breaking news
Warangal District Latest News
-
22న దివ్యాంగుల ఉద్యోగాలకు ప్రత్యేక స్క్రీనింగ్
కాశిబుగ్గ: జిల్లాలోని నిరుద్యోగ దివ్యాంగుల ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరం ఈనెల 22న ములుగు రోడ్డులోని ఐటీఐ క్యాంపస్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ బి.సాత్విక మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగ యువతను గుర్తించి, వారి నైపుణ్యాలను అంచనా వేసి, ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ప్రముఖ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగి, పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు అర్హులన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు బయోడేటా, సదరం సర్టిఫికెట్, ఆధార్, పాన్కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు, రెండు పాస్ఫోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 733063 7711, 9281408587 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఇంటర్ విద్యలో ఆధునిక బోధన కాళోజీ సెంటర్: ప్రస్తుత సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ సిలబస్ను మార్చినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంగళవారం అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ జనరల్ విభాగంలో చదివే విద్యార్థుల కోసం తెలుగు ద్వితీయ భాషా పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నూతన శైలిలో రూపొందించారని, సమకాలీన అంశాలు, నైతిక విలువలు, సృజనాత్మకత పెంపొందించేలా నూతన పాఠ్యాంశాలను చేర్చారన్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కృత్రిమ మేథ(ఏఐ) డిజిటల్ తరగతుల ద్వారా బోధన అందించేందుకు ప్రణాళిక ఉందన్నారు. అధ్యాపకులు మూల్యాంకనం, అభ్యసన మార్కుల విభజన తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్రావు, మాధవరావు, పరశురాం, శ్రీదేవి, అధ్యాపకులు, రిసోర్స్పర్సన్స్ పాల్గొన్నారు. ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలి గీసుకొండ: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశ నోడల్ సూపర్వైజర్లు, ఎంసీహెచ్ సూపర్వైజర్ల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీ గర్భిణీకి కనీసం నాలుగు సార్లు ఏఎన్సీ చెకప్లు జరిగేలా చూడాలన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారికి సత్వర వైద్యసేవలు అందించాలన్నారు. మాతాశిశు ఆరోగ్యంపై వైద్య అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. డీఐఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సజిదా, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఎస్ఓ ప్రసన్నకుమార్, డీపీహెచ్ఎన్ మనోజ్, డీపీఓ అర్చన తదితరులు పాల్గొన్నారు. డీఎంఓగా నాగరాజు బాధ్యతల స్వీకరణఖిలా వరంగల్: వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారిగా నాగరాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డీఎంఓ కలకోట్ల సురేఖ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మెదక్ జిల్లా డీఎంఓ నాగరాజును ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టి కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్తో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
వరంగల్
బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026పాకాల సరస్సు నుంచి సాగునీరు అందించాలిరాఖీ బంధానికి తపాలా తోడు దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు రాఖీలు పంపించే వారికి తపాలా శాఖ ప్రత్యేక రాయితీ ప్రకటించింది.ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్, గురుకుల డిగ్రీకళాశాలలు 241పీజీ కళాశాలలు 62ఫార్మసీ 24ఇంజనీరింగ్ 06బీఈడీ 43ఫిజికల్ ఎడ్యుకేషన్ 03ఎంసీఏ 10ఎంబీఏ 22 హోటల్ మేనేజ్మెంట్ 03లా 04 కేయూ పరిధిలోని కొత్తగూడెం ఇంజ నీరింగ్ కళాశాలను డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీగా మార్చారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవ శోభ సంతరించుకుంది. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ లక్షాలాది మంది విద్యార్థులను అక్షర దివిటీలుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఈ యూనివర్సిటీది. సామాజిక ఉద్యమాలు, పోరాటాల గడ్డగా పేరొందింది. బుధవారంతో యూనివర్సిటీ 50 వసంతాలు పూర్తి చేసుకొని (గోల్డెన్ జూబ్లీ) 51 వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రస్థానంతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం. కేయూ తొలుత పీజీ సెంటర్గా తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్గా 1968లో మొదలైంది. నాడు పోరాటాల ఫలితంగానే 1976, ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ 50 వసంతాల్లో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి వివిధ రంగాల్లో, దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడే ఆచార్యులు అయినవారూ ఉన్నా రు. మొదట కేయూ నాలుగు విభాగాలతో మొదలై నాడు రేకుల షెడ్లలోనే విద్య కొనసాగింది. అంచెలంచెలుగా ఎదిగి 29 విభాగాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం కేయూలోని అన్ని కాలేజీల్లో 1.20 లక్షలమందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. కేయూలో వివిధ సెంటర్లు కాకతీయ యూనివర్సిటీలో అంబేడ్కర్ స్టడీస్ సెంటర్, స్టూడెంట్ వెల్ఫేర్, ఎస్సీ, ఎీస్టీ సెల్, బీసీసెల్, దివ్యాంగసెల్, మహిళా అధ్యయన కేంద్రం, యోగా సెంటర్ ఉన్నాయి. వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యతోపాటు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డిగ్రీ, జూనియర్, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా అందులో 36వేల మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఉన్నారు. రక్తదానంలో అనేక అవార్డులు పొందింది. స్పోర్ట్స్బోర్డు కూడా ఉంది. ప్రతీఏటా సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీల వివిధ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారు. నిధులు మంజూరుపై ఆశలు యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటు న్న వేళ.. మౌలిక సదుపాయల కల్పనకు రూ.400 కోట్ల నిధుల కోసం వీసీ ప్రతాప్రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆనిధులు మంజూరు చేస్తే యూనివర్సిటీలో గోల్డెన్ జూబ్లీ, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు తొలుత ఓయూ పీజీ సెంటర్గా ఆ తరువాత కేయూ నాలుగు విభాగాలతో మొదలై నేడు 29 విభాగాలు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.400కోట్లతో ప్రతిపాదనలుకేయూ పరిధిలోని కాలేజీలుకాకతీయ యూనివర్సిటీకి 50 వసంతాలు పూర్తి కేయూలో 332 అధ్యాపక పోస్టులు ఖాళీ బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ?స్వర్ణోత్సవం భవిష్యత్కు బలమైన పునాది కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టుకింద రూ.60కోట్ల నిధులు రాగా, రూ.35కోట్లతో 42పరిశోధన ప్రాజెక్టులు, రూ.15కోట్లతో కెహబ్ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి అండర్గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు పూర్తయింది. అకడమిక్ బ్లాక్లు, వర్క్షాప్లు,సెమినార్ హాల్స్, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400లకోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి -
21న అథ్లెటిక్స్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యుగేంధర్రెడ్డి మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్ఎస్లో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమోతో హాజరుకావాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు 9866564422, 9000354465 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్, గురుకుల డిగ్రీ కళాశాలలు 241పీజీ కళాశాలలు 62ఫార్మసీ 24ఇంజనీరింగ్ 06బీఈడీ 43ఫిజికల్ ఎడ్యుకేషన్ 03ఎంసీఏ 10ఎంబీఏ 22 హోటల్ మేనేజ్మెంట్ 03లా 04 కేయూ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలను మన్మోహన్సింగ్ ఎర్త్ వర్సిటీగా మార్చారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవ శోభ సంతరించుకుంది. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ లక్షలాది మంది విద్యార్థులను అక్షర దివిటీలుగా తీర్చిదిద్దిన ఘనచరిత్ర ఈ యూనివర్సిటీది. సామాజిక ఉద్యమాలు, పోరాటాల గడ్డగా పేరొందింది. బుధవారంతో యూనివర్సిటీ 50 వసంతాలు (గోల్డెన్ జూబ్లీ) పూర్తి చేసుకొని 51వ వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రస్థానంతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం. కేయూ తొలుత పీజీ సెంటర్గా తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్గా 1968లో మొదలైంది. నాడు పోరాటాల ఫలితంగానే 1976 ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ 50 వసంతాల్లో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి వివిధ రంగాల్లో, దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడే ఆచార్యులు అయినవారూ ఉన్నా రు. మొదట కేయూ నాలుగు విభాగాలతో మొదలై నాడు రేకుల షెడ్లలోనే విద్య కొనసాగింది. అంచ లంచెలుగా ఎదిగి 29 విభాగాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం యూనివర్సిటీలోని అన్ని కాలేజీల్లో 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కేయూలో వివిధ సెంటర్లు కాకతీయ యూనివర్సిటీలో అంబేడ్కర్ స్టడీస్ సెంటర్, స్టూడెంట్ వెల్ఫేర్, ఎస్సీ, ఎీస్టీ సెల్, బీసీసెల్, దివ్యాంగసెల్, మహిళా అధ్యయన కేంద్రం, యోగా సెంటర్ ఉన్నాయి. వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యతోపాటు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డిగ్రీ, జూనియర్, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా అందులో 36వేల మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఉన్నారు. రక్తదానంలో అనేక అవార్డులు పొందింది. స్పోర్ట్స్బోర్డు కూడా ఉంది. ప్రతీఏటా సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీల వివిధ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారు. నిధుల మంజూరుపై ఆశలు యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటు న్న వేళ.. మౌలిక సదుపాయల కల్పనకు రూ.400 కోట్ల నిధుల కోసం వీసీ ప్రతాప్రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆనిధులు మంజూరు చేస్తే యూనివర్సిటీలో గోల్డెన్జూబ్లీ, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. కేయూ పరిధిలోని కాలేజీలు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు తొలుత ఓయూ పీజీ సెంటర్గా ఆ తర్వాత కేయూ నాలుగు విభాగాలతో మొదలై నేడు 29 విభాగాలు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.400 కోట్లతో ప్రతిపాదనలుకాకతీయ యూనివర్సిటీకి 50 వసంతాలు పూర్తి కేయూలో 332 అధ్యాపక పోస్టులు ఖాళీ బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ?స్వర్ణోత్సవం భవిష్యత్కు బలమైన పునాది కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టు కింద రూ.60 కోట్ల నిధులు రాగా, రూ.35 కోట్లతో 42 పరిశోధన ప్రాజెక్టులు, రూ.15 కోట్లతో కెహబ్ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి అండర్గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు పూర్తయ్యింది. అకడమిక్ బ్లాక్లు, వర్క్షాప్లు,సెమినార్ హాల్స్, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి -
నర్సంపేట అటెన్షన్
సాక్షి, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద దుమారం చెలరేగింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మరణం అనంతరం పట్టణంలోని జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ఎదురుగా ప్రతిష్ఠించిన విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం అర్ధరాత్రి తొలగించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం విగ్రహ తొలగింపు వార్త నియోజకవర్గంలోని నర్సంపేట, దు గ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలకు తెలియడంతో చాలా చోట్ల ముందుగానే ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు అన్ని వైపులా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసి పోలీసు పహారా పెంచారు. ముఖ్యంగా పెద్ది సుదర్శన్రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లి మండలంలో ఖాకీలమయం కావడంతో అందరి దృష్టి న ర్సంపేట వైపు అటెన్షన్ నెలకొంది. ఇంకోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు మంగళవారం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో కేక్లు కట్ చేసి హంగామా చేశారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కూడా పోలీసు పహారాలోకి వెళ్లింది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే దొంతి దిష్టిబొమ్మలు ద హనం చేశారు. ఇలా ఒకేరోజు అటు వైపు పెద్ది విగ్రహ తొలగింపు నిరసనలు, ఇటు వైపు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలతో నర్సంపేటలో విచిత్ర రాజకీ య వాతావరణం నెలకొంది. 500 మంది పోలీసులతో బందోబస్తు ఒక్క నర్సంపేటలోనే ఏఆర్, మామునూరు నాలు గో బెటాలియన్, ఇతర పోలీస్స్టేషన్ల నుంచి సుమారు 500 మంది వరకు పోలీసులు మకాం వేయడంతో హైటెన్షన్ వాతావారణం ఉంది. ఇప్పటికే పెద్ది దశ దినకర్మ ముందు పెద్ది విగ్రహ ప్రతిష్ఠాపనకు మున్సిపల్ అనుమతి లేదంటూ గద్దెలు తొలగించినా కూడా మళ్లీ విగ్రహ ప్రతిష్ఠాపన చేసిన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై ఇప్పటికే నర్సంపేట పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఇంకోవైపు నల్లబెల్లిలో పెద్ది భార్య స్వప్న ఆయన విగ్రహం వద్ద ‘నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో’ అంటూ విలపించారు. కుటుంబం గురించి కాకుండా ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించిన వ్యక్తి విగ్రహం తొలగించడం తట్టుకోలేక పోతున్నామని ఆమె భావోద్వేగ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పెద్ది విగ్రహ తొలగింపుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ భూ యజమాని విద్యాసాగర్రావు అనుమతితోనే పెద్ది విగ్రహం ఏర్పాటు చేస్తే కూల్చేందుకు కాంగ్రెస్కు సిగ్గుండాలి. అదే స్థానంలో పెద్ది విగ్రహం ఏర్పాటు చేయకపోతే తీవ్ర పరి ణామాలు ఉంటాయని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో హెచ్చరించడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఉంది. కాగా పెద్ది విగ్రహ తొలగింపుపై నేడు (బుధవారం) బీఆర్ఎస్ నాయకులు నర్సంపేట బంద్కు పిలుపునిచ్చారు. పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహం తొలగింపుతో ఉద్రిక్తత నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, అరెస్టులు ఇంకోవైపు ఎమ్మెల్యే దొంతి జన్మదిన వేడుకలతో హైటెన్షన్ -
బీఏఎంఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్!
కాశిబుగ్గ: వరంగల్ లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్ (బీఏఎంఎస్) అడ్మిషన్లకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. 2026–2027లో వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించిన సీట్ల భర్తీ కోసం డోకా లేనట్లు సమాచారం. ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) హెల్త్ సెక్రటరీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కళాశాలలో ఉన్న 50 జనరల్ సీట్లతో పాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 బీఏఎంఎస్ సీట్లను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. నీట్ ద్వారా బీఏఎంఎస్ కోర్సులో చేరడానికి మార్గం సుగమం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 12 సీట్లకు కోత.. కళాశాలలోని అధ్యాపకులు, ఇతర సౌకర్యాలను లేమిగా చూపుతూ గత సంవత్సరం 12 సీట్లకు కోత పెట్టారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో సదుపాయాలు కల్పించకపోవడం వల్ల సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని నిరసన తెలిపారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ఫ్యాకల్టీతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అప్పుడు కండీషన్ అఫిడవిట్ ఇవ్వడంతో సీట్లను యథావిధిగా భర్తీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ విద్యా సంవత్సరం వరకు ఫ్యాకల్టీతోపాటు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో తనిఖీ కోసం వచ్చిన ఉన్నతాధికారులు సౌకర్యాల లేమి చూపినట్లు తెలుస్తోంది. అవసరమైన సదుపాయాలు.. 2024 గెజిట్ ప్రకారం 30 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. ఈ ఏడాది మరో 50 మందిని పెంచారు. అలాగే, టీచింగ్ స్టాఫ్ 60 మంది ఉండాలి. మరో 30 మందిని అదనంగా పెంచినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 80 మందిని నియమించడం సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కళాశాలలో 40 శాతం వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. మళ్లీ కండీషన్ అఫిడవిట్..! ఆయుష్ విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్ర భుత్వం గతంలో మాదిరిగా ఈసారి కూడా కండీష న్ అఫిడవిట్ తీసుకున్నట్లు సమాచారం. 31 జనవ రి 2027లోపు పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని అండర్ టేకింగ్ తీసుకున్న ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఈడబ్ల్యూఎస్ కలుపుకుని 63 ఆయుష్ సీట్లు భర్తీ చేసే అవకాశం ఏర్పడింది. కండీషన్ అఫిడవిట్ కు ఎన్సీఐఎస్ఎం అంగీకరించినట్లు సమాచారం. వరంగల్ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్ సీట్లు పదిలం కండీషన్ అఫిడవిట్తో అంగీకరించిన ఎన్సీఐఎస్ఎం 2026–2027 వైద్యవిద్య ప్రవేశాల అభ్యర్థులకు అవకాశం -
పునరుత్పాదక ఇంధనంతో విప్లవాత్మక మార్పులు
హన్మకొండ: డిజిటలైజేషన్, పునరుత్పాదక ఇంధనం ద్వారా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ నోవాటెల్లో మంగళవారం నిర్వహించిన ఇండియా ఎనర్జీ సమ్మిట్ – ఎక్స్పో 2026 కార్యక్రమంలో ‘మోడర్నయిజింగ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్మార్ట్ గ్రిడ్స్ ఫర్ ఎ రిలయబుల్ పవర్ ఫ్యూచర్’’ అనే అంశంపై కర్నాటి వరుణ్ రెడ్డి ప్రసంగించారు. ఐఏఎస్ సంస్థలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, నెట్వర్క్ మ్యాపింగ్, స్మార్ట్ మీటరింగ్ కార్యక్రమాలను వివరించారు. సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ చేతుల మీదుగా జ్ఞాపిక, సావనీర్ అందుకున్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యుగేంధర్రెడ్డి మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్ఎస్లో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమోతో హాజరుకావాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు 9866564422, 9000354465 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో డోర్నకల్–గుండ్రాతిమడుగు మధ్య మూడో లైన్ నిర్మాణం కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే చర్లపల్లి–షాలిమార్ (18046) వెళ్లే ఎక్స్ప్రెస్ను బుధవారం వయా పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు. హన్మకొండ అర్బన్: జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ రెండు పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్ప య్య తెలిపారు. కలెక్టర్ అనుమతితో ఈ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో ఒకటి జనరల్, మరొకటి ఎస్సీ కేటగిరీకి కేటాయించారని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ ఉదయం 10.30 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హనుమకొండ కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాల కోసం హనుమకొండ జిల్లా అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని పేర్కొన్నారు. నయీంనగర్: భద్రకాళి బండ్పై సందర్శకుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనం సేవలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మంగళవారం ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. అనంతరం ఆ వాహనంలో నాయినితోపాటు, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, బల్దియా కమిషనర్ వెంకన్న, కుడా సీపీఓ అజిత్ రెడ్డి ప్రయాణించారు. కెనరా బ్యాంకు ఫాతిమానగర్ బ్రాంచ్ తన సీఎస్ఆర్ నిధుల కింద ఈ బ్యాటరీ వాహనం కొనుగోలు చేసి కుడాకు అందించారు. కార్యక్రమంలో కుడా ఈఈ భీమ్ రావు, కెనరా బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
సంక్రమిత వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి
సంగెం: సంక్రమిత వ్యాధులను వ్యాప్తింపజేసే దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని జాతీయ సంక్రమిత వ్యాధి నియంత్రణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ్జోషి సూచించారు. మంగళవారం ఆర్ఎఫ్డబ్ల్యూసీ (రూరల్ ఫ్యామిటీ వెల్ఫేర్ సెంటర్) రూరల్ కుటుంబ సంక్షేమ కేంద్రాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేసి ఆస్పత్రిలో చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. జ్వరం, దగ్గు ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ్జోషి -
పిల్లల భద్రత, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి
అదనపు కలెక్టర్ రవి హన్మకొండ అర్బన్ : బాలల సంరక్షణ కేంద్రాల్లో పిల్లల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, విద్య, వసతి, ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రవి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. గత త్రైమాసిక తనిఖీల్లో గుర్తించిన లోపాలు, సూచనలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించి తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, బాలల సంక్షేమ సమితి సభ్యుడు దామోదర్ పాల్గొన్నారు. -
అత్తను కారుతో ఢీకొట్టిన అల్లుడు
● అత్తకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం ● కుటుంబ తగాదాలే కారణంకమలాపూర్: కుటుంబ తగాదాలతో ఓ అల్లుడు కారుతో పిల్లనిచ్చిన అత్తను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని అంబాలలో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం పెద్దాపురానికి చెందిన నాగనబోయిన రవి–స్వరూప దంపతుల కూతురు అనితతో అంబాలకు చెందిన బండవరం కృష్ణకాంత్కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లుగా రెండు కుటుంబాల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అత్త స్వరూప, మామ రవి, భార్య అనిత, మరొకరితో కలిసి అంబాలలో కృష్ణకాంత్ కుటుంబీకులపై దాడి చేసి గాయపరిచారు. దీంతో కృష్ణకాంత్ కోపంతో కారుతో అత్త స్వరూపను ఢీకొట్టాడు. ఆమె పొట్టపైనుంచి కారు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. హసన్పర్తి 108సిబ్బంది ఈఎంటీ ప్రకాశ్, పైలట్ నాగరాజు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్వరూప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న స్థానిక ఇన్స్పెక్టర్ నవీన్ సిబ్బందితో కలిసి వెళ్లి ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ నవీన్ను వివరణ కోరగా ఇరువర్గాల వారు పరస్పర దాడులు చేసుకున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం వారందరూ ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు తమకెలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
బీఏఎంఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్!
● వరంగల్ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్ సీట్లు పదిలం ● కండీషన్ అఫిడవిట్తో అంగీకరించిన ఎన్సీఐఎస్ఎం ● 2026–2027 వైద్యవిద్య ప్రవేశాల అభ్యర్థులకు అవకాశం కాశిబుగ్గ: వరంగల్ లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్ (బీఏఎంఎస్) అడ్మిషన్లకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. 2026–2027లో వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించిన సీట్ల భర్తీ కోసం డోకా లేనట్లు సమాచారం. ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) హెల్త్ సెక్రటరీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కళాశాలలో ఉన్న 50 జనరల్ సీట్లతో పాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 బీఏఎంఎస్ సీట్లను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. నీట్ ద్వారా బీఏఎంఎస్ కోర్సులో చేరడానికి మార్గం సుగమం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 12 సీట్లకు కోత.. కళాశాలలోని అధ్యాపకులు, ఇతర సౌకర్యాలను లేమిగా చూపుతూ గత సంవత్సరం 12 సీట్లకు కోత పెట్టారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో సదుపాయాలు కల్పించకపోవడం వల్ల సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని నిరసన తెలిపారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ఫ్యాకల్టీతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అప్పుడు కండీషన్ అఫిడవిట్ ఇవ్వడంతో సీట్లను యథావిధిగా భర్తీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ విద్యా సంవత్సరం వరకు ఫ్యాకల్టీతోపాటు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో తనిఖీ కోసం వచ్చిన ఉన్నతాధికారులు సౌకర్యాల లేమి చూపినట్లు తెలుస్తోంది. అవసరమైన సదుపాయాలు.. 2024 గెజిట్ ప్రకారం 30 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. ఈ ఏడాది మరో 50 మందిని పెంచారు. అలాగే, టీచింగ్ స్టాఫ్ 60 మంది ఉండాలి. మరో 30 మందిని అదనంగా పెంచినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 80 మందిని నియమించడం సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కళాశాలలో 40 శాతం వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. మళ్లీ కండీషన్ అఫిడవిట్..! ఆయుష్ విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం గతంలో మాదిరిగా ఈసారి కూడా కండీషన్ అఫిడవిట్ తీసుకున్నట్లు సమాచారం. 31 జనవరి 2027లోపు పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని అండర్ టేకింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఈడబ్ల్యూఎస్ కలుపుకుని 63 ఆయుష్ సీట్లు భర్తీ చేసే అవకాశం ఏర్పడింది. కండీషన్ అఫిడవిట్కు ఎన్సీఐఎస్ఎం అంగీకరించినట్లు సమాచారం. -
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
ఆత్మకూరు: ఎల్నినో ప్రభావం ఉన్నందున ప్రజలు ఇంకుడు గుంతల నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయం, పెంచికలపేట, అగ్రంపహాడ్ గ్రామపంచాయతీలను మంగళవారం ఆయన సందర్శించారు. పెంచికలపేటలోని ఎగితే రాజయ్య పొలంలో రూ.1.18 లక్షల వీబీ రామ్జీ నిధులతో చేపట్టిన ఫాంపాండ్ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఫాంపాండ్, ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మాదాసి కమల పొలంలో రూ.లక్షతో నిర్మించిన పాండ్ను సందర్శించారు. చేపలు పెంచుతున్న తీరును చూసి రైతును అభినందించారు. మండల పరిషత్ కార్యాలయంలో తిరుమలగిరి గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళిక డేటా నమోదును తనిఖీ చేసి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, డీఎల్పీఓ రవిబాబు, ఎంపీఓ యోగిత, ఏపీఓ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పాషా తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ -
బీఆర్ఎస్ కార్యాలయం వద్ద హైడ్రామా
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ అరెస్ట్ హన్మకొండ: హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో మంగళవారం ఆందోళనలు చేపడతారని భావించిన పోలీసులు ముందుజాగ్రత్తగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. కొందరిని పోలీస్స్టేషన్కు తరలించగా, మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నర్సంపేటకు బయలుదేరుతుండగా కార్యాలయం గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ రాజకీయాన్ని ఇక్కడ రుద్ద దలచుకున్నారా అని మధుసూదనాచారి పోలీసులను ప్రశ్నించారు. తన బలగం ఏమైందని సుదర్శన్రెడ్డి ఆత్మ ఎదురు చూస్తుందని, వందల మంది పోలీసులు రండి వెళదామని చెప్పినా వదలకుండా మధుసూదనాచారిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరకు పోలీసులు పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడం అన్యాయమని అన్నారు. సహచర ఉద్యమకారులుగా వెళ్లేందుకు రేవంత్రెడ్డి సర్కారు అడ్డుకుంటుందని, దీనికి వెనుక ఆంధ్ర కుట్ర దాగి ఉందని ఆరోపించారు. చంద్రబాబు ద్వారా ఆంధ్రా నుంచి రిమోట్ ఆపరేషన్ జరుగుతోందని, తెలంగాణ నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
అధిక సాంద్రత పత్తి సాగుతో లాభాలు
దుగ్గొండి: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల దిగుబడి పెరిగి అధిక లాభాలు వస్తాయని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త రాజుకుమార్ అన్నారు. మండలంలోని మహ్మదాపురం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో పాలడుగుల రాజు పత్తి పంటలో మంగళవారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రాజుకుమార్ మాట్లాడారు. ప్రత్తిలో తెగుళ్లు, చీడపీడల ఉధృతిని గమనించడానికి ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెల్లదోమ, పచ్చదోమ నివారణకు ఎకరానికి 20 నుంచి 25 పసుపు, నీలి రంగులు అట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పేనుబంక, పచ్చదోమ నివారణకు లీటరు నీటికి 0.3 గ్రాముల ప్రోమికామిడ్, లేదా లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్యామ్, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, ఐఎఫ్సీపీ మేనేజర్ విశాల్, ఏఈఓలు విజయ్, హనుమంతు, భారతి, వైజయంతి, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి
హన్మకొండ అర్బన్: సామాజిక సమానత్వం, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సర్వాయి పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ రవి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల, మత వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సమాన ప్రాతినిథ్యం కల్పించేందుకు పాపన్న కృషి చేశారని నాగరాజు తెలిపారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా పాపన్న పోరాడారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ‘కుడా’ మాజీ చైర్మన్్ సుందర్రాజ్యాదవ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్, ఎకై ్స జ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి ● జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర పరకాల: ఎల్నినో వర్షాభావ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా ప్రత్నామ్నాయ ఆరుతడి పంటలపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర కోరారు. పరకాల మండలం కామారెడ్డిపల్లి రైతువేదికలో రైతులకు ఆరుతడి పంటల సాగు, ఆయిల్పామ్ సాగు, నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరికి బదులు పెసర, మినుము, కంది వంటి పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో మంచి దిగుబడులు పొందవచ్చని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి సాగు వ్యయాలను తగ్గించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరకాల ఏఓ ఎస్.శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి అహ్మద్ రజా, గ్రామసర్పంచ్ చిర్ర అనిత, ఉప సర్పంచ్ శ్రీపతి మౌనిక, తదితరులు పాల్గొన్నారు. -
పాపన్నగౌడ్ జీవితం ఆదర్శం
న్యూశాయంపేట: సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జీ వితం అందరికీ ఆదర్శమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహుజనుల కోసం పాలకుల ను ఎదురించి స్వరాజ్యాన్ని స్థాపించి ప్రజలకు సేవచేశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ. గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, బీసీ సంక్షేమశాఖ అధికారి పుష్పలత, గౌడ సంఘం నాయకులు రాజుగౌడ్, రమేశ్, లక్ష్మినారాయణ, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే నాగరా జు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. పనులు వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద -
మొరాయించిన ఎక్స్రే మిషన్
● ఇబ్బందుల్లో రోగులు నర్సంపేట రూరల్: తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్లోని ఎక్స్–రే మిషన్ మొరాయించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి గణనీయంగా పెరుగు తూ వస్తోంది. ప్రతీ రోజు ఓపీ 700 నుంచి 900 వర కు వస్తున్నారు. అయితే గత మూడు నెలలుగా ఆస్పత్రిలో ఉన్న ఎక్స్–రే మిషన్ మరమ్మతుకు గురైంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో పాత ఆస్పత్రి వద్ద ఉన్న తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్లోని ఎక్స్–రే మిషన్తో సేవలు అందిస్తూ వచ్చారు. మంగళవారం హబ్లోని ఎక్స్–రే మిషన్ కూడా మరమ్మతుకు గురికావడంతో రోగులకు తిప్పలు తప్పలేదు. ఇప్పటికే రోగులు కొత్త ఆస్పత్రి, పాత ఆస్పత్రికి ఎక్స్–రే కోసం ఆటోలో తిరుగుతూ ఒక్కొక్కరికి రూ.100 వరకు ఖర్చు చేసుకుంటున్నారు. ఇప్పడు ఉన్న ఒక ఎక్స్–రే మిషన్ మరమ్మతుకు గురికావడంతో రోగులకు ప్రైవేట్ ఆస్పత్రి, ఎంజీఎంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కలెక్టర్ కొనుగోలు చేసిన మొబైల్ ఎక్స్రే కూడా ఇన్స్టాలేషన్ కాలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎక్స్–రే మిషన్ మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని, నూతన ఎక్స్–రే మిషన్ కూడా ఇన్స్టాలేషన్ చేసి, స్టెప్లజర్ను కొనుగోలు చేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
క్వారీని తలపిస్తున్న చెరువు
హసన్పర్తి : మండలంలోని గోపాలపురం చెరువు పునరుద్ధరణ పనుల్లో భారీ అవకతవకలు చోటు చే సుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ని బంధనలను పక్కన పెట్టి అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేశారన్న విమర్శలున్నాయి. పూడికతీత పనుల పేరుతో ఏకంగా మొరం వ్యాపారానికి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.పది కోట్ల మేరకు చెరువు నుంచి మొరం దోపిడీ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గోపాలపురం చెరువు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రి టర్నింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.4 కోట్లు, పూడికతీత పనుల కోసం రూ.కోటి విడుదల చేసింది మూడు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెరువు అభివృద్ధి పనులు చేపట్టారు. పూడికతీత పేరిట మొరం దందా ఇదిలా ఉండగా.. చెరువులో పూడికతీత పేరుతో సదరు కాంట్రాక్టర్ మొరం దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు 1.5 మీటర్ల మేరకు పూడికతీయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సదరు కాంట్రాక్టర్ 8 మీటర్ల నుంచి 10 మీటర్ల లోతు వరకు చెరువును తోడేశాడు. తొలుత రాత్రి వేళ ఈ వ్యాపారం సాగించాడు. ప్రస్తుతం నిరంతరంగా మొరాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ప్రతీరోజు 100 నుంచి 200 టిప్పర్ల మొరం వివిధ ప్రాంతాలకు తరలివెళ్తోంది. ఒక్కోటిప్పర్ మొరం మార్కెట్లో రూ.10వేలు నుంచి 12 వేల వరకు విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నగరంలో కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, విల్లాలకు ఇక్కడే నుంచి మొరం తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి అండతోనే మొరం దందా సాగుతోందని ఆరోపణ లు వ్యక్తమవుతున్నాయి. చెరువు నుంచి మొరం తరలిస్తున్నారని లిఖితపూర్వకంగా ఫి ర్యాదు చేసినా స్పందించడం లేదని వినిపిస్తున్నాయి. అస్థిత్వం కోల్పోయిన చెరువు గోపాలపురం చెరువు అస్థిత్వాన్ని కోల్పోయింది. ప్రస్తుతం చెరువును క్వారీగా మార్చారు. చెరువు పునరుద్ధరిస్తే భవిష్యత్ బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. గోపాలపురం చెరువు ధ్వంసం రూ.10 కోట్ల విలువచేసే మొరం అమ్మకాలు అభివృద్ధి పేరుతో వ్యాపారం -
హౌస్సర్జన్ల రిలే నిరాహార దీక్ష ప్రారంభం
కాశిబుగ్గ: స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆయుష్ విద్యార్థులు, హౌస్సర్జన్లు వరంగల్ ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల వద్ద సోమవారం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు 14వ రోజుకు చేరాయి. దీక్షలో జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బాస్రే, డాక్టర్ గణేశ్, డాక్టర్ సంఘమేశ్వర్రెడ్డి, డాక్టర్ కీర్తన, డాక్టర్ అంకిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసం తాము శాంతియుతంగా పోరాటం చేస్తూ, అధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. పోస్టర్ కార్డు క్యాంపెయిన్, హైదరాబాద్లో ధర్నా చేసినా ఫలితం లేదని వాపోయారు. ప్రభుత్వం కనీసం తమ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాకు విచ్చేసిన సీఎం రేవంత్రెడ్డికి తమ గోడును విన్నవించుకోవడానికి అవకాశం కల్పించకపోవడం మరింత బాధకు గురిచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చేవరకు పోరాడుతామన్నారు. -
అర్జీల సత్వర పరిష్కారానికి కృషి
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కార చర్యలపై కలెక్టర్.. తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండల స్థాయి ప్రజావాణిని సజావుగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రభుత్వ హాస్టళ్లను పరిశీలించి మౌలిక వసతులపై నివేదికలు అందించాలన్నారు. హాస్టళ్లలో అవసరమైన వసతుల కల్పనకు అంచనాలు రూపొందించి ఇంజినీరింగ్ అధికారులకు పంపించాలని సూచించారు. కాగా, ప్రజావాణిలో జిల్లా స్థాయిలో 127, రెవెన్యూ డివిజన్ స్థాయిలో 47, మండల స్థాయిలో 187 కలిపి మొత్తం 361 వినతులు అందాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి, డీఆర్ఓ శ్రీనివాస్, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డీఆర్డీఓ మేన శ్రీను, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● 46వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ధర్మసాగర్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని, రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని స్టేషన్పెండ్యాలలో రూ.50 లక్షలు, రాంపూర్ గ్రామంలో రూ.1.50 కోట్లతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల పనులతో పాటు రూ.40 లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క రోజే రూ.2.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, వీటిని మూడు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నాలుగు నెలల వ్యవధిలోనే రాంపూర్ గ్రామానికి రూ.6.40 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొదటి విడత రాంపూర్ గ్రామానికి 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరో 15 రోజుల్లో రెండో విడత కింద మరో 50 ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గుడిసెలు, రేకుల ఇళ్లలో నివసిస్తున్న అర్హులకు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతికి పాల్పడలేదని, నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తన లాంటి ప్రజాప్రతినిధులకు ప్రజల మద్దతు ఎల్లప్పుడు ఉండాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మునిగాల సరోజన, డివిజన్ ప్రెసిడెంట్ భిక్షపతి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం
హన్మకొండ: వరంగల్ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నందుకు నిరసిస్తూ సోమవారం హనుమకొండ కాళోజీ కూడలిలోని వరంగల్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వరంగల్ కలెక్టరేట్కు వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు గేట్ మూసివేశారు. దీంతో గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు ఇతర నాయకులను పోలీసులు పోలీస్స్టేషన్కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వినయ్భాస్కర్తో పాటు, పార్టీ నాయకులను సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం వదిలిపెట్టారు. ఈసందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాన్ని రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నాయకులు కమరున్నీసా బేగం, మిడిదొడ్డి స్వప్న, మర్రి యాదవరెడ్డి, నయీముద్దీన్, జోరిక రమేశ్, రామ్మూర్తి, బైరపాక ప్రశాంత్, బొల్లు సందీప్తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి ఎగవేతపై ధర్నా వరంగల్ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం -
వినతులను తక్షణమే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 166 దరఖాస్తులు రాగా రెవెన్యూ 52, జీడబ్లుఎంసీ 26, హౌసింగ్, 12, డీఆర్డీఓ 22, ఇతర శాఖలకు సంబంధించి 54 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వం మండలస్థాయిలో ప్రజావాణిని నిర్వహిస్తుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, పెన్షన్, తదితర సమస్యలపై మండలపరిధిలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతులు ఇలా.. ● నర్సంపేట పట్టణం రాజుపల్లి గ్రామానికి చెందిన ఎస్. మల్లమ్మ వృద్దాప్య పింఛన్ మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. ● వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ విన్నవించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద గ్రీవెన్స్లో 166 దరఖాస్తులు -
అంకితభావంతో ఉన్నత స్థానాలకు..
