breaking news
Warangal District Latest News
-
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ ● హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో మంత్రి సమీక్ష హన్మకొండ: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు తీరు, సంక్షేమ, గురుకుల పాఠశాలల, కళాశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అందుతున్న భోజన, వసతి, జరుగుతున్న లోపాల్ని గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గురుకుల, ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదులు పెట్టె క్రమం తప్పకుండా పరిశీలించాలని, ఫిర్యాదుల బాక్సులో వస్తున్న ఫిర్యాదులు వాటికి గల కారణాలను వెంటనే తెలుసుకొని పరిష్కార మార్గాలను చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాదించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కే.ఆర్.నాగరాజు, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఆయా గురుకులాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
● సెప్టెంబర్ 15 నాటికి గృహ ప్రవేశాలకు సిద్ధమవ్వాలి ● కలెక్టర్ స్నేహ శబరీష్కమలాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాలను, మండలంలోని దేశరాజుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని గృహ నిర్మాణ, ఆర్అండ్బీ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన, దేశరాజుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి గురించి ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 15 వరకు గృహ ప్రవేశాలకు సిద్ధం చేసి ఉంచాలని లబ్ధిదారులు, అధికారులకు సూచించారు. 45 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఇళ్లు రద్దు చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, హౌసింగ్ డీఈ సిద్ధార్థ నాయక్, ఆర్అండ్బీ డీఈ రాజు పాడ్యా, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం
ఐనవోలు: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తల బృందం మండలంలోని పలు గ్రామాల్లో వివిధ పంటలు, కూరగాయల సాగు క్షేత్రాలను శనివారం సందర్శించింది. ఈసందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త ఎ.విజయ్భాస్కర్ మాట్లాడుతూ.. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు వేప నూనె (1,500 పీపీఎం) ఎకరాకు లీటరు చొప్పున, ఎకరాకు 300 గ్రాముల అసిఫేట్ పిచికారీ చేయాలని సూచించారు. మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటల్లో పిచికారీ చేసుకోవాల్సిన మందుల గురించి వివరించారు. వరినాట్లు ఆలస్యంగా జరుగుతున్నందున కలుపు యాజమాన్యంపై జాగ్రత్త వహించాలన్నారు. కూరగాయల పంటలైన టమాట, వంగ తోటల్లో ప్రస్తుతం చేయాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. రైతులు లింగాకర్షణ బుట్టలు పెట్టుకుని రెక్కల పురుగులను అదుపు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ విశ్వతేజ, మండల వ్యవసాయ అధికారి సునీల్కుమార్, ఏఈఓలు అనూష, సువర్ణ, హీనా కౌసర్, ప్రసన్న లక్ష్మి, అఫ్రీన్తో పాటు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
అనుమానం వస్తే తనిఖీ చేస్తున్నాం..
అర్ధరాత్రి యువత బర్త్డేలు చేసుకొని రోడ్లపై అరవడం, డ్యాన్సులు చేయడం చేస్తున్నారు. వీరిని వారిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. బస్టాండ్, చౌరస్తా వంటి ప్రాంతాల్లో మాకు ఏమాత్రం అనుమానం వచ్చినా వారి ఫింగర్ ప్రింట్ తీసుకుని పాత నేరస్తులు అయితే ప్రశ్నించి ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రాత్రి పూట విధులు కొంత కష్టమైనప్పటికీ పోలీస్శాఖలోకి వచ్చినం కాబట్టి సంతోషంగా నిర్వహిస్తున్నాం. – ఎం.వినూష, కానిస్టేబుల్● -
న్యాయం కోసం వివాహిత పోరాటం
● అత్తింటివారు ఇంటిలోకి రానివ్వడం లేదని ఆందోళన నర్సంపేట: న్యాయం కోసం వివాహిత పోరాటం చేస్తున్న సంఘటన చెన్నారావుపేట మండలం గురిజాల గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరి–యుగేంధర్రెడ్డి దంపతుల కూతురు రజితను.. గురిజాల గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి కుమారుడు రవికుమార్కు సుమారు రూ.50 లక్షల వరకట్నం వచ్చి వివాహం జరిపించారు. వీరికి రెండున్నర సంవత్సరాల పాప ఉంది. కొద్ది రోజులుగా గొడవలు జరుగుతుండడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. రజిత–రవికుమార్ కలిసి ఉండాలని పెద్దమనుషులు చెప్పి పంపించారు. మళ్లీ కొద్ది రోజులుగా తన భర్త రవికుమార్ ఆయన సోదరి చెప్పే మాటలు విని ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయింది. కట్నం కింద ఇచ్చిన రూ.50 లక్షలతో తన పేరు మీద ఇల్లు కొనుగోలు చేయాలని అడిగితే రవికుమార్ తన తల్లిదండ్రుల పేరుతో కొనుగోలు చేశాడని తెలిపింది. కూతురు, తల్లితో కలిసి అత్తగారి ఇంటికి శుక్రవారం సాయంత్రం రాగా అత్తమామ తనను ఇంటిలోకి రానివ్వకుండా గేటు వేశారని, శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జామువరకు ఇంటి ఎదుటే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికైనా గ్రామస్తులు, పోలీసులు, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రజిత వేడుకుంటోంది. -
తార స్థాయికి లారీఓనర్స్ అసోసియేషన్ గొడవ
● కొండా, రేవూరి వర్గాలుగా ఏర్పడి ఫైట్గీసుకొండ: గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతంలోని ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్లో వివాదాలు తార స్థాయికి చేరాయి. అసోసియేషన్ ఒకటైనా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేరు చెప్పి ఓ వర్గం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పేరు చెప్పి మరో వర్గం గొడవలకు దిగుతున్నాయి. ఫిరోజ్అలీ, షేక్ అజ్మల్ (రేవూరి వర్గం) కొంత కాలంగా అసోసియేషన్కు సంబంధించి లారీ ఓనర్లు, కార్మికులకు చెందిన రూ.32 లక్షలు కాజేశారని, బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.10 లక్షల లెక్కలు చూపించడం లేదని కొండా వర్గంగా చెప్పుకుంటున్న ఎండీ షకీల్ అహ్మద్, వేముల శ్రీకాంత్, ఇజగిరి శంకర్ ఆరోపిస్తున్నారు. లోడింగ్ ఆపవద్దని చెప్పినా వినకుండా.. కొందరు లారీల లోడింగ్ను అడ్డుకోవడంతో కలెక్టర్ సత్యశారద మూడు రోజుల క్రితం ఇరువర్గాలను పిలిచి లోడింగ్ ఆపవద్దని, ఎవరూ అడ్డుకోవద్దని చెప్పినా వినకుండా అడ్డుకుంటున్నారని రేవూరి వర్గం వారు వాపోతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తమ లారీకి లోడింగ్ లేకపోవడంతో లారీ యజమాని సయ్యద్ ఇస్మాయిల్ .. వైరి వర్గం నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్కూటీపై వెళ్తుండగా కోటగండి వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్ కుమారుడు ఫిరోజ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన.. విషయం తెలుసుకున్న రేవూరి వర్గం లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గాయపడ్డ సయ్యద్ ఇస్మాయిల్ భార్య అబేగా ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ తన భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. వైరల్ అవుతున్న ఆడియో ఈ గొడవ ఇలా జరుగుతుండగా కొండా మురళి అనుచరుడు గోపాల నవీన్రాజు.. రేవూరి వర్గానికి చెందిన ఫిరోజ్ అలీని బెదిరిస్తూ మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతోంది. వెంటనే అసోసియేషన్కు వచ్చే డబ్బులు చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటావని అతడిని బెదిరించినట్లు వాట్సాప్లో ఆడియో చక్కర్లు కొడుతోంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే
● రాష్ట్ర మంత్రులు లక్ష్మణ్, సీతక్క ● జనహిత పాదయాత్రపై సమీక్ష సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, చిత్రంలో మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, యశస్వినిరెడ్డి, ఠాకూర్, ఎమ్మెల్సీ సారయ్య, ఎంపీలు కావ్య, బలరాంనాయక్ తదితరులు ఈ నెల 25, 26 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టనున్న జనహిత పాదయాత్ర విజయవంతానికి శనివారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రులు లక్ష్మణ్, సీతక్క హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వందశాతం విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. – హన్మకొండ చౌరస్తా -
వరంగల్
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025గూడూరు మండల పరిధిలో దట్టమైన అడవిలోని భీముని పాదం జలపాతం ప్రకృతి ప్రేమికును ఆకర్షిస్తోంది. చాలెంజింగ్ విధులు...రాత్రిపూట విధులు నిర్వహించడం మహిళా పోలీసులకు చాలెంజింగ్ మారింది. బ్లూకోల్ట్ సిబ్బందితో సమానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్దేశించిన డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న హాస్టళ్ల పరిసరాలను పరిశీలించడంతోపాటు బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర ఎదురయ్యే ఆకతాయిల గొడవలు మొదలు కొని, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో బ్యాగులు తదితర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించి ఉన్నారో, లేదో తెలుసుకోవడం, రాత్రి పూట నిర్వహించే వ్యాపారాలను బంద్ చేసి ఎక్కడా చిన్న ఘటన జరగకుండా చూసుకోవడం చేస్తున్నారు. దీంతోపాటు ఏదైనా లాఅండ్ఆర్డర్కు సంబంధించి పెద్ద సంఘటన జరిగితే వెంటనే బ్లూకోల్ట్స్ సిబ్బంది సహకారం తీసుకుని పరిష్కరిస్తున్నారు. పోలీస్స్టేషన్కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వర్తిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రి వేళ సైతం విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ క్రైండయల్ 100 కాల్స్ మొదలుకుని కష్టతరమైన ఫిర్యాదుల విచారణకు సైతం మహిళా పోలీసులు సై అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పురుషులతో సమానంగా స్వీకరిస్తూ రంగంలోకి దిగుతున్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా బ్లూ కోల్ట్స్ విధుల్లో పురుషులతో కలిసి సమర్థంగా రాణిస్తున్నారు. రాత్రి పెట్రోలింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. మహిళా నేరస్తులను జైళ్లకు తరలించే క్రమంలో ఎస్కార్ట్గా, నేతల సభలకు షార్ట్ వెపన్లతో హాజరై సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో రూల్కాల్ ఉదయం 9 గంటలకు చేపడుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల వరకు విధులు నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీలో కొనసాగుతున్నారు. రాత్రి డ్యూటీ ఉన్నవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రిసెప్షన్ విధులు నిర్వర్తించే మహిళలు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మరొకరు విధులు చేపడుతున్నారు. వీరికి 24 గంటల పాటు రెస్ట్ దొరుకుతుంది. మహిళా పోలీస్ అధికారులు అత్యంత హుషారుగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకు వేతనంతో పాటు 30 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి తోడు ఉన్నత అధికారుల నుంచి విధులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో ట్రాఫిక్ విధుల్లో మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రైసిటీ పరిధి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒకరు హోంగార్డు విధుల్లో కొనసాగుతున్నారు. పోస్టు సంఖ్య డీసీపీ 01సీఐ 02 ఎస్సై 24 ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లు 245కానిస్టేబుళ్లు 352 హోంగార్డులు 70 -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
ధర్మసాగర్: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. కె పట్టాభి రామారావు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. కె.పట్టాభిరామారావు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రామలింగం, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రావణ స్వాతితో కలిసి మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేస్తే చట్టరీత్య నేరమని, అందుకు సహకరించిన వారు శిక్షార్హులవుతారని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం అర్చక సమాఖ్యతో పాటు పురోహితులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జాగృతి పోలీస్ కళా బృందం వారు నాటక ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సీఐ, ప్రవీణ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సంతోశ్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ హైమావతి, జిల్లా మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ కళ్యాణి, ఎస్ఐ జానీ పాషా, జాగృతి పోలీస్ కళా బృందం, మండల ప్రాజెక్ట్ మేనేజర్, ఏఓ రాజేశ్, సర్వోదయ యూత్ ఆర్గనైజషన్, జెండర్ ఎక్స్పర్ట్ ఇందిర, అంగన్వాడీ టీచర్లు, గ్రామైక్య సంఘం వీఓలు తదితరులు పాల్గొన్నారు. -
నర్సంపేట సబ్జైలర్ సస్పెన్షన్
నర్సంపేట రూరల్: నర్సంపేట సబ్జైలర్ (సూపరింటెండెంట్) లక్ష్మీశృతిని సస్పెండ్ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా జైలర్ పరావస్తు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని మహిళా సబ్జైలులో రిమాండ్ ఖైదీ పెండ్యాల సుచరిత అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా లక్ష్మీశృతి నిర్లక్ష్యం చేసింది. దీంతో సుచరిత మృతి చెందింది. ఆమె మృతికి విధుల్లో నిర్లక్ష్యమే కారణమంటూ ప్రాథమిక విచారణలో తేలడంతో లక్ష్మీశృతిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జైలర్ స్రవంతికి నర్సంపేట ఇన్చార్జ్ సబ్ జైలర్గా బాధ్యతలు అప్పగించారని, ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. ట్రాక్టర్ కిందపడి వృద్ధురాలి మృతినర్సంపేట: ట్రాక్టర్ కింద పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండలం అక్కల్చెడ గ్రామ శివారు కట్టయ్యపల్లెలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కట్టయ్యపల్లెకు చెందిన మంకు శశిరేఖ (60) నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి ఎదుట శనివారం ట్రాక్టర్ సాయంతో మొరం పోయిస్తోంది. అక్కల్చెడ గ్రామానికి చెందిన పడిదం ప్రదీప్ ట్రాక్టర్ను అతి వేగంగా రివర్స్ తీస్తూ వెనుక ఉన్న శశిరేఖను ఢీకొట్టాడు. దీంతో ఇంజన్ వెనుక ఉన్న టైర్ కింద ఆమె పడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు ప్రదీప్రెడ్డి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. వివాహిత అదృశ్యంగీసుకొండ: వివాహిత అదృశ్యమైన ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రెకుంటకు చెందిన మౌనికకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాల గ్రామానికి చెందిన కలకోటి సురేశ్తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేశ్ ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి ఒంగోలులో కిరాయి ఇంటిలో ఉంటున్నాడు. ఇంటి యజమాని వారు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయమని చెప్పడంతో భార్య, పిల్లలను తీసుకుని గొర్రెకుంటలోని మౌనిక తల్లిగారింటికి ఈ నెల 20 వచ్చాడు. ఇల్లు దొరికిన తర్వాత భార్య, పిల్లలను తీసుకుని వెళ్తానని చెప్పి అతడు వెళ్లిపోయాడు. ఈ నెల 21న మధ్నాహ్నం సుమారు 2 గంటల సమయంలో మౌనిక ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. మౌనిక అక్క రేవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. ప్రశాంతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలివర్ధన్నపేట: గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. వర్ధన్నపేటలో శనివారం శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. యువకుడి రిమాండ్నెక్కొండ: నేరారోపణలు ఎదుర్కొన్న మండల కేంద్రానికి చెందిన ఈదునూరి విష్ణువర్ధన్ (బబ్లూ)పై శనివారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. హైదరాబాద్లో గంజాయి రవాణా చేస్తుండగా బబ్లూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. అలాగే, 2024లో ఓ వ్యక్తిని కొట్టిన ఘటనలో అతడిపై కేసు నమోదైంది. ఈ నెల 20న నెక్కొండ తెలంగాణ తల్లి సెంటర్లో అకారణంగా ఓ వ్యక్తిపై గొడవపడి దాడి చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. అంతేకాకుండా మండల కేంద్రానికి వచ్చిపోయే వారిని ఇబ్బందులు పెడుతూ గొడవ పడుతుంటాడని ఆయన చెలిపారు. దీంతో అతడిపై పలు కేసులున్న కారణంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు. -
పాదయాత్రను విజయవంతం చేయాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ ఈ నెల 25న ఇల్లంద మార్కెట్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు చేపట్టిన జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చా రు. పాదయాత్ర ఇన్చార్జ్లు ఎమ్మెల్సీ శంకర్నాయక్, పులి అనిల్, జూలూరి ధనలక్ష్మి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనుబాబు, పల్లె శ్రీనివాస్, మోత్కూరి ధర్మారావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తోందని తెలిపారు. చీకటి ఒప్పందం కుదుర్చుకుని బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. గతంలో లక్ష ఓట్ల మెజారి టీ వచ్చిన వారిని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. నాయకులు కేఆర్ దిలీప్రాజ్, పిన్నింటి అనిల్రావు, తూళ్ల రవి, ఎద్దు సత్యనారాయణ, అబ్బిడి రాజిరెడ్డి పాల్గొన్నారు. -
అనుమానం వస్తే తనిఖీ చేస్తున్నాం..
అర్ధరాత్రి యువత బర్త్డేలు చేసుకుని రోడ్లపై అరుస్తున్నారు. డ్యాన్సులు చేస్తున్నారు. వద్దని వారిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. బస్టాండ్, చౌరస్తా వంటి ప్రాంతాల్లో మాకు ఏమాత్రం అనుమానం వచ్చినా వారి ఫింగర్ ప్రింట్ తీసుకుని పాత నేరస్తులు అయితే ప్రశ్నించి ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రాత్రి పూట విధులు కొంత కష్టమైనప్పటికీ పోలీస్శాఖలోకి వచ్చాం కాబట్టి సంతోషంగా నిర్వహిస్తున్నాం. – ఎం.వినూష, కానిస్టేబుల్ -
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పోలీస్ శాఖలో అందరూ సమానమే అనేలా పురుషులతో సమానంగా మహిళా అధికారులతో విధులు చేయిస్తున్నాం. ఆర్మీలో పురుషులతో సమానంగా అన్ని రకాల విధులు మహిళా అధికారులు చేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఇక్కడ డ్యూటీలు వేస్తున్నాం. ఏ డ్యూటీ వేసినా వారు చక్కగా రాణిస్తున్నారు. గతంలో కూడా అన్ని రకాల డ్యూటీలను మహిళా అధికారులు చేశారు. ప్రస్తుతం మరోసారి వారు అన్ని రకాల విధుల్లో రాణిస్తున్నారు. – సన్ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్, వరంగల్ పోలీస్స్టేషన్కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వహిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రిళ్లు సైతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ క్రైం డయల్ 100 కాల్స్ మొదలుకుని కష్టతరమైన ఫిర్యాదుల విచారణకు సైతం మహిళా పోలీసులు సై అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పురుషులతో సమానంగా స్వీకరిస్తూ రంగంలోకి దిగుతున్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా బ్లూకోల్ట్ విధుల్లో పురుషులతో కలిసి సమర్థంగా రాణిస్తున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ విధుల్లో భాగస్వామ్యమవుతున్నారు. మహిళా నేరస్తులను జైళ్లకు తరలించే క్రమంలో ఎస్కార్ట్గా, నేతల సభలకు షార్ట్ వెపన్లతో హాజరై సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు.ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో..సాధారణంగా పోలీస్ స్టేషన్లలో రూల్కాల్ ఉదయం 9 గంటలకు చేపడుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల వరకు విధులు నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీలో కొనసాగుతున్నారు. రాత్రి డ్యూటీ ఉన్నవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రిసెప్షన్ విధులు నిర్వహించే మహిళలు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మరొకరు విధులు చేపడుతున్నారు. వీరికి 24 గంటల పాటు రెస్ట్ దొరుకుతుంది. మహిళా పోలీస్ అధికారులు అత్యంత హుషారుగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను వేతనంతో పాటు 30 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి తోడు ఉన్నతాధికారుల నుంచి విధులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో ట్రాఫిక్ విధుల్లో మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రైసిటీ పరిధి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు విధుల్లో కొనసాగుతున్నారు. రాత్రిపూట విధులు నిర్వహించడం మహిళా పోలీసులకు చాలెంజింగ్ మారింది. బ్లూకోల్ట్స్ సిబ్బందితో సమానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్దేశించిన డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని హాస్టళ్ల పరిసరాలను పరిశీలించడంతోపాటు బార్అండ్ రెస్టారెంట్ల వద్ద ఎదురయ్యే ఆకతాయిల గొడవలు, అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీ చేయడం, రాత్రి పూట రోడ్ల వెంట నిర్వహించే వ్యాపారాలను బంద్ చేసి ఎక్కడా చిన్న ఘటన జరగకుండా చూస్తున్నారు. లాఅండ్ ఆర్డర్కు సంబంధించి పెద్ద ఘటన జరిగితే వెంటనే బ్లూకోల్ట్ సిబ్బంది సహకారం తీసుకుని పరిష్కరిస్తున్నారు. కూడళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో తనిఖీలు పురుషులతో సమానంగా విధులు వరంగల్ కమిషనరేట్లో తమదైన ముద్రకష్టతరమై నప్పటికీ విధులకు.. -
ఎఫ్ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు
విద్యారణ్యపురి: ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) డీఈఓగా వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా విధులు నిర్వర్తిస్తున్న బి.రంగయ్యనాయుడిని నియమిస్తూ కలెక్టర్ సత్యశారద శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఏడీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. డీఈఓ ఎం.జ్ఞానేశ్వర్ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఈనెల 22న ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. డీఈఓగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు. ఈ నేపథ్యంలో రంగయ్యనాయుడిని ఎఫ్ఏసీ డీఈఓగా కలెక్టర్ నియమించారు. విధుల్లో చేరేందుకు రంగయ్యనాయుడు విముఖత.. ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు రంగయ్యనాయుడు విముఖత చూపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నందున విధుల్లో చేరబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్కు కూడా తెలిపారని సమాచారం. ఈ విషయంపై సాక్షి ఆయనను వివరణ కోరగా తాను డీఈఓగా విధుల్లో చేరబోనని స్పష్టం చేశారు. డీఈఓ కార్యాలయం ఎదుట సంబురాలుడీఈఓ విధుల నుంచి జ్ఞానేశ్వర్ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం హనుమకొండలోని వరంగల్ డీఈఓ కార్యాలయం ఎదుట సంబురాలు చేసుకున్నారు. బాణ సంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్ మాట్లాడుతూ డీఈఓ వైఖరి పై తమ సంఘం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. టీఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెరిపోతు ల వంశీకృష్ణ, బాధ్యులు నాగారం మణితేజ, హనుమకొండ జి ల్లా అధ్యక్షుడు కందుకూరి యువకిశోర్, ప్రధాన కార్యదర్శి రామంచ శ్రీను, కార్యదర్శి కోట నాగరాజు పాల్గొన్నారు. -
ఇన్స్పైర్ నామినేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
విద్యారణ్యపురి: ఇన్స్పైర్ నామినేషన్ల ప్రక్రియ వేగవంతానికి ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి కోరారు. శనివారం హనుమకొండ ప్రశాంత్నగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జిల్లాలోని అన్ని మండలాల ఇన్స్పైర్ ఇన్చార్జ్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెలాఖరు వరకు నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సదస్సులో హనుమకొండ ఎంఈఓ గుగులోతు నెహ్రూనాయక్, రిసోర్స్పర్సన్లు పోతరాజు ఆనందం, దొంతుల శ్రీనివాస్, అమరకొండ సంపత్, ఉపాధ్యాయులకు ఇన్స్పైర్ అవార్డులకు నామినేషన్లు పంపే విధానంపై అవగాహన కల్పించారు. విద్యారణ్యపురి: స్వయం సాధికారత దిశగా పరిశోధన ఫలితాలు ఉండాలని కేయూ కెమిస్ట్రీ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ప్రొఫెసర్ సవితాజ్యోత్స్న అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ ఆలై డ్ సైన్సెస్ రీసెర్చ్’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి, సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి.రమేశ్, సెమినార్ కన్వీనర్ ఎం. అరుణ, కో కన్వీనర్ ప్రశాంతి అధ్యాపకులు ఉదయశ్రీ, బాలరాజు, జ్యోతి, శ్రీనివాస్, వి.శ్రీనివాస్, శాంతికుమార్, రవీందర్, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, సురేశ్బాబు ఉన్నారు. న్యూశాయంపేట: సీపీఐ రాష్ట్ర సమితిలో హనుమకొండ జిల్లాకు సముచిత స్థానం లభించింది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కర్రె భిక్షపతి, నేదునూరి జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జరిగిన పార్టీ 4వ రాష్ట్ర మహాసభల్లో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారితో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఆదరి శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్, మండ సదాలక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితుడిగా తోట భిక్షపతిని ఎన్నుకున్నారు. జిల్లాకు సముచిత స్థానం దక్కడంతో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్టేషనరీ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఔట్ పేషెంట్ (ఓపీ) అందించే పేపర్లు లేకపోవడంతో శనివారం వైద్యులు తెల్లపేపర్పై రాసి ఇస్తున్నారు. దీని వల్ల మెడికల్ లీగల్ కేసులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇన్పేషెంట్ అడ్మిట్ చేసేందుకు కేస్ షీట్లు ఓపీ విభాగంలో అందుబాటులో లేకపోవడంతో వైద్యసిబ్బంది ఎమర్జెన్సీ బ్లాక్కు పరుగులు పెట్టాల్సి వస్తుంది. బడ్జెట్ లేమితో స్టేషనరీ కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించపోవడంతో అరకొర స్టేషనరీ సరఫరా చేస్తున్నాడని, దీనిద్వారా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలువిద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు అందజేయనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా విద్యాశాఖ, భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సంయుక్తంగా హనుమకొండ డైట్ కాలేజీలో ప్రత్యేక అవసరాల పిల్లల క్యాంపు నిర్వహించారు. 14 మండలాలనుంచి 174మంది బాలబాలికలు హాజరయ్యారు. డాక్టర్లు కోమల్పాద్, రాజుహైదర్, ఎన్.దీప్తి, మాధవి, ఫిజియోథెరపిస్ట్ శివకృష్ణ పాల్గొని వారికి ఎలాంటి పరికరాలు అవసరమో నిర్ధారించారు. పిల్లలకు త్వరలోనే పరికరాలు అందజేస్తామని బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీధర్, సరస్వతి, ప్రవీణ్, శ్రీను, రఘుబాబు, తిరుపతి, భవన్, సుమన్, రజిత, యశోద, రజని, రవి తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ.. పంజా
ఎంజీఎం :సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ జ్వరాలు పంజా విసురుతున్నాయి. కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు ప్రారంభం నుంచి నేటి వరకు విషజ్వరాలతో బాధపడుతూ ఔట్ పేషంట్లు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్న క్రమంలో ఇన్పేషంట్గా 1,522 మంది అడ్మిట్ అయ్యారు. ఇందులో 59మంది బాధితులకు డెంగీ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. కాకతీయ మెడికల్ కళాశాల కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్య లోపం హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు డెంగీ బారిన పడుతున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఓ పీజీ వైద్యుడితో పాటు నర్సింగ్ విద్యార్థులు సైతం డెంగీ బారినపడ్డారు. అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన బుచ్చిమల్లు–కవిత దంపతుల కుమార్తె సాత్విక (9) విషజ్వరంతో బాధపడగా ఎంజీఎం ఆస్పత్రికి తీసుకు రాగా డెంగీ బారినపడి ఇటీవల మృతి చెందింది. వైద్య విద్యార్థులకు తప్పని తిప్పలు.. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసేవలు అందించే వైద్య విద్యార్థులు కాకతీయ మెడికల్ కాలేజీలోని హాస్టళ్లలో ఉంటూ చదువుతున్నారు. పది రోజులుగా హాస్టల్స్ పనిచేసే కార్మికులకు వేతనాలు రాకపోవడంతో విధులు బహిష్కరించి వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి చెత్త్తాచెదారం పేరుకుపోయి దోమల ఉధృతి పెరగడంతో వైద్యవిద్యార్థులు సైతం విషజ్వరాల బారిన పడుతున్నారు. అధికారికంగా ఓ పీజీ వైద్యుడికి డెంగీ పాజిటివ్గా నిర్ధారణ కాగా, పదుల సంఖ్యలో వైద్యవిద్యార్థులు విషజ్వరాలబారిన పడి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు.. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో 8 మంది డెంగీబారిన పడి చికిత్స పొందుతున్నారు.వీరితో పాటు ఒకరు మలేరియాతో బాధపడుతుండగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కిక్కిరిసిపోతున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. సీజనల్గా విజృంభించే విషజ్వరాలతో ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కిక్కిరిసిపోతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఎంజీఎంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంలేని వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. డెంగీబారిన కేఎంసీ వైద్యవిద్యార్థులు చికిత్స పొందుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి మృతి ఎంజీఎంలో 20 రోజుల్లో 59 మందికి డెంగీ నిర్ధారణ -
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ధర్మసాగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. మండలంలోని కరుణాపురం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలలో శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైద్య శిబిరంలో 109 మంది విద్యార్థులను పరీక్షించి వారి ఆరోగ్య సమస్యలకు తగిన మందులు అందజేశారు. దాదాపు 67 మందికి ఆర్డీటీ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ మలేరియా నెగిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శృతి, డాక్టర్ రుచిత, డాక్టర్ మహేందర్ రావు, హెల్త్ సూపర్వైజర్లు ప్రసన్న కుమారి, రామ్మోహన్ రావు, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం రజిత, ఆశ వర్కర్లు స్వరూప, రేణుక, రజిత, లక్ష్మి, రాణి, మహేశ్వరి, రాధిక, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య నడికూడ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కంఠాత్మకూరులో ఇంటింటికీ తిరిగి పరిసరాలను పరిశీలించారు. గ్రామస్తులకు డెంగీ నివారణపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉంటే సీజన్ వ్యాధులతో పాటు, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు ఫీల్డ్లో అందుబాటులో ఉంటూ.. ఇంటింటికీ వెళ్లి చికిత్స అందించాలన్నారు. సమయపాలన పాటిస్తూ.. మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధి కోసమే ‘పనుల జాతర’
ఎల్కతుర్తి: వివిధ అభివృద్ధి పనుల్ని పూర్తి చేసేందుకే పనుల జాతర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం మాల్లారంలో రూ.12 లక్షలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వీర్లగడ్డ తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. వీరభద్రస్వామి దేవాలయంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగానే హుస్నాబాద్ నియోజకవర్గంలో సుమారు 46 పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నట్లు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడం తన బాధ్యత అని, అనాడు ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్రెడ్డి అని, ఈనాడు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియకు రైతులు సహకరించాలని కోరారు. వీర్లగడ్డ తండాలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అధికారులు, స్థానికులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. స్థానికులు బస్సు, తాగునీటి సౌకర్యాల గురించి మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ డెరెక్టర్ సురేశ్బాబు, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓ రమేశ్ రాఽథోడ్, పంచాయతీ రాజ్ ఈఈ ఆత్మారాం, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ -
జాతీయ రహదారులకు వరంగల్ మహానగరం అనుసంధానం
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘భారత్ మాల’ప్రాజెక్టు గ్రేటర్ వరంగల్కు వరంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన జాతీయ రహదారులు వరంగల్ నగరాన్ని తాకేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే భువనగిరి – ఆరెపల్లి నేషనల్ హైవే పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. సిద్దిపేట – ఎల్కతుర్తి (765 డీజీ) హైవే రూ.578 కోట్లతో 64 కి.మీ.లు పూర్తి చేశారు. ఆ రోడ్డు సైతం 563 ఎన్హెచ్ నుంచి వరంగల్ ఔటర్ రింగు రోడ్డును తాకేలా డిజైన్ చేశారు. జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (ఎన్హెచ్ 563) నిర్మాణ పనులు సగం వరకు పూర్తయ్యాయి. తాజాగా వరంగల్ – ఖమ్మం నేషనల్ హైవేను సైతం భారత్ మాల కింద ఫోర్లేన్ రోడ్డుగా మార్చనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. వీటికి తోడుగా నాగపూర్– విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే వరంగల్ మీదుగానే వెళ్తుండడంతో గ్రేటర్ వరంగల్ జాతీయ రహదారులకు సెంటర్ పాయింట్ కానుంది. త్వరలోనే ఎయిర్పోర్టు రానుండడం... ఎన్హెచ్ల అనుసంధానంతో రవాణా పరంగా వరంగల్కు ఉపయోగం కలగనుంది. ఔటర్ రింగ్ రోడ్డుతోనూ లింకు.. కరీంనగర్ – వరంగల్ మధ్యన ఈ రహదారి పొడవు 68.34 కిలోమీటర్లు కాగా, రూ.2,164 కోట్లతో ఈ పనులు సాగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ను తాకుతూ వెళ్తున్న మంచిర్యాల–విజయవాడ జాతీయ రహదారికి.. మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 112 కి.మీ.లు, రూ.2,490 కోట్లు కేటాయించారు. మంచిర్యాల నుంచి మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర మీదుగా వెళ్లే రోడ్డు పనులు మొదట భూసేకరణ వల్ల ఆలస్యమైనా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. వరంగల్ – ఖమ్మం మధ్య రహదారి 107 కి.మీ.ల కోసం రూ. 2,249 కోట్లు కేంద్రం కేటాయించగా, 1,410 ఎకరాల భూసేకరణ ప్రకియ జరిగింది. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో ఉండే ఈ రహదారి.. గ్రేటర్ వరంగల్ విలీన ప్రాంతాలతోపాటు ఊరుగొండ, గీసుకొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం తదితర ముఖ్య పట్టణాలను తాకుతుంది. 765 డీజీగా పేరున్న సిద్దిపేట – ఎల్క తుర్తి రోడ్డు పొడవు 64 కి.మీ.లు కాగా.. ఈ రోడ్డు కోసం రూ.578 కోట్లు కేటాయించారు. ఆ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా.. సిద్దిపేట, హుస్నాబాద్, ఎల్కతుర్తి ద్వారా వరంగల్కు చేరుకుంటున్నారు. ఐదేళ్ల కిందట అప్పటి సీఎం కేసీఆర్ సంగెం వద్ద శంకుస్థాపన చేశారు. వరంగల్ నూతన మాస్టర్ప్లాన్లో కొత్త ప్రాజెక్టు రీజినల్ ఔటర్ రింగురోడ్డు నగర శివారు నుంచి వెళ్లే ఐదు జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేసేలా డిజైన్ చేసినా పెండింగ్లో ఉంది. సుమారు 135 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ ఓఆర్ఆర్ కూడా అసంపూర్తిగా ఉంది. తక్షణమే ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్లకు నిధులు విడుదల చేసి పూర్తి చేస్తే.. ఐదు జాతీయ, రాష్ట్ర రహదారులతో గ్రేటర్ వరంగల్కు మహర్దశ పట్టనుంది. నగరాభివృద్ధికి దోహదం నగరం చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల విస్తరణతోపాటు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే నగరాభివృద్ధికి ఎంతగానే తోడ్పడతాయి. భారీ ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాలు నగరంలోకి వెళ్లకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు నగరానికే మణిహారంగా నిలుస్తుంది. – మేరుగు అశోక్, శివనగర్, వరంగల్రవాణా వ్యవస్థ బలోపేతం.. రహదారుల నిర్మాణం వల్ల నగరంలో వాణిజ్య కార్యకలాపాలు అధికంగా పెరుగుతాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో నగరంలో ట్రాఫిక్ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ ఉంది. మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా మామునూరు ఎయిర్పోర్ట్ట్ పూర్తి చేస్తే వాణిజ్యంగా అభివృద్ధి చెందుతుంది. – గడ్డం రవి, వరంగల్ కొత్త పరిశ్రమలకు అవకాశం జాతీయ రహదారుల వల్ల వరంగల్ నగరం వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతుంది. రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం ఉంది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయి. – రామచంద్రారెడ్డి, రైతు, హసన్పర్తి తాజా నిర్ణయంతో ఫోర్ లేన్ రోడ్డుగా వరంగల్–ఖమ్మం హైవే మామునూరు ఎయిర్పోర్ట్కూ కొత్త రోడ్డు స్పీడ్గా మంచిర్యాల – విజయవాడ, వయా వరంగల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో వేగం -
శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంపునకు (శనివారం) నుంచి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) (ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు)ను అమలు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు అధికారులు సెంటర్ బోర్డ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక సహకారంతో టీజీబీఐఈ – ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతీరోజు రెండు సార్లు (ఉదయం, మధ్యాహ్న భోజనం తర్వాత) హాజరు తీసుకుంటారు. ఈమేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. కళాశాలకు ఏ విద్యార్థి అయినా హాజరుకాకుంటే అతడి తల్లిదండ్రుల ఫోన్కు సందేశం వెళ్తుంది. ఈ హాజరును ఆ కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు కూడా పర్యవేక్షిస్తారు. ఎఫ్ఆర్ఎస్ అమలుపై గత గురువారం ఆయా జిల్లాల్లో డీఐఈఓలు.. కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహించి హాజరు అమలు విధానాన్ని తెలియజేశారు. హనుమకొండ, వరంగల్లో డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్సుమన్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, విద్యార్థుల వివరాలురోజుకు రెండుసార్లు హాజరు నమోదు ● గైర్హాజరైతే తల్లిదండ్రుల ఫోన్లకు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు2,9002,013● అధ్యాపకులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీజీబీఐ ఈ –ఎఫ్ఆర్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో విద్యార్థుల ఫొటోతో సహా వివరాలు నమోదు చేయాలి. ● తరగతి ప్రారంభమయ్యాక స్మార్ట్ ఫోన్లో ఆ యాప్ ద్వారా కెమెరా ఓపెన్ చేసి వీడియా మాదిరిగా కూర్చున్న విద్యార్థులను తీసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఫొటో క్యాప్చర్ అయి హాజరు నమోదవుతుంది. ● ఈ విధానంతో 15నుంచి 20 సెకన్లలోనే 80మంది విద్యార్థుల వరకు హాజరు నమోదు చేయవచ్చని చెబుతున్నారు. ● ముఖ హాజరుకు శుక్రవారంనుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇంకా చేపట్టనివారు ఉంటే ఈనెల 23న చేపడతారు. ● కళాశాలల సమయం ఉదయం 9:30 గంటల నుంచి ప్రతీ తరగతి గదిలోని తొలి పీరియడ్ తీసుకునే అధ్యాపకుడు విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేస్తారు. ● మళ్లీ మధ్యాహ్నం లంచ్ తర్వాత 2గంటలకు మరోసారి నమోదు చేస్తారు. ప్రతీ జిల్లాకు ఇద్దరికి ఏఐ చాంపియన్లుగా శిక్షణ ఇంటర్ విద్యలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర బోర్డు నిర్ణయించింది. విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాల అ భివృద్ధి, సరికొత్త సాంకేతికత పరిచయం కోసం ఏఐని విని యోగించుకోనున్నారు. దీనిపై పట్టున్న సిబ్బందిని గుర్తించి ఏఐ చాంపియన్లుగా ఎంపిక చేసింది. ప్రతీ జిల్లాలోని అకడమిక్ మానిటరింగ్ సెల్లోని ఇద్దరు లెక్చరర్లు, ఒక లైబ్రేరియన్, ప్రతీ జిల్లాకు ఏఐ చాంపియన్లుగా ఎంపికై న ఒక లెక్చరర్, నాన్టీచింగ్ సిబ్బందికి శుక్రవారం హైదరాబాద్లో సంబంధిత ఉన్నతాధికారులు ఏఐ ఎఫ్ఆర్ఎస్ అమలు, వినియోగంపై శిక్షణ ఇచ్చారు. 1,2721,000విద్యార్థులకు రోజుకు రెండు సార్లు హాజరు మానుకోట1,3501,200734821520535యాప్ డౌన్లోడ్ విధానం తన మొబైల్ ద్వారా చూపిస్తున్న వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ జనగామ1,050950ఇంటర్లో హాజరుశాతాన్ని పెంచేందుకే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంటోంది. ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థుల్లో మధ్యాహ్నం భోజనం కోసం కొందరు ఇంటికి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. తిరిగి రావడం లేదు. ఇంటివద్ద కాలేజీకి అని చెప్పి డుమ్మా కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత తక్కువగా రావడానికి కూడా విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకాకపోవడమే అనేది ఇంటర్బోర్డు అధి కారులు భావిస్తున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారంగానే ఎఫ్ఆర్ఎస్ను అమలు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. నేటినుంచే అమలు.. రిజిస్ట్రేషన్ షురూ -
కుష్టు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
ఎంజీఎం: కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కుష్టు నివారణ బృంద సభ్యులు అన్నారు. శుక్రవారం దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బృందం సందర్శించింది. అక్కడి వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిపోర్ట్స్, రికార్డ్ని పరిశీలించి కుష్టు వ్యాధి సర్వేపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర బృంద సభ్యులు డీపీఎంఓ వెంకటేశ్వర చారి, సకలరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏపీఎంఓ అరుణ సుందర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, జిల్లా లెప్రసీ అధికారి మోహన్సింగ్, డీపీఎంఓ అనుపమ, వెంకన్న, స్థానిక మెడికల్ ఆఫీసర్ భరత్ కుమార్, నోడల్ పర్సన్లు జన్ను కొర్నెల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈవిద్యాసంవత్సరం 2025–26లో ప్రవేశాలకు టీజీఐసెట్ అభ్యర్థులకు శుక్రవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పారంభమైంది. ఈమేరకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో, హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హెల్ప్లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఆర్ట్స్ కాలేజీలో ధ్రువపత్రాలను ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి అందజేశారు. కేడీసీలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్ అందజేశారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ప్రేమకళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ, పీడీ, స్కూల్ అసిస్టెంట్, హిందీ పండిట్, టీపీ–2 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30లోపు హనుమకొండ అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. విద్యారణ్యపురి: జిల్లాలోని ఇన్స్పైర్ మనక్ 2025–26పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ఈనెల 23న హనుమకొండలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సదస్సు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూళ్లలోని ఇన్స్పైర్ ఇన్చార్జ్లు విద్యార్థులతో నామినేషన్లు వేయించేలా శిక్షణ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈనెల 23న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే సమావేశానికి భీమదేవరపల్లి, దామెర, హనుమకొండ, హసన్పర్తి, కాజీపేట, ఐనవోలు మండలాల ఉపాధ్యాయులు పాల్గొనాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే సమావేశానికి ఆత్మకూరు, ధర్మసాగర్, ఎల్క తుర్తి, కమలాపూర్, నడికూడ, పరకాల, శాయంపేట, వేలేరు మండలాల ఉపాధ్యాయులు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్లో సంప్రదించాలని డీఈఓ వాసంతి కోరారు. -
గత పాలకుల దోపిడీతో దిగజారిన ఆర్థిక స్థితి
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపరకాల: గత పాలకుల దోపిడీతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారి ఆర్థిక పరిస్థితి దిగజారిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. పరకాల మండలం నాగారం, పోచారం గ్రామాల్లో అంగన్వాడీ భవనాలకు, అలియాబాద్ గ్రామంలో కొత్త గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇచ్చిన మాటలకు కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసుకుంటూ అంచలవారీగా ప్రాధాన్య క్రమంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఎ పీడీ శ్రీను, పరకాల ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ధర్మకర్తల ప్రమాణ స్వీకారం
కమ్మగోని ప్రభాకర్గౌడ్(కొత్తపల్లి), కూస చిరంజీవి (పెరుమాండ్ల గూడెం), గడ్డం రేణుక(ఐనవోలు), బరిగెల ఆనందం (ఐనవోలు), నూనావత్ కీమా (డీసీ తండా), గుంటి కుమారస్వామి (ఇల్లంద), బందెల వెంకన్న (దౌలత్నగర్), బోయిని మహేందర్ (వెంకటాపురం), బాలబోయిన రాజయ్య (గర్మిళ్లపెల్లి), మందల నర్సింహారెడ్డి (కొండపర్తి), మడూరి రాజు (పంథిని), ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ పదవీ, గోప్యత ప్రమాణ స్వీకారం చేశారు. ధరం పూర్ణచందర్ (పర్వతగిరి), దాత సిరిమిల్ల వరలక్ష్మి (రంగారెడ్డి జిల్లా), పోలెపల్లి బుచ్చిరెడ్డి (నర్సింహులగూడెం) ప్రమాణ స్వీకారం చేయలేదు. వీరు 30 రోజుల్లోపు ప్రమాణ స్వీకారం చేయవచ్చని ఎండోమెంట్ అధికారులు తెలిపారు. ఐనవోలు: సుప్రసిద్ధ ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం ధర్మకర్తల పదవీ, గోప్యత ప్రమాణ స్వీకారం జరిగింది. డివిజన్ ఇన్స్పెర్ అనిల్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ క్యాబ్ అధ్యక్షుడు మార్నేని రవీందర్రావు హాజరయ్యారు. ముందుగా.. ధర్మకర్తలతో పదవీ, గోప్యత ప్రమాణ స్వీకారం చేయించారు. 15 మంది ధర్మకర్తలకుగాను 12 మంది మాత్రమే హాజరయ్యారు. 12 మందిలో చైర్మన్గా కమ్మగోని ప్రభాకర్ను సభ్యుడు మడూరి రాజు ప్రతిపాదించగా.. బందెల వెంకన్న బలపర్చారు. మిగిలిన సభ్యులు ఆమోదించారు. దీంతో కమ్మగోని ప్రభాకర్ను చైర్మన్గా నియమించారు. నేటి నుంచి సంవత్సర కాలం పాటు వీరు పదవిలో కొనసాగనున్నారు. ఆలయ ఈఓ కందుల సుధాకర్.. కమిటీ సభ్యులను, చైర్మన్ను పూలమాలలు వేసి కండువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ క్యాబ్ చైర్మన్ నాయకులకు అభినందనలు తెలిపి సత్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి సరైన ప్రణాళికలు వేసుకుని నూతన కమిటీతో అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు మండలంలోని ఉడుతగూడెంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలనికి శంశుస్థాపన చేశారు. చైర్మన్గా కమ్మగోని ప్రభాకర్ 15 మంది సభ్యులకు 12 మంది హాజరు -
మాజీ కౌన్సిలర్ సహా కుమారుడిపై దాడి
● భార్య అడ్డుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు ● పోలీసులను ఆశ్రయించిన ఇరువర్గాలు పరకాల: పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అల్లె దశరథంతోపాటు అతడి కుమారుడు ప్రశాంత్పై నడిరోడ్డుపై దాడి చేశారు. ఈ ఘటన పరకాలలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం ఈ వీడియో వైరలైంది. రెండు నెలల్లో రెండుసార్లు అల్లె దశరథంపై దాడి జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. పాత గొడవల కారణంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. దశరథం ఇటీవల అంబాల రోడ్డులో బైక్పై వెళ్తుండగా కొందరు వ్యక్తుల చేతుల్లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే బుధవారం వెల్లంపల్లి రోడ్డులోని బంధువుల శుభకార్యం వద్ద జరిగిన వివాదం చివరకు మాజీ కౌన్సిలర్ అల్లె దశరథంతోపాటు అతడి కుమారుడు దాడికి దారితీసినట్లు సమాచారం. తండ్రీకొడుకులిద్దరిని నలుగురు వ్యక్తులు నడిరోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దశరథం భార్య రజిత ఒకవైపు భర్తను.. మరోవైపు రోడ్డుపై పడిపోయిన కొడుకును కొట్టొదంటూ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనపై ఇరువర్గాలు స్థానిక పోలీసులను ఫిర్యాదు చేసుకోగా కేసు నమోదు చేశారు. ఓ ఫంక్షన్ వద్ద జరిగిన వివాదం దాడికి దారితీసినట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. ఆయుధాలతో దాడులు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. -
పదోన్నతులతోపాటు బాధ్యతలూ పెరుగుతాయి
వరంగల్ క్రైం : ఉద్యోగులకు పదోన్నతులతోపాటు బాధ్యతలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సుధాకర్, సంపత్ కుమార్, రవీందర్, కిరణ్ కుమార్, శ్రీనివాస్, జె. శ్రీనివాస్, శ్రీనివాస్రావు, రమేశ్, ప్రభాకర్, కిషన్ రావు, రవీందర్, ప్రభాకర్, కీర్తి నాగరాజు, నరేందర్, వెంకటస్వామి గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై సీపీ స్వయంగా పట్టీలను అలంకరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులపై భరోసా, నమ్మకాన్ని కలిగించాలన్నారు. నిరుపేదలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని సూచించారు. హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరపనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. హన్మకొండ చౌరస్తా: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గురువారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ను త్వరితగతిన ప్రారంభించాలని మంత్రి నడ్డాకు వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు. హన్మకొండ : మెరుగైన సేవల కోసం ప్రయాణికులనుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (శుక్రవారం) ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తరిగొప్పుల, పాలకుర్తి రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రామన్నపేట: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీఐసెట్ –2025 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్, వరంగల్ టీజీఐసెట్ హెల్ప్లైన్ క్యాంప్ ఆఫీసర్ డా.బైరి ప్రభాకర్ తెలిపారు. ఈనెల 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 25 నుంచి 30వ తేదీ వరకు ఆప్షన్ ఎంట్రీ, 30న ఆప్షన్ ఫ్రీజింగ్, సెప్టెంబర్ 2 తేదీ లోపు సీట్ల ప్రొవిజనల్ అలాట్మెంట్, 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ట్యాషన్ ఫీజు చెల్లింపు, స్వీయ రిపోర్టింగ్ ఉంటుందని వివరించారు. విద్యార్థులు తమ డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకొని, సమయపాలన పాటించి కౌన్సెలింగ్లో పాల్గొనాలని సూచించారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ముల్కనూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించారు. విద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. కూరల్లో నీళ్లు ఎక్కువగా ఉన్నాయని, ఫుడ్ పాయిజన్ కాకుండా నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఓ జ్యోతికి సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఔషధ నిల్వలు, ఫీవర్ సర్వే, సుఖ ప్రసవాలు, తదితర అంశాల నమోదు తీరును డాక్టర్ ప్రదీప్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఉనికచర్లలో ఇసుక బజార్ ఏర్పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల కోసం మూడు రోజుల క్రితం ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామంలో ఇసుక బజార్ను ప్రారంభించినట్లు వెంకట్రెడ్డి తెలిపారు. ఈ ఇసుక బజార్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టన్నుకు ఇసుక రూ.వెయ్యి ఉంటుందని, రవాణా ఖర్చులు అదనంగా చెల్లించాలన్నారు. త్వరలో భూ భారతి దరఖాస్తులను పరిశీలిస్తామని, వారసత్వం, మ్యుటేషన్, మిస్సింగ్, సర్వేనంబర్ల దరఖాస్తులను దశలవారీగా పరిశీలించి సర్వే అనంతరం పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రాజేశ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, విజయ్భాస్కర్ తదితరులు ఉన్నారు.యోగా ఇన్స్పెక్టర్కు మెమో జారీ చేయండి విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల యోగా ఇన్స్పెక్టర్కు మెమో జారీ చేయాలని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి.. ఆ వైద్యశాల డాక్టర్ సరితకు ఆదేశాలు జారీ చేశారు. హోమియోపతి వైద్యశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో యోగా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సురేశ్ కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరు అవుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో వైద్యాధికారి డాక్టర్ సరితను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతడి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, మెమో జారీ చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలు శారీరక రుగ్మతల బారిన పడకుండా హోమియో వైద్యశాలల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి యోగా శిక్షణ అందిస్తున్నామన్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. -
డీటీఓ కార్యాలయాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రవాణాశాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. అన్ని పనులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు రూ.లక్షలకు పడగలెత్తుతుండగా.. అధికారుల ఆదాయం, అక్రమాస్తులకు హద్దూపద్దు లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో వెల్లడవుతున్న ఆస్తుల వివరాలే ఇందుకు సాక్ష్యం. మే 7న ఏకంగా వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ.. ఆ తర్వాత ఈ జిల్లాలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగిత్యాల డీటీఓ భద్రునాయక్ రూ.22 వేలు తీసుకుంటుండగా ఆగస్టు 6న పట్టుకున్నారు. తాజాగా వరంగల్, హనుమకొండలో ఎంవీఐగా పనిచేసిన జి.వివేకానంద రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం రవాణాశాఖలో కలకలం రేపుతోంది. నెల రోజుల కిందట వివిధ పనుల కోసం ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. కొందరు సీనియర్ ఎంవీఐల ఆస్తులపై ఆరా తీస్తుండడం హాట్టాపిక్గా మారింది. అంతులేని ఆదాయం.. పోస్టింగ్ కోసం పోటాపోటీ రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడి పోస్టింగ్లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు ఇప్పుడు ఇన్చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్లు తిరకాసు చేసి జూనియర్లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండడం ఇష్టం లేక అతనే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యాచ్కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మామూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే ఇన్చార్జ్ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది. వరంగల్లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికారి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్ఛార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధికారుల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ పో స్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. అక్రమ సంపాదనే లక్ష్యంగా కొత్త పద్ధతులు పెడుతూ అర్జాదారులనుంచి అడ్డగోలుగా వసూలు చేస్తూ చివరికి ఏసీబీకి చిక్కుతున్నారంటూ ఆ శాఖ ఉ ద్యోగులే చర్చించుకోవడం గమనార్హం. రవాణా శాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవి నీతి నిరోధకశాఖ అధికారులు కూడా ద్వంద్వ వైఖ రితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. వ్యక్తిగత పరి చయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు, అధికారులపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమకొండ డీటీఓలో రెండింతలు పెరిగిన వసూళ్లు.. హనుమకొండ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వివిధ పనుల కోసం లంచాలు వసూలు చేస్తున్నారని, ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం వచ్చిన ఓ సీనియర్ ఎంవీఐ.. ఈ కార్యాలయానికి లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ కోసం వచ్చే వాళ్లనుంచి చేసే వసూళ్లు రెండింతలు చేశారన్న ఫిర్యాదులు కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లాయి. లెర్నింగ్ లైసెన్స్కు ఏడాది కిందట రూ.500 వరకు తీసుకుంటే ప్రస్తుతం రూ.1,000కి పెంచారని, రూ.700–800లు ఉన్న లైసెన్స్ మామూళ్లు రూ.2,000లకు పెరిగిందని బాధితులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసుకొని వచ్చిన అర్జీదారుడికి అసలు కంటే కొసరే ఎక్కువగా భారమవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అసలు సొమ్మును కట్టినా తనిఖీ అధికారులు కొసరుగా వేరే రేట్లను ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో ఒక్కో వాహనానికి రూ.2200 ఉంటే దానిని ఏకంగా రూ.5500 పెంచినట్లు ఆరోపణలున్నాయి. ఇలాగే ఇటీవల జూన్ మాసంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ధరలు ఒక్కోబస్సుకు రూ.4,500ల వరకు వసూలు చేయడం వివాదాస్పదమైంది. కాగా ముఖ్యంగా వాహన ఫిట్నెస్లు, లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సుల పైళ్లపైనే కోడ్లు ఉండడం బహిరంగ రహస్యం. కోడ్లేని ఫైళ్లను.. చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపుతూ కొర్రీలు పెడుతూ ఫిట్నెస్ అపడం.. వాహనదారుడు దానికి వేరే రేటు ఇచ్చుకుంటే పూర్తి చేయడం ద్వారా రూ.వేలు చేతులు మారుతున్నాయి. ఏసీబీ దాడులకు వెరవని రవాణాశాఖ అధికారులు వసూళ్లకు ‘ప్రైవేట్’ వ్యక్తులు, ఏజెంట్లే మధ్యవర్తులు కాసుల కక్కుర్తితో అడ్డంగా దొరికిపోతున్న అధికారులు ఆదాయాన్ని మించిన ఆస్తులు.. ఆ ఫిర్యాదులపైనే పలువురిపై దాడులు ప్రతి పనికీ రేటు.. ఇటీవలే రెండింతలు హనుమకొండ డీటీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు -
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
● రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖహన్మకొండ: అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం హనుమకొండ రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి రెండు జిల్లాల్లో వివిధ అభివృద్ధి పనులు, వాటి పురోగతి, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పరిస్థితులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. మామునూరు ఎయిర్ పోర్ట్ కల త్వరలో సాకారం కానుందని, ఇందుకు అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ.4,170 కోట్లతో వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామని, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సి ఉందన్నారు. భద్రకాళి ఆలయ మాడ వీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణలను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికను రూపొందించుకొని పనిచేయాలని ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వరంగల్ బస్ స్టేషన్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, ఇందిరమ్మ ఇళ్ల, డబుల్ బెడ్రూంలు, ఇతర అభివృద్ధి పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, సాగునీటి పారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ రాంప్రసాద్, ‘కుడా’ పీఓ అజిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంనుంచి పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విష యం తెలిసిందే. ఇప్పటికే పలు పాఠశాలల్లో చిన్నారులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్ష ద్వారా పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. ఒక్కో స్కూల్కు రూ.1.70లక్షల నిధులను కలెక్టర్లకు జమ చేశారు. హనుమకొండ జిల్లాలో 45 పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు మంజూరై విడుదలయ్యాయి. అందులో 25 స్కూళ్లకు రూ.1.70లక్షల చొప్పున, మరో 20 స్కూళ్లకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. రంగులు, విద్యార్థులకు ఆట వస్తువులు ఆయా పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతి గదికి రూ.50వేలు వెచ్చించి రంగులు వేయించాల్సి ంటుంది. ఆట వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక్కో విద్యార్థికి రూ.1,000 కేటాయించి బ్యాగ్, షూస్, బెల్ట్, టై తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జిల్లా కలెక్టర్లకు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్.. డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు ప్రతీ పూర్వ ప్రాథమిక తరగతి విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయా, ఒక ఇన్స్ట్రక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. జిల్లా పాఠశాలలు నిధులు హనుమకొండ 65 52.50 వరంగల్ 32 54.40 ములుగు 08 13.60 మహబూబాబాద్ 22 37.40 భూపాలపల్లి 54 78.60 జనగామ 15 21.90 కొన్నింటికి రూ.1.70లక్షలు, మరికొన్నింటికి రూ.50వేల చొప్పున విడుదల తరగతి గదికి కలర్, ఆటవస్తువులకు, విద్యార్థులకు బ్యాగ్, షూస్, టై, బెల్టులు త్వరలోనే ఆయాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకం -
అభివృద్ధి పనులు మరింత పారదర్శకం
హన్మకొండ అర్బన్: గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ .. అధికారులను అదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పనుల జాతర – 2025 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఆగస్టు 22న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ.15.61 కోట్లతో 2,802 పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు భాగస్వాములు కావాలని తెలిపారు. ఆగస్టు 22న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో గత సంవత్సరం చేపట్టి పూర్తయిన పనులను ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రారంభోత్సవాలు, కొత్తగా చేపట్టిన పనుల భూమి పూజ చేసి మొదలుపెట్టించాలని ఆదేశించారు. వనమహోత్సవం నిర్వహించి పండ్లు, నీడ నిచ్చే మొక్కలను నాటించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ స్నేహ శబరీష్ -
నేడు హనుమకొండ కలెక్టరేట్లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.సిమెంట్ పోల్ ఏర్పాటుదుగ్గొండి: ‘ఇనుప స్తంభానికి విద్యుత్’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన వార్తకు విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. మండలంలోని తిమ్మంపేట గ్రామంలో నారాయణతండా రోడ్డుకు సమీపంలోని వ్యవసాయ బావుల వద్ద ప్రమాదకరంగా ఉన్న ఇనుప స్తంభం తొలగించి గురువారం సిమెంట్ స్తంభం ఏర్పాటు చేశారు. వైర్లు సరిచేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్కో ఏఈ ప్రత్యూష, లైన్ ఇన్స్పెక్టర్ అజీంపాషా, సిబ్బంది పాల్గొన్నారు.రేకులతండాలో తాగునీటికి కటకటనెక్కొండ: మండలంలోని పెద్దకొర్పోలు గ్రామ శివారు రేకులతండాలో తాగు నీటి కటకట ఏర్పడింది. తండాలో తీజ్ ఉత్సవాల వేళ తాగు నీటి సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈసందర్భంగా తండావాసులు మాట్లాడుతూ.. గత ఆరు నెలల నుంచి మిషన్ భగీరథ నీరు రావట్లేదని, 15 రోజుల క్రితం నల్లాల బావి మోటారు కాలిపోయిందన్నారు. తీజ్ పండుగ వేళ రోడ్డెక్కి నిరసన తెలపాల్సి వస్తోందన్నారు. ఈవిషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేశ్ను వివరణ కోరగా.. పొంతన లేని సమాధానాలతో దాటవేశారు.అతివల అక్షరాస్యతకు ‘ఉల్లాస్’నెక్కొండ: గ్రామీణ ప్రాంతాల్లో చదవడం, రాయడం రాని వృద్ధులు, మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) అనే పథకానికి శ్రీకారం చుట్టాయని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్తేజ అన్నారు. స్థానిక హైస్కూల్లో ఎంఈఓ రత్నమాల అధ్యక్షతన ఉల్లాస్పై మహిళా సంఘాల వీఓలకు గురువారం శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ రంగారావు, ఏపీ ఓ కిరణ్, మండల రిసోర్స్పర్సన్స్ ప్రతాప్, రా మ్మోహన్, వీఓఏలు, ఉపాధ్యాయులున్నారు.గుణాత్మక విద్యనభ్యసిస్తూ ఎదగాలిడీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ఖిలా వరంగల్: దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకోవడంతోపాటు గుణాత్మక విద్యనభ్యసిస్తూ ఎదగాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ దివ్యాంగ విద్యార్థులకు సూచించారు. గురువారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (ఎలిమ్కో) వారి సౌజన్యంతో మానసిక శారీరక, ఆటిజం, బహుళ వైకల్యం, కృత్రిమ అవయవాల వినియోగం, ఉపయోగాలపై దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, డాక్టర్ కోమల్పహడ్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ శివమ్ శుక్ల, మెడికల్ ఆఫీసర్ రమ్య, ఫిజియో థెరఫిస్ట్ స్వాతి, ఐఈఆర్పీ నరసింహస్వామి, సంజీవ్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు. -
‘డబుల్’ డిమాండ్!
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు ఈ ఏడాది ఆఖరులోగా మొదలు పెట్టాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అందుకు అవసరమయ్యే భూమిని సేకరించి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 696 ఎకరాల భూమి ఉంది. రన్వే విస్తరణకు అవసరమయ్యే 253 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.205 కోట్లు కేటాయించింది. పరిపాలనాపరమైన అనుమతులివ్వడంతో కన్సెంట్ ఇచ్చిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఇప్పటి వరకు 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34,86,05,298 జమ చేశారు. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు చెల్లిస్తుండడంతో చాలా మంది రైతులు ఇప్పటికే కన్సెంట్ ఇచ్చారు. రెట్టింపు కావాలని డిమాండ్ వ్యవసాయేతర భూముల (ఓపెన్ ప్లాట్లు)కు చదరపు గజానికి రూ.4,887లు ఇస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ పలుదఫాలుగా సమావేశమై నిర్ణయించింది. అందుకు రెట్టింపు కావాలంటూ చాలా మంది భూనిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వ్యవసాయేతర భూముల యజమానులతో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. చివరిగా మరో చదరపు గజానికి రూ.500 నుంచి రూ.600ల వరకు పెంచే వీలుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా భూ యజమానులు పరిహారం తీసుకోకపోతే ఆ డబ్బును కోర్టులో డిపాజిట్ చేసి చట్ట ప్రకారం భూమి సేకరించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రూ.12 వేలకు గజం ఇస్తా..నేను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నా. నెక్కొండ ప్రధాన రహదారిపై గుంటూరుపల్లిలో 968 గజాల ఇంటి స్థలం ఉంది. ఈస్థలం మామునూరు ఎయిర్పోర్ట్ రన్వే కింద పోతోంది. బహిరంగ మార్కెట్ ప్రకారం భూ పరిహారం చెల్లించాలి. నాకు 968 గజాల స్థలం ఉండగా.. ప్రభుత్వం రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు గజం ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. మార్కెట్ ధర కాకుండా గజం రూ.12 వేలు పరిహారం ఇస్తే భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. – ఎం.రాంబాబు, గుంటూరుపల్లి విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో 240 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు 13 ఎకరాల (61,134.5 చదరపు గజాల) వ్యవసాయేతర భూమి సేకరించాల్సి ఉంది. సాగుకు సంబంధించిన 240 ఎకరాలకు భూపరిహారం కింద రూ.288 కోట్లు అవుతున్నాయి. 61,134.5 చదరపు గజాలకు రూ.29,87,61,858 భూనిర్వాసితులకు చెల్లించాలి. మొత్తంగా రూ.317 కోట్లు అవసరం అవుతుండడంతో మరోదఫా ప్రభుత్వం రూ.112 కోట్లు నిధులు కేటాయించాల్సిన అవసరం కనబడుతోంది. వ్యవసాయేతర భూముల రైతులకు చదరపు గజానికి మరో రూ.600లు పెంచినా రూ.ముడు నుంచి రూ.నాలుగు కోట్లు అదనంగా అవసరమవుతాయి. ఈ లెక్కన రూ.320 కోట్లకుపైగా అవసరం కానుంది.వ్యవసాయ భూముల రైతుల ఖాతాల్లో జమవుతున్న నగదు రేటు పెంచాలంటున్న వ్యవసాయేతర భూ యజమానులు తుది సమావేశం నిర్వహించే యోచనలో అధికారులు -
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గౌతంరెడ్డినల్లబెల్లి: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు కృషి చేయాలని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గౌతంరెడ్డి అన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మామిండ్లవీరయ్యపల్లిలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. హాజరైన గౌతంరెడ్డి రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, పంప్సెట్ల వినియోగం, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ వంటి అంశాలపై చర్చించి సూచనలిచ్చారు. అధికారులు చేపట్టాల్సిన చర్యలను వివరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమయానుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ ఆనంద్, డీఈఈ తిరుపతి, ఏడీఈ లక్ష్మణ్, ఏఈ హరిబాబు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
సీనియర్ సిటిజన్లు మార్గనిర్దేశకులు
● న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబవరంగల్ లీగల్: ప్రస్తుత సమాజానికి సీనియర్ సిటిజన్లు మార్గదర్శకులని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వీబీ నిర్మలా గీతాంబ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ అధ్యక్షతన జిల్లా కోర్టులో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ హాజరై మాట్లాడుతూ.. తల్లిదండ్రులను దైవసమానులుగా భావించినప్పుడే జీవితానికి అర్థమన్నారు. చట్టపరమైన వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలను ఆచరణ రూపంలోకి తీసుకొచ్చేలా న్యాయసేవాధికార సంస్థలు కృషి చేస్తాయని తెలిపారు. కుటుంబాల్లోని వయోవృద్ధులు ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, సీనియర్ న్యాయవాది తీగల జీవన్గౌడ్, న్యాయవాదులు, ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
చలాన్లు.. చాలానే..
