breaking news
Warangal District Latest News
-
యూరియా కోసం ఎగబడిన రైతులు
● లైన్లో నిలబడి తోపులాట ● పోలీసుల పహారాలో పంపిణీ కమలాపూర్: మండలంలోని శనిగరంలో బుధవారం రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. దీంతో పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. శనిగరంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి బుధవారం 444 బస్తాల యూ రియా రాగా.. సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయాన్నే పెద్ద ఎత్తున పీఏసీఎస్ వద్ద బారులుదీరారు. యూరియా పంపిణీ సమయంలో ఒక్కసారిగా ఎగబడి తోపులాడుకున్నారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ హరికృష్ణ ఎస్సై మధు, సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడికు చేరుకుని రైతులను క్యూలైన్లో నిల్చోబెట్టి ఒక్కొక్కరికి 3 బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేయించారు. అయినప్పటికీ రైతులందరికీ యూరియా బస్తాలు సరిపడకపోవడంతో కొందరు రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. రైతులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా బస్తాల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ యూరియా బస్తాల కోసం వ్యవసాయ పనులన్నీ వదులుకుని కుటుంబ సమేతంగా క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. -
‘పరఖ్’లో టాప్
విద్యారణ్యపురి: పర్ఫార్మెన్స్ ఎసెస్మెంట్ రివ్యూవ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ (పరఖ్ – న్యాస్) సర్వేలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుదలలో రాష్ట్రంలో హనుమకొండ జిల్లా టాప్గా నిలిచింది. భారతదేశంలోని పాఠశాలల విద్యార్థులు ఎంత బాగా నేర్చుకుంటున్నారో అంచనా వేయడం పరఖ్ (నేషనల్ అచీవ్మెంట్ సర్వే) లక్ష్యం. దేశంలోని విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యా స్థాయిని అంచనా వేసేందుకు పరఖ్ రాస్ట్రీయ సర్వేక్షన్–2024 (నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2024) పేరిట జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిసెంబర్– 2024లో 3, 6, 9 తరగతుల విద్యార్థులకు సర్వే నిర్వహించారు. ఈసర్వే అంశాల ఆధారంగా జాతీయ నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)– 2020 లక్ష్యాలు చేరేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈసర్వే నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ, స్టేట్ ప్రాజెక్ట్ అధికారులు, ఎన్సీఈఆర్టీఅండ్ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, జిల్లా విద్యా శిక్షణ సంస్థలు, ఇతర విద్యాసంస్థల అధికారులు, ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు. ప్రతీ నాలుగేళ్లకోసారి దేశవ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. సర్వే నిర్వహించిన అంశాలు ● గ్రామీణ, పట్టణ ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో సామర్థ్యాలపై ఈ సర్వే నిర్వహించారు. ● భాషలకు సంబంధించి ఆంగ్లం, తెలుగు, ఉర్దూలో సబ్జెక్టులకు సంబంధించి గణితం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రాలకు సంబంధించి సర్వే నిర్వహించారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. ● ఈ సర్వే ఫలితాల్లో 4 అంశాలవారీగా స్థాయిలను నిర్ణయించారు. ఇందులో ఉద్భవ్, ఉన్నత, ఉదయ్, ఉదిత్గా పేర్కొన్నారు. ఉదిత్ అత్యధిక స్థాయిని తెలియజేస్తుంది. ● హనుమకొండ జిల్లాలో భాషలు, గణితం అంశాల్లో ఉదిత్స్థాయి పొందుతూ ప్రథమ స్థానంలో రాష్ట్రంలో నిలిచింది. ● 9వ తరగతి విద్యార్థులు జాతీయస్థాయి నాణ్యత సాధించడంలో పోటీపడ్డారు. భాష నాణ్యతలో జాతీయస్థాయితో సమానంగా, గణితం – సైన్సెస్లో ఒకశాతం తేడాతో, సోషల్లో రెండుశాతం తేడాతో పోటీ పడినట్లు తేల్చారు. గుణాత్మక విద్యపై దృష్టిసారించడంతోనే.. రెండు, మూడు విద్యా సంవత్సరాల నుంచి హనుమకొండ జిల్లాలో విద్యార్థుల గుణాత్మక విద్యపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాలను అమలు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, ఉపాధ్యాయుల తరగతి గది బోధనను పరిశీలించడం, విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి, విద్యార్థి కేంద్రీకృత బోధన చేయడం ద్వారా వారిలో కనీస సామర్థ్యాలు పెంచడంతో ఈ లక్ష్యాలను చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా విద్యాశాఖ చేపట్టిన ప్రణాళిక, కార్యాచరణ సత్ఫలితాలను ఇచ్చిందని, డీఈఓ డి.వాసంతి, హసన్పర్తి ఇన్చార్జ్ ఎంఈఓ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. సబ్జెక్టు నిపుణులు, సబ్జెక్టు ఫోరం, స్కూల్కాంప్లెక్స్ హెచ్ఎంలు, మండల విద్యాశాఖాధికారులు తమ స్థాయిలో కృషి చేయడం వల్ల ఈసర్వేలో విద్యార్థుల్లో సామర్థ్యాల పెరిగాయని పేర్కొన్నారు. ప్రాథమిక తరగతి నుంచి విద్యార్థులు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, వ్యాఖ్యానించడం, గణిత పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి నిలపడం వల్ల సత్ఫలితాలు వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో హనుమకొండ జిల్లాకు మొదటిస్థానం విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుదల భాషలు, గణితం అంశాల్లో ఉదిత్స్థాయి గణితం – సైన్సెస్లో ఒకశాతం తేడా, సోషల్లో రెండు శాతం తేడా.. -
అట్టహాసంగా ‘ఐ–స్టెమ్ సమావేశ–12’
కాజీపేట అర్బన్: తెలంగాణలో తొలి ఐ–స్టెమ్ సమావేశాన్ని ‘ఐ–స్టెమ్ సమావేశ–12’ పేరిట నిట్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐ–స్టెమ్ వెబ్పోర్టల్ను ఆవిష్కరించి మాట్లాడారు. భారతదేశంలో శాసీ్త్రయ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు నిట్ వరంగల్, ఓప్సా (ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్) సౌజన్యంతో ఐ–స్టెమ్(ఇండియన్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్) వెబ్పోర్టల్ తోడ్పడుతుందన్నారు. నిట్లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్లు హరిలాల్, శిరీష్, వీరేశ్బాబు, రవికుమార్, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ గురుకులంలో ఆకస్మిక తనిఖీన్యూశాయంపేట: హనుమకొండ జిల్లా పరిధి ఒగ్లాపూర్ సైలానీబాబా దర్గా వద్ద ఉన్న పరకాల(బీ1) బాలుర మైనార్టీ గురుకులాన్ని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి(డీఎండబ్ల్య్లూఓ) కేఏ గౌస్ హైదర్ బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం, మైనార్టీ, నాన్మైనార్టీ సీట్ల కేటాయింపు వివరాల్ని ప్రిన్సిపాల్ రమేశ్లాల్ హట్కర్ను అడిగి తెలుసుకున్నారు. 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్లు ఏ మేరకు భర్తీ అయ్యాయో ఆరా తీశారు. కిచెన్హాల్, డైనింగ్, స్టోర్రూమ్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తహసీల్దార్లకు స్థానచలనంహన్మకొండ అర్బన్: జిల్లాలో తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లా నుంచి ఇటీవల వచ్చిన తహసీల్దార్ రాణికి నడికూడ తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. నడికూడ తహసీల్దార్గా ఉన్న రవీందర్రెడ్డిని హనుమకొండకు బదిలీ చేశారు. అదేవిధంగా కలెక్టరేట్లో ఎన్నికల విభాగ సూపరింటెండెంట్గా ఉన్న ఏవీఎన్ ప్రసాద్ను ఎల్క తుర్తి తహసీల్దార్గా నియమించారు. ఎల్కతుర్తిలో పని చేస్తున్న జగత్సింగ్ను కలెక్టరేట్కు బదిలీ చేశారు. బీఎస్ఎన్ఎల్ లీగల్ కౌన్సిల్గా వీరభద్రరావువరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా కోర్టు పరిధిలో గల కేసుల్లో బీఎస్ఎన్ఎల్ పక్షాన న్యాయవాదిగా పి.వీరభద్రరావును నియమిస్తూ అ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీరభద్రరావు ఈపదవిలో మార్చి –2026వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక కొనసాగుతారని పేర్కొన్నారు. ఈమేరకు వీరభద్రరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వీరభద్రరావును పలువురు న్యాయవాదులు కలిసి అభినందనలు తెలిపారు. ఇంతేజార్ గంజ్ సీఐకి అత్యుత్తమ పురస్కారంవరంగల్ చౌరస్తా: విధుల్లో అత్యుత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పతకానికి వరంగల్ ఇంతేజార్ గంజ్ సీఐ షుఖూర్ ఎంపికయ్యారు. ఈమేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఉత్తమ సేవలకుగాను అవార్డును ఎంపిక చేశారు. ఈసందర్భంగా సీఐ షుఖూర్కు సీఐలు, ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నేడు మేధస్సు సంపత్తి హక్కులపై అవగాహనరామన్నపేట: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం (నేడు) ‘ఆవిష్కరణను ప్రోత్సహించడం, సృజనాత్మకతను పరిరక్షించడం’ అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ బుధవారం తెలిపారు. పేటెంట్లు, ట్రేడ్మార్క్లు, డిజైన్లు, కాపీరైట్లు, భౌగోళిక సూచికలు వంటి అంశాలపై నిపుణుల ద్వారా ఉపన్యాసాలు, అనుభవాల వివరణలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు 94910 56452, 99124 22004 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
‘కార్పొరేట్’కు ఊడిగానికే 4 లేబర్ కోడ్లు
హన్మకొండ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు ఉద్యమాలు ఆగవని సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శులు కర్రె భిక్షపతి, గాదె ప్రభాకర్ రెడ్డి, హంసరెడ్డి, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ జిల్లా నాయకులు గంగుల దయాకర్, కౌడగాని శివాజీలు అన్నారు. బుధవారం సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏకశిలా పార్కునుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి ఎనిమిది గంటల పని విధానాన్ని ఎత్తివేసి, కార్మికుల సమ్మె హక్కును కాలరాస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు సిరబోయిన కరుణాకర్, అదరి శ్రీనివాస్, ఎన్ఎ స్టాలిన్, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, బొట్ల చక్రపాణి, ఎం. చుక్కయ్య, రాగుల రమేష్, గొడుగు వెంకట్, నున్నా అప్పారావు, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, జక్కు రాజ్ గౌడ్, బత్తిని సదానందం, నేదునూరి వెంకట్రాజం, కొట్టెపాక రవి, నేదునూరి రాజమౌళి, మునిగాల భిక్షపతి, వేల్పుల సారంగపాణి, ధర్ముల రాంమూర్తి, కార్మికులు పాల్గొన్నారు. కాగా, సమ్మెకు వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే కమలాపూర్: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్పాండే అన్నారు. కమలాపూర్లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం నేరమని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం అర్చక సమాఖ్యలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పురోహితులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వయసు ధ్రువీకరణకు ఆధార్కార్డును కాకుండా జనన, మరణ అధికారి, సంబంధిత పాఠశాల హెచ్ఎం ఇచ్చిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 18 ఏళ్లలోపు పిల్లలు వాహనాలు నడపకుండా, డ్రగ్స్ బారిన పడకుండా చూడాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ఫోన్ మరొక డ్రగ్గా మారిందని, సోషల్ మీడియాతో చాలా మంది నష్టపోతున్నారని, ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం కేజీబీవీలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులకు నచ్చిన రంగంలో రాణించేలా తల్లిదండ్రులు పోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.దామోదర్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్కుమార్, సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ హైమావతి, కేజీబీవీ ఎస్ఓ అర్చన తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరకాలం తర్వాత తెరుచుకున్న బడి
వేలేరు: పుష్కరకాలం క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ అధికారులు తిరిగి బుధవారం పునఃప్రారంభించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం గొల్లకిష్టంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదుశాతం తక్కువగా ఉందని 12 ఏళ్ల క్రితం మూసివేశారు. కాగా ప్రస్తుతం గ్రామానికి చెందిన 20 మందికి పైగా విద్యార్థులు వివిధ పాఠశాలల్లో చదువుతున్నారు. అయితే వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడి కొంతమంది పిల్లలు పాఠశాలకు వచ్చే విధంగా ఒప్పించారు. పిల్లలు వస్తుండడంతో ఎంఈఓ చంద్రమౌళి బడిని ప్రారంభించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో వేలేరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జ్ఞానేశ్వర్, పంచాయతీ కార్యదర్శి ఉమాకేశ్వర్, ఉపాధ్యాయుడు అరుణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘సూపర్ స్పెషాలిటీ’ పనులు పూర్తిచేయాలి
ఎంజీఎం: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆయా క్లినికల్ విభాగాల్లో వసతులు కల్పించేందుకు పూర్తి వివరాలతో కూడిన సూక్ష్మ ప్రణాళిక నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని పేర్కొన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మి స్తున్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆర్అండ్బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పిడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, పాథాలాజీ, ఫోరెన్సిక్, అనస్థీషియా, ఆర్థోపెడిక్ తదితర క్లినికల్ విభాగాలకు ఏ భవనాల్లో గదులు కేటాయించారు, ఇంకా మిగిలిన విభాగాలకు ఏ అంతస్తుల్లో గదులు కేటాయించాలి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అనంతరం ఆస్పత్రిలో నిర్మాణమవుతున్న 24 అంతస్తుల్లో పలు అంతస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు కీలక అంశాలపై నిర్మాణ ప్రతినిధులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేస్తే ఆయా శాఖలకు కేటాయించాల్సిన వనరులు, వసతులు కల్పించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న వివిధ పరికరాలను ఇక్కడికి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. వీటికి అదనంగా కొత్త పరికరాలను సంబంధిత శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్, ఎల్అండ్టీ అధికారి శరవరన్, జిల్లా ఆర్అండ్బీ అఽధికారి రాజేందర్, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ, ఆర్ఎంఓలు, అధికారులున్నారు. ఆస్పత్రిలో వసతుల కల్పనకు సూక్ష్మప్రణాళిక నివేదిక సమర్పించాలి అధికారుల, నిర్మాణ సంస్థ ప్రతినిధుల సమీక్షలో వరంగల్ కలెక్టర్ సత్యశారద -
ముందుకు సాగట్లే!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆతర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై రెండు మాసాలు నడుస్తున్నా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చేరక.. పెరిగిన భూగర్భజలాలు కూడా అంతంతే కావడంతో రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే.. మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడడంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా..ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల ఈసారి ఆశించిన మేరకు సాగు పెరగలేదని, అయితే ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా లోటు వర్షపాతమే.. వరి సాగు 6.39 శాతమే.. జనగామ జిల్లాల్లో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్లో సాధారణ వర్షాపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్లో 23, ములుగులో 32, హనుమకొండలో 30శాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శా తం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వ రిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది. ఉమ్మడి వరంగల్లో 2025–2026 వానాకాలం సాగు అంచనా, సాగు లెక్క ఇదీమొత్తం సాగు: 34.50%ఉమ్మడి జిల్లాకు కలిసిరాని వానాకాలం గత సీజన్లో ఇప్పటికే 74శాతం.. ఈ సారి 34.50 శాతానికే పరిమితం సాగు అంచనా 15.83 లక్షల ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది 5.46 లక్షల ఎకరాలు లోటు వర్షపాతం ఖాతాలో ఆరు జిల్లాలు కష్టకాలంలో పత్తి సాగువైపే మొగ్గు.. వరి సాగుపై వేచి చూసే ధోరణి మొత్తం సాగు అంచనా 15,82,755 ఎకరాలు -
కదం తొక్కిన కార్మికులు
నర్సంపేట: జిల్లాలో కార్మిక లోకం కదం తొక్కింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్మిక సంఘాల నాయకులు బుధవారం నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నర్సంపేటలో సీఐ టీయూ, బీఆర్టీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్ టీయూ న్యూ, ఐఎఫ్టీయూ, టీయూసీఐ నాయకులు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరించడం సరికాదని పేర్కొన్నారు. రోజుకు 8 గంటల పని విధానానికి స్వస్తి పలికి 10 గంటలు పనిచేయాలని చెప్పడం కార్మికవర్గాన్ని శ్రమదోపిడీకి గురి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపల్లి బాబు, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి గుంపెల్లి మునీశ్వర్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పంజాల రమేశ్, హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్షీనారాయణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేశ్, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు లలిత, మున్సిపల్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గడ్డం సమ్మయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు హనుమకొండ శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా సమ్మయ్య, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అసంఘటిత కార్మికులకు చట్టం చేయాలని డిమాండ్ -