కేయూ క్యాంపస్: అంకితభావం, క్రమశిఽక్షణ, దృఢసంకల్పం విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరవచ్చని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమవారం కేయూలో ఆడిటోరియంలో కో–ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో ప్రవేశాలు పొందిన నూతన విద్యార్థులకు సోమవారం ఓరియంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకుని సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ కోల ఆనందకిషోర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం, నైతిక విలువలు, మానవీయ దృక్పథం సమన్వయమే సమగ్ర విద్యకు పునాది అన్నారు. కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రమణ, వివిధ విభాగాల అధ్యాపకులు రాధిక, సుమలత, వి.మహేందర్, ఆసీం ఇక్బాల్, విజయ్, శ్రీధర్ పాల్గొన్నారు. కేయూ ఓఎస్డీ వెంకట్రాంరెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓరియంటేషన్ -
భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
గీసుకొండ: హారతి ఇస్తున్న అర్చకుడు సుదర్శనాచార్యులుఉర్సు నాగమయ్య దేవాలయంలోని పుట్టలో పాలు పోస్తున్న మహిళలుగీసుకొండ: జిల్లాలో భక్తులు శ్రావణమాసం, శుక్లపక్ష పంచమి సందర్భంగా నాగుల పంచమిని సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కాలసర్ప దోశం తొలగిపోవాలని, సంతాన భాగ్య కలగాలంటూ మహిళలు ఆలయాల్లోని పుట్టలో పాలు పోసి మొక్కుకున్నారు. గీసుకొండ మండలం ఊకల్హవేలిలోని ప్రసిద్ధ నాగ సుభ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు గర్భాలయాన్ని పూలతో సుందరంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
ఘనంగా నాగుల పంచమి వేడుకలు
హన్మకొండ కల్చరల్: జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమిని ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం నుంచి భక్తులు పుట్టల్లో పాలుపోయడం, పసుపు, కుంకుమలు, చలిమిడి, ఆవుపాలు, పచ్చిగుడ్డు, నువ్వులబెల్లం (చిమ్మిరి) మొదలైనవి నైవేద్యంగా సమర్పించారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోరికలు నెరవేరాలని మొక్కులు చెల్లించుకున్నారు. కోరికలు తీరిన వారు నాగులమ్మకు చీర, రవిక బట్టలు, వెండి, బంగారంతో చేసిన నాగపడిగలను సమర్పించారు. హనుమకొండ వేయిస్తంభాల ఆలయం, ‘కుడా’ కార్యాలయం రోడ్డులోని శివాలయం, ఎక్సైజ్ కాలనీలోని నాగ ఆభయాంజనేయ సహిత లక్ష్మీగణపతి దేవాలయంలోనూ, హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో పూజలు చేశారు. -
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఉమ్మడి జిల్లాలో భారీగా ఓట్ల కుదింపు విడుదలైన ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాసాక్షిప్రతినిధి, వరంగల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)తో ఉమ్మడి వరంగల్లో రాజకీయ సమీకరణాల కంటే ముందే ఓటర్ల లెక్కల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. జూన్ 10న ఉన్న ఓటర్లతో పోలిస్తే సోమవారం నాటి ముసాయిదా ప్రకారం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాలు మారాయి. 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. తాజా జాబితాలో 26,77,498 మంది నమోదయ్యారు. అంటే దాదాపు 12.31 శాతం తగ్గుదల కనిపించింది. 3,75,740 మంది ఓటర్లు తగ్గారు. 4,83,803 మంది ఏఎస్డీడీ (మరణించినవారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయినవారు, ఇప్పటికే మరోచోట నమోదైనవారు, ఇతర కేటగిరీ)లలో ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లకు మ్యాపింగ్ జరగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తూర్పులో భారీ మార్పు.. పశ్చిమలో పెద్ద కోత ఉమ్మడి వరంగల్లో అత్యంత ఆసక్తికరమైన గణాంకం వరంగల్ పశ్చిమది. జూన్ 10న 2,86,335 మంది ఓటర్లు ఉండగా.. సోమవారం నాటికి 2,03,719కు తగ్గారు. అంటే 82,616 మంది తగ్గారు. వరంగల్ తూర్పులోనూ దాదాపు ఇదే తరహా పరిస్థితి. 2,60,437 మంది నుంచి ఓటర్ల సంఖ్య 2,09,646కు తగ్గింది. అంటే 50,791 మంది తగ్గారు. ఏఎస్డీడీలో పాలకుర్తి రెండో స్థానం.. ఏఎస్డీడీని పరిశీలిస్తే పాలకుర్తి 23.68 శాతంతో ఉమ్మడి వరంగల్లో రెండో స్థానం, వరంగల్ తూర్పు 23.88 శాతంతో మొదటి స్థానంలో ఉంది. భూపాలపల్లిలో ఏఎస్డీడీ ఓటర్ల శాతం కేవలం 8.63 శాతం ఉంది. అంటే ఒకే ఉమ్మడి ప్రాంతంలో నియోజకవర్గాల మధ్య సవరణ ప్రభావంలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. అక్టోబర్ 1న తుది జాబితా.. ఇక నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు, విచారణ, కొత్తగా చేరే ఓటర్లు, తిరిగి చేర్చే పేర్లతో జాబితా మారనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న వెలువడే తుది జాబితానే ఉమ్మడి వరంగల్లో అసలు ఓటర్ల బలాన్ని స్పష్టంగా చూపించనుంది. ఇప్పటివరకు కనిపిస్తున్న గణాంకాలు తుది జాబితా కాదన్నదే కీలకం. ప్రత్యేక సవరణలో ముసాయిదా జాబితా అనంతరం ఓటర్లకు తమ పేరు ఉందో లేదో చూసుకునే అవకాశం, అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలకు ఈ నెల 30 వరకు అవకాశం ఉండగా, వాటి పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు కొనసాగి, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న ప్రచురించాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం కనిపిస్తున్న తగ్గుదలలో ఎన్ని పేర్లు శాశ్వతంగా తొలగిపోతాయి? ఎన్ని తిరిగి చేరుతాయి? కొత్తగా ఎన్ని పేర్లు చేరతాయి? అనేది త్వరలో తేలనుంది. రంగంలోకి రాజకీయ పార్టీలు మరణించిన వారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయిన వారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, ఇతర కేటగిరీలు ఏఎస్డీడీలో ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. తమ బూత్లో తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకోవడం, నిజంగా అక్కడే నివసిస్తున్న ఓటర్ల పేర్లు తొలగిపోయాయా? అనేది ఇంటింటికీ పరిశీలించడం. అర్హులైన కొత్త ఓటర్లు, మిస్సైన పేర్లు, చిరునామా/పేరు తప్పులపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేయడం. ఇది పార్టీలకు కేవలం రాజకీయ కార్యక్రమం కాదు.. ఎన్నికల బూత్ మేనేజ్మెంట్కు కీలకమైన ప్రక్రియగా మారనుంది. 12 నియోజకవర్గాల్లో 4.84 లక్షల మంది ఏఎస్డీడీలో.. 1.62 లక్షల మందికి నో మ్యాపింగ్ 17.08.26 నాటికి ఓటర్లు26,77,498ఏఎస్డీడీ4,83,803తగ్గిన ఓటర్లు3,75,740 -
సిబ్బందికి అండగా నిలవాలి
వరంగల్ సీపీ శ్వేత వరంగల్ క్రైం: పోలీస్ అధికారుల సంఘం సి బ్బందికి అండగా నిలవాలని వరంగల్ పోలీ స్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. ఇటీవల ఎన్నికై న నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం సీపీ ఎన్.శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి మొక్కలు అందజేశారు. ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్రావు నూతన కార్యవర్గ సభ్యులను సీపీకి పరిచయం చేశారు. అనంతరం ఆమె నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంఘం స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సదయ్యతో పాటు నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం
హన్మకొండ: వరంగల్ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నందుకు నిరసిస్తూ సోమవారం హనుమకొండ కాళోజీ కూడలిలోని వరంగల్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వరంగల్ కలెక్టరేట్కు వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు గేట్ మూసివేశారు. దీంతో గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు ఇతర నాయకులను పోలీసులు పోలీస్స్టేషన్కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వినయ్భాస్కర్తో పాటు, పార్టీ నాయకులను సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం వదిలిపెట్టారు. ఈసందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాన్ని రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నాయకులు కమరున్నీసా బేగం, మిడిదొడ్డి స్వప్న, మర్రి యాదవరెడ్డి, నయీముద్దీన్, జోరిక రమేశ్, రామ్మూర్తి, బైరపాక ప్రశాంత్, బొల్లు సందీప్తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి ఎగవేతపై ధర్నా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం -
లోటు వర్షపాతమైనా..పత్తికి సై
సాక్షి, వరంగల్: వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంటలసాగుపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. జిల్లాలో అత్యధికంగా సాగు చేద్దామనుకున్న వరి సాగు వెనుకబడగా, పత్తి మాత్రం ముందంజలో ఉంది. 1,25,000 ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 53,315.08 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. ఇక 1,10,200 ఎకరాల్లో సాగు చేద్దామనుకున్న పత్తి 1,19,459.88 ఎకరాల్లో సాగు చేశారు. అయితే వరి సాగు 46.65 శాతం ఉండగా, పత్తి సాగు 108.40 శాతంగా నమోదైంది. మొక్కజొన్న ఎనిమిది వేల ఎకరాలకు గానూ 8,188.87 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పంటల విస్తీర్ణాన్ని పరిశీలిస్తే గీసుకొండ, దుగ్గొండి, నెక్కొండ, సంగెం, నల్లబెల్లి తదితర మండలాల్లో పత్తి అత్యధికంగా సాగు చేయగా, రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో వరి విస్తీర్ణం గణనీయంగా ఉంది. భూముల స్వభావం, నీటి లభ్యత, గత సాగు విధానం, వర్షాధార పరిస్థితులు ఈ పంటలపై ప్రభావాన్ని చూపాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు 2,75,500 ఎకరాల్లో పంట సాగు అంచనా వేస్తే ఈ నెల 10వ తేదీ నాటికి 13 మండలాల్లో కలిపి 1,88,045.94 ఎకరాల్లో వానాకాలం పంటలు మాత్రమే సాగయ్యాయి. అంటే ఇప్పటివరకు 68.26 శాతం సాగవగా, ఇంకా 31.74 శాతం సాగు కావాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా రాయపర్తి మండలంలో 26,573.32 ఎకరాలు సాగవగా, అత్యల్పంగా వరంగల్ మండలంలో 1,858.87 ఎకరాల్లో సాగు నమోదైంది. ఈ నెలాఖరు నాటికి వర్షాలు కురిస్తే మిగిలిన ఎకరాల్లో పంటల సాగు చేసే అవకాశం ఉంది. మండలాల వారీగా సాగు వివరాలు ● చెన్నారావుపేట మండలంలో పత్తి 11,275 ఎకరాలు, వరి 2,747, మొక్కజొన్న 650, పెసర 80, కంది 40, వేరుశనగ 35, పసుపు 12, ఆయిల్పామ్ 421.08 ఎకరాల్లో సాగయ్యాయి. ● దుగ్గొండి మండలంలో పత్తి 13,995, మొక్కజొన్న 921, పెసర 649, వరి 802, వేరుశనగ 59, కంది 53, పసుపు 295, సోయాబీన్న్ 12, ఆయిల్పామ్ 485.88 ఎకరాల్లో సాగయ్యాయి. ● ఖానాపురం మండలంలో వరి 4,859 ఎకరాలు, పత్తి 3,297, మొక్కజొన్న 1,378, ఆయిల్పామ్ 357.17 ఎకరాల్లో సాగు నమోదైంది. కంది 2, పెసర 8, పసుపు 2 ఎకరాల్లో ఉన్నాయి. ● నల్లబెల్లి మండలంలో పత్తి 12,826.20 ఎకరాలతో ప్రధాన పంటగా ఉంది. మొక్కజొన్న 1,890.87, వరి 1,900, పెసర 249.20, వేరుశనగ 112, కంది 32, సోయాబీనన్ 12, ఆయిల్పామ్ 182.94 ఎకరాల్లో సాగయ్యాయి. ● నర్సంపేట మండలంలో పత్తి 7,521 ఎకరాలు, మొక్కజొన్న 1,032, వరి 1,139, వేరుశనగ 446, పెసర 270, సోయాబీన్ 252, ఆయిల్పామ్ 322.21 ఎకరాల్లో సాగయ్యాయి. పసుపు 50, కంది 33 ఎకరాల్లో ఉన్నాయి. ● నెక్కొండ మండలంలో పత్తి 12,308 ఎకరాలు, వరి 2,913, మొక్కజొన్న 625, ఆయిల్పామ్ 359.76 ఎకరాల్లో సాగయ్యాయి. పసుపు 105, సోయాబీన్ 8, కంది 14, పెసర 19 ఎకరాల్లో ఉన్నాయి. ఎరమ్రిర్చి 2 ఎకరాల్లో సాగైంది. ● గీసుగొండ మండలంలో పత్తి 14,673, వరి 862, మొక్కజొన్న 202, పెసర 86, కంది 56, సోయాబీన్ 51, పసుపు 115, ఆయిల్పామ్ 1.20 ఎకరాల్లో సాగైంది. ● ఖిలా వరంగల్ మండలంలో పత్తి 3,405 ఎకరాలు, వరి 634, పెసర 271, మొక్కజొన్న 229, కంది 45, వేరుశనగ 4 ఎకరాల్లో సాగయ్యాయి. ● పర్వతగిరి మండలంలో వరి 6,041, పత్తి 9,195, మొక్కజొన్న 119, కంది 11, పెసర 29, వేరుశనగ 4, ఎరమ్రిర్చి ఒక ఎకరం, పసుపు 3 ఎకరాల్లో సాగయ్యాయి. ● రాయపర్తి మండలంలో వరి 16,020, పత్తి 9,829, ఆయిల్పామ్ 456.32, మొక్కజొన్న 162, కంది 50, పెసర 46, వేరుశనగ 8, పసుపు 2 ఎకరాల్లో సాగయ్యాయి. ● సంగెం మండలంలో పత్తి 12,495 ఎకరాలు, వరి 1,942, మొక్కజొన్న 652, పసుపు 158, పెసర 104, కంది 41, సోయాబీన్ 15, ఆయిల్పామ్ 55.68 ఎకరాల్లో సాగయ్యాయి. ● వరంగల్ మండలంలో పత్తి 1,438.68 ఎకరాలు, వరి 254.08, మొక్కజొన్న 64, ఆయిల్పామ్ 47.46 ఎకరాల్లో ఉన్నాయి. పెసర 28.38, కంది 18.27, సోయాబీన్్ 8 ఎకరాల్లో సాగయ్యాయి. ● వర్ధన్నపేట మండలంలో వరి 13,202, పత్తి 7,202, మొక్కజొన్న 264, ఆయిల్పామ్ 275.56 ఎకరాల్లో సాగయ్యాయి. కంది 63, పెసర 34, నువ్వులు 5, ఎర్రమిర్చి 5, పసుపు 2 ఎకరాల్లో సాగయ్యాయి. వానాకాలం సీజన్లో లక్ష్యానికి మించి 1,19,459.88 ఎకరాల్లో సాగు 53,315.08 ఎకరాల్లో వరి సాగుతో 46.65 శాతంగా నమోదు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 68.26 శాతమే సాగు ఈ నెలాఖరు నాటికి వర్షాలు కురిస్తే మిగిలిన భూముల్లో సాగయ్యే అవకాశం -
సర్
వరంగల్మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026ముసాయిదా జాబితాలో 6,78,540 మంది ఓటర్లుఅభివృద్ధి పనులకు ఆమోదం! హైదరాబాద్లోని సెక్రటేరియట్లో సోమవారం జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. ఇక నోటీసులు అభ్యంతరాలుసాక్షి, వరంగల్: జిల్లాలో 7,76,953 మంది ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 6,78,540 మంది ఓటర్లున్నట్టుగా సోమవారం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు. అయితే ఈ డిజిటలైజేషన్ అయిన ఓట్లలోనూ 2002 ఓటరు జాబితాకు, ప్రస్తుతం ఉన్న జాబితాలో పేరు తప్పుగా నమోదై ఉన్నా, ఇంటి పేరు, తల్లి, తండ్రి పేర్లు, తల్లిదండ్రుల వయస్సుతో పిల్లల వయస్సు సరిపోలకపోవడం వంటి తదితర వ్యత్యాసాలున్న వారు 1,50,183 మంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీరితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓటు, జిల్లాలోనే ఉండి ఫారాలు సమర్పించని వారికి బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) నోటీసులు జారీ చేస్తారు. జిల్లాలో మొత్తంగా చూసుకుంటే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని 98,413 మంది ఓటర్లున్నారు. ఈ ఓటర్లను ‘సర్’లో ఆన్ కలెక్టబుల్ పేరుతో నమోదు చేశారు. వీరిలో 21,933 మంది డెత్, 6,669 మంది అన్ట్రేసబుల్ /అబ్సెంట్, 55,751 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారు, 129 మంది ఇతరులు, 13,931 మంది ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదుగా ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. నోటీసులందుకున్న ఓటర్లు ఫారం–6 ద్వారా ఎన్నికల సంఘం సూచించిన పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. సరిగా ఉంటే తిరిగి వారి పేర్లను జాబితాలో నమోదు చేస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే తుది జాబితాలో ప్రచురిస్తారు. మిగతా పేర్లనీ జాబితా నుంచి తొలగిస్తారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అక్టోబర్ 15 వరకు వాటి పరిష్కారం చేపట్టి అక్టోబర్ 19న తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అలాగే ఈ ముసాయిదా జాబితాపై వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్లను పరిశీలించి అర్హత ఉన్నవారి వివరాలను సరిచేయనున్నారు. సర్వీస్ ఓటర్లు 642 మంది జిల్లా ముసాయిదా వివరాల్లో 642 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు. వీరిలో 597 మంది పురుషులు, 33 మంది మహిళలు ఉన్నారు. ఇతరుల కేటగిరీలో ఎవరూ లేరు. సర్వీస్ ఓటర్లలో అత్యధికంగా నర్సంపేటలో 366 మంది ఉండగా, వర్ధన్నపేటలో 187, వరంగల్ తూర్పులో 89 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 35 మంది ఉన్నారు. వీరిలో 28 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. నర్సంపేటలో ఎనిమిది మంది, వరంగల్ తూర్పులో 19 మంది, వర్ధన్నపేటలో ఎనిమిది మంది ఎన్ఆర్ఐ ఓటర్లుగా నమోదయ్యారు. 2002 ఓటరు జాబితాతో వ్యత్యాసమున్న 1,50,183 మందికి నోటీసులు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని 98,413 మంది విషయంలోనూ చర్యలు సెప్టెంబర్ 16 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 15వ తేదీ వరకు పరిష్కారం చేపట్టి 19న తుది జాబితానియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితా వివరాలు నియోజకవర్గం పీఎస్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం నర్సంపేట 288 1,08,654 1,13,251 8 2,21,913 వరంగల్ తూర్పు 242 1,01,711 1,07,873 62 2,09,646 వర్ధన్నపేట 286 1,21,073 1,25,894 14 2,46,981 -
డీపీఆర్ఓగా బండి పల్లవి
హన్మకొండ అర్బన్: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి గా బండి పల్లవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నూతనంగా డీపీఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన పల్లవికి పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం సెప్టెంబర్ 19న హనుమకొండలోని పాత పెన్షన్, పీఆర్సీ సాధన సభ నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ తెలిపారు. నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘం భవన్లో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా పాత పెన్షన్, పీఆర్సీ సాధన సభ హనుమకొండలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు రామునాయక్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ టి.యాదగిరిరావు సూచించారు. కేయూలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మానవ వనరుల విభాగాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడారు. సమావేశంలో విభాగాధిపతి పి.శ్రీనివాస్రావు, అధ్యాపకులు ఎ.శ్రీనివాసులు, చీకటి శ్రీను, ఉమాశంకర్, దేవేంద్రచారి విద్యార్థులున్నారు. న్యూశాయంపేట: టైలరింగ్లో ప్రావీణ్యం ఉన్న నిరుద్యోగులకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. డీఆర్డీఓ కార్యాలయంలో నిరుద్యోగులు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతీ సోమవారం, గురువారాల్లో ఉదయం 11 గంటలకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సంప్రదించి కూడా ఉపాధి పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. కేయూ క్యాంపస్: అధునాతన సాంకేతిక సాధనాల వినియోగం అత్యంత కీలకమని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్ ఆధ్వర్యంలో కేయూ కంప్యూటర్ సెంటర్లో వారం రోజుల వర్క్షాపును సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక పరిశోధనలో డేటాను శాసీ్త్రయంగా విశ్లేషించి ప్రయోగాత్మక ఫలితాలను మరింత కచ్చితంగా వినియోగించాలని కోరారు. పుణేలోని అడ్వకేంట్ ఇన్ఫర్మేటిక్స్ సీఈఓ సురోజిత్సాధు, ఇతర బాధ్యులు షమ్షీర్సింగ్, దీపక్శర్మ, రూసా నోడల్ అధికారి ఆర్.మల్లికార్జున్రెడ్డి, వర్క్షాప్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, కో కోఆర్డినేటర్ డాక్టర్ శాస్త్రి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సారూ.. మా ఊరును మరిచారా?
● అమల్లోకి రాని అక్కంపేట రెవెన్యూ గ్రామ ఉత్తర్వులు ● అక్కంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్కు వేడుకోలుఆత్మకూరు: సీఎం రేవంత్రెడ్డి అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో 2022లో ఆత్మకూరు మండలం అక్కంపేటలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యటించిన సందర్భంగా అక్కంపేట ప్రజలు తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను అధికారంలోకి రాగానే రెవెన్యూ గ్రామంగా మారుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామంగా మారుస్తున్నామని సీఎం అధికారికంగా ప్రకటించారు. కానీ, ఇంతవరకు తమ గ్రామం పెద్దాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోనే రికార్డుల్లో చూపిస్తున్నదని ఇంతవరకు అక్కంపేట రెవెన్యూ గ్రామ ఉత్తర్వులు అమలు కావట్లేదని అక్కంపేట ప్రజలు వాపోతున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ స్వగ్రామంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అక్కంపేట గ్రామస్తులు సీఎం రేవంత్ను కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి అక్కంపేట సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించి అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రగతి పరుగులు
హన్మకొండ అర్బన్: ప్రజా ప్రభుత్వంలో హనుమకొండ జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. పలు పాఠశాలల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం శకటాల ప్రదర్శన, ఉత్తమ ఉద్యోగులను సత్కరించారు. ఈసందర్భంగా రాష్ట్రం, జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ లక్ష్యాలు మంత్రి తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు. అభివృద్ధి పథంలో జిల్లా.. హనుమకొండ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పనులు వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ద్వారా ధర్మసాగర్, చలివాగు ప్రా జెక్టులను నింపి వచ్చే ఏడాది వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పురోగతిలో పనులు.. 2057 జనాభా అవసరాలకు అనుగుణంగా రూ.5,300 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ పనులు చేపట్టినట్లు, రూ.572 కోట్లతో 45 కిలోమీటర్ల పొడవునా 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. హనుమకొండ–కాజీపేట రూ.78 కోట్లు, ఫాతిమా–మామునూరు రూ.68 కోట్లతో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ‘కుడా’ ఆధ్వర్యంలో మామునూరు విమానాశ్రయం కోసం 950 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీకి అప్పగించామని, జిల్లాలో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరకాలలో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని, భద్రకాళి మాడవీధుల పనులు తుది దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. వంగరలో పీవీ.నరసింహారావు విజ్ఞాన వేదికకు రూ.7 కోట్లు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్కు రూ.5 కోట్లతో పునరుద్ధరణ పనులు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.జెండాకు వందనం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సీపీ శ్వేత, అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హనుమకొండ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ పతాకం ఆవిష్కరణ, జిల్లా ప్రగతి నివేదిక వివరణ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సమరయోధులకు సన్మానం.. ఉత్తమ ఉద్యోగులకు సత్కారంప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీజిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. జిల్లాలోని 1,445 మహిళా సంఘాలకు రూ.136 కోట్ల సీ్త్రనిధి, బ్యాంకు అనుసంధాన రుణాలు అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సీపీ శ్వేత, అదనపు కలెక్టర్ రవి ఇతర ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ: ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేద పిల్లలకు నాణ్యమైన విద్య కోసం హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్రంలో తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. హైదరాబాద్లో స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తున్నామన్నారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి లోపాలకు తావివ్వొద్దని సూచించారు. వరంగల్లో రూ.5,700 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించనున్నట్లు తెలిపారు. కేంద్రాన్ని ఒప్పించి వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ సౌకర్యముందన్నారు. ఎక్కడైనా రేషన్ పొందేలా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్.నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అడిషనల్ కలెక్టర్ రవి, డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ పాల్గొన్నారు. -
తండ్రి కల నెరవేరకుండానే..
● రోడ్డు ప్రమాదంలో యువ క్రికెటర్ దుర్మరణం ● టీజీ –20లో చోటు.. ● విషాదంలో వరంగల్ క్రీడాభిమానులువరంగల్ స్పోర్ట్స్/ఖిలా వరంగల్: మైదానంలో పరుగులు తీస్తూ.. బంతిని బౌండరీ దాటిస్తూ.. ఒక రోజు జాతీయ జట్టు తరఫున తన కుమారుడు ఆడాలన్నది ఆ యువ క్రికెటర్ తండ్రి కల. తన తండ్రి కలను నెరవేర్చాలని ఆ కుమారుడి తపన మధ్యలో ఆగిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. అటు తండ్రి కన్న కల, ఆ యువ క్రికెటర్ ఆశయం నెరవేరకుండానే ఇటీవల హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్ను మూశాడు. ఈఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రిడాకారులను విషాదంలో ముంచెత్తాడు. వరంగల్ ఎస్ఆర్ఆర్తోటకు చెందిన విశ్వనాధ ఓం ప్రకాశ్, కవిత దంపతులు కుమారుడు వైష్ణవ్(21)కు చిన్ననాటి ఉంచే క్రికెట్పై ఆసక్తి ఉండేది. తన కుమారుడిని జాతీయ స్థాయి క్రికెటర్గా చూడాలన్న ఆశతో హైదరా బాద్లోని ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పించారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తెలంగాణ–20 పోటీల్లో వరంగల్ వారియర్స్ జట్టులో ప్రాతి నిధ్యం వహించాడు. ఈ క్రమంలో జూలై 26వ తేదీన రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని ఉప్ప ల్ స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తున్న వైష్ణవ్ను వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వైష్ణవ్ను సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. సుమారు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. కాగా, విశ్వనాథ్ వైష్ణవ్ వరంగల్ జట్టు నుంచి అండర్–14, 16, 19 విభాగాలతోపాటు వరంగల్–2, 3డే టీములకు ప్రాతినిధ్యం వహించాడు. వేసవిలో జరిగిన శ్రీలంక టూర్లో వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్నాడు. కన్నీటి వీడ్కోలు.. నిన్నటి వరకు క్రికెట్ మైదానంలో పరుగులు తీసిన యువకుడు, నేడు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. క్రికెట్ అభిమానులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఎస్ఆర్ఆర్తోటలో యువ క్రికెటర్ వైష్ణవ్ మృతదేహాన్ని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మేనల్లుడు యువ నేత విష్ణువర్ధన్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. -
ఇంధన స్వావలంబన దిశగా అడుగులు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: ఇంధన స్వాలంబన దిశగా సోలార్, బ్యాటరీ స్టోరేజ్ సాంకేతికతల వైపు అడుగులు వేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. హనుమకొండలో నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వరుణ్ రెడ్డి ప్రసంగించారు. సమష్టి కృషితో 33 కేవీ 11 కేవీ లైన్లలో విద్యుత్ అంతరాయాలను 36 శాతం వరకు తగ్గించగలిగామన్నారు. కవర్డ్ కండక్టర్లు, ఓల్టేజ్ బూస్టర్లు, నూతన సబ్స్టేషన్ల నిర్మాణం ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యత పెరిగిందన్నారు. సామాజిక బాధ్యతగా 10,345 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు అందించడం సంతృప్తినిచ్చిందన్నారు. రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్స్, జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ తుది దశకు చేరిందన్నారు. నిజామాబాద్ జక్రాన్పల్లిలో మొట్టమొదటి సోలార్ ప్లాంట్ నెలకొల్పామని చెప్పారు. ఎల్సీ యాప్ ద్వారానే ఎల్సీలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల భద్రతకు శ్రీవన్ మినిట్ రూల్ తీసుకువచ్చామని చెప్పారు. భద్రతా మౌలిక సదుపాయాలకు రూ.57.97 కోట్ల ఖర్చు చేసినట్లు వివరించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1912 నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐ వాయిస్ ఏజెంట్ను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సంస్థ నష్టాలు రూ.1,370 కోట్ల నుంచి రూ.670 కోట్లకు తగ్గాయని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సీఈలు తిరుమల్రావు, జయవంత్ రావు చౌహన్, అశోక్, మాధవరావు, సురేందర్, అన్నపూర్ణ, గౌతమ్ రెడ్డి, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణు బాబు, జాయింట్ సెక్రటరీలు రమేష్, శ్రీకృష్ణ పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో వైద్యులు, విద్యార్థుల పాత్ర కీలకంకాశిబుగ్గ: దేశాభివృద్ధిలో వైద్యరంగం, వైద్యులు, విద్యార్థుల పాత్ర కీలకమని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రమేష్రెడ్డి అన్నారు. వరంగల్ కాళోజీ హెల్త్ వర్సిటీలో శనివారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వందన పాల్గొన్నారు. -
తలకిందులుగా జెండా
● విద్యార్థులతో ఊళ్లో ర్యాలీ ● గమనించని ఉపాధ్యాయులుఐనవోలు: స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి స్థానిక గ్రామ పంచాయతీ వరకు నిర్వహించిన ర్యాలీలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. ప్రతీ సంవత్సరం మాదిరిగా ప్రభుత్వ పాఠశాల నుంచి జీపీ వద్దకు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి జీపీ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తారు. అయితే, ఈసారి విద్యార్థులు మువ్వన్నెల జాతీయ జెండాను తలకిందులుగా ఆకుపచ్చ రంగుపైకి, కాషాయ రంగు కిందికి వచ్చేలా పట్టుకుని ప్రదర్శించారు. ర్యాలీ మొత్తం జాతీయ జెండా రివర్స్లోనే సాగినప్పటికీ వెంట ఉన్న ఉపాధ్యాయులు, బాధ్యులెవరూ దీన్ని గమనించకపోవడంపై స్థానికులు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. దేశ సమగ్రతకు, గౌరవానికి ప్రతీక అయిన జాతీయ పతాకం విషయంలో ఇంత నిర్లక్ష్యం తగదని, కనీస అవగాహన లేకుండా జెండాను తలకిందులుగా ఊరేగించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ప్రత్యేకాధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శనివారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు చూపిన దేశభక్తి, సేవా స్ఫూర్తిని ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో జీడబ్ల్యూఎంసీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం పలువురు ఉత్తమ అధికారులు సిబ్బందికి కమిషనర్తో కలిసి ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్ కుమార్, సీఎంహెచ్ఓ రాజారెడి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, అకౌంట్స్ అధికారి శివలింగం డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని టౌన్ హాల్లో బల్దియా కమిషనర్ టి.వెంకన్న జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు పబ్లిక్ గార్డెన్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.● గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
కేయూ అభివృద్ధికి రూ.400 కోట్లతో ప్రతిపాదనలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.400 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. 50 ఏళ్ల కేయూ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ లక్ష్యాల వైపు మరింత దృఢంగా సాగాలని పిలుపునిచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమం, పరిపాలనా సంస్కరణల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రూసా ప్రాజెక్టు ద్వారా రూ.50 కోట్లతో వివిధ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీ అనుమతి లభించిందన్నారు. కేయూలోని గ్రంథాలయ అభివృద్ధికి రూ.కోటి కేటాయించామని తెలిపారు. వేడుకల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య వెంకట్రామ్రెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేష్లాల్, రమ, సుదర్శన్, అనితారెడ్డి, సుకుమారి, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బోధన, బోధనేతర ఉద్యోగులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు వీసీ, రిజిస్ట్రార్ బహుమతులను అందజేశారు. తొలుత వీసీ ప్రతాప్రెడ్డి.. ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. సాంకేతిక లోపంతో పాలు విరిగాయి ● విజయ డెయిరీ, వరంగల్ డీడీ ధన్రాజ్ హన్మకొండ చౌరస్తా: డెయిరీలోని మిషనరీలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణం, పాల శీతలీకరణ ప్రక్రియలో అంతరాయం వల్లనే పాలు విరిగినట్లు గుర్తించామని విజయ డెయిరీ వరంగల్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ ధన్రాజ్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన ‘విరిగిన విజయ డెయిరీ పాలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై డెయిరీ డీడీ స్పందించారు. శనివారం హహనుమకొండ అలంకార్ జంక్షన్ సమీపంలో విజయ డెయిరీ కార్యాలయంలో డెయిరీ పరిధిలో పాలు సరఫరా చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, పాడి రైతుల సంఘం బాధ్యులు, డెయిరీ ఉద్యోగులతో డీడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత మిషనరీ పూర్తిగా తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు, సాంకేతిక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విజయ డెయిరీ వినియోగదారులకు నాణ్యమైన పాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని, మార్కెట్లో పాల సరఫరా, నిల్వ, శీతల సరఫరా వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు.● కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి -
పగబట్టిన విధి!