ట్రాఫిక్ స్టేషన్ల వారీగా పెండింగ్ ఇలా.. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడంతో పోలీసులు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో జరిమానాలు విధిస్తున్నారు. ఇలా కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ చలాన్లు చాంతాడంత పేరుకుపోయాయి. వాహనదారులు తరువాత చెల్లించొచ్చనే ఆలోచనతో రోజురోజుకు పెండింగ్ జరిమానాలు పెరిగిపోతున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 1,27,194 వాహనాలపై మొత్తం 11,71,094 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వీటి మొత్తం సుమారు రూ.33.28కోట్ల జరిమానాలు చెల్లించాల్సి ఉంది. పోలీస్ కంప్యూటర్ డేటా బేస్లో వాహనాల వివరాలు.. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల పూర్తి వివరాలు పోలీస్ కంప్యూటర్ డేటా బేస్లో నమోదు చేసినట్లు సీపీ చెబుతున్నారు. ఈ చలాన్లను క్లియర్ చేసేందుకుగాను ఇకపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. తనిఖీ సమయంలో చలాన్లు గుర్తిస్తే వెంటనే జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో అన్ని కూడళ్లలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు అమర్చారు. వీటి ఆధారంగా వాహనదారుడు ప్రయాణించే మార్గంలోని పోలీస్ ట్యాబ్లకు సమాచారం వెళ్తుంది. అక్కడి పోలీసులు మీ వాహనాలను రోడ్డుపై నిలిపివేసి జరిమానాలు క్లియర్ చేస్తారు. జరిమానాలు సరే.. ట్రాఫిక్ క్లియరెన్స్ ఏదీ? వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడం లేదని, సెల్ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ క్రాసింగ్ ఇలా చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. రోడ్లపై ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్ కేంద్రాల్లోని కూడళ్లలో, హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఆటోలు, ఇతర వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిపి ఉంచి మిగతా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సిబ్బంది వాహనాలను క్రమబద్ధీకరించకుండా కెమెరా, ఫోన్తో వాహనదారుల ఫొటోలు తీయడంలోనే బిజీగా ఉంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. చలాన్లు క్లియర్ చేయకపోతే వాహనం సీజ్ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయని పక్షంలో వాహనాలను సీజ్ చేసి పోలీస్స్టేషన్లకు తరలిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవుతున్నాయి. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో పోలీసులు జరిమానాలు విధిస్తారు. జరిమానాలు సకాలంలో చెల్లించాలి. – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో భారీగా 11,71,094 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఇందులో రూ.10 లక్షల వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోనివే.. నిబంధనల ఉల్లం‘ఘనుల’పై ఆన్లైన్, ఆఫ్లైన్లో జరిమానాలు జమ చేయకుంటే వాహనం సీజ్ చేస్తామంటున్న సీపీ -
శాఖల వారీగా నిధుల కేటాయింపు వివరాలు (రూ.కోట్లలో)
పంచాయతీరాజ్ 51.30తాగునీరు, శానిటేషన్ ఆర్డబ్ల్యూఎస్ 15.15జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం 11.62ఐఅండ్పీఆర్ 0.57పశుసంవర్థకం 0.30అగ్నిమాపక 0.30ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ 8.57ఇరిగేషన్, సీఏడీడీ 5.90రోడ్లు, భవనాలు 9.95పోలీస్ 14.50వైద్య ఆరోగ్య 1.07అటవీ 0.50మత్స్య 0.23ఎండోమెంట్ 1.75రెవెన్యూ శాఖ 14.38సీ్త్ర శిశు సంక్షేమ 0.25ఎన్పీడీసీఎల్ 5టీజీ ఆర్టీసీ 5 ఎకై ్సజ్, ప్రొహిబిషనరీ 0.25టూరిజం 0.90 గిరిజన సంక్షేమం (ఐటీడీఏ) 2.50 -
రూ.42 లక్షలకు లెక్కలు చూపించడం లేదు
గీసుకొండ: ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ గత కార్యవర్గంలోని నాయకులు ఫిరోజ్, అజ్మల్ సుమారు రూ.42 లక్షలకు లెక్కలు చూపించకుండా అక్రమాలకు పాల్పడ్డారని అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎండీ షకీల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్, నాయకుడు ఇజగిరి శంకర్ ఆరోపించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పేరు చెప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతం హోల్సేల్ కమర్షియల్ కాప్లెక్స్ పక్కన ఉన్న లారీ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. తాము గతం నుంచి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, జిల్లా నాయకుడు గోపాల నవీన్రాజ్ సహకారంతో లారీ ఓనర్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఫిరోజ్, అజ్మల్ తదితరులు నియంతృత్వ పోకడలతో అసోసియేషన్కు చెందిన రూ.42 లక్షలకు లెక్కలు చూపించకుండా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గీసుకొండ పోలీస్స్టేషన్లో అక్రమంగా కేసులు నమోదు చేయించారని వాపోయారు. అసోసియేషన్ పార్కింగ్ స్థలానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి స్పందించి లారీ కార్మికులకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఎమ్మెల్యే పేరు చెప్పి ఇబ్బంది పెడుతున్నారు తమపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు -
ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీ చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో యూరియా కొరత లేద ని, సక్రమ పంపిణీ కోసం అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అవసరం మేరకు యూరియా కేటాయించినట్లు తెలిపారు. ఎరువుల కంపెనీల ప్రతినిధులు, ఎరువుల డీలర్లు సహకరించాలని కోరారు. రెవెన్యూ, పోలీస్ వ్యవసాయ శాఖ ల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు రాంరెడ్డి, అనురాధ, నీరజ, కల్పన పాల్గొన్నారు. కలెక్టరేట్లో కాల్సెంటర్.. జిల్లాలో యూరియా పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కాల్సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. రైతుల సౌకర్యార్థం 18004253424 టోల్ ఫ్రీ నంబర్, 0870–2530812, 9154252936 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు. కీర్తినగర్ యూపీహెచ్సీ తనిఖీ.. గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ కీర్తినగర్లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రక్తపరీక్షలు, మందులు నిల్వచేసే గదులు, ఐపీ వార్డు, బెడ్స్, టాయిలెట్లు, వ్యాక్సినేషన్ను ఆమె పరిశీలించారు. ప్రతి రోజు ఎంతమంది రోగులు వస్తున్నారని సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. పారాసిటమాల్ మాత్రలు ఎక్కువగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం మేరకు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని ఆదేశించారు. యూపీహెచ్సీ పరిసరాలను మరింత శు భ్రంగా ఉండేలా చూసుకోవాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్, మెడికల్ ఆఫీసర్ హుస్సేన్ ఉన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద -
మహాజాతరకు.. నిధుల వరద
సాక్షిప్రతినిధి, వరంగల్/ఏటూరునాగారం: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ కుంభమేళా, సమ్మక్క, సారలమ్మల మేడారం మహాజాతరకు భారీగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తూ శాఖలవారీగా బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారీగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపుపొందింది. ఈ జాతర తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. అందుకే మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తరలివచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు మహాజాతర నిర్వహించనున్నారు. ఇప్పటికే సమ్మక్క–సారలమ్మ పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దైపెకి చేరుకుంటారు. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. మూడో రోజు జనవరి 30న సమ్మక్క సారలమ్మను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశంతో జాతర ముగియనుంది.ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక..మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.గత ఏడాది రూ.110 కోట్లుగత ఏడాది 2024 మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110కోట్లు మంజూరు చేసి మేడారంలో పలు అభివృద్ధి పనులు చేసింది. భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఈసారి అదనంగా రూ.40 కోట్లు పెంచి రూ.150కోట్లు చేయడం గమనార్హం. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.75 కోట్లను మేడారం జాతర నిర్వహణకు మంజూరు చేసింది. -
వాహనాల వేలం
నర్సంపేట రూరల్: నర్సంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన వాహనాలకు బుధవారం వేలం నిర్వహించినట్లు అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మురళీధర్ తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అధికారి అరుణ్కుమార్ ఆదేశాల మేరకు 19 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించగా ప్రభుత్వానికి రూ.3,11,460 ఆదా యం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. నర్సంపేట ఎకై ్సజ్ సీఐ నరేశ్రెడ్డి, ఎకై ్స జ్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. 13 మంది సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్. వెంకన్న వీఆర్ నుంచి దేవరుప్పుల పీఎస్, జి.శ్రీదేవి తరిగొప్పుల నుంచి వరంగల్ సీసీ ఎస్, ఎం.రాజు గీసుకొండ నుంచి ముల్కనూ రు, ఎన్.సాయిబాబు ముల్కనూరు నుంచి వర్ధన్నపేట, బి.చందర్ వర్ధన్నపేట నుంచి టాస్క్ ఫోర్స్, జి.అనిల్కుమార్ వీఆర్ నుంచి గీసుకొండ, టి.విజయ్రాజు వీఆర్ నుంచి గీసుకొండ, ఎం.కుమారస్వామి వీఆర్ నుంచి వరంగల్ ట్రాఫిక్, ఈ.రతీశ్ వీఆర్ నుంచి సీఎస్బీ వరంగల్, హెచ్.ఆనందం వీఆర్ నుంచి సీఎస్బీ వరంగల్, టి.యాదగిరి వరంగల్ ట్రాఫిక్ నుంచి సీసీఎస్ వరంగల్, ఈ.నారయణ హనుమకొండ ట్రాఫిక్ నుంచి వీఆర్ వరంగల్కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ సివిల్ జడ్జిల నియామకంవరంగల్ లీగల్: రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికై న 49 మంది జూనియర్ సివిల్ జడ్జిలను వివిధ జిల్లాలకు నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు జూనియర్ సివిల్ జడ్జిలను నియమించారు. వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (ఎకై ్సజ్ కోర్టు) జడ్జిగా రాజ్నిధి, నర్సంపేట జూనియర్ సివిల్ జడ్జిగా ఊట్లూరి గిరిధర్, హనుమకొండ రెండో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (పీసీఆర్ కోర్టు) జడ్జిగా బానావత్ అనూష, పరకాల మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు బొడ్డు శ్రీవల్లి శైలజ, ములుగు మొబైల్ కోర్టు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా దక్కన్నగారి మధులిక తేజను నియమించారు. రెండు కిలోల ఎండు గంజాయి స్వాధీనంనర్సంపేట రూరల్: ఎండు గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ద్వారకపేట బైపాస్ రోడ్డు– మహబూబాబాద్ రోడ్డు సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న యువకులను ఆపి తనిఖీ చేశారు. ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు కవర్లో రెండు కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. వారిని విచారించగా భద్రాద్రి జిల్లా చింతూరు మండలం మోతుగూడేనికి చెందిన నాగు అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలుచేసినట్లు తెలిపారని అన్నారు. అరెస్టు చేసిన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉసిరికాయపల్లికి చెందిన వరుణ్దొర, ఇల్లందులోని జేకే కాలనీకి చెందిన ప్రవీణ్కుమార్ ఉన్నారు. గంజాయి, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వరంగల్ మహా నగరాన్ని తీర్చిదిద్దండి
సంగెం: వలస పాలకుల నిర్లక్ష్యం, విధ్వంసానికి గురైన వరంగల్ మహానగరాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా పాలకులతో వరంగల్లోని ఆజంజాహి మిల్లు మూతబడి, బీడీల పరిశ్రమలు కాలగర్భంలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటిక్యాల మధుసూదన్రావు, ఎమ్మెస్ రాజలింగం, టీఎస్ మూర్తి వంటి నిస్వార్థ రాజకీయ నాయకుల చొరవతో ఎన్ఐటీ, కేఎంసీ సంస్థలు వచ్చాయన్నారు. వలస పాలకులు అభివృద్ధి చేయకపోవడంతోనే జిల్లాలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని గుర్తుచేశారు. వరంగల్ సెంట్రల్ జైలును కూలగొట్టి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టి 1200 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని ధ్వజమెత్తారు. వీటిని జీర్ణించుకోలేని ప్రజలు గత పాలకులను ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టారని వివరించారు. ప్రముఖ సామాజికవేత్త సోమ రామమూర్తి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ -
క్యూలో ఉన్నా అందని యూరియా
ఖానాపురం: రైతులకు యూరియా కష్టాలు తీరడంలేదు. రాత్రి, పగలు తేడా లేకుండా సొసైటీ గోదాంలు, రైతువేదికల వద్ద యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఖానాపురం మండలంలోని బుధరావుపేట, మనుబోతులగడ్డ గ్రామాల్లో రైతులు యూరియా కోసం బుధవారం బారులు తీరారు. బుధరావుపేటకు 444 బస్తాల యూరియా వచ్చింది. టోకెన్ల కోసం రైతువేదిక వద్ద తెల్లవారుజాము నుంచే 600మందికి పైగా రైతులు, మహిళలు, చిన్నారులు క్యూలైన్లలో నిల్చున్నారు. కొంతమందికి మాత్రమే టోకెన్లు అందించి అధికారులు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. క్యూలో ఉన్నా తమకు యూరియా అందలేదని మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో బుధరావుపేటలో క్యూలో నిల్చున్న రైతు అలీపాషా సొమ్మసిల్లిపడిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. యూరియా అందలేదని రైతులు జాతీయ రహదారి–365పై రాస్తారోకో చేపట్టారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మద్దతు తెలిపి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఎస్సై రఘుపతి, ఏఓ శ్రీనివాస్ చేరుకుని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. రెండు గంటలకు పైగా రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మనుబోతులగడ్డలో 444 బస్తాల యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. మేడపల్లిలో.. నల్లబెల్లి: మేడపల్లి గ్రామంలో ఉదయం నాలుగు గంటల నుంచి రైతులు యూరియా కోసం బారులు తీరారు. పీఏసీఎస్ సిబ్బంది గోదాం వద్దకు ఉదయం 7 గంటలకు చేరుకున్నారు. గోదాంలో తక్కువ బస్తాలు ఉన్నాయని తెలుసుకుని రైతులు ఎగబడ్డారు. దీంతో తోపులాట జరుగగా రైతు నూనావత్ కిషన్కు గాయమైంది. ఎస్సై గోవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతుకు రెండు బస్తాల చొప్పున 20 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు. ఫర్టిలైజర్ షాపు, గ్రోమోర్ షాపులకు వెళ్లి యూరియా తీసుకోవాలని ఏఓ రజిత సూచించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని సొసైటీ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ అన్నారు. నాగరాజుపల్లి, నందిగామ, బోల్లోనిపల్లిలో అదనంగా యూరియా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సూరిపల్లిలో.. నెక్కొండ: సూరిపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో అందిస్తున్న యూరియా కోసం రైతులు బారులుదీరారు. పీఏసీఎస్ పరిధిలోని సూరిపల్లి, చిన్నకొర్పోలు, నాగారం రెవెన్యూ గ్రామాల రైతులకు బదులు గూడూరు, కేసముద్రం మండలాల రైతులు ఇక్కడకు వచ్చారని ఏఓ నాగరాజు తెలిపారు. వీరిని గుర్తించి తిరిగి పంపించినట్లు ఆయన తెలిపారు. అనంతరం 250 మంది రైతులకు 444 బస్తాల యూరియా అందించామని ఆయన పేర్కొన్నారు. చౌటపల్లి గ్రామంలో.. పర్వతగిరి: చౌటపల్లిలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. బుధరావుపేటలో సొమ్మసిల్లిపడిపోయిన రైతు జాతీయ రహదారి–365పై రాస్తారోకో రెండు గంటల పాటు నిలిచిన వాహనాలు -
తూర్పు కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు
రామన్నపేట : మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా వరంగల్ తూర్పు కాంగ్రెస్లో మరోసారి వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. వరంగల్ ఎంజీఎం జంక్షన్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే నాగరాజు తమ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. ముందుగా స్వర్ణ, సారయ్య రాజీవ్గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న మంత్రి కొండా సురేఖ రెండు నిమిషాల పాటు ఆగి వేరుగా విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో ఆయా నేతల అనుచరులు జై కొండా.. జై సారన్న, జై నాగరాజు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తింది. ఆ తర్వాత సారయ్య వర్గం నాయకులు అక్కడినుంచి వెళ్లిపోయారు. మరోసారి చర్చ.. కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతలపై బహిరంగంగానే విమర్శలు చేయడంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసేందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇరువర్గాల నాయకులను పిలిచి మాట్లాడి గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా ఏకతాటిపై నిలవాలని సూచించింది. వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాజకీయాలను అధిష్టానంతో నిత్యం పర్యవేక్షిస్తున్న సమయంలో రాజీవ్గాంధీ జయంతి వేదికగా మరోసారి విబేధాలు బహిర్గతమవడం చర్చకు దారి తీసింది. రాజీవ్గాంధీ తెచ్చిన రిజర్వేషన్లే నన్ను మంత్రిని చేశాయి.. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ నాడు తన హయాంలో స్థానిక సంస్థల్లో ఇచ్చిన రిజర్వేషన్ల వల్లే ప్రస్తుతం తాను మంత్రిస్థాయి ఎదిగానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎంజీఎం జంక్షన్లోని రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడారు. దేశంలో పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికను జోడించాల ఆనాడు రాజీవ్గాంధీ ఆలోచన చేశారని పేర్కొన్నారు. రాజీవ్గాంధీ జయంతి వేడుకల సమయంలో రాజకీయాలు చేయడం తగ్గదంటూ కార్యకర్తలను సముదాయించారు. తాను రాకముందే పూలమాలలు వేయడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. రాజీవ్గాంధీ జయంతి వేదికగా బహిర్గతం ముందుగా జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాళి అనంతరం వచ్చిన మంత్రి సురేఖ.. ఆ సమయంలో ఇరువర్గాల నినాదాలు.. -
చలాన్లు.. చాలానే..
ట్రాఫిక్ స్టేషన్ల వారీగా పెండింగ్ ఇలా.. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడంతో పోలీసులు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో జరిమానాలు విధిస్తున్నారు. ఇలా కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ చలాన్లు చాంతాడంత పేరుకుపోయాయి. వాహనదారులు తర్వాత చెల్లించవచ్చు అనే ఆలోచనలో ఉండడంతో రోజురోజుకూ పెండింగ్ జరిమానాలు పెరిగిపోతున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 1,27,194 వాహనాలపై మొత్తం 11,71,094 చలా న్లు పెండింగ్లో ఉన్నాయి. వీటి మొత్తం సుమారు రూ.33.28కోట్ల జరిమానాలు చెల్లించాల్సి ఉంది. పోలీస్ కంప్యూటర్ డేటా బేస్లో వాహనాల వివరాలు.. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల పూర్తి వివరాలు పోలీస్ కంప్యూటర్ డేటా బేస్లో నమోదు చేసినట్లు సీపీ చెబుతున్నారు. ఈ చలాన్లను క్లియర్ చేసేందుకుగాను ఇకపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. తనిఖీ సమయంలో చలాన్లు గుర్తిస్తే వెంటనే జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో అన్ని కూడళ్లలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు అమర్చారు. వీటి ఆధారంగా వాహనదారుడు ప్రయాణించే మార్గంలోని పోలీస్ ట్యాబ్లకు సమాచారం వెళ్తుంది. అక్కడి పోలీసులు మీ వాహనాలను రోడ్డుపై నిలిపివేసి జరిమానాలు క్లియర్ చేస్తారు. జరిమానాలు సరే.. ట్రాఫిక్ క్లియరెన్స్ ఏదీ? వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడం లేదని, సెల్ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, సిగ్నల్ క్రాసింగ్ ఇలా చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. రోడ్లపై ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్ కేంద్రాల్లోని కూడళ్లలో, హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఆటోలు, ఇతర వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిపి ఉంచి మిగతా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సిబ్బంది వాహనాలను క్రమబద్ధీకరించకుండా కెమెరా, ఫోన్తో వాహనదారుల ఫొటోలు తీయడంలోనే బిజీగా ఉంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. చలాన్లు క్లియర్ చేయకపోతే వాహనం సీజ్ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయని పక్షంలో వాహనాలను సీజ్ చేసి పోలీస్స్టేషన్లకు తరలిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవుతున్నాయి. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో పోలీసులు జరిమానాలు విధిస్తారు. జరిమానాలు సకాలంలో చెల్లించాలి. – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 11,71,094 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఇందులో 10లక్షల వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోనివే.. నిబంధనల ఉల్లం‘ఘనుల’పై ఆన్లైన్, ఆఫ్లైన్లో జరిమానాలు జమచేయకుంటే వాహనం సీజ్ చేస్తామంటున్న సీపీ -
కుట్టు శిక్షణలో మెళకువలు నేర్చుకోవాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ ఆత్మకూరు/దామెర: మహిళలు కుట్టు శిక్షణలో మెళకువలు నేర్చుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. ఆత్మకూరు, దామెర మండల కేంద్రాల్లో బుధవారం కలెక్టర్ స్నేహ శబరీష్ మహిళా కుట్టు శిక్షణ కేంద్రాల్ని సందర్శించారు. శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి పలు సూచనలిచ్చారు. మండల మహిళా సమాఖ్య అధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని మహిళలు వినియోగించుకోవాలని, కుట్టుకు సంబంధించిన మెలకువలను శిక్షణ కాలంలో నేర్చుకోవాలన్నారు. సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశం వచ్చినా, రాకున్నా స్వయం ఉపాధి ద్వారా సొంత కాళ్ల పై నిలబడే అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం ఆత్మకూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. అనంతరం దామెర సమాఖ్య భవనం ఆవరణలో మొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఓ మేన శ్రీను, సెర్ప్ అడిషనల్ డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆబ్కారీకి టెండర్ల కిక్కు!
కాజీపేట అర్బన్: ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న ఎకై ్సజ్ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ప్రతీసారి రెండేళ్ల కాలపరిమితితో టెండర్లకు పిలుపునిస్తారు. వైన్స్ దక్కించుకునేందుకు నిర్వాహకులతో పాటు నూతనంగా మద్యం వ్యాపారంలో రాణించాలనే ఆసక్తి ఉన్న వారు పోటీ పడుతుంటారు. కాగా.. గత టెండర్లలో హనుమకొండ జిల్లా పరిధి 65 వైన్స్లకుగాను ప్రతీ టెండర్లో దరఖాస్తులు డబుల్ అయ్యాయి. ఆదాయం సైతం రెట్టింపు అయ్యింది. గత టెండర్లలో 6,002 దరఖాస్తులు రాగా.. రూ.120 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. ఈసారి టెండర్లతో 12 వేల దరఖాస్తులు, రూ.240 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సీన్ రిపీట్ అయ్యేనా? ఎన్నికల సమయం దగ్గరపడుతోందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023–25 రెండేళ్ల కాల పరిమితితో మూడు నెలల ముందుగానే టెండర్లను పిలిచింది. 2021–23కు గాను 2023 నవంబర్ వరకు వైన్స్కు గడువు ఉండగా.. మూడు నెలల ముందుగానే.. (ఆగస్టు)లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. సెప్టెంబర్లో నూతన వైన్స్ నిర్వాహకుల నుంచి ముందస్తుగా రుసుం చెల్లించుకుంది. అనంతరం డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్స్ ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు జీఓ నంబర్ 93ను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా.. గత ఆగస్టులో మాదిరి స్థానిక ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఓ నంబర్ 93ను విడుదల చేయడంతో అదే సీన్ రిపీట్ అవుతుందా? అంటూ వైన్స్ నిర్వాహకులు చర్చించుకుంటున్నారు. ఆదాయం, దరఖాస్తు రుసుము ఇలా.. వైన్స్ టెండర్లలో పాల్గొనేవారు ఇప్పటి వరకు రూ.2 లక్షలు దరఖాస్తు రుసుముగా చెల్లించేవారు. ప్రస్తుత ప్రభుత్వం అదనపు ఆదాయం కోసం దరఖాస్తు రుసుమును రూ.2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతూ జీఓ 93ను విడుదల చేసింది. రిజర్వేషన్ ఖరారు చేసింది. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం వైన్స్లను కేటాయించేందుకు నిర్ణయించారు. దీంతో గత టెండర్ల కంటే పెరిగిన దరఖాస్తు రుసుముతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎకై ్సజ్ కిక్కు డబుల్ కానుంది.హనుమకొండ జిల్లా వైన్స్ (వరంగల్ అర్బన్)లో ఇలా.. హనుమకొండ 25 కాజీపేట 15 వరంగల్ అర్బన్ 12 ఖిలా వరంగల్ 13 ఏడాది దరఖాస్తులు ఆదాయం2021–23 2,983 రూ.59 కోట్లు 2023–25 6,002 రూ.120 కోట్లు వరంగల్ రూరల్ జిల్లాలో వైన్స్.. నర్సంపేట 25 పరకాల 22 వర్ధన్నపేట 16 2023–25లో మొత్తం దరఖాస్తులు 2,938 ఆదాయం రూ.58 కోట్లు వైన్స్ నిర్వాహకుల్లో టెండర్స్ ఫీవర్ విడుదలైన జీఓ.. పెరిగిన రుసుము డ్రా తేదీల కోసం ఎదురుచూపులు -
ఇందిరమ్మ ఇళ్లు, పీహెచ్సీ పరిశీలన
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రికార్డులు పరిశీలించారు. వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధుల బారిన పడే వారికి సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలందించాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అక్కడి నుంచి కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి తహసీల్దార్ ప్రసాద్రావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయ్కుమార్, కార్యదర్శి శ్రీనివాస్, వైద్య సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్ అనితాదేవి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
శాఖల వారీగా నిధుల కేటాయింపు వివరాలు (రూ.కోట్లలో)
పంచాయతీరాజ్ 51.30తాగునీరు, శానిటేషన్ ఆర్డబ్ల్యూఎస్ 15.15అగ్నిమాపక 0.30రోడ్లు, భవనాలు 9.95ఇరిగేషన్, సీఏడీడీ 5.90ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ 8.57జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం 11.62పశుసంవర్థక 0.30ఐఅండ్పీఆర్ 0.57ఎకై ్సజ్ప్రొహిబిషన్ 0.25అటవీ 0.50రెవెన్యూ శాఖ 14.38పోలీస్ 14.50సీ్త్ర, శిశు సంక్షేమ 0.25ఎండోమెంట్ 1.75మత్స్య 0.23వైద్య ఆరోగ్య 1.07టూరిజం 0.90 ఎన్పీడీసీఎల్ 5టీజీ ఆర్టీసీ 5 గిరిజన సంక్షేమం(ఐటీడీఏ) 2.50 -
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలి
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్ దామెర: గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్ అన్నారు. మండల కేంద్రలోని పోలీస్స్టేషన్ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశీలించారు. ప్రాపర్టీ రూమ్, సన్నిహిత పిటిషన్లు, క్రైమ్ ఫైల్స్, పోలీస్ స్టేషన్లో నమోదు అవుతున్న కేసుల వివరాలను ఎస్సై కొంక అశోక్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా విధులు నిర్వహించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పర్యటించి మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించి యువతలో చైతన్యం తీసుకురావాలని వెల్లడించారు. వీపీఓలు ఆయా గ్రామ ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే దరఖాస్తుదారులతో సోదరభావంతో మెలగాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై కొంక అశోక్, ఏఎస్సైలు యాకయ్య, రమేశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. సమాచారం నమోదు చేయాలి● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ రామన్నపేట: చెత్త తరలింపు వాహనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా పరిధి రాంపూర్లోని డంపింగ్ యార్డ్ను ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యర్థాలు నిర్వహణపై అధికారులకు సూచనలిచ్చారు. -
నేషనల్ హైవే ఆఫీస్ ఫర్నిచర్ జప్తు చేయండి
నష్టపరిహారం చెల్లింపు కేసులో కోర్టు ఆదేశం కాజీపేట అర్బన్ : హనుమకొండ హంటర్రోడ్డులోని నేషనల్ హైవే ఆఫీస్ ఫర్నిచర్ జప్తు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జప్తు చేసేందుకు వచ్చిన కోర్టు సిబ్బందిని బుధవారం కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. కోర్టు సిబ్బంది కథనం ప్రకారం.. నేషనల్ హైవే 163 రోడ్డు కింద భూములు కోల్పోయిన పైడిపల్లి గ్రామానికి చెందిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్న నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్ మూవబుల్ ప్రాపర్టీని జప్తు చేయాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు సిబ్బంది ఆఫీస్లోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని జప్తు చేసేందుకు వెళ్లారు. వీరిని నేషనల్ హైవే ఆఫీస్ సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిపారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.వెంకన్న వీఆర్ నుంచి దేవరుప్పుల పీఎస్, జి.శ్రీదేవి తరిగొప్పుల నుంచి వరంగల్ సీసీఎస్, ఎం.రాజు గీసుకొండ నుంచి ముల్క నూరు, ఎన్.సాయిబాబు ముల్కనూరు నుంచి వర్ధన్నపేట, బి.చందర్ వర్ధన్నపేట నుంచి టాస్క్ఫోర్స్, జి.అనిల్కుమార్ వీఆర్ నుంచి గీసుకొండ, టి.విజయ్రాజు వీఆర్ నుంచి గీసుకొండ, ఎం.కుమారస్వామి వీఆర్ నుంచి వరంగల్ ట్రాఫిక్, ఈ.రతీశ్ వీఆర్ నుంచి సీఎస్బీ వరంగల్, ఆనందం వీఆర్ నుంచి సీఎస్బీ వరంగల్, టి.యాదగిరి వరంగల్ ట్రాఫిక్ నుంచి సీసీఎస్ వరంగల్, ఈ.నారయణ హనుమకొండ ట్రాఫిక్ నుంచి వీఆర్ వరంగల్కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ లీగల్: రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికై న 49 మంది జూనియర్ సివిల్ జడ్జిలను వివిధ జిల్లాలకు నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు జూనియర్ సివిల్ జడ్జిలను నియమించారు. వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (ఎకై ్సజ్ కోర్టు) జడ్జిగా రాజ్నిధి, నర్సంపేట జూనియర్ సివిల్ జడ్జిగా ఊట్లూరి గిరిధర్, హనుమకొండ రెండో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (పీసీఆర్ కోర్టు) జడ్జిగా బానావత్ అనూష, పరకాల మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు బొడ్డు శ్రీవల్లి శైలజ, ములుగు మొబైల్ కోర్టు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా దక్కన్నగారి మధులిక తేజ ను నియమించారు. ఈనెల 28లోపు బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం భూ సేకరణలో భాగంగా కన్సెంట్ అవార్డుకు ముందుకు వచ్చిన రైతుల బ్యాంకు ఖాతాలో రూ.34,84,05,298 జమ చేసినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం తెలిపారు. 48మంది రైతుల ఖాతాల్లో జమయ్యాయని పేర్కొన్నారు. ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున 12 మంది రైతులకు, గాడేపల్లి గ్రామంలో 36 మంది రైతులకు భూ సేకరణ పరిహారం కింద డబ్బులు చెల్లించామని కలెక్టర్ వెల్లడించారు. -
కొత్త కార్డులకు బియ్యం
ఖిలా వరంగల్: రేషన్కార్డుల కోసం 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరింది. జూలై 14న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త రేషన్కార్డుల పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రేషన్కార్డులు అందించారు. దీంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కార్డుదారులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జూన్లో మూడు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేసింది. దీంతోపాటు మూడు నెలలుగా ప్రభుత్వం కొత్త రేషన్కార్డుల జారీతోపాటు ఉన్న కార్డుల్లో సభ్యుల పేర్లను నమోదు చేసింది. జిల్లాలో పెరిగిన ఆహారభద్రతా కార్డుల్లోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్షాపులకు బియ్యం.. కొత్త రేషన్కార్డుదారులకు బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి యథావిధిగా పాత కార్డులతోపాటు కొత్త కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన సన్న బియ్యం కేటాయించింది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్షాపులకు బియ్యం తరలింపునకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం చౌకధరల దుకాణాలు, మండలస్థాయి గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యానికి తోడు అదనంగా కావాల్సిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. కొత్తకార్డుల పంపిణీకి ముందు ప్రతి నెల సుమారు 509 షాపుల ద్వారా 2,66,429 కార్డులకు 50,14,541 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని పంపిణీ చేశారు. పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా జిల్లాకు 53,82,518 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మూడు ఎంఎల్ఎస్ పాయింట్లు.. వరంగల్ జిల్లాలో ఏనుమాముల, వర్ధన్నపేట, నర్సంపేట ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 13 మండలాల్లోని 509 రేషన్ షాపులకు బియ్యం చేరనున్నాయి. స్టేజ్–1 గోదాముల నుంచి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు సన్న బియ్యం నిల్వలు రాక ప్రారంభమైంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా రేషన్ షాపులకు సన్నబియ్యం పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పంపిణీకి సన్నాహాలు ఏర్పాట్లు చేస్తున్న పౌరసరఫరాల శాఖ పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా రేషన్ దుకాణాలకు కోటా కేటాయింపురేషన్ దుకాణాలు : 509పాతకార్డులు : 2,66,429కొత్తకార్డులు : 16,251ఎంఎల్ఎస్ పాయింట్లు : ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేట పంపిణీ చేయాల్సిన బియ్యం : 5,382,518 మెట్రిక్ టన్నులు -
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
● ఆర్డీఓలు, తహసీల్దార్ల వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ న్యూశాయంపేట: భూ భారతి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్ నుంచి మంగళవారం జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలోగా పరిష్కరించలేని దరఖాస్తుల వివరాల నివేదికను తయారుచేయాలని తహసీల్దార్లకు సూచించారు. రెవెన్యూ రికార్డుల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని, తహసీల్దార్ల కార్యాలయాల్లో విధిగా రిజిస్టర్లు, బయోమెట్రిక్ అటెండెన్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఆర్డీఓల పరిధిలోని తహసీల్దార్ల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలు, పెండింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వీడి యో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఏఓ విశ్వప్రసాద్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సీపీని కలిసిన క్రైం డీసీపీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రెం డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన గుణశేఖర్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమొక్క అందజేశారు. కమిషనరేట్ పరిధిలో చోరీలను నియంత్రించడంతో పాటు పెండింగ్ కేసుల్లో పట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు.నానో యూరియాతో లాభాలు : డీఏఓరాయపర్తి: నానో యూరియాతో రైతులకు లాభాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి కె.అనురాధ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు దాసరి మహేందర్ వ్యవసాయక్షేత్రంలో మంగళారం నానో యూరియా క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నానో యూరియా కు ధర తక్కువ అని, డ్రోన్తో సులభంగా పిచికారీ చేయవచ్చని చెప్పారు. యూరియా, నానో యూరియాకు తేడాపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రం, సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, సీఈఓ సోమిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.లక్ష్యాన్ని సాధించాలిన్యూశాయంపేట: వనమహోత్సవంలో భాగంగా అధికారులు నిర్దేశిత లక్ష్యాన్ని వారంలోగా సాధించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో ఇన్చార్జ్ డీఎఫ్ఓ కృష్ణమూర్తితో కలిసి మంగళవారం వనమహోత్సవంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా లక్ష్యం 31,04,272 కాగా.. ఇప్పటి వరకు 21,85,252 మొక్కలు నాటినట్లు తెలిపారు. 10,29, 230 మొక్కలకు జియోట్యాగింగ్, మేరీ లైఫ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికఖానాపురం: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని బుధరావుపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సాయిచరణ్ ఎంపికై నట్లు పీఈటీ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈనెల 18 నుంచి రంగారెడ్డిలో రాష్ట్రస్థాయి క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో సాయిచరణ్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో ఆయనను ఉపాధ్యాయులు, పీఈటీ అభినందించారు.ఇనుప స్తంభానికి విద్యుత్దుగ్గొండి: తిమ్మంపేటలోని నారాయణతండా రోడ్డులో నరహరి సాంబరెడ్డి వ్యవసాయ బావి వద్ద ఉన్న ఇనుప స్తంభానికి ఎర్త్ పాసై విద్యుత్ సరఫరా అవుతోందని రైతులు పేర్కొంటున్నారు. వంగిపోయి 11కేవీ, ఎల్టీ లైన్లు ఉన్న ఈ స్తంభంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సిమెంట్ స్తంభం ఏర్పాటు చేసి, తీగలు సరిచేయాలని రైతులు కోరుతున్నారు.ఉపాధి హామీ డబ్బులు రికవరీ చేయాలినర్సంపేట: ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అవకతవకలపై డబ్బులను రికవరీ చేయాలని డీఆర్డీఓ కౌసల్యాదేవి ఆదేశించారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో మంగళవారం సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం ఎస్ఆర్పీ, డీఆర్పీలు ఉపాధి హామీ పనులపై నిర్వహించిన సోషల్ ఆడిట్ నివేదికలను డీఆర్డీఓకు సమర్పించారు. నివేదికల ఆధారంగా ప్రోగ్రాం ఆఫీసర్, ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి రూ.46,527 రికవరీ చేయాలని డీఆర్డీఓ ఆదేశించారు. రికవరీ కింద డబ్బులు చెల్లించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఖానాపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రం శివారులో మంగళవార రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన దున్నపోతుల సంజీవ కుమారుడు వ్యాసు (21) నర్సంపేటలోని జయముఖి కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై నర్సంపేటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఖానాపురం శివారులోని బ్రిడ్జిపైకి రాగానే నర్సంపేట నుంచి ఖానాపురం వైపు వస్తున్న ట్రాక్టర్ను ఢీకొని పడిపోయాడు. ప్రమాదంలో తీవ్రగాయాలై అక్కడికక్కడికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యాసు మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కొత్త కార్డు రావడం ఆనందంగా ఉంది..