శాంతిభద్రతలను కాపాడాలి
రాయపర్తి: శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వర్ధన్నపేట పోలీస్ సబ్డివిజన్ పరిధి సీఐలు, ఎస్సైలు, రైటర్లతో బుధవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ల విషయంలో తొందరపడకూడదని సూచించారు. సమావేశంలో సీఐలు, ఎస్సైలు, రైటర్లు పాల్గొన్నారు. ట్రాక్టర్ను దహనం చేసిన ఆగంతకులుఖానాపురం: ఆగంతకులు ట్రాక్టర్ను దహనం చేసిన సంఘటన మండలంలోని మనుబోతులగడ్డలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తేజావత్త్ బాలునాయక్ తన ట్రాక్టర్ను ఇంటి ఆవరణలో మంగళవారం రాత్రి ఉంచాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ట్రాక్టర్పై డీజిల్ పోసి నిప్పు అంటించారు. దీంతో ట్రాక్టర్ ఇంజన్ భాగం దగ్ధమై రూ.1.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు బాలునాయక్ తెలిపా రు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. మాజీ ఎంపీపీ ప్రకాశ్రావు, మాజీ సర్పంచ్ సోమయ్య, సొసైటీ డైరెక్టర్ అశోక్యాదవ్, వల్లెపు శ్రీనివాస్ పలువురు బాధితుడిని పరామర్శించారు. పశువులకు టీకాలు వేయించాలినెక్కొండ: వ్యాధులు సోకకుండా పశువులకు ముందస్తుగా టీకాలు వేయించాలని మామునూరు పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. జాతీయ సేవా పథకంలో భాగంగా గుండ్రపల్లిలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పశువులకు గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించామని తెలిపారు. పాల దిగుబడి పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. శిబిరంలో 243 పశువులకు వైద్యం అందించామని ఆయన పేర్కొన్నారు. శిబిరం ఏర్పాటుకు జిల్లా పశుసంవర్థక శాఖ శాఖ, స్కై ఈసీ, కారస్, కోరీస్ కంపెనీలు సహకారం అందించాయని వివరించారు. మండల పశువైద్యాధికారి మమత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు వంశీకష్ణ, రాజశ్రీ, కళాశాల అధ్యాపకులు అనిల్కుమార్రెడ్డి, ఫణికుమార్, అరుణ, వైద్యవిద్యార్థులు, గోపాలమిత్రులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇంతేజార్గంజ్ సీఐకి అత్యుత్తమ పురస్కారం వరంగల్ చౌరస్తా: విధుల్లో అత్యుత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవా పతకానికి వరంగల్ ఇంతేజార్గంజ్ సీఐ షుఖూర్ ఎంపికయ్యారు. ఈమేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఉత్తమ సేవలకు అవార్డును ఎంపిక చేశారు. బీఎస్ఎన్ఎల్ లీగల్ కౌన్సిల్గా వీరభద్రరావువరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా కోర్టు పరిధిలో గల కేసుల్లో బీఎస్ఎన్ఎల్ పక్షాన న్యాయవాదిగా పి.వీరభద్రరావును నియమిస్తూ అ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీరభద్రరావు ఈ పదవిలో మార్చి –2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా కొనసాగుతారని పేర్కొన్నారు. ఈ మేరకు వీరభద్రరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరభద్రరావును పలువురు న్యాయవాదులు కలిసి అభినందనలు తెలిపారు. -
నానో యూరియాతో అధిక దిగుబడి
నెక్కొండ: పత్తి, మొక్కజొన్న పంటల సాగులో రైతులు సస్యరక్షణ పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ సూచించారు. సాయిరెడ్డిపల్లి గ్రామంలో రైతు పెండ్లి మల్లయ్య వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఆ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ యంత్రం ద్వారా పిచికారీ చేశారు. పత్తి, మొక్కజొన్న పంటలపై నానో యూరియా, నానో డీఏపీల స్ప్రే చేయు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ డ్రోన్ స్ప్రే ద్వారా ఒక ఎకరం పంటను 10 నిమిషాల్లో 10 లీటర్ల నీటితో స్ప్రే చేయవచ్చన్నారు. దీంతో సమయం ఆదా అవుతుందని, కూలీల సమస్య తీరనుందని, ఎరువులు, పురుగుల మందులు, సమానంగా స్ప్రే చేయవచ్చనని ఆమె వివరించారు. నానో యూరియా, నానో డీఏపీని వివిధ పంటల 20 రోజుల దశ, పూతకు ముందుగా స్ప్రే చేయడం ద్వారా మంచి దిగుబడి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎకరాకు డ్రోన్ స్ప్రే చేయుటకు రూ.400 ఖర్చు అవుతుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత ఏఈఓ లేదా ఏఓను సంప్రదించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, ఏఓ నాగరాజు, ఏఈఓలు, గ్రోమోర్ ప్రతినిధి సజ్జన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ డ్రోన్తో పిచికారీపై రైతులకు అవగాహన -
‘సూపర్ స్పెషాలిటీ’ పనులు పూర్తిచేయాలి
ఎంజీఎం: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆయా క్లినికల్ విభాగాల్లో వసతులు కల్పించేందుకు పూర్తి వివరాలతో కూడిన సూక్ష్మ ప్రణాళిక నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని పేర్కొన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆర్అండ్బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పిడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, పాథాలాజీ, ఫోరెన్సిక్, అనస్థీషియా, ఆర్థోపెడిక్ తదితర క్లినికల్ విభాగాలకు ఏ భవనాల్లో గదులు కేటాయించారు, ఇంకా మిగిలిన విభాగాలకు ఏ అంతస్తుల్లో గదులు కేటాయించాలి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అనంతరం ఆస్పత్రిలో నిర్మాణమవుతున్న 24 అంతస్తుల్లో పలు అంతస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు కీలక అంశాలపై నిర్మాణ ప్రతినిధులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేస్తే ఆయా శాఖలకు కేటాయించాల్సిన వనరులు, వసతులు కల్పించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న వివిధ పరికరాలను ఇక్కడికి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. వీటికి అదనంగా కొత్త పరికరాలను సంబంధిత శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్, ఎల్అండ్టీ అధికారి శరవరన్, జిల్లా ఆర్అండ్బీ అఽధికారి రాజేందర్, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ, ఆర్ఎంఓలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాలకు రూ.8.2 లక్షల నిధులుగీసుకొండ: గీసుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మతు పనుల కోసం రూ.8.2 లక్షల నిధులు మంజూరయ్యాయని, పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె కళాశాలను ఆకస్మికంగా సందర్శించి వసతులను పరిశీలించారు. ప్రహరీ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు సరిగా లేవని, గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, భవనం పై భాగంలో రేకులు ఎగిరి పోవడంతో వర్షపు నీరు వస్తోందని, స్కావెంజర్ లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆమె దృష్టికి తీసుకురాగా.. వెంటనే పనులు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1.36 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. విద్యార్థులను గణితం, తెలుగు, సైన్స్ సబ్జెక్టుల్లోని ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు కష్టపడి చదువులో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఈఓ శ్రీధర్సుమన్, టీజీడబ్ల్యూ ఐడీసీ అసిస్టెంట్ ఇంజనీర్ మురళీకృష్ణ, ప్రిన్సిపాల్ శోభాదేవి పాల్గొన్నారు. ఆస్పత్రిలో వసతుల కల్పనకు సూక్ష్మప్రణాళిక నివేదిక సమర్పించాలి అధికారుల, నిర్మాణ సంస్థ ప్రతినిధుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద -
ముందుకు సాగట్లే.. !
ఉమ్మడి వరంగల్ జిల్లాకు కలిసిరాని వానాకాలం ● గత సీజన్లో ఇప్పటికే 74శాతం.. ఈ సారి 34.50 శాతానికే పరిమితం ● సాగు అంచనా 15.83 లక్షల ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది 5.46 లక్షల ఎకరాలు ● లోటు వర్షపాతం ఖాతాలో ఆరు జిల్లాలు ● కష్టకాలంలో పత్తి సాగువైపే మొగ్గు... వరి సాగుపై వేచి చూసే ధోరణిసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై 40 రోజులు దాటినా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చేరక.. పెరిగిన భూగర్భజలాలు కూడా అంతంతే కావడంతో రైతులకు ఈ వానాకాలం ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే.. మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడటంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా..ఆశించిన మేరకు వర్షాపాతం నమోదు కాకపోవడం వల్ల ఈసారి ఆశించిన మేరకు సాగు పెరగలేదని, అయితే ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా లోటు వర్షపాతమే... వరి సాగు 6.39 శాతమే.. జనగామ జిల్లాల్లో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్లో సాధారణ వర్షపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్లో 23, ములుగులో 32, హనుమకొండలో 30శాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శాతం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వరిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది. ఉమ్మడి వరంగల్లో 2025–2026 వానాకాలం సాగు అంచనా, సాగు లెక్క ఇదీ..5,46,138 మొత్తం సాగు శాతం : 34.50 శాతంఇప్పటి వరకు సాగైన విస్తీర్ణం15,82,755 -
వేతనాలు రాక వెతలు
ఉపాధి హామీ పథకం సిబ్బందికి మూడు నెలలుగా అందని జీతాలుఖానాపురం: గ్రామాల్లో వలసలను నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా కూలీలకు 100 రోజులపాటు పనులు కల్పించడంలో ఎఫ్ఏ (ఫీల్డ్ అసిస్టెంట్లు)ల పాత్ర కీలకం. కానీ, వేతనాలు సకాలంలో రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీరితోపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి సైతం నెలనెలా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 గ్రామీణ మండలాల పరిధిలో 74 వేల జాబ్కార్డులు ఉన్నాయి. 1.25 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్నారు. కూలీలకు గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా 163 మంది ఫీల్డ్అసిస్టెంట్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. వీరితో పాటు 40 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 29 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 10 మంది ఈసీలు, 10 మంది ఏపీఓలు మొత్తం 252 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా గ్రామాల్లో సంవత్సరానికి సరిపడా ఉపాధి పనులు గుర్తించి జాబ్కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పిస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు నూతనంగా గుర్తించిన పనులకు అంచనాలు వేయడం, పని ప్రదేశాల్లో కొలతలు వేయడం, రికార్డుల నిర్వహణ వంటి విధులు నిర్వర్తిస్తారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో మస్టర్లు పొందుపర్చడం, ఎఫ్ఏలకు మస్టర్లు ఇవ్వడం, నిధుల జనరేట్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. ఈసీలు, ఏపీఓలు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారు. భారమవుతున్న కుటుంబ పోషణ.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్ఏలు, ఇతర ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్ఏలు కూలీలకు పనులు తప్పనిసరిగా కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఎఫ్ఏలు ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. వీరితోపాటు ఇతర ఉద్యోగులు సైతం నిత్యం కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. వేతనాలు రాకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ సైతం భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వేతనాలు చెల్లించాలని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు కోరుతున్నారు. ఎఫ్ఏలు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్ల ఇబ్బందులుజిల్లా సమాచారంగ్రామీణ మండలాలు : 11పనిచేస్తున్న ఉద్యోగులు : 252 మంది జాబ్కార్డుల సంఖ్య : 74 వేలు కూలీల సంఖ్య : 1.25 లక్షలు -
ఉద్యోగి కుటుంబానికి బాసట
దామెర: మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి బాసటగా నిలిచారు తోటి ఉద్యోగులు. వివరాలిలా ఉన్నాయి. పులుకుర్తికి చెందిన గోవింద్ జైపాల్ ఒక సీడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల కిత్రం ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు సీడ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్, తోటి ఉద్యోగులు ముందుకొచ్చారు. ఈ మేరకు గ్రామంలో రూ.55 వేల విలువైన 25 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. మంగళవారం జైపాల్ భార్య శోభారాణికి ఇంటిస్థలం పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 25 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి పత్రాలు అందించిన తోటి ఉద్యోగులు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దామెర: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పరకాల రేవూరి ప్రకాశ్రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీఓను నివేదిక అడిగి తెలుసుకున్నారు. వివరాలు సరిగా లేవని, తప్పుల తడకగా నివేదిక తయారు చేశారని ఎంపీడీఓ కల్పనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఇంత నిర్లక్ష్యం తగదని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేయిస్తాని హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్తోపాటు దామెర, ముస్త్యాలపల్లి, పులుకుర్తి, వెంకటాపూర్ గ్రామ పంచాయితీ కార్యదర్శుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించకుంటే రద్దుచేసి అర్హులకు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, హౌసింగ్ డీఈ రవీందర్, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, మండల ప్రత్యేక అధికారి బాలరాజు, సీఐ రంజిత్ కుమార్, ఎస్సై కొంక అశోక్, ఏఓ రాకేశ్, సీనియర్ నాయకులు గుడిపాటి శ్రీధర్ రెడ్డి, సదిరం పోశాలు, దుర్శెట్టి భిక్షపతి, దామెర శంకర్, కిరణ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి నివేదిక తప్పుగా తయారుచేశారని దామెర ఎంపీడీఓ కల్పనపై ఆగ్రహం ఆదిలాబాద్కు బదిలీ చేయిస్తానని హెచ్చరించిన ఎమ్మెల్యే -
సంక్షేమ ప్రదాత వైఎస్సార్
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండలోని డీసీసీ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజేందర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీఎంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రుణ మాఫీ, ఉచిత విద్యుత్లాంటి అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుచేశారని పేర్కొ న్నారు. ఆయన పాలన అందరికీ రోల్ మోడల్ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో నేటికి చిరస్థాయిగా నిలిచిన మహావ్యక్తి అని కొనియాడారు. -
మాత్రా, సర్వమంగళగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా 13వ రోజు మంగళవారం అమ్మవారికి మాత్రా, సర్వమంగళ క్రమాల్లో పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని మాత్రా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని సర్వమంగళ అమ్మవారిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 10న మహాశాకంబరీ అమ్మ వారి దర్శన ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, వరంగల్ ఏఎస్పీ నాగరాలే శుభం ప్రకాశ్, మట్టెవాడ సీఐ గోపి దేవాలయాన్ని సందర్శించారు. కూరగాయలు సమర్పించిన భక్తులు.. మహబూబాబాద్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరసేవా ట్రస్ట్ సభ్యులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. కూరగాయలతో ఓసిటీ నుంచి ర్యాలీగా బయలుదేరి భద్రకాళి దేవాలయానికి చేరుకుని మహాశాకంబరీ అలంకరణకు కూరగాయలు సమర్పించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ర్యాలీకి స్వాగతం పలికారు.10న మహా శాకంబరీగా అమ్మవారి దర్శనం -
అభివృద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధం
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి డిప్యూటీ మేయర్ రిజ్వానా, బీఆర్ఎస్ కార్పొరేటర్ల సవాల్ హన్మకొండ: అభివృద్ధి, అవినీతిపై చర్చ సిద్ధమని బీఆర్ఎస్ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఎప్పుడు.. ఎక్కడికి రావాలో చెప్పాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి వారు సవాల్ విసిరారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి గ్రేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు మాట్లాడారు. సమస్యలు, అవినీతిపై ప్రశ్నిస్తారనే భయంతో కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే నాయిని ఎందుకు మేయర్కు సూచించడం లేదని ప్రశ్నించారు. భద్రకాళి చెరువు ఎఫ్టీఎల్ను తగ్గించడానికి గుట్టల వైపు మట్టికట్ట ఎందుకు పోస్తున్నారని నిలదీశారు. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకే ఎఫ్టీఎల్ తగ్గింపు అని ఆరోపించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుడు కాంట్రాక్టర్ కావడంతోనే చెరువు పూడికతీతపై కౌన్సిల్లో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. చెరువులో చనిపోయిన వ్యక్తికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. చెరువులో జరుగుతున్న అవినీతిపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ప్రశ్నిస్తే పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సోదా కిరణ్, బోయినపల్లి రంజిత్ రావు, ఇమ్మడి లోహిత రాజు, సంకు నర్సింగరావు పాల్గొన్నారు. -
‘పీఎంశ్రీ’తో కొత్తగా..
