స్వీకరణ మూడు రోజులే.. వైన్స్ టెండర్ల గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఐదు రోజులు పొడిగించినా ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు ఉన్నాయి. కాగా, మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉంది. -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు..
స్టేషన్ఘన్పూర్: పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి మీడియాలో ఏపీ ప్రభుత్వం పోలీసులతో సోదాలు, దాడులు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికారంగంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న దాడి అనాగరికం. పత్రికా స్వాతంత్య్రం అత్యంత కీలకం. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదు. – మంగు జయప్రకాశ్, టీఎస్ యూటీఎఫ్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్ -
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం. – ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి -
ఉర్సు రంగలీల మైదానంలో నరకాసుర వధ
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం సాయంత్రం నరకాసుర వధ కనులపండువగా జరిగింది. కృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని బాణసంచాతో సంహరించిన వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసింది. మైదాన పరిసరాల్లోకి వాహనాలు రాకుండా కిలోమీటర్ల దూరంలోనే నలువైపులా ప్రత్యేక పార్కింగ్ వసతి అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన ఘట్టంగా రథయాత్ర.. ఉర్సు ప్రతాప్నగర్ నుంచి ప్రత్యేక రథంపై కృష్ణుడు, సత్యభామ ఉత్సవ మూర్తులతోపాటు యువతులు ధనస్సు చేతబట్టి శ్రీకష్ణుడు, సత్యభామ వేషధారణతో వచ్చారు. కళాకారుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, భజనల నడుమ వారు రంగలీల మైదానానికి చేరుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి, సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల నరకాసుర ప్రతిమను మేయర్ గుండు సుధారాణి స్విచ్ ఆన్చేసి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పరికరంతో దహనం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు.. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కృష్ణుడు, సత్యభామ నాటకం, నృత్యాలు, పేరిణ, శివతాండం, కూచిపూడి నృత్యాలు విశేషంగా అలరించాయి. జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. భారీ బందోబస్తు.. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఏఎస్పీ శుభంప్రకాశ్ పర్యవేక్షణలో మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత, ఎస్సైలు, 100 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. 58 అడుగుల ప్రతిమను దహనం చేసిన మేయర్ సుధారాణి బాణసంచా మోతతో దద్దరిల్లిన ప్రాంగణం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించాలి.. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే న్యాయం పోరాటం చేయాలి. బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛ హరించడమే. ఏపీ ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – ఆడెపు రవీందర్, అధ్యక్షుడు దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం, వరంగల్వేధింపులు మానుకోవాలి.. నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – గుగులోత్ భీమానాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు సరికాదు తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో వైద్య, ఆరోగ్యశాఖ, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల లభ్యత, వైద్యుల హజరు, పరీక్ష పరికరాల వినియోగం, మాతాశిశు సంరక్షణ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ సర్వే నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సిజేరియన్లు కాకుండా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. ప్రైవేట్ డాక్టర్లు విధిగా సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలన్నారు. సీజనల్ వ్యాధులు మలేరియా, పైలేరియా డెంగీ, చికున్గున్యా, మెదడువాపు వ్యాధులను చికిత్స అందించాలని కోరారు. వ్యాధి గ్రస్తుల సమీపంలో ఉన్న వారిని స్క్రీనింగ్ చేసి వ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి. సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగాం అధికారులు రవీందర్, ఆచార్య, విజయ్కుమార్, మోహన్సింగ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు నరకాసుర వధ
సాక్షి, వరంగల్ /ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం నరకాసుర వధ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాలతో డీసీపీలు, ఏసీపీ శుభం ప్రకాశ్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నా యి. ప్రత్యేకంగా వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పా టు చేశారు. అధికారుల సహకారంతో చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ శుభం ప్రకాశ్, ఉత్సవకమిటీ అధ్యక్షుడు మరుపల్లి రవి, ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఏఈ సుకృత, తహసీల్దార్ ఇక్బాల్, ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ పరిశీలించారు. 23 ఏళ్లుగా.. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో గత 23 ఏళ్లుగా నరకాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం కరీమాబాద్ ఉర్సు ప్రతాప్నగర్ నుంచి శ్రీకృష్ణ సత్యభామ ఉత్సవ మూర్తులు, పిల్లల వేషధారణతో భారీ ఊరేగింపుతో రంగలీల మైదానానికి చేరుకుంటారు. అక్కడే శ్రీకృష్ణ, సత్యభామ డిజిటల్ బొమ్మలను ఏర్పాటు చేయగా.. బాణసంచాతో కాల్చే పక్రియను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఈఏడాది 58 అడుగుల నరకాసుర ప్రతిమను సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6గంటలకు వేదికపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రాత్రి 8గంటలకు నరకాసుర ప్రతిమను మంత్రి కొండా సురేఖ స్విచ్ ఆన్చేయగానే శక్తివంతమైన బాణసంచాతో దహనమవుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు.. నరకాసుర ప్రతిమ దహనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాలప్రకారం వేదిక, బారీకేడ్లు నాలుగు వైపులా పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపడుతున్నాం. – శుభం ప్రకాశ్ ఏఎస్పీ, వరంగల్ వరంగల్ రంగలీల మైదానంలో 58 అడుగుల ప్రతిమ ఏర్పాటు సాయంత్రం 6 గంటల నుంచి వేదికపై సాంస్కృతిక కార్యక్ర మాలు మంత్రి సురేఖ చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి దహనం -
బీసీ జేఏసీ బంద్ సక్సెస్
వరంగల్ చౌరస్తా: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చి పిలుపుమేరకు శనివారం జిల్లాలో బంద్ విజయవంతమైంది. వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో బీసీ, ప్రజాసంఘాలు, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ర్యాలీలు, నినాదాలతో హోరెత్తించారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్, రహదారులు, కూడళ్లు బోసిపోయి కనిపించాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా : బీజేపీ బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ స్పష్టం చేశారు. వరంగలో జరిగిన బంద్లో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బీసీలపై రేవంత్రెడ్డి సర్కారుది కపట ప్రేమ అని విమర్శించారు. నాడు జయలలిత తమిళనాడులో 9వ షెడ్యూల్ ప్రకారం 58% శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. బంద్కు బీజేపీ మద్దతు సిగ్గుచేటు : వామపక్షాలు బీసీ జేఏసీ బంద్కు బీజేపీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని వామపక్షాల నాయకులు విమర్శించారు. వరంగల్ హెడ్పోస్టాఫీస్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పార్టీలు ద్వంద్వ విధానాలను విడనాడాలని ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి, రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు. తెగించి పోరాడుదాం.. బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి పోరాడుదామని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా వరంగల్ శివనగర్లోని తమ్మెర భవన్ నుంచి సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరి అండర్ బ్రిడ్జి రోడ్డు, స్టేషన్ రోడ్డు, పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి నాయకులు మేకల రవి, పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, గన్నారపు రమేశ్, నేతలు పాల్గొన్నారు. సీపీఎం నాయకుల ప్రదర్శన.. సీపీఎం నాయకులు వరంగల్ పోస్టాఫీస్ సెంటర్ నుంచి వరంగల్ చౌరస్తా, బట్టలబజార్, బీట్ బజారులో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అరూరి రమేశ్, జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకమాడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల ర్యాలీ.. వరంగల్ ఎంజీఎం, పోచమ్మమైదాన్, మండిబజారు, ఆర్ఎన్టీ రోడ్డు, వరంగల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు రాజనాల శ్రీహరి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణా వ్యవస్థ స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల మూసివేత కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకుల ర్యాలీలు, రాస్తారోకోలునర్సంపేట : పట్టణంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్ష, టీజేఎస్, పలు కుల సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. చెన్నారావుపేట : బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. దుగ్గొండి : గిర్నిబావిలోని నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నల్లబెల్లి : తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. మండల కేంద్రంలో కాంగ్రెస్, బీసీ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఖానాపురం : బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయాన్ని మూసివేశారు. కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. నెక్కొండ : రాజకీయ, కుల, యువజన సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు వేర్వేరుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. రాయపర్తి : మండల కేంద్రంలోని దుకాణాలను రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు మూసివేయించారు. వర్ధన్నపేట : పట్టణంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. పర్వతగిరి : కిరాణాషాపులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేశారు. సంగెం : మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు బంద్లో పాల్గొన్నారు. గీసుకొండ : స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పలు పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహించారు. -