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. రేషన్కార్డు కోసం 11 సంవత్సరాలుగా ఎదురుచూశాం. కొత్త రేషన్కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్నాం. అధికారులు సర్వే చేసి మాకు కార్డు మంజూరు చేశారు. నాపేరు, భర్త, ఇద్దరు పిల్లల పేర్లతో కూడిన కార్డు మాకు వచ్చింది. సెప్టెంబర్ నెల నుంచి నలుగురికి 24 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. నాకుటుంబానికి కొత్త కార్డు రాడడం ఎంతో ఆనందంగా ఉంది. – భార్గవి, తిలక్రోడ్డు కాశిబుగ్గ, వరంగల్ -
మహిళా క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఎంజీఎం: మహిళా ఆరోగ్య క్లినిక్ల ద్వారా అందించే సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతీ మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా క్లినిక్ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా అక్కడకు వచ్చిన మహిళలను వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆస్పత్రిలోని ఫార్మసీ, ల్యాబ్, వ్యాక్సిన్ భద్రపరిచే విభాగాలు, రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీ పరిధిలో జ్వరసర్వే, పాఠశాలల్లో, గ్రామాల్లో నిర్వహించే మెడికల్ క్యాంపుల వివరాలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హసన్పర్తి: హసన్పర్తి సంస్కృతీ విహార్లోని గ్రామీణ ఉపాఽధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ బాస రవి తెలిపారు. సీసీ టీవీ ఇన్స్టాలేషన్లో (13 రోజులు), ఎలక్ట్రిషీయన్, హౌజ్ వైరింగ్లో (30 రోజులు), మొబైల్ రిపేరింగ్లో (30రోజుల) పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సు, తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, తెల్లరేషన్కార్డు, ఆధార్కార్డు, విద్యార్హత జిరాక్స్ పత్రాలతో ఈనెల 26 లోపు సంస్కృతీ విహార్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 26 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు ఫోన్ నంబర్ 98493 07873 సంప్రదించాలని మేనేజర్ రవి సూచించారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన గుణశేఖర్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమొక్క అందజేశారు. కమిషనరేట్ పరిధిలో చోరీలను నియంత్రించడంతో పాటు పెండింగ్ కేసుల్లో పట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు. విద్యారణ్యపురి: జిల్లాలోని ప్రత్యేక ఉపాధ్యాయుల చేత గుర్తించిన ప్రత్యేక అవసరాల పిల్ల లకు వైకల్యం స్థాయి నిర్ధారణ పరీక్షలు ఈనెల 23న హనుమకొండలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో నిర్వహించనున్నట్లు డీఈవో డి. వాసంతి మంగళవారం తెలిపారు. అర్హత కలిగిన ప్రత్యేక అవసరాల పిల్లలు వారి రెండు పాస్పోర్టుసైజ్ ఫొటోలు, రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 40శాతం వైకల్యం ఉన్నట్లుగా నిర్ధారించిన ధ్రువపత్రం, ప్రభుత్వ వైద్యుడు అందించిన సదరం ధ్రువపత్రం మీద హెచ్ఎం, మండల విద్యాధికారి సంతకం చేసిన కాపీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు, ఆధార్కార్డు, యూనివర్సల్ డిజేబిలిటీ ఐడీ వంటి ధ్రువపత్రాలు తీసుకొనిరావాలన్నారు. ఈవైకల్య స్థాయి నిర్ధారణ క్యాంపులో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఎంపిక చేసిన వైద్యబృందం ఈ క్యాంపులో పాల్గొంటుందని తెలిపారు. వారిలోని లోపాలను గుర్తించి అవసరమైన ప్రత్యేక పరికరాలను అందజేసేందుకు ఈక్యాంపును నిర్వహిస్తున్నారన్నారు. అదనపు సమాచారం కోసం జిల్లా సమ్మిళిత విద్య సమన్వయ కర్త బద్దం సుదర్శన్రెడ్డిని 9603672289 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. -
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
రాయపర్తి: యూరియా సరఫరాలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్తోపాటు ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ వ్యవసాయాధికారులతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. షాపుల్లోని యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ షాపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా యూరియా పంపిణీ సక్రమంగా చేపట్టాలని సూచించారు. యూరియా కోసం పురుగుమందులు, ఇతర వస్తువులను అంటగడుతున్నారని కలెక్టర్ ఎదుట రైతులు వాపోయారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు అలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. యూరియా బస్తాలను పక్కదారి పట్టించి కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. షాపుల వద్ద అధికారులు ఉండి యూరియా పంపిణీ పర్యవేక్షించాలని సూచించారు. యూరియాకు బదులు ప్రత్యామ్నాయంగా నానో యూరియా పంటలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని రైతులకు అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన.. మండల కేంద్రం, పెర్కవేడు గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో వైద్యశిబిరాన్ని పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందించాలని ఆదేశించారు. భోజనం ఎలా ఉందని బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, గృహనిర్మాణ శాఖ పీడీ గణపతి శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ గుగులోత్ కిషన్నాయక్, ఏఓ గుమ్మడి వీరభద్రం ఉన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
గ్రామాల్లో సమస్యలపై మంత్రి ఓఎస్డీకి వినతులు
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓఎస్డీ శ్రీనివాస్రెడ్డి మంగళవారం పర్యటించారు. మండలంలోని రామ్నగర్, రంగయ్యపల్లి, రత్నగిరి, వంగర, కొప్పూర్, గాంధీనగర్, కొత్తపల్లి, భీమదేవరపల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో వీరేశం, ఎంపీవో నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినయ్రెడ్డి, ఏవో పద్మ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
అక్రమ రవాణా కట్టడికే సాండ్బజార్
మడికొండ: ఇసుక అక్రమ రవాణా కట్టడికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాండ్బజార్ ఏర్పాటు చేశారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 64వ డివిజన్ ఉనికిచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సాండ్బజార్ను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. సాండ్ బజార్ల ద్వారా సరసమైన ధరకే ఇసుక లభిస్తుందన్నారు. ప్రజల అవసరాల మేరకు ఇసుకను డోర్ డెలివరీ చేస్తారని, మెట్రిక్ టన్నుకు రూ.1200లకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లభ్ధిదారులకు రూ.1,000లకు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీజీఎండీసీ, ఎండీల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు అందుబాటులో నాణ్యమైన ఇసుక అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సాండ్బజార్లను ఏర్పాటు చేసినట్లు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఘన్పూర్ నియోజకవర్గంలో 80శాతం వరకు ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇందిరమ్మ లబ్ధిదారులకు అందుబాటు ధరల్లో ఇసుక : కడియం శ్రీహరి -
444 బస్తాల యూరియా.. రెండు వేల మంది రైతులు!
పర్వతగిరి: యూరియా కోసం క్యూలో ఉన్న రైతుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పర్వతగిరి పీఏసీఎస్ పరిధిలోని కల్లెడ గ్రామానికి మంగళవారం 444 బస్తాల యూరియా రాగా.. రెండు వేల మంది రైతులు బారులుదీరారు. వంద మంది రైతులకు అధికారులు కూపన్లు పంపిణీ చేసి మిగిలిన వారిని క్యూలో ఉండమని సూచించారు. ఎక్కువ మంది రావడంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. గమనించిన పీఏసీఎస్ సీఈఓ సురేశ్, వ్యవసాయ శాఖ అధికారి ప్రశాంత్కుమార్, ఎస్సై బోగం ప్రవీణ్ తక్షణమే కూపన్లు, యూరియా పంపిణీ నిలిపివేశారు. దీంతో రైతులు నిరాశకు గురై వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కూపన్లు ఇచ్చి యూరియా బస్తాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఈఓ సురేశ్ను వివరణ కోరగా గత ఏడాది ఈ సమయం వరకు 15 లారీల యూరియా రాగా.. ఈ ఏడాది 8 లారీల యూరియా మాత్రమే వచ్చిందని తెలిపారు. వారానికి ఒక లారీ రావాల్సి ఉండగా.. 25 రోజులకు ఒక లారీ రావడంతో రైతులు యూరియా కోసం బారులుదీరుతున్నారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి టోకెన్లు ఇచ్చి యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేస్తామని ఏఓ ప్రశాంత్కుమార్ తెలిపారు. గ్రోమోర్ షాపు ఎదుట పడిగాపులు.. వర్ధన్నపేట: యూరియా కోసం మండల కేంద్రంలోని గ్రోమోర్ షాపు ఎదుట రైతులు మంగళవారం క్యూలైన్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. వారం రోజులుగా యూరియా దొరకడం లేదని, పంట సాగుకు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందపల్లి పీఏసీఎస్ కార్యాలయం వద్ద.. దుగ్గొండి: యూరియా కోసం మందపల్లి పీఏసీఎస్ కార్యాలయానికి రైతులు భారీగా తరలివచ్చారు. ప్రతి రైతుకు రెండు బస్తాల చొప్పున అందించారు. మండల వ్యవసాయ అధికారి మాధవి మాట్లాడుతూ అపోహతోనే రైతులు యూరియా నిల్వ చేసుకోవడంతో కొరత ఏర్పడుతోందని తెలిపారు. మండలానికి ఇప్పటివరకు 1336 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇంకా 30 టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. క్యూలైన్లో తోపులాట.. పంపిణీ నిలిపివేసిన అధికారులు కల్లెడ గ్రామంలో నిరాశతో వెనుదిరిగిన రైతులు -
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా కేయూ ఆడిటోరియంలో మంగళవారం తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారంనుంచి మూడు రోజులపాటు ఈ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. ‘ఇన్నోవేటివ్ స్కిల్స్ ఫర్ ఎంపవర్మెంట్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పోకల్’ అనే థీమ్పై ఈ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా డీఆర్డీఓ మాజీ చైర్మన్, భారత రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ జి.సతీశ్రెడ్డి హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ సైంటిస్టులు, పరిశోధకులు, ప్రొఫెసర్లు, ప్రతినిధులు హాజరై పలు అంశాలపై ప్రసంగించారు. – కేయూ క్యాంపస్ -
నకిలీ వైద్యకేంద్రాల్లో తనిఖీలు
ఎంజీఎం: నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్యకేంద్రాలపై మంగళవారం రాత్రి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యు ల బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తిలక్నగర్ ప్రాంతానికి చెందిన మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ డాక్టర్ అని పోస్టర్ పెట్టుకుని ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడిగా చలామణి అవుతూ రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా అనుమతి లేకుండా త్రివేణి క్లినిక్ నడుపుతున్నాడని తెలిపారు. ఎస్ నయిమ్ అనే వ్యక్తి ఎక్స్రే టెక్నిషియ న్ చదివి హిజమా స్పీకింగ్ థెరపీ పేరుతో అనుమతి లేని డిగ్రీలు పెట్టుకుని పడకలు ఏర్పాటు చేసి సైలెన్ పెట్టడం, అధిక మోతాదు స్టిరాయిడ్స్, యాంటీబయోటిక్స్ రోగులకు ఇస్తున్నట్లు గుర్తించారు. -
మరమ్మతులు చేపట్టండి
బల్దియా పాత భవనాన్ని పరిశీలించిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ రామన్నపేట: ఇటీవల కురిసిన వర్షాలకు బల్దియా ప్రధాన కార్యాలయంలో పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్న వివిధ విభాగాల్లో పైకప్పు (సీలింగ్)లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయ పురాతన భవనంతో పాటు మేయర్ చాంబర్పై భాగంలోని అంతస్తును కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవన స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల కురిసిన వర్షాలకు హెల్త్ విభాగంలోని చాంబర్లో పైకప్పులో నీరు చేరి సీలింగ్ కూలి కంప్యూటర్పై పడిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కమిషనర్ పరిశీలించారు. కూలిన సీలింగ్తో పాటు ప్రమాదకరస్థితిలో ఉన్న సీలింగ్లకు మరమ్మతులు చేయించాలన్నారు. హెల్త్ విభాగంతో పాటు, బర్త్ అండ్ డెత్ విభాగాల్లో మరమ్మతులు పూర్తయ్యే వరకు ఆ విభాగాలను తాత్కాలికంగా మేయర్ చాంబర్ ఉన్న మొదటి అంతస్తులోకి తరలించాలని, పురాతన భవనంలో ప్రమాదకరస్థితిలో ఉన్న ఇతర విభాగాలను గుర్తించి వాటికి కూడా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జి ఎస్ఈ మహేందర్, ఏంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, పర్యవేక్షకులు ఆనంద్ పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
నర్సంపేట రూరల్: సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం నర్సి నాయక్ తండాకు చెందిన అజ్మీరా వీరమ్మ కుమార్తె సునీత (28) పీజీ చదివింది. 18 నెలల క్రితం చక్రంతండాకు చెందిన భూక్యా భద్రుతో సునీతకు వివాహమైంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి సునీతను భద్రు వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం చేస్తుండడంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె పుట్టింటికి వచ్చి ఉంటోంది. ఈ విషయమై పలు మార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ సైతం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర మనోవేదనకు గురైన సునీత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తండాలో వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో సునీత మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అరుణ్కుమార్ బావి నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు తీయించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో మోసగించి పెళ్లి చేసుకున్నాడని మనస్తాపం నర్సినాయక్తండాలో బలవన్మరణం -
కాజీపేట దర్గా ఉత్సవాలు షురూ
కాజీపేట దర్గా కాజీపేట రూరల్: కాజీపేట హజరత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రీస్తుశకం 1865లో సఫర్ 26న హజరత్ భగవంతునిలో లీనమైన దినాన దర్గాను నిర్మించి ఉర్సు ఉత్సవాలను ఆరంభించి నేటికి కొనసాగిస్తున్నట్లు ముస్లిం మతపెద్దలు తెలిపారు. హిజ్రి క్యాలెండర్ ప్రకారం ప్రతీ సఫర్ నెలలో ఉత్సవాలు జరుగుతాయని, హిందు, ముస్లిం సమైక్యతకు హజరత్ సయ్యద్ షా అప్జల్బియాబాని దర్గా ఉత్సవాలు ప్రత్యేకతను చాటుతున్నాయని చరిత్ర చెబుతోంది. దర్గాను దర్శించుకొని పార్థనలతో వేడుకుంటే తమ సమస్యలు, బాధలు పోయి అనుకున్నవి జరుగుతాయని ప్రజలు నమ్మకం. ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి కులమత భేదం లేకుండా లక్షలాది మంది వస్తారని దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా తెలిపారు. రేపు చందనోత్సవం ఉర్సులో భాగంగా బియాబాని సమాధిని రోజ్వాటర్తో శుద్ధి చేస్తారు. 21న గురువారం అర్ధరాత్రి గంధం (సందల్) వేడుక ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది. బడేఘర్ వద్ద ఖుస్రుపాషా కుటుంబీకులు ఆనవాయితీగా స్వయంగా గంధం చెక్కలతో గంధాన్ని తయారు చేస్తారు. ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సందల్ వేడుకలో ఖుస్రు పాషా వెండి పాత్రలో గంధం లేపనం, వస్త్రాలను, రోజ్వాటర్ను గుర్రాలు, బ్యాండ్ మేళతాళాలతో భక్తుల మధ్య ఊరేగింపుగా తీసుకవస్తారు. అనంతరం రోజ్వాటర్తో బియాబాని సమాధిని కడిగి శుద్ధి చేసి గంధం లేపనాన్ని పూసి, పూలమాలలు, పట్టు వస్త్రాలు, సమర్పించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. 22వ తేదీన ఉర్సు ఉత్సవాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారుల సందర్శన, 23వ తేదీన బదావా ముగింపులో ఫకీర్ల విన్యాసాలు ఉంటాయి. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి –సయ్యద్ గులాం అప్జల్ బియాబాని ఖుస్రుపాషా, దర్గా పీఠాధిపతి కాజీపేట దర్గా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహకారంతో తరలివచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం, రోడ్లు, ట్రాఫిక్, డ్రెయినేజీలు, శానిటేషన్, వైద్యం, ఉండేందుకు బస, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశాం. మూడు రోజుల ప్రధాన ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దర్గాను సందర్శిస్తారు. కులమతాలకతీతంగా ఉర్సు ఉత్సవాలు రేపు అర్ధరాత్రి గంధంతో ప్రధాన ఉత్సవం ప్రారంభం 22న ఉర్సు, 23న బదావా (ముగింపు) దేశ నలుమూలలనుంచి రానున్న భక్తులు -
ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువత ఆవిష్కరణలు దేశానికి ఆదర్శమని డీఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సలహా దారు డాక్టర్ సతీష్రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణో త్సవం సందర్భంగా తెలంగాణ అకాడమీ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ మంగళవారం క్యాంపస్లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో సావనీర్, రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సతీష్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇన్నోవేటివ్ స్కిల్స్ అండ్ ఎంపవర్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతీ రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం, ఎఐఎంఎస్, నిట్స్ సెంట్రల్ యూనివర్సిటీలు ఉండడం వల్ల అనేకమంది విద్యార్థులు ఆవిష్కరణలు, పరిశోధనాపత్రాల ప్రచురణలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం 75శాతం విద్యార్థులు విదేశాలనుంచి తిరిగి వచ్చి మాతృభూమిలో ఆవి ష్కరణలు చేస్తున్నారన్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన 90శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. తమ గ్రామం నుంచి తానొక్కడినే ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 1.75మిలియన్ స్టార్టప్స్ వచ్చాయన్నారు. ఏ గ్రా మం, ఏకుటుంబం నుంచి వచ్చామనేది ముఖ్యం కాదని, ఏ ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తున్నామన్నదే ముఖ్యమన్నారు. యువత మైండ్సెట్ మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ సాంకేతికతతో పోటీ పడే మనస్తత్వం రావాలన్నారు. టీబీ నియంత్రణకు నూతన ఔషధాలు టీబీ నియంత్రణకు నూతన ఔషధాల అభివృద్ధి తప్పనిసరి అని హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందుకూరి వెల్లడించారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో ‘టీబీ మెకానిస్టిక్ ఇన్సైట్స్ ఇన్ టూ హౌది పాజిటివ్ పాథోజెన్ సర్వైవ్స్ ఇన్ది హోస్ట్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ట్యూబర్కులోసిస్కు కారణమైన మైక్రోబాక్టీరియం టూ బర్కులోసిస్ (ఎంటీబీ)లో ఔషధ నిరోధకత పెరుగుతుందన్నారు. ఆధునిక రక్షణ సాంకేతికలు అభివృద్ధి దేశ అభివృద్ధిలో రక్షణ, సాంకేతికతల పాత్ర ఎంతో కీలకమని, రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి ప్రభుత్వ పెట్టుబడులు శాస్త్ర సాంకేతిక పురోగతికి ఆధునిక రక్షణ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్రపోషిస్తాయని బెంగళూరు డీఆర్డీఎ ఎల్ఆర్డీఈ డైరెక్టర్ విశ్వం అన్నారు. ‘ఆర్అండ్డీ డిఫెన్స్ టెక్నాలజీస్ అపార్చునిటీస్ అండ్ చాలెంజెస్–ఏ 2047 పర్సెక్టివ్స్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. యువతకు ఆలోచనలే కీలకం డీఆర్డీఓ మాజీ చైర్మన్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు సతీష్రెడ్డి కేయూలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం సావనీర్, రెండు పుస్తకాలు ఆవిష్కరణ కేయూ వీసీ ప్రతాప్రెడ్డి సంక్షేమమే సేవ సైన్స్ లక్ష్యం కావాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. క్వాంటం ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్తో నూతన నూతనశాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తున్నామన్నారు. స్వర్ణోత్సవంలోకి అడిగిడిన సందర్భంగా టాస్తో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహిస్తున్నామన్నారు. కేయూలో రూసా ప్రాజెక్టు కింద రూ.50కోట్లు మంజూరు కాగా, అందుకు సంబంధించిన పరిశోధనలు, ప్రాజెక్టులపై ఆచార్యులు దృష్టి సారించారన్నారు. అక్టోబర్లో కేయూ కె హబ్తో టీహబ్ ఎంఓయూ చేసుకుందని, దీనితో ఇన్నోవేషన్ ఇంక్యూబేషన్, స్టార్టప్లతో ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. కేయూ టాస్ జనరల్ సెక్రటరీ, ఓయూ మాజీ వీసీ సత్యనారాయణ మాట్లాడుతూ యువత సైన్స్ అండ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణల దిశగా ముందుకెళ్లాలని సూచించారు. రిజిస్ట్రార్ రామచంద్రం, తెలంగాణ సైన్స్కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రామ్రెడ్డి, టాస్ ట్రెజరర్ ప్రొఫెసర్ ఎస్ఎంరెడ్డి మాట్లాడారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్తాఫ్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. కేయూలోని ఆడిటోరియం వద్ద సెరికల్చర్ విద్యార్థుల పట్టుపురుగుల ప్రదర్శన ఆకట్టుకుంది. డాక్టర్ సుజాత విశిష్టతను వివరించారు. మల్బరీ నాన్మల్బరీ గూడిపట్టు చీలుకులపై బోధన, పెంపకం, పరిశోధనపై నిర్వహించే అంశాలపై వివరించారు. ఇదిలా ఉండగా.. సెనెట్హాల్లో విద్యార్థులు, సైంటిస్టులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వెంకటేశ్వర్రావు, విజ్ఞాన్ప్రసాద్, రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్గా ఆచార్య జ్యోతి పాల్గొన్నారు. -
అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలి
పరకాల: పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు పాటుపడాలని కోరారు. సోమవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవూరి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గత ప్రభుత్వాల వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని కోరారు. త్వరలో పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ మండలాల సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
యూరియా కొరత.. రోడ్డెక్కిన రైతులు
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను సకాలంలో అందించడం లేదని మండల రైతులు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకోకు దిగారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తే, అవి ఏ మూలకూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కలగుజేసుకుని యూరియా అందించేలా అధికారులతో మాట్లాడించడంతో ఆందోళన విరమించారు. కా ర్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షం
హన్మకొండ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం కారణంగా నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. హనుమకొండ, వరంగల్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆటోమెటిక్ వెథర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లిలో 25.8 మిల్లీ మీటర్లు, దుగ్గొండిలో 23.5, ఖానాపూర్ మండలం మంగలవారిపేటలో 23.5, నల్లబెల్లిలో 23.3, చెన్నారావుపేటలో 22, వరంగల్ పైడిపల్లిలో 18.5, గీసుకొండలో 15.8, గీసుకొండ మండలం గొర్రెకుంటలో 15.5, నర్సంపేట మండలం లక్నేపల్లిలో 15,3, వరంగల్ ఉర్సులో 13.3, నెక్కొండలో 13, కాశిబుగ్గలో 12.5, రాయపర్తిలో 3.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లా దామెరలో 19.8, పరకాలలో 19.8, ఆత్మకూరులో 17.3, దామెర మండలం పులుకుర్తిలో 17, శాయంపేటలో 16.8, నడికూడలో 15.8, కాజీపేటలో 15.5, కమలాపూర్లో 13.3, ధర్మసాగర్లో 12, ఐనవోలులో 12, మడికొండలో 10.3, ఐనవోలు మండలం కొండపర్తిలో 10.3, హసన్పర్తి మండలం నాగారంలో 10, ఎల్కతుర్తిలో 10, భీమదేవరపల్లిలో 9, వేలేరులో 8.8, ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా గుణశేఖర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా గుణశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్న గుణశేఖర్ను రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పోలీస్ కమిషనరేట్కు బదిలీ చేసింది. ఈసందర్భంగా పోలీస్ అధికారులు నూతన డీసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలు అందించారు. కాకతీయ జూపార్కుకు ట్రెయినీ బీట్ ఆఫీసర్లున్యూశాయంపేట: ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లిలో శిక్షణ పొందుతున్న 37వ బ్యాచ్కు చెందిన 40 మంది ట్రెయినీ బీట్ ఆఫీసర్లు ఒక రోజు శిక్షణలో భాగంగా సోమవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జువలాజికల్ పార్క్కు వచ్చారు. వీరికి జూ పార్క్ ఇన్చార్జ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మయూరి, ఇతర పార్క్ అధికారులు చిరుతల సంరక్షణ, తెల్లపులి సంరక్షణ, వాటి ఆహార నియమాలు తదితర అంశాలపై వివరించారు. అలాగే పార్క్లోని శాఖాహార జంతువులు, పక్షులు, ఇతర జంతువుల సంరక్షణ విధానం ఆహారం, పార్క్ సిబ్బంది విధుల గురించి తెలిపారు. ఆధ్యాత్మికతలో జీవించాలిహన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని వారణాసి సంత్ రవిదాస్ ఆశ్రమం పీఠాధిపతి ఆచార్య భరత్భూషణ్దాస్ ఉద్బోధించారు. సోమవారం వెయ్యి స్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా వారిని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతించారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించుకున్న అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ఈఓ అనిల్కుమార్ ఆచార్యులకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను పండ్లను అందజేశారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా చివరి సోమవారం స్వామివారిని సర్పరుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రీ రిపబ్లిక్ డే శిబిరానికి వలంటీర్ల ఎంపికకేయూ క్యాంపస్: గుజరాత్ పాటన్ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 31 నుంచి నిర్వహించనున్న ప్రీ రిపబ్లిక్ డే పరేడ్కు కేయూలో సోమవారం ఎన్ఎస్ఎస్ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డి నేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఎన్ఎస్ఎస్ రీజినల్ కార్యాలయం సూపరింటెండెంట్ సంజయ్, కేయూ పరిధి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆర్.ప్రవీణ్కుమార్, అశోక్ మోరె, పిరాధిక, దత్తాత్రేయ, సతీశ్చంద్ర, వలంటీర్లు పాల్గొన్నారు. -
పరకాల పోలీస్స్టేషన్లో ఒకరి ఆత్మహత్యాయత్నం
● దాడి ఘటనలో ఫిర్యాదుతో మనస్తాపం పరకాల: హనుమకొండ జిల్లా పరకాల పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నడికూడ మండలానికి చెందిన యువకుడు తాళ్ల స్వామిరాజ్తోపాటు మరో ముగ్గురు తనపై హత్యాయత్నం చేశారంటూ అదే గ్రామానికి చెందిన కిన్నెర మల్లికార్జున్ అనే వ్యక్తి పరకాల పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పరకాల పోలీసులు స్వామిరాజ్ను పోలీస్స్టేషన్కు పిలిపించారు. తనపై కావాలనే కుట్ర పూరితమైన కేసు పెట్టారనే మనస్తాపంతో స్వామిరాజ్ తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందును స్టేషన్లోనే తాగాడు. పోలీసులు, ఆయన వెంట వచ్చిన వ్యక్తులు వెంటనే చికిత్స నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. కిన్నెర మల్లికార్జున్ ఇంట్లో తాళ్ల అనిల్కుమార్ అద్దెకు ఉంటున్నాడని తెలిపారు. అనిల్కుమార్కు, అదే గ్రామానికి చెందిన స్వామిరాజ్కు పాత తగాదాలు ఉండడంతో పొలం పనికి వెళ్లివస్తున్న మల్లికార్జున్ను స్వా మిరాజ్ అసభ్య పదజాలంతో దూషించడమే కా కుండా దాడి చేసినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. స్వామిరాజ్ను స్టేషన్కు పిలిపించామని, తాము ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదని స్పష్టం చేశారు. -
మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025
హన్మకొండ: వర్షాకాలంలో విద్యుత్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం ఆదమరిచినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. తడిదుస్తులు ఆరేస్తూ, మోటార్లు ఆన్ చేస్తూ, మరమ్మతుల సమయంలో విద్యుత్ తీగలు పట్టుకుని, తెగిన తీగల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెగిన విద్యుత్ లైన్లు, టాన్స్ఫార్మర్ గద్దెలు ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. ఈక్రమంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సిబ్బంది భద్రతా చర్యలు పాటించకపోవడంతో పాటు ఎల్సీల్లో నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ● తడిసిన విద్యుత్ స్తంభాల స్టే వైర్, సపోర్ట్ వైరును, ట్రాన్స్ఫార్మర్, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకవద్దు. ● దండెం వైర్లను, విద్యుత్ వైర్లను కలుపవద్దు. సపోర్ట్ వైర్లుగా ఇన్సులేటెడ్ జీఐ వైర్లను ఉపయోగించాలి. ● వోల్టేజ్లో హెచ్చుతగ్గులు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి. ● వర్షాల కారణంగా చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. ● వ్యవసాయ నిమిత్తం, గృహాల్లో అతుకులు లేని సర్వీస్ వైరును మాత్రమే ఉపయోగించాలి. ● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎ త్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకవద్దు, వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి. ● ఎవరికై నా పొరపాటున కరెంట్ షాక్ కొడితే దగ్గరలోని వ్యక్తులు షాక్కు గురైన వ్యక్తిని రక్షించాలన్న అత్రుతతో ప్రమాదం బారిన పడిన వ్యక్తిని ముట్టుకోవద్దు. ● రైతులు పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంట్ మోటార్లకు కానీ, పైపులను కానీ, ఫుట్ వాల్వులను ఏమర పాటుతో తాకకూడదు. వ్యవసాయ పంపు సెట్లను, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయాలి. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జీఐ పైపులు, ఫుట్ వాల్వ్లు తాకడం అత్యంత ప్రమాదకరం. ● డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేర్ చేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. ● మోటారు పంపుసెట్లకు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే సొంతగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం, హాని జరగవచ్చు. మోటారు రిపేర్ తెలిసిన వారిచేతనే చేయించాలి. ● గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్లను సంప్రదించి వారి సేవలను పొందాలి. ● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు అందుబాటులో వచ్చిన ప్రస్తుత తరుణంలో వాటిని వినియోగించడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ● విద్యుత్ పరికరాలు, వైరింగ్, వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తింపు కలిగినవి వాడాలి.విద్యుత్ వినియోగంలో అప్రమత్తత అవసరం ఆదమరిస్తే అంతే సంగతులు సొంతంగా మరమ్మతు చేయవద్దు.. విస్తృత అవగాహన కల్పిస్తున్న అధికారులువిద్యుత్ వినియోగదారులు : 4,86,266ఇందులో గృహ విద్యుత్ వినియోగదారులు : 3,61,540 వ్యవసాయ వినియోగదారులు : 67,573విద్యుత్ సబ్స్టేషన్లు : 74డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు : 12,489 వినియోగదారులు : 4,20,925ఇందులో గృహ వినియోగదారులు : 2,99,091వ్యవసాయ వినియోగదారులు : 70,853విద్యుత్ సబ్స్టేషన్లు : 76డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు : 12,467జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సర్కిల్లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించి విద్యుత్ ప్రమాదాల నివారణకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కృషి చేస్తోంది. పొ లం బాట ద్వారా రైతులకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లో సంస్థ చేయాల్సిన విద్యుత్ పనులు సొంతగా చేయొద్దని అధికారులు చెబు తున్నారు. భద్రతపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సిబ్బందికి అన్ని రకాల భ ద్రత పరికరాలు హెల్మెట్, గ్లౌవ్స్, పోర్టబుల్ ఎర్తింగ్, షార్ట్ సర్క్యూట్ కిట్లు, సేఫ్టీ షూస్, ఇన్సులేటె డ్ టూల్స్, ఓల్టేజ్ డిటెక్టర్ వంటివి అందించారు. -
అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సమస్యలు వస్తే ఏఈ, సిబ్బందికి తెలియజేయాలి. ప్రతీ నెల జారీ చేసే బిల్ కమ్ నోటీస్పై ఏఈ, లైన్మెన్ ఫోన్ నంబర్ ఉంటుంది. వినియోగదారులు సొంతంగా మరమ్మతులు చేసుకోకుండా విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించి వారిచే సమస్యను పరిష్కరించుకోవాలి. నిపుణులైన ఎలక్ట్రీషియన్తో విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలి. – పి.మధుసూదన్రావు, ఎస్ఈ, హనుమకొండ సర్కిల్● -
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్తో శాసీ్త్రయ దృక్పథం
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువతలో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా టాస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా యూనివర్సిటీలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్), హైదరాబాద్ సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్. మోహన్రావు తెలిపారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఏ రంగంలో రాణించాలన్నా సైన్స్ ముఖ్యమన్నారు. ఆ దిశగా విద్యార్థుల్లో సైన్స్ను ప్రమోట్ చేసేందుకు, జిజ్ఞాస పెంచేందుకు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో సైంటిస్టులు, విద్యావేత్తలు నూతన ఆవిష్కరణలపై శాసీ్త్రయ సవాళ్లు, పురోగతులపై చర్చించనున్నారన్నారు. కేయూ స్వర్ణోత్సవంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలో అకాడమిక్పరంగా పర్స్పెక్టివ్ మారాలన్నారు. ఇన్నోవేషన్స్, ఇంక్యుబేషన్, స్టార్టప్స్ ఎంట్రప్రెన్యూర్స్ రావాలన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో భాగంగానే తెలంగాణ సైన్స్కాంగ్రెస్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి 750 అబ్స్ట్రాక్ట్స్ వచ్చాయని, 700 మంది ప్రతినిధులు రానున్నట్లు తెలిపారు. కేయూ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 9గంటలకు సైన్స్కాంగ్రెస్ ప్రారంభ సమావేశంలో వీసీ ప్రతాప్రెడ్డి అధ్యక్షతన డీఆర్డీఓ మాజీ చైర్మన్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ జి.సతీశ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో టాస్ జనరల్ సెక్రటరీ, ఓయూ మాజీ వీసీ ఎస్.సత్యనారాయణ, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, టాస్ ట్రెజరర్ ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి పాల్గొన్నారు. నేటినుంచి మూడు రోజులపాటు నిర్వహణ టాస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్రావు యూనివర్సిటీ ఆవిర్భవించి 49 ఏళ్లు పూర్తి నేడు 50వ వసంతంలోకి.. -
రైతులకు యూరియా తిప్పలు
కమలాపూర్: రైతులను యూరియా కష్టాలు వెంటా డుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకుని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నా యూరియా దొరకడం గగనంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు పూర్తయి యూరియా అత్యవసరమైంది. కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సోమవారం 888 బస్తాల యూరియా రాగా, సమాచారం అందుకున్న రైతులు వేకువ జామునుంచే పీఏసీఎస్ గోదాం వద్దకు చేరుకున్నారు. సుమారు 1,500 మందికి పైగా రైతులు వర్షంలోనే బారులుదీరగా.. మరి కొందరు క్యూలైన్లో చెప్పులు పెట్టారు. గత ఐదారు రోజు లుగా యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో వచ్చిన స్టాక్లో సగానికిపైగా పోలీసు పహారాలో పంపిణీ చేశారు. తర్వాత ఈ–పాస్ సర్వర్ మొరాయించడంతో సు మారు 300 బస్తాల యూరియా పంపిణీ నిలిచిపోయింది. అందుబాటులో ఉన్న యూరియా వరకు రైతులకు టోకెన్లు జారీ చేసి మంగళవారం పంపిణీ చేస్తామని చెప్పి పంపించారు. యూరియా, టోకెన్లు దొరకని పలువురు రైతులు నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ఎండనకా, వాననక గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఓ వైపు రైతుల బారులు.. మరో వైపు క్యూలైన్లో చెప్పులు ఈ–పాస్ పనిచేయక సగంలోనే నిలిచిన పంపిణీ -
పాల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి?