పరకాల: పేద విద్యార్థుల చదువుకు నాడు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యల్లో కొట్టుమిట్టాడింది. మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కానీ, నేడు పీఎం శ్రీ పథకానికి ఎంపికై నాన్ రెసిడెన్షియల్ స్కూల్గా ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తోంది పరకాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల. 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి రూ.27 లక్షల పీఎంశ్రీ నిధులతో పాఠశాలను అభివృద్ధి చేశారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారు. ఒకప్పుడు ఒక కంప్యూటర్ కూడా లేని పాఠశాలతో ఐఎఫ్పీ(ఇంటర్నెట్ ఫ్లాగ్ ప్యానల్) ద్వారా ఉపాధ్యాయులు డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాల పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం 180 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలతో విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులు వెలికితీస్తున్నారు. సైన్స్, మ్యాథ్స్ ప్రాజెక్టుల గురించి వివరిస్తున్నారు. ఆత్మరక్షణకు బాలికలకు కరాటేలో శిక్షణ ఇపిస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పోషణకు జీసీఈసీ వంటి క్లబ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖర్చుతోనే విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలకు తీసుకెళ్తున్నారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. రెండు మూడు రోజుల్లో విద్యార్థులకు ట్యాబ్లు కూడా పంపిణీ చేయనున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ప్రవర్తన గమనిస్తున్నారు. చదువులో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూనే మరో వైపు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. విద్యార్థులకు వసతులు కల్పించాం.. పీఎంశ్రీ పథకానికి పరకాల మండలంలో ఎంపికై న ఏకై క నాన్ రెసిడెన్షియల్ స్కూల్ కావడం ఎంతో గర్వంగా ఉంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యారంగాభివృద్ధికి 2027–28 సంవత్సరం వరకు రూ.ఐదు కోట్ల ఖర్చు చేస్తాం. ప్రస్తుతం ఉన్న 180 మంది విద్యార్థుల సంఖ్య మరో రెండేళ్లలో 500 వరకు పెరుగవచ్చు. –చక్రవర్తుల మధు, ప్రధానోపాధ్యాయుడు పాఠశాల అభివృద్ధికి సహకరించాలిఐనవోలు: పీఎంశ్రీకి ఎంపికై న ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని డీఈఓ డి.వాసంతి కోరారు. పాఠశాలలో మంగళవారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని సూచించారు. విద్యార్థి పురోగతిపై ప్రతి నెల జరుగనున్న పేరెంట్, టీచర్ మీటింగ్లో ఉపాధ్యాయుడికి తెలియజేయాలని చెప్పారు. మంచి బోధన చేస్తూ విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్ రెడ్డి, ఎంఈఓ పులి ఆనందం, హెచ్ఎం సదానందం, మోహన్రావు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రూ.27 లక్షలతో పరకాల జెడ్పీహెచ్ఎస్ అభివృద్ధి పెరిగిన విద్యాప్రమాణాలు, మౌలిక వసతులు డిజిట్ పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు త్వరలో విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ -
పంటల సాగులో యూరియా తక్కువ వాడాలి
● డీఏఓ అనురాధ నర్సంపేట: రైతులు తమ పంటలకు యూరియాను తక్కువ మోతాదులో వాడాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ అన్నారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ సహకార సంఘాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గోదాంలోని స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు తమకు అవసరం ఉన్న మేరకే యూరియాను తీసుకెళ్లాలన్నారు. యూరియా దొరకదనే నెపంతో కొంత మంది రైతులు ఇళ్లలో యూరియాను స్టాక్ చేసుకుంటున్నారని అది సరికాదన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మర్ మురహరి రవి, సొసైటీ సిబ్బంది ఎల్లయ్య, అశోక్, ప్రవీణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి● కస్తూర్బా పాఠశాలను సందర్శించిన డీఈఓ పర్వతగిరి: టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ జ్ఞానేశ్వర్ అన్నారు. పర్వతగిరి లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులు, మౌలి క వసతులను పరిశీలించారు. ప్రతీ తరగతి గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులను ప్రశ్న లు అడిగారు. పాఠశాలలో అందిస్తున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గాయపు లింగారెడ్డి, పర్వతగిరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ పాక రమేష్బాబు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ నాజియాసల్మా, సీఆర్పీ భూక్య శ్రీని వాస్, సీసీఓ గారె జయరాజ్ పాల్గొన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలిఖానాపురం: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎకై ్సజ్శాఖ అధికారి మురళీధర్రావు అన్నారు. మండలంలోని అశోక్నగర్, ఖానాపురం, బుధరావుపేటతోపాటు పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువే ప్రధాన ఆయుధమన్నారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు భవిష్యత్లో ఉన్నతులుగా ఎదుగుతారని తెలిపారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదువుకోవాలని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని సూచించారు. టీవీలు, సెల్ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమాల్లో డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ సునీల్కుమార్, ఎకై ్సజ్ సీఐ నరేష్రెడ్డి, ఎంఈఓ శ్రీదేవి, ఎస్ఓ మేనక, రిటైర్డ్ హెచ్ఎం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్గా అపర్ణనర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ అపర్ణకు ప్రమోషన్ కల్పిస్తూ డైరెక్టర్ ఆఫర్ మెడికల్ ఎడ్యూకేషన్ నుంచి మంగళవారం జాబితా విడుదలైంది. ఇప్పటివరకు నర్సంపేట ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిలో పాథాలజి డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కిషన్కు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించారు. ఆ స్థానంలో వరంగల్ కేఎంజీ/ఎంజీఎం పిడియాక్రిక్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి రెగ్యూలర్ సూపరింటెండెంట్గా నియమిస్తూ ఉత్వర్తులు జారీ చేశారు. -
గుడువు దాటిన చెక్కులు వాపస్
కమలాపూర్: గడువుదాటిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రెవెన్యూ అధికారులు మంగళవారం వాపస్ తీసుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి చేతుల మీదుగా సోమవారం మండలానికి చెందిన 100 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అందులో పలువురికి గడువు దాటిన చెక్కులు పంపిణీ చేసిన విషయం విదితమే. ‘గడువు దాటిన చెక్కులతో అవాక్కు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. మండల వ్యాప్తంగా గడువు దాటిన చెక్కులు అందుకున్న 20 మందిని గుర్తించారు. వారి నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను వాపస్ తీసుకుని, వాటిని రీవ్యాలిడేషన్ కోసం హనుమకొండ ఆర్డీఓ రమేశ్కు పంపించినట్లు తెలిపారు. వారం రోజుల్లో లబ్ధిదారులకు రీవ్యాలిడేషన్తో కూడిన చెక్కులు అందజేస్తామని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని తహసీల్దార్ సురేశ్కుమార్ సూచించారు. -
అభివృద్ధి పథం..
● మానుకోట జిల్లా సోమ్లాతండా, కేసముద్రంలో రూ.400కోట్ల పనులకు శంకుస్థాపనలు ● హాజరైన డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు సాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం/మహబూబా బాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహబూబాబాద్ పరిధిలో సుమారు రూ.100కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్ భవనాలు, నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, పట్టణంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, నూతన సబ్స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. కార్యకర్తల్లో జోష్.. బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి, రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజ నీరింగ్ కళాశాల, ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు ఏమన్నారంటే...– వివరాలు 8లోu -
ఎన్నికల నిర్వహణలో బీఎల్ఓల పాత్ర కీలకం
వర్ధన్నపేట: ఎన్నికల నిర్వహణలో బీఎల్ఓల పాత్ర చాలా కీలకమని జిల్లా ఎలక్టోరల్ ఆఫీసర్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని వర్ధన్నపేట మండల బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యపాల్రెడ్డి మా ట్లాడుతూ బీఎల్ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.శిక్షణలో నేర్చుకున్న అంశాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్సాగర్, నాయక్ తహసీల్దార్ షేక్ అనీఫ్ పాషా, ట్రైనర్లు ఏవీఆర్ చార్యులు, మనుజేందర్రెడ్డి, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
కేఎంసీ ప్రిన్సిపాల్గా సంధ్య
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా డాక్టర్ ఎస్.సంధ్య నియమితులయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆస్పత్రుల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా నియామకానికి ఇటీవల 44 మంది ప్రొఫెసర్లకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అడిషనల్ డీఎంఈ)గా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్న సంధ్యకు అడిషనల్ డీఎంఈగా పదోన్నతి కల్పించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేఎంసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఫారిన్ డిప్యుటేషన్ సర్వీస్ (ఎఫ్డీఎస్)పై కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీస్ కుటుంబాలకు చెక్కుల అందజేత వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ పలు కారణాలతో గత సంవత్సరం మరణించిన ఎస్సై నర్సింహారావు కుటుంబానికి రూ.15,92,134, మరో హెడ్కానిస్టేబుల్ శ్రీరాం రాజు కుటుంబానికి రూ.15,22,983 విలువైన చెక్కులను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబ స్థితిగతులపై సీపీ ఆరా తీశారు. కార్యక్రమంలో ఏఓ సంపత్ కుమార్ పాల్గొన్నారు. అందరి సహకారంతో అభివృద్ధి : ‘కుడా’ చైర్మన్ నయీంనగర్: అందరి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం కుడా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా వచ్చే నాలుగేళ్లలో చేపట్టనున్నపనులు, వరంగల్ మాస్టర్ప్లాన్ –2041పై చర్చించారు. సమావేశంలో జీడబ్లూఎంసీ కమిషనర్, కుడా వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, జేపీఓ, ఏపీఓ తదితరలు పాల్గొన్నారు. -
అభివృద్ధి పథం..
● మానుకోట జిల్లా సోమ్లాతండా, కేసముద్రంలో రూ.400 కోట్ల పనులకు శంకుస్థాపనలు ● హాజరైన డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు సాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం/మహబూబా బాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహబూబాబాద్ పరిధిలో సుమారు రూ.100 కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్ భవనాలు, నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300 కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, పట్టణంలో 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, నూతన సబ్స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. కార్యకర్తల్లో జోష్.. బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి, రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కళాశాల, ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రులు ఏమన్నారంటే...– వివరాలు 8లోu -
సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు
నర్సంపేట రూరల్: సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. ‘పల్లె దవాఖానాలో సేవలు సున్నా..’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఎంహెచ్ఓ మంగళవారం ఇటుకాలపల్లి పల్లె దవాఖానాను తనిఖీ చేశారు. రికార్డులు, మెడిసిన్, తనిఖీ చేశారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పల్లె దవాఖానాలో వైద్యులు, వైద్యసిబ్బంది సకాలంలో హాజరుకావాలని, సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఫీవర్ సర్వేలతో జ్వరపీడితులు గుర్తించి ప్రత్యేక క్యాంప్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో అనిల్ కుమార్, డాక్టర్లు అరుణ్చంద్ర, డాక్టర్ రామ్రాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరా మహిళా శక్తి సంబురాలు
వర్ధన్నపేట: ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించి సంవత్సరంం పూర్తయిన సందర్భంగా ఈనెల 7వ తేదీ నుంచి 16 వరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ మహిళా శక్తి సంబురాలను ఘనంగా నిర్వహించాలని డీఆర్డీ ఏ, సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనిల్ వీఓఏల అధ్యక్ష, కార్యదర్శులకు సూచించారు. పట్టణ కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో మహిళా సమైక్యలకు ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, మహిళా శక్తి క్యాంటీన్ల మొదలగు వాటి నిర్వహణ బాధ్యతలతో మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి ప్రత్యేక కార్యక్రమాన్ని మహిళలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. అనంతరం వివిధ వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణిస్తున్న ఉత్త మ ఎంటర్ప్రెన్యూర్లను సన్మానించారు. అంతకు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎం వీర్ల వేణు, సీసీలు గోలి కొమురయ్య, రమేష్, అనిల్ స్వామి, చీకటి కవిత, లెక్కల జ్యోతి, మండల పద్మ, తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ అనిల్ -
విద్యార్థి దశలోనే పొదుపు అలవర్చుకోవాలి
నర్సంపేట: విద్యార్థి దశలోనే పొదుపును అలవర్చుకోవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో మంగళవారం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో ఆర్ధిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పొదుపు చేసుకున్న డబ్బులు జీవితంలో ఎన్నో అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తల్లిదండ్రులకు కూడా పిల్లలు పొదుపు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. డబ్బులను పొదుపు చేయకుండా ఖర్చు చేస్తే అవసరమైన సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. ప్రతి ఒక్కరు పొదుపుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. మొక్కలను నాటడమే కాకుండా ప్రతి ఒక్కరు వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ జ్ఞానేశ్వర్, డీఆర్డీఓ కౌసల్యదేవి, తహసీల్దార్ మహమ్మద్ అబిద్అలీ, జిల్లా బ్యాంకు అధికారి రాజు, గిర్దావర్ మహ్మద్ రషీద్, ప్రిన్సిపాల్ జయశ్రీ, పంచాయతీ కార్యదర్శి సురేష్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలి పర్వతగిరి: మహిళలు కృత్రిమ ఆభరణాల తయారీలో శిక్షణ పొంది ఆర్ధిక అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో నాబార్డ్, సెర్ప్ డీఆర్డీఏ వరంగల్ సంయుక్త సౌజన్యంతో పర్వతగిరి, వర్ధన్నపేట మండల ఔత్సాహికులకు ఏడు రోజులపాటు నిర్వహించనున్న ఆర్టిఫిషియల్ జ్యూవెలరీ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృత్రిమ ఆభరణాలకు చాలా డిమాండ్ ఉందని అన్నారు. గొప్ప వ్యాపారవేత్తలుగా తయారవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ రేణుకదేవి, సీఎంఓ సీనియర్ జర్నలిస్టు శివ, జిల్లా విద్యాశౠఖ అధికారి, నాబార్డు డీడీఎం, ఎల్డీఎం, తహసీల్దార్ వెంకటస్వామి, డీపీఎం దాసు, డీపీఎం సుజాత, ఎంపీఈఓ శేషు, ఏపీఎం టి.కృష్ణమూర్తి, సీసీలు సుధాకర్, రవీందర్రాజు, కాంతయ్య, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. ‘ఆపరేషన్ ముస్కాన్’ పకడ్బందీగా నిర్వహించాలి న్యూశాయంపేట: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 11వ విడత ఆపరేషన్ ముస్కాన్ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. బాలకార్మికులకు భిక్షాటన, వెట్టిచాకిరిల నుంచి విముక్తి కల్పించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలకార్మికులను గుర్తించి బాలసదన్లో చేర్పించాలని చెప్పారు. బడికి దూరంగా ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
‘నాసిరకం’ పరేషాన్!