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినులు
నల్లబెల్లి: రాష్ట్రస్థాయి అండర్–19 రెజ్లింగ్ పోటీలకు నల్లబెల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థినులు ఎంపికై నట్లు ఎస్ఓ సునీత తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను పీఈటీ సుజాత, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థినులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 17న హన్మకొండ జేఎన్ఎస్లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అజ్మీరా మానస, పెంట అర్చన ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరు ఈ నెల 21 నుంచి 23 వరకు హైదరాబాద్లో జరుగనున్న పోటీల్లో పాల్గొంటారు. వాలీబాల్ పోటీల్లో సిల్వర్ మెడల్ రాయపర్తి: రాష్ట్రస్థాయి అండర్–17 వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ద్వితీయస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు కోచ్ పుట్ట సమ్మయ్య తెలిపారు. పటాన్చెరులో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ క్రీడల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఫైనల్లో ఖమ్మం జట్టుతో పోరాడి ద్వితీయస్థానంలో నిలిచినట్లు చెప్పారు. -
గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాయపర్తి: గ్రామాల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్డీఓ రాంరెడ్డి తెలిపారు. మండలంలోని మైలారం, జగన్నాథపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన స్థలాన్ని ఏడీఆర్డీఓ రేణుకాదేవితో కలిసి శనివారం పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల కోసం స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, మండల అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో డీపీఎం దాసు, ఏపీఎం రవీందర్, సీసీలు స్వామి, సుధాకర్, ఎంఎస్ అధ్యక్షురాలు నీరజ, వీఓఏ నాగమణి, చందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ నల్లబెల్లి: హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ తెలిపారు. పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై గోవర్ధన్తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 15న రాత్రి కొండాపూర్ గ్రామానికి చెందిన మేరుగుర్తి రమేశ్ ఇంటి జాగ పంచి ఇవ్వాలని తల్లి సమ్మక్కతో వాదనకు దిగాడు. అదే సమయంలో తమ్ముడు సురేశ్ అప్పుగా ఇచ్చిన రూ.10 వేలు అన్న ఇవ్వడం లేదు. పైగా అమ్మతో గొడవెందుకు పడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అన్నదమ్ముల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన సురేశ్ కత్తితో రమేశ్పై దాడి చేస్తుండగా.. రమేశ్ భార్య స్వరూప అడ్డుకుంది. దీంతో ఆమైపె కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. గాయపడిన రమేశ్, స్వరూపను స్థానికులు 108 వాహనంలో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప అదే రోజు రాత్రి మృతి చెందగా రమేశ్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సురేశ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. చేసిన నేరాన్ని అంగీకరించడంతో శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. పందెం కోళ్ల అపహరణ ఖానాపురం: మండలంలోని పెద్దమ్మగడ్డలో పందెం కోళ్లను అపహరించుకెళ్లిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచం వెంకన్న ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆగంతకులు బయట తలుపులు బిగించారు. ఇంటి ఆవరణలో ఉన్న రూ.20 వేల విలువ చేసే 6 పందెం కోళ్లను దొంగిలించారు. తెల్లవారిన తర్వాత వెంకన్న ఇంటి తలుపులు తీయగా రాలేదు. చుట్టుపక్కల వారి సహకారంతో బయటకు వచ్చి చూడగా కోళ్లు దొంగతనం చేసినట్లు గుర్తించాడు. ఇటీవల వల్లెపు ఎల్లయ్య ఇంట్లోనూ పందెం కోళ్లను చోరీ చేశారు. దొంగతనంపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వెంకన్న తెలిపాడు. -
బీసీ బంద్ సక్సెస్
వాటా కోసం పిడికిలెత్తిన సకల జనులుప్రజలు రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తే పాలకవర్గాలకు ప్రమాదకరం ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తే అది పాలకవర్గాలకు ప్రమాదకరం. కాంగ్రెస్ ద్రోహం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పించాయి. మేమెంతో మాకంత వాటా కల్పించాల్సిందే. –మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించం బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేదిలేదు. బీసీలకు రిజర్వేషన్ల కల్పించాలనే ఆలోచన సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్యానికి అద్దంపట్టే నిర్ణయం. – ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిబీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లకు మద్దతు పలుకుతున్న పార్టీలు పార్టీ పదవుల్లో 50 శాతం పదవులు ఇవ్వాలి. అప్పుడే పార్టీల నిజాయితీ, చిత్తశుద్దిని నమ్ముతాం. – ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్హన్మకొండ: హనుమకొండ జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది. శనివారం జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీలు రోడ్డెక్కారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ర్యాలీలు తీయడంతో పోరు హోరెత్తింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు వేకువజామునే ఆర్టీసీ జిల్లా బస్స్టేషన్కు చేరుకున్నారు. వరంగల్–1 డిపో గేట్లో బైఠాయించి బస్సులు అడ్డుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో బంద్ ప్రశాంతంగా సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేశాయి. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు వరంగల్ మహానగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ కూడలి నుంచి ములుగు క్రాస్ రోడ్డులోని జ్యోతిబా పూలే విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహంనుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు హనుమకొండ జిల్లా బస్స్టేషన్కు చేరుకుని బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, దొడ్డిపల్లి రఘుపతి, బొనగాని యాదగిరిగౌడ్, తమ్మెల శోభారాణి, మూగల కుమార్ యాదవ్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు చింతం సదానందం, శోధన్, పులి రజనీకాంత్, పోలెపల్లి రామ్మూర్తి, ముత్తిక రాజు, శ్రీధర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, నాయకులు తోట వెంకటేశ్వర్లు, రవీందర్, పోతుల శ్రీమాన్, విజయశ్రీ, పల్లకొండ సతీశ్, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలాల్లో ఇలా.. ఎల్కతుర్తి: ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో శనివారం బంద్ సంపూర్ణంగా కొనసాగింది. ఎల్కతుర్తి వామపక్ష పార్టీల నాయకులు బస్టాండ్ నుంచి సమీప కూడలి ప్రాంతం వరకు బైక్ ర్యాలీలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, చిరువ్యారులు, పలు షాపుల యజమానులు తమ తమ షాపులు మూసివేసి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఐనవోలు: మండలంలోని పున్నేలు క్రాస్ వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ తక్కళ్లపెల్లి చందర్రావు, నాయకులు ఉస్మాన్ అలీ, పల్లకొండ సురేష్, మిద్దెపాక రవీందర్, దుప్పెల్లి కొంరయ్య, దేవదాసు, రామారావు, రాజు, సుదర్శన్, ప్రభాకర్, రాములు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకులు. మండల కేంద్రంలోని పలు దుకాణాలతో పాటు బీఓబీ బ్యాంకును మూసి వేయించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో కాడబోయిన లింగయ్య, మడిగె నాగరాజు మహేందర్, నారాయణరెడ్డి, ఉప్పలయ్య, యాకూబ్, నాగరాజు, రాంకుమార్, రాజేశ్వర్రావు, చిన్న రాజు, రాజు, నర్సయ్య, గోపాల్, యాకయ్య, రాజిరెడ్డి పాల్గొన్నారు. దామెర/వేలేరు/ఆత్మకూరు: దామెర, వేలేరు, ఆత్మకూరు మండలకేంద్రాలతో పాటు పలుగ్రామాల్లో బీసీ బంద్ విజయవంతమైంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించడంతో బంద్ శాంతియుత వాతావరణంలో కొనసాగింది. కమలాపూర్ : కమలాపూర్లో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక బస్టాండ్ కూడలి వద్ద హుజూరాబాద్–పరకాల ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇన్స్పెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఈ బంద్లో బీసీ సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పరకాల: పరకాలలో విద్యాసంస్థలకు యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. దుకాణాల మూసివేతతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ పి.కాళీప్రసాద్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సిరంగి సంతోష్కుమార్, కాంగ్రెస్ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు బండి సారంగపాణి పాల్గొన్నారు. నడికూడ : మండలంలోని పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బీసీ బంద్ ఫొటోలు మరిన్ని : 9లో గ్రేటర్లో వ్యాపార, వాణిజ్య సంస్థల మూసివేత డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు బీసీ సంఘాలు, వివిధ పార్టీల ర్యాలీలు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ కేంద్రం మెడలు వంచైనా.. బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి శనివారం చేపట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ విజయవంతమైంది. సకలజనుల సమ్మె తరహాలో బీసీ సమాజమంతా రోడ్లపైకి వచ్చి బంద్ సక్సెస్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధం అవుతాయి. తెలంగాణలోని బీజేపీ నాయకత్వం ప్రధాని ఒప్పించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలాకృషి చేయాలి. సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి తాడోపేడో తేల్చుకోవాలన్నారు. కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తాం. బంద్కు సహకరించిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు. – బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధరప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్వర్క్కక్షసాధింపు చర్యలు మానుకోవాలి నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. – ఎం.వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు కేసుల నమోదు సరికాదు ములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – పోలురాజు, టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు దాడులు ఖండిస్తున్నాం.. జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కారు తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. –పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్, రాష్ట్ర నాయకుడు, జనగామ ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిదికాదు సాక్షి దినపత్రిక, ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్