హన్మకొండ చౌరస్తా: నగరంలోని ములుగురోడ్ సమీపంలో గల ప్రభుత్వ రంగ సంస్థ విజయ డె యిరీ యూనిట్ను సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం తనిఖీ చేసింది. ఈ డెయిరీ అధికారుల తీరుపై ఇటీవల వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం ఎండీ ప్రత్యేక కమిటీని నియమించినట్లు తెలిసింది. ఆయన ఆదేశాలతో నగరానికి చేరుకున్న ప్రత్యేక కమిటీ ఏడాదికాలంగా జరిగిన పాల అమ్మకాలు, సేకరణ, రికార్డులను పరిశీలించారు. ఉదయం 11 గంటలకు డెయిరీకి చేరుకున్న అధికారులు సాయంత్రం 4గంటల వరకు విచారణ చేపట్టారు. తగ్గిన అమ్మకాలు విజయ డెయిరీ వరంగల్ పరిధిలో సివిల్ మార్కెట్లో పాల అమ్మకాలు గతేడాది సుమారు ఆరు వేల లీటర్లు ఉండగా, ఈ ఏడాది సగానికి పైగా పడిపోయినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తె లిసింది. అంతేకాకుండా పాడిరైతులకు, డెయిరీ అ ధికారులకు దూరం పెరగడంతో సేకరణ సైతం గ ణనీయంగా పడిపోయింది. దీనిపై విచారణ అధికా రులు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెండింగ్లో లక్షల రూపాయలు పాల అమ్మకాల డబ్బులు లక్షల్లో పెండింగ్లో ఉండడంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పాల అమ్మకాల కోసం గత ఏడాది ఓ డిస్ట్రిబ్యూటర్ను నియమిస్తే సదరు వ్యక్తి మధ్యలోనే చేతులెత్తేశాడు. డిస్ట్రిబ్యూటర్ ద్వారా డెయిరీకి చెల్లించాల్సిన సుమారు రూ.30 లక్షల వరకు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం కొత్తగా మరో డిస్ట్రిబ్యూటర్కు అమ్మకాల బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. సిబ్బందితో సమావేశం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక కమిటీ సభ్యులు.. వరంగల్ డెయిరీ సిబ్బందితో రెండు గంటలపాటు సమావేశమయ్యారు. పాల అమ్మకాలను పెంచుకోవడంతోపాటు పాడిరైతులకు మరింత చేరువై సేకరణను ఎలా పెంచుకోవాలి అనే అంశాలపై సిబ్బంది నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. సమష్టిగా పనిచేసి డెయిరీ ప్రతిష్టను పెంచుకుందామని సిబ్బందికి సూచించారు. విచారణ కమిటీలో విజయ డెయిరీ వరంగల్ ప్రత్యేక అధికారి, జనరల్ మేనేజర్లు మల్లయ్య, కవిత, ప్రొక్యూర్మెంట్ అధికారి మధుసూదన్రావు, ఆర్ఎస్ఎం ధన్రాజ్ ఉన్నారు.వరంగల్ పాలు.. ఖమ్మంలో ఎలా అమ్మారు? విజయ డెయిరీలో ప్రత్యేక కమిటీ విచారణ పాల డబ్బులు పెండింగ్లో ఉండడంపై ఆరావరంగల్ యూనిట్ పాల ప్యాకెట్లు గత నెలలో ఖమ్మంలో అమ్ముతుండగా అక్కడి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని ఆధారాలతో సహా ఉ న్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయ ంపైనా వరంగల్ అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 92 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా భూసమస్యలు 33, జీడబ్ల్యూఎంసీ 18, గృహానిర్మాణం 9, వైద్య, ఆరోగ్య, విద్యాశాఖకు సంబంధించి 4, ఇతర శాఖలకు సంబంధించినవి 24 ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి.. నా వ్యవసాయ బావి పక్కనే ఓ వ్యక్తి బావిని తవ్వాడు. వాల్టా చట్టం ప్రకారం బావికి, బావికి మధ్య దూరం 50 మీటర్లు ఉండాలి. చట్టాన్ని అతిక్రమించి బావిని తవ్వడంతో నా బావి ఎండిపోయింది. అతడిపై చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలి. – పి.అశోక్రెడ్డి, కొమ్మాల, గీసుకొండఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు ఇవ్వాలి వర్థన్నపేట మండల కేంద్రంలో 2021లో జాతీయ రహదారి కోసం రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్లు కోల్పోయాం. పది మందికి పట్టాలు ఇచ్చారు. ఇంకా 17 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. భూమి ఉన్నా అధికారులు పట్టాలు ఇచ్చేందుకు నిర్లక్ష్యం వహిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. మేము షెడ్యూల్ కులాలకు చెందిన వారం. మాకు ఉండటానికి ఇళ్లు లేవు. మాకు న్యాయం చేయాలి. – వర్థన్నపేట వాసులురిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూస్తున్నాడు.. నాకు రికార్డుల్లో 21 గుంటల భూమి ఉంది. తెలియకుండా మా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడికి ఎలాంటి హక్కులేదు. నాకు న్యాయం చేయాలి. – పి.బస్వయ్య, జీజీఆర్ పల్లి, శివారు మైబుపల్లి, నర్సంపేట ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద -
డెంగీ డేంజర్బెల్స్
సాక్షి, వరంగల్: జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 18 వరకు 56 డెంగీ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోనే 28వరకు కేసులు అంటే దాదాపు 50 శాతం కేసులు ఉండడం నగరవాసులను కలవరానికి గురిచేస్తోంది. అలాగే జిల్లావ్యాప్తంగా ఒక్క ఆగస్టులోనే 18వరకు డెంగీ కేసులు వస్తే వీటిలో తొమ్మిది కేసులు వరంగల్ నగరం నుంచే ఉండడం ఇక్కడా వ్యాధి తీవ్రత ఎలా ఉందో గణాంకాలే చెబుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వరంగల్ నగరంలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉండడంతో దోమలు విజృంభించి వ్యాధి వ్యాప్తి ఎక్కువవుతోంది. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. డెంగీ దోమలు పెరిగేందుకు కారణమయ్యే మంచినీటి నిల్వలు, తాగేసిన కొబ్బరి బొండాలు, ఖాళీ సీసాలు, పూలకుండీలు, పాతటైర్లు అలాగే వదిలేయడంతో సమస్య తీవ్రమవుతోంది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం లోపించడం, బ్లీచింగ్, ఫాగింగ్ చర్యలు నామమాత్రంగా ఉండడంతో దోమల వృద్ధి పెరిగింది. అయితే జిల్లా వైద్యారోగ్య గణాంకాలు డెంగీ కేసుల సంఖ్య 56 అ ని చెబుతున్నా, ఇంకా లెక్కలోకి రాని డెంగీ కేసులు ఎక్కువగానే ఉన్నట్టు పరిస్థితిని బట్టి తెలుస్తోంది. సత్వర చికిత్స కోసమంటూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన వారు ఉన్నారు. దోమల వ్యాప్తితో రోగాలు వస్తున్నాయని, దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడంటే.. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 18 వరకు నమోదైన డెంగీ కేసుల్లో 56 ఉంటే వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో సగం వరకు ఉన్నాయి. బానోజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు, చెన్నారావుపేట పీహెచ్సీలో మూడు, దుగ్గొండి పీహెచ్సీలో ఐదు, ఖానాపూర్ పీహెచ్సీలో ఎనిమిది, మేడిపల్లి పీహెచ్సీలో ఒకటి, నెక్కొండ పీహెచ్సీలో రెండు, పర్వతగిరి, రాయపర్తి, సంగెం పీహెచ్సీలలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్లో హాట్ స్పాట్లు ఎక్కడంటే.. వరంగల్ నగరంలో కీర్తినగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అత్యధికంగా ఆరు డెంగీ కేసులు నమోదయ్యాయి. దేశాయిపేట యూపీహెచ్సీలో మూడు, ఫోర్ట్ వరంగల్ యూపీహెచ్సీలో రెండు, రంగశాయిపేట యూపీహెచ్సీలో రెండు, ఎంజీఎంలో మూడు, సీకేఎం యూఎఫ్డబ్ల్యూసీలో ఐదు, చింతల్ యూపీహెచ్సీలో ఒకటి, కాశీబుగ్గ యూపీహెచ్సీలో ఒకటి, పైడిపల్లి యూపీహెచ్సీలో ఒకటి, గీసుగొండ పీహెచ్సీలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆగస్టులో నమోదైన 18 డెంగీ కేసుల్లో తొమ్మిది కేసులు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. కీర్తినగర్ యూపీహెచ్సీలో నాలుగు, రంగశాయిపేట యూపీహెచ్సీలో ఒకటి, పైడిపల్లి యూపీహెచ్సీలో ఒకటి, సీకేఎం యూఎఫ్డబ్ల్యూసీలో ఒకటి, ఎంజీఎంలో ఒకటి, గీసుగొండ పీహెచ్సీలో ఒకటి నమోదైంది. డెంగీ పెరుగుతోంది ఇలా.. జిల్లాలో యాభై దాటేసిన కేసులు జనవరి నుంచి ఇప్పటివరకు 56 .. ఆగస్టులోనే అత్యధికంగా 18 .. వీటిలో సగానికిపైగా గ్రేటర్ వరంగల్లోనే వర్షాలతో అమాంతం పెరుగుతున్న కేసులు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యాధికారులులక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి..డెంగీ సాధారణ జ్వరంగా మొదలవుతుంది. 100 నుంచి 104 డిగ్రీల ఫారన్హీట్ వరకు జ్వరం ఉంటుంది. చలి, వణుకు, తీవ్రమైన తలనొప్పి, కంటి వెనుకభాగంలో నొప్పి, ఒళ్లు నొప్పులు, నడుంనొప్పి, శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. రెండు మూడురోజులకు మించి ఈ లక్షణాలు ఉంటే డెంగీ జ్వరంగా భావించాలి. తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలోని వైద్యుడిని సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. డెంగీ పాజిటివ్ అని తేలినా హైరానా పడొద్దు. డెంగీ వచ్చినప్పుడూ ప్లేట్లెట్స్ పడిపోవడం సర్వసాధారణం. కౌంట్ సంఖ్య చూసి ఆందోళన చెందొద్దు. వైద్యుడి సూచించి మేరకు మెడిసిన్ వాడాలి. – డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్యారోగ్య విభాగాధికారి -
యూరియా రైతులందరికీ అందాలి
న్యూశాయంపేట: వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావుతో కలిసి యూరియా, ఎరువుల లభ్యతపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ..లక్షా అరవై వేల మంది రైతులకు సరిపడా 20వేల588 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు కేటాయించగా ఇప్పటివరకు 19వేల545 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. ఇంకా ప్రైవేటు, పీఏసీఎస్లో వెయ్యి 43 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని సెంటర్లపై వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీసీపీ అంకిత్కుమార్, జిల్లా అధికారులు రామిరెడ్డి, అనురాధ, సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
స్థానిక సమస్యలు పరిష్కరించాలి
నర్సంపేట: స్థానిక సమస్యలపై సర్వేలు చేసి సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. ఈమేరకు పట్టణంలో సీపీఎం జిల్లా స్థాయి రూరల్ ప్రాంత వర్క్షాప్ సోమవారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కోరబోయిన కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక, వీధి లైట్లు కుక్కలు, కోతుల సమస్యలతో ఇలాంటి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి బాబు, భూక్య సమ్మయ్య, నమిండ్ల స్వామి, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య, మండల నాయకులు అక్కపెల్లి సుధాకర్, పుచ్చకాయల నర్సింహారెడ్డి, ఎస్కే అన్వర్, పెండ్యాల సారయ్య, కందికొండ రాజు, నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
నర్సంపేట: ఇంటర్నేషనల్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్లోని ఓ సిటీ గ్రౌండ్లో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో నర్సంపేట పట్టణానికి చెందిన విజ్డమ్ విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈసందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20, 21న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీట్ హైస్కూల్లో జరిగే పోటీల్లో పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎ.చందన, తొమ్మిదో తరగతికి చెందిన బి.రాంప్రసాద్ పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో రాణించడం తమ లక్ష్యమని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభకనబర్చిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇన్చార్జి నాజియాఇక్బాల్, వైస్ప్రిన్సిపల్ ప్రకాశ్, ప్రీస్కూల్ ప్రిన్సిపల్ ఫహీంసుల్తానా, కోచ్ రాజేష్, మధు, ప్రశాంత్కుమార్, రియాజ్లతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. -
పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాలి
న్యూశాయంపేట: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాపన్నగౌడ్ 375వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పోరాడిన నేతగా పాపన్న పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు విజయలక్ష్మి, రాంరెడ్డి, పుష్పలత, 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ, గౌడ సంఘం నాయకులు రమేశ్, వెంకటేశ్వర్లు, లక్ష్మినారాయణ, రాందాస్, యాదగిరి, రాజు,రాజేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వానల కాలం.. ప్రాణాలు పదిలం
హన్మకొండ: వర్షాకాలంలో విద్యుత్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం ఆదమరిచినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. తడిదుస్తులు ఆరేస్తూ, మోటార్లు ఆన్ చేస్తూ, మరమ్మతుల సమయంలో విద్యుత్ తీగలు పట్టుకుని, తెగిన తీగల కారణంగా తరచూ వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తెగిన విద్యుత్ లైన్లు, టాన్స్ఫార్మర్ గద్దెలు ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. ఈక్రమంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పాటించాలి. విద్యుత్ సిబ్బంది భద్రతా చర్యలు పాటించకపోవడంతో పాటు ఎల్సీల్లో నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో అవగాహన.. జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సర్కిల్లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించి విద్యుత్ ప్రమాదాల నివారణకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కృషి చేస్తోంది. పొలం బాట ద్వారా రైతులకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లో సంస్థ చేయాల్సిన విద్యుత్ పనులు సొంతగా చేయొద్దని అధికారులు చెబుతున్నారు. భద్రతపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సిబ్బందికి అన్ని రకాల భద్రత పరికరాలు హెల్మెట్, గ్లౌవ్స్, పోర్టబుల్ ఎర్తింగ్, షార్ట్ సర్క్యూట్ కిట్లు, సేఫ్టీ షూస్, ఇన్సులేటెడ్ టూల్స్, వోల్టేజ్ డిటెక్టర్ వంటివి అందించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● తడిసిన విద్యుత్ స్తంభాల స్టే వైర్, సపోర్ట్ వైరును, ట్రాన్స్ఫార్మర్, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకవద్దు. ● దండెం వైర్లను, విద్యుత్ వైర్లను కలుపవద్దు. సపోర్ట్ వైర్లుగా ఇన్సులేటెడ్ జిఐ వైర్లను ఉపయోగించాలి. ● వోల్టేజ్లో హెచ్చుతగ్గులు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి. ● వర్షాల కారణంగా చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. గమనించాలి. ● వ్యవసాయ నిమిత్తం, గృహాల్లో అతుకులు లేని సర్వీస్ వైరును మాత్రమే ఉపయోగించాలి. ● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకవద్దు, వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేయాలి. ● ఎవరికై నా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్కు గురైన వ్యక్తిని రక్షించాలన్న అత్రుతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోవద్దు. ● రైతులు పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంట్ మోటార్లకు కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను ఏమరపాటుతో తాకకూడదు. వ్యవసాయ పంపు సెట్లను , స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ● డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేర్ చేయడం, ఎబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. ● మోటారు పంపుసెట్లకు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే సొంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం, హాని జరగవచ్చు. ● గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్లను సంప్రదించి వారి సేవలను పొందాలి. ● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు అందుబాటులో వచ్చిన ప్రస్తుత తరుణంలో వాటిని వినియోగించడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ● విద్యుత్ పరికరాలు, వైరింగ్, వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తింపు కలిగినవి వాడాలి. జాగ్రత్తగా ఉండాలి... రోజు వర్షం కురుస్తున్నందున ప్రజలు విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు నివారించడానికి సమష్టి కృషి అవసరం. విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలి. – కాసిడి గౌతంరెడ్డి, ఎస్ఈ, వరంగల్ సర్కిల్ వరంగల్ జిల్లాలో.. వినియోగదారులు 4,20,925, ఇందులో గృహ వినియోగదారులు 2,99,091 వ్యవసాయ వినియోగదారులు 70,853 విద్యుత్ సబ్స్టేషన్లు 76 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 12,467 విద్యుత్ వినియోగంలో అప్రమత్తత అవసరం ఆదమరిస్తే అంతే సంగతులు సొంతంగా మరమ్మతులు చేయవద్దు.. విస్తృత అవగాహన కల్పిస్తున్న అధికారులు -
రేపు జాబ్మేళా
న్యూశాయంపేట: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఉపాధి కల్ప నాధికారి వరంగల్ ఆధ్వర్యంలో ప్రథమ్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో ఈనెల 20న బుధవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్మేళా హనుమకొండ ములుగురోడ్డులోని ఎంప్లాయ్మెంట్(ఐటీఐ క్యాంపస్) కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 70931 68464 నెంబర్లోగాని, కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా గుణశేఖర్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా గుణశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్న గుణశేఖర్ను రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పోలీస్ కమిషనరేట్కు బదిలీ చేసింది. ఈసందర్భంగా పోలీస్ అ ధికారులు నూతన డీసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలు అందించారు. విద్యార్థి అప్పగింతగీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండకు చెందిన ఓ విద్యార్థి ఆకతాయి వేషాలు ఉపాధ్యాయులనే కాదు అతడి తల్లిదండ్రులను బురడీ కొట్టించాయి. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మనుగొండకు చెందిన ఓ విద్యార్థి(12) తన గ్రామంలో ఏడో తరగతి వరకు చదివి 8వ తరగతిలో సమీపంలోని గంగదేవిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేరాడు. అతడు గుండె, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తరచుగా ఉపాధ్యయులకు చెప్పేవాడు. సదరు విద్యార్థి పాఠశాల వరకు వచ్చి తరగతి గదులకు వెళ్లకుండా బయటతిరిగి బడి ముగిసే సమయానికి తోటి విద్యార్థులతో కలిసి ఇంటికి వెళ్లేవాడు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ కుమారుడు బడికివెళ్లి వస్తున్నాడనే భ్రమల్లో ఉండేవారు. సోమవారం అతడు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో సదరు విద్యార్థి తండ్రి కంబాల రంజిత్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆచూకీ కోసం రెండు బృందాలతో గాలింపు జరిపి విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. ఆధ్యాత్మికతలో జీవించాలి హన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని వారణాసి సంత్ రవిదాస్ ఆశ్రమం పీఠాధిపతి ఆచార్య భరత్భూషన్దాస్ ఉద్బోధించారు. సోమవారం వెయ్యి స్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా వారిని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ ఆలయమర్యాదలతో స్వాతించారు. స్వామివారిని రుద్రాభిషేకం నిర్వహించుకున్న అనంతరం ఆలయనాట్యమండపంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ఈఓ అనిల్కుమార్ ఆచార్యులకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను పండ్లను అందజేశారు. శ్రావణమాసోత్సవాల్లో భాగంగా చివరి సోమవారం స్వామివారిని సర్పరుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే శిబిరానికి ఎంపిక కేయూ క్యాంపస్: గుజరాత్ పాటన్ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 31 నుంచి నిర్వహించనున్న ప్రీ రిపబ్లిక్ డే పరేడ్కు కేయూలో సోమవారం ఎన్ఎస్ఎస్ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఎన్ఎస్ఎస్ రీజినల్ కార్యాలయం సూపరింటెండెంట్ సంజయ్, కేయూ పరిధి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆర్.ప్రవీణ్కుమార్, అశోక్ మోరె, పిరాధిక, దత్తాత్రేయ, సతీశ్చంద్ర, వలంటీర్లు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
ఖానాపురం: సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్ సూచించారు. ఈమేరకు మండల కేంద్రంలోని పీహెచ్సీని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. ఐనపల్లిలోని ఎంజేపీలో జరుగుతున్న కిషోరరక్ష కార్యక్రమాన్ని పరిశీలించి విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను తప్పకుండా అమలయ్యే చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ప్రతీ ఒక్కరు కాచిచల్లార్చిన నీటిని తాగాలన్నారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్లు కల్పన, సునీత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజయ్య, సిబ్బంది అన్నపూర్ణ, దివ్య, సతీశ్, భాస్కర్, జ్యోతి, ప్రిన్సిపల్ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టండి
రామన్నపేట: నగరం ముంపునకు గురవకుండా ప్రణాళిక ప్రకారం.. శాశ్వత చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అఽథారిటీ కమిషనర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్ వివిధ విభాగాల అధికారులతో కలిసి భద్రకాళి బండ్, చిన్న వడ్డేపల్లి చెరువు ఐసీసీసీ కేంద్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సమర్థంగా వరద ముంపును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు. భద్రకాళి చెరువు సమీపంలో ముంపునకు గురయ్యే ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీల పరిస్థితి తెలుసుకున్నారు. 12 మోరీల వద్ద వరద నీటి ప్రవాహం పరిశీలించారు. అనంతరం చిన్నవడ్డేపల్లి చెరువును పరిశీలించి ముంపునకు గురయ్యే ప్రాంతాలైన ఎస్ఆర్ నగర్, సాయిగణేశ్ కాలనీ, ప్రాంతాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడం, తదితర విషయాలు తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి నిర్మాణాలు చేపట్టాలి భద్రకాళి బండ్ ఇన్ లెట్ వద్ద వాస్తవ సామర్థ్యం? ఇన్ ఫ్లో? ఔట్ ఫ్లో? తదితర విషయాల అధ్యయనానికి ఇరిగేషన్, బల్దియా, ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల సమన్వయం చేసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు నిలువ సామర్థ్యాన్ని పెంచి వరద ముంపునకు గురికాకుండా నీటిని నిలువరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ కేంద్రం పరిశీలన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని శశాంక పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో నగరంలోని ప్రతీ చెరువుకు సంబంధించి నీటి ప్రవాహం ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో సమాచారం ప్రతీ వార్డును ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా సమాచారం అందజేయాలన్నారు. ఐసీసీసీకి అనుసంధానం చేస్తూ వాతావారణంలో సంభవించే మార్పులను అలారం ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ సిటీ ప్లానర్లు మహేందర్, రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ రవికుమార్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ తదితరులున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అఽథారిటీ కమిషనర్ శశాంక ముంపు ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్వి చిల్లర మాటలు
హన్మకొండ: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అజ్ఞానపు, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. ఆదివారం హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మేడిగడ్డ బరాజ్ను ఎవరో బాంబులతో పేల్చారు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడడం అవివేకం అన్నారు. కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనుల కారణంగా కూలిపోయింది తప్ప బాంబు పేలుళ్లతో కాదన్నారు. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఆర్ఎస్ ప్రవీణ్ తస్మాత్ జాగ్రత్త! నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. అని కొండేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్రెడ్డి ఇప్పుడు ఒక్క చర్య తీసుకోకపోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి నిదర్శనమన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంప్ర మధు, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మార్టిన్ లూథర్, నాయకులు జన్ను మధు, ఎన్.శివకృష్ణ, వెంకటేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బరాజ్ను బాంబులతో పేల్చారనడం అవివేకం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ -
బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు అందాలి
న్యూశాయంపేట: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీ ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలు అందా లని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. హనుమకొండ ములుగురోడ్డులోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్లో బీసీ ముస్లిం ఏ, బీ, ఈగ్రూప్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీన ర్ డాక్టర్ రాజ్మహ్మద్ అధ్యక్షతన ఆదివారం జరిగి న రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో ఇప్పటికీ బీసీ ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. వరంగల్ నుంచి హక్కుల సాధన కోసం బీసీ ముస్లింల ఓ అడుగు ముందుకు పడడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యఅతిథిగా రావాల్సిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు ఫోన్లో తమ మద్దతు తెలిపారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ప్రొఫెసర్ వీరస్వామి, టీఎస్ మెసా తోఫఖుర్రహమా న్, అబ్దుల్ సుభాన్, ఖాలిద్ సయిద్, సిరాజ్ అ హ్మద్, అజీజ్పాషా, సర్వర్మొహినుద్దీన్, ముస్లిం ఉపకులాల ప్రముఖులు అబ్దుల్ ఆలమ్, సైదులు పాషా, యాకూబ్పాషా, రఫీ తదితరులున్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ -
వెడ్డింగ్ కలెక్షన్ ఫ్యాషన్ షో
నయీంనగర్: నయీంనగర్ ప్రెసిడెంట్ దాబాలో ఆదివారం వెడ్డింగ్ కలెక్షన్ ఫ్యాషన్ షో నిర్వహించారు. తెలంగాణ ఫ్యాషన్ కార్నివాల్ ప్రీ ఈవెంట్ గౌస్ స్టూడియో వరంగల్ మోడల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ పసునూరి దయాకర్, మోడల్ సెలెక్షన్ జ్యూరీగా వంశీ పాల్గొన్నారు. తెలంగాణ బ్రైడల్ ఫ్యాషన్ రన్వే షో నిర్వాహకుడు గౌస్ మాట్లాడుతూ.. ఈ ఫ్యాషన్ షోలో ఆరుగురు డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు డిజైన్ చేసిన వెడ్డింగ్ థీమ్లను మోడల్స్ ప్రదర్శించారని తెలిపారు. ఈ ఫ్యాషన్ షోలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి 50 మంది మోడల్స్ పాల్గొన్నట్లు తెలిపారు. సెలెక్ట్ అయిన మోడల్స్తో వెడ్డింగ్ కలెక్షన్ షోకేస్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫైనల్ ఈవెంట్ సెప్టెంబర్ 14న ఉంటుందని, ఫైనల్ ఈవెంట్లో డిజైనర్ల సహకారంతో మోడల్స్ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో మోడల్స్, మేకప్ ఆర్టిస్టులు, యువతులు, ఔత్సాహికులు, ఫ్యాషన్ ప్రియులు పాల్గొన్నారు. ప్రారంభించిన మాజీ ఎంపీ పసునూరి దయాకర్ వివిధ జిల్లాల నుంచి హాజరైన 50 మంది మోడల్స్ -
ఇంకా ఇన్స్పైర్ కాలేదు!
‘ఇన్స్పైర్ మనక్’ అవార్డుల నామినేషన్లు వేయించేందుకు పెద్దగా ఆసక్తి చూపని హెచ్ఎంలు, టీచర్లుగుంతలమయమైన ఖమ్మం బ్రిడ్జి జంక్షన్ రోడ్డువిద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డు మనక్ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో.. భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్టీ), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ద్వారా ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డుల మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, వివిధ గురుకులాల్లోని ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలల నుంచి ప్రాజెక్టుల రూపకల్పనకు ఐదు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు మహబూబాబాద్ జిల్లా మినహా మిగిలిన ఐదు జిల్లాల్లో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మహబూబాబాద్ జిల్లా 789 నామినేషన్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు ఉండడంతో ఇంకా నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది. సైన్స్ టీచర్లు ఎక్కువ శ్రద్ధ వహిస్తేనే.. ఉమ్మడి జిల్లాలోని డీఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు ఇప్పటికే అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించారు. ఇన్స్పైర్ అవార్డులకు నూతన ఆవిష్కరణల ప్రాజెక్టులతో విద్యార్థులతో నామినేషన్లు వేయించాలని ఆదేశించారు. నామినేషన్లు చేయించేందుకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టెక్నికల్ టీంలు కూడా ఏర్పాటుచేశారు. పాఠశాలల్లో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ప్రధానంగా సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే నామినేషన్లు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎంలు, టీచర్లలో కొంత నిర్లిప్తత కూడా కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం డీఈఓ, సైన్స్ అధికారి ప్రత్యేక దృష్టిసారించడంతో నామినేషన్లు బాగా అయ్యాయని తెలుస్తోంది. హెచ్టీటీపీఎస్//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్–డీఎస్టీ.గౌట్.ఇన్ ద్వారా లేదా గూగుల్ ప్లేస్లోర్లో ఇన్స్పైర్ మనక్యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. స్కూల్ అథారిటీ ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి విద్యార్థుల ఆవిష్కరణ వివరాలను నమోదు చేయడంతోపాటు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. పాఠశాలల హెచ్ఎంలు, గైడ్ టీచర్ల సహకారంతో విద్యార్థులతో ప్రాజెక్టులకు సంబంధించి నామినేషన్లు పంపించవచ్చు. విద్యార్థి సృజనాత్మక ఆలోచన లేదా ప్రాజెక్టు సంక్షిప్త నివేదిక రెండువేల పదాలకు మించకూడదు. విద్యార్థి ఆధార్ కార్డుతో అనుసంధానించిన ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద్వారా జారీచేసిన పొదుపు ఖాతా పాస్పుస్తకం, విద్యార్థి పాస్ఫొటో, వివరాలు, ఫోన్నంబర్, గైడ్ టీచర్ వివరాలు కూడా ఉండాలి. ఇన్స్పైర్ అవా ర్డులకు నామమాత్రంగానే నా మినేషన్లు పంపారు. విద్యార్థుల్లోని ప్రతిభ వె లికితీసేందుకు ఒక చక్కటి వేది క ఇన్స్పైర్ అవార్డు మనక్. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. అందుకు ఒక ఐ డియాతో ప్రాజెక్టుకు సంబంధించి సంక్షిప్తంగా వివరాలు పంపించాలి. హెచ్ఎంలు, టీ చర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సెప్టెంబర్ 15 లోగా విద్యార్థులతో నామినేషన్లు పంపాలి. – ఎస్.శ్రీనివాసస్వామి, హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి జిల్లా నామినేషన్ల సంఖ్య మహబూబాబాద్ 789హనుమకొండ 30వరంగల్ 45ములుగు 30 భూపాలపల్లి 10జనగామ 25 789తో మహబూబాబాద్ రాష్ట్రంలోనే మొదటి స్థానం మిగిలిన జిల్లాల్లో తక్కువగా వేసిన విద్యార్థులుఇన్స్పైర్ అవార్డుకు ప్రాజెక్టు రూపకల్పన చేసి వెబ్సైట్ ద్వారా పంపితే ఎంపికై న విద్యార్థికి రూ. 10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. విద్యార్థి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి నమూనా రూపొందించేందుకు, ప్రయాణ ఖర్చులకు ఈ డబ్బులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాస్థాయిలో ఇన్స్పైర్ అవార్డుల ప్రాజెక్టులకు సంబంధించిన నమూనా ప్రదర్శనలు వచ్చే ఏడాది నవంబర్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి ఇన్స్పైర్, ఇందులో ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే జపాన్ వంటి దేశాల పర్యటనకు కూడా ఎంపిక చేస్తారు. అలా ఎంపికై న వారికి రూ.25 వేలు పారితోషికం అందజేస్తారు. -
సహకారం మరింతగా..