సాక్షి, వరంగల్: జిల్లాలో వారం రోజుల నుంచి ఆడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి మొక్కలు సారవంతంగా ఎదిగేందుకు ఎరువులు, పెస్టిసైడ్స్ వినియోగించేందుకు రైతులు ఆరాటపడుతున్నారు. మరోవైపు ఫర్టిలైజర్ మార్కెట్లో నకిలీ, కాలం చెల్లిన పెస్టిసైడ్ అమ్ముతూ కొందరు వ్యాపారులు టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కుతుండడం కలవరపెడుతోంది. అన్నదాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని కొందామనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఈ నకిలీ బారినపడి పంటను చేజార్చుకున్న ఘటనలు కొకొల్లలు. అయితే రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందేలా చూడాల్సిన వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈనకిలీ బెడద ఎక్కువవుతోందని రైతుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. ఇటీవల టాస్క్ఫోర్స్ దాడుల్లో జిల్లాలో వరుసగా నకిలీ, కాలం చెల్లిన ఎరువులు పట్టుబడుతున్నా.. వ్యవసాయ అధికారుల్లో పెద్దగా చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయా ఫర్టిలైజర్ దుకాణా యజమానులు ఇచ్చే మామూళ్లకు ఆశపడి క్షేత్రస్థాయిలో తనిఖీలు మరిచారనే టాక్ వస్తోంది. ఇప్పటికై నా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో తనిఖీలు చేయాలని రైతులు కోరుతున్నారు. నాసిరకం బెడద నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. రైతులు ఏం చేయాలంటే.. వ్యవసాయశాఖ లైసెన్సు పొందిన డీలర్ వద్దనే విత్తనాలు, పెస్టిసైడ్స్, ఎరువులు కొనాలి. సరిగ్గా సీల్ వేసి ఉన్న ప్యాకెట్లు, బస్తాలను ధ్రువీకరణ పత్రం (ట్యాగ్) ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. బస్తా, ప్యాకెట్పై గడువు తేదీ, రకం పేరు, లాట్ నంబర్లను గమనించాలి. కొనుగోలు బిల్లుతోపాటు నంబరు, విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలరు సంతకంతోపాటు రైతు సంతకం బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. పంటల అధిక దిగుబడికి నాణ్యమైన ఎరువులనే వాడాలి. మిషన్ కుట్టు ఉన్న ఎరువుల బస్తాను మాత్రమే కొనాలి. బస్తాపై ప్రమాణిక పోషకాలు, ఉత్పత్తిదారుల వివరాలు ఉండాలి. చిరిగిన, రంధ్రాలున్న బస్తాలను తిరస్కరించాలి. ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చాలి. కొనుగోలు చేసిన ఎరువుల విషయంలో అనుమానం వస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారమివ్వాలి. అవగాహన అవసరం చీడపీడల నివారణకు వాడే క్రిమిసంహారక మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మందుల విషపూరిత స్థాయిని తెలిపేందుకు డైమండ్ ఆకారంలో తెలుపు రంగు వినియోగిస్తారు. వాటి వర్గీకరణను బట్టి విష స్థాయిని అంచనా వేసుకో వచ్చు. ఎరుపు రంగు ఉంటే అత్యంత విష పూరితం. పసుపు రంగు అతి విష పూరితం. నీలి రంగు విష పూరితం, ఆకు పచ్చరంగు స్వల్ప విష పూరితం అని అర్థం చేసుకోవాలి. వాడిన మందు సీసా, డబ్బా, ప్యాకెట్లను ధ్వంసం చేసి పాతిపెట్టాలి. మందులు కలిపిన పాత్రలను ఇతర అవసరాలకు వాడకూడదు. విచక్షణ రహితంగా పురుగు మందులను వాడడం మంచిదికాదు. రైతులను భయపెడుతున్న ‘నకిలీ పెస్టిసైడ్స్’ జిల్లాలో జోరుగా వర్షాలు.. ఎరువుల వైపు అన్నదాతల చూపు ఇటీవల టాస్క్ఫోర్స్ దాడుల్లో కాలం చెల్లిన పురుగుమందులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులుఇటీవలి ఘటనలు.. జూన్ 26న నల్లబెల్లి మండలం రేలకుంటలోని ఓ పెస్టిసైడ్స్ దుకాణంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేసి కాలం చెల్లిన రూ.14.93 లక్షల విలువైన ఎరువులు, పురుగు మందులు పట్టుకున్నారు. జూన్ 27న దుగ్గొండి మండల కేంద్రంలోని ఓ పెస్టిసైడ్ దుకాణంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రూ.51,488 విలువైన నకిలీ ఫె ర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ను స్వాధీనం చేసుకున్నా రు. మరో రెండు దుకాణాల్లో కాలం చెల్లిన రూ.48,600, రూ.25,270 విలువైన పెస్టిసైడ్స్ను పట్టుకున్నారు. అలాగే నర్సంపేట మండలం చంద్రయ్యపల్లిలో రూ.58వేల విలు వైన నకిలీ ఎరువులను పట్టుకున్నారు. జూన్ 30న వరంగల్లోని అబ్బనికుంట ప్రాంతంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రూ.38,267 విలువైన నకిలీ పెస్టిసైడ్స్, పురుగు మందులు పట్టుకున్నారు. -
విద్యార్థులు విలువలు పెంపొందించుకోవాలి
నర్సంపేట: విద్యార్థులు చదువుతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని జిల్లా వైద్యఆరో గ్యశాఖ అధికారి సాంబశివరావు అన్నారు. నర్సంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ మోడల్ హైస్కూల్లో మంగళవారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు శారీరక, మానసిక స్థితి, శాసీ్త్రయ దృక్ఫథం ఆర్థిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సైక్రియాటిస్ట్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ.. విద్యార్థులు సమస్యలను సాధారణంగా పరిష్కరించుకోవాలని.. మానసిక ఒత్తిడికి గురి కావొద్దని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం టెలిమానస్ అనే ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. సమస్యలు ఉంటే వెంటనే 14461 నంబర్లో సంప్రదించి సలహాలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శాంతకుమారి, ఉపాధ్యాయులు వజ్రం నందగోపాల్, సుజాత, సుధాకర్, కుమారస్వామి, రవి, శ్యాంప్రసాద్, సీసీ నాగరాజ్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయాలి ఖానాపురం: జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమి ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ఆరోగ్య మహిళా కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ మంగళవారం మహిళల కోసం ఆరోగ్య మహిళా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది ప్రతీ మంగళవారం ఫీవర్ సర్వే చేపట్టాలని, ప్రతీ శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు జ్యోతి, కల్పన, సునీత, సిబ్బంది రాజచయ్య, హేమలత, సబిత, శ్రీనివాసచారి, దామోదర్రెడ్డి, అనిల్కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు -
‘ఆపరేషన్ ముస్కాన్’ను పకడ్బందీగా నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 11వ విడత ఆపరేషన్ ముస్కాన్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలకార్మికులకు భిక్షాటన, వెట్టిచాకిరిల నుంచి విముక్తి కల్పించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలకార్మికులను గుర్తించి బాలసదన్లో చేర్పించాలని చెప్పారు. బడికి దూరంగా ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధ పాల్గొన్నారు. -
ముగిసిన చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో గండు రిత్విక్, దారా సాయివివేశ్, జె.రంజిత్, నిక్రీ ప్రహర్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు వేడుకల్లో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, రజినీకాంత్, ఫ్రాంక్లిన్, అక్షయ్ తల్లిదండ్రులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంహన్మకొండ కల్చలర్: వరంగల్ నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ, బోర్టు ఫర్ ప్రమోషన్ ఆఫ్ భారత్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ సౌజన్యంతో ఆగస్టులో నిర్వహించే పేరిణి నాట్య విశారద పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ నిర్వాహకుడు, చీఫ్ ఎగ్జామినర్ గజ్జెల రంజిత్ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పరీక్షల నోటిషికేషన్ విడుదల చేశారు. ఈసందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. పేరిణి నాట్య విద్యార్థులు ఈ నెల 21 వరకు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పేరిణి గురువు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, ధరావత్ రాజ్కుమార్ నాయక్, పి.సందీప్ పాల్గొన్నారు. వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలిహన్మకొండ: వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హనుమకొండ జిల్లా పశు సంవర్థక, పశు వైద్యాధికారి డాక్టర్ విజయభాస్కర్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని హనుమకొండ వడ్డేపల్లిలోని పశు వైద్య కేంద్రంలో పెంపుడు జంతువులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయ భాస్కర్ ప్రారంభించారు. మొత్తం 107 శునకాలకు టీకాలు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జంతువుల రోగ నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకురాలు డాక్టర్ నాగమణి, జిల్లా పశు సంవర్థక, పశు వైద్య కార్యాలయం సహాయ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్, వడ్డేపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్కుమార్, సిబ్బంది కొమురయ్య, యాదలక్ష్మి, వంశీ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపికవరంగల్ స్పోర్ట్స్: ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు గద్వాలలో జరగనున్న అండర్–18 బాలబాలికల రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల కోసం ఆదివారం కాజీపేటలోని సీబీఎస్ఈ మాన్ట్ఫోర్ట్ స్కూల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపిక పోటీలకు హనుమకొండ జిల్లా నుంచి బాలురు 22, బాలికలు 26 మంది పాల్గొననున్నట్లు హనుమకొండ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లపెల్లి రాజు, డోలి సాంబయ్య తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న బాలుర జట్టులో అక్షత్, శ్రీవైభవ్, మాషూక్, రేహాన్, షాహీద్, సహన్, సాత్విక్, భువన్ ఆదిత్య, మసూద్, అభినయ్, రిషి, హర్శ, బాలికల విభాగంలో మేరీ హాసిని, యుక్తి, తేజస్వి, వేలిక, మీనాక్షి, షారోన్, సహస్ర, భార్గవి, పూర్విక, యఘ్నసేవి, సుధీక్ష, శ్రేష్టపటేల్ ఉన్నారు. కార్యక్రమంలో పీఈటీలు విజయ్కుమార్, సునీలా కోచ్ ఇర్ఫాన్, అసిస్టెంట్ కోచ్ యశ్వంత్, సీనియర్ క్రీడాకారులు సాగర్, సందీప్ పాల్గొన్నారు. -
సమస్యలు చర్చకు వచ్చేనా?
వరంగల్ అర్బన్: చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. ప్రధాన నాలాల విస్తరణ, ఆధునీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ ప్రధా న కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంట లకు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగనుంది. 5 ఎజెండా, 19 సప్లిమెంటరీ ఎజెండాలోని అంశాలను ప్రవేశపెట్టనున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు చర్చకు వస్తేనే పరి ష్కారం లభిస్తుంది. అధికారులు, సిబ్బందిలో జవా బుదారీతనం పెరుగుతుంది. కానీ, కొన్ని సంవత్సరాలుగా గ్రేటర్ కౌన్సిల్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరగడం లేదు. కేవలం ఎజెండాలోని అంశాలను చదివి వినిపించడం, పెద్దగా చర్చ లేకుండానే అధికార పక్షం చప్పట్లతో ఆమోదించడం, నామామాత్రపు నిరసనలకే ప్రతిపక్షాలు పరిమితమవుతున్నాయి. నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం -
ఆయిల్పామ్... సాగు లాభదాయకం
దుగ్గొండి: అన్నదాతలు ప్రతియేటా ఒకేరకమైన పంటలు సాగుచేయడం వల్ల ఆశించిన అభివృద్ధి సాధించడంలో వెనుకబడిపోతున్నారు. కొన్ని పంటలనే రైతులు విరివిగా సాగుచేయడం.. ఆయా పంటలు చేతికొచ్చాక విక్రయించడంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తక్కువ పెట్టుబడితో సుదీర్ఘకాలంపాటు అన్నదాతకు సిరులు కురిపించే ఆయిల్పామ్ సాగును ఎంచుకుంటే రైతులు ప్రగతి సాధిస్తారని నర్సంపేట డివిజన్ ఉద్యానశాఖ అధికారి అలకొండ జ్యోతి సూచిస్తున్నారు. సాగువిధానం... ఆయిల్పామ్ పంట వేయడానికి బంక నేలలు, చౌడు నేలలు పనికిరావు. నీటి సౌకర్యం ఉన్న అన్ని నేలలు అనుకూలంగానే ఉంటాయి. నీటి సౌకర్యం ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు చాలా అనుకూలం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్నీ నేలలు, వాతావరణం ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎకరా భూమిలో 57 మొక్కలు, హెక్టార్ అయితే 143 మొక్కలు నాటాల్సి ఉంటుంది. మొక్కకు మొక్కకు సాలుకు సాలుకు మధ్య 9 మీటర్ల ఎడంతో నాటుకోవాలి. మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటగా వరి తప్ప అన్ని పంటలు సాగుచేసుకోవచ్చు. 4వ సంవత్సరం నుంచి ఆయిల్పామ్ తోటలో దుక్కి దున్నకూడదు. 7వ సంవత్సరం నుంచి ఆయిల్పామ్ తోటలో అంతరపంటగా కోకో పంటను సాగుచేసుకోవచ్చు. దీని వల్ల ఎకరాకు ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.40 వేల అదనపు ఆదాయం వస్తుంది. డ్రిప్ద్వారా లేదా మినీ స్ప్రింకర్ల ద్వారా సాగునీటిని అందించడం మేలు. డ్రిప్పును ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో అందిస్తుంది. సేంద్రియ ఎరువులద్వారా పంట పండిస్తే అధిక దిగుబడి వస్తుంది. ఎకరాకు నేలను బట్టి 10 నుంచి 20 టన్నుల గెలల దిగుబడి వస్తుంది. టన్ను గెలలకు మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.19 వేల నుంచి గరిష్టంగా రూ.21 వేలు ఉంది. ఎకరాకు సాగు ఖర్చు రూ.20 వేలు అవుతుంది. కనీసం 10 టన్నుల దిగుబడి వచ్చినా రూ.2 లక్షలు వస్తాయి. ఖర్చులు పోగా రూ.1.80 లక్షల నికరాదాయం వస్తుంది. పంట వేసిన నాలుగో సంవత్సరం నుంచి 25 –30 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. ప్రతి యేటా జూన్ నుంచి ఫిబ్రవరి వరకు గెలల దిగుబడి వస్తూనే ఉంటుంది. నూనె దిగుబడి 17 నుంచి 22 శాతం వరకు వస్తుంది. ప్రభుత్వ సబ్సిడీ... ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు మొక్కలపై 90 శాతం సబ్సిడీ ఇస్తుంది. మొక్క ధర రూ.193 ఉండగా రైతు కేవలం రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. పంట మొదటి నాలుగు సంవత్సరాల వరకు ఎరువుల కోసం ఎకరాకు ఏడాదికి రూ.4,200 సబ్సిడీగా అందిస్తుంది. పంట కోత, గెలల రవాణాకు ప్రభుత్వం ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల్లోనూ నష్టం ఉండదు.. ఆయిల్ పామ్ పంట తుపానులు వచ్చినా, వరదలు వచ్చినా ఎలాంటి నష్ట జరగదు. కోతులు, ఇతర పక్షులు, జంతువుల బెడద ఉండదు. పర్యావరణానికి హితంగా ఉండి సకాలంలో వర్షాలు కురవడానికి దోహదపడుతుంది. మొదలైన పంట దిగుబడి.. నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా 2022లో ఆయిల్పామ్ పంట సాగు ప్రారంభమైంది. ఇప్పటికి 2,500 ఎకరాల్లో తోటలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం సాగు చేసిన రైతులకు ఈ నెలలో తొలి పంట చేతికి రానుంది. ఇందుకోసం ఎక్కడికో ప్యాక్టరీకి రైతు వెళ్లే అవసరం లేకుండా నర్సంపేట మండలంలోనే పికప్ పాయింట్ ఏర్పాటు చేశారు. రైతులు అక్కడి వరకు తెస్తే సరిపోతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పంట కోతకు వస్తూనే ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ప్రకృతి వైపరీత్యాల్లోనూ ఆదాయం -
ముగిసిన చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో గండు రిత్విక్, దారా సాయివివేష్, జె.రంజిత్, నిక్రీ ప్రహర్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు వేడుకల్లో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, రజినీకాంత్, ఫ్రాంక్లిన్, అక్షయ్ తల్లిదండ్రులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంహన్మకొండ కల్చలర్: వరంగల్ నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ, బోర్టు ఫర్ ప్రమోషన్ ఆఫ్ భారత్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ సౌజన్యంతో ఆగస్టులో నిర్వహించే పేరిణి నాట్య విశారద పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ నిర్వాహకుడు, చీఫ్ ఎగ్జామినర్ గజ్జెల రంజిత్ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పరీక్షల నోటిషికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ పేరిణి నాట్య విద్యార్థులు ఈ నెల 21 వరకు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పేరిణి గురువు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, ధరావత్ రాజ్కుమార్ నాయక్, పి.సందీప్ పాల్గొన్నారు. వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలిహన్మకొండ: వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హనుమకొండ జిల్లా పశు సంవర్థక, పశు వైద్యాధికారి డాక్టర్ విజయభాస్కర్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని హనుమకొండ వడ్డేపల్లిలోని పశు వైద్య కేంద్రంలో పెంపుడు జంతువులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయ భాస్కర్ ప్రారంభించారు. మొత్తం 107 శునకాలకు టీకాలు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జంతువుల రోగ నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకురాలు డాక్టర్ నాగమణి, జిల్లా పశు సంవర్థక, పశు వైద్య కార్యాలయం సహాయ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్, వడ్డేపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్కుమార్, సిబ్బంది కొమురయ్య, యాదలక్ష్మి, వంశీ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపికవరంగల్ స్పోర్ట్స్: ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు గద్వాల్లో జరగనున్న అండర్–18 బాలబాలికల రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల కోసం ఆదివారం కాజీపేటలోని సీబీఎస్ఈ మాన్ట్ఫోర్ట్ స్కూల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపిక పోటీలకు హనుమకొండ జిల్లా నుంచి బాలురు 22, బాలికలు 26 మంది పాల్గొననున్నట్లు హనుమకొండ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లపెల్లి రాజు, డోలి సాంబయ్య తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న బాలుర జట్టులో అక్షత్, శ్రీవైభవ్, మాషూక్, రేహాన్, షాహీద్, సహన్, సాత్విక్, భువన్ ఆదిత్య, మసూద్, అభినయ్, రిషి, హర్శ, బాలికల విభాగంలో మేరీ హాసిని, యుక్తి, తేజస్వి, వేలిక, మీనాక్షి, షారోన్, సహస్ర, భార్గవి, పూర్విక, యఘ్నసేవి, సుధీక్ష, శ్రేష్టపటేల్ ఉన్నారు. కార్యక్రమంలో పీఈటీలు విజయ్కుమార్, సునీలా కోచ్ ఇర్ఫాన్, అసిస్టెంట్ కోచ్ యశ్వంత్, సీనియర్ క్రీడాకారులు సాగర్, సందీప్ పాల్గొన్నారు. -
ఇక నూతన విధానం