హన్మకొండ చౌరస్తా/ఆత్మకూరు/ఖిలా వరంగల్:/హన్మకొండ అర్బన్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ.. కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నా రు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గుడెప్పాడ్లో మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునా గారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్త సురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శని వారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్గా ఉంచుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకం కొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..?’ అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఒకే కుటుంబంలో రెండేళ్లలో ముగ్గురి మృతి తాడ్వాయి రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీఎంఓ సురేఖ దుర్మరణం కన్నీరు మున్నీరైన బంధువులు -
బిల్లా మహేందర్కు సాహితీ పురస్కారం ప్రదానం
విద్యారణ్యపురి: హనుమకొండలోని పీఆర్రెడ్డి భవన్లో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఒద్దిరాజు సోదరుల స్మృత్యర్థం కవి బిల్లా మహేందర్ రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ ఉత్తమ కవితా సంపుటిని సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి చేతుల మీదుగా బిల్లా మహేందర్కు రూ.10 వేల నగదు పురస్కారం అందించి సత్కరించారు. బాధ్యులు గండ్ర లక్ష్మణ్రావు, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య పుస్తకాన్ని సమీక్షించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. తాను మంచి పాఠకురాలినని, ప్రజలకు మేలు చేసే కవిత్వం బిల్లా మహేందర్ రాస్తున్నారని అభినందించారు. కాగా, ఇదే కార్యక్రమంలో మైక్రో ఆర్టిస్టు మట్టెవాడ అజయ్ని నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సహృదయ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్వీఎన్ చారి నిర్వహించగా, సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహర్బాబు అధ్యక్షత వహించారు. సహృదయ సాంస్కృతిక సంస్థ బాధ్యులు, కవులు పొట్లపెల్లి ఒద్దిరాజు, రఘురావు, ఏవీ నర్సింహారావు, లక్ష్మణ్రావు, సీత వెంకట్, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కలెక్టరేట్ ప్రారంభోత్సవం
ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల (గ్రామీణ రహదారుల) అభివృద్ధి పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. అక్కడినుంచి కలెక్టరేట్కు చేరుకొని రూ.868 కోట్లతో జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల మరో పైలాన్ను ప్రారంభించారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన కలెక్టరేట్ను సీఎం రేవంత్రెడ్డి.. మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. కార్యాలయం అంతా కలియదిరిగి పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును కుర్చీలో ఆసీనులు చేసి శాలువా కప్పారు. నూతన కలెక్టరేట్ పక్కన ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు భవనాలు నిర్మించడంతోపాటు మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి గ్రూప్ ఫొటో దిగారు. -
బోనాల సందడి
వెంకటేశ్వరపల్లిలో బోనాలతో మహిళలుడప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు..పోతురాజుల విన్యాసాల నడుమ జిల్లావ్యాప్తంగా ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రజలు బోనాల పండగ నిర్వహించుకున్నారు. భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, మంగళహారతులు, నైవేద్యాలతో డప్పుచప్పుళ్లతో ఆలయాలకు చేరుకున్నారు. గ్రామదేవతలైన మారెమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. యాటపోతులు, కోళ్లు బలిచ్చారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం కనిపించింది. – రాయపర్తి -
ఇప్పటివరకు ఎంతమందికి చికిత్స అందిందంటే..
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు, పుట్టిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. తక్కువ బరువు, ఇన్ఫెక్షన్ లేదా పచ్చ కామెర్లతో అత్యవసర వైద్యం అవసరమున్న పసికందుల ప్రాణాలకు రక్షణగా నిలు స్తోంది 108 నియోనేటల్ అంబులెన్స్. నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నియోనేటల్ అంబులెన్స్ అత్యవసర వేళల్లో కదిలే మొబైల్ ఐసీయూగా పనిచేస్తోంది. 2023 ఆగస్టులో గ్రేటర్ వరంగల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికి వేల మంది పసికందుల ప్రాణాలు కాపాడాయి. హనుమకొండ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండే ఈ అంబులెన్స్లో నియోనేటల్ కేర్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), పైలట్ విధులు నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణ సమయంలోనే శిశువుకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందిస్తూ నిరంతర వైద్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అత్యవసర పరికరాలతో ఆయుష్షు.. పుట్టిన 28 రోజుల్లోపు శిశువులకు శ్వాస ఆడకపోవడం, తక్కువ బరువు, ఇన్ఫెక్షన్లు, పచ్చకామెర్లు తదితర సమస్యలు తలెత్తినప్పుడు ఈ అంబులెన్స్ కీలకంగా మారుతోంది. ఇందులో శిశువు శరీర ఉష్ణోగ్రతను కాపాడే ఇంక్యుబేటర్, శ్వాస అందించేందుకు పిడియాట్రిక్ వెంటిలేటర్, పల్స్, ఆక్సిజన్ స్థాయి, రక్తపోటు, ఉష్ణోగ్రత, ఈసీజీ వంటి వివరాలను నిరంతరం పర్యవేక్షించే మల్టీ పారా మానిటర్ ఉన్నాయి. నవజాత శిశువు గొంతులో శ్వాసమార్గానికి అడ్డుపడిన ముక్కు, నోటిలోని అవాంఛిత స్రావాలను తొలగించేందుకు సెక్షన్ మెషిన్, మందులను కచ్చితమైన మోతాదులో అందించేందుకు సిరంజీ ఇన్ఫ్యూజన్ పంపు వంటి పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయి.మొత్తం2,655శిశువులు5139371,0342023 2024 2025 2026వెంటిలేటర్, శిశువుకు కచ్చితమైన మోతాదులో ఇంజక్షన్ మందులు ఇవ్వడానికి ఉపయోగపడే సిరంజీ ఇన్ఫ్యూజియన్ పంపు పసికందుల పాలిట సంజీవని ప్రాణాలు కాపాడుతున్న 108 నియోనేటల్ అంబులెన్స్ ఇప్పటి వరకు 2,655 మంది శిశువులకు ఊపిరి -
అభివృద్ధి.. సంక్షేమం.. రాజకీయం!
సీఎం రేవంత్రెడ్డి ములుగు, పరకాల పర్యటన.. ఆద్యంతం ఆసక్తికరంసాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదివారం ములుగు, పరకాల పర్యటన అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ సందేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మేడారంలో వనదేవతలను దర్శించుకుని పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. అక్కడినుంచి ములుగులో హ్యామ్రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం.. చివరగా పరకాలలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, మహిళా సాధికారతకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన సీఎం.. సొంతపార్టీలోని అసంతృప్తులకూ చురకలు అంటించారు. చర్చనీయాంశంగా రాజకీయ సందేశం.. పరకాల సభలో సీఎం ప్రసంగం అభివృద్ధి, సంక్షేమంతోపాటు రాజకీయ సందేశాలతోనూ సాగింది. ప్రజలనుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలన్నారు. ‘కేసీఆర్ ఫ్యామిలీ జస్టిస్ చేస్తే నేను సోషల్ జస్టిస్ చేస్తున్నా.. ఆనాడు కుటుంబసభ్యులకు పదవులు కట్టబెడితే, మేం సామాజిక కోణంలో అవకాశాలు కల్పిస్తున్నాం.. ఇలాంటి నేతలు మహిళలు, ప్రజలకు ఎలా న్యా యం చేస్తారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాలకుర్తిలాంటి చోట పాలన పరాకాష్టకు చేరి కొండలాంటి వ్యక్తులమని చెప్పుకున్న వారు ఎన్నికల్లో బండలా పగిలిపోయారని, ఇప్పటికై నా ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి బలమని గ్రహించాలని పేర్కొన్నారు. సీఎం పర్యటనతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఓరుగల్లుపై వరాల జల్లు వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణకు రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. రెండేళ్లలో విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరంగల్ నగరంలో సుమారు రూ.5,700 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, మిగిలిన ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 32 నెలల పాలనలో రోజూ మూడు గంటలైనా రెస్ట్ తీసుకోలేదు. ప్రజలు అండగా ఉంటే చాలు ఏదైనా సాధిస్తా’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు కావ్య, వేం నరేందర్ రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రాంచంద్రునాయక్, మురళీనాయక్, ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, కలెక్టర్లు హేమంత్ సహదేవరావు, చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, సీపీ శ్వేత, ఎస్పీ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందడి.. ఓరుగల్లుపై వరాల జల్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హామీలు.. నిరుద్యోగులకు మార్గదర్శనం రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సొంతపార్టీ అసంతృప్తులకు చురకలు సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్రెడ్డి తాజా పిలుపు ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి ప్రాధాన్యం దక్కగా.. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రకాశ్రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో గతంలో రేవూరి, మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య విబేధాలు బహిర్గతమైన సందర్భాలున్నాయి. ఫ్లెక్సీల వివాదం ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, మంత్రి సురేఖ గైర్హాజరుకు అధికారిక కారణం వెల్లడికాకపోవడంతో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా.. ‘పరకాలలో రేవూరికే సీఎం అండ’ అన్న సంకేతాన్ని రేవంత్రెడ్డి పర్యటన ఇచ్చిందనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
ఇప్పటివరకు ఎంతమందికి చికిత్స అందిందంటే..
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు, పుట్టిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. తక్కువ బరువు, ఇన్ఫెక్షన్ లేదా పచ్చ కామెర్లతో అత్యవసర వైద్యం అవసరమున్న పసికందుల ప్రాణాలకు రక్షణగా నిలు స్తోంది 108 నియోనేటల్ అంబులెన్స్. నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నియోనేటల్ అంబులెన్స్ అత్యవసర వేళల్లో కదిలే మొబైల్ ఐసీయూగా పనిచేస్తోంది. 2023 ఆగస్టులో గ్రేటర్ వరంగల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికి వేల మంది పసికందుల ప్రాణాలు కాపాడాయి. హనుమకొండ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండే ఈ అంబులెన్స్లో నియోనేటల్ కేర్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), పైలట్ విధులు నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణ సమయంలోనే శిశువుకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందిస్తూ నిరంతర వైద్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అత్యవసర పరికరాలతో ఆయుష్షు.. పుట్టిన 28 రోజుల్లోపు శిశువులకు శ్వాస ఆడకపోవడం, తక్కువ బరువు, ఇన్ఫెక్షన్లు, పచ్చకామెర్లు తదితర సమస్యలు తలెత్తినప్పుడు ఈ అంబులెన్స్ కీలకంగా మారుతోంది. ఇందులో శిశువు శరీర ఉష్ణోగ్రతను కాపాడే ఇంక్యుబేటర్, శ్వాస అందించేందుకు పిడియాట్రిక్ వెంటిలేటర్, పల్స్, ఆక్సిజన్ స్థాయి, రక్తపోటు, ఉష్ణోగ్రత, ఈసీజీ వంటి వివరాలను నిరంతరం పర్యవేక్షించే మల్టీ పారా మానిటర్ ఉన్నాయి. నవజాత శిశువు గొంతులో శ్వాసమార్గానికి అడ్డుపడిన ముక్కు, నోటిలోని అవాంఛిత స్రావాలను తొలగించేందుకు సెక్షన్ మెషిన్, మందులను కచ్చితమైన మోతాదులో అందించేందుకు సిరంజీ ఇన్ఫ్యూజన్ పంపు వంటి పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయి.మొత్తం2,655శిశువులు5131,0349372023 2024 2025 2026వెంటిలేటర్, శిశువుకు కచ్చితమైన మోతాదులో ఇంజక్షన్ మందులు ఇవ్వడానికి ఉపయోగపడే సిరంజీ ఇన్ఫ్యూజియన్ పంపు పసికందుల పాలిట సంజీవని ప్రాణాలు కాపాడుతున్న 108 నియోనేటల్ అంబులెన్స్ ఇప్పటి వరకు 2,655 మంది శిశువులకు ఊపిరి -
నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు
కాశిబుగ్గ: సమాన హక్కు, సమాన గౌరవం, సమాన స్థాయిలో స్టైఫండ్ పెంపు కోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవదిక దీక్షలు ఆదివారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వద్ద ఆయుష్ విద్యార్థులు తమ డిమాండ్ల కోసం నినాదాలు చేస్తూ ఉదయం నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నేటి (సోమవారం) నుంచి రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తామని ఆయుష్ జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బాస్రె పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజేశ్, సంగమేశ్వర్, సంగీత, ప్రణీత, స్నేహబిందు పాల్గొన్నారు. -
అభివృద్ధి.. సంక్షేమం.. రాజకీయం!
సీఎం రేవంత్రెడ్డి ములుగు, పరకాల పర్యటన.. ఆద్యంతం ఆసక్తికరంసాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదివారం ములుగు, పరకాల పర్యటన అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ సందేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మేడారంలో వనదేవతలను దర్శించుకుని పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. అక్కడినుంచి ములుగులో హ్యామ్రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం.. చివరగా పరకాలలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, మహిళా సాధికారతకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన సీఎం.. సొంతపార్టీలోని అసంతృప్తులకూ చురకలు అంటించారు. చర్చనీయాంశంగా రాజకీయ సందేశం.. పరకాల సభలో సీఎం ప్రసంగం అభివృద్ధి, సంక్షేమంతోపాటు రాజకీయ సందేశాలతోనూ సాగింది. ప్రజలనుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలన్నారు. ‘కేసీఆర్ ఫ్యామిలీ జస్టిస్ చేస్తే నేను సోషల్ జస్టిస్ చేస్తున్నా.. ఆనాడు కుటుంబసభ్యులకు పదవులు కట్టబెడితే, మేం సామాజిక కోణంలో అవకాశాలు కల్పిస్తున్నాం.. ఇలాంటి నేతలు మహిళలు, ప్రజలకు ఎలా న్యా యం చేస్తారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాలకుర్తిలాంటి చోట పాలన పరాకాష్టకు చేరి కొండలాంటి వ్యక్తులమని చెప్పుకున్న వారు ఎన్నికల్లో బండలా పగిలిపోయారని, ఇప్పటికై నా ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి బలమని గ్రహించాలని పేర్కొన్నారు. సీఎం పర్యటనతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఓరుగల్లుపై వరాల జల్లు వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణకు రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. రెండేళ్లలో విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరంగల్ నగరంలో సుమారు రూ.5,700 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, మిగిలిన ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 32 నెలల పాలనలో రోజూ మూడు గంటలైనా రెస్ట్ తీసుకోలేదు. ప్రజలు అండగా ఉంటే చాలు ఏదైనా సాధిస్తా’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు కావ్య, వేం నరేందర్ రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రాంచంద్రునాయక్, మురళీనాయక్, ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, కలెక్టర్లు హేమంత్ సహదేవరావు, చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, సీపీ శ్వేత, ఎస్పీ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందడి.. ఓరుగల్లుపై వరాల జల్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హామీలు.. నిరుద్యోగులకు మార్గదర్శనం రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సొంతపార్టీ అసంతృప్తులకు చురకలు సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్రెడ్డి తాజా పిలుపు ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి ప్రాధాన్యం దక్కగా.. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రకాశ్రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో గతంలో రేవూరి, మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య విబేధాలు బహిర్గతమైన సందర్భాలున్నాయి. ఫ్లెక్సీల వివాదం ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, మంత్రి సురేఖ గైర్హాజరుకు అధికారిక కారణం వెల్లడికాకపోవడంతో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా.. ‘పరకాలలో రేవూరికే సీఎం అండ’ అన్న సంకేతాన్ని రేవంత్రెడ్డి పర్యటన ఇచ్చిందనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
నారు ముదురుతుందని..
దుగ్గొండి: వర్షాలు మొహం చాటేశాయి. మిరప నారు ముదిరిపోతోంది. అదను దాటితే పంట పండదు. దీంతో డ్రిప్పు ఉన్న రైతులు మొదట డ్రిప్పు పైపులు పరిచి రెండు మూడు రోజులు నీరు వదిలి పదును కాగానే డ్రిప్పు పైపుల వెంట మిరప మొక్కలు నాటుతున్నారు. ఆదివారం మండలంలోని స్వామిరావుపల్లి గ్రామానికి చెందిన యువరైతు దాసరి రాజు ఇలా డ్రిప్పు ద్వారా నీరు పెట్టి కూలీలతో మిరప మొక్కలు నాటిస్తున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. జపాన్ విద్యాబోధన పరిశీలనకు ఎంపిక నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం తరఫున జపాన్లోని విద్యావిధానం, బోధన పరిస్థితులు, వినూత్న విద్య అనుభవాలను తెలుసుకునేందుకు ఖానాపురం మండలకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు బొమ్మెర కుమారస్వామిని ఎంపికచేశారు. జపాన్ పర్యటన సెప్టెంబర్ 5నుంచి 12 వరకు కొనసాగనుంది. ఈ ప్రతిష్టాత్మక విద్య ప్రేరణ కోసం తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని కుమారస్వామి తెలిపారు. నేటినుంచి మండలస్థాయిలో ప్రజావాణి న్యూశాయంపేట: ప్రతీ సోమవారం జిల్లాస్థాయిలో కలెక్టరేట్, డివిజన్ స్థాయి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణితో పాటు నేటినుంచి మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలో జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ డివిజన్ అధికారులు, మండలస్థాయిలో మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై వినతులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాశిబుగ్గ: ఈ నెల 14న ఎంజీఎంలో ‘పనిచేయని ఎక్స్రే మిషన్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత టెక్నీషియన్లను పిలిపించి మరమ్మతు చేయించడంతో ఎక్స్రే మిషన్లు పని చేస్తున్నాయి. మొత్తం మూడు ఎక్స్రే మిషన్లు పనిచేస్తుండడంతో పేషెంట్ల నిరీక్షణ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పేషెంట్లకు ఎక్స్రేలు తీసేటప్పుడు సంబంధిత అధికారులు రేడియాలజీ విభాగంలో అందుబాటులో ఉండట్లేదన్న ఆరోపణలున్నాయి. చాలావరకు ఎక్స్రేలను స్టూడెంట్ టెక్నీషియన్లు తీస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులు తరచూ సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెట్టుబడిదారుల చేతుల్లో విద్యావ్యవస్థనయీంనగర్: దేశంలో, రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో డెమొక్రటిక్ టీచర్స్ అసోసియేషన్ (డాటా) ఆధ్వర్యంలో ‘తెలంగాణ విద్యా వ్యవస్థ, వరంగల్ డిక్లరేషన్–ప్రజా ఎజెండా’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డాటా రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.మోహినొద్దీన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకుమార్ హాజరై మాట్లాడుతూ.. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల మధ్య ర్యాంకుల కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో అది తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షల్లో 15 సార్లు పేపర్లు లీక్ అయ్యిందని, దళిత, బహుజన, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అతిథులు ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ (విద్యా పరిరక్షణ కమిటీ), ప్రొఫెసర్ ఎ.హరిప్రసాద్ (కేయూ), ప్రొఫెసర్ కేవై.రత్నం (హెచ్సీయూ) ప్రొఫెసర్ ఎం.వెంకటదాసు (ఓయూ), నాగేశ్వర్రావు ప్రసంగించారు. సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రవణ్కుమార్, డీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు, డి.పాపారావు సీనియర్ జర్నలిస్ట్ బండారి లక్ష్మయ్య, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు ఉదయ్సింగ్, సాయిని నరేందర్, సురేందర్, సరోజన, సురేశ్, మల్లేశ్, డాటా సభ్యులు నర్సయ్య, భాస్కర్, స్వామిదాసు పాల్గొన్నారు. -
గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి బస్సుయాత్ర
● కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ.రమణ ఎల్కతుర్తి: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికే కేజీకేఎస్ (తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం) ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ తెలిపారు. మహబూబాబాద్లో ప్రారంభమైన గీతన్నల చైతన్య బస్సు యాత్ర ఆదివారం మండల కేంద్రానికి చేరుకోవడంతో గీత కార్మిక సంఘం నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ సర్కిల్లో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ.. గౌడ కులస్తుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని, గీత కార్మికులకు రూ.4 వేలకు పెన్షన్ పెంచుతామని, ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించి 32 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి రాష్ట్రంలో 1,600 మంది బాధితులకు సంబంధించిన సుమారు రూ.20 కోట్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులకు పింఛన్ ఇవ్వాలని, ప్రతీ గీత కార్మికుడికి కాటమయ్య రక్షణ కిట్లు అందించాలని కోరారు. తాటి, ఈత మొక్కలను వనమహోత్సవం కింద పెద్ద సంఖ్యలో నాటాలని, 460 సొసైటీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రూ.27 కోట్లను విడుదల చేసి నీరా యూనిట్ను పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో గీత కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్రే మిషన్లకు మరమ్మతులు
కాశిబుగ్గ: ఎంజీఎంలో ‘పనిచేయని ఎక్స్రే మిషన్లు’ శీ ర్షికన ఈ నెల 14న ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత టెక్నీషియన్లను పిలిపించి మరమ్మతు చేయించడంతో ఎక్స్రే మిషన్లు ఆదివారం నుంచి పని చేస్తున్నాయి. మొత్తం మూడు ఎక్స్రే మిషన్లు పనిచేస్తుండడంతో పేషెంట్ల నిరీక్షణ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. కాగా, పేషెంట్లకు ఎక్స్రేలు తీసేటప్పుడు సంబంధిత అధికారులు రేడియాలజీ విభాగంలో అందుబాటులో ఉండట్లేదన్న ఆరోపణలున్నాయి. చాలావరకు ఎక్స్రేలను స్టూడెంట్ టెక్నీషియన్లు తీస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులు తరచూ సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాశిబుగ్గ: సమాన హక్కు, సమాన గౌరవం, సమాన స్థాయిలో స్టైఫండ్ పెంపు కోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవదిక దీక్షలు ఆదివారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వద్ద ఆయుష్ విద్యార్థులు తమ డిమాండ్ల కోసం నినాదాలు చేస్తూ ఉదయం నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నేడు (సోమవారం) నుంచి రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తామని ఆయుష్ జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బాస్రె పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజేశ్, సంగమేశ్వర్, సంగీత, ప్రణీత, స్నేహబిందు పాల్గొన్నారు. హసన్పర్తి: సాహితీ రంగంలో విశేష కృషి చేస్తున్న గుంటూరుకు చెందిన లంకా సూర్యనారాయణకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ, గుంటూరు ఆధ్వర్యంలో భీమారంలోని రాధిక నర్సింగ్ హోంలో జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా లంకా సూర్యనారాయణను నగరానికి చెందిన సాహితీవేత్తలు ప్రొఫెసర్ రామా చంద్రమౌళి, డాక్టర్ లంకా శివరామప్రసాద్, డాక్టర్ గన్నమరాజు గిరిరాజామనోహర్ బాబు, అంపశయ్య నవీన్, శ్రీలేఖ అభినందించారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సాహిత్య రంగంలో 1.48 లక్షల పుస్తకాలతో గుంటూరులో అన్నమయ్య గ్రంథా లయం స్థాపించి సాహితీ రంగానికి సూర్యనా రాయణ అందిస్తున్న సేవలను కొనియాడారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫై నాన్స్ కమిటీ సమావేశం నేడు (సోమవారం) హైదరాబాద్లోని సెక్రటేరియెట్లో నిర్వహించనున్నారు. కేయూలో 24వ కాన్వొకేషన్ను ఈఏడాది నవంబర్లో నిర్వహించాలని వర్సిటీ అధికారులు తాజాగా నిర్ణయించారు. గోల్డ్మెడల్స్కు, తదితర నిర్వహణ ఖర్చుల నిమిత్తం నిధుల వినియోగానికి ఫైనాన్స్ కమిటీ అప్రూవల్ కోసం ఎజెండాలో పెట్టారు. అదేవిధంగా వర్సిటీ పరిధిలో వివిధ పనులకు ఎంతెంత వెచ్చించనున్నారో ఇందులో చర్చించనున్నారు. ఫైనాన్స్ కమిటీ సమావేశం ఆమోదం పొందాక ఈనెల 18న కేయూలో జరిగే పాలకమండలి సమావేశంలోనూ ఆమోదం లభించాల్సి ఉంటుంది. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, ఫైనాన్స్ కమిటీ సభ్యులు కేయూ ప్రొఫెసర్ సురేశ్లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి నేటి సమావేశంలో పాల్గొంటారు. -
రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కలెక్టరేట్ ప్రారంభోత్సవం
ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల (గ్రామీణ రహదారుల) అభివృద్ధి పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. అక్కడినుంచి కలెక్టరేట్కు చేరుకొని రూ.868 కోట్లతో జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల మరో పైలాన్ను ప్రారంభించారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన కలెక్టరేట్ను సీఎం రేవంత్రెడ్డి.. మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. కార్యాలయం అంతా కలియదిరిగి పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును కుర్చీలో ఆసీనులు చేసి శాలువా కప్పారు. నూతన కలెక్టరేట్ పక్కన ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు భవనాలు నిర్మించడంతోపాటు మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి గ్రూప్ ఫొటో దిగారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ఖానాపురం: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. మండలంలోని పాకాలలో ఆదివారం పీఆర్టీయూ టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. పెండింగ్లో ఉన్న డీఏల విడుదల, పీఆర్సీ అమలు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముందుండి పని చేస్తామని హామీ ఇచ్చారు. పదోన్నతులు, బదిలీలు, ఏకీకృత సర్వీస్ సమస్యలు, పెండింగ్ బిల్లులు, జీతభత్యాల సమస్యలు, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాల అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేందర్ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘం బాధ్యులు పాల్గొన్నారు. -
పగబట్టిన విధి!
అప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.హన్మకొండ చౌరస్తా/ఆత్మకూరు/ఖిలా వరంగల్:/హన్మకొండ అర్బన్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ.. కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గూడెప్పాడ్లో మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్త సురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జులైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనా రోగ్యంతో ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శని వారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్గా ఉంచుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకం కొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జులైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..? అంటూ బంధువుల ను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే కుటుంబంలో రెండేళ్లలో ముగ్గురి మృతి తాడ్వాయి రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీఎంఓ సురేఖ దుర్మరణం కన్నీరు మున్నీరైన బంధువులు -
తండ్రి కల నెరవేరకుండానే..
వరంగల్ స్పోర్ట్స్/ఖిలా వరంగల్: మైదానంలో పరుగులు తీస్తూ.. బంతిని బౌండరీ దాటిస్తూ.. ఒక రోజు జాతీయజట్టు తరఫున తన కుమారుడు ఆడాలన్నది ఆ యువ క్రికెటర్ తండ్రి కల. తన తండ్రి కలను నెరవేర్చాలని ఆ కుమారుడి తపన మధ్యలో ఆగిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. అటు తండ్రి కన్న కల, ఆ యువ క్రికెటర్ ఆశయం నెరవేరకుండానే ఇటీవల హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్ను మూశాడు. ఈఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రిడాకారులను విషాదంలో ముంచెత్తాడు. వరంగల్ ఎస్ఆర్ఆర్తోటకు చెందిన విశ్వనాఽథ్ ఓం ప్రకాశ్, కవిత దంపతులు కుమారుడు వైష్ణవ్(21)కు చిన్ననాటి ఉంచే క్రికెట్పై ఆసక్తి ఉండేది. తన కుమారుడిని జాతీయ స్థాయి క్రికెటర్గా చూడాలన్న ఆశతో హైదరాబాద్లోని ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పించారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తెలంగాణ–20 పోటీల్లో వరంగల్ వారియర్స్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో జూలై 26వ తేదీన రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తున్న వైష్ణవ్ను వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వైష్ణవ్ను సికింద్రాబా ద్లోని యశోద ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. సుమారు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. కా గా, విశ్వనాథ్ వైష్ణవ్ వరంగల్ జట్టు నుంచి అండర్–14, 16, 19 వి భాగాలతోపాటు వరంగల్–2, 3డే టీములకు ప్రాతినిఽథ్యం వహించాడు. వేసవిలో జరిగిన శ్రీలంక టూర్లో వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్నాడు. కన్నీటి వీడ్కోలు.. నిన్నటి వరకు క్రికెట్ మైదానంలో పరుగులు తీసిన యువకుడు, నేడు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. క్రికెట్ అభిమానులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఎస్ఆర్ఆర్తోటలో యువ క్రికెటర్ వైష్ణవ్ మృతదేహాన్ని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మేనల్లుడు యువ నేత విష్ణువర్ధన్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం స్థానిక శ్మశాన వాటికలో ఆంత్యక్రియలు జరిగాయి. రోడ్డు ప్రమాదంలో యువ క్రికెటర్ దుర్మరణం టీజీ –20లో చోటు.. విషాదంలో వరంగల్ క్రీడాభిమానులు -
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
మధ్యకోటలోని ఖుష్మహల్ మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శనివారం స్మార్ట్ రేషన్కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర వేడుకల అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,96,929 కార్డులు, 8,94,791 మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కార్డులను పంపిణీ చేయగా.. నేడు సీఎం రేవంత్రెడ్డి స్మార్ట్కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినక తక్కువ ధరకే విక్రయించేవారని గుర్తు చేశారు. ప్రతినెల ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తోందని వివరించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ స్మార్ట్కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్నాయక్ మంత్రి సురేఖను కలిసి డీలర్లకు రూ.ఐదువేల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300 కమిషన్ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, గణేశ్, డీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, మార్కెట్ డైరెక్టర్ గజ్జెల శ్యాం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం, గోపాల నవీన్రాజు ఉన్నారు. -
బోనాల పండుగకు వస్తుండగా..