నర్సంపేట: సొసైటీల నుంచి రైతులకు అందనున్న సేవలు మరో ఆరు నెలలు పొడిగించడం వారికి ఎంతో ప్రయోజనకరం కానుంది. పంటల సాగులో రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి పలు రకాల సేవలు అందాలంటే స్థానికంగా అందుబాటులో ఉంటున్న చైర్మన్ల కృషి ఎంతో ఉంటుంది. ఈనెల 14వ తేదీన చైర్మన్ల పదవీ కాలం ముగియడంతో ఒకింత రైతులు ఆందోళన చెందారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలో వరి పంట అధికంగా సాగు చేస్తున్న రైతులకు యూరియా, డీఏపీ అందించడంలో సొసైటీ చైర్మన్ల పాత్ర కీలకంగా మారింది. జిల్లాలో 98 పీఏసీఎస్ సొసైటీలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీ వరకు పదవీ కాలం ముగిస్తే 2026 ఫిబ్రవరి 14లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపాలిటీ ఎన్నికలు రాక ముందే పీఏసీఎస్ ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ల పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించినప్పటికీ ఖరీఫ్లో రైతుల పంటలకు అందాల్సిన సేవలను దృష్టిలో ఉంచుకొని కూడా పదవీ కాలం పెంచి ఉంటారని తెలుస్తోంది. దీంతో సొసైటీ చైర్మన్లతో పాటు పాలకవర్గం పంటల సాగు రెండు సీజన్ల ప్రక్రియ చైర్మన్ల చేతుల మీదుగానే సాగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల ద్వారా యూరియా అందించి రైతుల అవసరాలు తీర్చుతోంది. రైతులకు కావాల్సిన యూరియా సొసైటీ పరిధిలలోని పంటల సాగును అంచనా వేసి అవసరమైన యూరియాను అందించడంలో సహకార సంఘాల పాత్ర ఎంతగానో ఉంది. దీనిలో భాగంగా సొసైటీ చైర్మన్లు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తూ కావాల్సినంత యూరియా సమకూర్చుకుని రైతులకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని రైతులు కూడా సొసైటీ చైర్మన్ల పదవీ కాలం పొడిగించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మరింత సేవ చేసే అవకాశం..పీఏసీఎస్ల ద్వారా రైతులకు పలు రకాల సేవలను అందించే అవకాశం మరో ఆరు నెలలు పొడిగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అన్ని రకాల రుణాలను అందిస్తూ ధాన్యాన్ని కొంటూ పంటల సాగుకు అవసరమైన యూరియా, డీఏపీలను అందించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం. –బొబ్బాల రమణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ల పదవీ కాలం ఆరు నెలలు పొడిగింపు కీలక సాగు సమయంలో రైతులకు ప్రయోజనకరం జిల్లాలో 98 పీఏసీఎస్ సొసైటీలు -
ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టండి
● ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అఽథారిటీ కమిషనర్ శశాంక ● ముంపు ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనరామన్నపేట: నగరం ముంపునకు గురవకుండా ప్రణాళిక ప్రకారం.. శాశ్వత చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అఽథారిటీ కమిషనర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్ వివిధ విభాగాల అధికారులతో కలిసి భద్రకాళి బండ్, చిన్న వడ్డేపల్లి చెరువు ఐసీసీసీ కేంద్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సమర్థంగా వరద ముంపును ఎదుర్కొనేందు కు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు. భద్రకాళి చెరువు సమీపంలో ముంపునకు గురయ్యే ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీల పరిస్థితి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి నిర్మాణాలు చేపట్టాలి నగరంలోని వరద నీటి తీవ్రత స్థాయి అంచనాకు వివిధ విభాగాలు సమన్వయంతో పని చేయాలని శశాంక ఆదేశించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవకుండా భద్రకాళి బండ్ ఇన్ లెట్ వద్ద వాస్తవ సామర్థ్యం? ఇన్ ఫ్లో? ఔట్ ప్లో తదితర విషయాల అధ్యయనానికి ఇరిగేషన్, బల్దియా, ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల సమన్వయం చేసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు నిలువ సామర్థ్యాన్ని పెంచి వరద ముంపునకు గురికాకుండా నీటిని నిలువరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ కేంద్రం పరిశీలన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని శశాంక పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో నగరంలోని ప్రతీ చెరువుకు సంబంధించి నీటి ప్రవాహం ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో సమాచారం ప్రతీ వార్డును ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా సమాచారం అందజేయాలన్నారు. సీఎంహెచ్ఓ రాజా రెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ సిటీ ప్లానర్లు మహేందర్, రవీందర్ రాడేకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా ‘ఇన్స్పైర్’ కాలేదు!
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డు మనక్ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో.. భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్టీ), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ద్వారా ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డుల మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, వివిధ గురుకులాల్లోని ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలల నుంచి ప్రాజెక్టుల రూపకల్పనకు ఐదు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు మహబూబాబాద్ జిల్లా మినహా మిగిలిన ఐదు జిల్లాల్లో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మహబూబాబాద్ జిల్లా 789 నామినేషన్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు ఉండడంతో ఇంకా నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది. సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తేనే.. ఉమ్మడి జిల్లాలోని డీఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు ఇప్పటికే అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించారు. ఇన్స్పైర్ అవార్డులకు నూతన ఆవిష్కరణల ప్రాజెక్టులతో విద్యార్థులతో నామినేషన్లు చేయించాలని ఆదేశించారు. నామినేషన్లు చేయించేందుకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టెక్నికల్ టీంలు కూడా ఏర్పాటుచేశారు. పాఠశాలల్లో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ప్రధానంగా సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే నామినేషన్లు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎంలు, టీచర్లలో కొంత నిర్లిప్తత కూడా కారణమని తెలుస్తోంది. మహబూ బాబాద్ జిల్లాలో మాత్రం డీఈఓ, సైన్స్ అధికారి ప్రత్యేక దృష్టిసారిండచంతో నామినేషన్లు బాగా అయ్యాయని తెలుస్తోంది. ఎంపికై తే ఒక్కో విద్యార్థి నామినేషన్కు రూ.10 వేలు.. ఇన్స్పైర్ అవార్డుకు ప్రాజెక్టు రూపకల్పన చేసి వెబ్సైట్ ద్వారా పంపితే ఎంపికై న విద్యార్థికి రూ. 10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. విద్యార్థి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి నమూనా రూపొందించేందుకు, ప్రయాణ ఖర్చులకు ఈ డబ్బులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాస్ధాయిలో ఇన్స్పైర్ అవార్డుల ప్రాజెక్టులకు సంబంధించిన నమూనా ప్రదర్శనలు నవంబర్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి ఇన్స్పైర్, ఇందులో ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే జపాన్ వంటి దేశాల పర్యటనకు కూడా ఎంపిక చేస్తారు. అలా ఎంపికై న వారికి రూ.25వేల పారితోషికం కూడా అందజేస్తారు. నామినేషన్లు పంపించాలి.. ఇన్స్పైర్ అవార్డులకు నామమాత్రంగానే నామినేషన్లు పంపారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీసేందుకు ఒక చక్కటి వేదిక ఇన్స్పైర్ అవార్డు మనక్. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. అందుకు ఒక ఐడియాతో ప్రాజెక్టుకు సంబంధించి సంక్షిప్తంగా వివరాలు పంపించాలి. హెచ్ఎంలు, టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సెప్టెంబర్ 15లోగా విద్యార్థులతో నామినేషన్లు పంపాలి. – ఎస్.శ్రీనివాసస్వామి, హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి జిల్లా నామినేషన్ల సంఖ్య మహబూబాబాద్ 789 హనుమకొండ 30 వరంగల్ 45 ములుగు 30 జయశంకర్ 10 జనగామ 25 ‘ఇన్స్పైర్ మనక్’ అవార్డుల నామినేషన్లు వేయించేందుకు పెద్దగా ఆసక్తి చూపని హెచ్ఎంలు, టీచర్లు 789తో మహబూబాబాద్ రాష్ట్రంలోనే మొదటి స్థానం మిగిలిన జిల్లాల్లో తక్కువగా వేసిన విద్యార్థులు హెచ్టీటీపీఎస్//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్–డీఎస్టీ.గౌట్.ఇన్ ద్వారా లేదా గూగుల్ ప్లేస్లోర్లో ఇన్స్పైర్ మనక్యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. స్కూల్ అథారిటీ ద్వారా యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి విద్యార్థుల ఆవిష్కరణ వివరాలను నమోదు చేయడంతోపాటు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. హెచ్ఎంలు, గైడ్ టీచర్ల సహకారంతో విద్యార్థులతో ప్రాజెక్టులకు సంబంధించి నామినేషన్లు పంపించాలి. ఇన్స్పైర్ నామినేషన్కు కావాల్సినవి.. విద్యార్థి సృజనాత్మక ఆలోచన లేదా ప్రాజెక్టు సంక్షిప్త నివేదిక రెండువేల పదాలకు మించకూడదు. విద్యార్థి ఆధార్ కార్డుతో అనుసంధానించిన ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద్వారా జారీచేసిన పొదుపు ఖాతా పాస్పుస్తకం, విద్యార్థి పాస్ఫొటో, వివరాలు, ఫోన్నంబర్, గైడ్ టీచర్ వివరాలు కూడా ఉండాలి. -
గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి ఎత్తు తగ్గించొద్దు
నెక్కొండ: నాగపూర్–విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి ఎత్తు తగ్గించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అలంకానిపేట, తోపనపల్లి, వెంకటాపురం, అప్పల్రావుపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు ఆదివారం కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ని కలిసి గ్రామస్తులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు పలువురు మాట్లాడుతూ.. గ్రీన్ఫీల్డ్ హైవే 163జీ బ్రిడ్జి నెక్కొండ– కేసముద్రం ప్రధాన గ్రామాల నుంచి వెళ్తోందని, అలంకానిపేట–అప్పల్రావుపేట మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి ఎత్తు 20 ఫీట్లకు బదులు 14 ఫీట్లకు తగ్గించి పనులు చేపడుతున్నారని తెలిపారు. పరిసర గ్రామాల రైతులు పంట ఉత్పత్తుల విక్రయానికి కేసముద్రం, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ తీసుకెళ్తారని, కేవలం ట్రాక్టర్లు, బస్సుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడుతూ..అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం, మిర్చి, పత్తి లోడ్ లారీలు పోవడానికి ఇబ్బందులు ఏర్పటే ప్రమాదం ఉందని వారు వాపోయారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి భవిష్యత్తులో మూతపడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ఫీల్డ్ నిబంధనలకు లోబడి 20 ఫీట్ల ఎత్తుకు పెంచాలని వారు కోరారు. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్, కరీంనగర్ 1వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాస్ సమక్ష్యంలో కేంద్రమంత్రిని కలవడం జరిగిందన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకవెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ను వేడుకున్న గ్రామస్తులు -
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్వి చిల్లర మాటలు
హన్మకొండ: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అజ్ఞానపు, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. ఆదివారం హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బరాజ్ను ఎవరో బాంబులతో పేల్చారు అని ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడడం అవివేకం అన్నారు. కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనుల కారణంగా కూలిపోయింది తప్ప బాంబు పేలుళ్లతో కాదన్నారు. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తస్మాత్ జాగ్రత్త! నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. అని కొండేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులపై అసత్య ప్రచారం చేసి.. బీఆర్ఎస్ చేసిన అవినీతిని కప్పిపుచ్చే కుట్రలో ఆర్ఎస్ ప్రవీణ్ భాగమవుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్రెడ్డి ఇప్పుడు ఒక్క చర్య తీసుకోకపోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి నిదర్శనమన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంప్ర మధు, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మార్టిన్ లూథర్, నాయకులు జన్ను మధు, ఎన్.శివకృష్ణ, వెంకటేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బరాజ్ను బాంబులతో పేల్చారనడం అవివేకం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
నర్సంపేట: వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సూచించారు. ఈమేరకు చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ భద్రయ్య, స్టాఫ్నర్స్ హేమలత, హెల్త్ అసిస్టెంట్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి.. ఖానాపురం: వైద్యాఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులకు సెలవులు ఉండవని, సమయపాలన తప్పకుండా పాటించాలని జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు ఆదేశించారు. ఈమేరకు మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆదివారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. త్వరలోనే ఫేషియల్ అటెండెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు -
ముగిసిన పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షలు
హన్మకొండ కల్చలర్: విద్యార్థులకు నిర్వహించిన పేరిణి నాట్య ప్రవేశిక స్థాయి పరీక్షలు ఆదివారం ముగిశాయి. వరంగల్లోని నాగార్జున హైస్కూల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 180 మంది విద్యార్థులకు థియరీ, ప్రాయోగిక, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు అకాడమీ నిర్వాహకుడు గజ్జెల రంజిత్కుమార్ చీఫ్ ఎగ్జామినర్గా, విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పేరిణి నాట్య అధ్యాపకురాలు చాతరాజు నవ్యజ ఇంటర్ననల్గా, హైదరాబాద్కు చెందిన పేరిణి గురువు సందీప్ ఎక్స్టర్నల్గా విధులు నిర్వర్తించారు. -
ట్రాక్టర్ నుంచి బస్తాలు దింపుతూ..
సంగెం: ట్రాక్టర్ నుంచి ధాన్యం బస్తాలు దింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడి ఓ హమాలీ తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన వేల్పుల ఎలిషా, నర్సయ్య దంపతులకు కుమారుడు రాజు(26), ఒక కూతురు ఉన్నారు. కూతురు వివాహం కాగా రాజుకు వివాహం కాలేదు. తండ్రి నర్సయ్య పక్షవాతంతో మంచానపడ్డాడు. తల్లి కూలికి, రాజు హమాలీ పనికి వెళ్లేవాడు. రోజువారీ పనిలో భాగంగా రాజు ఈ నెల 15న ఆశాలపల్లిలోని కేదారేశ్వర రైస్ మిల్లులో హమాలీ పనికివెళ్లాడు. ధాన్యం బస్తాలు ట్రాక్టర్ నుంచి దింపుతున్న క్రమంలో అదుపుతప్పి కిండపడిపోగా మర్మాంగాలకు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఇంటికి వెళ్లి ఆర్ఎంపీతో ఇంజక్షన్ వేయించుకున్నాడు. శనివారం ఉదయం వరకు రాజు తీవ్ర అస్వస్థతకు గురికాగా ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా ఈ విషయం గురించి ఎస్సై నరేశ్ను వివరణ కోరగా రాజు మృతిచెందింది వాస్తవమేనని, ఫిర్యాదు అందలేదన్నారు. జారిపడి హమాలీకి తీవ్రగాయాలు చికిత్స పొందుతూ మృతి -
వర్ధన్నపేటకు మీనాక్షి నటరాజన్
● ఖరారైన పాదయాత్ర షెడ్యూల్ వర్ధన్నపేట: ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25న సాయంత్రం వర్ధన్నపేటకు చేరుకుని పాదయాత్ర నిర్వహించనున్నారు. 26న ఉదయం శ్రమదానం, కార్మికులతో సమావేశం కానున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదివారం తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేయడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు, ఈ పనులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పాదయాత్రలో గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రజలకు వివరిస్తారు. మహేశ్కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పర్యటన నేపథ్యంలో వర్ధన్నపేటలో పండుగ వాతావరణం నెలకొంటుందని, కార్యక్రమానికి భారీగా ప్రజలు, కార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్నారు. సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు హన్మకొండ కల్చరల్/జనగామ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి ఫొటోగ్రాఫర్లను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. వరంగల్కు చెందిన సాక్షి సీనియర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ పెద్దపల్లి వరప్రసాద్, జనగామ ఫొటోగ్రాఫర్ గోవర్ధనం వేణుగోపాల్ ఉత్తమ వార్త చిత్రాల పోటీల్లో బహుమతులకు ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. న్యూశాయంపేట: ప్రజాసమస్యల పరిష్కారంలో భాగంగా వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలని తెలిపారు. నేడు నులిపురుగుల నివారణ కార్యక్రమం గీసుకొండ: జిల్లాలో నులిపురుగుల నివారణ కోసం 0–19 సంవత్సరాల వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఎంహెచ్వో డాక్టర్ బి.సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోని వారికి సోమవారం వేస్తారన్నారు. 0–2 సంవత్సరాల వయస్సులోపు వారికి సగం ట్యాబ్లెట్ను నీళ్లలో వేసి తాగించాలని, ఆపైన వయస్సు నుంచి 19 ఏళ్ల లోపు వారు పూర్తి ట్యాబ్లెట్ను నమిలి మింగాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్యాధికారులు, సిబ్బంది, సంబఽంధిత శాఖల వారు కృషి చేయాలని కోరారు. కార్యక్రమాన్ని డీఐవో డాక్టర్ ప్రకాశ్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. డీఈఈసెట్–25 స్పాట్ అడ్మిషన్లువిద్యారణ్యపురి: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు 2025–27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ) రెండేళ్ల కోర్సు కళాశాలల్లో (ప్రభుత్వ, ప్రైవేట్) వారీగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశిఽక్షణా సంస్థ ప్రధానాచార్యుడు ఎండీ అబ్దుల్హై ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ కళాశాలలోనూ (ప్రభుత్వ, ప్రైవేట్) సీటు పొందలేద ని రిపోర్ట్, జాయిన్ కాని అభ్యర్థులు మాత్రమే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాల న్నారు. వరంగల్, హనుమకొండలో విద్యాశిక్షణ సంస్థలో ఖాళీ సీట్లలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు ఈనెల 19న హాజరు కావాలని, ఈ నెల 21న సీటు పొందిన అభ్యర్థులు కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ డైట్ కళాశాలల్లో ఈనెల 20న స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాల్సి ఉంటుందని, సీటు పొందినవారు 21న కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. వివరాలకు హెచ్టీటీపీఎస్//డీఈఈసెట్,సీడీఎస్ఈ.తెలంగాణ. గౌట్.ఇన్ వెబ్సైట్ను చూడాలని సూచించారు. -
నేటినుంచి కాజీపేట దర్గా ఉర్సు
కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబాని దర్గా ఉర్సు ఉత్సవాలు కుల, మతాలకు అతీతంగా నేడు (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయని దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా శనివారం తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాజీపేట దర్గా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉర్సులో ప్రధాన ఘట్టాలు ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి గంధంతో ప్రారంభం, 22న ఉర్సు, 23న బదావా (ముగింపు) ఉంటుందని వివరించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర, దేశ నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు వస్తారని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. – కాజీపేట రూరల్ -
ఎట్టకేలకు వరుణుడి కరుణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరుణుడి కరుణతో ఆలస్యంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వానాకాలం సీజన్ మే లో ముందస్తుగా తొలకరి జల్లులు మురిపించాయి. ఆ వర్షాలకు సాగుకు శ్రీకారం చుట్టిన రైతులు అత్యధికంగా పత్తి పంట వేశారు. ఆ తర్వాత జూన్ వరకు మేఘాలు ముఖం చాటేశాయి. జూలై రెండో వా రంలో అక్కడక్కడ జల్లులు పడినా, అంతగా ప్రయోజనం లేకపోగా పత్తి విత్తనాలు రెండు సార్లు వేసినా ఎండిపోయాయి. పది రోజుల క్రితం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోటు వర్షపాతం ఉంది.ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊ రట కలిగిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 79మండలాల్లో శనివారం ఉదయం 8:30గంటల వరకు అధికారిక గ ణాంకాల ప్రకారం ఒక్క మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. 25 మండలాల్లో అధికం, 48 మండలాల్లో సాధారణం,మరో ఐదు మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. ఇప్పటికీ ఐదు మండలాల్లో లోటు వర్షమే.. జూలై చివరినాటికి ఉమ్మడి జిల్లాలో 79 మండలాలకు గాను ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మి.మీ.లకు గాను 662.10 మి.మీ.ల(66శాతం)అధికంగా పడింది.25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురిసింది. 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్న ఆ జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే ఉంది. లోటు వర్షపాతం ఉన్న మండలాల జాబితాలో ములుగు జిల్లాల్లోని కన్నాయిగూడెం, వాజేడు, భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవపూర్, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూ ర్ మండలాలు ఉన్నాయి. మహబూ బాబాద్ జిల్లాలో 18 మండలాలకు 8 మండలాల్లో అధికం కాగా,10 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. సాగుపై వాన ప్రభావం.. తగ్గిన విస్తీర్ణం.. నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించడంతో తొలకరి జల్లులకే రైతులు సాగుబాట పట్టారు. ముందుస్తు వర్షాలు పడడంతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు నాటారు. అయితే ఆ తర్వాత సుమారు నెలన్నర అసలు వర్షాలే పడకపోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోయాయి. దీంతో ఈ సారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు విస్తీర్ణం 77.65 శాతానికే పరిమితమైంది. వానాకాలంలో 15,82,755 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 12,41,456 ఎకరాల్లోనే సాగు చేశారు. గతేడాది వానాకాలంలో 110 శాతంగా సాగు విస్తీర్ణం ఉండగా.. ఈ సారి 77.65 శాతాని కి పడిపోయింది. వరి, పత్తి సాగు కూడా గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు అంచనా 5,79,863 ఎకరాలు కాగా తాజా గణాంకాల ప్రకారం 4,98,109 (85.90 శాతం)లలోనే సాగు చేశారు. అలాగే, వరి సాగు అంచనా 8,78,376 ఎకరాలు కాగా, శనివారం నాటికి 6,14,320 (69.94 శాతం)గా సాగు విస్తీర్ణం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆలస్యంగానైనా పడుతున్న వర్షాలు.. లోటునుంచి ఎక్సెస్ వైపు వర్షపాతం ఉమ్మడి వరంగల్లో 25 మండలాల్లో అధికం.. 48 మండలాల్లో సాధారణం ఐదు మండలాల్లో ఇంకా లోటువర్షపాతమే.. వర్ధన్నపేటలో అత్యధిక నమోదు.. రైతులకు ఊరట వానల ఆలస్యంతో తగ్గిన సాగు విస్తీర్ణం.. ఇప్పటివరకు 77.65 శాతమేజిల్లా మండలాలు అత్యధిక అధిక సాధారణ లోటు హనుమకొండ 14 – 02 12 – వరంగల్ 13 01 08 04 – మహబూబాబాద్ 18 – 08 10 – ములుగు 10 – 02 06 02 జనగామ 12 – 04 07 01 జేఎస్ భూపాలపల్లి 12 – 01 09 02 మొత్తం 79 01 25 48 05 జిల్లా సాగు అంచనా సాగైన విస్తీర్ణం ( ఎకరాల్లో..) హనుమకొండ 1,41,984 1,13,011 వరంగల్ 1,27,950 92,315 మహబూబాబాద్ 2,03,909 1,49,808 ములుగు 99,628 59,833 జేఎస్ భూపాలపల్లి 1,08,106 66,217 జనగామ 1,96,799 1,33,136 మొత్తం 8,78,376 6,14,320పత్తి సాగు ఇలా.. జిల్లా సాగు అంచనా సాగైన విస్తీర్ణం (ఎకరాల్లో..) హనుమకొండ 92,028 74,849 వరంగల్ 1,28,343 1,18,106 మహబూబాబాద్ 89,219 78,745 ములుగు 24,513 19,431 జేఎస్ భూపాలపల్లి 99,948 98,260 జనగామ 1,45,812 1,08,718 మొత్తం 5,79,863 4,98,109సకాలంలో వర్షాలు కురిస్తే బాగుండుఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు పడలేదు. రోహిణి కార్తెలో వర్షాలు కురవడంతో చాలామంది రైతులు మొదట్లో విత్తనాలు నాటారు. అవి మొలకెత్తిన తర్వాత వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం సమయం మించిపోయిన తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్పుడే సరైన సమయంలో వర్షాలు కురిస్తే పంటల సాగుకు రైతులకు అనుకూలంగా ఉండేది. – రామంచ సుధాకర్, రైతు, పీచర -
● శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హరియాణా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. కళాక్షేత్రంలో కృష్ణతత్వం, గొల్లకురుమ సంస్కృతీసంప్రదాయాలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాత్రి గోకుల్నగర్లో ఉట్టి కొట్టారు. – హన్మకొండ అర్బన్ -
ఒడంబడిక..!
నిట్ వరంగల్లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏలతో పాటు పీహెచ్డీ విద్యను అభ్యసిస్తున్న సుమారు 6 వేల మంది విద్యార్థులకు ఇతర పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్షిప్, విద్యా పరస్పర బదిలీలకు, టెక్నాలజీ ఉపయోగానికి ల్యాబ్స్ సౌకర్యం, ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఎంఓయూలు తోడ్పాటునందిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులకు వివిధ సంస్థల్లో విద్యను అభ్యసించే అవకాశం వీటి ద్వారా లభిస్తోంది. దీంతో పాటు ఇతర సంస్థలు, పరిశ్రమల్లో ఆవిష్కరణలకు, పరిశోధనలకు తోడ్పడుతున్నాయి. 103 నేరుగా.. 2 వర్చువల్గా నిట్ వరంగల్తో జీడబ్ల్యూఎంసీ, భువనగిరి ఎయిమ్స్, సీఎస్ఆర్–ఐఐఎంటీ, ఐఐటీ గోవా, వీజేటీఐ ముంబాయి, నిట్ జంషెడ్ పూర్, ఐఐఐటీడీఎం కర్నూల్, ఐఐఎం విశాఖపట్నం, ఐఐటీ జమ్మూ, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ హైదరాబాద్, నిట్ జైపూర్ మాలవ్య, టాటా కన్సల్టెన్సీ హైదరాబాద్, బెంగళూరు ఇన్ఫోసిస్, ది లక్ష్య ఫౌండేషన్ వరంగల్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, స్వీడెన్ యూనివర్సిటీ ఆఫ్ మలార్డలాన్, హైదరాబాద్ టీఎస్కాస్ట్, ఇండియన్ రైల్వేస్, నోయిడాలోని ది మిస్టో టెక్స్లతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల వర్చువల్గా థాయిలాండ్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో, జర్మనీలోని నార్దో హుస్సేన్ యూనివర్సిటీ ఆఫ్ ఆ్ఫ్లైడ్ సైన్స్తో వర్చువల్గా ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రం, దేశంలోనే పలు సంస్థలతోనూ.. భువనగిరి ఎయిమ్స్లో ఆధునిక టెక్నాలజీని వైద్య రంగంలో ఉపయోగించేందుకు, కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో టెక్నాలజీ ఉపయోగానికి ఇండియన్ రైల్వేతో, మెరుగైన రోడ్ల నిర్మాణానికి న్యూఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో, పరిశ్రమల్లో పరిశోధనకు ఎన్ఐ–ఎంఎస్ఎంఈతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇవే కాకుండా.. ఎంజీఎంలోని మూగ, చెవిటి చిన్నారులకు తోడ్పడేందుకు ‘అమ్మ’ యాప్ను నిట్ వరంగల్ విద్యార్థులు స్టార్టప్గా రూపొందించారు. ఎంఓయూలతో అభివృద్ధి నిట్ వరంగల్లో నేరుగా ఆవశ్యకతను బట్టి వర్చువల్గా ఆన్లైన్లో ఎంఓయూలను కుదుర్చుకుంటున్నాం. ఎంఓయూల ద్వారా నిట్ విద్యార్థులతో పాటు నిట్ వరంగల్ విద్యాసంస్థ అభివృద్ధి తోడ్పడుతున్నాయి. పరిశోధనలకు అనువుగా, ఆవిష్కరణలకు నెలవుగా ఉన్న నిట్ వరంగల్తో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పరిశ్రమలతో ఉపాధి, విద్యాసంస్థలతో ఇంటర్న్షిప్లే కాకుండా పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు ఎంఓయూలు ఉపయోగపడతాయి. – బిద్యాధర్ సుబుదీ, నిట్ డైరెక్టర్ అంతర్జాతీయ ప్రమాణాలు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్నా.. నూతన సాంకేతికతలో రాటుదేలాలన్నా.. సరికొత్త ఆవిష్కరణల్ని రూపొందించాలన్నా.. జీవితంలో బాగా స్థిరపడాలన్నా విద్యార్థులకు కల్పతరువు నిట్ వరంగల్. ఇక్కడ సీటు వస్తే చాలు.. లైఫ్ సెట్ అనుకుంటారు. అలాంటి క్యాంపస్తో వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఎంఓయూలు చేసుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు నిట్.. ఆఫ్లైన్లోనే కాదు.. వర్చువల్గా పరస్పర ఒప్పందాలు చేసుకుంటూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. – కాజీపేట అర్బన్ఎంఓయూలో ‘వరంగల్ నిట్’ కొత్త ధోరణి అటు వర్చువల్గా, ఇటు నేరుగా ఒప్పందాలు సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉద్యోగావకాశాలకు తోడ్పాటు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, విస్తరించే దిశగా ప్రయత్నాలు ప్రత్యేకతను చాటుకుంటున్న సాంకేతిక సంస్థ -
వరంగల్ డీఈఓను విధులనుంచి తొలగించాలి
విద్యారణ్యపురి: వరంగల్ డీఈఓ ఎం.జ్ఞానేశ్వర్ను వెంటనే విధులనుంచి తొలగించాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట, నర్సంపేట, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరిలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజను డీఈఓ జ్ఞానేశ్వర్ ఇటీవల దుర్బాషలాడారన్నారు. జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉపాధ్యాయుల ఫైళ్లను ఏజీ ఆఫీస్కు పంపకుండా డీఈఓ తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. కార్యాలయ సిబ్బందితోనూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులను అవమానపర్చేలా ప్రవర్తిస్తున్న డీఈఓ జ్ఞానేశ్వర్ను విధులనుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలోని టీజీహెచ్ఎం అసోసియేషన్, పీఆర్టీయూ టీఎస్, టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్, టీపీయూఎస్, టీయూటీఎఫ్, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ యూనియన్ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఉపాధ్యాయ సంఘాల వినతి -
ఠాకూర్ ధరమ్సింగ్కు జాతీయ అవార్డు
హన్మకొండ: హనుమకొండకు చెందిన ఠాకూర్ ధరమ్సింగ్కు సేవా రంగంలో హ్యుమనిటేరియన్ ఎక్సలెన్స్–2025 జాతీ య అవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినో త్సవం, ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఐకెన్ ఫౌండేషన్ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని ఎంపిక చేసి శుక్రవారం న్యూ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అ వార్డులు ప్రదానం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ బాగ్డోరియా చేతుల మీదుగా ధరమ్సింగ్ జాతీయ అవార్డు అందుకున్నారు. 53 సార్లు చేసిన రక్తదానాన్ని పరిగణనలోకి తీసుకుని సేవా రంగంలో ధరమ్ సింగ్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 19నుంచి ఎంఏ తెలుగు రెండో సెమిస్టర్ పరీక్షలుహన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2024–25 విద్యా సంవత్సరానికిగాను రెగ్యులర్ ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 19వ తేదీనుంచి 25వ తేదీవరకు నిర్వహిస్తున్నామని జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 99894 17299, 99891 39136 నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. వాలీబాల్, ఫుట్బాల్ ఎంపిక పోటీలువరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం నిర్వహించిన వాలీబాల్, ఫుట్బాల్ ఎంపిక పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్–15,17 విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరైనట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రతిభ చూపిన వాలీబాల్ జట్లు ఈ నెల 18, 19వ తేదీల్లో హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో, ఫుట్బాల్ క్రీడాకారులు 21, 22వ తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, వాలీబాల్ సంఘం బాధ్యులు యాదిరెడ్డి, రాముడు, కోచ్ జీవన్, భూపాలపల్లి డీవైఎస్ఓ రఘు తదితరులు పాల్గొన్నారు. మద్యం తాగి వాహనం నడపొద్దు: సీపీవరంగల్ క్రైం: మద్యం తాగి వాహనం నడిపి చిక్కుల్లో పడొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శనివారం ఒక ప్రకటనలో వాహనదారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈనెల 9నుంచి వారం రోజుల్లో చేపట్టిన తనిఖీల్లో మొత్తం 324 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 16 మంది వాహనదారులకు కోర్టు రెండ్రోజుల జైలు శిక్ష విధించగా, మిగతా వాహనదారులు రూ.3,95,400 జరిమానా చెల్లించారని వివరించారు. హనుమకొండ ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో 121 కేసులకు,నలుగురికి జైలు, రూ.1,36,400 జరిమానా, కాజీపేట పరిధిలో 106 కేసుల్లో ఐదుగురికి జైలుశిక్ష పడగా, రూ.1,69,300 జరిమానా విధించినట్లు వివరించారు. అదేవిధంగా వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 97 కేసుల్లో ఐదుగురికి జైలుశిక్ష పడగా, మిగతా కేసుల్లో రూ.89,700 జరిమానా చెల్లించారని సీపీ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి : రవీంద్రనాయక్కాజీపేట అర్బన్ : ప్రజలకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్, డాక్టర్ రవీంద్రనాయక్ తెలిపారు. కాజీపేట మండలం రాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలోని ల్యాబ్, ఫార్మసీ బ్లాక్లను పరిశీలించి మాట్లాడారు. వర్షాలకు ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగీ బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఒడంబడిక!