నర్సంపేట: పత్తి కొనుగోలుకు కేంద్రం నూతన విధానం అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ధర వ్యత్యాస చెల్లింపు పథకం(పీడీపీఎస్) పేరిట అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. మార్కెట్లో రైతులకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర లభిస్తే.. ఆ వ్యత్యాసాన్ని కేంద్రం భరించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ వ్యత్యాసాన్ని పూడ్చేందుకు కనీస మద్దతు ధరలో 15 శాతం చెల్లిస్తుంది. ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు.. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ నూతన పథకం అమలైతే... సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు నిలిచిపోతాయి. గుర్తింపు పొందిన ప్రైవేట్ వ్యాపారాలు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ విధానంలో ఆ మార్కెట్లో వారం రోజుల సరాసరి ధరలను పరిగణనలోకి తీసుకొని మొదట క్వింటా ధర నిర్ణయిస్తారు. ఆపై కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర వచ్చిన రైతులకు 15 శాతం పీడీపీఎస్ చెల్లిస్తారు. మద్దతు ధర రూ.8,110 2025–26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.8,110 నిర్ణయించింది. ఇందులో 15 శాతాన్ని అంటే గరిష్టంగా రూ.1,216 రైతులకు జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు క్వింటా పత్తికి రూ.6,800 ధర వచ్చింది. మరి కొంత మంది రైతులకు రూ.6,500 నుంచి రూ.8 వేలు పడింది. ఇలా వారంలో వచ్చిన పత్తి సరాసరి ధరను రూ.7,500 నిర్ణయించారనుకుందాం. కాగా, కనీస మద్దతు ధర రూ.8,110 అయినందున మొదటి రైతు రూ.1,310 నష్టపోతాడు. కానీ, కేంద్ర ప్రభుత్వం మొత్తం చెల్లించదు. కనీస మద్దతు ధర రూ.8,110, సగటు ధర రూ.7,500 ఉన్నందున సగటు ధర కంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని అంటే రూ.560 మాత్రమే చెల్లిస్తుంది. అంటే ఆ రైతుకు ఏడు శాతం మాత్రమే వర్తిస్తుంది. దీని వల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంది. పైలట్గా వరంగల్... గత సీజన్లో సీసీఐ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పీడీపీఎస్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని మూడు మార్కెట్లను పైలట్గా ప్రకటించింది. ఆదిలాబాద్, నల్గొండతోపాటు వరంగల్ను ఎంపిక చేసింది. ఈ మేరకు వరంగల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. వ్యాపారుల చేతివాటం.. పీడీపీఎస్ విధానం వల్ల వ్యాపారులు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమాయక రైతులను మచ్చిగా చేసుకొని తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేసినట్లు చూపించి ఎక్కువ మొత్తంలో కాజేసే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ విధానం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పీడీపీఎస్ పద్ధతిలో పత్తి సేకరణ కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటే కేంద్రం చెల్లించేలా చర్యలు పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ జిల్లా ఎంపికజిల్లాలో పత్తిసాగు ఇలా.. ఏడాది ఎకరాలు 2024 1,20,166 2025 1,26,173 -
మల్లన్న సన్నిధిలో తొలి ఏకాదశి పూజలు
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో తొలి ఏకాదశి పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి మేలు కొలుపుతో ప్రారంభం కాగా.. మహాగణపతి పూజ, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మతో ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు ఉప్పుగల్లులోని ఆకేరు వాగు నుంచి వేద మంత్రోచ్ఛరణల మధ్య కొత్త నీరు తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్తులు బిందెలతో కొత్తనీరు తీసుకొచ్చి లింగాకారుడికి సహస్త్ర ఘటాభిషేకం జరిపించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సుభిక్షంగా పండాలని దేవుడిని ప్రార్థించారు. కాగా, అర్చకులు మల్లన్న ఉపాలయంలో భ్రమరాంబిక అమ్మవారిని కూరగాయలతో శాకంబరీగా అలంకరించారు. -
ఘనంగా తొలి ఏకాదశి పండుగ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో తొలి పండుగ తొలి ఏకాదశి ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమ దంపతులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి రుద్రాభి షేకం, పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు స్వా మివారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలన చేసి తొలిఏకాదశి పండుగను, చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాకతీయుల దేవా లయాల పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. వేయిస్తంభాల ఆలయంలో చాతుర్మాస వ్రతం ప్రారంభం -
స్నాతకోత్సవానికి వేళాయె
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ బాధ్యులతోపాటు 10 సబ్కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2020 నుంచి 2025 వరకు పీహెచ్డీ పూర్తయిన వారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 387మంది విద్యార్థులు పట్టాలు అందుకోనునున్నారు. ఇందులో ఆర్ట్స్లో 56, సైన్స్ 96, ఫార్మసీ 21, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 49, సోషల్ సైన్సెస్ 133, ఎడ్యుకేషన్ 18, లా 4, ఇంజనీరింగ్లో 10 మంది పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మందికి 564 గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఆర్ట్స్లో 60, సైన్స్లో 161, ఫార్మసీలో 48, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 66, సోషల్ సైన్సెస్లో 88, ఎడ్యుకేషన్లో 25, లా 72, ఇంజనీరింగ్లో 44 మందికి గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. కళాశాలలకు గోల్డ్మెడల్స్ విద్యార్థుల జాబితాలు.. పీహెచ్డీ పట్టాలు పొందే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లను పరీక్షల విభాగంలో అందజేశారు. పేరెంట్స్కు కూడా ఎంట్రీపాస్లు జారీ చేశారు. కేయూలోని వివిధ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులు చదివి గోల్డ్మెడల్స్ సాధించిన వారి జాబితాలను ఆయా కళాశాలలకు ఇప్పటికే పంపారు. అలాగే, ఆయా విద్యార్థులకు అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్లను కూడా పరీక్షల విభాగాధికారులు పంపించారు. గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థులు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లతో స్నాతకోత్సవానికి రావాల్సి ఉంటుంది. ముందుగానే గోల్డ్మెడల్స్ ప్రదానం.. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ముందే అందజేస్తారు. ఇందుకు అధ్యాపకులతో కూడిన కమిటీ కూడా ఉంది. విద్యార్థులు గోల్డ్మెడల్స్ తీసుకుని ఆడిటోరియంలో కేటా యించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. పీహెచ్డీ విద్యార్థులకు పట్టాల ప్రదానం అనంతరం గోల్డ్మెడల్స్ విద్యార్థులు వేదిక మీదకు వచ్చి గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో ఫొటోలు దిగాల్సి ఉంటుంది. 373 మంది విద్యార్థులను 19 బ్యాచ్లుగా విభజించారు. అయితే అందులో ఎంతమంది హాజరవుతారనేది ఉదయమే తెలియనుంది. ఎందుకంటే వారిలో కొందరు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు విదేశాలకు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. పేరెంట్స్ కోసం ఆడిటోరియం బయట స్క్రీన్ ఏర్పాటు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆడిటోరియంలోకి అనుమతిలేదు. వీరు వీక్షించడంకోసం ఆడిటోరియం బయట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. నేడు కేయూకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాక ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి 387 మందికి పీహెచ్డీ పట్టాలు.. 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్ల పంపిణీషెడ్యూల్ ఇలా... గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరి ఉదయం 11 గంటలకు వరంగల్ నిట్కు చేరుకుంటారు. ఉదయం 11:15 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కాకతీయ యూనివర్సిటీకి ఉద యం 11:25 గంటలకు చేరుకుంటారు. ఆడిటోరియం వద్ద ఉదయం 11:30 గంటలకు అకడమిక్ సెనేట్ సమావేశం ఉంటుంది. 11:35 గంటలకు సెనేట్ సభ్యులు గవర్నర్తో ఫొటో దిగుతారు. అనంతరం ప్రొసెసన్ ఉంటుంది. ఉదయం 11:40 గంటలకు కాన్వొకేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 11:50 గంటలకు కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి రిపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి ప్రసంగిస్తారు. 12:10 గంటలకు చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రసంగిస్తారు. 12:20 గంటల నుంచి పీహెచ్డీ విద్యార్థులకు పట్టాల ప్రదానం ఉంటుంది. అనంతరం గోల్డ్మెడల్స్ విద్యా ర్థులు గ్రూప్ ఫొటో దిగాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకో త్సవం ముగుస్తుంది.కేయూలో భారీ బందో బస్తుకాకతీయ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించనున్న స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానుండడంతో క్యాంపస్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం స్నాతకోత్సవాన్ని నిర్వహించే ఆడిటోరియం ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీ చేసింది. సోమవారం ఉదయం మరోసారి తనిఖీ చేయనున్నది. కేయూలో పోలీసులు మోహరించారు. కేయూ పోలీస్ స్టేషన్తోపాటు వివిధ పోలీస్టేషన్లకు చెందిన ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది అందులో క్విక్ రెస్పాన్స్ పోలీస్ ఫోర్స్ కూడా బందోబస్తు నిర్వహిస్తారు. ఎంట్రీపాస్లు ఉన్న విద్యార్థులకు వివిధ కమిటీల బాధ్యులకు, సభ్యులకు (ఆచార్యులు, ఉద్యోగులు) పాలక మండలి సభ్యులు, సెనేట్ సభ్యులకు ప్రెస్కు ఆడిటోరియంలోకి అనుమతి ఉంటుంది. పలు విద్యార్థి సంఘాల బాధ్యులపై పోలీసులు నిఘా ఉంచారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuడోలు వాయిస్తున్న కళాకారులుఖిలా వరంగల్: ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం ఉర్సు కరీమాబాద్, రంగశాయిపేటలో బీరన్న వేడుకలు కనులపండువగా నిర్వహించారు. ఆరాధ్యదైవమైన బీరప్పకు కురుమలు బోనాలు సమర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనం కుండల్లో ప్రీతికరమైన నైవేద్యం ఉంచి డోలు చప్పుళ్లు.. ఒగ్గు కళాకారుల నృత్యాల ఊరేగింపుతో కరీమాబాద్ వీధులు కిక్కిరిశాయి. స్థానిక ప్రజలు భవనాలు ఎక్కి ప్రత్యేక వేషధారణలోనున్న బీరన్నల కత్తుల విన్యాసాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఉదయం నుంచి ఆలయాల్లో ఊరేగింపుగా కురుమ కుల పెద్దలు నగరవాసులు జెండాలను నిలిపారు. పూజారులు బీరన్నకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా చేరుకున్న భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బీరన్న స్వామి దేవాలయాలు కిటకిటలాడాయి. బీరన్నకు తొలి బోనం.. సంతోషంగా ఉంది: మంత్రి సురేఖ వరంగల్లో తొలి బోనం బీరన్నకే కావడం సంతోషంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉర్సు కరీమాబాద్ బీరన్న బోనాల ఉత్సవాల్లో నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బీరన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కురుమ మహిళలతో కలిసి మంత్రి సురేఖ బీరన్న బోనాన్ని ఎత్తుకున్నారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి బోనం వరంగల్ భద్రకాళి అమ్మవారిదే అనుకున్నా.. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంకల్పం ఆగిపోయిందని, త్వరలో పునరాలోచన చేసి ప్రకటిస్తానన్నారు. అదేవిధంగా 12వ డివిజన్ దేశాయిపేట బీరన్న దేవాలయంలో మంత్రి కొండా సురేఖ, ఓసిటీలో మేయర్ గుండు సుధారాణి బోనం ఎత్తుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ నాయకులు గంట రవికుమార్ బీరన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. న్యూస్రీల్గావుపట్టి బీరన్నల రక్త తిలకం భక్తి పారవశ్యంతో ఊగిపోయిన భక్తులు ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి -
గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ బాధ్యులతోపాటు 10 సబ్కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2020 నుంచి 2025 వరకు పీహెచ్డీ పూర్తయిన వారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 387 మంది అభ్యర్థులు పట్టాలు అందుకోనునున్నారు. ఇందులో ఆర్ట్స్లో 56, సైన్స్ 96, ఫార్మసీ 21, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 49, సోషల్ సైన్సెస్ 133, ఎడ్యుకేషన్ 18, లా 4, ఇంజనీరింగ్లో 10 మంది పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మందికి 564 గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఆర్ట్స్లో 60, సైన్స్లో 161, ఫార్మసీలో 48, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 66, సోషల్ సైన్సెస్లో 88, ఎడ్యుకేషన్లో 25, లా 72, ఇంజనీరింగ్లో 44 మందికి గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. కళాశాలలకు గోల్డ్మెడల్స్ అభ్యర్థుల జాబితాలు.. పీహెచ్డీ పట్టాలు పొందే అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లను పరీక్షల విభాగంలో అందజేశారు. పేరెంట్స్కు కూడా ఎంట్రీపాస్లు జారీ చేశారు. కేయూలోని వివిధ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులు చదివి గోల్డ్మెడల్స్ సాధించిన వారి జాబితాలను ఆయా కళాశాలలకు ఇప్పటికే పంపారు. అలాగే, ఆయా అభ్యర్థులకు అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్లను కూడా పరీక్షల విభాగాధికారులు పంపించారు. గోల్డ్మెడల్స్ పొందే అభ్యర్థులు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లతో స్నాతకోత్సవానికి రావాల్సి ఉంటుంది. ముందుగానే గోల్డ్మెడల్స్ ప్రదానం.. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు అభ్యర్థులకు గోల్డ్మెడల్స్ ముందే అందజేస్తారు. ఇందుకు అధ్యాపకులతో కూడిన కమిటీ కూడా ఉంది. అభ్యర్థులు గోల్డ్మెడల్స్ తీసుకుని ఆడిటోరియంలో కేటా యించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. పీహెచ్ డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు వేదిక మీదకు వచ్చి గవర్నర్ జి ష్ణుదేవ్వర్మతో ఫొటోలు దిగాల్సి ఉంటుంది. 373 మంది అభ్యర్థులను 19బ్యాచ్లుగా చేశారు. అయి తే అందులో ఎంతమంది హాజరవుతారనేది ఉదయమే తెలియనుంది. ఎందుకంటే వారిలో కొంద రు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు విదేశాలకువెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. పేరెంట్స్కు ఆడిటోరియం బయట స్క్రీన్ ఏర్పాటు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందే అభ్యర్థుల తల్లిదండ్రులకు ఆడిటోరియంలోకి అనుమతిలేదు. వీరి కోసం ఆడిటోరియం బయట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవాన్ని వీరు వీక్షించనున్నారు.నేడు కేయూకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాక ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి 387 మందికి పీహెచ్డీ పట్టాలు.. 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్ల పంపిణీషెడ్యూల్ ఇలా... గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరి ఉదయం 11 గంటలకు వరంగల్ నిట్కు చేరుకుంటారు. ఉదయం 11:15 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కాకతీయ యూనివర్సిటీకి ఉద యం 11:25 గంటలకు చేరుకుంటారు. ఆడిటోరియం వద్ద ఉదయం 11:30 గంటలకు అకడమిక్ సెనెట్ సమావేశం ఉంటుంది. 11:35 గంటలకు సెనెట్ సభ్యులు గవర్నర్తో ఫొటో దిగుతారు. అనంతరం ప్రొసెసన్ ఉంటుంది. ఉదయం 11:40 గంటలకు కాన్వొకేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 11:50 గంటలకు కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి రిపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి ప్రసంగిస్తారు. 12:10 గంటలకు చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రసంగిస్తారు. 12:20 గంటల నుంచి పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం ఉంటుంది. అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు గ్రూప్ ఫొటో దిగాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవం ముగుస్తుంది.కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్నారు. అలాగే, ముఖ్య అతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందేవారు వైట్ డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. కేటాయించిన సీట్లలో వీరు కూర్చోవాల్సి ఉంటుంది. కేయూలో భారీ బందోబస్తుకాకతీయ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించనున్న స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానుండడంతో క్యాంపస్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం స్నాతకోత్సవాన్ని నిర్వహించే ఆడిటోరియం ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీ చేసింది. సోమవారం ఉదయం మరోసారి తనిఖీ చేయనున్నది. కేయూలో పోలీసులు మోహరించారు. కేయూ పోలీస్ స్టేషన్తోపాటు వివిధ పోలీస్టేషన్లకు చెందిన ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది అందులో క్విక్ రెస్పాన్స్ పోలీస్ ఫోర్స్ కూడా బందోబస్తు నిర్వహిస్తారు. ఎంట్రీపాస్లు ఉన్న అభ్యర్థులకు వివిధ కమిటీల బాధ్యులకు సభ్యులకు (ఆచార్యులు, ఉద్యోగులు) పాలక మండలి సభ్యులు, సెనెట్ సభ్యులకు ప్రెస్కు ఆడిటోరియంలోకి అనుమతి ఉంటుంది. పలు విద్యార్థి సంఘాల బాధ్యులపై పోలీసులు నిఘా ఉంచారు. -
గార్బేజ్ చార్జెస్ సవరణ
వరంగల్ అర్బన్: నగరంలో గార్బేజ్ (చెత్త) చార్జీలను పక్కాగా వసూలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఆరేళ్ల క్రితం నిర్ణయించిన ధరల సవరణకు రంగం సిద్ధమైంది. ‘మామూళ్ల మత్తు, కమర్షియల్ నుంచి కాసుల పంట’ శీర్షికన సాక్షిలో జూన్ 30న ప్రచురితమైన కథనానికి పాలకవర్గం, అధికారులు స్పందించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశంలో గార్బేజ్ చార్జీల సవరణను ప్రవేశపెట్టేందుకు ఎజెండాలో చేర్చారు. గార్బేజ్ చార్జీలు మూడు స్లాబ్లుగా .. ● నివాస, పాక్షిక నివాస గృహాలకు గార్బేజ్ చార్జీలుగా ప్రతి నెలకు 0 నుంచి 1,500 ఫీట్ల వరకు రూ.60 కాగా, 1,501 నుంచి 2,500 వరకు రూ.100 ఉండగా, 25,01 నుంచి 3,500 వరకు రూ.120, 3,500 నుంచి 10 లక్షల ఫీట్ల వరకు రూ.150గా నిర్ణయించారు. ● నివాసేతర (కమర్షియల్, ఇండస్ట్రీయల్) భవనాలకు 0 నుంచి 1,000 ఫీట్ల వరకు రూ.80 కాగా, 1,001 నుంచి 1,500 వరకు రూ.100 ఉంది. 1,501 నుంచి 2,500 వరకు రూ.120 ఇక 2,501 నుంచి ఆపై రూ.180 వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. -
ఘనా, నీలపతాక క్రమాల్లో అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రోత్సవాల్లో భాగంగా పదకొండో రోజు ఆదివారం అమ్మవారికి ఘనా, నీలపతాక క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఘనా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని నీలపతాక అమ్మవారిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి ఏకాదశి, ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్ర సాద వితరణ జరిగింది. ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
వీర తిలకం..