రాయపర్తి: హైదరాబాద్లో ఉంటున్న ఓ కుటుంబం తన స్వగ్రామానికి బోనాల పండుగకు వస్తుండగా ఘట్కేసర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి చెందగా, తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన గూబ సురేష్, గూబ ఉమారాణి దంపతులు ఇరవై ఏళ్లక్రితం జీవనోపాధికోసం హైదరాబాద్కు వలసవెళ్లారు. వారాసీగూడలో నివాసం ఉంటూ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ సొంత గ్రామంలో ఆదివారం బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు బంధువుల ద్వారా తెలుసుకున్న సురేష్ తన భార్య ఉమారాణి, కుమార్తె గూబ శ్రావణి(30)తో కలిసి తమ టూ వీలర్పై సొంత గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఘట్కేసర్ బైపాస్ రోడ్డు వద్ద ఓ లారీ అజాగ్రత్తగా, అతివేగంతో వచ్చి వీరు ప్రయాణిస్తున్న టూవీలర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రావణి అక్కడికక్కడే మృతిచెందగా, భార్యాభర్తలు సురేష్, ఉమారాణికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. పండుగ కోసం వస్తుండగా ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి, తల్లిదండ్రులకు తీవ్రగాయాలు హైదరాబాద్ ఘట్కేసర్లో ఘటన.. సన్నూరు గ్రామంలో విషాదఛాయలు -
వరంగల్
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20267సీఎం దూరదృష్టితోనే అన్నిరంగాల్లో జిల్లా ప్రగతి● 80వ స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర అటవీ,పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ● ఖుష్మహల్ మైదానంలో జాతీయ పతాకం ఆవిష్కరణఖిలా వరంగల్: జిల్లా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం దూరదృష్టితో జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రత్యేక వాహనంపై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో సాధారణంగా 1,39,997 ఎకరాల్లో వరి సాగవుతుండగా.. ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో 51,045 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయని తెలిపారు. మరో 44,745 ఎకరాల్లో మొక్కజొన్న, పెసర తదితర ఆరుతడి పంటల సాగవుతున్నాయని పేర్కొన్నారు. రైతుబీమా కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 242 మంది రైతుల కుటుంబాలకు రూ.12.10 కోట్ల ఆర్థిక సాయం అందించామని వివరించారు. 20,925 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని తెలిపారు. 1,40,862 కుటుంబాలకు గృహజ్యోతి.. గృహజ్యోతి పథకం కింద 1,40,862 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.128.82 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 9,522 ఇళ్లు మంజూరు కాగా, 2,973 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా 2,114 మహిళా సంఘాలకు రూ.148.80 కోట్ల రుణాలు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. 34,964 మంది విద్యార్థుల యూనిఫాం తయారీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. వరంగల్లో రూ.1,371 కోట్లతో 2,100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం 90 శాతం పూర్తయ్యిందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో రూ.56.06 కోట్ల వ్యయంతో 10,565 మందికి వైద్యం అందించామన్నారు. 18,969 మంది విద్యార్థులకు అల్పాహారం.. 295 పాఠశాల్లో 18,969 మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. 458 ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.10.45 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. మూడు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ.1.36 కోట్లు మంజూరు చేశామని, 1,594 మంది విద్యా ర్థులకు మధ్యాహ్నం భోజనం, ఉదయం అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 818 మంది మైనారిటీ విద్యార్థులకు రూ. 94.18 లక్షలు చెల్లించామని, ఇందిరా మహిళా శక్తి కుట్టుమిషన్ల పథకం కింద 498 కుట్లు మిషన్లను అందించామని తెలిపారు. టెక్స్టైల్ పార్కుకు 1,357 ఎకరాల భూమి.. గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని టెక్స్టైల్ పార్కుకు 1,357 ఎకరాల భూమిని సేకరించామని మంత్రి వివరించారు. 866 మంది రైతులకు రూ.145 కోట్ల పరిహారం చెల్లించామని, భూములు ఇచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, ఈప్రాంత ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్లో రన్వే విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని సేకరించి 330 మంది రైతులకు రూ.258 కోట్ల పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. వరంగల్ బస్స్టేషన్ పనులు కొనసాగుతున్నాయని, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.94.10 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదం పొందాయని చెప్పారు. వనమహోత్సవంలో భాగంగా 25.51 లక్షల మొక్కలు నాటే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 11.50 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి తెలిపారు. పాకాల అర్బన్ ఫారెస్ట్ను అభివృద్ధి చేస్తామన్నారు. -
పుట్టిన రోజు నాడే అంతిమ యాత్ర
నర్సంపేట/ఆలేరురూరల్ : నాన్న.. ఇంటికి వస్తున్నా.. నా పుట్టిన రోజు ఇంటివద్దనే జరుపుకుందాం.. అని తండ్రికి చెప్పాడు. కానీ, విధి కనికరించలేదు. రోడ్డు ప్రమాదంరూపంలో వచ్చిన మృత్యువు ఆ యువకుడిని కబళించడంతో పుట్టినరోజు నాడే అంతిమ యాత్ర నిర్వహించడంతో ముగ్దుంపురంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముగ్దుంపురం గ్రామానికి చెందిన చీకటి ప్రభాకర్ –భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి వివాహం జరగగా చిన్న కుమారుడు ప్రదీప్(26) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. ప్రదీప్ ఆగస్టు 15న తన బర్త్డే, చిన్నమ్మ ఇంట్లో బోనాల పండుగ, తర్వాత రోజు తన తల్లి ఆరునెలల మాసికం నిర్వహించేందుకు తండ్రికి ఫోన్ చేసి బైక్పై ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. దీంతో బైక్పై వద్దని బస్సులో రావాలని తండ్రి సూచించాడు. కానీ, ఓ యువతితో కలిసి హైదరాబాద్ నుంచి నర్సంపేటకు వస్తుండగా ఆలేరు బైపాస్లో బహద్దూర్పేట ఫ్లైఓవర్ దాటగానే వెనుక నుంచి గూడ్స్ వాహనం ఢీ కొట్టడంతో ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. యువతి కాలుకు తీవ్రగాయం కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. ఏడాదిలోనే ఇంట్లో మరో విషాదం.. ఆరు నెలల క్రితం తల్లి భాగ్యమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి కుటుంబం తేరుకుంటోంది. ఈక్రమంలో నాన్నతో ఆనందంగా గడుపుదామనుకున్న ప్రదీప్ మృతి చెందడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. యువకుడి తండ్రి చీకటి ప్రభాకర్ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తుండగా కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గుండెలవిసేలా విలపించాడు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఘటన నర్సంపేటలో విషాదఛాయలు -
కేయూ అభివృద్ధికి రూ.400 కోట్లతో ప్రతిపాదనలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.400 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. 50 ఏళ్ల కేయూ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ లక్ష్యాల వైపు మరింత దృఢంగా సాగాలని పిలుపునిచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమం, పరిపాలనా సంస్కరణల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రూసా ప్రాజెక్టు ద్వారా రూ.50 కోట్లతో వివిధ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీ అనుమతి లభించిందన్నారు. కేయూలోని గ్రంథాలయ అభివృద్ధికి రూ.కోటి కేటాయించామని తెలిపారు. ఈ వేడుకల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య వెంకట్రాంరెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేష్లాల్, రమ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బోధన, బోధనేతర ఉద్యోగులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. -
ఉత్తములకు ప్రశంస
ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్ మహల్ మైదానంలో శనివారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలందించిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్తో కలిసి ప్రశంసపత్రాలు అందించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ -
రూ.66.36 కోట్ల ధాన్యం మాయం!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిల వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యం /ధాన్యం లెక్కల్లో భారీగా తేడాలు బయటపడుతున్నాయి. విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 25,689.522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.66.36 కోట్లుగా తేలింది. సీఎంఆర్ బకాయిల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. 20 రోజుల్లో 16 రైస్మిల్లులను తనిఖీ చేయగా.. పలు మిల్లుల్లో ధాన్యం లేనట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆరు మిల్లులపై కేసులు నమోదు చేసి, స్వల్ప తేడా ఉన్న మిల్లర్లకు నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్లో మొత్తం సీఎంఆర్ బకాయి రూ.230 కోట్ల వరకు ఉండగా, వాటి వసూళ్ల కోసం దాడులు, తనిఖీలు కొనసాగుతున్నాయి. పక్కదారి పట్టిన సీఎంఆర్.. ఎక్కడెక్కడ ఎంత? తనిఖీల్లో బయటపడిన మొత్తం కొరత 25,689.522 టన్నులు కాగా, ఆరుగురు మిల్లర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ఆయా మిల్లులపై అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. కొన్ని మిల్లులకు సంబంధించిన వ్యక్తులు అందుబాటులో లేకపోవడంలో నోటీసులు జారీ చేశామని, మరికొన్ని కేసుల్లో తదుపరి చర్యలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. ● హనుమకొండ జిల్లాలో మూడు మిల్లుల్లో 6,853.306 టన్నుల ధాన్యం కొరతగా, దాని విలువ రూ.17.27 కోట్లుగా నమోదైంది. గట్లకానిపర్తిలో మెస్సర్స్ లక్ష్మీ నర్సింహ ఇండస్ట్రీస్, మెస్సర్స్ శ్రీవినాయక ఇండస్ట్రీస్లపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ● వరంగల్లో రెండు మిల్లుల్లో 2,285.232 టన్నుల ధాన్యం మాయం కాగా, దాని విలువ రూ.5.20 కోట్లుగా అధికారులు గుర్తించారు. నర్సంపేటలోని సుగుణ ఇండస్ట్రీస్పై కేసు నమోదైంది. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెండు మిల్లుల్లో 3,007.244 టన్నుల ధాన్యం కొరతగా ఉండగా, వాటి విలువ రూ.7.88 కోట్లుగా తేలింది. రూ.4.39 కోట్లు బకాయి ఉన్న గిద్దెముత్తారంలోని వైష్ణవి ఇండస్ట్రీస్ మిల్లుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ● ములుగులో రెండు మిల్లుల్లో తనిఖీ చేయగా, 1,574.217 టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఆ ధాన్యం విలువ రూ.3.59 కోట్లుగా నమోదైంది. ● మహబూబాబాద్ జిల్లాలో నాలుగు మిల్లుల్లో 1,103.250 టన్నుల ధాన్యం లేకపోగా, వాటి విలువ రూ.3.08 కోట్లుగా తేలింది. కేసముద్రంలోని బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీ, తిరుమల బిన్నీ రైసుమిల్లులపై కేసులు పెట్టగా, ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ● జనగామ జిల్లా బచ్చన్నపేట శ్రీమిత్ర అగ్రో ఇండస్ట్రీస్, జఫర్గడ్ మండలం తిమ్మంపేటలోని పీఎస్కే ఆగ్రో ఇండస్ట్రీస్లలో విజిలెన్స్, సివిల్సప్లయ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు మిల్లుల్లో రూ.2.29 కోట్ల విలువైన 833.206 టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. తదుపరి చర్యలకు పౌరసరఫరాలశాఖను ఆదేశించారు. పాత బకాయిలపై నజర్ తనిఖీల్లో బయటపడిన కొరతలో కొంతభాగం 2022–23 ధాన్యానికి సంబంధించిన పాత బకాయిలపై కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నజర్ పెట్టారు. అలాంటి మిల్లులపై సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారులకు తదుపరి చర్యల కోసం రిక్విజిషన్లు పంపినట్లు సమాచారం. కాగా, సీఎంఆర్ కోసం ప్రభుత్వ ధాన్యాన్ని తీసుకున్న మిల్లుల్లో నిల్వలు, మిల్లింగ్ అనంతరం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం, మిల్లుల్లో అందుబాటులో ఉన్న ధాన్యం తదితర లెక్కలను అంచనా వేసి బకాయిలు రాబట్టడంపై దృష్టి పెడుతున్నారు. ఇదిలా ఉండగా, సీఎంఆర్ బకాయిలపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్ష అనంతరం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మరింత దూకుడు పెంచారు. పౌరసరఫరాలశాఖ సమన్వయంతో బకాయిదారుల రైసుమిల్లుల్లో తనిఖీలు నిర్వహించి ధాన్యం గుట్టు విప్పుతున్నారు. సీఎంఆర్ చెల్లించక, ధాన్యం నిల్వ చూపని మిల్లర్లను గుర్తించి కేసులు పెడుతున్నారు. అందుబాటులో లేని డిఫాల్టర్లకు నోటీసులు జారీ చేస్తుండగా.. అందుబాటులో ఉన్న మిల్లర్లపై కేసులు, బకాయిల వసూలుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీఎంఆర్ బకాయిల వ్యవహారంలో ఇక నుంచి మరింత కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు అధికార వర్గాలనుంచి వెలువడుతున్నాయి. ‘విజిలెన్స్–సివిల్ సప్లయీస్’ తనిఖీల్లో బట్టబయలు సీఎంఆర్ ఎగవేతపై కేసుల కొరడా... ఆరుగురు మిల్లర్లపై ఎఫ్ఐఆర్లు.. స్వల్ప తేడా ఉన్నవారికి నోటీసులు.. 25,690 టన్నుల ధాన్యం కొరత... కొనసాగుతున్న తనిఖీలు సీఎం సమీక్ష తర్వాత మరింత దూకుడు పెంచిన అధికారులు రైస్ మిల్లర్ అరెస్ట్ వేలేరు: సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేసిన కేసులో మండలంలోని మల్లికుదుర్ల గ్రామానికి చెందిన రాజరాజేశ్వర రైస్మిల్లర్ యాజమాని మండల అరుణ్కుమార్ను అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2023–24 ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం 1,585,040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. అందుకు అనుగుణంగా సదరు మిల్లర్ అరుణ్కుమార్ 1,061,976 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 602.111 మెట్రిక్ టన్నుల ధాన్నాన్ని మాత్రమే అందజేశారు. మిగతా 459.865 మెట్రిక్ టన్నుల బకాయి ఉంది. దీంతో జిల్లా సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం నిల్వలు అందుబాటులో లేవని గుర్తించి రైస్ మిల్లులో ధాన్యం లేదని ఆయన ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. బకాయి విలువ 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ కలిపి మొత్తం రూ.2,42,02,477 ఉన్నట్లు అధికారులు గుర్తించి పోలీస్ స్టేషన్లో అరుణ్కుమార్పై పిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మండల అరుణ్కుమార్ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వేలేరు ఎస్సై అజ్మీర సురేశ్, తదితరులు ఉన్నారు. -
అవమానించడం బీజేపీ సంస్కృతి
హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరు వారి సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విమర్శించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఖర్గేకు సంఘీభావంగా సత్యాగ్రహ నిరసన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రగా పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పబ్లిక్గార్డెన్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్ష వద్ద ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే వంటి సీనియర్ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకుల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నిరసన ర్యాలీలో కాంగ్రెస్ టీపీసీసీ, డీసీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అంబేడ్కర్ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ -
నల్సార్ విద్యార్థులపై చర్య అప్రజాస్వామికం
ఖిలా వరంగల్: శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్న నల్సార్ విద్యార్థులపై చర్య అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ అన్నారు. విద్యార్థుల నిరసనను అడ్డుకోవడానికి బార్ కౌన్సిల్ ఆప్ ఇండియా(బీసీఐ) ఎవరని, విద్యార్థులను లాయర్లుగా నమోదు చేసుకోవద్దని ఆదేశించడం, వారిని బెదిరించడం వంటి చర్యలు పూర్తి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. వారం రోజులపాటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన సీపీఐ పాదయాత్ర శుక్రవారం నగరంలోని శివనగర్లోని సీసీఐ తమ్మెర భవనంలో ముగిసింది. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ బాష్మియా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడారు. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించవద్దని విద్యార్థులు వీసీకి విజ్ఞప్తి చేయడం వారి నిరసనలో భాగమని ఆయన పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ -
రూ.66.36 కోట్ల ధాన్యం మాయం!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిల వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యం /ధాన్యం లెక్కల్లో భారీగా తేడాలు బయటపడుతున్నాయి. విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 25,689.522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.66.36 కోట్లుగా తేలింది. సీఎంఆర్ బకాయిల వసూళ్లపై ప్రభుత్వం దష్టి సారించడంతో అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. 20 రోజుల్లో 16 రైస్మిల్లులను తనిఖీ చేయగా.. పలు మిల్లుల్లో ధాన్యం లేనట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో 6 మిల్లులపై కేసులు నమోదు చేసి, స్వల్ప తేడా ఉన్న మిల్లర్లకు నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్లో మొత్తం సీఎంఆర్ బకాయి రూ.230 కోట్ల వరకు ఉండగా, వాటి వసూళ్ల కోసం అధికారుల దాడులు, తనిఖీలు కొనసాగుతున్నాయి. పక్కదారి పట్టిన సీఎంఆర్.. ఎక్కడెక్కడ ఎంత..? తనిఖీల్లో బయటపడిన మొత్తం కొరత 25,689.522 టన్నులు కాగా ఆరుగురు మిల్లర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ఆయా మిల్లులపై అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. కొన్ని మిల్లులకు సంబంధించిన వ్యక్తులు అందుబాటులో లేకపోవడంలో నోటీసులు జారీ చేశామని, మరికొన్ని కేసుల్లో తదుపరి చర్యలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. ● హనుమకొండ జిల్లాలోని మూడు మిల్లుల్లో 6,853.306 టన్నుల ధాన్యం కొరతగా, దాని విలువ రూ.17.27 కోట్లుగా నమోదైంది. గట్లకానిపర్తిలో మెస్సర్స్ లక్ష్మీ నర్సింహ ఇండస్ట్రీస్, మెస్సర్స్ శ్రీవినాయక ఇండస్ట్రీస్పె ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ● వరంగల్ జిల్లాలోని రెండు మిల్లుల్లో 2,285.232 టన్నుల ధాన్యం మాయం కాగా దాని విలువ రూ.5.20 కోట్లుగా అధికారులు గుర్తించారు. నర్సంపేటలోని సుగుణ ఇండస్ట్రీస్పై కేసు నమోదైంది. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెండు మిల్లుల్లో 3,007.244 టన్నుల ధాన్యం కొరతగా ఉండగా, వాటి విలువ రూ.7.88 కోట్లుగా తేలింది. రూ.4.39 కోట్లు బకాయి ఉన్న గిద్దెముత్తారంలోని వైష్ణవి ఇండస్ట్రీస్ మిల్లుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ● ములుగు జిల్లాలోని రెండు మిల్లుల్లో తనిఖీ చేయగా 1,574.217 టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఆ ధాన్యం విలువ రూ.3.59 కోట్లుగా నమోదైంది. ● మహబూబాబాద్ జిల్లాలోని నాలుగు మిల్లుల్లో 1,103.250 టన్నుల ధాన్యం లేకపోగా, వాటి విలువ రూ.3.08 కోట్లుగా తేలింది. కేసముద్రంలోని బాలాజీ ఆగ్రోఇండస్ట్రీ, తిరుమల బిన్నీ రైస్ మిల్లులపై కేసులు పెట్టగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ● జనగామ జిల్లా బచ్చన్నపేట శ్రీమిత్ర ఆగ్రో ఇండస్ట్రీస్, జఫర్గడ్ మండలం తిమ్మంపేటలోని పీఎస్కే ఆగ్రో ఇండస్ట్రీస్లో విజిలెన్స్, సివిల్సప్లయీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు మిల్లుల్లో రూ.2.29 కోట్ల విలువైన 833.206 టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. తదుపరి చర్యలకు పౌరసరఫరాలశాఖను ఆదేశించారు. పాత బకాయిలపైనా నజర్ తనిఖీల్లో బయటపడిన కొరతలో కొంతభాగం 2022–23 ధాన్యానికి సంబంధించిన పాత బకాయిలపై కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నజర్ పెట్టారు. అలాంటి మిల్లులపై సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారులకు తదుపరి చర్యల కోసం రిక్విజిషన్లు పంపినట్లు సమాచారం. కాగా సీఎంఆర్ కోసం ప్రభుత్వ ధాన్యాన్ని తీసుకున్న మిల్లుల్లో నిల్వలు, మిల్లింగ్ అనంతరం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం, మిల్లుల్లో అందుబాటులో ఉన్న ధాన్యం తదితర లెక్కలను అంచనా వేసి బకాయిలు రాబట్టడంపై దృష్టి పెడుతున్నారు. ఇదిలా ఉండగా సీఎంఆర్ బకాయిలపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్ష అనంతరం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మరింత దూకుడు పెంచారు. పౌరసరఫరాలశాఖ సమన్వయంతో బకాయిదారుల రైస్మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి ధాన్యం గుట్టు విప్పుతున్నారు. సీఎంఆర్ చెల్లించక, ధాన్యం నిల్వ చూపని మిల్లర్లను గుర్తించి కేసులు పెడుతున్నారు. అందుబాటులో లేని డిఫాల్టర్లకు నోటీసులు జారీ చేస్తుండగా.. అందుబాటులో ఉన్న మిల్లర్లపై కేసులు, బకాయిల వసూలుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీఎంఆర్ బకాయిల వ్యవహారంలో ఇక నుంచి మరింత కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు అధికార వర్గాలనుంచి వెలువడుతున్నాయి. ‘విజిలెన్స్–సివిల్ సప్లయీస్’ తనిఖీల్లో బట్టబయలు సీఎంఆర్ ఎగవేతపై కేసుల కొరడా... ఆరుగురు మిల్లర్లపై ఎఫ్ఐఆర్లు.. స్వల్ప తేడా ఉన్నవారికి నోటీసులు.. 25,690 టన్నుల ధాన్యం కొరత... కొనసాగుతున్న తనిఖీలు సీఎం సమీక్ష తర్వాత మరింత దూకుడు పెంచిన అధికారులు -
హెచ్ఐవీ కేసులను నమోదు చేయాలి
గీసుకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో హెచ్ఐవీ కేసులను సంబంధిత వైద్యులు, సిబ్బంది రికార్డుల్లో తప్పనిసరిగా నమోదుచేయాలని వరంగల్, హనుమకొండ డీఎంహెచ్ఓలు డాక్టర్ బి.రాజారెడ్డి, డాక్టర్ అప్పయ్య అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఎయిడ్స్ నివారణ, నియంత్రణ యూనిట్ ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్లు, ఐసీటీసీ కౌన్సిలర్లు, ఎన్జీఓ ప్రతినిధులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారికి ఏఆర్టీ, కౌన్సెలింగ్, ఇతర వైద్య సేవలను క్రమం తప్పకుండా అందించాలన్నారు. హై రిస్క్ ఉన్న వారిని హెచ్ఐవీ స్క్రీనింగ్ చేసుకునేలా మోటివేట్ చేయాలని కోరారు. ప్రోగాం అధికారులు డాక్టర్ మదన్మోహన్, డాక్టర్ అరుణ్జోషి, ప్రోగ్రాం మేనేజర్ స్వప్నమాధురి, డేటా మేనేజర్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాయకుల అర్ధనగ్న ప్రదర్శన
వరంగల్ చౌరస్తా: అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుంచి అర్ధనగ్న ప్రదర్శనగా కాశిబుగ్గ జంక్షన్కు చేరుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ఖాన్, తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
నిస్వార్థ కమ్యూనిస్టు యోధుడు పీసీఆర్
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని దుగ్గొండి: నిస్వార్థ కమ్యూనిస్టు యోధుడు పీసీఆర్ (పుచ్చకాయల చంద్రారెడ్డి) అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. నాచినపల్లి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పుచ్చకాయల చంద్రారెడ్డి 12 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈమేరకు ఆయన స్వగ్రామంలో శుక్రవారం సంస్మరణ సభ నిర్వహించారు. మొదట సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ(యూ), బీఆర్ఎస్ నాయకులు పీసీఆర్ చిత్రపటం వద్ద జోహార్లు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో తమ్మినేని ప్రసంగించారు. కమ్యూనిస్టు బాట ముళ్లబాట.. ముళ్లబాటను ఎంచుకుని పూలబాటగా ముందుకు సాగినవారే నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ సంయమనంతో నర్సంపేట డివిజన్లో పార్టీని కాపాడిన ఘనత పీసీఆర్కే దక్కుతుందన్నారు. పార్టీకి చెందిన ప్రతి రూపాయిని సక్రమంగా క్రమశిక్షణగా ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రారెడ్డి మృతి తీరని లోటు పుచ్చకాయల చంద్రారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఎంసీపీఐ(యూ) పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. చంద్రారెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గొల్లపల్లి నాగయ్య, పోతినేని సుదర్శన్రావు, చూడి కృష్ణారెడ్డి, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల కార్యదర్శులు రంగయ్య, ప్రభాకర్రెడ్డి, సాంబశివ, ఈసంపల్లి బాబు, బోళ్ల సాంబయ్య, స్థానిక సర్పంచ్ పెండ్యాల రాజు, పీసీఆర్ కుటుంబ సభ్యులు మల్లక్క, భాస్కర్రెడ్డి, జనార్దన్రెడ్డి, అరుణశ్రీ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా టెన్నిస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఒక్క రోజు ఇంటర్నల్ టోర్నమెంట్ నిర్వహించారు. 60 ప్లస్ కేటగిరీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ డాక్టర్ ఎర్రగట్టు స్వామి–కె.రవిచంద్ర, కుంజ్ బిహారి–పి.వెంకటేశ్వరరావు మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఎర్రగట్టు స్వామి, రవిచంద్ర జట్టు విజేతగా నిలిచింది. ఓపెన్ కేటగిరీ డబుల్స్ విభాగంలో వినీల్కుమార్, శ్రీనివాస్ జట్టు విజేతగా నిలవగా, ద్వితీయ స్థానంలో ప్రదీప్త, కార్తికేయ జట్టు ట్రోఫీని అందుకుంది. సింగిల్స్ విభాగంలో ప్రథమ స్థానంలో టి.సాత్విక్, ద్వితీయ స్థానంలో వినీల్కుమార్ విజేతలుగా నిలిచారు. ముగింపు పోటీలకు ముఖ్య అతిథులుగా అసోసియేషన్ ప్యాట్రన్ శ్రీనివాసరావు, డీవైఎస్ఓ ప్రశాంత్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. నయీంనగర్: కాకతీయ మ్యూజికల్ గార్డెన్ను నేడు (శనివారం) నుంచి ప్రజలు సందర్శించడానికి అందుబాటులోకి తీసుకొచ్చామని హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్మన్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వాకర్లు, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు సాధారణ సందర్శకులు గార్డెన్ను సందర్శించవచ్చని పేర్కొన్నారు. గార్డెన్ నిర్వహణ, సౌకార్యాల పరిరక్షణ కోసం సందర్శకుల నుంచి కనీస రుసుము వసూలు చేస్తారని తెలిపారు. రోజూ సాయంత్రం 7:30 గంటలకు మల్టీమీడియా షో (మ్యూజికల్ షో) ఉంటుందని తెలిపారు. ఈగార్డెన్.. సందర్శకులకు వినోదంతో పాటు ఆహ్లాదకర వాతావరణం అందించనున్నట్లు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కాశిబుగ్గ: కాశిబుగ్గలోని సాయి గణేశ్ కాలనీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవగింజపై జాతీయ పతాకం చిత్రించి ఆకట్టుకున్నారు. కాగా, సూక్ష్మ కళలో ఆయన ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు గతంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డులు అందించాయి. హన్మకొండ అర్బన్: హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించిన ప్రతీ కేసును తప్పనిసరిగా నమోదు చేసి, బాధితులకు ఏఆర్టీ, కౌన్సెలింగ్, వైద్య సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్, హనుమకొండ డీఎంహెచ్ఓలు బి.రాజారెడ్డి, అప్పయ్య సూచించారు. శుక్రవారం వరంగల్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో నోడల్, కార్యక్రమ అధికారి మదన్మోహన్, వరంగల్ కార్యక్రమ అధికారి అరుణ్జోషి, జిల్లా కార్యక్రమ నిర్వాహకురాలు స్వప్న మాధురి, డేటా మేనేజర్ కమలాకర్, ఏఆర్టీ వైద్యాధికారులు, ఐసీటీసీ కౌన్సెలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా ఎయిడ్స్ నివారణ, సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ: విద్యుత్ వినియోగదారులు అపరిచితులనుంచి వచ్చే ఫోన్కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మేం ఎలక్ట్రిసిటీ వాళ్లమని, మీ మీటర్ ఆగిపోయింది.. కాలిపోయింది.. బకాయి ఉంది’ అని కాల్ చేస్తే స్పందించవద్దని పేర్కొన్నారు. ఇలాంటి వారికి నేరుగా డబ్బులు ఇవ్వొద్దని, డిజిటల్ పేమెంట్ చేయొద్దని సూచించారు. ప్రధానంగా 94945 75271 నంబర్తో వచ్చే ఫోన్ కాల్ను నమ్మొద్దని కోరారు. -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ సీపీ శ్వేత ● పరకాల బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన పరకాల: ఈనెల 16న సీఎం ఏనుముల రేవంత్రెడ్డి పరకాలలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తెకుండా పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ సీపీ శ్వేత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పరకాలలోని బహిరంగ సభా ప్రాంగణాన్ని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సీపీ శ్వేత, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ బాషాతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు. సీఎం పర్యట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ వారికి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. సభా వేదిక పరిశీలనలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, డీసీపీ అంకిత్, జిల్లా అఽధికారులు, రెవెన్యూ, ఇంజనీరింగ్, మున్సిపల్, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇంటింటా జ్వర సర్వే నిర్వహించాలి
కాశిబుగ్గ: ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి, జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలను సేకరించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి రజని అన్నారు. దేశాయిపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంహెచ్ నగర్లో ఇటీవల నమోదైన కీటక జనిత వ్యాధుల దృష్టా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక మెడికల్ ఆఫీసర్ భరత్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలకు కీటక జనిత వ్యాధులైన డెంగీ, మలేరియా, చికున్ గన్యా వ్యాధుల నివారణకపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని, ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రై డే పాటించాలని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కుమారస్వామి, సదానందం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా మలేరియా నివారణ అధికారి రజని -
మృత్యువుకు ‘లిఫ్ట్’ ఇచ్చినట్టే..!
సాక్షి, వరంగల్/గీసుకొండ: బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయం.. ఆరు అంతస్తులున్న పరిశ్రమలో కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ నాలుగో అంతస్తును కమ్మేసింది. ప్రాణాలు కాపాడుకునేందుకు కార్మికులు పరుగులు తీశారు. కానీ ఇద్దరి జీవితాలు అక్కడే ముగిశాయి. టెక్నీషియన్లుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్కు చెందిన సూర్యప్రకాశ్(31), అదే రాష్ట్రం బెనారస్(వారణాసి)కు చెందిన వినోద్ ప్రజాపతి (30) లిఫ్ట్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. గీసుకొండ మండలంలోని కాకతీయ మెగాటెక్స్టైల్ పార్క్లోని గణేశా ఏకో పెట్ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అదే సమయంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడినీ అప్రమత్తం చేసే గట్టి హెచ్చరికగా మారింది. పాలిస్టర్ ఫైబర్ తయారీలో భాగంగా ప్లాస్టిక్ను కరిగించేందుకు స్టీమ్ను పైపులైన్ ద్వారా పైకి పంపే ప్రక్రియ జరుగుతోంది. పైప్లైన్లో ఎంత వేడితో స్టీమ్ను పై యూనిట్లకు పంపించాలనే విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మొత్తం 80 మంది కార్మికులు ఉండగా మిగతా వారు అప్రమత్తం కావడంతో పెనుప్రమా దం తప్పినట్లయింది. కానీ, పై అంతస్తులకు వెళ్లిన ఇద్దరు లిఫ్ట్లో చిక్కుకొని మంటలు, వేడి, దట్టమైన పొగ మధ్య బయటపడే అవకాశం లేకుండా పోయింది. టెక్స్టైల్ పార్కులోని ఇతర కంపెనీల్లో పర్యావరణ, పొల్యూషన్, ఫైర్, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో సేఫ్టీ ప్రమాణాలపై పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. లిఫ్ట్ వద్దు.. మెట్లే ముద్దు ● భవనాల్లో లేదా ఫ్యాక్టరీల్లో మంటలు చెలరేగితే షార్ట్ సర్క్యూట్లను అరికట్టడానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఆ సమయంలో లిఫ్ట్లో ఉన్నవారు ఫ్లోర్ మధ్యలోనే చిక్కుకుపోతారు. ● లిఫ్ట్ వెళ్లే మార్గం (షాఫ్ట్) ఒక చిమ్నీలా పనిచేస్తుంది. భవనంలో ఉత్పన్నమయ్యే పొగ, విష వాయువులు అత్యంత వేగంగా ఈ షాఫ్ట్ గుండా పైకి పాకుతాయి. దీనివల్ల లిఫ్ట్ లోపల ఉన్నవారికి క్షణాల్లో ఊపిరాడక ఊపిరితిత్తులు దెబ్బతిని స్పృహ తప్పిపోతారు. ● వేడికి లిఫ్ట్ సెన్సార్లు, సర్యూట్లు కాలిపోయి తలుపులు లాక్ అయిపోవడం లేదా మంటలు తీవ్రంగా ఉన్న ఫ్లోర్లోనే లిఫ్ట్ ఆగిపోతుంది. ● అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎంత ఎత్తయిన భవనమైనా, పరిశ్రమ అయినా ఎట్టిపరిస్థితుల్లోనూ లిఫ్ట్ జోలికి వెళ్లకూడదు. ● మంటలు కనిపించిన వెంటనే లిఫ్ట్ వైపు వెళ్లకుండా అత్యవసర మెట్లమార్గం ద్వారా బయటకు రావాలి. ● ప్రతీ కార్మికుడికి ఎమర్జెన్సీ ఎగ్జిట్, మెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఎక్కడున్నాయో ముందుగానే తెలియాలి. ● ప్రమాద సమయంలో ఏం చేయాలో క్రమం తప్పకుండా మాక్డ్రిల్స్ ద్వారా శిక్షణ ఇవ్వాలి. ● కేఎంటీపీలో కై టెక్స్ కంపెనీ షెడ్ల నిర్మాణం జరిగే సమయంలో జరిగిన ప్రమాదాల్లో ఒకరిద్దరు కార్మికులు మృత్యువాత పడినట్లు అప్పట్లో ప్రచా రం జరిగింది. కంపెనీల్లో జరిగే ప్రమాదాల విష యం బయటకు పొక్కకుండా ఆయా కంపెనీల వారు జాగ్రత్తలు పడుతున్నారని, కనీసం పోలీ సులకు సమాచారం ఇవ్వకుండా కొన్ని సందర్బాల్లో విషయాన్ని వారే సెటిల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమయంలో లిఫ్ట్ వాడితే ప్రాణానికి ముప్పు ఏకో గణేశా కంపెనీలో ఈ మాదిరిగానే ఇద్దరి ప్రాణాలు బలి అత్యవసర సమయంలో మెట్ల మార్గమే భద్రమంటున్న అధికారులు గతంలోనూ ఈ కంపెనీలో పలు ప్రమాదాలుగతంలోనూ పలు ప్రమాదాలు?గతంలోనూ ఫైబర్ యార్న్ తయారు చేసే యూనిట్లోని యంత్రంలో ఇరుక్కుని బిహార్కు చెందిన కార్మికుడు ఒకరు మృతి చెందినట్లు కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా సెటిల్ చేసుకున్నట్లు సమాచారం. గతంలో కంపెనీకి ఉద్యోగులను తీసుకుని వచ్చే బస్సు లోనికివెళ్లాక రివర్స్ తీసుకుంటుండగా ఓ మహిళా కార్మికురాలు టైర్ కింద పడి మృతి చెందింది. సురక్షిత మార్గాన్ని ఎంచుకోవాలియంత్రం ఆగితే మళ్లీ నడుస్తుంది. ఉత్పత్తి ఆగితే తిరిగి మొదలవుతుంది. కానీ ప్రాణం పోతే తిరిగిరాదు. ఈ విషాదం మరో కుటుంబాన్ని కన్నీటిలో ముంచకూడదు. ప్రమాదం రాకముందే భద్రత నేర్చుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.. లిఫ్ట్ను కాదు, సురక్షిత మార్గాన్ని ఎంచుకోవాలి.. ప్రాణాలను కాపాడుకోవాలి – యజ్ఞనారాయణ, జిల్లా అగ్నిమాపక విభాగాధికారి -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం
కాళోజీ సెంటర్ : దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రెండో దశ పోరాట కార్యక్రమంలో భాగంగా గురువారం వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఊటుకూరి అశోక్ మాట్లాడుతూ.. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు దాటినా ఇప్పటివరకు నివేదిక స్వీకరించకపోవడం విచారకరమన్నారు. ఆరు డీఏలు పెండింగ్లో ఉండటం, మూడు నెలలుగా ఈహెచ్ఎస్ ప్రీమియం మినహాయిస్తున్నా హెల్త్ కార్డులు జారీ చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించినా స్పందించకపోవడంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 21న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్లో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరావు, మండల బాధ్యులు బెల్లంకొండ పూర్ణచందర్, పూజరి మనోజ్, వెంకటేశ్వర్లు, గోపాల్, దుగ్యాల రవీందర్, తాబేటి కుమార్, కుమార్, ఆనందచారి, పేరం శ్యామ్సుందర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ -
పోలీస్ అధికారుల సంఘం కమిటీ ఎన్నిక
వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఎన్నికలకు నోడల్ అధికారిగా అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, నిర్వహణ కమిటీ సభ్యులుగా అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్య వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో కానిస్టేబుల్ కొండా కరుణాకర్ (ధర్మసాగర్ పోలీస్ స్టేషన్), ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ టి.బాబుపై 17 ఓట్ల అధిక్యంతో నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి.సతీశ్(ఆర్ఐ), బి.శరత్ కుమార్(ఆర్ఎస్ఐ), ప్రధాన కార్యదర్శిగా ఇ.వీరభద్రరావు (దామెర ఎస్ఐ), సంయుక్త కార్యదర్శిగా టి.నరేశ్ (కాజీపేట కానిస్టేబుల్), కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్.ప్రవీణ్కుమార్ (ఏఆర్ కానిస్టేబుల్), కోశాధికారి బి.నరేశ్ (పాలకుర్తి కానిస్టేబుల్), కార్యనిర్వాహక సభ్యులుగా ఎం.తులసి (కానిస్టేబుల్ కాజీపేట), సీ.హెచ్ మహేందర్ యాదవ్ (ఏఆర్ కానిస్టేబుల్), ఏ.రమేశ్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎన్.ప్రవీణ్ (సుబేదారి కానిస్టేబుల్), ఎండీ తాజుద్దీన్ (హనుమకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్), పి.సర్వేశ్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అభినందనలు తెలిపారు. సభ్యుల సంక్షేమానికి పనిచేయాలని కోరారు. అధ్యక్ష, కార్యదర్శులుగా కరుణాకర్, వీరభద్రరావు ఎన్నికల తీరును పరిశీలించిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత -
‘సూపర్’ డిప్యూటీ సూపరింటెండెంట్గా మాధవరావు
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పరిధి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్.మాధవరావును నియమించారు. ఈమేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మాధవరావు ఎంజీఎం న్యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్గా, హెచ్ఓడీగా పని చేస్తున్నారు. కాగా, డాక్టర్ మాధవరావు శనివారం స్వాతంత్ర దినోత్సవం రోజు డిప్యూటీ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇంతకు ముందు డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ అనిల్ బాలరాజు రెండు నెలల క్రితం జరిగిన బదిలీల్లో భాగంగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లారు. -
ఎంజీఎంలో పనిచేయని
కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో రెండు ఎక్స్రే మిషన్లు గురువారం పనిచేయక రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈవిభాగంలో మూడు ఎక్స్రే మిషన్లు ఉండగా.. వారం క్రితం ఒక మొబైల్ ఎక్స్రే మిషన్ పాడైపోయింది. దీనికి మరమ్మతులు చేయకముందే మరో మినీ డిజిటల్ ఎక్స్రే మిషన్ గురువారం నుంచి పనిచేయట్లేదు. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు క్యూ కడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక మిగిలిన ఒకే ఒక డిజిటల్ ఎక్స్రే మిషన్ ద్వారా ఎక్స్రేలు తీశారు. దీంతో పేషంట్లు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఎక్స్రే రిపోర్ట్ వచ్చే వరకు సంబంధిత డాక్టర్ ఉంటారో? లేదో? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే మిషన్పై మూడు మిషన్లకు సంబంధించిన ఎక్స్రేలు తీయడం వల్ల లోడ్ పెరిగి సిబ్బంది సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎక్స్రే మిషన్లకు మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు. పోలీసులకూ తప్పని తిప్పలు.. ఎంజీఎంలోని రేడియాలజీ విభాగంలో ఎక్స్రే ఫిలిం కొరత వేధిస్తోంది. మెడికో లీగల్ కేసుల విషయంలో తప్పనిసరిగా ఎక్స్రేకు సంబంధించిన ఫిలిం అవసరం. ఆస్పత్రి అధికారుల ఆదేశాల మేరకు ఎంఎల్సీ కేసులకు ఎంజీఎం సిబ్బంది కేవలం రిపోర్ట్ మాత్రమే ఇస్తున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకు గురవుతున్నారు. మెడికో లీగల్ కేసుల విషయంలో రిపోర్ట్ తీసుకోవడంతో పాటు ఫిలింను వైద్యుల పర్యవేక్షణలో రేడియాలజీ విభాగంలో భద్రపర్చాల్సి ఉంటుంది. పలు సందర్భాల్లో ఈ కేసులు కోర్టులో ఉన్నప్పుడు జడ్జికి తప్పనిసరిగా రిపోర్టుతో పాటు ఫిలిం చూపించాలి. ఎంజీఎంలో ఫిలిం ఇవ్వకపోవడం వల్ల కోర్టులో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని, బాధితులకు సంబంధించిన ఎక్స్రే ఫిలింలు తీసి, ఆస్పత్రిలో భద్రపర్చాలని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే తాము కోర్టు, పోలీస్ స్టేషన్, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. -
వరంగల్
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 202696 మిల్లులు.. 73,809 టన్నులు!భోజన ఏజెన్సీలపై గుడ్డుభారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వారంలో మూడురోజులు గుడ్డు అందించడం ఏజన్సీలకు భారంగా మారింది.సాక్షిప్రతినిధి, వరంగల్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో కలకలంరేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో కోట్లాది రూపాయల విలువైన సర్కారు ధాన్యం కొందరు రైసుమిల్లర్ల జేబుల్లోకి వెళ్లింది. రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం కేటాయించగా, వాటిని పక్కదారి పట్టించి ఆ డబ్బుతో కొందరు జల్సాలు చేస్తున్నారు. మరికొందరు బినామీ పేర్ల మీద బంగళాలు, కార్లు, భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల సీఎంఆర్ ఎగవేసి తిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రులు, పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కఠిన నిర్ణయాలు తీసుకుని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం డిఫాల్టర్లు, వారికి సహకరిస్తున్న అధికారుల్లో గుబులు మొదలైంది. ఆరు జిల్లాల్లో రూ.166 కోట్లు.. మహబూబాబాద్లో అత్యధికం.. ఆరు జిల్లాలకు చెందిన కొందరు రైసుమిల్లర్లు గత వానాకాలం సీజన్ నాటికే రూ.348 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. 2022–23 రబీ సీజన్కు సంబంధించి ఆరు జిల్లాల్లో గురువారం నాటికి 96 రైస్మిల్లుల నుంచి 73,809 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువకు సమానమైన రూ.166.30 కోట్ల రికవరీ ఇంకా పెండింగ్లో ఉంది. బకాయిల్లో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత వరంగల్ జిల్లా ఉంది. డిఫాల్టర్లకూ సీఎంఆర్..?.. ఇలాగైతే బాకీ తీరేదెప్పుడు? 2022–23 రబీ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ బకాయిలు ఇంతవరకు పూర్తిగా రికవరీ కాకపోవడం గమనార్హం. ఆ జాబితాలో ఉన్న కొందరికీ ఆ తర్వాత సీజన్లలో కూడా సీఎంఆర్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే కోట్లాది రూపాయలు ఎగవేసిన మిల్లర్లను డిఫాల్టర్లుగా చూపకుండా ఎలా ఇస్తారు? అన్న చర్చ కొందరు రైసుమిల్లర్లలోనే సాగుతోంది. ఉన్నతాధికారులు అడిగినప్పుడు బకాయిల వివరాలే చూపుతున్న స్థానిక అధికారులు.. డిఫాల్టర్ల జాబితా, సీఎంఆర్ కేటాయింపులు గోప్యంగా ఉంచుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి తాజా ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికై నా బకాయి ఉన్న 96 మిల్లుల నుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిస్థాయిలో రికవరీ చేయాల్సి ఉంది.ధాన్యం (మెట్రిక్ టన్నులు)మొత్తం మిల్లులుచెల్లించిన మిల్లులుఇప్పటికీ సరఫరా అయినది (మె.టన్నులు)బకాయి ధాన్యం (మె.టన్నులు)సీఎంఆర్ ఇచ్చిన ధాన్యం (మె.టన్నులు)ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయి లెక్క ఇదీ.. సీఎంఆర్ బకాయిల కొండ... ఆరు జిల్లాల్లో రూ.348 కోట్లకు పైనే 2022–23 రబీ సీజన్ బకాయిలే భారీగా.. మహబూబాబాద్లో అత్యధికం ఆ తర్వాత వరంగల్, హనుమకొండ జిల్లాలు.. రైస్మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలపై సీరియస్గా ఉండాలి. భవిష్యత్లో వారికి సీఎంఆర్ ఇవ్వొద్దు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినా, సీఎంఆర్ అప్పగించకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలి. బకాయిలపై పక్కా లెక్కలు తేల్చాలి. బకాయిదారులనుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిగా రికవరీ చేయని వారిపై చర్యలు ఉంటాయి. – సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి1,11,634బకాయి 73,80937,825216120(55.56%)జిల్లా సీఎంఆర్గా మొత్తం బకాయి బకాయి బకాయి ఇచ్చిన ధాన్యం మిల్లులు ధాన్యం మిల్లులు విలువ (మె.టన్నులు) (మె.టన్నులు) (రూ.కోట్లలో..) హనుమకొండ 13,015 34 8,683 12 19.42 వరంగల్ 32,425 67 21,512 27 48.54 జనగామ 4,429 45 3,258 27 7.49 జేఎస్ భూపాలపల్లి 15,900 20 4,204 5 9.59 మహబూబాబాద్ 40,758 25 33,309 12 74.90 ములుగు 5,107 25 2,843 13 6.36 -
విద్యుత్ భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
● సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ● పరకాల సబ్స్టేషన్ సందర్శన పరకాల: విద్యుత్ సరఫరాలో నాణ్యతతో పాటు భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం పరకాల పట్టణ సబ్స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా సబ్స్టేషన్లోని ఓఅండ్ఎం సిబ్బందితో సమావేశమయ్యారు. విద్యుత్ భద్రతా చర్యలు, నిర్వహణ పనులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్మ్యాన్డ్ సబ్స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందితో కూడా మాట్లాడి, విద్యుత్ పనులు నిర్వర్తించే సమయంలో తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు ఉద్యోగుల భద్రతను సమాన ప్రాధాన్యంతో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ టి.మధుసూదన్, హనుమకొండ ఎస్ఈ సౌమ్య నాయక్, డీఈ మల్లికార్జున్, ఏడీఏ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా.. పెండింగ్లోనే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ మహా నగరాన్ని ఆధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దుతూ ‘స్మార్ట్సిటీ’గా మార్చాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇంకా పూర్తి కాని పనులు మిగిలే ఉన్నాయి. స్మార్ట్సిటీస్ మిషన్ (ఎస్సీఎం) అధికారికంగా 2025 మార్చి 31తో ముగిసినా.. గ్రేటర్ వరంగల్లో ఇప్పటికీ 16 ప్రాజెక్టులు పూర్తికాలేదు. దేశవ్యాప్తంగా గడువులు, పొడిగింపుల మధ్యన పదేళ్లు గడిచినా ఇంకా పనులు పెండింగ్లో ఉన్న స్మార్ట్సిటీల జాబితాలో గ్రేటర్ వరంగల్ కూడా ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరానికి మొత్తం 119 ప్రాజెక్టులు రూ.1,800 కోట్ల విలువతో చేపట్టగా.. 103 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వీటి విలువ రూ.1,499 కోట్లు. ఇంకా రూ.301 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. మిషన్ గడువు ముగిసిన తర్వాత కూడా ఈ పనులు పూర్తికాకపోవడం నగర స్మార్ట్సిటీ లక్ష్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మిషన్ ముగిసిన తర్వాత కూడా మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేయాలని, స్మార్ట్సిటీ కింద సృష్టించిన ఆస్తులకు నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలు, సంబంధిత ప్రత్యేక ప్రయోజన సంస్థలకు సూచించింది. అంటే మిషన్ ముగిసిందని పనులకు తెరపడినట్లు కాదు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత కొనసాగుతూనే ఉంటుంది. స్మార్ట్సిటీ మిషన్ కింద వరంగల్ మహానగరానికి విడుదలైన మొత్తం నిధులు, చేపట్టిన పనులు, ఖర్చయిన నిధులకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ క్లియరెన్స్ పొందాల్సి ఉంది. వరంగల్ జేపీఎన్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న ఫుట్పాత్లు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్, ఇతర తీగలుస్మార్ట్ మిషన్ ముగిసి ఏడాది దాటినా.. పూర్తికాని 16 పనులు ‘గ్రేటర్’ పరిధిలో మంజూరైన పనులు 119, పూర్తి చేసింది 103 పదేళ్లలో 86.6 శాతంలోనే ‘స్మార్ట్సిటీ’ వర్క్స్ తాజా నివేదికలో కేంద్రం వెల్లడి ఈ ఫొటోలో కనిపిస్తుంది భద్రకాళి బండ్. నగరవాసుల ఆహ్లాదం కోసం.. పర్యాటకులను ఆకర్షిచేందుకు ప్రభుత్వం స్మార్ట్సిటీకింద ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రీనరీ, ప్యాచ్ వర్క్లు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితేనే ఇది అందుబాటులోకి రానుంది. ప్రధాన అసంపూర్తి పనులు ఇవే.. భద్రకాళి బండ్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే గ్రీనరీ, లైట్లు, ప్యాచ్ వర్క్లు చేపట్టాల్సి ఉంది. వడ్డేపల్లి బండ్పై 25 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు, గ్రీనరీ, లైటింగ్ తదితర పనులు చేపట్టాలి. కరీమాబాద్ కీర్తి బార్నుంచి రంగశాయిపేట క్రాస్ రోడ్డులో డక్ట్ పనులు మరో పదిశాతం చేయాలి. ఉర్సుగుట్టలో చేపట్టిన పనులు చాలామేరకు పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ములుగు రోడ్డు, నర్సంపేట రోడ్డు, ఖమ్మం గ్రాండ్ ఎంట్రెన్స్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. బయోమైనింగ్.. ప్రధాన రహదారుల అభివృద్ధి... సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల ఏర్పాటు. -
ఎంజీఎంలో వైద్యసేవలపై కలెక్టర్ ఆరా
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని బుధవారం కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలు, మీడియాలో వచ్చిన కథనాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముందుగా.. ఆమె ఎంఏసీ, క్యాజువాలిటీతోపాటు డైట్ సెంటర్ను పరిశీలించారు. ఈసందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంఏసీ వద్ద ఓ రోగి బయట పడుకున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన దాని గురించి అడిగి అధికారులనుంచి వివరణ తీసుకున్నారు. ఓ సెక్యూరిటీ గార్డు డబ్బులు తీసుకుంటున్నట్లు వచ్చిన మీడియా కథనంపై ఆరా తీశారు. తమ పేషెంట్ను ఎంఏసీ వార్డులో అడ్మిట్ చేసుకోవడం లేదని, తమ యూనిట్ కాదని చెబుతున్నారని రోగి బంధువులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. క్యాజువాలిటీకి వెళ్లి వైద్య సేవల విషయంలో ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని డ్యూటీ డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పేషెంట్ అటెండెంట్ కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించారు. దీంతో ఆమె వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులకు అందుతున్న వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని కంప్లైంట్ బాక్స్ పరిశీలించారు. అనంతరం రోగులకు ఆహారాన్ని అందించే డైట్ను ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. అంతకుముందు అకడమిక్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, పలువురు వైద్యులు ఉన్నారు. డైట్ సెంటర్ను సందర్శించిన డాక్టర్ సత్యశారద మీడియా కథనాలకు స్పందించి వార్డుల పరిశీలన -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారదతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 16న సీఎం రేవంత్రెడ్డి పరకాల పర్యటనకు సంబంధించి సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్ తదితర అంశాలపై చర్చించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచడంతో పాటు విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతీ శాఖకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించి, నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. -
ఇంకా.. పెండింగ్లోనే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ మహా నగరాన్ని ఆధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దుతూ ‘స్మార్ట్ సిటీ’గా మార్చాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇంకా పూర్తి కాని పనులు మిగిలే ఉన్నాయి. స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సీఎం) అధికారికంగా 2025 మార్చి 31తో ముగిసినా.. గ్రేటర్ వరంగల్లో ఇప్పటికీ 16 ప్రాజెక్టులు పూర్తికాలేదు. దేశవ్యాప్తంగా గడువులు, పొడిగింపుల మధ్యన పదేళ్లు గడిచినా ఇంకా పనులు పెండింగ్లో ఉన్న స్మార్ట్ సిటీల జాబితాలో గ్రేటర్ వరంగల్ కూడా ఉండడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరానికి మొత్తం 119 ప్రాజెక్టులు రూ.1,800 కోట్ల విలువతో చేపట్టగా.. 103 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వీటి విలువ రూ.1,499 కోట్లు. ఇంకా రూ.301 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. మిషన్ గడువు ముగిసిన తర్వాత కూడా ఈ పనులు పూర్తికాకపోవడం నగర స్మార్ట్ సిటీ లక్ష్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మిషన్ ముగిసిన తర్వాత కూడా మిగిలిన పనులను సకాలంలో పూర్తి చేయాలని, స్మార్ట్ సిటీ కింద సృష్టించిన ఆస్తులకు నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలు, సంబంధిత ప్రత్యేక ప్రయోజన సంస్థలకు సూచించింది. అంటే మిషన్ ముగిసిందని పనులకు తెరపడినట్లు కాదు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత కొనసాగుతూనే ఉంటుంది. స్మార్ట్సిటీ మిషన్ కింద వరంగల్ మహానగరానికి విడుదలైన మొత్తం నిధులు, చేపట్టిన పనులు, ఖర్చయిన నిధులకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ క్లియరెన్స్ పొందాల్సి ఉంది. వరంగల్ జేపీఎన్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న ఫుట్పాత్లు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్, ఇతర వైర్లు స్మార్ట్ మిషన్ ముగిసి ఏడాది దాటినా.. పూర్తికాని 16 పనులు ‘గ్రేటర్’ పరిధిలో మంజూరైన పనులు 119, పూర్తి చేసింది 103 పదేళ్లలో 86.6 శాతంలోనే ‘స్మార్ట్సిటీ’ వర్క్స్ తాజా నివేదికలో కేంద్రం వెల్లడి ఈఫొటోలో కనిపిస్తున్నది భద్రకాళి బండ్. నగరవాసుల ఆహ్లాదం కోసం.. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం స్మార్ట్ సిటీకింద ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రీనరీ, ప్యాచ్ వర్క్లు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితేనే ఇది అందుబాటులోకి రానుంది. ప్రధాన అసంపూర్తి పనులివే.. భద్రకాళి బండ్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అలాగే గ్రీనరీ, లైట్లు, ప్యాచ్ వర్క్లు చేపట్టాల్సి ఉంది. వడ్డేపల్లి బండ్పై 25 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు, గ్రీనరీ, లైటింగ్ తదితర పనులు చేపట్టాలి. కరీమాబాద్ కీర్తి బార్నుంచి రంగశాయిపేట క్రాస్ రోడ్డులో డక్ట్ పనులు మరో పదిశాతం చేయాలి. ఉర్సుగుట్టలో చేపట్టిన పనులు చాలామేరకు పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ములుగు రోడ్డు, నర్సంపేట రోడ్డు, ఖమ్మం గ్రాండ్ ఎంట్రెన్స్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. బయోమైనింగ్.. ప్రధాన రహదారుల అభివృద్ధి... సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల ఏర్పాటు. -
రోగులకు పరీక్షే!
● ఎంజీఎంలో సీబీపీ టెస్ట్ లేక ప్రైవేట్కు పరుగులు కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలో సాధారణంగా చేయించుకునే బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర విభాగంతో పాటు సెంట్రల్ ల్యాబ్లో ఈ పరీక్ష అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్ప డం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సర్జరీ చేయాలన్నా, రక్తం ఎక్కించాలన్నా బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం ముఖ్యం. ఈ గ్రూపు తెలుసుకోవడానికి అవసరమైన సిరాస్ లేకపోవడం వల్ల టెస్ట్లు చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పేషంట్ ఏ రక్త గ్రూపునకు సంబంధించిన వారో తెలుసుకోవడానికి యాంటీ ఏ, యాంటీ బీ, యాంటీ ఓ అందుబాటులో ఉండాలి. ఇందులో ఏమీ లేకపోవడంతో పేషంట్లు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే, ప్రైవేట్గా తీసుకొచ్చిన బ్లడ్ గ్రూప్ రిపోర్ట్ను వైద్యులు అంగీకరించడం లేదని ఆందోళన చెందుతున్నారు. అత్యవసరంగా సర్జరీ చేయాలంటే బ్లడ్ గ్రూప్ లేకుంటే సర్జరీలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఈ పరీక్షలపై ప్రత్యేక చొరవ చూపాలని, కెమికల్స్ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారదతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 16న సీఎం రేవంత్రెడ్డి పరకాల పర్యటనకు సంబంధించి సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భారికేడింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్ తదితర అంశాలపై చర్చించారు. భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచడంతో పాటు విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతీ శాఖకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించి, గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. -
ఇంటర్ విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ : డీఐఈఓ
కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. రంగశాయిపేట, సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బుధవారం ఆయన సందర్శించి విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 2,704 మంది ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా 32,448 నోట్బుక్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికి 12 నోట్బుక్స్ అందించడం ద్వారా సుమారు రూ.600 వరకు తల్లిదండ్రులకు ఆదా అవుతుందన్నారు. మారిన పాఠ్యాంశాల ప్రకారం వార్షిక పరీక్షలకు 80, అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులు ఉంటాయని వివరించారు. కళాశాల ప్రిన్సిపాళ్లు సంపత్కుమార్, కరుణశ్రీ, లైబ్రేరియన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో వైద్యసేవలపై కలెక్టర్ ఆరా
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని బుధవారం కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలు, మీడియాలో వచ్చిన కథనాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముందుగా.. ఆమె ఎంఏసీ, క్యాజువాలిటీతోపాటు డైట్ సెంటర్ను పరిశీలించారు. ఈసందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంఏసీ వద్ద ఓ రోగి బయట పడుకున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన దాని గురించి అడిగి అధికారులనుంచి వివరణ తీసుకున్నారు. ఓ సెక్యూరిటీ గార్డు డబ్బులు తీసుకుంటున్నట్లు వచ్చిన మీడియా కథనంపై ఆరా తీశారు. తమ పేషెంట్ను ఎంఏసీ వార్డులో అడ్మిట్ చేసుకోవడం లేదని, తమ యూనిట్ కాదని చెబుతున్నారని రోగి బంధువులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. క్యాజువాలిటీకి వెళ్లి వైద్య సేవల విషయంలో ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని డ్యూటీ డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పేషెంట్ అటెండెంట్ కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించారు. దీంతో ఆమె వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులకు అందుతున్న వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని కంప్లైంట్ బాక్స్ పరిశీలించారు. అనంతరం రోగులకు ఆహారాన్ని అందించే డైట్ను ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు. అంతకుముందు అకడమిక్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, పలువురు వైద్యులు ఉన్నారు. డైట్ సెంటర్ను సందర్శించిన డాక్టర్ సత్యశారద మీడియా కథనాలకు స్పందించి వార్డుల పరిశీలన -
పాఠశాలల్లో స్వచ్ఛ పోటీలు
కాళోజీ సెంటర్: పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్) 2026–27’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగస్వామ్యం కావడం ద్వారా తమ పాఠశాలల స్వచ్ఛతా ప్రమాణాలను జాతీయస్థాయిలో నిరూపించుకునే అవకాశం ఉంటుంది. పోర్టల్, యాప్ వేదికగా స్వీయ మూల్యాంకనం.. పాఠశాల విద్యాశాఖ సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. యూడీఐఎస్ఈ+ కోడ్ ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల పాఠశాలలు 100 శాతం ఈ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలి. https://shvr.education.gov.in, Swachh Evam Harit Vidyalaya Rating మొబైల్ యాప్ ద్వారా తమ స్వీయ మూల్యాంకనాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్టు ఒకటి నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. తుది గడువు ప్రకటించలేదు. మూల్యాంకన అంశాలు, పాయింట్లు.. పాఠశాలల నిర్వహణ, స్వచ్ఛతా ప్రమాణాలను మొత్తం 6 ప్రధాన విభాగాల ఆధారంగా అంచనా వేస్తారు. తాగునీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్లకు 27 మార్కులు, సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవడంపై 14 మార్కులు, నిర్వహణ, సంరక్షణకు 21 మార్కులు, ప్రవర్తనా మార్పు – సామర్థ్య పెంపునకు 20 మార్కులు, మిషన్ లైఫ్ కార్యకలాపాలకు 21 మార్కులు కేటాయిస్తారు. ఆయా విభాగాల్లో పొందిన మార్కుల ఆధారంగా పాఠశాలలకు 1 స్టార్ నుంచి 5 స్టార్ వరకు జాతీయస్థాయిలో రేటింగ్ ఇస్తారు. గడువులోగా పూర్తిచేయాలి.. డీఈఓ జిల్లా నోడల్ ఆఫీసర్గా, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. రోజువారీ పురోగతిని పర్యవేక్షించి అన్ని పాఠశాలలు 100 శాతం నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సమగ్రశిక్ష కార్యాలయం ఆదేశించింది. పాఠశాలలకు నమోదు ప్రక్రియలో సందేహాలు ఉంటే మార్గదర్శకాలు అందించి నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయించాలి. రేటింగ్ కోసం పోటీపడాలి..పాఠశాలల్లో పరిశుభ్రత, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించేందుకు రేటింగ్ కోసం పోటీపడాలి. పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు విద్యార్థులు, ఉపాద్యాయులు, సిబ్బందికి అవగాహన కల్పించాలి. పాఠశాలల పరిశుభ్రత, పచ్చదనం ప్రమాణాల ఆధారంగా స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్) ఉంటుంది. స్వచ్ఛభారత్, హరితభారత్ వంటి జాతీయ లక్ష్యాలపై విద్యార్థుల్లో బాధ్యత పెంచి సమగ్ర పాఠశాల అభివృద్ధి దిశగా కృషి చేసి 5 స్టార్ రేటింగ్ వచ్చేలా కృషి చేయాలి. – డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ మార్కుల ఆధారంగా జాతీయస్థాయిలో రేటింగ్ 100 శాతం స్కూళ్ల భాగస్వామ్యమే లక్ష్యం -
ఓరుగల్లుకు ‘పీఎం మిత్ర’ నే
రూ.200 కోట్లతో కేఎంటీపీలో మౌలిక వసతుల కల్పనసాక్షి, వరంగల్: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు పీఎం మిత్ర హోదా రావడంతో ఓరుగల్లు జౌళి రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతోంది. పార్కులో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటివరకు రూ.200 కోట్లు వెచ్చించామని కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి సబిత్రా మార్గరేటా లోక్సభలో వెల్లడించారు. ఇప్పటికే దశలవారీగా మంజూరవుతున్న నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు కాంపిటేటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. దీంతో కొత్త పెట్టుబడులు మరింత వేగంగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వచ్చిన పెట్టుబడులతోనే 24,400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరిలో అత్యధికంగా మహిళలే ఉండడం గమనార్హం. పీఎం మిత్ర పథకం ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఒక లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం ఉందని కేంద్రం పేర్కొంది. రూ.6వేల కోట్లకు పైగా పెట్టుబడులు.. పీఎం మిత్ర పథకం కింద తెలంగాణ నుంచి వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును 2023లో ఎంపిక చేశారు. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో 1,327 ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కులో పత్తి నుంచి నూలు, దుస్తుల తయారీ, ఎగుమతుల వరకు పూర్తి విలువ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పార్కు అభివృద్ధికి మొత్తం రూ.1,695.54 కోట్ల వ్యయం అంచనా కాగా.. వివిధ మార్గాల ద్వారా రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెక్స్టైల్ పార్కులో ఇప్పటికే 548 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయి. ఇందులో పీఎం మిత్రగా ఎంపికై న తర్వాతే 310 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కై టెక్స్, యంగ్వన్, గణేశా తదితర సంస్థలు సిబ్బందిని నియమించుకుని ఉత్పత్తిని ప్రారంభించడంతో పార్కులో సందడి నెలకొంది. మరిన్ని సంస్థలు పెట్టుబడులతో రావడానికి ఆసక్తి చూపుతున్నాయి.5ఎఫ్ విధానంతో పార్కు అభివృద్ధి.. కాంపిటేటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్ కింద మరో రూ.300 కోట్లు ఇప్పటికే పలు కంపెనీలతో 24,400 మందికి ఉపాధి లోక్సభలో కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి సబిత్రా మార్గరేటా వెల్లడితో చర్చఫామ్ టు ఫైబర్.. ఫైబర్ టు ఫ్యాక్టరీ.. ఫ్యాక్టరీ టు ఫ్యాషన్.. ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5ఎఫ్ విధానంతో పీఎం మిత్ర పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్, నిరంతర నీటి సరఫరా, అంతర్గత రహదారులు, కార్మిక వసతి, ఉమ్మడి బాయిలర్, 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు, సీఈటీపీ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేఎంటీపీకి శ్రీకారం చుట్టగా.. 2023లో పీఎం మిత్రలో ఎంపికతో దీనికి జాతీయ ప్రాధాన్యం లభించింది. ప్రస్తుతం కేంద్రం వెల్లడించిన పెట్టుబడులు, ఉపాధి గణాంకాలు పార్కు భవిష్యత్ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలకు స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉండడంతో సామాజికంగా దీని ప్రాధాన్యం పెరుగుతోంది. పీఎం మిత్రతో ఓరుగల్లు జాతీయ జౌళి కేంద్రంగా, పెట్టుబడులు, ఉపాధికి కొత్త గమ్యస్థానంగా ఎదిగే అవకాశాలు బలపడుతున్నాయి. -
నర్సంపేట పీఎస్ను తనిఖీ చేసిన సీపీ శ్వేత
నర్సంపేట రూరల్: నర్సంపేట పోలీస్స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం తనిఖీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నర్సంపేట పోలీస్స్టేషన్కు వచ్చిన సీపీకి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భగా పలు రికార్డులను పరిశీలించిన ఆమె కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గోవాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సునర్సంపేట: ప్రత్యేక టూర్ ప్యాకేజీలో భాగంగా నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి 36 సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సు గోవా యాత్రకు వెళ్తుందని డిపో మేనేజర్ ఎం.సరస్వతి తెలిపారు. డిపోలో బుధవారం ఆమె మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ ఉదయం 5 గంటలకు బస్సు హైదరాబాద్ నుంచి హంపి క్షేత్రం ద్వారా కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం, ధర్మస్థల, ఉడిపి నుంచి మురుడేశ్వర్, గోకర్ణ దైవ దర్శనాల తర్వాత గోవాకు వెళ్తుందని పేర్కొన్నారు. గోవాలో ఒకరోజు అనంతరం హైదరాబాద్ నుంచి నర్సంపేటకు 20వ తేదీ రాత్రి 12 గంటలకు చేరుకుంటుందన్నారు. రానుపోను ఒక్కరికి రూ.5,500 ప్రయాణ చార్జి ఉంటుందని, ఐదు రోజుల యాత్రలో భోజనం, వసతి, గదుల ఖర్చు బాధ్యత పర్యాటకులదేనని తెలిపారు. ముందస్తు బుకింగ్ కోసం 9704644543 నంబర్లో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఆరుతడి పంటలు సాగుచేయాలినర్సంపేట రూరల్: ఎల్నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి విజయ్ భాస్కర్ సూచించారు. మహేశ్వరం గ్రామంలో రైతులకు ఆరుతడి పంటలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో నీరు లేకపోవడంతో వరి పంటకు బదులు పెసర, మినుము, జొన్న, పొద్దు తిరుగుడు తదితర ఆరుతడి పంటలను సాగుచేయాలని కోరారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ భూగర్భ జలాలు పడిపోవడంతో ఆరుతడి పంటలు సాగుచేయాలని పేర్కొన్నారు. సదస్సులోకౌన్సిలర్ ఏపూరి శ్రీనివాస్రెడ్డి, మండల వ్యవసాయాధికారి కృష్ణకుమార్, ఏఈఓ వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెట్లతోనే జీవకోటికి మనుగడ : డీసీఓసంగెం: చెట్లు జీవకోటికి మనుగడ అని జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా కాపులకనిపర్తి సొసైటీ ఆవరణలో బుధవారం వారు మొక్కలు నాటి మాట్లాడారు. చెట్లు ఉంటే జీవకోటికి ఆక్సిజన్ అందడంతో పాటుగా పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని పేర్కొన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్రావు, మండల వ్యవసాయాధికారి జగదీశ్వర్, సంఘం కార్యవర్గ సభ్యులు రవీందర్, చేరాలు, పోశయ్య, వెంకటలక్ష్మి, కిషన్, కుమారస్వామి, కార్యదర్శి రమణాచారి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్.వెంకన్న పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో గురుకుల బాలుర సైనిక్ స్కూల్ నర్సంపేట అశోక్నగర్లో ఫిజిక్స్(1), ఇంగ్లిష్(2), మ్యాథ్స్(2) కెమెస్ట్రీ(01), మ్యాథ్స్(2) కెమిస్ట్రీ(1), జేఎల్ మ్యాథ్స్ (2), కెమిస్ట్రీ(1), పీజీటీ ఇంగ్లిష్(1) టీజీటీ ఇంగ్లిష్ (1), బాలుర గురుకులం నర్సంపేట జేఎల్ జువాలజీ(1), పీజీటీ ఇంగ్లిష్(1), టీజీటీ ఫిజికల్ సైన్స్(1), మూడు చెక్కలపల్లి బాలికల జూనియర్ కళాశాల జేఎల్ మ్యాథ్స్ (1) బాలికల గురుకులం పర్వతగిరి టీజీటీ ఫిజికల్ సైన్స్(1) బయోసైన్స్(1), బాలుర గురుకులం యాకూబ్పురా వరంగల్, జేఎల్ జువాలజీ(1) టీజీటీ తెలుగు(1), హనుమకొండ జిల్లాలో బాలికల గురుకులం(సీఓఈ) పెద్దమ్మగడ్డలో జేఎల్ మ్యాథ్స్(1), జనగామ జిల్లాలోని పాలకుర్తి బాలికల గురుకులంలో పీజీటీ మ్యాథ్స్ (1), ఫిజిక్స్(1), టీజీటీ ఫిజికల్ సైన్స్(1), బయోసైన్స్(1), హిందీ(1) లైబ్రేరియన్ (1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల 21న గిరిజన గురుకులం(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ) పెద్దమ్మగడ్డ, ములుగురోడ్డు, వరంగల్కు ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. -
హెచ్ఐవీపై అవగాహన అవసరం
హన్మకొండ: యువతకు హెచ్ఐవీపై అవగాహన అవసరమని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధ వారం హనుమకొండలోని ప్రభుత్వ టీబీ ఆస్పత్రిలో హెచ్ఐవీ, ఎయిడ్స్, లైంగిక సంక్రమణ వ్యాధులపై విస్తృత అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ.. హెచ్ఐవీకి సంబంధించిన సమాచారం, సేవలను జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన ‘బ్రేక్ ఫ్రీ’ యాప్ ద్వారా యువత పొందవచ్చని తెలిపారు. అదనపు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మదన్న్మోహన్రావు మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లాలోని 181 గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ.శ్రీనివాస్రావు, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, ఆర్ఎంఓ వెంకటరమణ, డీటీసీఓ ప్రదీప్రెడ్డి, అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూ ఫార్మసీ కళాశాల దివంగత ప్రొఫెసర్ వై.మధుసూధన్రావు తొలి స్మారకోపన్యాసాన్ని ఈనెల 14న ఉదయం 11 గంటలకు క్యాంపస్లో నిర్వహించనున్నట్లు బుధవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని వీసీ ప్రతాప్రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. కేయూ ఫార్మసీ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ రామ్బహు ‘ఇన్నోవేటివ్ నానో డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్స్’ అంశంపై స్మారకోపన్యాసం చేయనున్నట్లు తెలిపారు. బోధన, బోధనేతర ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొనాలని రిజిస్ట్రార్ కోరారు. ఎంజీఎంలో సీబీపీ టెస్ట్ లేక ప్రైవేట్కు పరుగులు కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సాధారణంగా చేయించుకునే బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యసవర విభాగంతో పాటు సెంట్రల్ ల్యాబ్లో ఈ పరీక్ష అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్ప డం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సర్జరీ చేయాలన్నా, రక్తం ఎక్కించాలన్నా బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం ముఖ్యం. ఈ గ్రూపు తెలుసుకోవడానికి అవసరమైన సిరాస్ లేకపోవడం వల్ల టెస్ట్లు చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పేషెంట్ ఏ రక్త గ్రూపునకు సంబంధించిన వారో తెలుసుకోవడానికి యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ అందుబాటులో ఉండాలి. ఇందులో ఏమీ లేకపోవడంతో పేషెంట్లు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్గా తీసుకొచ్చిన బ్లడ్ గ్రూప్ రిపోర్ట్ను వైద్యులు అంగీకరించడం లేదని పేషెంట్లు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసరంగా సర్జరీ చేయాలంటే బ్లడ్ గ్రూప్ లేకుంటే సర్జరీలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఈ పరీక్షలపై ప్రత్యేక చొరవ చూపాలని, అడ్వాన్స్గా కెమికల్స్ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
శ్రావణం.. నిత్యోత్సవం
హన్మకొండ కల్చరల్: గ్రేటర్ వరంగల్ పరిధి ఆలయాలకు శ్రావణ శోభ సంతరించుకుంది. నేటి (గురువారం) నుంచి సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. నగరంలోని వేయిస్తంభాల ఆలయంలో శ్రావణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతీ సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు, బిల్వార్చానలు, రుద్రాహోమాలు, అన్నపూజలు నిర్వహించనున్నారు. 17న నాగపూజలు, 28న రాఖీ పండుగ, సెప్టెంబర్ 9న మాస శివరాత్రిని పురస్కరించుకుని ఉదయం 11గంటలకు రుద్రేశ్వరీరుద్రేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ తెలిపారు. క్యూలైన్ల ఏర్పాట్లు శ్రావణమాసం సందర్భంగా దేవాదాయ శాఖ పరిధి ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రకాళి ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా భద్రేశ్వర శివలింగానికి ప్రతీ సోమవారం ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతీ శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు, ఒడిబియ్యం సమర్పణలు ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. పద్మాక్షి ఆలయంలో, వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీదేవి దేవాలయంలో, హంటర్ రోడ్డులోని సంతోషిమాత ఆలయం, లష్కర్బజార్లోని సంతోషిమాత ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. వీటితో పాటు నగరంలోని పలు వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, పోచమ్మ దేవాలయాల్లోనూ శ్రావణమాస పూజలు, పండిత ప్రవచనాలు ఏర్పాటు చేయనున్నారు. నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు -
విద్యార్థుల చెంతకు సమాచారం..