– సాక్షిప్రతినిధి, వరంగల్అంతర్జాతీయ ప్రమాణాలు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్నా.. నూతన సాంకేతికతలో రాటుదేలాలన్నా.. సరికొత్త ఆవిష్కరణల్ని రూపొందించాలన్నా.. జీవితంలో బాగా స్థిరపడాలన్నా విద్యార్థులకు కల్పతరువు నిట్ వరంగల్. ఇక్కడ సీటు వస్తే చాలు.. లైఫ్ సెట్ అనుకుంటారు. అలాంటి క్యాంపస్తో వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఎంఓయూలు చేసుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు నిట్.. ఆఫ్లైన్లోనే కాదు.. వర్చువల్గా పరస్పర ఒప్పందాలు చేసుకుంటూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. – కాజీపేట అర్బన్ నిట్ వరంగల్లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏలతో పాటు పీహెచ్డీ విద్యను అభ్యసిస్తున్న సుమారు 6 వేల మంది విద్యార్థులకు ఇతర పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్షిప్, విద్యా పరస్పర బదిలీలకు, టెక్నాలజీ ఉపయోగానికి ల్యాబ్స్ సౌకర్యం, ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఎంఓయూలు తోడ్పాటునందిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులకు వివిధ సంస్థల్లో విద్యను అభ్యసించే అవకాశం వీటి ద్వారా లభిస్తోంది. దీంతో పాటు ఇతర సంస్థలు, పరిశ్రమల్లో ఆవిష్కరణలకు, పరిశోధనలకు తోడ్పడుతున్నాయి. 103 నేరుగా.. 2 వర్చువల్గా నిట్ వరంగల్తో జీడబ్ల్యూఎంసీ, భువనగిరి ఎయిమ్స్, సీఎస్ఆర్–ఐఐఎంటీ, ఐఐటీ గోవా, వీజేటీఐ ముంబాయి, నిట్ జమ్షెడ్పూర్, ఐఐఐటీడీఎం కర్నూల్, ఐఐఎం విశాఖపట్నం, ఐఐటీ జమ్మూ, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ హైదరాబాద్, నిట్ జైపూర్ మాలవ్య, టాటా కన్సల్టెన్సీ హైదరాబాద్, బెంగళూరు ఇన్ఫోసిస్, ది లక్ష్య ఫౌండేషన్ వరంగల్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, స్వీడెన్ యూనివర్సిటీ ఆఫ్ మలార్డలాన్, హైదరాబాద్ టీఎస్కాస్ట్, ఇండియన్ రైల్వేస్, నోయిడాలోని ది మిస్టో టెక్స్తో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల వర్చువల్గా థాయిలాండ్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో, జర్మనీలోని నోర్ధా హుస్సేన్ యూనివర్సిటీ ఆఫ్ ఆప్లైడ్ సైన్స్తో వర్చువల్గా ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రం, దేశంలోనే పలు సంస్థలతోనూ.. భువనగిరి ఎయిమ్స్లో ఆధునిక టెక్నాలజీని వైద్య రంగంలో ఉపయోగించేందుకు, కాజీపేట మండలం అయోధ్యపురంలో చేపట్టిన కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనుల్లో టెక్నాలజీ ఉపయోగానికి ఇండియన్ రైల్వేతో, మెరుగైన రోడ్ల నిర్మాణానికి న్యూఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో, పరిశ్రమల్లో పరిశోధనకు ఎన్ఐ– ఎంఎస్ఎంఈతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇవే కాకుండా.. వరంగల్ ఎంజీఎంలోని మూగ, చెవిటి చిన్నారులకు తోడ్పడేందుకు ‘అమ్మ’ యాప్ను నిట్ వరంగల్ విద్యార్థులు స్టార్టప్గా రూపొందించారు. ఎంఓయూలో ‘వరంగల్ నిట్’ కొత్త ధోరణి అటు వర్చువల్గా, ఇటు నేరుగా ఒప్పందాలు సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉద్యోగవకాశాలకు తోడ్పాటు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, విస్తరించే దిశగా ప్రయత్నాలు ప్రత్యేకతను చాటుకుంటున్న సాంకేతిక సంస్థడ్యూయల్ డిగ్రీలకు అవకాశం నిట్ వరంగల్తో థాయ్లాండ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీలను అందజేసేందుకు వర్చువల్ ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్ వరంగల్కు చెందిన 20 మంది విద్యార్థులు జియో ఇన్ఫామేటిక్స్లో రెండేళ్ల పాటు విద్యతోపాటు పరిశోధనలు చేపట్టనున్నారు. దీంతో నిట్ వరంగల్ నుంచి ఎంటెక్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ థాయ్లాండ్ నుంచి మాస్టర్ డిగ్రీలు అందుకుంటారు.ఏఐ పరిశోధనల కోసం.. నిట్ వరంగల్తో నోయిడాలోని మిస్టోటెక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో జాతీయ రహదారుల భద్రత, ప్రయాణికుల అనుభవాలపై, మెరుగైన రహదారుల నిర్మాణానికి పరిశోధనలను చేపట్టేందుకు ఎంఓయూ తోడ్పడనుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ తోడ్పడనుంది.ఎంఓయూలతో అభివృద్ధి..నిట్ వరంగల్లో నేరుగా ఆవశ్యకతను బట్టి వర్చువల్గా ఆన్లైన్లో ఎంఓయూలను కుదుర్చుకుంటున్నాం. ఎంఓయూల ద్వారా నిట్ విద్యార్థులతో పాటు నిట్ వరంగల్ విద్యాసంస్థ అభివృద్ధి తోడ్పడుతున్నాయి. పరిశోధనలకు అనువుగా, ఆవిష్కరణలకు నెలవుగా ఉన్న నిట్ వరంగల్తో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పరిశ్రమలతో ఉపాధి, విద్యాసంస్థలతో ఇంటర్న్షిప్లే కాకుండా పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు ఎంఓయూలు ఉపయోగపడతాయి. – బిద్యాధర్ సుబుదీ, నిట్ డైరెక్టర్ -
దంచికొట్టిన వాన
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, వరంగల్: జిల్లాలో వాన మళ్లీ దంచికొట్టింది. ఐదు రోజుల క్రితం అతిభారీ వర్షంతో వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ వరద బురద నుంచి ఇంకా తేరుకోక ముందే జిల్లాలోని నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంతోపాటు ఇతర మండలాల్లో మోస్తరు వర్షం కురవడంతో చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీవర్షానికి ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు ఫీటు ఎత్తులో మత్తడి పోస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ నగరంలో కురిసిన సాధారణ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి 8.30 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు 40 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అలుగుపోస్తున్న గుండం చెరువుదుగ్గొండి: భారీ వర్షానికి పలు గ్రామాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. 14 పెద్ద చెరువులు, 90 కుంటలు మత్తడి పోస్తున్నాయి. మండలంలో అతి పెద్ద చెరువు తిమ్మంపేట గుండం చెరువు మత్తడి పోస్తోంది. ఈ చెరువు పరిధిలోని 400 ఎకరాల్లో రెండు పంటలు పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిమ్మంపేట–నారాయణతండా ప్రధాన రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో భారీ వర్షం జలకళ సంతరించుకున్న చెరువులు, కుంటలు అలుగు పోస్తున్న పాకాల సరస్సు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు జిల్లాలో సగటు వర్షపాతం 40 మిల్లీమీటర్లు -
ప్రయాణికులను రక్షించిన సీఐ సాయిరమణ
ఖానాపురం: వరద నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని దుగ్గొండి సీఐ సాయిరమణ కాపాడారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన బాస లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, రితిక, రితిన్ భద్రాచలానికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో చిలుకమ్మనగర్–కొత్తగూడ మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకుపోయారు. వెంటనే లక్ష్మీనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. డీజీ కంట్రోల్ కార్యాలయం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో దుగ్గొండి సీఐ సాయిరమణ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చిలుకమ్మనగర్కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పంటలకు సరిపడా యూరియా : డీఏఓ నెక్కొండ: పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవపరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి అనురాధ అన్నారు. చంద్రుగొండ పీఏసీఎస్ ఉప కేంద్రంలో యూరియాను శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యూరియా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే ఫర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, చంద్రుగొండలోని వట్టె వాగు లోలెవల్ కాజ్వే, సీతారాంపురం మాటు, పెద్దకొర్పోలు లొట్ల వాగును పరిశీలించారు. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వాగులు, చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డీఏఓ సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. శాంతివనంలో కలిమి కాయలు నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శాంతివనంలో కలిమి కాయలు ఈసారి విరగ కాశాయి. వీటిని వాక్రాయలు, కరెండ అనే పేర్లతో కూడా పిలుస్తారని వనప్రేమి గోకా రామస్వామి తెలిపారు. ఈ కాయలతో రోటి పచ్చడే కాకుండా నిల్వ పచ్చడి కూడా చేస్తారని పేర్కొన్నారు. కిలో రూ.50 ఉన్న టమాట బదులు ఐదుఆరు కాయలు పప్పులో వేసుకుంటే ఆ రుచే వేరని వివరించారు. ఇందులోని సీ విటమిన్ ఆరోగ్య ప్రదాయినిగా ఉపయోగపడుతుందని రామస్వామి పేర్కొన్నారు. రైతులు ఈ మొక్కలను జీవ కంచెగా చేను చుట్టూ నాటుతారని, వీటికి ఉన్న మూడు ఇంచుల ముల్లులతో పాములు కూడా చొరబడవని తెలిపారు. విరగకాసిన కాయలు శాంతి వనానికి అందం తెచ్చాయని చెప్పారు. భూ పరిహారం రూ.5కోట్లు పెంచి ఇవ్వాలి ఖిలా వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ రన్వే కింద భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.5కోట్ల పరిహారం పెంచాలని, లేనిపక్షంలో భూమికి బదులు భూమి ఇవ్వాలని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు డిమాండ్ చేశారు. శనివారం వరంగల్–నెక్కొండ రోడ్డుపై గుంటూరుపల్లి వద్ద ఎయిర్పోర్ట్ భూ బాధిత రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విలువైన భూమికి ఎకరానికి రూ.5కోట్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని, భూములను రీసర్వే చేసి పరిహారం పెంచి ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో రైతులు కాలశ్రీ ప్రసాద్, కొత్తపల్లి భద్రయ్య, వంకటి శ్రీనివాస్, రత్తయ్య, సుబ్బారావు, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
నేలవాలిన పంటలు..
ఖానాపురం: పాకాల సరస్సు మత్తడి కారణంగా అశోక్నగర్ శివారులో కల్వర్టుపై నుంచి వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో నర్సంపేట–కొత్తగూడకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ, గంగారం మండలాలకు వెళ్లాల్సిన వారు భూపతిపేట మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. అశోక్నగర్ లోలెవల్ వద్ద ఎస్సై రఘుపతి ఆధ్వర్యంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. నాజీతండా శివారులో కల్వర్టుపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అశోక్నగర్ వద్ద సీఐ సాయిరమణ, తహసీల్దార్ రమేశ్, ఎస్సై రఘుపతి పర్యవేక్షిస్తున్నారు. కాగా, పాకాల ఆయకట్టు పరిధిలో వరి పంటలు నీటమునగగా.. నాజీతండా శివారులో పత్తిపంటలు జాలువారాయి. -
నర్సంపేట–నెక్కొండ దారిలో నిలిచిన రాకపోకలు
నర్సంపేట: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి. నర్సంపేట–నెక్కొండకు వెళ్లే ప్రధాన రహదారిలో పాతమగ్ధుంపురం వద్ద ఉన్న లో లెవల్ కాజ్పై నుంచి వరద నీరు ప్రవహించింది. మండల స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ, తహసీల్దార్ అబిద్ అలీ, ఎంపీడీఓ నల్లా శ్రీవాణి, చెన్నారావుపేట ఎస్సై రాజేశ్రెడ్డి, గిర్దావర్ మహ్మద్ రషీద్, పోలీసులు, గ్రామపంచాయతీ సిబ్బందితో బారికేడ్లు అడ్డుగా పెట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాజ్పై నుంచి రాకపోకలు నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సత్యశారద
నర్సంపేట/నల్లబెల్లి/ఖానాపురం: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు ఖానాపురం మండలంలోని అశోక్నగర్ శివారులో రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరద, నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి వాగు, నర్సంపేట నుంచి చెన్నారావుపేట వెళ్లే రహదారిలో మగ్ధుంపురం వద్ద లోలెవల్ కాజ్వే, నర్సంపేటలోని మాదన్నపేట వద్ద కాజ్వేను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. కాజ్వేల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ వాతావరణ శాఖ జిల్లాకు ప్రకటించిన ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్గా మారే సూచనలు ఉన్న నేపధ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విపత్కర పరిస్థితి ఎదురైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాగులు, కాల్వలను దాటే ప్రయత్నం చేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, పోలీసుల నిఘా ఉండాలని ఆదేశించారు. డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, జిల్లా పంచాయతీ అధికారి కల్పన పాల్గొన్నారు. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నర్సంపేట రూరల్: వర్షాలతో రవాణా సౌకర్యానికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గర్భిణులను 102, 108 వాహనాల ద్వారా ఆస్పత్రులకు తీసుకురావాలని కలెక్టర్ సత్యశారద, వైద్యాధికారి సాంబశివరావు సూచించారు. కలెక్టర్ సత్యశారద, డీఎంహెచ్ఓ సాంబశివరావు నర్సంపేట మండలంలోని అధికారులతో కలిసి రవాణా వ్యవస్థను పర్యవేక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణుల ప్రసవాలు సాధారణంగా జరగాలని, వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. వైద్యాధికారులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని, వర్షాకాలంలో ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గీసుకొండ పీహెచ్సీ తనిఖీ గీసుకొండ: మండల కేంద్రంలోని పీహెచ్సీని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు శనివారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి మాట్లాడారు. -
మా సమస్యలు పట్టించుకోరా?
● స్వాతంత్య్ర సమరయోధుల వినతి హన్మకొండ అర్బన్: తమ సమస్యలను పరిష్కరించాలని స్వాతంత్య్ర సమరయోధులు కోరారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ.. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించే క్రమంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాము భూ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు విన్నవించినా పట్టించుకోలేదని అన్నారు. కాగా, మంత్రి ఆ వినతిని కలెక్టర్కు ఇచ్చి పరిశీలించాలన్నారు. -
సైన్స్ కాంగ్రెస్ను సమర్థంగా నిర్వహించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19, 20, 21వ తేదీల్లో తలపెట్టిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్) జనరల్ సెక్రటరీ, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ కోరారు. శుక్రవారం కేయూ అకడమిక్ కమిటీ హాల్లో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డితో కలిసి సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై మానిటరింగ్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సత్యనారాయణ పాల్గొని పలు సూచనలు చేశారు. స్పీకర్లుగా వచ్చే ప్రముఖ సైంటిస్టులకు వసతి తదితర ఏర్పాట్లపై చర్చించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సీహెచ్.మోహన్రావు హైదరాబాద్నుంచి ఆన్లైన్లో పలు సూచనలు చేశారు. ఈసారి సదస్సులో ప్రధాన థీమ్గా సాధికారిత కోసం వినూత్న పుణ్యాలు–యువభారతాన్ని మార్చడంలో శాస్త్ర సాంకేతికత అనే అంశంపై చర్చించనున్నారు. మరో ఏడు సబ్ థీమ్స్లో వివిధ లైఫ్ సైన్స్స్ విభాగాల్లోను అధ్యాపకులు, పరిశోధకులు విద్యార్థుల పేపర్ల ప్రజెంటేషన్స్, పోస్టర్ల ప్రజెంటేషన్స్ ఉంటాయి. ప్రతి థీమ్లో బెస్ట్ పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్లను ఎంపిక చేసి ప్రశంసపత్రాలు అందజేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వెంకట్రామ్రెడ్డి, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, టెక్నికల్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పి.మల్లారెడ్డి, టి.మనోహర్, టాస్ వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీ వడ్డె రవీందర్, సెషన్స్ కోఆర్డినేటర్ వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేయూ వివేచన న్యూస్లెటర్ విడుదల కాకతీయ యూనివర్సిటీ వివేచన న్యూస్లెటర్ను శుక్రవారం వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రంతో కలిసి విడుదల చేశారు. ఆరు నెలలుగా వర్సిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు ఆచార్యుల అవార్డులు, అచీవ్మెంట్స్, యూనివర్సిటీలో చేపట్టిన ప్రాంగణ నియామకాలు తదితర అంశాలను పొందుపర్చి వివేచన న్యూస్లెటర్గా విడుదల చేశారు. టాస్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ సత్యనారాయణ కేయూలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష -
నాగారంలో జెండా గొడవ
పరకాల : మండలంలోని నాగారం గ్రామంలో బీజేపీ నాయకులు నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ వివాదానికి దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యావత్ దేశంలో ఎక్కడ జెండా ఎగురవేయకముందే నాగారంలో కొందరు బీజేపీ కార్యకర్తలు గ్రామ కూడలిలోని బీజేపీ జెండా గద్దైపె జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్రెడ్డి, బీజేపీ గద్దైపె జాతీయ జెండాను ఎలా ఎగురవేస్తారంటూ నిలదీశారు. దీంతో జాతీయ జెండాను తొలగించే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ చోటుచేసుకొని గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులపై దాడి సరికాదు.. నాగారంలో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడడం సరికాదని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ పి.కాళీప్రసాద్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడులు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడకుండా చర్యకు ప్రతిచర్య ఉండడం ఖాయమన్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకుడు కట్కూరి దేవేందర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానపరుస్తూ బీజేపీ జెండా గద్దైపె త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతోపాటు జెండాను ధ్వంసం చేశారని ఐదుగురు బీజేపీ కార్యకర్తలపై గ్రామ కార్యదర్శి కురిమిళ్ల కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుండెబోయిన నర్సయ్య, కట్టగాని రాజయ్య, చిట్టిరెడ్డి మహేందర్రెడ్డి, వంగ భిక్షపతి, అడికెల సురేష్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. బీజేపీ జెండా గద్దైపె త్రివర్ణ పతాకం ఆవిష్కరణ..కాంగ్రెస్ నేతల అడ్డగింత దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు బీజేపీ నాయకులపై గ్రామ కార్యదర్శి ఫిర్యాదు -
అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..
మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖసన్న బియ్యం.. కొత్త రేషన్ కార్డులతో ప్రజల్లో ఆనందం ● రైతులను ఆదుకునేందుకే రుణమాఫీ, పెట్టుబడి సాయం ● పంద్రాగస్టు వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ● హనుమకొండ పోలీస్పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణజాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ స్నేహ శబరీష్, సీపీ సన్ప్రీత్ సింగ్హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజా పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఫలితాలు సాధించిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఆరు గ్యారంటీ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి కోసం చర్యల్లో భాగంగా క్రీడా పాఠశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జిల్లాలో ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. తాత్కాలికంగా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతు భరోసా, రైతుబీమా, రైతు రుణమాఫీ పథకాలను అందిస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు. జిల్లాలోని 54,734 మంది రైతులకు రూ.450.09 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం ఈ వానాకాలం 2025లో 1,44,192 మంది రైతులకు మొదటి విడతగా రూ.6 వేల చొప్పున రూ.152.76 కోట్లను వారి ఖాతాలో జమ చేశామన్నారు. సన్నబియ్యం.. కొత్త రేషన్కార్డులు ప్రజా ప్రభుత్వం ఉగాదినుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిందన్నారు. జిల్లాలో 2.31 లక్షల ఆహార భద్రతకార్డుదారులకు 414 రేషన్ దుకాణాల ద్వారా ప్రతీ ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం, 1,21,01 కొత్త రేషన్ కార్డులు, 25,349 కుటుంబ సభ్యులను అదనంగా చేర్చినట్లు వివరించారు. ఆయిల్ పామ్ విస్తరణ పథకం ద్వారా 2025 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 231మంది రైతులు 734 ఎకరాల్లో సాగుకు రూ.1.11 కోట్లకు పరిపాలనా అనుమతులు పొందినట్లు తెలిపారు. జిల్లాలోని 164 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించినట్లు మంత్రి తెలిపారు. సదస్సుల ద్వారా ఇప్పటివరకు మొత్తం 36,429 దరఖాస్తులు వచ్చాయన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి 302 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి నియమిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 163 మంది జీపీఓలను నియమించనున్నట్లు చెప్పారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందించి స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఇతర జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. కుడా ఆధ్వర్యంలో రూ.30 కోట్లతో భద్రకాళి దేవస్థానంలో మాడవీధుల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి సురేఖ తెలిపారు. రూ.4కోట్లతో భద్రకాళి చెరువులో పూడికతీత, రూ.70 కోట్లతో రోప్వే, సస్పెన్షన్ బ్రిడ్జి, ఇతర పనులు చేపట్టినట్లు వివరించారు. రూ.5 కోట్లతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఆధునీకరణ, రూ.4 కోట్లతో ఎల్కతుర్తి కూడలి అభివృద్ధి, రూ.2 కోట్లతో పాత కలెక్టర్ నివాస సముదాయం ఆధునికీరించినట్లు చెప్పారు. అదేవిధంగా భీమదేవరపల్లి మండలం వంగరలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన.. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 9 కోట్ల 12 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుని రూ.372.99 కోట్ల లబ్ధి పొందారని తెలిపారు. పరకాలలో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, జిల్లాలోని 74 సబ్ సెంటర్ భవనాల నిర్మాణాలకు రూ.11.45 కోట్లు మంజూరు చేసి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 2024, ఏప్రిల్నుంచి ఇప్పటివరకు రూ.54.19 కోట్ల ఖర్చుతో 21,146 మంది పేదలు వైద్య చికిత్సలు పొందగలిగారని తెలిపారు. వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కామన్ మెనూ అమలు చేస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లోని వంటశాలలకు ఎల్పీజీ కనెక్షన్లు అందిస్తున్నట్లు వివరించారు. 2025–26 సంవత్సరానికిగాను 7,902 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.483.49 కోట్లు లక్ష్యం కాగా, 1,288 సంఘాలకు రూ.134.52 కోట్లు బ్యాంకు లింకేజి రూపంలో ఇప్పటివరకు రుణాలు అందించామన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ, ఈబీసీ కులాలకు చెందిన 733 జంటలకు 7కోట్ల33లక్షల 85వేల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 9,990 ఇళ్లు మంజూరయ్యాయని వివరించారు. వనమహోత్సవంలో 23 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 13.76 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా 3 క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. 5 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసేందుకు 5 మండల సమాఖ్యలకు రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ.1.50 కోట్లను విడుదల చేశారని పేర్కొన్నారు. మంత్రి సురేఖ తన ప్రసంగంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఆయన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. అధికారిక ప్రసంగపాఠం కాకుండా ఆరోగ్యశ్రీ వంటి విషయాల్లో తన మనస్సులోని భావాలను వేదికపై వెల్లడించారు. నాడు వైఎస్సార్ తన మానస పుత్రికగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేదలు సైతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం పొందేలా చేశారన్నారు. దాని కొనసాగింపుగా ప్రస్తుత ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తోందని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నాటి ముఖ్యమంత్రి వైఎస్ చలువతోనే అమలు చేశామని, దాని ద్వారా ఎంతో మంది విద్యావంతులు అయ్యారని వివరించారు. -
స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ పనులను శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న తరగతి గదులు, ఎంత మందికి వసతి కల్పిస్తున్నారనే వివరాలను డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ను, ఎప్పటి వరకు పనులు పూర్తి చేస్తారని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 25వ తేదీలోగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కం ఎక్స్లెన్స్ సెంటర్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ ఈఈ సురేష్బాబు, అధికారులు నరేందర్రెడ్డి, రవీందర్, డీఎస్ఏ కోచ్లు ఉన్నారు. మామునూరు : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13వ తేదీతో ముగియగా.. విద్యాలయ సమితి మరోమారు గడువు పెంచుతూ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. హసన్పర్తి : మండలంలోని సిద్ధాపురంలో గల అగ్రికల్చర్ రీసెర్చ్ ఫార్మ్ను వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.జానయ్య శుక్రవారం సందర్శించి అక్కడి పనులను అడిగి తెలుసుకున్నారు. రీసెర్చ్ ఫార్మ్కు 50 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వీసీకి వివరించారు. అయితే ఈ భూమిలో తాటిచెట్లు ఉన్నందున గీత కార్మికులతో వీసీ జానయ్య మాట్లాడారు. అనంతరం నష్టపోతున్న తాటిచెట్లకు పరిహారం చెక్కులు అందజేశారు. వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రామన్నపేట : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అనుమతి లేకుండా గైర్హాజరైన ఆరుగురు జవాన్ల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు బల్దియా సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి శుక్రవారం తెలిపారు. 9,10 డివిజన్లలో క్షేత్రస్థాయిలో హాజరును తనిఖీ చేసే క్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది కనీసం 50 శాతం హాజరు నమోదు కాలేదని, 3–4 రోజులు వారి పనితీరును గమనించి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆరుగురు జవాన్ల వేతనంలో ఒక రోజు కోత విధించినట్లు పేర్కొన్నారు. ఇలాగే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే కఠిన చర్యలతో పాటు విధుల నుంచి తొలగిస్తామని సీఎంహెచ్ఓ హెచ్చరించారు. వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీపీ సన్ప్రీత్సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్రావు, సురేష్కుమార్, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, పరిపాలన విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి
● రుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్ : చారిత్రక వేయిస్తంభాల గుడిలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా రుద్రేశ్వరస్వామి వారిని విభూది, గంధంతో అలంకరించారు. ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహించి, దర్శనం కల్పించారు. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో గణపతికి అభిషేకం, స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భద్రకాళి దేవాలయంలో.. భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి శ్రావణమాస పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. మేయర్ గుండు సుధారాణి ఒడిబియ్యం, చీర సమర్పించారు. న్యూఢిల్లీకి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ జితేంద్రగుప్తా, సీపీఎంజీ తెలంగాణ పీవీఎస్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటు వరంగల్ ఎస్పీ రవికుమార్, హనుమకొండ ఎస్పీ హనుమంతు, సీతారాం, వెంకన్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
డెంగీతో బాలిక మృతి
వేలేరు: డెంగీ జర్వంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూత్రపు రమేష్ కూతురు శాన్విక(7)కు ఐదు రోజల క్రితం జర్వం రాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా గుర్తించి చికిత్స చేస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం మృతిచెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
వరంగల్ క్రైం: çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ùÎçÜ$-Ë$, ™ðlÌS…V>׿ Ķæ*…sîæ ¯éÆöP-sìæMŠSÞ {yýlVŠæÞ MýS…{sZÌŒæ sîæ… B«§ýlÓ-Æý‡Å…ÌZ ¯]lË$VýS$Æý‡$ VýS…gêÆ‡$$ çÜÃVýSÏ-Æý‡Ï¯]l$ AÆð‡‹Üt ^ólÔ>Æý‡$. çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ù΋ÜõÜt-çÙ¯ŒS BÐ]l-Æý‡-׿ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… HÆ>µr$ ^ólíܯ]l ÑÌôæ-MýS-Æý‡$ÌS çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ HïÜï³ ¯]lÆý‡-íÜ…àÆ>Ð]l# ÐðlÌS-Ïyìl…_¯]l ÑÐ]l-Æ>ÌS {ç³M>Æý‡….. Ô¶æ${MýS-ÐéÆý‡… E§ýlĶæ$… çßæ¯]l$-Ð]l$-Mö…yýl MýS$Ð]l*-ÆŠ‡-ç³-ÍÏÌZ° òÜÆ‡$$…sŒæ gZòÜ-‹œ çÜ*PÌŒæ §ýlVýSYÆý‡ ¯]lË$VýS$Æý‡$ Ð]lÅMýS$¢-Ë$ G…yýl$ VýS…gêÆ‡$$ MýSÍW E¯é²-Æý‡° Ð]l_a¯]l çÜÐ]l*-^éÆý‡…-™ø ¯éÆöP-sìæMŠSÞ ïÜI }M>…-™Œæ, GOòÜÞ ïÜòßæ^Œl ç³Æý‡$-Ô¶æ$-Æ>Ð]l¬-Ë$, íܺ¾…¨™ø MýSÍíÜ ÐðlãÏ M>Æý‡$-ÌZ VýS…gêÆ‡$$° ™èlÆý‡-ÍçÜ$¢¯]l² °…¨™èl$-ÌS¯]l$ A§ýl$-ç³#-ÌZMìS ¡çÜ$-MýS$-¯é²Æý‡$. MýSÈ…¯]l-VýS-ÆŠ‡MýS$ ^ðl…¨¯]l G…yîl Oò³gꯌl, G‹Üyîl A¯éÞ-ÆŠæ, G…yîl AÆ>¾¯Œl, MýS$Ð]l*-ÆŠ‡-ç³-ÍÏMìS ^ðl…¨¯]l AÆý‡Û§Šæ AÎRꯌS¯]l$ AÆð‡çÜ$t ^ólíÜ-¯]lr$Ï ™ðlÍ´ëÆý‡$. ÒÇ ¯]l$…_ 25MìS-ÌZÌS 800{V>-Ð]l¬ÌS G…yýl$ VýS…gêÆ‡$$-™ø´ër$ I§ýl$ òÜÌŒæ-¸ù¯]l$Ï, M>Æý‡$¯]l$ ÝëÓ«©¯]l… ^ólçÜ$-MýS$-¯]l²r$Ï ™ðlÍ´ëÆý‡$. Oò³gꯌl, A¯éÞ-ÆŠæ, AÆ>¾¯ŒS.. B…{«§ýl-{ç³-§ól-ÔŒæ& JyìlÔ> »êÆý‡zÆŠ‡ Ð]l§ýlª »êË$ A¯ól Ð]lÅMìS¢ ¯]l$…_ VýS…gêÆ‡$$° ¡çÜ$-Mö_a çßæ¯]l$-Ð]l$-Mö…yýl-ÌZ° MýS$Ð]l*-ÆŠ‡-ç³-ÍŠిÌSP ^ðl…¨¯]l AÆý‡Û§Šæ AÎRꯌS C…sZÏ yýl…‹³^ólíÜ, AÐ]l-çÜ-Æý‡-OÐðl$¯]l ÐéâýæÏMìS Ñ{MýS-Ƈ$$-çÜ$¢…sêÆý‡$. D{MýS-Ð]l$…-ÌZ VýS…gêÆ‡$$° M>Æý‡$-ÌZ ¡çÜ$-MöçÜ*¢ ´ùÎçÜ$-ÌSMýS$ ç³r$t-ºyéz-Æý‡° ™ðlÍ ´ëÆý‡$. °…¨™èl$-ÌS¯]l$ çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ùÎçÜ$-ÌSMýS$ Aç³µ-W…^èl-V> C¯ŒS-òܵ-MýStÆŠ‡ Ð]l$^èla ÕÐ]l-MýS$-Ð]l*ÆŠ‡ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ MøÆý‡$t-ÌZ àfÆý‡$-ç³-Ç_ ÇÐ]l*…yŠæMýS$ ™èlÆý‡-Í…_¯]lr$Ï ™ðlÍ´ëÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ Ķæ*…sîæ ¯éÆöP-sìæMŠS {yýlVŠæÞ MýS…{sZÌŒæ sîæ…, çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ù΋ÜõÜt-çÙ¯ŒS A«¨M>Æý‡$-Ë$, íܺ¾…¨ ´ëÌŸY-¯é²Æý‡$. 25 కిలోల 800 గ్రాముల గంజాయి, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ నరసింహారావు -
సాంకేతికాభివృద్ధిలో కొత్త ఒరవడి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సాంకేతికంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రాజెక్టు డైరెక్టర్ వంగూరు మోహన్రావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మోహన్రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఏపీటీఎస్–విజిలెన్స్ వారిచే గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగ అమరులకు కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 18 జిల్లాల్లో 70 లక్షల మంది వినియోగదారులకు 24/7 మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2024 సంవత్సరం (ఏప్రిల్ నుంచి జూలై) తో పోల్చుకుంటే 33 కేవీ బ్రేక్ డౌన్స్ 2025 (ఏప్రిల్ నుంచి జూలై) లో 21శాతం, 11 కేవీ బ్రేక్ డౌన్లు 46శాతం తగ్గాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎండీ వరుణ్ రెడ్డి స్వీయ ఆలోచనతో రూ. కోటి బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. పునరుత్పాదక శక్తి జూన్ 30, 2025 నాటికి ఎన్పీడీసీఎల్లో 2155.87 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జనరేషన్ సామర్థ్యాన్ని సాధించామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వంటేరు తిరుపతి రెడ్డి, మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు అశోక్ కుమార్, తిరుమల్రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, మాధవరావు, సీజీఎంలు చరణ్ దాస్, రవీంద్రనాథ్, జాయింట్ సెక్రటరి రమేష్, కంపెనీ కార్యదర్శి వెంకటేశం, వరంగల్ ఏపీటీఎస్ సీఐ కిరణ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్రావు -
సంఘాలను మరింత పటిష్టం చేయాలి
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీలు, టెస్కాబ్ పాలకవర్గాలకు ప్రభుత్వం ఆరు నెలలు పొడిగింపు ఇచ్చిన సందర్భంగా శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రపటాలకు పాలక వర్గంతో కలిసి రవీందర్ రావు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సేవ చేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. వరంగల్ డీసీసీబీని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి సేవలు విస్తృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు హరిప్రసాద్, మాడుగుల రమేష్, దొంగల రమేష్, ఎరబ్రెల్లి గోపాలరావు, మురళి, సంపెల్లి నరసింగరావు, నరేందర్ రెడ్డి, పోలపాక శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు రాజేష్ ఖన్నా, రామచంద్ర రావు, లక్ష్మారెడ్డి, దేవేందర్రావు, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ గౌడ్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
ఉత్తములకు ప్రశంసపత్రాలు
విధుల్లో ఉత్తమ సేవలందించిన పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు ప్రశంసపత్రాలు అందుకున్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద వారికి ప్రశంసపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. వేడుకల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు. –సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, వరంగల్ -
విద్యుదాఘాతంతో విద్యార్థికి గాయాలు
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థిని దైనంపల్లి సిరి తొమ్మిదో తరగతి చదువుతుంది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకల ఏర్పాట్లలో భాగంగా స్టీల్ పైప్తో కూడిన జెండాలను పట్టుకుని వెళ్తున్న క్రమంలో పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యార్థిని సిరి చేతికి, కాలుకు గాయాలు అయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది హూటహూటిన స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించా రు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న బాలికను పరామర్శించారు. -
దంత వైద్యశిబిరానికి స్పందన
హన్మకొండ చౌరస్తా: భారత స్వాతంత్య్ర దినోత్సవం, ఎస్వీఎస్ దంత వైద్యశాల 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ చౌరస్తాలోని దంత ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ గిరిధర్రెడ్డి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, టూత్పేస్టులు, మౌత్ వాష్లు అందజేశారు. దంతాల పరిరక్షణపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. వైద్య శిబిరంలో వైద్యులు గణేష్, హారిక, సిబ్బంది యాకూబ్రెడ్డి, సౌమ్య, చంద్రిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