కరీమాబాద్ రోడ్డులోని బురుజు సెంటర్లో వేలాది మహిళలు బోనాలకు ఎదురుగా ప్రత్యేక వేషధారణలో ఉన్న బీరన్న గొర్రె పిల్ల లను గావు పట్టారు. భక్తులు గొర్రె పొట్టేలు రక్తాన్ని వీర తిలకంగా దిద్దారు. అనంతరం బీరన్న ఆలయంలో కురుమ మహిళలు స్వామికి కొత్తబట్టలు పెట్టి కొత్తకొండలో తెచ్చిన బోనాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించారు. నగర సీపీ ఆదేశాల మేరకు వరంగల్ ఏసీపీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు స్పెషల్ పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు చేపట్టారు. వేడుకల్లో కురుమ పెద్దలు పరుపల్ల రవి, కోరె కృష్ణ, బీరన్న దేవాలయాల కమిటీ సభ్యులు మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. బూర ఊదుతున్న యువకుడు -
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలోని ఆయిల్ పామ్ పంటలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ మండలాల్లో ఆయిల్ పామ్ పంట సాగు వివరాలను కలెక్టర్కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటల ప్రాముఖ్యతను రైతులకు అధికారులు వివరిస్తూ అధిక విస్తీర్ణంలో సాగయ్యే విధంగా కృషి చేయాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ పంట సాగును వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఉన్న ఆయిల్ పామ్ సాగు స్కీం ఈ సంవత్సరంతో ముగుస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెరికల్చర్లో ప్రగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉద్యాన శాఖకు సంబంధించిన బుక్లెట్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనసూయ, సెరికల్చర్ అధికారులు సంజీవరావు, వెంకన్న, మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాజీపేట అర్బన్ / మడికొండ: కాజీపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, పీహెచ్సీ, ప్రభుత్వ పాఠశాలలను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, పుస్తకాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కాజీపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, భూభారతి రెవెన్యూ సదస్సుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ భావ్సింగ్ను అడిగి తెలుసుకున్నారు. కడిపికొండ గ్రామంలోని పీహెచ్సీని సందర్శించి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. మడికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల నమోదును ఆన్లైన్లో (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం–ఎఫ్ఆర్ఎస్) తప్పనిసరిగా నమోదు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఈఓ వాసంతి, కడిపికొండ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ శ్రీదేవి, కాజీపేట ఎంఈఓ మనోజ్కుమార్, మడికొండ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సంధ్యారాణి, ఎంపీపీఎస్ హెచ్ఎం మల్లారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చెత్త సేకరణ, తరలింపులో నిర్లక్ష్యం తగదు
వరంగల్ అర్బన్: ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, ఏదైనా వాహనం మరమ్మతుకు గురైతే ప్రత్యామ్నాయంగా మరొకటి ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం మాత్రం చేయొద్దని అధికారులను గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. ఈ నెల 2, 3వ తేదీల్లో సాక్షి దినపత్రికలో పారిశుద్ధ్యంపై వార్త కథనాలు ప్రచురితమయ్యారు. దాంతో స్పందించిన కమిషనర్.. వరంగల్ పోతననగర్లోని చెత్త సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఆవరణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. తనిఖీల్లో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఏఈలు సంతోష్ కుమార్, ఫణి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంరాజ్ పాల్గొన్నారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
లిఫ్ట్ లేక.. మెట్లు ఎక్కలేక
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని మొదటి, రెండో అంతస్తుల్లోకి వెళ్లేందుకు వృద్ధులు, వికలాంగులకు లిఫ్టే ప్రధాన ఆధారం. కొద్దిరోజుల క్రితం కలెక్టరేట్ సమీపంలోని ఒక లిఫ్ట్ను అధికారులు నిలిపివేశారు. తాజాగా, కలెక్టరేట్లో ఉన్న రెండో లిఫ్ట్ కూడా శుక్రవారం నుంచి పనిచేయలేదు. దీంతో పై అంతస్తులకు వెళ్లేందుకు వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు ఎర్కొన్నారు. పనిచేయని లిఫ్ట్లు ఆసరా ఫింఛన్లు, సర్వీస్ ఫించన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కలెక్టరేట్ వస్తుంటారు. ఆసరా ఫింఛన్కు సంబంధించిన డీఆర్డీఏ రెండో అంతస్తులో, సర్వీస్ పెన్షన్లకు సంబంధించిన ట్రెజరీ కార్యాలయం మొదటి అంతస్తులో ఉంది. ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తుల నిమిత్తం మొదటి అంతస్తులో ఉన్న పౌర సరఫరాల కార్యాలయానికి జనం భారీగా వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు లిఫ్టులు పనిచేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా లిఫ్ట్లు ఆపేశారా లేక ఏమైన సాంకేతిక సమస్యలు తలెత్తిందా అన్నది తెలియాల్సి ఉంది. లిఫ్ట్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. పింఛన్ కోసం వచ్చి.. పైకి ఎక్కలేకపోయా : రామక్క, సర్వీస్ పెన్షనర్ నా వయస్సు 88 సంవత్సరాలు. కాకతీయ యూనివర్సిటీ ప్రాంతం నుంచి వచ్చాను. నా భర్తకు సంబంధించిన సర్వీస్ పెన్షన్ నాకు వచ్చేది. రెండు నెలలుగా పింఛన్ రావడం లేదు. అధికారులను అడిగితే నేనే స్వయంగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పారు. దాంతో నేనే ట్రెజరీ కార్యాలయానికి నా కూతురును తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చాక పైకి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం లేదు. వీల్ చైర్లో పైకి వెళ్లే పరిస్థితి లేదు. ఏం చేయాలో దిక్కుతోచక పొద్దటి నుంచి ఎదురు చూస్తున్నాం. తెలిసిన వారి ద్వారా ట్రెజరీ కార్యాలయానికి కబురు చేశాం. అధికారులు వచ్చి చూస్తామని చెప్పారు. ఇప్పుడు మధ్యాహ్నం అవుతున్నా వారు రాలేదు. హనుమకొండ కలెక్టరేట్లో పనిచేయని లిఫ్ట్లు అవస్థలు ఎదుర్కొంటున్న వృద్ధులు, వికలాంగులు -
బాల్య వివాహాలను అరికట్టాలి
ధర్మసాగర్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల సమాఖ్య సంఘాల మహిళా సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ మూడు ముళ్లతో బాలికల భవిష్యత్ను నాశనం చేయొద్దని హెచ్చరించారు. చదువు, క్రీడలు, సాంస్కృతిక, ఇతర రంగాల్లో వారు రాణించేందుకు ప్రోత్సాహం అందించాలని కోరారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం నేరమని అన్నారు. అందుకు సహకరించిన వారు శిక్షార్హులని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంఈఓ రాంధన్, హనుమకొండ సీడీపీఓ విశ్వజ, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్, సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ హైమావతి, ఏపీఏం అనిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఝాన్సీ, జిల్లా మిషన్ శక్తి కోఆర్డినేటర్ కల్యాణి, ఎస్సై షైక్ జానీపాషా పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే -
దేవాలయ భూములను స్వాధీనం చేసుకుంటాం
ఎల్కతుర్తి: అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, దేవాదాయ, ధర్మాదాయ శాఖ జేవీఓ (జువెల్లరీ వెరిఫికేషన్ ఆఫీసర్) అంజనాదేవి తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాన్ని వారు శుక్రవారం సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,062 దేవాలయాలుండగా, వాటిలో 46 దేవాలయాల నుంచి ఆదాయం సమకూరుతున్నట్లు వెల్లడించారు. 458 దేవాలయాలకు దీపధూప నైవేద్యం వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 252 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ప్రయోగాత్మకంగా మహబూబాబాద్ జిల్లాలోని అగస్తీశ్వర ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పరిశీలకులు అనిల్కుమార్, ఈఓలు లలిత కుమారి, సులోచన, వెంకన్న, మారుతి, కిషన్రావు తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత -
విద్యుత్శాఖలో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భద్రత కరువు
● క్షేత్రస్థాయిలో కీలక విధులు.. తరచూ ప్రమాదాలు ● ఇంటి పెద్ద చనిపోవడంతో రోడ్డున పడుతున్న కుటుంబం ● గాయాలపాలై మంచానికే పరిమితమైన మరికొందరు.. ● మొన్నటిదాకా వినియోగదారులకు ఇస్తున్న ఎక్స్గ్రేషియానే దిక్కు ● ఇటీవల బీమా సౌకర్యం కల్పించిన టీజీ ఎన్పీడీసీఎల్ ● ఐటీఐ అర్హత కలిగిన వర్కర్కు రూ.20 లక్షలు.. ● ఐటీఐ లేని వారికి రూ.17 లక్షల ఇన్సూరెన్స్ -
చేతులు కోల్పోయి రెండు నెలలుగా ఆస్పత్రిలో..
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రామరాజు కొన్నేళ్లుగా విద్యుత్శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో గత మే 9న రైతుల వ్యవసాయ బావుల వద్ద ఓ ట్రాన్స్ఫార్మర్కు ఎగ్జ్ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ తీగ తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ చెయ్యిని పూర్తిగా మరో చేయిని సగం వరకు తీసి వేశారు. రెండు నెలలుగా వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.19 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. గ్రామస్తులు దాదాపు రూ.16 లక్షల వరకు విరాళాలు అందించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా చికిత్స కోసం రూ.10 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు అంటున్నారని బాధితుడి భార్య రజిత తెలిపింది. పెద్ద కుమార్తె అఖిల ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలని మదనపడుతోంది. చిన్న కుమార్తె అక్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాల్సి ఉంది. ఊరు అండగా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రజిత, పిల్లలు కన్నీటిపర్యంతమవుతున్నారు.మరికొంతమంది కార్మికుల కన్నీటి గాథలు– 8లోu -
వరంగల్
శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025జీవనాధారాన్ని కోల్పోయారు.. కమ్యూనిజం ఐక్యం అనివార్యం కమ్యూనిజం భావజాల శక్తులు ఐక్యం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.– 8లోuహన్మకొండ: విద్యుత్శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న వీరు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆదరణకు నోచుకోవడం లేదు. వీరికి ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా యాజమాన్యంనుంచి అందే సహాయం కూడా లేదు. వినియోగదారులకు విద్యుత్ సంబంద సమస్యలు తలెత్తితే ముందుగా వీరినే సంప్రదిస్తారు. వీరి దృష్టికే సమస్యలు వివరించి బాగు చేయించుకుంటారు. ఇంతటీ కీలక భూమిక పోషిస్తున్న వీరికి ఆర్థిక భరోసా అందడం లేదు. ఆర్టిజన్లుగా గుర్తించని టీజీ ఎన్పీడీసీఎల్ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 2016లో విద్యుత్ సంస్థల్లోకి ఆర్టిజన్లుగా అబ్జర్వ్ చేసుకున్న క్రమంలో తెలంగాణ సౌథర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్)లో పనిచేస్తున్న కట్టర్లను (ఇక్కడ అన్మ్యాన్ వర్కర్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను అక్కడ కట్టర్లుగా పిలిచేవారు) ఆర్టిజన్లుగా తీసుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్లో మాత్రం అప్పటి యాజమాన్యం అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించలేదు. దీంతో వీరు ప్రమాదవశాత్తు మృతిచెందితే వినియోగదారులకు ఎక్స్గ్రేషియా చెల్లించినట్లుగానే రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై గాయాలపాలైతే చికిత్స ఖర్చులు మాత్రం యాజమాన్యం భరిస్తుంది. కానీ, ఇది సరిగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తుండడంతో చలించిన టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో మొత్తం 1,388 మంది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి గత నెలనుంచి బీమా సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు 1300 మందికి బీమా సౌకర్యం కల్పించారు. ఇందులో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను రెండు విభాగాలుగా విభజించారు. ఐటీఐ అర్హత కలిగిన వారికి నెలకు రూ.20 వేల వేతనం, ఐటీఐ అర్హత లేని వారికి నెలకు రూ.17 వేల వేతనం అందిస్తున్నారు. ఈ మేరకు ఐటీఐ అర్హత కలిగిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్కు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల బీమా, ఐటీఐ అర్హత లేని వారికి రూ.17 లక్షల పరిహారం అందేలా బీమా సౌకర్యం కల్పించారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ద్వారా వీరికి బీమా చేయించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో మృతిచెందిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్కు ఈ బీమా వర్తించే అవకాశముందని విద్యుత్ అధికార వర్గాలు తెలిపాయి. నేషనల్ మీట్లోనూ సత్తా చాటాలి జోనల్ డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచిన పోలీసులు నేషనల్ మీట్లో సత్తా చాటాలని సీపీ సన్ప్రీత్సింగ్ అన్నారు. – 8లోuఇటీవల బీమా సౌకర్యం..న్యూస్రీల్ -
మోతాదుకు మించి యూరియా వాడొద్దు
సంగెం: రైతులు మోతాదుకు మించి పంటలకు యూరియా వాడొద్దని కలెక్టర్ సత్యశారద సూచించారు. గవిచర్లలోని కాపులకనిపర్తి సొసైటీ ఎరువుల గోదాంను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా, డీఏపీ తదితర ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలన్నారు. షాపుల ఎదుట స్టాకు నిల్వ, ధరల పట్టిక వివరాలతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వ్యాపారులను ఆదేశించారు. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చట్టప్రకారం కేసులు నమోదు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు అవసరం మేరకు యూరియా తీసుకోవాలని, ముందస్తుగా తీసుకుని నిల్వ చేయొద్దని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఏఓ యాకయ్య, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సకాలంలో ఎరువులు అందించాలి న్యూశాయంపేట: రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులతో శుక్రవారం యూరియా సరఫరాపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు ప్రణాళికాబద్ధంగా వివిధ పంటలకు సరిపడా ఎరువులు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం అన్ని మండలాల్లో ‘ఏరువాక–పంటల ఆరోగ్యం’ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, నర్సంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వినతులు సకాలంలో పరిష్కరించాలి ఆర్టీఐ, ప్రజావాణిలో వచ్చిన వినతులను సకా లంలో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్టీఐ యాక్ట్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం కోసం శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్షించారు. దరఖాస్తుల పరి ష్కారం పురోగతి, శాఖల వారీగా సమీక్షించి అధికా రులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. గురుకులాలకు పాలు, గుడ్ల సరఫరాపై సమీక్ష జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాలకు విజయ డెయిరీ పాలు, గుడ్ల సరఫరాపై కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులతో సమీక్షించారు. ఆహార పదార్థాల నాణ్యతలో ఎటువంటి రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సత్యశారద -