● నిట్లో డిజిటల్ ఎల్ఈడీల ఏర్పాటు.. కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థుల చెంతకు సమాచారం అందజేసేందుకు కొత్తగా రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. సాధారణంగా అధికారులు తన అఫీషియల్ పోర్టల్ అయిన వెబ్సైట్, ఇన్స్టాగ్రాంలో కళాశాల ప్రాధాన్యత కలిగిన సమాచారం పొందుపరుస్తుంటారు. ప్రతిరోజూ విద్యార్థులు ఆ వెబ్సైట్, ఇన్స్టాగ్రాంను ఓపెన్ చేయడం కుదరకపోవడంతో కీలక సమాచారం మిస్సవుతున్నారు. ఆ చిన్న సమాచారం తెలియాలన్న ఉద్దేశంతో క్యాంపస్లో రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఎల్ఈడీ బోర్డులు తాజా సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. అదే విధంగా విద్యార్థులకు ఇంటర్న్షిప్, పేపర్ ప్రజంటేషన్,పేటెంట్ హక్కులు సాధించిన వారి వివరాలతోపాటు క్యాంపస్లో చోటుచేసుకునే వివరాలను తెలుసుకునేందుకు కేరాఫ్గా డిజిటల్ ఎల్ఈడీ సమాచారం నిలుస్తోంది. మొత్తం 6,500 మంది విద్యార్థులు.. నిట్ వరంగల్లో బీటెక్, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు సుమారు 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. కాలి నడకన, సైక్లింగ్లో కళాశాల తరగతి గదులు, ల్యాబ్స్, ఆడిటోరియం, హాస్టల్స్, కెఫెలకు వెళ్తుంటారు. ఇక్కడికి మెయిన్ బిల్డింగ్, కలాం గెస్ట్హౌస్ వద్ద నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆ డిజిటల్ బోర్డుల్లో ప్లే అవుతున్న సమాచారాన్ని ఆసక్తిగా తిలకిస్తూ తమకు అవసరమైన వాటిని విద్యార్థులు నోట్ చేసుకుంటున్నారు. -
గురువారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని షెడ్లుసాక్షి, వరంగల్: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు పీఎం మిత్ర హోదా రావడంతో ఓరుగల్లు జౌళి రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతోంది. పార్కులో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటివరకు రూ.200 కోట్లు వెచ్చించామని కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి సబిత్రా మార్గరేటా లోక్సభలో వెల్లడించారు. ఇప్పటికే దశలవారీగా మంజూరవుతున్న నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు కాంపిటేటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. దీంతో కొత్త పెట్టుబడులు మరింత వేగంగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వచ్చిన పెట్టుబడులతోనే 24,400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరిలో అత్యధికంగా మహిళలే ఉండడం గమనార్హం. పీఎం మిత్ర పథకం ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఒక లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం ఉందని కేంద్రం పేర్కొంది. రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడులు.. పీఎం మిత్ర పథకం కింద తెలంగాణ నుంచి వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును 2023లో ఎంపిక చేశారు. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో 1,327 ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కులో పత్తి నుంచి నూలు, దుస్తుల తయారీ, ఎగుమతుల వరకు పూర్తి విలువ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పార్కు అభివృద్ధికి మొత్తం రూ.1,695.54 కోట్ల వ్యయం అంచనా కా గా.. వివిధ మార్గాల ద్వారా రూ.6 వేల కోట్లకు పైగా పె ట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయి. ఇందులో పీఎం మిత్రగా ఎంపికై న తర్వాతే 310 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కై టెక్స్, యంగ్వన్, గణేశా తదితర సంస్థలు సిబ్బందిని నియమించుకుని ఉత్పత్తిని ప్రారంభించడంతో పార్కులో సందడి నెలకొంది. మరిన్ని సంస్థలు పెట్టుబడులతో రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. 5ఎఫ్ విధానంతో పార్కు అభివృద్ధి.. ఫామ్ టు ఫైబర్.. ఫైబర్ టు ఫ్యాక్టరీ.. ఫ్యాక్టరీ టు ఫ్యాషన్.. ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5ఎఫ్ విధానంతో పీఎం మిత్ర పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్, నిరంతర నీటి సరఫరా, అంతర్గత రహదారులు, కార్మిక వసతి, ఉమ్మడి బాయిలర్, 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, సీఈటీపీ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేఎంటీపీకి శ్రీకారం చుట్టగా.. 2023లో పీఎం మిత్రలో ఎంపికతో దీనికి జాతీయ ప్రాధాన్యం లభించింది. ప్ర స్తుతం కేంద్రం వెల్లడించిన పెట్టుబడులు, ఉపాధి గణాంకాలు పార్కు భవిష్యత్ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలకు స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉండడంతో సామాజికంగా దీని ప్రాధాన్యం పెరుగుతోంది. పీఎం మిత్రతో ఓరుగల్లు జాతీయ జౌళి కేంద్రంగా, పెట్టుబడులు, ఉపాధికి కొత్త గమ్యస్థానంగా ఎదిగే అవకాశాలు బలపడుతున్నాయి. రూ.200 కోట్లతో కేఎంటీపీలో మౌలిక వసతుల కల్పన కాంపిటేటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్ కింద మరో రూ.300 కోట్లు ఇప్పటికే పలు కంపెనీలతో 24,400 మందికి ఉపాధి లోక్సభలో కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి సబిత్రా మార్గరేటా వెల్లడితో చర్చ -
విద్యార్థుల చెంతకు సమాచారం..
● నిట్లో డిజిటల్ ఎల్ఈడీల ఏర్పాటు.. కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థుల చెంతకు సమాచారం అందజేసేందుకు కొత్తగా రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. సాధారణంగా అధికారులు తమ అఫీషియల్ పోర్టల్ అయిన వెబ్సైట్, ఇన్స్టాగ్రాంలో కళాశాల ప్రాధాన్యం కలిగిన సమాచారం పొందుపరుస్తుంటారు. ప్రతీ రోజూ విద్యార్థులు ఆ వెబ్సైట్, ఇన్స్టాగ్రాంను ఓపెన్ చేయడం కుదరకపోవడంతో కీలక సమాచారం మిస్సవుతున్నారు. ఏ చిన్న సమాచారం మిస్సవ్వొద్దని క్యాంపస్లో రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఎల్ఈడీ బో ర్డులు తాజా సమాచారాన్ని తెలియజేస్తుంటా యి. విద్యార్థులకు ఇంటర్న్షిప్, పేపర్ ప్రజంటేషన్, పెటెంట్ హక్కులు సాధించిన వారి వివరాలతోపాటు క్యాంపస్లో చోటుచేసుకునే వివరాలను తెలుసుకునేందుకు కేరాఫ్గా డిజిటల్ ఎల్ఈడీ సమాచారం నిలుస్తోంది. బోర్డుల్లో డిస్ప్లే అవుతూ.. నిట్ వరంగల్లో బీటెక్, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు సుమారు 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. కాలి నడకన, సైక్లింగ్లో కళాశాల తరగతి గదులు, ల్యాబ్స్, ఆడిటోరియం, హాస్టళ్లు, కెఫెలకు వెళ్తుంటారు. ఇక్కడికి మెయిన్ బిల్డింగ్, కలాం గెస్ట్హౌజ్ వద్దనుంచి వెళ్లాల్సి ఉంటుండడంతో ఆ డిజిటల్ బోర్డుల్లో ప్లే అవుతున్న సమాచారాన్ని ఆసక్తిగా తిలకిస్తూ తమకు అవసరమైన వాటిని నోట్ చేసుకుంటున్నారు. -
చేయూతకు వేళాయె!
కాళోజీ సెంటర్: కొత్త సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘చేయూత’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ (సెర్ప్) స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన సర్క్యూలర్ను జారీ చేసింది. తొలివిడత ప్రాధాన్యం కింద ఏడు ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారికి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరెవరికీ అవకాశం ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు) బాధితులు, రక్త సంబంధిత వ్యాధులు (తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా) అవకాశం కల్పిస్తూ వీరి నుంచి ఈ నెల ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరణకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలంటే.. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, ఎంపీడీఓలు, పురపాలక కమిషనర్ల వద్ద దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇప్పటికే ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల గ్రామసభలు, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసేవారు, ఇంతకుముందు అవసరమైన పత్రాలు జత చేయనివారు సంబంధిత సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అందుబాటులో ఆన్లైన్ వెబ్సైట్.. దరఖాస్తుల నమోదు కోసం ప్రత్యేకంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.చేయూత.తెలంగాణ. జీవీఓ.ఇన్ అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు. మండల స్థాయి, మున్సిపల్ స్థాయిలో ప్రత్యేక లాగిన్ల ద్వారా ఆన్లైన్ ఎంట్రీలు పూర్తి చేస్తారు. క్షేత్రస్థాయిలో విచారణ అధికారుల పరిశీలన అనంతరం కలెక్టర్ల ఆమోదంతో మంజూరు ఉత్తర్వులు జారీ చేసి, ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ తొలి విడతలో ఏడు కేటగిరీలకు కొత్త పింఛన్లు మార్గదర్శకాలు జారీ చేసిన సెర్ప్అవసరమైన ధ్రువీకరణ పత్రాలువితంతువులు: భర్త మరణ ధ్రువీకరణ పత్రం. ఒంటరి మహిళలు: విడిపోయినట్లు స్థానిక విచారణ నివేదిక. గీత కార్మికులు, చేనేత కార్మికులు: ఆయా శాఖల (ఆబ్కారీ, చేనేత జౌళి శాఖ) ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. ఫైలేరియా బాధితులు: వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన సర్టిఫికెట్ అందించాలి. -
వదలరు.. కదలరు!
కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ‘ఔట్సోర్సింగ్’ హ వాకాశిబుగ్గ: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యసేవల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అవసరం ఉన్న చోట విధులు నిర్వర్తించాల్సిన ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇష్టానుసారంగా పనిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిఽధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంది. వైద్యసిబ్బంది సైతం ఎక్కడ వైద్యసేవలు అవసరం ఉంటే అక్కడికి వెళ్లక తప్పదు. అయితే, సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తీరే వేరుగా ఉంది. చివరకు వారు అధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎంకు అనుబంధంగా హాస్పిటల్.. వరంగల్ ఎంజీఎంకు అనుబంధంగా పీఎంఎస్ఎస్వై పఽథకం కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వరంగల్ కాకతీయ వైద్యకళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో అందిస్తున్న వైద్యసేవలతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేకంగా సూపర్ సేవలు అందిస్తోంది. ఇందులో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఈ రెండు హాస్పిటల్స్లో అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది తీరు వేరే అన్నట్లు తాము ఇక్కడే పనిచేస్తామంటూ కొందరు సిబ్బంది పట్టుబడుతున్నట్లు సమాచారం. వైద్యసిబ్బంది తీరు ఇలా.. సూపర్ స్పెషాలిటీలో ఎక్కువ మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. చివరకు ఎక్కువ మంది వైద్యులు కూడా కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. 120 మంది స్టాఫ్నర్సులు ఉండగా.. ఇటీవల 20 మంది వరకు ఉద్యోగాలు వచ్చి రాజీనామా చేసి వెళ్లారు. ఐదారుగురు మూడు నెలల నుంచి రాకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొందరూ మెడికల్ లీవ్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 90 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. పారామెడికల్ సిబ్బంది 98 వరకు ఉండగా, వీరిలో ఆరుగురు రాజీనామా చేసి వెళ్లారు. కొందరు రెండు నెలల నుంచి లాంగ్ లీవ్లో ఉంటూ ఏమి చేస్తున్నారో తెలియదు. ఇక 115 మంది వరకు పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది విధులకు సరిగా హాజరు కావడం లేదని సమాచారం. ఆస్పత్రిలో ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపణ ఎంజీఎంలో అవసరం ఉన్నా వెళ్లనంటున్న మిగులు సిబ్బంది అధికారుల ఆదేశాలను పట్టించుకోని తీరు పేషెంట్లు తక్కువ.. వైద్యసిబ్బంది ఎక్కువ ప్రతిరోజు ఓపి ఉన్నప్పుడు 400 నుంచి 500 వరకు పేషెంట్లు వస్తుంటారు. ఇక ఇన్పేషంట్లు పరంగా 20 నుంచి 25 వరకు మాత్రమే ఉంటారని సమాచారం. దీనిని బట్టి చూస్తే పేషంట్లు తక్కువగా ఉన్నా వైద్య సిబ్బంది అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎంజీఎంకు వెళ్లాలంటూ అఽధికారులు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినా కొందరు సిబ్బంది మేము వెళ్లమంటూ చెబుతూ సూపర్లోనే పనులు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో స్టాఫ్నర్సులు, పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే పనిచేస్తామని పట్టుబట్టడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదని అధికారులే తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు వచ్చి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిని గాడిలో పెట్టాల్సిన సూపర్వైజర్లు ఏం చేస్తున్నారో వారికే తెలియాలి. కొన్ని సందర్భాల్లో కచ్చితంగా పనిచేయాలని చెబితే వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రజాప్రతినిధి నుంచి టక్కున ఫోన్కాల్ వస్తుంది. దీంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇదంతా బహిరంగమే అయినా ‘ఎవరికీ వారే యమునా తీరే’ అన్నట్లు ఉందనే ప్రచారం లేకపోలేదు. ఇటీవల ముగ్గురు సెక్యూరిటీ గార్డులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎంజీఎంకు పంపించినట్లు తెలుస్తోంది. -
ధరల నియంత్రణలో మోదీ విఫలం
నర్సంపేట: పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరల ని యంత్రణలో మోదీ విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనివాసరావు డి మాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్భాషామియా ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర మూడో రోజు మంగళవారం నర్సంపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. దేశంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లాఖాద్రి, దండు లక్ష్మణ్, గన్నారపు రమేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
గ్రాడ్యుయేట్ సీటుపై గురి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీల్లో మాత్రం అప్పుడే కసరత్తు మొదలైనట్లు కనిపిస్తోంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2027లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో పొటీ చేసిన ముఖ్య నేతలతోపాటు కొత్తగా తెరపైకి వచ్చే ఆశావహులపైనా పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో పట్టున్న నాయకుల కోసం అన్వేషణ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 2024 ఉప ఎన్నికపై అధ్యయనం... 2024 ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనూ ఆయన 1,22,813 ఓట్లు సాధించి ముందంజలో నిలిచి చివరకు ఎలిమినేషన్ ప్రక్రియలో విజేతగా నిలిచారు. తదనంతర పరిణామాలతో మల్లన్న సొంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించారు. అయితే.. ఎన్నికల సమయానికి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో? అన్న చర్చ ఉంది. బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్రెడ్డి పోటీచేసి గట్టి పోటీ ఇచ్చారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు 1,04,248 ఓట్లు వచ్చాయి. మల్లన్న తర్వాత చివరివరకు పోటీలో నిలిచిన అభ్యర్థి కూడా రాకేశ్రెడ్డే. దీంతో బీఆర్ఎస్ మరోసారి ఆయనకే అవకాశం ఇస్తుందా? అన్న చర్చకు ఆస్కారం ఉంది. కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బరిలో నిలిచారు. కాగా, ప్రధాన పార్టీలు కేవలం సీనియర్ రాజకీయ నాయకుల వైపే కాకుండా విద్యావంతులు, ఉద్యోగ సంఘాల నాయకులు, నిరుద్యోగ ఉద్యమాల్లో పనిచేసిన నేతలు, యువ నాయకుల పేర్లను కూడా పరిశీలిస్తుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికకు ఇంకా సమయం.. అప్పుడే కసరత్తు ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం 2027 మార్చి వరకు ఉండటంతో, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల సంఘం కూడా ఆరు నెలల ముందే సన్నద్ధం కానున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక, ఓటర్ల నమోదు, నియోజకవర్గాల వారీగా బలాబలాలు, ఉద్యోగులు–నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తదితర అంశాలపై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు రాజకీయంగా కీలకమైన ఓటు బ్యాంకు ఉంది. వరంగల్ నగరం, హనుమకొండలో ఉద్యోగులు, విద్యావంతులు, యువత అధికంగా ఉండగా.. మిగిలిన జిల్లాల్లో గ్రామీణ ప్రాంత పట్టభద్రుల ఓటర్లు కీలకంగా మారనున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్ర నాయకులు ఇటీవల ఆ వర్గాలే టార్గెట్ సెమినార్లు, సభలు, సమావేశాలే నిర్వహిస్తుండడం గమనార్హం. 2027 ఎన్నికలపై ముందస్తు లెక్కలు.. ఇప్పటి నుంచే కసరత్తు.. పట్టభద్రుల ఎన్నికలే టార్గెట్.. బలాబలాలపై బేరీజు.. ఆశావహుల జాబితాపైన ఆరా.. గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరకాల: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో పరకాలలోని రాజిపేటలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తిచేయాలని కోరారు. మీ జీవిత లక్ష్యాలు ఏమిటి? పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. బీకాం సీఏ, బీఏ, బీఎస్సీ డెయిరీ సైన్స్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మీ జీవిత లక్ష్యాలు ఏమిటని ప్రశ్నించారు.. మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉంటామని కొందరు, తల్లిదండ్రుల కలను సాకారం చేస్తామని మరికొందరు సమాధానం ఇచ్చారు. ఎక్కడి నుంచి కళాశాలకు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నాగారంలో యూనిఫామ్ కుట్టుకేంద్రం పరిశీలన మండలంలోని నాగారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాం కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కుట్టు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందని తెలుసుకున్నారు. యూనిఫామ్లో తయారీలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. పిల్లలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పరిసరాలను ఎప్నటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. అదనపు కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రామకృష్ణ, సర్పంచ్ రమాదేవి పాల్గొన్నారు. -
గ్రాడ్యుయేట్ సీటుపై గురి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీల్లో మాత్రం అప్పుడే కసరత్తు మొదలైనట్లు కనిపిస్తోంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2027లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో పొటీ చేసిన ముఖ్య నేతలతోపాటు కొత్తగా తెరపైకి వచ్చే ఆశావహులపైనా పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో పట్టున్న నాయకుల కోసం అన్వేషణ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 2024 ఉప ఎన్నికపై అధ్యయనం... 2024 ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనూ ఆయన 1,22,813 ఓట్లు సాధించి ముందంజలో నిలిచి చివరకు ఎలిమినేషన్ ప్రక్రియలో విజేతగా నిలిచారు. తదనంతర పరిణామాలతో మల్లన్న సొంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించారు. అయితే.. ఎన్నికల సమయానికి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో? అన్న చర్చ ఉంది. బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్రెడ్డి పోటీచేసి గట్టి పోటీ ఇచ్చారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు 1,04,248 ఓట్లు వచ్చాయి. మల్లన్న తర్వాత చివరివరకు పోటీలో నిలిచిన అభ్యర్థి కూడా రాకేశ్రెడ్డే. దీంతో బీఆర్ఎస్ మరోసారి ఆయనకే అవకాశం ఇస్తుందా? అన్న చర్చకు ఆస్కారం ఉంది. కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బరిలో నిలిచారు. కాగా, ప్రధాన పార్టీలు కేవలం సీనియర్ రాజకీయ నాయకుల వైపే కాకుండా విద్యావంతులు, ఉద్యోగ సంఘాల నాయకులు, నిరుద్యోగ ఉద్యమాల్లో పనిచేసిన నేతలు, యువ నాయకుల పేర్లను కూడా పరిశీలిస్తుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికకు ఇంకా సమయం.. అప్పుడే కసరత్తు ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం 2027 మార్చి వరకు ఉండటంతో, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల సంఘం కూడా ఆరు నెలల ముందే సన్నద్ధం కానున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక, ఓటర్ల నమోదు, నియోజకవర్గాల వారీగా బలాబలాలు, ఉద్యోగులు–నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తదితర అంశాలపై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు రాజకీయంగా కీలకమైన ఓటు బ్యాంకు ఉంది. వరంగల్ నగరం, హనుమకొండలో ఉద్యోగులు, విద్యావంతులు, యువత అధికంగా ఉండగా.. మిగిలిన జిల్లాల్లో గ్రామీణ ప్రాంత పట్టభద్రుల ఓటర్లు కీలకంగా మారనున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్ర నాయకులు ఇటీవల ఆ వర్గాలే టార్గెట్ సెమినార్లు, సభలు, సమావేశాలే నిర్వహిస్తుండడం గమనార్హం. 2027 ఎన్నికలపై ముందస్తు లెక్కలు.. ఇప్పటి నుంచే కసరత్తు.. పట్టభద్రుల ఎన్నికలే టార్గెట్.. బలాబలాలపై బేరీజు.. ఆశావహుల జాబితాపైన ఆరా.. గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు -
వదలరు.. కదలరు!
కాశిబుగ్గ: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యసేవల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అవసరం ఉన్న చోట విధులు నిర్వర్తించాల్సిన ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇష్టానుసారంగా పనిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిఽధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంది. వైద్యసిబ్బంది సైతం ఎక్కడ వైద్యసేవలు అవసరం ఉంటే అక్కడికి వెళ్లక తప్పదు. అయితే, సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తీరే వేరుగా ఉంది. చివరకు వారు అధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎంకు అనుబంధంగా హాస్పిటల్.. వరంగల్ ఎంజీఎంకు అనుబంధంగా పీఎంఎస్ఎస్వై పఽథకం కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వరంగల్ కాకతీయ వైద్యకళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో అందిస్తున్న వైద్యసేవలతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేకంగా సూపర్ సేవలు అందిస్తోంది. ఇందులో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఈ రెండు హాస్పిటల్స్లో అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంది. తాము ఇక్కడే పనిచేస్తామంటూ కొందరు పట్టుబడుతున్నట్లు సమాచారం. వైద్యసిబ్బంది తీరు ఇలా.. సూపర్ స్పెషాలిటీలో ఎక్కువ మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. చివరకు ఎక్కువ మంది వైద్యులు కూడా కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. 120 మంది స్టాఫ్నర్సులు ఉండగా.. ఇటీవల 20 మంది వరకు ఉద్యోగాలు వచ్చి రాజీనామా చేసి వెళ్లారు. ఐదారుగురు మూడు నెలల నుంచి రాకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొందరూ మెడికల్ లీవ్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 90 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. పారామెడికల్ సిబ్బంది 98 వరకు ఉండగా, వీరిలో ఆరుగురు రాజీనామా చేసి వెళ్లారు. కొందరు రెండు నెలల నుంచి లాంగ్ లీవ్లో ఉన్నారు. 115 మంది వరకు పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది విధులకు సరిగా హాజరుకావడం లేదని సమాచారం. ఆస్పత్రిలో ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపణ ఎంజీఎంలో అవసరం ఉన్నా వెళ్లనంటున్న మిగులు సిబ్బంది అధికారుల ఆదేశాలను పట్టించుకోని పరిస్థితి అధికారులు ఆదేశాలు జారీ చేసినా.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎంజీఎంకు వెళ్లాలంటూ అఽధికారులు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినా కొందరు సిబ్బంది మేము వెళ్లమంటూ చెబుతూ సూపర్లోనే పనులు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో స్టాఫ్నర్సులు, పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే పనిచేస్తామని పట్టుబట్టడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదని అధికారులే తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు వచ్చి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిని గాడిలో పెట్టాల్సిన సూపర్వైజర్లు ఏం చేస్తున్నారో వారికే తెలియాలి. కొన్ని సందర్భాల్లో కచ్చితంగా పనిచేయాలని చెబితే వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రజాప్రతినిధి నుంచి టక్కున ఫోన్కాల్ వస్తుంది. దీంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇదంతా బహిరంగమే అయినా ‘ఎవరికీ వారే యమునా తీరే’ అన్నట్లు ఉందనే ప్రచారం లేకపోలేదు. ఇటీవల ముగ్గురు సెక్యూరిటీ గార్డులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎంజీఎంకు పంపించినట్లు తెలుస్తోంది. పేషంట్లు తక్కువ.. వైద్యసిబ్బంది ఎక్కువ ప్రతిరోజు ఓపి ఉన్నప్పుడు 400 నుంచి 500 వరకు పేషంట్లు వస్తుంటారు. ఇక ఇన్పేషంట్లు పరంగా 20 నుంచి 25 వరకు మాత్రమే ఉంటారని సమాచారం. దీనిని బట్టి చూస్తే పేషంట్లు తక్కువగా ఉన్నా వైద్య సిబ్బంది అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. -
‘కాళోజీ’ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటేశ్వర్లు
కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్లును ఫారెన్ సర్వీసు కింద డిప్యూటేషన్పై రిజిస్ట్రార్గా మూడేళ్లపాటు పనిచేయడానికి ప్రభుత్వం ఇటీవల నియమించింది. కాళోజీ హెల్త్వర్సిటీలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా పనిచేసిన డాక్టర్ నాగార్జున రెడ్డి జాయింట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించనున్నారు. కాగా, డాక్టర్ వెంకటేశ్వర్లును కాశోజీ వీసీ డాక్టర్ రమేష్రెడ్డి, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి సన్మానించారు. హన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మాసం శ్రావణం అని, ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని దేవాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ రామల సునీత అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం ఉదయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు గణపతి ఆరాధన, శ్రీరుద్రేశ్వరస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. డీసీ రామల సునీత స్వామివారికి పూజలు చేశారు. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆలయంలో నిర్వహించనున్న శ్రావణ మాసోత్సవాల కరపత్రాన్ని రామల సునీత ఆవిష్కరించి మాట్లాడారు. ఈఓ అనిల్కుమార్, ఆలయ వేదపండితుడు గంగు మణికంఠశర్మ, మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. వరంగల్ లీగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) విద్యార్థిని ప్రీతి హత్య కేసు విచారణ హనుమకొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రారంభమైంది. కేసు విచారణ షెడ్యూల్ మంగళవారం నుంచి ఐదు మాసాల వరకు నిర్ణయించారు. మొత్తం 99మంది సాక్షులను విచారించనున్నారు. మొదటి రోజు మృతురాలి తండ్రిని విచారించారు. 2023లో మృతి చెందిన మెడికో ప్రీతి హత్య విషయమై నాడు పీజీ విద్యార్థి అయిన మహ్మద్ షఫీని నిందితుడిగా భావించి కాలేజీ నుంచి తొలగించిన విషయం విదితమే. విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్డు జడ్జి పద్మజ బుధవారానికి వాయిదా వేశారు. విద్యారణ్యపురి: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు టి.లింగారెడ్డి, నన్నబోయిన తిరుపతి తెలిపారు. హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హనుమకొండ, వరంగల్ జిల్లాల యూఎస్సీఎస్ శాఖల దశలవారీ పోరాటాల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12, 13 తేదీల్లో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద, 19న జిల్లాకేంద్రంలో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పీఆర్సీని 2023నుంచి అమలు చేయాలని, సీపీస్ను రద్దుచేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్లతో ఆందోళలు చేపడతామని పేర్కొన్నారు. కమిటీ రాష్ట్ర బాధ్యులు రావుల రమేష్, ఎ.శ్రీనివాస్రెడ్డి, జిల్లాల బాధ్యులు పెండెం రాజు, గొడిశాల సత్యనారాయణ, జి. ఉప్పలయ్య, కె.శ్రీనివాస్, బైరి స్వామి, భీమళ్ల సారయ్య, శ్రీనివాస్, డి.శ్రీరామ్, సూరయ్య, ఎ.మల్లయ్య, ఆర్.రాంరెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో హిందీ, పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ గిరిరాజ్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటలవరకు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. హిందీ పోస్టుకు హిందీ సబ్జెక్టుతోపాటు బీఏ లేదా బీఓఎల్ హిందీ ప్రవీణ/విధ్వాన్ లేదా ఎంఏ హిందీతోపాటు బీఈడీ లేదా ప్రచారక్ లేదా శిక్షణా కళా ప్రవీణ డిప్లొమా లేదా హిందీపండిట్ కలిగి ఉండాలన్నారు. పీఈటీకి ఇంటర్ లేదా బీఏతోపాటు బీపీఈడీ అర్హతగా పేర్కొన్నారు. -
మూడు నెలల పరేషన్!