బచ్చన్నపేట: తండ్రి మందలించాడని మనస్థాపంతో విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని లింగంపల్లిలో గురువారం రాత్రి జరి గింది. కుటుంబ సభ్యులు, ఎస్సై అబ్దుల్ హమీద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడబోయిన నర్సమ్మ–మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. చిన్న కుమారుడు సాయివర్ధన్ (20) హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. సాయివర్ధన్ సరిగా చదవడంలేదని తండ్రి మల్లయ్య మందలించాడు. దీంతో సాయివర్ధన్ క్షణికావేశంలో తమ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి పెద్దవంగర: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన గద్దల బన్నీ (17) తన చిన్నతనంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ గ్రామమైన ఉప్పరగూడెంలో తాత కొమురయ్య సంరక్షణ లో పెరిగాడు. పదో తరగతి పూర్తి కావడంతో ప్రస్తు తం నెల్లికుదరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రాఖీ పౌర్ణమితోపాటు వరుస సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. శుక్రవారం తాత పొలం పనులకు వెళ్లాడు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై క్రాంతికిరణ్ను వివరణ కోరగా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురీకి తరలించామని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. -
సాంకేతికాభివృద్ధిలో కొత్త ఒరవడి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సాంకేతికంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రాజెక్టు డైరెక్టర్ వంగూరు మోహన్రావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మోహన్రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఏపీటీఎస్–విజిలెన్స్ వారిచే గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగ అమరులకు కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 18 జిల్లాల్లో 70 లక్షల మంది వినియోగదారులకు 24/7 మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2024 సంవత్సరం (ఏప్రిల్ నుంచి జూలై) తో పోల్చుకుంటే 33 కేవీ బ్రేక్ డౌన్స్ 2025 (ఏప్రిల్ నుంచి జూలై) లో 21శాతం, 11 కేవీ బ్రేక్ డౌన్లు 46శాతం తగ్గాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎండీ వరుణ్ రెడ్డి స్వీయ ఆలోచనతో రూ. కోటి బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. పునరుత్పాదక శక్తి జూన్ 30, 2025 నాటికి ఎన్పీడీసీఎల్లో 2155.87 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జనరేషన్ సామర్థ్యాన్ని సాధించామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వంటేరు తిరుపతి రెడ్డి, మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు అశోక్ కుమార్, తిరుమల్రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, మాధవరావు, సీజీఎంలు చరణ్ దాస్, రవీంద్రనాథ్, జాయింట్ సెక్రటరి రమేష్, కంపెనీ కార్యదర్శి వెంకటేశం, వరంగల్ ఏపీటీఎస్ సీఐ కిరణ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్రావు -
సంఘాలను మరింత పటిష్టం చేయాలి
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీలు, టెస్కాబ్ పాలకవర్గాలకు ప్రభుత్వం ఆరు నెలలు పొడిగింపు ఇచ్చిన సందర్భంగా శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రపటాలకు పాలక వర్గంతో కలిసి రవీందర్ రావు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సేవ చేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. వరంగల్ డీసీసీబీని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి సేవలు విస్తృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు హరిప్రసాద్, మాడుగుల రమేష్, దొంగల రమేష్, ఎరబ్రెల్లి గోపాలరావు, మురళి, సంపెల్లి నరసింగరావు, నరేందర్ రెడ్డి, పోలపాక శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు రాజేష్ ఖన్నా, రామచంద్ర రావు, లక్ష్మారెడ్డి, దేవేందర్రావు, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ గౌడ్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి
● వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : త్వరలోనే కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు, మ రింత బలమైన సమగ్ర, సృజనాత్మకంగా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేద్దామని వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కేయూ పరిపాలన భవనం వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కేయూ స్వర్ణత్సవాల్లో భాగంగా ఈనెల 19, 20, 21వ తేదీల్లో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేయూ 23వ స్నాతకోత్సవాన్ని, టీజీఎడ్సెట్–2025ను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. రూసా ద్వారా ఐదు పరిశోధన కేంద్రాలు, 37 ప్రాజెక్టులకు రూ.37 కోట్ల నిధులను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వచ్చేనెలలో రూసా ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నామని, టీహబ్ సహకారంతో కేహాబ్లో స్టార్టప్లు నిర్వహించబోతున్నామన్నారు. జువాలజీ విభాగానికి రెండు పేటెంట్లు లభించాయన్నారు. వచ్చేనెలలో యూని వర్సిటీలోని అధ్యాపకులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్)ను ప్రవేశపెట్టబోతున్నట్లు వీసీ వెల్లడించారు. ఇటీవల బోధన, బోధనేతర, విశ్రాంత ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ బి.సురేష్లాల్, డాక్టర్ బి.రమ, సుదర్శన్, సుకుమారి, చిర్ర రాజు, ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాల డీన్లు, అధిపతులు, పరిపాలనాధికారులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
డెంగీతో చిన్నారి మృతి
వేలేరు: డెంగీ జర్వంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూత్రపు రమేష్ కూతురు శాన్విక(7)కు ఐదు రోజల క్రితం జర్వం రాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా గుర్తించి చికిత్స చేస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం మృతిచెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
దంత వైద్యశిబిరానికి స్పందన
హన్మకొండ చౌరస్తా: భారత స్వాతంత్య్ర దినోత్సవం, ఎస్వీఎస్ దంత వైద్యశాల 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ చౌరస్తాలోని దంత ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ గిరిధర్రెడ్డి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, టూత్పేస్టులు, మౌత్ వాష్లు అందజేశారు. దంతాల పరిరక్షణపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. వైద్య శిబిరంలో వైద్యులు గణేష్, హారిక, సిబ్బంది యాకూబ్రెడ్డి, సౌమ్య, చంద్రిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
వరంగల్ క్రైం: హనుమకొండ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో నలుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. హనుమకొండ పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నరసింహారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం హనుమకొండ కుమార్పల్లిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర నలుగురు వ్యక్తులు ఎండు గంజాయి కలిగి ఉన్నారని వచ్చిన సమాచారంతో నార్కొటిక్స్ సీఐ శ్రీకాంత్, ఎస్సై సీహెచ్ పరుశురాములు, సిబ్బందితో కలిసి వెళ్లి కారులో గంజాయిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్కు చెందిన ఎండీ పైజాన్, ఎస్డీ అన్సార్, ఎండీ అర్బాన్, కుమార్పల్లికి చెందిన అర్షద్ అలీఖాన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 25కిలోల 800గ్రాముల ఎండు గంజాయితోపాటు ఐదు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పైజాన్, అన్సార్, అర్బాన్.. ఆంధ్రప్రదేశ్– ఒడిశా బార్డర్ వద్ద బాలు అనే వ్యక్తి నుంచి గంజాయిని తీసుకొచ్చి హనుమకొండలోని కుమార్పల్లికి చెందిన అర్షద్ అలీఖాన్ ఇంట్లో డంప్చేసి, అవసరమైన వాళ్లకి విక్రయిస్తుంటారు. ఈక్రమంలో గంజాయిని కారులో తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డారని తెలి పారు. నిందితులను హనుమకొండ పోలీసులకు అప్పగించగా ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో యాంటీ నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్ టీం, హనుమకొండ పోలీస్స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 25 కిలోల 800 గ్రాముల గంజాయి, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ నరసింహారావు -
‘రేషన్’కు కొత్త బ్యాగులు
ఖిలా వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఏనుమాముల, వర్ధన్నపేట, నర్సంపేట ఎంఎల్ఎస్ గోదాములకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ముద్రించిన కొత్త సంచులు చేరుకున్నాయి. సెప్టెంబర్ 1వతేదీ నుంచి అన్ని చౌకధరల దుకాణాల్లో ప్రతి కార్డు దారుడికి ఉచితంగా ‘సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అని ముద్రించిన బ్యాగులను డీలర్లు పంపిణీ చేయనున్నారు. దీంతో వినియోగదారులు ఇంటినుంచి బ్యాగు తెచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సంచిపై సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రాలు ఉన్నాయి. -
సైన్స్ కాంగ్రెస్ను సమర్థవంతంగా నిర్వహించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19, 20, 21వ తేదీల్లో తలపెట్టిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్) జనరల్ సెక్రటరీ, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ కోరారు. శుక్రవారం కేయూ అకడమిక్ కమిటీ హాల్లో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డితో కలిసి సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై మానిటరింగ్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సత్యనారాయణ పాల్గొని పలు సూచనలు చేశారు. స్పీకర్లుగా వచ్చే ప్రముఖ సైంటిస్టులకు వసతి తదితర ఏర్పాట్లపై చర్చించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సీహెచ్.మోహన్రావు హైదరాబాద్ ుంచి ఆన్లైన్లో పలు సూచనలు చేశారు. ఈసారి సదస్సులో ప్రధాన థీమ్గా సాధికారిత కోసం వినూత్న పుణ్యాలు–యువభారతాన్ని మార్చడంలో శాస్త్ర సాంకేతికత అనే అంశంపై చర్చించనున్నారు. మరో ఏడు సబ్ థీమ్స్లో వివిధ లైఫ్ సైన్స్స్ విభాగాల్లోను అధ్యాపకులు, పరిశోధకులు విద్యార్థుల పేపర్ల ప్రజంటేషన్స్, పోస్టర్ల ప్రజంటేషన్స్ ఉంటాయి. ప్రతి థీమ్లో బెస్ట్ పేపర్, పోస్టర్ ప్రజంటేషన్లను ఎంపిక చేసి ప్రశంసపత్రాలు అందజేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వెంకట్రాంరెడ్డి, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, టెక్నికల్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పి.మల్లారెడ్డి, టి.మనోహర్ పాల్గొన్నారు. కేయూ వివేచన న్యూస్లెటర్ విడుదల.. కేయూ వివేచన న్యూస్లెటర్ను వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రంతో కలిసి విడుదల చేశారు. ఆరు నెలలుగా వర్సిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు ఆచార్యుల అవా ర్డులు, అచీవ్మెంట్స్, కాకతీయ యూనివర్సిటీలో చేపట్టిన ప్రాంగణ నియామకాలు తదితర అంశాలను పొందుపర్చి వివేచన న్యూస్లెటర్గా విడుదల చేశారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పలు పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికీ చెరువులు, వాగులు, వంకలు తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగకుండా రోడ్డు మార్గాలను డైవర్ట్ చేయాలన్నారు. ఇందుకు పోలీసు, గ్రామ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని, శిథిలావస్థలో ఉన్న గృహాలు, పాఠశాలలను గుర్తించి అందులో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. డ్రైనేజీలను మరమ్మతు చేయాలని, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా డ్యాంలు, చెరువుల స్థితిగతులను నిరంతరం పరిశీలించాలని, ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈనెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండల స్థాయి టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు సెలవులో వెళ్లకుండా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటూ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. డెంగీ, చికున్గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, ఇరిగేషన్ ఈఈలు శంకర్, సునీత, జిల్లా ఆర్అండ్బీ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరిక
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: ఇందిరాగాంధీ స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు, 24వ వార్డు ప్రజలతోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవరెడ్డి వారికి కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, తెల్లరేషన్ కార్డులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ గద్ద వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయం అన్నారు. విద్యావంతులు, ఉద్యోగులు, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 24వ వార్డులోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఎమ్మెల్యే సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేదర్, 24వ వార్డు అధ్యక్షుడు కోలా చరణ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య, ఓబీసీ వరంగల్ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, జిల్లా కమిటీ అధ్యక్షురాలు పార్వతమ్మ, మాజీ సర్పంచ్ చిలువేరు రజినీభారతి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, జిల్లా కార్యదర్శి నూనె పద్మ, పట్టణ అధ్యక్షురాలు కీర్తన, పట్టణ ప్రధాన కార్యదర్శి గద్ద జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు..సాక్షి వరంగల్/ఖిలా వరంగల్: జిల్లా సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా గుర్తించి హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయిందని గుర్తుచేశారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించామని పేర్కొన్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ మైదానంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై కలెక్టర్ సత్యశారద, ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్తో కలిసి మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2057 నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే రూ.4,100 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని, మామునూరు విమానాశ్రయం కల త్వరలో సాకారం చేస్తామని, ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. భూ సేకరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతం చేశామని, నర్సంపేటలో వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభించుకున్నామని తెలిపారు. కలెక్టరేట్ పనులు తదిదశకు చేరాయని, అధునాతన సౌకర్యాలతో వరంగల్ బస్టాండ్ నిర్మిస్తున్నామని, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. అటవీ శాఖ ద్వారా గత ఏడాది 26 లక్షల మొక్కలు నాటామని, ఈ ఏడాది 31 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పాకాల బయోడైవర్సిటీ పార్కు అభివృద్ధి, భద్రకాళి ఆలయ మాడవీధులు, రాజగోపురాల పనులు సాగుతున్నాయని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యం పొందుతున్నారని, గృహలక్ష్మితో రూ.500కు సిలిండర్లు అందుకుంటున్నారని, గృహజ్యోతి కింద లక్ష మందికిపైగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారని తెలిపారు. వరంగల్ను రెండో రాజధానిగా గుర్తిసాం మామునూరు విమానాశ్రయం కల త్వరలో సాకారం 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మధ్యకోటలోని ఖుష్మహల్ మైదానంలో జాతీయ జెండావిష్కరణ అలరించిన పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలుసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగవంతం..ఉత్తములకు ప్రశంసపత్రాలు -
మా సమస్యలు పరిష్కరించాలి
● స్వాతంత్య్ర సమరయోధుల వినతి హన్మకొండ అర్బన్: ™èlÐ]l$ çÜÐ]l$-çÜÅ-ÌS¯]l$ ç³ÇçÙP-Ç…^éÌS° ÝëÓ™èl…-{™èlÅ çÜÐ]l$-Æý‡-Äñæ*-«§ýl$-Ë$ MøÆ>Æý‡$. D Ðól$Æý‡MýS$ Ð]l$…{† Mö…yé çÜ$Æó‡-QMýS$ ѯ]l-†ç³-{™èl… A…§ýl-gôæ-Ô>Æý‡$. ÝëÓ™èl…-{™èlÅ ¨¯ø™èlÞÐ]l… çÜ…§ýl-Æý‡Â…V> çßæ¯]l$-Ð]l$-Mö…yýl ´ùÎ‹Ü ç³Æó‡yŠæ OÐðl$§é¯]l…-ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… °Æý‡Ó-íßæ…_¯]l M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ Ð]l$…{† Mö…yé çÜ$Æó‡Q.. ÝëÓ™èl…[™èlÅ çÜÐ]l$-Æý‡-Äñæ*-«§ýl$-ÌS¯]l$ çܯéÃ-°…^ól {MýSÐ]l$…-ÌZ ™èlÐ]l$ BÐól-§ýl-¯]l¯]l$ Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. ™éÐ]l¬ ¿¶æ* çÜ…º…«¨™èl çÜÐ]l$-çÜÅ-ÌS-™ø Cº¾…-§ýl$-Ë$ G§ýl$-ÆöP…r$-¯é²-Ð]l$° ™ðlÍ´ëÆý‡$. D ÑçÙ-Ķæ$OÐðl$ E¯]l²-™é«¨-M>Æý‡$-Ë$ ѯ]l²-Ñ…_¯é ç³sìæt…^èl$-MøÌôæ-§ýl° A¯é²Æý‡$. M>V>, Ð]l$…{† B ѯ]l-†° MýSÌñæ-MýStÆŠ‡ õܲçßæ ÔèæºÈ‹ÙMýS$ C_a ç³ÇÖÍ…-^éÌS° çÜ*_…^éÆý‡$. ˘ మెట్రోనగరాల సరసన వరంగల్ ● స్వాతంత్య్ర వేడుకల్లో మేయర్ సుధారాణి రామన్నపేట : రానున్న రోజుల్లో వరంగల్ మహానగరం దేశంలోని ఇతర మెట్రో నగరాల సరసన నిలుస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆమె కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగర ప్రజల చిరకాలవాంచ అయిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను రూ.4,100 కోట్లతో చేపట్టేందుకు రంగం సిద్ధమైందన్నారు. ఇందులో భాగంగానే రూ.158 కోట్లతో వరద ముంపు నివారణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సాస్కీ సంస్కరణల ద్వారా నగర అభివృద్ధికి రూ.200 నుంచి రూ.250 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
డీలర్లు లైసెన్స్ కలిగి ఉండాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: డీలర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, 1985 ఎరువుల నియంత్రణ చట్టం నియమనిబంధనలు పాటించాలని, పీఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేపట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. ఉప్పరపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ఓడీసీఎంఎస్ కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి రైతు దగ్గర నుంచి ఆధార్కార్డు వివరాలు సేకరించి మాత్రమే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు. అలాగే, వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం విక్రయ కేంద్రాలను తనిఖీలు చేయాలని, క్షేత్రస్థాయిలోఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
‘రేషన్’కు కొత్త బ్యాగులు
● ఏనుమాముల గోదాంకు చేరిన సంచులు ఖిలా వరంగల్: జిల్లాలోని ఏనుమాముల, వర్ధన్నపేట, నర్సంపేట ఎంఎల్ఎస్ పాయింట్లకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ముద్రించిన కొత్త సంచులు చేరుకున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని చౌకధరల దుకాణాల్లో ప్రతికార్డు దారుడికి ఉచితంగా ‘సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అని ముద్రించిన బ్యాగులను డీలర్లు పంపిణీ చేయనున్నారు. దీంతో వినియోగదారులు ఇంటినుంచి బ్యాగు తెచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సంచిపై సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలు ఉన్నాయి. విరబూసిన బ్రహ్మకమలం గీసుకొండ: మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన మాదినేని బాలస్వామి ఇంటిలో రెండేళ్ల క్రితం నాటిన బ్రహ్మకమలం మొక్క విరబూసింది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడిన శుభ సమయంలో బ్రహ్మకమలం విచ్చుకుని కనువిందు చేయడం విశేషం. సాధారణంగా బ్రహ్మకమలం మొక్క హిమాలయ పర్వతాలు, ఉత్తరప్రదేశ్, బర్మా, టిబెట్ , చైనా, నేపాల్ దేశాల్లో కనిపిస్తుంది. ఇలాంటి అరుదైన మొక్కను రాజమండ్రి నుంచి కొనుగోలు చేసి బాలస్వామి ఇంటి ఆవరణలో నాటగా తాజాగా ఓ పువ్వు పూసింది. ఏడాదికోసారి బ్రహ్మకమలం మొక్క పువ్వు పూస్తుందని, శివుడిని ఆరాధించడానికి ఈ పుష్పాన్ని ఉపయోగిస్తారని ఆయన తెలిపారు. -
ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి
● రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్ : చారిత్రక వేయిస్తంభాల ఆలయంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా రుద్రేశ్వరస్వామి వారిని విభూది, గంధంతో అలంకరించారు. ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహించి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రభాతసేవ, గణపతికి అభిషేకం, రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భద్రకాళి దేవాలయంలో.. భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి శ్రావణమాస పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. మేయర్ గుండు సుధారాణి ఒడిబియ్యం, చీర సమర్పించారు. న్యూఢిల్లీకి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ జితేంద్రగుప్తా, సీపీఎంజీ తెలంగాణ పీవీఎస్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటు వరంగల్ ఎస్పీ రవికుమార్, హనుమకొండ ఎస్పీ హనుమంతు, సీతారాం, వెంకన్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా వరంగల్లోని సద్గురు శివానందమూర్తి గురుసప్తధామంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో శుక్రవారం రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని, శ్రీచక్రాన్ని పూలమాలతో అలంకరించారు. అమ్మవారి ఉపాసకులు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. హంటర్రోడ్డులోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. నగరంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘నవోదయ’ గడువు పెంపు మామునూరు : వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న చివరి తేదీ ఉండగా.. విద్యాలయ సమితి మరోమారు గడువు పెంచుతూ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. కమిషనరేట్లో పంద్రాగస్టు వేడుకలు వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీపీ సన్ప్రీత్సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్రావు, సురేశ్కుమార్, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, పరిపాలన విభాగం సిబ్బంది పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం.. వేతనాల్లో కోత రామన్నపేట : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అనుమతి లేకుండా గైర్హాజరైన ఆరుగురు జవాన్ల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు బల్దియా సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి శుక్రవారం తెలిపారు. 9,10 డివిజన్లలో క్షేత్రస్థాయిలో హాజరును తనిఖీ చేసే క్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది కనీసం 50 శాతం హాజరు నమోదు కాలేదని, 3–4 రోజులు వారి పనితీరును గమనించి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆరుగురు జవాన్ల వేతనంలో ఒక రోజు కోత విధించినట్లు పేర్కొన్నారు. ఇలాగే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే కఠిన చర్యలతో పాటు విధుల నుంచి తొలగిస్తామని సీఎంహెచ్ఓ హెచ్చరించారు. -
నిర్మానుష్య ప్రదేశాలపై నిఘా పెట్టండి
● మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యం : సీపీ సన్ప్రీత్ సింగ్ కేయూ క్యాంపస్: ‘మత్తు పదార్థాల నియంత్రణకు విద్యాసంస్థల పరిసరాలతో పాటు నిర్మానుష్య ప్రదేశాలపై నిఘా పెట్టండి’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పోలీస్ అధికారులతో అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం సెనేట్ హాల్లో గురువారం పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల నిరోధానికి పోలీస్ అధికారులు పోలీస్టేషన్ పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణకు వివిధ చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా మద్యం దుకాణాల యజమానుల్ని ఆదేశించాలన్నారు. పోలీసు సిబ్బంది యోగక్షేమాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. కాగా, సన్ప్రీత్సింగ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీస్ అధికారులతో పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్షించారు. కేసుల పరిష్కారానికి పలు సూచనలిచ్చారు. సమావేశంలో డీసీపీలు షేక్సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్కుమార్, వరంగల్, జనగామ ఎస్పీలు శుభం, చేతన్ నితిన్, అదనపు డీసీపీలు ప్రభాకర్, రవి ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ప్రజా హక్కుల రక్షణకే రాహుల్గాంధీ పోరాటం
● హనుమకొండ, వరంగల్ డీసీసీ ఆధ్వర్యంలో ర్యాలీహన్మకొండ: దేశ ప్రజల హక్కులను కాపాడేందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఓటును చోరీ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు హరించిన బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గళాలను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజలు ఇప్పటికై నా వివేకులై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు బత్తిని శ్రీనివాస్రా వు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయిని లక్ష్మారెడ్డి, పెరుమాండ్ల రామకృష్ణ, పులి అనిల్కుమార్, ఎంపీ ఆనంద్, అల్వాల కార్తీక్, బుట్టి స్వప్న, రజాలి, గుంటి శ్రీనివాస్, మామిండ్ల రాజు పాల్గొన్నారు. -
ఇప్పటికీ పేదరికంలోనే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా.. బీదలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. రాజకీయ నేతలు అభివృద్ధి అని అంటున్నారే తప్ప అంతర్గతంగా గ్రామాలు, మారుమూల తండాలకు కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాజకీయ నాయకులు, ప్రజలకు నిజమైన సేవలందిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. – ఎండీ. సానియామీర్, బీఎస్సీ మూడో సంవత్సరం భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా చిన్న దేశాలకు స్వాతంత్య్రం వచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి. కానీ, 150 కోట్లకుపైగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు సంపాదిస్తున్నారు. ముందుగా రాజకీయ నాయకులు మారితేనే దేశం మారుతుంది. – గోగు రమేశ్, బీకాం మూడో సంవత్సరం అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకోనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది. – జాహ్నవి, బీకాం, ద్వితీయ సంవత్సరం రాజకీయ నాయకులకు అక్రమ సంపాదనపై ఉన్న మక్కువ దేశాభివృద్ధిపై లేదు. స్వార్థపు ఆలోచనలతోనే బతుకుతున్నారు. ఎవరు ఎటుపోతే నాకేంటి? అనుకుంటున్నారు. తోటి మిత్రులకు, పేదలకు, ఇతరులకు సాయం అందించినప్పుడు దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. పదిమంది చేసే పనిని ఒక ఏఐ చేస్తే మిగతావారి పొట్టకొట్టినట్లే కదా. ఏఐతో మానవ మనుగడకు ముప్పే. – ఎస్కే అన్వర్, బీఏ, తృతీయ సంవత్సరం ఆనాటి పోరాట యోధులు తెల్లదొరల తుపాకీ గుండ్లకు ఎదురు నిలబడి, ప్రాణత్యాగాలు చేసి భారత్కు స్వాతంత్య్రం తీసుకొచ్చారు. నవ చైతన్యానికి విద్య పునాది అని అంబేడ్కర్ చెప్పినట్లుగా యువకులు ఉన్నత చదువులు చదివి దేశానికి ఆదర్శంగా నిలవాలి. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఆపేసి ఉచిత విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. – మహంకాళి వరుణ్, బీకాం తృతీయ సంవత్సరం● -
భారత్ మెరవాలి
‘మనది ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న దేశమే. మారుతున్న ఆధునిక టెక్నాలజీని అందుకుని ఇంకా మార్పు రావాలి.. అప్పుడే భారత్ మెరుస్తుంది’ అని విద్యార్థులు అంటున్నారు. నేడు (శుక్రవారం) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘2047కు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత్ ఎలా ఉండాలి’? అనే అంశంపై, ఉచిత పథకాలు, పాలకుల విధానం, విద్యా, వైద్యం, ఆరోగ్య రంగం అంశాలపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ‘సాక్షి’ టాక్షో నిర్వహించింది. ఇందులో విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ -
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
‘దేశంలో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అవినీతి. దీనిని రూపుమాపినప్పుడే సమాజం బాగుపడుతుంది. బీద, ధనిక తేడాలు, అధికార దర్పం తదితర కారణాలతో స్వేచ్ఛాసమానత్వం ప్రజలందరికీ అందడం లేదు. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు, కొలువుదీరే చట్టసభలు న్యాయంగా పనిచేస్తేనే నాడు ఏ ఉద్దేశంతో అయితే బ్రిటిష్ వాళ్ల నుంచి స్వాతంత్య్రం పొందామో ఆ ఫలితాలు తారతమ్యాలు లేకుండా అందరికీ చేరుతాయి.’ అని ఉమ్మడి వరంగల్ జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో పలు అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా ప్రజలు తమ మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. – సాక్షి నెట్వర్క్అవినీతి పేదరికం నాణ్యమైన విద్య వైద్యం కుల వివక్ష -
వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రబలకుండా ప్రజల్లో విస్తృత చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వైద్య సదుపాయాలపై కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి డీఎంహెచ్ఓ అప్పయ్య, వివిధ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రై డే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశాలు, ఏఎన్ఎంలతో గ్రామాల్లో ఫీవర్ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స మావేశంలో డీపీఓ లక్ష్మీ రమాకాంత్, అడిషనల్ డీ ఎంహెచ్ఓ మదన్మోహన్ రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌతమ్ చౌహన్ ఉన్నారు. -
డీఈఓ జ్ఞానేశ్వర్పై చర్యలు తీసుకోవాలి
విద్యారణ్యపురి: వరంగల్ విద్యాశాఖ సమగ్రశిక్ష జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్తేజపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్పై చర్యలు తీసుకోవాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గురువారం హనుమకొండలోని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈనెల 12న ఎంఈఓలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో అకడమిక్ విషయాలపై సుజన్తేజ మాట్లాడుతుండగా జ్ఞానేశ్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్, టీఎస్యూటీఎఫ్, డీటీఎఫ్, టీపీటీఎఫ్, టీపీయూఎస్, ఎస్సీఎస్టీ యూఎస్ బాధ్యులు ఎస్.రవీందర్, తాటికాయల కుమార్, సి.సుజన్ప్రసాద్రావు, నామోజు శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్రెడ్డి, గోవిందరావు, కడారి భోగేశ్వర్, బి.వెంకటరమణ, ఎస్.వెంకన్న, ఎం.నర్సయ్య, గుండు కరుణాకర్, ఎస్ఏ రవూఫ్, కె.రవీందర్, వి.అరవింద్, కె.కుమారస్వామి ఉన్నారు. పీఏసీఎస్, డీసీసీబీల కాల పరిమితి పెంపుహన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీల పాలకవర్గాల కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది. 2025 ఫిబ్రవరి 14 నాటికి ఐదేళ్ల కాలపరిమితి ముగియగా.. ఆరు నెలలు పెంచింది. ఈ గడువు కూడా గురువారంతో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈమేరకు ఏపీసీ అండ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎం.రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డీసీసీబీ ప్రస్తుత పాలక వర్గం కాల పరిమితి ఈ నెల 24తో ముగియనుంది. దీంతో ప్రస్తుత పాలక వర్గంలో మరో ఆరు నెలల పాటు కొనసాగనుంది. ఈసందర్భంగా తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ.. ఈనెల 15న వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రం తనిఖీహన్మకొండ: హనుమకొండ సమ్మయ్యనగర్లోని లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చేశారు. ప్రతీ రోజు ఎంత మంది రోగులు వస్తున్నారో రికార్డులు పరిశీలించా రు. ఈహెచ్ఎంఐఎస్ ఆన్లైన్ పోర్టర్లో నమో దు చేసిన వివరాలను పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హైదర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హైదర్, సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ టాపర్లకు నగదు ప్రోత్సాహకాలువిద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి, ఇంటర్ చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఈనెల 15న స్వాతంత్య్ర వేడుకల్లో నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రతీ జిల్లా నుంచి పదో తరగతిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, ఇంటర్లో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు అందించనున్నారు. వీరికి హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో నగదు, ప్రశంసపత్రాలు అందించనున్నారు. రేపు జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపికలువరంగల్ స్పోర్ట్స్: ఈనెల 16న హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అండర్–15 బాలబాలికల జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య జిల్లా కార్యదర్శి ప్రశాంత్కుమార్ గురువారం ఒక ప్రకనటలో తెలిపారు. క్రీడాకారులు జనవరి 01, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలని, వెంట ఆధార్, బోనోఫైడ్ సర్టిఫికెట్లతో ఉదయం 9గంటలకు వాలీబాల్ గ్రౌండ్ వద్ద కన్వీనర్ రాముడుకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన జట్టు ఈనెల 18, 19 తేదీల్లో సరూర్నగర్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. -
భారత్ మెరవాలి
● ప్రపంచంలోనే దేశం అగ్రగామిగా నిలుస్తుంది.. ● పాలకుల విధానాలు మారాల్సిన అవసరం ఉంది ● అభిప్రాయాలు వ్యక్తం చేసిన ‘నలంద’ విద్యార్థులు ● ‘వందేళ్ల భారత్ ఎలా ఉండాలి’ అనే అంశంపై ‘సాక్షి’ టాక్షోమహబూబాబాద్ అర్బన్: ‘మనది ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న దేశమే. మారుతున్న ఆధునిక టెక్నాలజీని అందుకుని ఇంకా మార్పు రావాలి.. అప్పుడే భారత్ మెరుస్తుంది’ అని విద్యార్థులు అంటున్నారు. నేడు (శుక్రవారం) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘2047కు వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే భారత్ ఎలా ఉండాలి’? అనే అంశంపై, ఉచిత పథకాలు, పాలకుల విధా నం, విద్యా, వైద్యం, ఆరోగ్య రంగ అంశాలపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ‘సాక్షి’ టాక్షో నిర్వహించింది. ఇందులో విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. సమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకొనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది. – జాహ్నవి, బీకాం, ద్వితీయ సంవత్సరంకొన్ని పథకాలు తొలగించాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రజలకు ఉపయోగం లేనివి ఉన్నాయి. వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. వాటిని సక్రమంగా పేద, మధ్య తరగతి వారికి, చిరువ్యాపారులకు అందిస్తే దేశం ఆర్థిక పురోగతి సాధిస్తుంది. మిగిలిన నిధులను రైతులకు, పాఠశాలలు, గ్రామాలు, తండాల అభివృద్ధికి ఉపయోగించాలి. – హర్షవర్ధన్, బీఎస్సీ, ఫస్ట్ ఇయర్ నాయకుల్లో మార్పు రావాలి.. భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా చిన్న దేశాలకు స్వాతంత్య్రం వచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి. కానీ, 150 కోట్లకుపైగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు సంపాదిస్తున్నారు. ముందుగా రాజకీయ నాయకులు మారితేనే దేశం మారుతుంది. – గోగు రమేశ్, బీకాం మూడో సంవత్సరం