దీప్తా, కులసుందరి క్రమాల్లో అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తొమ్మిదో రోజు అమ్మవారిని దీప్తా, కులసుందరి క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించి, అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపన భేరాన్ని దీప్తామాతగా, షోడశీ క్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని కులసుందరిగా అలంకరించి పూజలు చేశారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దొడ్డి కొమురయ్యకు నివాళి న్యూశాయంపేట: తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతిని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, కురుమ సంఘం ప్రతినిధులు పాల్గొని దొడ్డి కొంరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య సామాజిక న్యాయం కోసం పోరాడారని వారు కొనియాడారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఆర్ఓ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి పుష్పలత పాల్గొన్నారు. మాజీ సీఎం రోశయ్య జయంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతి ని శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి కలెక్టర్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.మొబైల్ షాపు, టీ స్టాల్లో చోరీ నర్సంపేట: మొబైల్ షాపు, టీ స్టాల్లో చోరీ జరిగిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని మగ్థుంపురం గ్రామ శివారులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోట రాజు చెన్నారావుపేట–నెక్కొండ ప్రధాన రహదారిలో ఉన్న జయముఖి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆర్కే సెల్ షాపు నిర్వహిస్తున్నాడు. మగ్ధుంపురం తండాకు చెందిన మాలోతు బేబిరాణి మణికంఠ టీ స్టాల్ నిర్వహిస్తోంది. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులను నడుపుకొని తాళాలు వేసి వారు ఇళ్లకు వెళ్లారు. అర్ధరాత్రి వేళ దుండగులు గడ్డపారతో తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సెల్షాపులో సుమారు రూ.30 వేల విలువ చేసే స్పీకర్ బాక్స్లు, పౌచులు, బ్లూటూత్లు, చార్జర్లు, చార్జింగ్ కేబుల్స్, సెల్ఫోన్లకు వాడే గ్లాసులు, టీ స్టాల్లో రూ.40 వేల విలువ చేసే వివిధ సిగరెట్ బాక్సులు, కూల్డ్రింక్స్ అపహరించుకుకెళ్లారు. శుక్రవారం ఉదయం షాపులకు వచ్చి చూసే సరికి చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రాజేశ్రెడ్డి పోలీసు సిబ్బందితో చేరుకొని షాపులను పరిశీలించారు. అలాగే, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు వేలిముద్ర నమూనాలను సేకరించారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ గీసుకొండ: మండలంలోని ఓ గ్రామానికి చెంది బాలికపై లైంగిక దాడి చేసిన అదే గ్రామానికి చెందిన యువకుడు కొమ్ముల లిటిల్ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. సదరు బాలికను బలవంతంగా తన బైక్పై గ్రామ శివారుకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని, ఆ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఇటీవల కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. అతడి నుంచి బైక్తోపాటు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. -
ఇక కొత్త రేషన్కార్డులు
సాక్షి, వరంగల్: జిల్లాలో కొత్త రేషన్కార్డుల మంజూరుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కొత్త రేషన్కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం తదితర పథకాల అమలుపై అధికారులు దృష్టి సారించడంతో కొత్తకార్డుల జారీ ప్రక్రియ నిదానమైంది. ప్రభుత్వం గత జనవరి నుంచే కొత్త రేషన్కార్డుల సర్వే చేపట్టి, అర్హులకు కార్డులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసినా వివిధ పథకాలతో ఆలస్యమైంది. క్షేత్రస్థాయిలో అధికారుల సర్వే.. కొత్త రేషన్కార్డుల కోసం ప్రజాపాలనలో మొత్తం 12,773 వచ్చాయి. మీ సేవ కేంద్రాల నుంచి 14,087 దరఖాస్తులు అందాయని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను పౌరసరఫరాల విభాగాధికారులకు పంపాల్సిన తహసీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన నెమ్మదిగా చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా కొత్త రేషన్కార్డుల క్లియరెన్స్ ప్రక్రియ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంతవరకు నత్తనడకన సాగిన ప్రక్రియ ఇప్పుడు వేగవంతంగా జరుగుతోంది. మరో వారం రోజుల్లో పూర్తిచేసే దిశగా ఇరు విభాగాధికారులు పనిచేస్తున్నారు. రేషన్కార్డులు మంజూరు కానుండడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన ఈ రేషన్కార్డుల ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా తేల్చాల్సినవి ఎనిమిది వేలపైనే.. జిల్లాలో మొత్తం 2,66,621 రేషన్ కార్డులున్నాయి. వీటిలో 2,52,799 ఆహార భద్రత కార్డులు, 13,855 అంత్యోదయ అన్నయోజన కార్డులు, ఏడు అన్నపూర్ణ కార్డులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా 14,087 మంది కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వీటిలో 5,667 మాత్రమే అధికారులు క్లియర్ చేశారు. పలు కారణాలతో 124 కార్డులను పౌరసరఫరాల విభాగాధికారులు తిరస్కరించారు. మిగిలిన 8,296 దరఖాస్తులను అన్ని మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ 360 డిగ్రీ యాప్లో తుది జాబితాను తనిఖీ చేస్తున్నారు. ఈ అధికారుల ఆమోదంతో రేషన్కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుంది. సాధ్యమైనంత తొందరగా క్లియర్ చేయడంపై దృష్టి సారించారు. రేషన్కార్డుల జారీపై ప్రత్యేక దృష్టి.. జిల్లాలో కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాం. రెండు నెలల్లో రేషన్కార్డుల్లో పేర్ల మార్పులు, చేర్పులు చేశాం. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రెవెన్యూ సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాం. దళారులను నమ్మి రేషన్కార్డు ఇప్పిస్తామంటే నమ్మొద్దు. అలా ఎవరైనా డబ్బులు తీసుకుని కార్డులు ఇప్పిస్తామంటే ఆ సమాచారం చేరవేయాలి. – కిష్టయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కలెక్టర్ సత్యశారద ఆదేశాలతో జారీ ప్రక్రియ వేగవంతం ఇప్పటివరకు 14,087 దరఖాస్తుల్లో 5,667 క్లియర్ పలు కారణాలతో 124 అర్జీలను తిరస్కరించిన అధికారులు వారంలో పూర్తిచేయనున్న రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ -
పంటలకు సరిపడా యూరియా ఇస్తాం
దుగ్గొండి: ఖరీఫ్ పంటల కోసం సరిపడా యూరియా ఉందని, రైతులకు అవసరం ఉన్నంత యూరియా అందిస్తామని నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి అన్నారు. శ్రీఅన్నదాతల అగచాట్లుశ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీలో కథనం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి మందపల్లి పీఏసీఎస్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఎంత యూరియా వచ్చింది, ఒక్కో రైతుకు ఎన్ని బస్తాలు ఇచ్చారు అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుకు నిర్దిష్టంగా ఇంతే యూరియా ఇస్తామని చెప్పడం సరికాదని సిబ్బందికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అవసరం ఉన్న మేరకు యూరియా ఇవ్వాలన్నారు. ఆధార్కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్లు అవసరం లేదని ఏడీఏ స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లోని పీఏసీఎస్లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో సైతం యూరియా అందుబాటులో ఉంచుతామని వివరించారు. రైతులు ఆందోళన చెందకుండా యూరియా కోసం బారులు తీరొద్దని ఆయన కోరారు. ఆయన వెంట సొసైటీ సిబ్బంది రంగు వెంకటేశ్వర్లు, రాజు ఉన్నారు. నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి ‘సాక్షి’ కథనానికి స్పందన -
ఆశలు.. సజీవ దహనం
సాక్షి, వరంగల్: అతనికి.. భార్య, ఇద్దరు పిల్లలు.. హ్యాపీ లైఫ్.. టెంపరరీ లారీడ్రైవర్గా పనిచేస్తూ పోగేసుకున్న డబ్బులతో ఇటీవల గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పాలు పొంగించి తాత్కాలికంగా ఉంటున్నాడు. ఇల్లులోకి వెళ్లే కార్యక్రమం ఉంది. ఆ శుభకార్యం చేసే హడావుడిలో ఉన్నాడు. ఈక్రమంలోనే లారీ కిరాయికి వెళ్లిన అతడిని మృత్యువు మరో లారీ రూపంలో కబళించింది. ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని రాంధన్తండాకు చెందిన గుగులోతు గణేశ్ (30) తాత్కాలిక లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 2022లో అనసూయతో పెళ్లి జరిగింది. ఆయనకు రెండు సంవత్సరాల బాబు, 15 నెలల పాప ఉన్నారు. గ్రామంలో ఇటీవల కొత్త ఇల్లు కట్టుకున్నాడు. టెంపరరీ డ్రైవర్ కావడంతో ఎవరు కిరాయికి పిలిస్తే వారికి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే గురువారం కరీంనగర్లోని పద్మావతి గ్రానైట్ నుంచి లోడ్ లారీతో కాకినాడకు బయలుదేరాడు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో లారీ యజమాని యాకూబ్ని మార్గమధ్యలోని తన స్వగ్రామమైన ఇల్లందలో దింపాడు. అనంతరం బయలుదేరాడు. శుక్రవారం తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ కుడియాతండా వద్ద వరంగల్–ఖమ్మం 563 జాతీయ రహదారిపై రాజస్థాన్కు చెందిన మరో లారీ.. రోడ్డుపై గుంతను తప్పించబోయి ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో ఇద్దరు లారీడ్రైవర్లు, మరో క్లీనర్ సజీవదహనమయ్యారు. బూడిదే మిగిలింది.. గణేశ్ నడుపుతున్న గ్రానైట్ లారీని.. రాజస్థాన్కు చెందిన లారీ హైవేపై గుంతను తప్పించబోయి అదుపు తప్పి ఎదురుగా ఢీకొట్టింది. అది కూడా.. వస్తున్న గ్రానైట్ లారీ డీజిల్ ట్యాంక్ సమీపంలో బలంగా ఢీ కొట్టడంతో ట్యాంకు పగిలి ఉవ్వెత్తున మంటలు ఎగిశాయి. భారీ గ్రానైట్ బండలు రెండు లారీల క్యాబిన్ల వైపు రావడంతో నుజ్జునుజ్జు కావడం, అందులో లారీడ్రైవర్లు, క్లీనర్ ఇరుక్కుపోవడంతో బయటికి రాలేక మంటల్లో సజీవదహనమయ్యారు. బోరున విలపించిన భార్య భర్త లారీ క్యాబిన్లో కూర్చున్నచోటే బూడిద కావడంతో ఘటనాస్థలానికి చేరుకున్న భార్య అనుసూయ ఆ దృశ్యాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియక ఇద్దరు పిల్లలు అమాయకంగా చూస్తుండడంతో అక్కడున్న వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరిపెడ ఘటనలో వర్ధన్నపేటవాసి మృతి భర్త బూడిద చూసి విలపించిన భార్య -
‘ప్రత్యేక’ పిల్లలకు విశిష్ట బోధన
విద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రభుత్వం భరోసా భవిత కేంద్రాలు నిర్వహిస్తోంది. శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలను భవిత కేంద్రాలల్లో చేర్పించి పాఠశాల స్థాయి చిన్నారులకు ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్, రిసోర్స్పర్సన్లతో ప్రత్యేకంగా విద్యను బోధించనున్నారు. మండలానికో కేంద్రం హనుమకొండ జిల్లాలో ప్రతీ మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వశిక్షా అభియాన్ కింద ఈసెంటర్లను ఏర్పాటు చేశారు. హనుమకొండ, పరకాలలో శాశ్వత భవనంతో కూడిన భవిత కేంద్రాలున్నాయి. మిగతా మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఓగదిలో నడిపిస్తున్నారు. ప్రతి భవిత సెంటర్లో 16మంది చొప్పున ప్రత్యేక అవసరాల పిల్లలకు అవకాశం కల్పిస్తున్నారు. భవిత సెంటర్లో ఐఈఆర్పీ(బోధకుడు) ఆయా పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో బొమ్మలు చూపిస్తూ.. వారి వైకల్యాన్ని బట్టి వారికి అర్థమయ్యేలా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో విద్యను బోధిస్తుంటారు. ఈభవిత సెంటర్కు కూడా రాలేని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇంటివద్దనే హోమ్ బేస్డ్ విద్యను సైతం అందిస్తున్నారు. ప్రతీ శనివారం ఒక్కో ఐఈఆర్పీ కనీసం 8 మంది ప్రత్యేక అవసరాల పిల్లల వద్దకు వెళ్లి వారికి అనుగుణంగా విద్యను నేర్పించాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ వైద్యం.. రెమ్యునరేషన్ ప్రతీ భవిత సెంటర్లో ఫిజియోథెరఫిస్ట్ను అందుబాటులో ఉంచుతారు. శారీరకంగా వైకల్యాన్ని బట్టి ఫిజియోథెరపీ చేస్తారు. గతంలో వారానికి ఒక్కరోజే వీరు భవిత సెంటర్కు వచ్చి ఫిజియోథెరపీ చేసేవారు. ఈవిద్యా సంవత్సరం నుంచి వారంలో రెండు రోజులు చేయనున్నారు. కాగా భవిత సెంటర్లకు పిల్లల్ని తీసుకొచ్చే తల్లిదండ్రులకు నెలకు రూ 500లు, పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు రూ 500లు చొప్పున రవాణా భత్యం ఇస్తున్నారు. ఈవిద్యాసంవత్సరంలో హనుమకొండ జిల్లాలో 1,841 మంది పిల్లలు ప్రత్యేక అవసరాల పిల్లలున్నట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. సొంత భవనాలు రెండింటికే హనుమకొండ మండల కేంద్రంలో, పరకాలలోని భవిత కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. వీటిని అందంగా తీర్చిదిద్దారు. ఈరెండు భవిత కేంద్రాలకు ఒక్కొ భవిత కేంద్రానికి రూ. 2 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. ఆ నిధులతో పిల్లలను ఆకట్టుకునే బొమ్మలు, మెటీరియల్ కొని ఉంచారు. మరో రెండింటికి రూ.7 లక్షలు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని నడుపుతున్నారు. అక్కడ స్థలం ఉండడంతో భవిత కేంద్రం నిర్వహించేందుకు ఒక గదిని నిర్మించేందుకు కొన్ని నెలల క్రితం రూ.7 లక్షలు మంజూరయ్యాయి. హసన్పర్తి మండలం భీమారంలోని ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని నడుపుతున్నారు. అక్కడ సైతం గది నిర్మాణానికి రూ.7 లక్షలు మంజూరయ్యాయి. వీటిని త్వరలోనే నిర్మించనున్నారు. కాగా.. మిగతా చోట్ల మరమ్మతులకు టాయ్లెట్స్ ర్యాంపులకు ఒక్కో భవిత కేంద్రానికి రూ.లక్ష జిల్లాలో ఐనవోలు, కమలాపూర్, మడికొండ, కంఠాత్మకూరు, పత్తిపాక, వేలేరు, అక్కంపేట, భీమదేవరపల్లి, దామెర స్కూళ్లలో నడుపుతున్న భవిత సెంటర్ల మరమ్మతులకు రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా జిల్లాలోని 14 భవిత కేంద్రాలకు పేయింటిం కోసం ఒక్కో భవిత కేంద్రానికి రూ ఒక లక్ష 50 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం రూ.63.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ప్రత్యేక పిల్లలకు‘ భవిత’ తోడ్పాటు గ్రామాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లల్ని సిబ్బంది గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించనున్నారు. పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఫిజియోథెరపీ, ప్రత్యేకంగా బోధన ఉంటుంది. భవిత కేంద్రాలను ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలి. – బద్దం సుదర్శన్ రెడ్డి, జిల్లా కమ్యునిటీ మొబిలింగ్ కోఆర్డినేటర్ జిల్లాలో భరోసా భవిత కేంద్రాలు రెండింటికి ప్రత్యేక నిధులు, శాశ్వత భవనాలు వైకల్యం ఆధారంగా విద్యా బోధన వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ జిల్లాలో 1841 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలు -
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
– 4లోuపక్క ఫొటోలోని సీసీ రోడ్డు వరంగల్లోని 42 డివిజన్లో ఇటీవల నిర్మించినది. ఈ రోడ్డు నిర్మాణ పనులకు సుమారు రూ.65 లక్షలకుపైగా నిధులు వెచ్చించారు. అలాగే గవిచర్ల క్రాస్ రోడ్ టీచర్స్ కాలనీలో రోడ్లు వేసిన కొద్ది రోజులకే గుంతలు ఏర్పడిన నీరు నిలిచిన ధ్వంసమవుతున్నాయి.ఈ ఫొటోలో కనిపిస్తున్న హనుమకొండ స్నేహనగర్లో రోడ్ నంబర్–17లో గతంలో నిర్మించిన సైడ్ కాల్వ నిర్మాణం ధ్వంసం కావడంతో అందులో మట్టి, నీరు నిలిచింది. పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు వెళ్లకుండా మురుగు నీరు ముందుకు పోవడం లేదు. న్యూస్రీల్ -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పెంచాలి
● హనుమకొండ డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ లో ఈవిద్యాసంవత్సరం (2025–2026)లో ప్రవేశాలు పెంపుదల చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. గురువారం హనుమకొండలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లతో డీఈఓ కార్యాయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్కు అర్హులలైన మహిళా సమాఖ్య సభ్యులు 1,800మందికిపైగా జిల్లాలో ఉన్నారని, వారు ప్రవేశాలు పొందేలా కృషి చేయాలని సూచించారు. వారికి ఓపెన్ స్కూల్ విద్య గురించి తెలియజేసి చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. అడ్మిషన్ల విధానం, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అనేది కూడా వివరించాలన్నారు. ఓపెన్ స్కూల్లో ప్రవేశాల లక్ష్యాలను వివరించారు. మళ్లీ ఈనెల 9న సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం పాల్గొన్నారు. నేడు శ్రీరుద్రేశ్వరస్వామికి శతఘటాభిషేకం హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం ఉదయం శ్రీరుద్రేశ్వరస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని, పాడిపంటల సమృద్ధి, భూగర్భజలాలు నిండుగా ఉండాలనే సంకల్పంతో రుష్యశృంగపూజ 60 వారుణానువాకాలుతో శ్రీరుద్రేశ్వరుడికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ ఉంటుందని తెలిపారు. మహాశాకంబరీ ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న గురువారం ఆషాఢ శుద్ధ పౌర్ణమిరోజున మహాశాకంబరీగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా గురువారం కార్యాలయంలో ఈఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ధర్మకర్తలు, మట్వాడ సీఐ గోపి, ట్రాఫిక్ ఎస్సై సాయికిరణ్ పాల్గొని దేవాలయాన్ని పరిశీలించి శాకంబరీ ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు క్యూ లైన్లు, తాగునీటి వసతి, బాదంమిల్క్, మజ్జిగ పంపిణి, అదనంగా ప్రసాదాల విక్రయకౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాలిటెక్నిక్ కాలేజి పక్కగా ప్రవేశించి దర్శనం అనంతరం కాపువాడ మీదుగా బయటకు వెళ్లాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా ఈఓ శేషుభారతి దేవాలయంలో పూలమొక్కలు నాటారు. నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కాజీపేట అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరుకావాలని కోరారు. రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలి న్యూశాయంపేట: రోగ నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అరుంధతి పట్నాయక్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్పై గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 8 రకాల వ్యాధులకు సంబంధించి 2,04,979 మంది రోగులు ఉన్నారని తెలిపారు. వారిలో 3,794 మందికి జూన్ 3 నుంచి రెండో విడత టీబీ, 8 రకాల వ్యాధుల నిర్మూలనకు వైద్య, ఆరోగ్య శాఖ కృషిచేస్తోందని తెలిపారు. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. -