హన్మకొండ అర్బన్ : మూడు నెలల రేషన్బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు కనిపించక కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల ఒకటో తేదీ నుంచే పంపిణీ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ అనేక రేషన్ దుకాణాలకు స్టాక్ చేరలేదు. దీంతో బియ్యం పంపిణీ ఎప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందుగా స్టాక్ చేరిన దుకాణాల్లోనూ రెండు రోజుల్లోనే బియ్యం ఖాళీ కావడంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 414 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటికి హనుమకొండ, పరకాలలోని రెండు ఎంఎల్ఎస్ (మండల స్థాయి నిల్వ) పాయింట్ల నుంచి బియ్యం సరఫరా అవుతుంది. హనుమకొండ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 264 దుకాణాలు ఉండగా.. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అన్ని షాపులకు బియ్యం సరఫరా కాలేదు. వచ్చిన స్టాక్ రెండు రోజుల్లోనే ఖాళీ.. ముందుగా బియ్యం చేరిన దుకాణాలకు కార్డుదారులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో రెండు రోజుల్లోనే స్టాక్ ఖాళీ అయిపోయింది. మళ్లీ బియ్యం వచ్చేవరకు రావద్దని డీలర్లు చెబుతున్నా.. సరైన సమాచారం లేక కార్డుదారులు ఉదయంనుంచే షాపుల వద్దకు చేరుకుంటున్నారు. కొన్నిచోట్ల ఉదయం 6 గంటల నుంచే క్యూలు మొదలవుతుండగా.. రాత్రి 9 గంటల వరకు డీలర్లు దుకాణాలు తెరిచి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. బియ్యం కోసం భారీగా జనం చేరడంతో కొన్ని చోట్ల డీలర్లు, కార్డుదారుల మధ్య వాగ్వాదాలు, గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన కారణాలు.. ఎస్డబ్ల్యూఎస్, ఎఫ్సీఐ గోదాముల నుంచి బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించడం స్టేజ్–1 కాంట్రాక్టర్ బాధ్యత కాగా.. అక్కడినుంచి దుకాణాలకు చేర్చడం స్టేజ్–2 కాంట్రాక్టర్ బాధ్యత. ఈ రెండు దశల రవాణా బాధ్యతలు ఒకే కాంట్రాక్టర్ పరిధిలో ఉండటంతో తగినన్ని వాహనాలు ఏర్పాటు చేయకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ● బియ్యం రవాణా, పంపిణీ ప్రారంభమైన సమయంలో హమాలీల అదనపు డబ్బుల డిమాండ్ కూడా మరో కారణమని చెబుతున్నారు. ● దుకాణాల వారీగా స్టాక్ ఎప్పుడు చేరుతుంది.. ఎప్పుడు పంపిణీ చేస్తారనే సమాచారాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయకపోవడంతో ఖాళీ చేతులతో దుకాణాల వద్దకు వస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలో నిల్చుని చివరకు బియ్యం లేక వెనుదిరగాల్సి వస్తోంది. స్టాక్ లేని షాపులకు బియ్యం ఎప్పుడు? ఒకటో తేదీనుంచే పంపిణీ ప్రారంభం కావాల్సి ఉండగా.. వారం రోజులు గడిచినా అనేక దుకాణాలకు స్టాక్ చేరలేదు. ముందుగా స్టాక్ వచ్చిన దుకాణాల్లోనూ ఇప్పటికే బియ్యం ఖాళీ అయింది. దీంతో మిగిలిన దుకాణాలకు స్టాక్ ఎప్పుడు చేరుతుంది? వచ్చిన దుకాణాల్లో మళ్లీ బియ్యం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. అధికారులు స్పందించి మిగిలిన అన్ని రేషన్ దుకాణాలకు తక్షణమే స్టాక్ చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైనన్ని వాహనాలను ఏర్పాటు చేసి సరఫరాను వేగవంతం చేయాలని కార్డుదారులు కోరుతున్నారు. ఒకటో తేదీనుంచే పంపిణీ.. ఇప్పటికీ సగం షాపులకు చేరని బియ్యం స్టాక్ వచ్చిన చోట రెండురోజుల్లోనే ఖాళీ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాల వద్ద పడిగాపులు అదనపు కలెక్టర్కు రేషన్డీలర్ల వినతి హన్మకొండ అర్బన్ : రేషన్దుకాణాలకు వెంటనే పూర్తిస్థాయిలో బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మంగళవారం హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పరకాల, హనుమకొండ గోదాములనుంచి షాపులకు ఇప్పటివరకు 30శాతం బియ్యం మాత్రమే సరఫరా చేశారని, మరో 70శాతం రావాల్సి ఉందని డీలర్లు తెలిపారు. దీంతో లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం జరుగుతోందని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ గోదాం శిథిలావస్థకు చేరినందున దాన్ని వెంటనే సురక్షిత ప్రాంతానికి మార్చి, అక్కడ బియ్యం నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్బాబు, ప్రధాన కార్యదర్శి చలిగాని మోహన్, ప్రతినిధులు మహేశ్వరం గౌరీశంకర్, పోతరాజు రమేష్, శ్రీశైలం ఉన్నారు. -
కాళోజీ రిజిస్ట్రార్కు సన్మానం
కాశిబుగ్గ: కాళోజీ నారాయణరావు హెల్త్వర్సిటీ రి జిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జె.వెంకటేశ్వర్లును వైద్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్క అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేశ్కుమార్, హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు కె.వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి ఎస్.శిరీష్కుమార్, కోశాధికారి ఎం.దిలీప్కుమార్, జాయింట్ సెక్రటరీ శివ్వా సృజన్, అకడమిక్ కమిటీ చైర్మన్ వి.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
ఐటీఐ అభివృద్ధికి రూ.25 కోట్లు
కాశిబుగ్గ: వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఐటీఐ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి హరిచందన దాసరి ఉత్తర్వులు జారీ చేశారు. 2026–2027 సంవత్సరానికి శక్తి డిపార్ట్మెంట్ ఉపాధి, శిక్షణ విభాగం కింద నిధులను కెటాయించారు. అయితే ఐటీఐ భవన నిర్మాణానికి రూ.30 కోట్ల బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపగా, రూ.25 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 1959 సంవత్సరంలో స్థాపించిన వరంగల్ ప్రభుత్వ బాలుర ఐటీఐ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణంలో మౌలిక సదుపాయాల కొరత, తరగతి గదులు, వర్క్షాపుల కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులు మంజూరు చేసినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్ మంగళవారం తెలిపారు. కాగా వరంగల్ ఐటీఐకు హబ్ ఽహోదా, హాస్టల్ మంజూరు చేయాలని ఇటీవల వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. నూతన భవన నిర్మాణ సముదాయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ -
మొదలైన మెడికో విద్యార్థిని ప్రీతి కేసు విచారణ
వరంగల్ లీగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) విద్యార్థిని ప్రీతి హత్య కేసు విచారణ హనుమకొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రారంభమైంది. కేసు విచారణ షెడ్యూల్ మంగళవారంనుంచి ఐదు మాసాల వరకు నిర్ణయించారు. మొత్తం 99మంది సాక్షులను విచారించనున్నారు. మొదటి రోజు మృతురాలి తండ్రిని విచారించారు. 2023లో మృతి చెందిన మెడికో ప్రీతి హత్య విషయమై నాడు పీజీ విద్యార్థి అయిన మహ్మద్ షఫీని నిందితుడిగా భావించి కాలేజీ నుంచి తొలగించిన విషయం విధితమే. విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్డు జడ్జి పద్మజ బుధవారానికి వాయిదా వేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలిదుగ్గొండి/నల్లబెల్లి/నర్సంపేటరూరల్: ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజిరెడ్డి తెలిపారు. ఈ మేరకు దుగ్గొండి, నల్లబెల్లి, న ర్సంపేట మండలాల్లోని పీహెచ్సీలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, మందుల వివరాలు, నెలవారి గర్భిణులు, బాలింతల నమో దు, వారికి అందుతున్న వైద్య సేవల వివరా లను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. వైద్యం అందుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణతో పాటు చుట్టూ పిచ్చిమొక్కలు విపరీతంగా ఉన్నాయని, వాటినే వెంటనే తీసివేసి శుభ్రం చేయించాలని పీహెచ్సీ వైద్యాధికారి కిరణ్రాజును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాకేష్, సీహెచ్ఓ సలోమి, హెచ్ఈఓ గౌస్, హెచ్వీ సంధ్యారాణి పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలు విద్యారణ్యపురి: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు టి.లింగారెడ్డి, నన్నబోయిన తిరుపతి తెలిపారు. హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హనుమకొండ, వరంగల్ జిల్లాల యూఎస్సీఎస్ శాఖల దశలవారీ పోరాటాల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12, 13 తేదీల్లో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద, 19న జిల్లాకేంద్రంలో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పీఆర్సీని 2023నుంచి అమలు చేయాలని, సీపీస్ను రద్దుచేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, ఏకీకృత సర్వీస్రూల్స్ను రూపొందించి పర్యవేక్షణ పోస్టులను భర్తీచేయాలన్న డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కమిటీ రాష్ట్ర బాధ్యులు రావుల రమేష్, ఎ.శ్రీనివాస్రెడ్డి, జిల్లాల బా ధ్యులు పెండెం రాజు, గొడిశాల సత్యనారాయణ, జి.ఉప్పలయ్య, కె.శ్రీనివాస్, బైరి స్వామి, భీమళ్ల సారయ్య, శ్రీనివాస్, డి.శ్రీరామ్, సూరయ్య, ఎ.మల్లయ్య పాల్గొన్నారు. హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలి: సీపీ వరంగల్ క్రైం: రాజ్యాంగం కల్పించిన హక్కులతోపాటు పౌరులు బాధ్యతలను కూడా తెతెలుసులకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీహర్ ఘర్ తిరంగాశ్రీపై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం, ఫొటో ఎగ్జిబిషన్ను సీపీ, కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగా లను స్మరించుకుంటూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడడంతోపాటు దేశ అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని కోరారు. రాజ్యాంగంలో రాసుకున్న హక్కులు, బాధ్యతలను ఇలాంటి కార్యక్రమాలు గుర్తు చేస్తాయని ఆమె వివరించారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని పే ర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశా ల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్, రజినీ లత, సమత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్తో ఆర్థిక భరోసా
● వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకం ● 14న తుది గడువు, అక్టోబర్లో పరీక్ష ● ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు ● ఎంపికై న వారికి ఏడాదికి రూ.12 వేల స్కాలర్షిప్సంగెం: ఆర్థికంగా వె నుకబడిన విద్యార్థుల కు కేంద్రం ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మె రిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)తో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహకంగా ఉపకార వేతనం అందించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్ఎంఎంఎస్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నిరుపేదలు ఉన్నత విద్యను చదువుకునేందుకు ఈ ఉపకార వేతనం ఎంతోగానో ఉపయోగపడనుంది. ఆర్థిక కారణాలతో ఉన్నత చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ను తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్ వరకు స్కాలర్షిప్ ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్, గురుకుల, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పొందిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. దరఖాస్తు ఇలా.. అర్హత పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులు రూ.50 చొప్పున పరీక్ష రుసుం ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్సీ.తెలంగాణ.జీఓవీ.ఇన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు ఈనెల 14వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష తెలుగు, ఆంగ్లం, హిందీ మాద్యమాల్లో రాసే వెసులుబాటు ఉంది. అర్హులు వీరే.. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 7వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి -
బీజేపీని గద్దె దింపే వరకు పోరు
సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డిహన్మకొండ చౌరస్తా: దేశంలోని ప్రజావ్యతిరేక బీజేపీని గద్దె దింపే వరకు సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు సీపీఐ జిల్లా సమితి నాయకులు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 6న ప్రారంభమైన పాదయాత్ర జిల్లాలో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకట్రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సీపీఐ ప్రచార జాత పాదయాత్ర నిర్వహిస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలే బీజేపీ పతనానికి దారి తీస్తాయని అన్నారు. దేశంలో మార్పు కోసం సీపీఐ పోరాటం సాగిస్తోందని, 12 ఏళ్ల పాలనలో బీజేపీ ఒక్క మంచి పని చేయలేదన్నారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సీనియర్ రాష్ట్ర నాయకుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర సమితి సభ్యుడు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్ పాల్గొన్నారు. -
మందులు వాడితే టీబీ నియంత్రణ
● జిల్లా టీబీ వైద్యాధికారి ప్రదీప్రెడ్డి శాయంపేట: ప్రాథమిక దశలోనే టీబీ గుర్తించి పూర్తికాలం మందులు వాడితే వ్యాధిని నిర్మూలించవచ్చని జిల్లా టీబీ వైద్యాధికారి ప్రదీప్రెడ్డి పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫేజ్–2లో భాగంగా మంగళవారం కాట్రపల్లి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 14 సంవత్సరాలు పైబడిన పిల్లల నుంచి వృద్ధుల వరకు టీబీ ఎక్స్రే, తెమడ పరీక్షలు చేశారు. అనంతరం డాక్టర్ ప్రదీప్రెడ్డి మాట్లాడుతూ మద్యపానం, పొగతాగడం వల్ల టీబీ సోకుతుందన్నారు. టీబీ వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. మండల వైద్యాధికారి సాయికృష్ణ, పీడీఎంఓ డాక్టర్ విద్యశ్రీ, సీహెచ్ఓలు మాధవరెడ్డి, ప్రేమలత, టీబీ స్టాఫ్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ చలపతిరావు, సూపర్వైజర్ సీతారాంనాయక్, లాబ్ టెక్నీషియన్ కృష్ణ, రేడియో గ్రాఫర్ మహేశ్, సదానందం, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్గఢ్ 196 సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ను పరిశీలించి సీఆర్పీఎఫ్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్ధాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్రావుతో పాటు ఒకరి ద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావో యిస్టుల ప్రభావం తగ్గడంతో అటవి ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం డీజీపీ సీవీ ఆనంద్ మావోయిస్టు సీనియర్ నాయకురాలు సమత లొంగుబాటు పామూనూరు, తడపల బేస్ క్యాంపుల పరిశీలన ఆపరేషన్ కగార్తో 700మంది లొంగుబాటు -
నేడు, రేపు విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ చౌరస్తా : రైతులను, కార్మికులను అధోగతి పాలు చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. సోమవారం వరంగల్ హెడ్ఫోస్టాఫీస్ సెంటర్ల రాస్తారోకో నిర్వహించగా పోలీసులు అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదం పేరు చెప్పి ఆచరణలో అమెరికా లాంటి విదేశాలకు అనుకూలంగా విధానాల రూపకల్పన చేసి రైతులను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారన్నారు. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతోపాటు వ్యవసాయాన్ని వదిలి కూలీలుగా మారిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్, కుసుంబ గంగాధర్, దయాకర్, జిల్లా కన్వీనర్లు చుక్క మొగిలి, శ్రీనివాస్, బాలరాజు, సూరి, భాస్కర్, కుమార్, ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పాశం రవి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాకెట్ పడితే పతకం ఖాయం! ● బ్యాడ్మింటన్లో వేదితారెడ్డి ప్రతిభ ● జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో 20 వరకు పతకాలు ● అండర్–13లో జాతీయస్థాయిలో 26వ ర్యాంక్నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బ్యాడ్మింటన్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తోంది. బ్యాడ్మింటన్ కోర్టులో దిగి బ్యాట్ (రాకెట్) పడితే పతకం ఖాయం అన్నట్లుగా పట్టుదలతో ఆడి పతకాలు సాధిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట పట్టణానికి చెందిన కట్కూరి సురేష్రెడ్డి, మమత దంపతుల కుమార్తె వేదితారెడ్డి ప్రస్తుతం 8వ తరగతి చదువుతుంది. మొదటి నుంచి బ్యాడ్మింటన్పై ఆసక్తి ఉండేది. ఆటల్లో ప్రతిభ కనబరుస్తుండటాన్ని తల్లిదండ్రులు గుర్తించి హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం అండర్ 13 విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తూ సుమారు 20 పతకాలు సాధించింది. ఇటీవల హైదరాబాద్లో ప్రభుత్వ సహకారంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యునెక్స్ సన్రైస్ 11వ రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ చాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించి ఒలింపిక్ ప్లేయర్ తనీషాక్రాప్టో చేతుల మీదుగా బహుమతి అందుకుంది. గతంలో ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లోనూ రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి, జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. పట్టుదలతో పతకాలు సాధిస్తుండటంతో పట్టణానికి చెందిన పలువురు అభినందిస్తున్నారు. ఒలింపిక్స్లో ఆడటమే లక్ష్యంవేదితారెడ్డి బ్యాడ్మింటన్పై మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తన ప్రతిభను గుర్తించి హైదరాబాద్లోని ఓ అకాడమీలో కోచ్ నిఖిల్కుమార్ పర్యవేక్షణలో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇండియా తరఫున ఒలింపిక్స్లో ఆడటమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. –వేదితారెడ్డి తండ్రి సురేష్రెడ్డి -
రూ.కోట్ల విలువైన భూమి గోల్మాల్ !
పరకాల: కోట్ల రుపాయల విలువైన తమ భూములను నకిలీ ధ్రువపత్రాలతో కొందరు అక్రమంగా పట్టా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని పరకాలకు చెందిన కొందరు భూబాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పరకాల ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూబాధితులు లక్కం సురేశ్, పొరండ్ల రాజయ్య, రాంశెట్టి రాజేందర్తో పాటు తిక్క రాజయ్య, తిక్క శంకరయ్య, తిక్క దేవేందర్ పరకాల పట్టణంలో తమ భూమి విషయంలో జరుగుతున్న అన్యాయంపై గోడు వినిపించారు. లక్కం సురేశ్ మాట్లాడుతూ.. పరకాల శివారులోని 689 సర్వే నంబర్లోని 15 గుంటల వ్యవసాయ భూమిని 2013లో కొలగాని నాగయ్య వద్ద కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. (నాగయ్య మనవడు రామిశెట్టి రాజేందర్ నుంచి పావుశెట్టి రాజు కొన్నాడు. అతడి నుంచి సురేశ్ భూమి కొన్నాడు) ఈ నేపథ్యంలో అదే సర్వే నంబర్లో కొంత భూమి నాగయ్య వారసుడు కొలగాని లింగయ్య పేరిట ఉందని పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మొత్తం భూమి తమదేనని కాగితాలు సృష్టించి లింగయ్య అక్రమంగా పట్టా చేసుకున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లింగయ్య, అతడి కుమారుడు నాగరాజు అరాచకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయమై పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రిజిష్ట్రేషన్ చేసిన భూములను మరొకరి పేరిట ఎలా పట్టా చేస్తారని స్థానిక తహసీల్దార్ను నిలదీసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ రూ.50 కోట్ల విలువైన భూములను అన్యాయంగా ఇతరుల పేరిట మార్చినట్లు ఆరోపించారు. లింగయ్య, అతడి కుమారుడు నాగరాజు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరారు. న్యాయం చేయాలంటూ భూ బాధితుల ఆవేదన రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆగ్రహం.. -
పెద్ది జ్ఞాపకాలతో కన్నీటిపర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం..మరోవైపు ఉద్యమ జ్ఞా పకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత..ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం నల్లబెల్లి మండలకేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, న ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ..‘ఎంత కాలం బతికామన్నది కాదు..ఎట్లా బతికామన్నదే ముఖ్యం..సమాజంకోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నారు. నర్సంపేట లో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడుతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్నాయక్ నాయకులు గండ్ర జ్యోతి, సతీష్రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆ యనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
పీఆర్సీ అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను, వివిధ రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, గొడిశాల రమేశ్, జిల్లా కార్యదర్శి అంకం శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, సీని యర్ బాధ్యులు సుబ్బారావు, జిల్లా కమిటీ బాధ్యులు వీరభద్రం, చక్రునాయక్, కుమారస్వామి, సదానందం, చంద్రమౌళి, చందర్నాయక్, కొమురయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పీఆర్సీ అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, గొడిశాల రమేశ్, జిల్లా కార్యదర్శి అంకం శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, సీనియర్ బాధ్యులు సుబ్బారావు, జిల్లా కమిటీ బాధ్యులు వీరభద్రం, చక్రునాయక్, కుమారస్వామి, సదానందం, చంద్రమౌళి, చందర్నాయక్, కొమురయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ బంగ్లా ఎదుట జైల్ భరో.. హన్మకొండ అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూ, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం సుబేదారి కలెక్టర్ బంగ్లా ఎదుట సోమవారం జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. రాస్తారోకోతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. అరెస్టు చేసిన వారిని సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించగా, అక్కడే బైఠాయించి మరో అరగంట పాటు ధర్నా చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్రెడ్డి, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి హంసారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడిప్పుడే..
కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు పూర్తయినా..విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాం మెటీరియల్ ఇప్పుడిప్పుడే జిల్లాకు చేరుకుంటుంది. పాఠశాలల ప్రారంభం రోజున ఉచితంగా రెండు జతల యూనిఫాం, పుస్తకాలు అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నా.. ఒక పుస్తకాలు మాత్రమే సకాలంలో అందించారు. యూనిఫాం అందించడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విద్యార్థులు పాత దుస్తులతోనే జరుపుకునే పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 664 పాఠశాలలు ఉండగా 29,899 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఏప్రిల్ మాసంలోనే విద్యార్థుల కొలతలు తీసుకుని పభుత్వానికి ఇండెంట్ పంపించారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, పట్టణ ప్రాంతంలో మెప్మా.. జిల్లాలో దుస్తులను కుట్టే బాధ్యతలను గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, పట్టణ ప్రాంతంలో మెప్మా పర్యవేక్షణలో మహిళా సంఘాల (ఎస్హెచ్జీ) గ్రూప్లకు బాధ్యతను అప్పగించారు. అయితే ప్రభుత్వం ఈసారి యూనిఫాం కలర్ మార్చి ఇవ్వాలనే ఆలోచన చేసింది. దీంతో జాప్యం జరిగి ఇప్పటి వరకు మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు క్లాత్ అందకపోవడంతో విద్యార్థులకు పంపిణీ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని ఆధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఎమ్మార్సీ కేంద్రాలకు.. జిల్లాలో ఇప్పుడిప్పుడే క్లాత్ (మెటీరియట్) ఎమ్మార్సీ కేంద్రాలకు చేరుకుంటుంది. దీంతో ఎప్పుడు యూనిఫాం తయారవుతుంది..ఎప్పుడు పాఠశాలలకు చేరుకుంటుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే యూనిఫాం తయారుకావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఎమ్మార్సీలకు చేరుకుంటున్న నూతన యూనిఫాం క్లాత్ పూర్తి దుస్తులు తయారవడానికి మరో నెలరోజుల సమయం పాత దుస్తులతోనే పంద్రాగస్టు వేడుకలు జిల్లాలో 664 పాఠశాలలు, 29,899 మంది విద్యార్థులుకొత్తగా చేరిన విద్యార్థుల సంగతేంటి? ఏప్రిల్ మాసంలో పాత యూడైస్ ప్రకారం 29,899 ఉన్న విద్యార్థులకు మాత్రమే అధికారులు దుస్తులకు సంబంధించిన మెటీరియల్ పంపిస్తున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం (2026–27)లో కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఎటూ తేలకుండా ఉంది. పాత విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫాం అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. -
డిగ్రీ పాస్ అంతంతే!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకప్పుడు వార్షిక పరీక్షలు ఉండేవి. సంవత్సరం మొత్తం పాఠాల బోధన, అనంతరం పరీక్షలు నిర్వహించేవారు. అందులో ఉత్తీర్ణత తక్కువగా ఉండేది. ఈ విధానాన్ని రద్దుచేసి సెమిస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్ విధానంలో ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 మార్కులు ఇంటర్నల్, 80 మార్కులకు సెమిస్టర్ పరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చినవి ఇంటర్నల్ మార్కులతో కలిపి ఉత్తీర్ణత ప్రకటిస్తున్నారు. అయినా పాస్ మార్కులు రావడం లేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాల్లో డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండో, మూడవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇటీవల అధికారులు విడుదల చేసిన విషయి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం అంతంత మాత్రంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకిలా..? డిగ్రీకోర్సుల్ల సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగైన ఫలితాలు సాధించలేకపోవటానికి పలు కారణాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ● విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరుకాకపోవటం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. కానీ, ఏ కళాశాలలోనూ అమలుచేయడం లేదు. ● ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవారే ఉంటున్నారు. కొందరు కళాశాలలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రైవేట్గా ఉపాధి పొందుతుంటారని తెలుస్తోంది. ● ప్రైవేట్ కళాశాలల్లోనూ విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేలా యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు. ● కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవటంతో కొన్ని ప్రేవేట్ కళాశాలలైతే వి ద్యార్థులకు సరిగా ప్రాక్టికల్స్ నిర్వహించడం లేదు. మరోవైపు సెల్ఫోన్ ప్రభావం కూడా వారి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదన వినిపిస్తోంది. డిగ్రీ కళాశాలలపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కొరవడిందనేది మరో కారణంగా భావిస్తున్నారు. విద్యార్థులు సక్రమంగా క్లాస్లకు హాజరయ్యేలా, కళాశాలల్లో నాణ్యమైన బోధన అందేలా చర్యలు చేపడితేనే పరీక్షల్లో ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సెమిస్టర్ పరీక్షల్లో బాయ్కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత సాధించారు. కేయూ పరిధిలో సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగుపడని ఫలితాలు ఇటీవల విడుదలైన ఫలితాల్లో తేటతెల్లం నాలుగు సెమిస్టర్లలో బాలికలదే హవా -
నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం
ఎల్కతుర్తి: పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్ల లకు నాణ్యమైన విద్యనందించడమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించారు. నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్తో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి అవసరమైన కార్యాలయ భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. సుపరిపాలన అందించాలని సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి రూ.600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తవడం సంతోషకరమన్నారు. నాబార్డ్ నిధులతో అదనపు మరుగుదొడ్లు, కిచెన్షెడ్ నిర్మాణ పనులు కూడా చేపట్టినట్ల తెలిపారు. విద్యలో ప్రతిభ కనబర్చి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రులు సన్మానించి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, శ్రీకుడాశ్రీ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సామ్యనాయక్, డీఈఓ గిరిరాజ్గౌడ్, తహసీల్దార్ ప్రసాద్రావు, ఎంపీడీఓ విజయ్కుమార్, ప్రిన్సిపాల్ అనితాదేవి, అధ్యాపకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేజీబీవీ నూతన భవనం ప్రారంభోత్సవం తహసీల్దార్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ -
పెద్ది జ్ఞాపకాలతో.. కన్నీటిపర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం.. మరోవైపు ఉద్యమ జ్ఞాపకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత.. ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ.. ‘ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎ ట్లా బతికామన్నదే ముఖ్యం.. సమాజం కోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నారు. నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్నాయక్, నాయకులు గండ్ర జ్యోతి, సతీశ్రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
జిల్లాలో ఇలా..
పెండింగ్ ఫారాలు: 0జిల్లా మొత్తం ఓటర్లు జిల్లాలో సేకరించలేని మొత్తం ఫారాలు మరణించినవారు5,09,01476,99114,7578,5001,4081,01,781125 అత్యధిక ఓటర్లు: హనుమకొండ మండలంలో 2,10,521 మంది తర్వాతి స్థానంలో: కాజీపేటలో 61,115 మంది అత్యధిక డిజిటలైజేషన్ శాతం: దామెర మండలంలో 95.49 శాతం తర్వాతి స్థానాల్లో: ఆత్మకూరు 93.59 శాతం, నడికూడ 93.35 శాతం అత్యల్ప డిజిటలైజేషన్ శాతం: హనుమకొండ మండలంలో 69.71 శాతం తర్వాతి స్థానాల్లో: కాజీపేట 74.66 శాతం అత్యధిక శాతం సేకరించలేని ఫారాలు: హనుమకొండ మండలంలో 30.29 శాతం తర్వాతి స్థానాల్లో: కాజీపేట 25.34 శాతం అత్యల్పంగా సేకరించలేని ఫారాలు: దామెరలో 4.51 శాతం, ఆత్మకూరులో 6.41 శాతం. అత్యధిక శాశ్వత వలసలు: హనుమకొండ మండలంలో 52,851 మంది. తర్వాతి స్థానంలో: కాజీపేటలో 11,922 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారిగా నమోదయ్యారు. -
డిగ్రీ పాస్ అంతంతే!
బాలికలదే పై చేయి నాలుగు సెమిస్టర్ పరీక్షల్లో బాయ్కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత సాధించారు. ● మొదటి సెమిస్టర్లో బాలికలు 11,295 మందికిగాను 3,776 మంది (33.43శాతం) ఉత్తీర్ణత సాఽధించారు. బాయ్స్ 14,166మందికిగాను 3,336 మంది (23.55శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాయ్స్కంటే బాలికదే పైచేయిగానే ఉంది. ● రెండో సెమిస్టర్లో బాలికలు 25,603మందికిగాను 10,742మంది ఉత్తీర్ణత (41.96శాతం) సాధించగా, బాయ్స్24,689మంది కిగాను 5,644మంది (22.86శాతం) పాసదయ్యారు ఉత్తీర్ణత సాధించారు. ● మూడవ సెమిస్టర్లో బాలికలు 7,834మందికిగాను 3,591మంది (45.83శాతం), బాయ్స్ 10,452మందికిగాను 3,400 (32.53శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● 4వ సెమిస్టర్లో బాలికలు 19,947మందికిగాను 9,587మంది ఉత్తీర్ణత (48.06శాతం), బాయ్స్18,086 మంది కిగాను 5,032 మంది (27.82శాతమే )ఉత్తీర్ణత సాధించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకప్పుడు వార్షిక పరీక్షలు ఉండేవి. సంవత్సరం మొత్తం పాఠాల బోధన, అనంతరం పరీక్షలు నిర్వహించేవారు. అందులో ఉత్తీర్ణత తక్కువగా ఉండేది. ఈ విధానాన్ని రద్దుచేసి సెమిస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్ విధానంలో ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 మార్కులు ఇంటర్నల్, 80 మార్కులకు సెమిస్టర్ పరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చినవి ఇంటర్నల్ మార్కులతో కలిపి ఉత్తీర్ణత ప్రకటిస్తున్నారు. అయినా పాస్ మార్కులు రావడం లేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాల్లో డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండో, మూడవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఇటీవల అధికారులు విడుదల చేసిన విషయి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం అంతంత మాత్రంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకిలా..? డిగ్రీకోర్సుల సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగైన ఫలి తాలు సాధించలేకపోవటానికి పలు కారణాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ● విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరుకాకపోవటం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. కానీ, ఏ కళాశాలలోనూ అమలుచేయడం లేదు. ● ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవారే ఉంటున్నారు. కొందరు కళాశాలలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రైవేట్గా ఉపాధి పొందుతుంటారని తెలుస్తోంది. ● ప్రైవేట్ కళాశాలల్లోనూ విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేలా యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు. ● కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవటంతో కొన్ని ప్రేవేట్ కళాశాలలైతే వి ద్యార్థులకు సరిగా ప్రాక్టికల్స్ నిర్వహించడం లే దు. మరోవైపు సెల్ఫోన్ ప్రభావం కూడా వారి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదన వినిపిస్తోంది. డిగ్రీ కళాశాలలపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కొరవడిందనేది మరో కారణంగా భావిస్తున్నారు. కళాశాలల్లో నాణ్యమైన బోధన అందేలా చర్యలు చేపడితేనే పరీక్షల్లో ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేయూ పరిధిలో సెమిస్టర్ సిస్టమ్లోనూ మెరుగుపడని ఫలితాలు ఇటీవల విడుదలైన ఫలితాల్లో తేటతెల్లం నాలుగు సెమిస్టర్లలో బాలికలదే హవా -
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్గఢ్ 196 సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ను పరిశీలించి సీఆర్పీఎఫ్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్ధాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్రావుతో పాటు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం.. డీజీపీ సీవీ ఆనంద్ పామూనూరు, తడపల బేస్ క్యాంపుల పరిశీలన ఆపరేషన్ కగార్తో 700మంది లొంగుబాటు -
ఆదివాసీల సంస్కృతిని పరిరక్షించుకోవాలి
ఖిలా వరంగల్: ఆదివాసీ, గిరిజన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జూనియర్ సివిల్ జడ్జి రాజ్ నిధి అన్నారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వరంగల్ యాకూబ్పురంలోని ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో గిరిజనుల హక్కులు, చట్టపరమైన రక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సివిల్ జడ్జి రాజ్నిధి హాజరై మాట్లాడారు. గిరిజనులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సాయం పొందవచ్చునని సూచించారు. సదస్సులో సబ్ ఇన్స్పెక్టర్ నిహారిక, న్యాయవాది పి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ హేమంత్, సిబ్బంది పాల్గొన్నారు కాజీపేట అర్బన్: కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మాతంగి ప్రవీణ్ తైక్వాండో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు గ్రాండ్ మాస్టర్ ఎం.జయంత్రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈనెల 9న హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్స్ సంయుక్తంగా తైక్వాండో పోటీలు నిర్వహించారు. మాతంగి ప్రవీణ్ బ్లాక్ బెల్ట్ మూడో డాన్ విభాగంలో పాల్గొని ప్రతిభ కనబర్చి తైక్వాండో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు తెలిపారు. కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేస్టేషన్లోని స్టేషన్ మాస్టర్ కార్యాలయంలో ఆదివారం టీడీ సేవర్ 101 ఎమర్జెన్సీ మెడికల్ బాక్స్ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ కిట్లో గాయాలకు డ్రెస్సింగ్లు, బ్యాండేజీలు, రక్తస్రావాన్ని నియంత్రించే సామగ్రి తదితర అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. రైల్వేస్టేషన్, రైళ్లలో ప్రయాణికులు అనుకోకుండా ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స అందించేందుకు ఈ మెడికల్ బాక్స్ ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. -
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
నర్సంపేట: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలో ఆదివాసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేడుకల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నారాయణరెడ్డి, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీలక్ష్మి, ఆదివాసీ సంఘం నాయకులు గట్టి పాపయ్య, జగ్గారావు, నర్సింహారావు, గొంది నాగేశ్వర్రావు, ఎల్లయ్య, ప్రణయ్దీప్, రవి, లక్ష్మ య్య, పాపయ్య, రామస్వామి, కృష్ణమూర్తి, సమ్మయ్య, వీరస్వామి, సదానందం తదితరులు పాల్గొన్నారు. అలాగే మహేశ్వరం గ్రామంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను సీపీఐ(ఎంఎల్)మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి చిన్న చంద్రన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. -
పోలీసింగ్లో వరంగల్ భేష్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లా పోలీసింగ్ బాగుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం వరంగల్కు వచ్చిన ఆయన వరంగల్ నిట్లో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయాలి.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. దోపిడీ కేసులు 29కి పెరగగా, సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కి, 2026 జనవరి–జూలైలోనే 119 కేసులుగా నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదు కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన 117 కేసులు నమోదైనట్లు డీజీపీకి అధికారులు వివరించారు. చోరీల ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ శ్వేత వివరించగా.. వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించా లని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై పీపీటీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) టీ–స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీ శ్వేత కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ పనితీరు, నేరాల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల భద్రత, ఆర్థిక నేరాల ధోరణులు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అధిక లాభాల ఆశతో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. పిల్లలే టార్గెట్.. గ్రామాలకూ డ్రగ్స్.. డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని డీజీపీ హెచ్చరించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తిస్తున్నామని, అయితే కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసింగ్ మరింత ప్రజా కేంద్రంగా.. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మార్చుతున్నామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, సైబర్ మోసాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడి ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్లతో నేరాలు పెరుగుతున్నాయన్నారు. బేసిక్ పోలీసింగ్కు ప్రాధాన్యం... సాంకేతికత పోలీసింగ్కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. వరంగల్తో అనుబంధం తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ సీవీ ఆనంద్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో నివాసం ఉన్నానన్న ఆయన నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ప్రతి రోజు ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వెళ్తామా.. లేదా? అన్న ఆందోళనకర పరిస్థితులు అప్పట్లో ఉండేవన్నారు. ప్రస్తుతం మావోయిజం పూర్తిగా అంతరించిపోవడం సంతోషకరమన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగు డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ వరంగల్తో అనుబంధం విడదీయరానిది.. ఐపీఎస్గా ఇక్కడి నుంచే ప్రస్థానం నిట్ మీడియా సమావేశంలో గతాన్ని గుర్తుచేసుకున్న పోలీస్ బాస్పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి : డీజీపీ -
ఇక తప్పించుకోలేరు!
సాక్షి, వరంగల్: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడంపై వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్) సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నారు. వివిధ వనరుల నుంచి లభించే సమాచారాన్ని అనుసంధానం చేసి.. అనుమానితుడి కదలికలు, సంబంధాలు, గత నేరచరిత్ర వంటి అంశాలను విశ్లేషించడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. ఇది కమిషనరేట్లో పూర్తిస్థాయిలో వినియోగించగలిగితే నేరాల పురోగతిలో కీలకమవుతుంది. డీజీపీ సీవీ ఆనంద్ కూడా ఈ సాంకేతికతను వాడాలని వరంగల్ పోలీసులకు సూచించారు. నేరస్తులను ఎలా గుర్తిస్తారంటే.. ఒక ఆధారం.. ఎన్నో లింకులు: నిందితుడికి సంబంధించిన పేరు, గుర్తింపు వివరాలు, ప్రయాణం, ఫోన్ లేదా ఇతర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సంబంధిత రికార్డులను అనుసంధానించి పరిశీలించే అవకాశం ఉంటుంది. కదలికలపై నిఘా: నిందితుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా.. అందుబాటులో ఉన్న ప్రయాణ, ఇతర సంబంధిత డేటా ఆధారాలతో అతడి కదలికలపై ఆధారాలు సేకరించవచ్చు. పాత నేరచరిత్ర గుర్తింపు: ఒక కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తికి గతంలో ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయా? ఏదైనా నేర ముఠాతో సంబంధం ఉందా? వంటి అంశాలను పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. నేర ముఠాల గుట్టురట్టు: ఒకే వ్యక్తి కాకుండా పలువురు కలిసి నేరాలకు పాల్పడుతున్నప్పుడు.. వారి మధ్య ఉన్న సంబంధాలను డేటా విశ్లేషణ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతర్రాష్ట్ర నేరాలకు చెక్: వరంగల్లో నేరం చేసి మరో రాష్ట్రానికి వెళ్లిన నిందితుడి విషయంలో స్థానిక సమాచారం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన సంబంధిత రికార్డులను కూడా పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. సైబర్ నేరాల్లో కీలకం.. ఆన్లైన్ మోసాల్లో నేరగాళ్లు తరచూ ఇతరుల బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, తప్పుడు గుర్తింపు వివరాలు ఉపయోగిస్తుంటారు. దీంతో అసలు నిందితుడిని చేరుకోవడం పోలీసులకు సవాల్గా మారుతుంది. ఇలాంటి కేసుల్లో వివిధ ఆధారాలను కలిపి చూడడం ద్వారా ఒక నంబర్ నుంచి ఖాతా.. అక్కడి నుంచి వ్యక్తి.. ఆ వ్యక్తి నుంచి నేర ముఠా వరకు దర్యాప్తును విస్తరించేందుకు సాంకేతిక ఆధారాలు తోడ్పడతాయి. ‘నాట్గ్రిడ్’తో నేరస్తుల జాడ ఆధారాలను అనుసంధానించి నిందితుల గుర్తింపు వరంగల్ సైబర్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కమిషనరేట్లో 2,400 సైబర్ కేసులు.. రూ.6.85 కోట్ల నష్టం ఇక నేరస్తులను పట్టుకోవడంలో పెరగనున్న మరింత వేగం‘డేటా’తో దర్యాప్తులో వేగం.. గతంలో వివిధ విభాగాల నుంచి సమాచారం సేకరించేందుకు ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు అనుమతించిన పరిధిలో అందుబాటులో ఉన్న డేటాను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా దర్యాప్తులో కీలకమైన లీడ్స్ త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాట్గ్రిడ్ను అధీకృత సంస్థలు, చట్టపరమైన విధానాల ప్రకారం మాత్రమే వినియోగిస్తాయి. మొత్తంగా.. నేరగాడు ఎక్కడున్నాడన్నదే కాదు.. అతడి వెనుక ఎవరున్నారు? ఎక్కడికి వెళ్లాడు? గతంలో ఏం చేశాడు? ఎవరితో సంబంధాలున్నాయి? అనే ప్రశ్నలకు డేటా ఆధారంగా సమాధానాలు వెతికే అవకాశం నాట్గ్రిడ్తో లభిస్తుంది. వరంగల్ సైబర్ పోలీసులకు అందుతున్న శిక్షణతో సాంకేతిక ఆధారాల విశ్లేషణ మరింత బలోపేతమై.. సైబర్, ఆర్థిక, అంతర్రాష్ట్ర నేరాల దర్యాప్తులో నిందితుల గుర్తింపు వేగవంతమయ్యే అవకాశం ఉంది. వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఇప్పటివరకు 2,400 సైబర్ కేసులు నమోదు కాగా.. రూ.6.85 కోట్లు నష్టపోయారు. పదుల సంఖ్యలోనే నిందితులు పట్టుకున్నారు. ఈ డేటాతో మరింత పురోగతి సాధించే అవకాశముంది. -
‘కార్ల’ సైన్యం!
● కిక్కిరిసిన జాతీయ రహదారి నర్సంపేట: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కార్లతో కూడిన కాన్వాయ్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి నల్లబెల్లికి ఆదివారం వచ్చారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కేసీఆర్ కాన్వాయ్ వరంగల్కు చేరుకోగానే కార్లతో అనుసరించి నల్లబెల్లికి చేరుకోవడంతో భారీ కార్ల ర్యాలీ ఏర్పడింది. మల్లంపల్లి నుంచి నర్సంపేట వరకు 365 జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. -
దివ్యాంగులకు పింఛన్లు ఇవ్వాలి
ఖానాపురం: దివ్యాంగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ఆదివారం దివ్యాంగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క దివ్యాంగుడికి పింఛన్ మంజూరు చేయలేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21,500 మంది దివ్యాంగులు నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు మేరుగు శంకర్, ఉపాధ్యక్షుడు మద్దూరి రవి, ప్రధాన కార్యదర్శి లావుడ్య రామోజీ, సహాయ కార్యదర్శి ధరావత్ భద్రు, కోగంటి ప్రభాకర్రావు, రాములు, తదితరులు పాల్గొన్నారు. నేటి ‘జైల్భరో’ను జయప్రదం చేయండిసంగెం: కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నేటి (సోమవారం) ‘జైల్భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు కోరారు. ఆదివారం సంగెం మండలకేంద్రంలో ఆటో జాత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంటూ కార్మిక రైతు ప్రజా వ్యతిరేఖ విధానాలను అమలు చేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల అనిల్కుమార్, ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు గుండేటి స్వామి, సీఐటీయూ మండల కన్వీనర్ దుపాకి రాజు, మండల నాయకులు మెట్టుపల్లి శంకర్, గుండేటి రామృష్ణ, మెట్టుపల్లి బాబు, నీరటీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వరస్వామికి పూజలు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రామప్ప సరస్సులో బోటు షికార్ చేసి సరస్సు అందాలను తిలకించారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై నెలకొన్న శ్రీహేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిట లాడింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖ పట్టణం వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముకాకమల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్ శర్మ, రాజీవ్ శర్మ స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. -
నెరవేరుతున్న పేదల సొంతింటి కల
కమలాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరబోతోందని కుడా చైర్మన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. మండలంలోని కమలాపూర్, గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఏర్పాట్లను ఆదివారం వారు పరిశీలించి మాట్లాడారు. నిరుపేదలు కలలుగన్న సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమైందని, సోమవారం రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి విడతలో ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, రెండో విడత మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిపేదవారిని ఆదుకుంటామన్నారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ జెండా గద్దె ఆవిష్కరణ స్థలాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్, ఏఎంసీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీరవీందర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్, హుజూరాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేడు కమలాపూర్కు రానున్న మంత్రులు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం కమలాపూర్కు రానున్నట్లు ఎంపీడీఓ గుండె బాబు తెలిపారు. గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను గూడూరులో ప్రారంభించిన అనంతరం మండల కేంద్రంలోని ఉమామహేశ్వర గార్డెన్స్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి -
నేడు ఎల్కతుర్తికి మంత్రులు
ఎల్కతుర్తి: మండల కేంద్రంలో నేడు (సోమవారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాల భవనాన్ని ప్రారంభించడంతో పాటు తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాయకులు, అఽధికారులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థలాన్ని పరిశీలించిన ఇన్చార్జ్ కలెక్టర్ రవి.. తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి ఆదివారం మండల కేంద్రంలో స్థలాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రసాద్రావు, ఈఈ దేవక చౌహాన్ తదితరులు ఉన్నారు. -
పోలీస్ శాఖలో ఎన్నికల సందడి
సాక్షి ప్రతినిధి, వరంగల్: పోలీస్ శాఖలో ఎన్నికల సందడి పెరిగింది. సుమారు పదమూడేళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరగలేదు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) కొత్త కార్యవర్గాల ఎన్నికల నిర్వహణకు ఇటీవలే డీజీపీ సీవీ.ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈమేరకు జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, వివిధ యూని ట్లలో ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. ఇందులో భాగంగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లోనూ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల అధికారిగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఆర్.ప్రభాకర్రావు వ్యవహరిస్తుండగా.. మూడు జిల్లాల్లో 110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తయ్యింది. వీరంతా కార్యవర్గ సభ్యుడి నుంచి అధ్యక్షుడి వరకు 13 మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవాల్సి ఉంది. 13 ఏళ్ల తర్వాత.. టీజీపీఓఏకు మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో సుమారు 13 ఏళ్లుగా పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు లేకుండాపోయాయి. డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం సంఘం ఎన్నికలపై దృష్టి సారించారు. డీజీపీ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలు, కమిషనరేట్ల యూనిట్ కమిటీల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి, ఆరుగురు కార్యవర్గ సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష పదవిని సివిల్ లేదా ఆర్ముడ్ వింగ్కు చెందిన కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు చేపట్టవచ్చు. ఎస్ఐ/ఇన్స్పెక్టర్ ఎన్నికై తే ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉండాలి. అదే హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ అధ్యక్షుడైతే ఇద్దరు ఉపాధ్యక్షులు ఎస్ఐ/ఇన్స్పెక్టర్ స్థాయికి చెందిన వారై ఉండాలి. సివిల్ పోలీస్ కోటాలో ఒక స్థానాన్ని మహిళా పోలీసులకు రిజర్వ్ చేసినట్లు పోలీసువర్గాల సమాచారం. కాగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి అధ్యక్షుడి వరకు 13 పోస్టులకు 13న ఎన్నికలు జరగనున్నాయి. ‘పొలిటికల్’ను తలపిస్తూ.. కమిషనరేట్ పరిధి అన్ని సర్కిళ్ల వారీగా 50 మందికి ఒకరు చొప్పున మొత్తం 110 మంది ప్రతినిధులను ఇప్పటికే ఎన్నుకున్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో అందులో నుంచి 13 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్న తర్వాత మరో ఇద్దరు సభ్యులను నామినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో సంఘం ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమం, సేవా పరిస్థితులు, ఇతర అంశాలపై తమ గళాన్ని వినిపించే అవకాశం ఉండడంతో ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరుగుతుండడంతో వరంగల్ కమిషనరేట్లోనూ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తమకు అనుకూలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. కార్యవర్గ సభ్యుడు మొదలుకొని అధ్యక్ష పదవి కోసం అర్హులైన పలువురు పోటీ పడుతున్నారు. ఇందులో కొందరు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు తమ అనుయాయులను ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు ప్రచారం. అభ్యర్థులుగా బరిలోకి దిగే కొందరు మద్యం, డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పొలిటికల్ పార్టీలను తలపించే రీతిలో మరికొందరు ప్రచారం నిర్వహిస్తుండడం పోలీస్శాఖలో చర్చనీయాంశమవుతోంది.సుమారు 13 ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు 110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తి 13 పోస్టులకు 13న ప్రత్యక్ష ఎన్నిక పోటాపోటీగా ప్రచారం -
‘పెద్ది’ కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
సాక్షి, వరంగల్/నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లోని ఫొటోలను చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. అనంతరం కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పా టు ముచ్చటించిన కేసీఆర్.. వారి యోగక్షేమాల ను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. షెడ్యూల్ ప్రకారం మధ్యా హ్నం ఒంటి గంటకు వచ్చి 1.30 నిమిషాలకు వెళాల్సి ఉంది. అంతకుముందు నల్లబెల్లికి వచ్చే క్రమంలో ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త వనకర్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లారు. ప్రముఖుల పరామర్శ.. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. నల్లబెల్లి–నర్సంపేట రహదారులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. ‘పెద్ది సుదర్శన్రెడ్డి అమర్ రహే’, ‘జోహార్ పెద్ది’ నినాదాలు మార్మోగాయి. పలు చోట్ల కాన్వాయ్ ఆపిన కేసీఆర్ కిందికి దిగి కార్యకర్తలను పలకరించారు. పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జీవన్రెడ్డి, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యులు జి.జగదీశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, అనిల్జాదవ్, గంగుల కమలాకర్, సంతోశ్కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. సభకు హాజరయ్యే అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లబెల్లి ఎస్సై సాయిప్రసన్న కుమార్తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది బందోబస్తు విధులు నిర్వర్తించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు చిత్రపటానికి నివాళి.. పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎం -
న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాడుతున్నాం
కాశిబుగ్గ: న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, అదే నమ్మకంతోనే కార్మికుల పక్షాన పోరాడుతున్నామని ఆజంజాహి మిల్స్ వీఆర్ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఆదివారం వరంగల్ చింతల్ బ్రిడ్జి వద్ద వీఆర్ఎస్ అసోసియేషన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేశ్ మాట్లాడుతూ.. 134 మంది మిల్లు కార్మికులకు 200 గజాల చొప్పున ఇచ్చినట్లుగానే మిగతా 318 మందికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పాండవుల సమ్మయ్య, తౌటం రమేశ్, సంజీవ్ పాల్గొన్నారు. ● ఆజంజాహి మిల్స్ వీఆర్ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు -
పెద్ది కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
సాక్షి, వరంగల్/నల్లబెల్లి: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. రోడ్డు మార్గంలో కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెలికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం పెద్ది కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్కుమార్, మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా నల్లబెల్లిలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో నల్లబెల్లి ఎస్సై సాయి ప్రసన్నకుమార్తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వర్తించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు చిత్రపటం వద్ద నివాళి.. పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎంప్రముఖుల పరామర్శ..మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
మత్స్యసంపదకు ఎల్ నినో దెబ్బ!
● నిండని చెరువులు, కుంటలు ● జిల్లాలో 1.95 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యం ● 17న తెరవనున్న టెండర్లుగీసుకొండ: జిల్లాలో ఈసారి మత్య్ససంపదకు ‘ఎల్నినో’ దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. గతేడాది వర్షాలు మెండుగా కురవడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు, కుంటల్లోకి సరిగా నీరు చేరలేదు. ఈ పరిస్థితి మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతీఏడాది ప్రభుత్వం ఉచితంగా అందించే చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ప్రహసనంలా సాగుతోంది. సరైన సమయంలో చేపపిల్లలను చెరువులోకి వదలక పోవడంతో అవి సరిగా ఎదగడం లేదని మత్స్య సంఘాల వారు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలాఖరు వరకు చేపపిల్లలను వదిలితే బాగుంటుందని, అలా కాకుండా అక్టోబర్ నెల ముగిసే వరకు చేపపిల్లలను పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ ఈ ఏడాది చెరువుల్లో చేపపిల్లలను పోయడానికి పలు ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్గా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సభ్యులుగా జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), మెంబర్ కన్వీనర్గా జిల్లా మత్స్యశాఖ అధికారి వ్యవహరిస్తారు. ఈ కమిటీ దాఖలైన టెండర్లను పరిశీలించి చేపపిల్లలను సరఫరా చేయడానికి అర్హులను గుర్తిస్తుంది. టెండర్లు వేయడానికి గత మూడేళ్ల నుంచి ముందుకు రావడం లేదు. తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం సకాలంలో చెల్లించక పోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది చేపపిల్లలను పంపిణీ చేసే టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో నవంబర్, డిసెంబర్ నెలలో పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు చేపపిల్లలను సరఫరా చేయడానికి ముందుకు వచ్చారు. టెండరు ఖరారు విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో జిల్లాలోని పెద్ద చెరువులకు చేపపిల్లలను సరఫరా చేస్తామని, చిన్న చెరువులకు అందించలేమని వారు చేతులెత్తారు. ఆ ఏడాది జిల్లాలోని 71 పెద్ద (పెరినియల్) చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. మిగతా 635 చిన్న (సీజనల్) చెరువులకు చేపపిల్లలను ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. చేపపిల్లల సరఫరాలో ఈసారి ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. జిల్లాలో 706 చెరువులు జిల్లాలో 706 చెరువులు ఉండగా వాటిలో సుమారు 71 పెద్ద చెరువులు ఉన్నాయని మత్స్యశాఖ జిల్లా అధికారి పిల్లి శ్రీపతిరావు తెలిపారు. 192 మత్స్య సహకార సంఘాలు ఉండగా వాటిలో 52 మహిళా సంఘాలు, ఒకటి ఎస్సీ, రెండు ఎస్టీ, రెండు మార్కెటింగ్ సంఘాలు ఉన్నాయన్నారు. వీటన్నింటిలో 16,160 మంది సభ్యులు ఉన్నారని, జిల్లాలోని చెరువుల్లో పోయడానికి 1,95,89,000 చేపపిల్లలు అవసరం ఉందన్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 17న టెండర్లను తెరుస్తామన్నారు. -
ఇక తప్పించుకోలేరు!
సాక్షి, వరంగల్: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడంపై వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్, లా అండ్ అర్డర్ పోలీసులకు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (నాట్ గ్రిడ్) సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నారు. వివిధ వనరుల నుంచి లభించే సమాచారాన్ని అనుసంధానం చేసి.. అనుమానితుడి కదలికలు, సంబంధాలు, గత నేరచరిత్ర వంటి అంశాలను విశ్లేషించడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. ఇది కమిషనరేట్లో పూర్తిస్థాయిలో వినియోగించగలిగితే నేరాల పురోగతిలో కీలకమవుతుంది. డీజీపీ సీవీ ఆనంద్ కూడా ఈ సాంకేతికతను వాడాలని వరంగల్ పోలీసులకు సూచించారు. ‘డేటా’తో దర్యాప్తులో వేగం.. గతంలో వివిధ విభాగాల నుంచి సమాచారం సేకరించేందుకు ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు అనుమతించిన పరిధిలో అందుబాటులో ఉన్న డేటాను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా దర్యాప్తులో కీలకమైన లీడ్స్ త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాట్గ్రిడ్ను అధీకృత సంస్థలు, చట్టపరమైన విధానాల ప్రకారం మాత్రమే వినియోగిస్తాయి. మొత్తంగా.. నేరగాడు ఎక్కడున్నాడన్నదే కాదు.. అతడి వెనుక ఎవరున్నారు? ఎక్కడికి వెళ్లాడు? గతంలో ఏం చేశాడు? ఎవరితో సంబంధాలున్నాయి? అనే ప్రశ్నలకు డేటా ఆధారంగా సమాధానాలు వెతికే అవకాశం నాట్గ్రిడ్తో లభిస్తుంది. వరంగల్ సైబర్ పోలీసులకు అందుతున్న శిక్షణతో సాంకేతిక ఆధారాల విశ్లేషణ మరింత బలోపేతమై.. సైబర్, ఆర్థిక, అంతర్రాష్ట్ర నేరాల దర్యాప్తులో నిందితుల గుర్తింపు వేగవంతమయ్యే అవకాశం ఉంది. వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఇప్పటివరకు 2,400 సైబర్ కేసులు నమోదు కాగా.. రూ.6.85 కోట్లు నష్టపోయారు. పదుల సంఖ్యలోనే నిందితులు పట్టుకున్నారు. ఈ డేటాతో మరింత పురోగతి సాధించే అవకాశముంది. ‘నాట్గ్రిడ్తో నేరగాళ్ల జాడ ఆధారాలను అనుసంధానించి నిందితుల గుర్తింపు వరంగల్ సైబర్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కమిషనరేట్లో 2,400 సైబర్ కేసులు.. రూ.6.85 కోట్ల నష్టం ఇక నేరస్తులను పట్టుకోవడంలో పెరగనున్న మరింత వేగంనేరస్తులను ఎలా గుర్తిస్తారంటే.. ఒక ఆధారం.. ఎన్నో లింకులు: నిందితుడికి సంబంధించిన పేరు, గుర్తింపు వివరాలు, ప్రయాణం, ఫోన్ లేదా ఇతర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సంబంధిత రికార్డులను అనుసంధానించి పరిశీలించే అవకాశం ఉంటుంది. కదలికలపై నిఘా: నిందితుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా.. అందుబాటులో ఉన్న ప్రయాణ, ఇతర సంబంధిత డేటా ఆధారాలతో అతడి కదలికలపై ఆధారాలు సేకరించవచ్చు. పాత నేరచరిత్ర గుర్తింపు: ఒక కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తికి గతంలో ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయా? ఏదైనా నేర ముఠాతో సంబంధం ఉందా? వంటి అంశాలను పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. నేర ముఠాల గుట్టురట్టు: ఒకే వ్యక్తి కాకుండా పలువురు కలిసి నేరాలకు పాల్పడుతున్నప్పుడు.. వారి మధ్య ఉన్న సంబంధాలను డేటా విశ్లేషణ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతర్రాష్ట్ర నేరాలకు చెక్: వరంగల్లో నేరం చేసి మరో రాష్ట్రానికి వెళ్లిన నిందితుడి విషయంలో స్థానిక సమాచారం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన సంబంధిత రికార్డులను కూడా పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది.ఆన్లైన్ మోసాల్లో నేరగాళ్లు తరచూ ఇతరుల బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, తప్పుడు గుర్తింపు వివరాలు ఉపయోగిస్తుంటారు. దీంతో అసలు నిందితుడిని చేరుకోవడం పోలీసులకు సవాల్గా మారుతుంది. ఇలాంటి కేసుల్లో వివిధ ఆధారాలను కలిపి చూడడం ద్వారా ఒక నంబర్ నుంచి ఖాతా.. అక్కడి నుంచి వ్యక్తి.. ఆ వ్యక్తి నుంచి నేర ముఠా వరకు దర్యాప్తును విస్తరించేందుకు సాంకేతిక ఆధారాలు తోడ్పడతాయి. -
పోలీసింగ్లో వరంగల్ భేష్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లా పోలీసింగ్ బాగుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం వరంగల్కు వచ్చిన ఆయన వరంగల్ నిట్లో పోలీ సు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయాలి.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. దోపిడీ కేసులు 29కు పెరగగా, సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కు, 2026 జనవరి–జూలైలోనే 119 కేసులుగా నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదు కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన 117 కేసులు నమోదు అయినట్లు డీజీపీకి అధికారులు వివరించారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్ను మరింత విస్తరించి ప్రజల భద్రతను బలోపేతం చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. చోరీలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ శ్వేత వివరించగా.. వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై పీపీటీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) టీ–స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీ ఎన్.శ్వేత కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ పనితీరు, నేరాల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల భద్రత, ఆర్థిక నేరాల ధోరణులు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అధిక లాభాల ఆశతో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇలాంటి వాటికి దూరంగా సైబర్ మోసాలకు తావుండదని చెప్పారు. పిల్లలే టార్గెట్.. గ్రామాలకూ డ్రగ్స్.. డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని డీజీపీ హెచ్చరించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తిస్తున్నామని, అయితే కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసింగ్ మరింత ప్రజా కేంద్రంగా.. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మార్చుతున్నామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, సైబర్ మోసాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడి ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని చెప్పారు. సోషల్ మీడియాకు ప్రజలు బానిసలవుతున్నారని, ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ అన్నారు. బేసిక్ పోలీసింగ్కు ప్రాధాన్యం... సాంకేతికత పోలీసింగ్కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. వరంగల్తో విడదీయరాని అనుబంధం తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ సీవీ ఆనంద్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో నివాసం ఉన్నానన్న ఆయన నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ప్రతీ రోజు ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వెళ్తామా.. లేదా? అన్న ఆందోళనకర పరిస్థితులు అప్పట్లో ఉండేవన్నారు. ప్రస్తుతం మావోయిజం పూర్తిగా అంతరించిపోవడం సంతోషకరమన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగు డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ వరంగల్తో అనుబంధం విడదీయరానిది.. ఐపీఎస్గా ఇక్కడి నుంచే ప్రస్థానం నిట్ మీడియా సమావేశంలో గతాన్ని గుర్తుచేసుకున్న పోలీస్ బాస్పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి : డీజీపీ -
బస్టాండ్కు స్థలం కేటాయించాలి
మంత్రులకు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వినతికమలాపూర్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్కు ప్రభుత్వాస్పత్రి స్థలాన్ని కేటాయించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులతో శనివారం జరిగిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి పాల్గొని మంత్రులకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా కమలాపూర్లోని పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో వెంటనే కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లు ఆన్ చేసి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీరందించాలని కోరారు. నియోజకవర్గంలో ఇసుక లభ్యత ఉన్నప్పటికీ రూ.1,500కు దొరకాల్సిన ఇసుక రూ.7,500 వరకు విక్రయిస్తున్నారని, పెద్దపల్లి, మానకొండూరు నియోజకవర్గాల మాదిరిగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఇసుక ట్రాక్టర్లకు ఆన్లైన్ విధానం లేకుండా తరలింపునకు అనుమతులు కల్పించాలని కోరారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. -
ఆత్మహత్యల నివారణ.. సామాజిక బాధ్యత
● అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్హన్మకొండ: జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు పాల్పడొద్దని, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఫల్యాలను చూసి కుంగిపోకుండా వాటిని అధిగమించి నిలిచి గెలిచినప్పుడే జీవితంలో నిజమైన ఘనత సాధించినట్లవుతుందని చెప్పారు. ఆత్మహత్యల నివారణ కమిటీ, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత 20 ఏళ్లుగా తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడటం గొప్ప విషయమన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తుల పట్ల సమాజం సానుభూతి, మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యుడు రాంపెల్లి లింగమూర్తి, భారతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
ఆషాఢంలో మైదాకు పెట్టుకునేందుకు మహిళల ఆసక్తి
కుల మతాలతో సంబంధం లేకుండా శుభకార్యాల్లో మహిళల చేతికి గోరింటాకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. గోరింటాకు దొరకనప్పుడు మార్కెట్లో దొరికే మె హందీ అయినా పెట్టుకుంటారు. గోరింటాకు చేతికి అందాన్ని వ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆషాఢంలో ముత్తయిదువలు చేతికి గోరింటాకు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్లయిన మహిళలు ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తారు. వారు తమ కుటుంబసభ్యులతో కలిసి చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ వేడుకలను స్థానిక మహిళలు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. కాలనీలు, అపార్ట్మెంట్లలో సైతం ఆషాఢ మాసంలో మహిళలంతా గోరింటాకు సంబరాలు జరుపుకుంటారు. తద్వారా బంధాలు బలపడతాయి. బ్యాక్టీరియా బారిన పడకుండా కాళ్లు, చేతులకు రక్షణ అందం, ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. -
ఆధ్యాత్మికత పరంగా సౌభాగ్యానికి గుర్తు. ఔషధ గుణాల పరంగా ఆరోగ్యకారిణిగా గుర్తింపు. అరచేతిలో పూసే గోరింటతో అందం, ఆరోగ్యం. ఆషాఢంలో వర్ష రుతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలోని మార్పులను శరీరం తట్టుకునేందుకు చేతులు, కాళ్లకు మహిళలు గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఏళ్
వరంగల్లో వేడుకలు.. వరంగల్ కాశిబు గ్గ తిలక్రోడ్డులో శ్రీజగన్మాత మహిళా పరపతి సంఘం సభ్యులు శనివారం గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సేకరించిన గోరింటాకుతో ఒక్క చోట చేరి రోలులో వేసి రుబ్బారు. రుబ్బుతున్న సమయంలో లయబద్ధంగా గౌరమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. వాయినాలు ఇచ్చుకున్నారు. తాంబూలాలు, స్వీట్లు పంచుకున్నారు. సంతోషంతో ఒకరికొకరు చేతులు, కాళ్లకు మైదాకు పెట్టుకున్నారు. ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రతీ సంవత్సరం ఇలాగే సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకుంటామని సంఘం సభ్యులు చెబుతున్నారు. -
పెద్ది పోరాటం ప్రతీ కార్యకర్తకు స్ఫూర్తి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెన్నారావుపేట: తెలంగాణ సాధనలో పెద్ది సుదర్శన్రెడ్డి చేసిన ఉద్యమం బీఆర్ఎస్ ప్రతీ కార్యకర్తకు స్ఫూర్తి కావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇటీవల మృతిచెందగా, మండల కేంద్రంతో పాటు అమీనాబాద్ గ్రామంలో శనివారం సంతాపసభ, మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న, మండల కన్వీనర్ నాయకులు కొమ్ము రమేష్, జక్క అశోక్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాంరెడ్డి, పత్తినాయక్, సొసైటీ మాజీ అధ్యక్షుడు వంశీ, రవి, కుమారస్వామి, కుండె మల్లయ్య, ప్రదీప్ పాల్గొన్నారు. పెద్ది సంస్మరణ సభకు ఏర్పాట్లు నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభను మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి దేవాలయ ప్రాగణంలో ఈనెల 10న నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను అధిక సంఖ్యలో తరలించేలా సమీకరణపై నాయకులు దృష్టి సారించారు. సంస్మరణ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మండలాల వారీగా సమన్వయం చేస్తున్నారు. సభ ప్రాంగణంలో వేదిక, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాల కల్పనపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు సంస్మరణ సభ వివరాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. -
సహజమైన రంగు..
మొక్క నుంచి లభించే సహజ రంగునిచ్చే పదార్థం గోరింట. అలంకరణలో ప్రత్యేకమైంది. భారతీయ సంప్రదాయాల్లో వివాహాలు, పండుగలు, శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఆషాఢమాసంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా గోరింటాకు పెట్టుకునే సనాతన సంప్రదాయం కొనసాగుతోంది. నా చిన్నతనం నుంచి గోరింటాకు పెట్టుకోవడం అలవాటు. ఈ మాసంలో కొందరు మగవారు కూడా గోరింటాకు పెట్టుకుంటారు. – చందనాల జ్యోతి, తిలక్రోడ్డు, వరంగల్ చిట్కాలు పాటిస్తే మరింత ఎరుపు గోరింటాకు ఎర్రగా పండాలంటే పటిక, చింతపండు, పెరుగు, టీ పొడి ఏదో ఒకటి వేసి ముద్దగా రుద్దుకోవాలి. వివాహ సమయంలో పెళ్లి కుమార్తెలకు మెహందీ పెడుతుంటారు. ఈ సమయంలో ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. చేతులు ఎర్రగా పండితే మంచి భర్త దొరుకుతాడనేది ఒక నమ్మకమైతే గోరింటాకులో ఉండే ఔషధ గుణాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. – చందనాల పద్మ, కాశిబుగ్గ, వరంగల్ గోరింటాకు పెట్టుకోవడమంటే ఇష్టం.. గోరింటాకు పెట్టుకోవడమంటే చిన్నతనం నుంచి ఆసక్తి. గోరింటాకు శుభప్రదమైందిగా భావించి ముఖ్యంగా వివాహ వేడుకల్లో భాగంగా గోరింటాకు పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అందంతో పాటు ఆరోగ్యానికి గోరింటాకు పెట్టుకుంటే మంచిదని పోటీ పడి మరీ గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండే వరకు వేచి చూస్తాం. – రామగిరి జ్యోతి, వరంగల్ ప్రకృతి ప్రసాదంగా.. తెలుగు సంస్కృతీసంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రకృతి ఇచ్చిన సంపద గోరింటాకు. ఆధునిక కాలంలోనూ యువతులు గోరింటాకు ఇష్టపడుతున్నారంటే సంప్రదాయమంటే గౌరవం. ఔషధ గుణాలు ఉండడమే కారణం. రసాయనాలు ఉపయోగించే కోన్స్ వాడడం కంటే ప్రకృతి ప్రసాదించిన గోరింటాకు ఉపయోగించుకోవడం శ్రేష్టం. – సంఘ జీవనజ్యోతి, వరంగల్ -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో పోలీసు అధికారుల ఘన స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి, ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
మోతాదు మించితే అనర్థమే!
ఖిలా వరంగల్: పంటలకు ఎంత ఎక్కువ యూరియా వేస్తే అంత అధికంగా దిగుబడులు వస్తాయనే అపోహతో మోతాదుకు మించి రైతులు చల్లేస్తున్నారు. ఈ రకమైన ధోరణి తీవ్ర అనర్థాలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. రైతులు అనుసరిస్తున్న పద్ధతులతో జీవజాలానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఎరువుల కొరత లేదు జిల్లాలో వర్షాలు ఆలస్యంగా కురవడంతో వరి సాగు 50శాతానికి పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. అంచనా ప్రకారం 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 30వేల ఎకరాల వరకు వరినాట్లు వేశారు. గతేడాది ఇదే సమయానికి 90 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. గత వానాకాలం, యాసంగిని దృష్టిలో పెట్టుకుని యూరియా కొరత లేకుండా సరిపడా ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ వానాకాలం యూరియా 41,000 టన్నులు, డీఏపీ 17,500 టన్నులు, ఎస్ఎస్పీ 6,500 టన్నులు, ఎంఓపీ 14,500 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 28,000 టన్నులు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకనుగుణంగా కావాల్సిన ఎరువులను దిగుమతి చేసుకుని గోదాముల్లో నిల్వ చేశారు. జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వలు అధికంగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జరిగే నష్టం ఇలా.. యూరియా అధికంగా వాడటం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు భూములు క్రమంగా ఆమ్ల నేలలుగా మారి భూసారం దెబ్బతింటుంది. మొక్కలు ఏపుగా పెరిగినా ఆకులు లేతగా మారి తెగుళ్లు, పురుగు బెడద అధికమవుతుంది. దీంతో క్రిమిసంహారక మందులకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా కాండం బలహీనపడి కొద్దిపాటి గాలులు, వర్షాలకు పంట నేలవాలుతుంది. ఆకుల అధికంగా పెరిగి పూత, పిందె, గింజ తక్కువై దిగుబడులపై ప్రభావం చూపుతుంది. నేలలో జింక్, ఇనుము, సూక్ష్మ పోషకాల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. అవసరమైతే రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి. దీంతో భూమిలో సహజంగా లభించే పోషకాల స్థాయి తెలుస్తుంది. నేలల రకాలను బట్టి ఎంత మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాషియం వేసుకోవాలో తెలుస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూసారం దెబ్బతిని జీవజాలానికి ముప్పు అందుబాటులో సరిపడా యూరియా నిల్వలు భూసార పరీక్షలు చేయించుకోవాలంటున్న వ్యవసాయాధికారులుభూసారం దెబ్బతింటుందిప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. రైతులు వరిలో యూరియాను విడతల వారీగా విచ్చలవిడిగా చల్లుతున్నారు. దీంతో దీర్ఘకాలికంగా నేలలపై తీవ్ర ప్రభావం పడి భూసారం దెబ్బతినే అవకాశం ఉంది. గతేడాది అధిక మోతాదులో యూరియా వాడడం వల్లనే కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 41వేల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం. – విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
నేడు నల్లబెల్లికి కేసీఆర్ రాక
నర్సంపేట: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్ల బెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే. కిరాణా షాపులో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు నర్సంపేట రూరల్: గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత ఈస్ట్ పౌడర్ ప్యాకెట్లను అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారం మేరకు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఓ కిరాణా షాపులో 38 ప్యాకెట్ల ఈస్ట్ పౌడర్, 40కిలోల చక్కెరను స్వాధీనం చేసుకొని షాపు యాజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రజితరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వర కిరాణం అండ్ జనరల్ స్టోర్స్పై ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు నిర్వహించి నిషేధిత ఈస్ట్ పైడర్ స్వాధీనం చేసుకుని, షాపు యాజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలిహసన్పర్తి: భారత రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థను రక్షించుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ చేపట్టిన ప్రచార యాత్ర శనివారం హసన్పర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కార్ పేద ప్రజల వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రెండు లక్షల కోట్ల అప్పులు చేసి దేశ సంపదను పెట్టుబడిదారీ వర్గానికి దోచి పెట్టాడని ఆరోపించారు. దోపీడీ వర్గానికి వ్యతి రేకంగా యువత కార్మికవర్గం తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని విభజిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ ఈనెల 14వ తేదీ వరకు ప్రచార యాత్రను కొనసాగించాలని చాడా వెంకట్రెడ్డి సూచించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యదర్శి మెట్టు శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, మోతె లింగారెడ్డి, శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మిద్దెల ఎల్లేశ్, తోట భిక్షపతి, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు. ఏఐసీసీ చీఫ్ను కలిసిన డాక్టర్ రామకృష్ణ హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా నికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ హనుమకొండకు చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. రామకృష్ణ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్గా, పార్టీలో సీనియర్గా వరంగల్ నియోజకవర్గం, క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతం కోసం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన అనుభవాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన తాత, తండ్రి సైతం కాంగ్రెస్ పార్టీగా విధేయుడిగా ఉన్న ట్లు తెలిపారు. దశాబ్దానికి పైగా పార్టీ కోసం శ్ర మిస్తున్న తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అ వకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్ చైర్మన్ పదవితోనైనా ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 30 లేఖలు సిఫారసు చేశానని రామకృష్ణ వారికి వినతిపత్రం అందజేశారు. -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో పోలీసు అధికారుల ఘన స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవందనం స్వీకరించి, విధులు, సంక్షేమం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
డయాబెటిస్.. హైపర్టెన్షన్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో డయాబెటిస్, హైపర్టెన్షన్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటితేనే వచ్చే వ్యాధులుగా భావించిన మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైపర్టెన్షన్).. ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయస్సులోనే చాలామందిని చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి, ఊబకాయం, నిద్రలేమి, కుటుంబ సంబంధిత కారణాలు అసంక్రమిక వ్యాధులను వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మధుమేహం కేసులు 1,136, రక్తపోటు కేసులు 1,377 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామం నుంచి నగరం వరకు సర్వే.. ప్రతిఏటా అసంక్రమిత వ్యాధుల నివారణ పేరుతో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారిని గుర్తించి సమీప ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు తగిన వైద్యం అందిస్తున్నారు. రోగులకు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ప్రతినెలా ఆరోగ్య కేంద్రాలకు పిలిపించి వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆహార నియమాలు, వ్యాయామాలపై సూచనలు అందిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయొద్దు.. డయాబెటిస్: తరచూ దాహం వేయడం, ఎక్కువగా మూత్రం రావడం, బరువు తగ్గడం, త్వరగా అలసిపోవడం, చూపు మసకబారడం నిర్లక్ష్యం చేస్తే: మధుమేహం నిశ్శబ్దంగా శరీరంలోని కిడ్నీలు, కళ్లు, గుండె, నరాలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు: తలనొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతిలో బరువుగా అనిపించడం, కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవడం నిర్లక్ష్యం చేస్తే: గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగులకు సరిపడా మందులు ఇస్తున్నాం.. షుగర్, బీపీ రాకముందే జీవనశైలిని మార్చుకోవడం ఉత్తమ ఔషధం. కనీసం సంవత్సరంలో ఒకసారి రక్తంలో చక్కెర, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలు, సరిపడా మందులు ఇస్తోంది. – రాజారెడ్డి, డీఎంహెచ్ఓ, వరంగల్ వరంగల్ జిల్లాలో పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు కేసులు ఆరోగ్య నియమాలు పాటించాలంటున్న వైద్యులు -
15 నుంచి స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: జిల్లాలో ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకున్న కార్డులను శుక్రవారం ఆయన పరిశీలించి, పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 14 మండలాలకు 2,56,838 స్మార్ట్ రేషన్కార్డులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి రేషన్ షాపు పరిధిలో లబ్ధిదారులకు కార్డులు సులభంగా, పారదర్శకంగా అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను సమన్వయం చేసేందుకు ప్రతి మండలానికి నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి మహేందర్, డీటీలు, సిబ్బంది పాల్గొన్నారు. సీఈఓకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రతిపాదనలు జిల్లాలో పోలింగ్ కేంద్రాల మార్పు, సర్దుబాటు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చేందుకు రూపొందించిన రేషనలైజేషన్ ప్రతిపాదనలను ఈనెల 10న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు కారణాలతో 14 పోలింగ్ కేంద్రాలను సమీపంలోని అనువైన భవనాలకు మార్చేందుకు ప్రతిపాదించారు. 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను సమీప కేంద్రాల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.