మురికి కాల్వలు అస్తవ్యస్తం
రూ.లక్షలు ఖర్చు చేసి డ్రెయినేజీలు నిర్మిస్తున్న అవి మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిమెంట్, ఇసుక మోతాదులో వాడకపోవడం వల్ల నాణ్యత లోపిస్తుంది. కాలుతో తన్నితే మురికి కాల్వలు కూలిపోతున్నాయి. కనీసం వానాకాలం సీజన్ వరద రాకముందే దెబ్బతింటున్నాయి. – నద్దునూరి నాగరాజు, చింతగట్టు నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి సైడ్ డ్రెయినేజీల నిర్మాణం త్వరగా, తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం కోసం రెడ్మిక్స్తో పూర్తి చేస్తున్నారు. పూర్తయిన మురికి కాల్వలకు సరిగా క్యూరింగ్ చేపట్టడం లేదు. పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇదేంటని అడిగితే వర్క్ అగ్రిమెంట్లో ఇలానే ఉందంటున్నారు. – పెరుగు సురేష్, న్యూశాయంపేట రోడ్లపైకి నీళ్లు వస్తున్నయ్.. వరంగల్ మార్కెట్ ఏరియాలో సీసీ రోడ్లు వేసి సైడ్ డ్రెయినేజీ నిర్మించారు. అయితే కొద్ది రోజులకే డ్రెయినేజీ దెబ్బతినడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తుంది. పారిశుద్ధ్యం సరిగా లేక రోడ్లపైకి వస్తున్న బురద దుర్వాసన, దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. – మాడిశెట్టి భరత్, పాతవీధి మురుగును భరించలేకున్నాం..ఆర్భాటంగా నిర్మించిన డ్రెయినేజీలు.. ఆ తర్వాత నిర్వహణకు నోచుకోవడం లేదు. 39వ డివిజన్లోని కరీమాబాద్ ప్రాంతంలో మురికికాల్వల్లో చెత్త, మురుగు నిలిచి విపరీతంగా దుర్గంధం వస్తుంది. ఇటీవల వర్షాలకు మురుగు నీరుతోపాటు దోమల వల్ల సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. – కొప్పుల రాజ్కుమార్, కరీమాబాద్ -
చైల్డ్ ట్రాఫికింగ్పై కఠిన చర్యలు
వరంగల్ క్రైం : చైల్డ్ ట్రాఫికింగ్, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు వివిధ శాఖలతో కలిసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో చైల్డ్ ట్రాఫికింగ్పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్ను సీపీ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైల్డ్ ట్రాఫికింగ్ అనేది సమాజాన్ని గాయపరిచే తీవ్రమైన నేరమని, ఇది అమాయక పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని వివరించారు. సాధారణంగా పేద పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు, చదువు, మంచి జీవితం అనే మాయ మాటలతో నిందితులు మోసగిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాలకార్మికులుగా మారకుండా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా, నాణ్యమైన విద్యను అందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలలకు ఆపద వస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రవికుమార్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ విభాగం ఇన్స్పెక్టర్ జి.శ్యామ్కుమార్, వరంగల్ జిల్లా చైల్డ్ రైట్స్ అడ్వయిజరీ ఫోరం కన్వీనర్ మండల పరశురాములు, ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ సభ్యురాలు మంజులతో పాటు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
జిల్లా కోర్టులకు పీపీల నియామకం
వరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా మొదటి అదనపు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది భూక్య వెంకట్రామ్ నాయక్, పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గంప వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ, శాసనశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఇరువురు పీపీలుగా బాధ్యతలు స్వీకరించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ, ఇతర న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు జిల్లా మదనపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది భూక్య వెంకట్రామ్ నాయక్ 1988 నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్గా, రాష్ట్ర లోకాయుక్తలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పడిన నాటి నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావడం ఇదే తొలిసారి. నగరంలోని మట్టెవాడ ప్రాంతానికి చెందిన గంప వెంకటరమణ 18 ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. వరంగల్ బార్ అసోసియేషన్కు మూడు పర్యాయాలు క్రీడా, సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశారు. కాగా ఇరువురు మూడేళ్ల వరకు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలి
న్యూశాయంపేట: ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతంగా విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో నావల్ మాట్లాడారు. చట్టప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విపత్తు నిర్వహణలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగంపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పాఠశాలలను గుర్తించినట్లు చెప్పారు. వాటిలో ఉన్నవారిని ముందస్తుగానే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ బల్దియా ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా నగరంలో విపత్తులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్డీఎంఏ అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ వసీం ఇక్బాల్, గౌతమ్ కృపా, సంధ్రా, అనుపమా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ -
కోట్లు గుల్ల
నాణ్యత డొల్ల..● ‘గ్రేటర్’లో ఇష్టారాజ్యంగా రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం ● పనుల్లో నాణ్యతకు తిలోదకాలు.. ప్రజాధనం దుర్వినియోగం ● ముసురుకే రోడ్లన్నీ గుంతలమయం... ● మహా నగరవాసులకు తప్పని తిప్పలుసాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరంలో నిర్మించిన రోడ్లు, డ్రెయినేజీలు మూడ్రోజుల ముచ్చటగా మారుతున్నాయి. స్మార్ట్ సిటీ, అమృత్, మున్సిపల్ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించి ధ్వంసమవుతున్నాయి. ఇటీవల కురిసిన తేలికపాటి చినుకులకే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని రోడ్లు, డ్రెయినేజీలు నోళ్లు తెరిచి ఉన్నాయి. దీంతో కిందకు ప్రవహించే నీరు లోతట్టు కాలనీలకు చేరి కుంటను తలపిస్తున్నాయి. దీంతో కాలనీలకు అనుసంధానమైన రోడ్లన్నీ గుంతలమయమై నగరవాసులకు నరకప్రాయంగా మారాయి. అలాగే మురుగు, చెత్త నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాంట్రాక్టర్ల సిండికేట్, అధికారుల వత్తాసు.. గ్రేటర్ వరంగల్లో పనులు దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులు వత్తాసు పలుకుతుండటంతో రూ.కోట్లు ఖర్చు చేసిన పనులు కొద్దిరోజుల్లోనే దెబ్బతింటున్నాయనే ఆరోపణలున్నాయి. 2015 నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో పాతుకుపోయిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారు. 2015–2018 సంవత్సరాల్లో సాగిన కుమ్మక్కు, మాముళ్ల వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం లేపాయి.. ఐదారు నెలల క్రితం కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో కాంట్రాక్టర్లు మళ్లీ జట్టుకట్టి పనులు చేస్తున్నారు. ఏడాదిలో వివిధ పద్దుల (స్మార్ట్ సిటీ నిధులు కాకుండా) కింద సుమారు రూ.195 కోట్లతో నగరంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఈ పనులను కొద్ది మంది కాంట్రాక్టర్లు కీలక ప్రజాప్రతినిధుల ఆదేశం, ఇంజనీరింగ్ అధికారుల మద్దతుతో పూర్తి చేశారు. ట్రైసీటిలో చేసిన పనుల్లో చాలాచోట్ల దెబ్బతినడం. తరచూ కాలనీ వాసులు ప్రజావాణిల్లో ఫిర్యాదు చేస్తుండటం వివాదస్పదంగా మారింది. తాజాగా జీడబ్ల్యూఎంసీ కీలక ప్రజాప్రతినిధి అండదండలతో బడా కాంట్రాక్టర్లు రూ.187.24 కోట్ల పనులపై కన్నేసి సిండికేట్ దక్కించుకుంది. కాగా ప్రజాప్రతినిధులు, అధికారుల మద్దతు.. ఎక్సెస్ టెండర్లు, నాసిరకం పనులతో కొందరు కాంట్రాక్టర్లు భారీగా దండుకోగా, కొద్ది రోజులకే దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల ప్రభావం నగరవాసులపై పడుతోంది. వాళ్లకు పర్సంటేజీలు.. ఇంజనీరింగ్ డీబీ సెక్షన్కు 0.25 శాతం, స్థానిక కార్పొరేటర్కు 4, ఆపై ప్రజాప్రతినిధికి 4, ఏఈకి 4, డీఈకి 3, ఈఈకి 2, ఎస్ఈకి 1 శాతం, అడిట్ విభాగం, అకౌంట్స్కు తలా 0.50 శాతం.. ఇలా పర్సంటేజీలు చెల్లించాల్సి వస్తోందని గ్రేటర్ పరిధిలో చేపట్టే రోడ్లు, డ్రెయినేజీ తదితర నిర్మాణం పనులు చేసే కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారన్న చర్చ జరగుతోంది. మట్టి, కంకర రోడ్లు వేశాకా.. తారు వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించి ఒక్కోచోట మట్టిపై నుంచి కంకర పరిచిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు రోడ్డుకు రెండు వైపులా ఎక్కడికక్కడ కోతకు గురై రోడ్లకు గండ్లు పడ్డాయి. ఇక సీసీ రోడ్డు నిర్మాణాలైతే అధ్వానంగా మారాయి. గతంలో ఉన్న తారురోడ్డుపైనే సీసీ రోడ్డును వేశారు. మురికి కాల్వలు నిర్మించాల్సి ఉండగా, అవి లేకుండానే సీసీరోడ్డు వేయగా బురద, మురుగు నీరు రోడ్లపైకి, కాలనీల్లోకి చేరుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై ఫొటో గ్రేటర్ వరంగల్లోని రహమత్నగర్లో గల సీసీ రోడ్డుది. ఈ రోడ్డు పనులు చేస్తున్నప్పుడే నాణ్యత లోపించిందంటూ సంబంధిత కాలనీలకు చెందిన కొందరు ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. ఈ రోడ్డుతో పాటు ఐదు కాలనీల్లో పనులు పూర్తి చేసిన కొద్ది రోజులకే సీసీ రోడ్డు కూలిపోయింది. -
ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలి
హన్మకొండ అర్బన్: ఎన్నికల విధులు, నియమ నిబంధనలపై బూత్ లెవల్ అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలని హనుమకొండ ఆర్డీఓ రమేశ్ అన్నారు. గురువారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్లో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ తహసీల్దార్ రంజిత్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ మాట్లాడుతూ ఓట్ల నమోదు కోసం, తొలగింపు, బదిలీ, మార్పు, చేర్పులకు సంబంఽధించి వినియోగించే ఫారాలపై బీఎల్ఓలకు అవగాహన ఉండాలన్నారు. భారత ఎన్నికల సంఘం తీసుకువచ్చే నూతన మార్పులను తెలుసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఓటర్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో నమోదు నిరంతర ప్రక్రియ అన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు దశరథ రామ్రెడ్డి, శరత్కుమార్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ ఆర్డీఓ రమేశ్ -
జిల్లా కోర్టులకు పీపీల నియామకం
వరంగల్ లీగల్: జిల్లా మొదటి అదనపు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది భూక్య వెంకట్రామ్ నాయక్, పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గంప వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ, శాసనశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఇరువురు పీపీలుగా బాధ్యతలు స్వీకరించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ, ఇతర న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు జిల్లా మదనపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది భూక్యా వెంకట్రాంనాయక్ 1988 నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్గా, రాష్ట్ర లోకాయుక్తలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పడిన నాటి నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావడం ఇదే తొలిసారి. నగరంలోని మట్టెవాడ ప్రాంతానికి చెందిన గంప వెంకటరమణ 18 ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. వరంగల్ బార్ అసోసియేషన్కు మూడు పర్యాయాలు క్రీడా, సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశారు. కాగా, ఇరువురు మూడేళ్ల వరకు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీపీల నియామకంపై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. -
చైల్డ్ ట్రాఫికింగ్పై కఠిన చర్యలు
వరంగల్ క్రైం: చైల్డ్ ట్రాఫికింగ్, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు వివిధ శాఖలతో కలిసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో చైల్డ్ ట్రాఫికింగ్పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్ను సీపీ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది సమాజాన్ని గాయపరిచే తీవ్రమైన నేరమని, ఇది అమాయక పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని వివరించారు. సాధారణంగా పేద పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు, చదువు, మంచి జీవితం అనే మాయ మాటలతో నిందితులు మోసగిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాలకార్మికులుగా మారకుండా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలలకు ఆపద వస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రవికుమార్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఇన్స్పెక్టర్ జి.శ్యాంకుమార్, జిల్లా చైల్డ్ రైట్స్ అడ్వయిజరీ ఫోరం కన్వీనర్ మండల పరశురాములు, ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ సభ్యురాలు మంజుల, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలి
న్యూశాయంపేట: ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతంగా విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో నావల్ మాట్లాడారు. ప్రతిశాఖ తమదైన ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించడం కీలకమన్నారు. చట్టప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విపత్తు నిర్వహణలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగంపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. స్థానికుల సహకారంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పాఠశాలలను గుర్తించినట్లు చెప్పారు. వాటిలో ఉన్నవారిని ముందస్తుగానే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ బల్దియా ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా నగరంలో విపత్తులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరదలు సంభవించినప్పుడు చేపట్టే చర్యలపై ఆయా శాఖల అధికారులు వివరించారు. సమావేశంలో ఎన్డీఎంఏ అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ వసీం ఇక్బాల్, గౌతమ్ కృపా, సంధ్రా, అనుపమా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ -
విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
దుగ్గొండి: గ్రామాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఓటర్ల నమోదు, చనిపోయిన ఓటర్ల తొలగింపు, తప్పులు సరిచేయడం వంటి వాటిపై విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి అన్నారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన బీఎల్ఓల ఒకరోజు శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడా రు. ఓటర్ల నమోదు కోసం అందించే దరఖాస్తులు, తప్పులు సరిచేసుకోవడం, చిరునామా మార్చుకోవడం వంటి విషయాలపై వివరించారు. గ్రామాలలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత బీఎల్ఓలదేనని గుర్తు చేశారు. ఎన్నికల వేళ బీఎల్ఓలు రాజకీయాలకు అతీ తంగా వ్యవహరించాలని సూచించారు. తహసీల్దార్ రాజేశ్వర్రావు, డీటీ ఉమ, ఆర్ఐలు రాంబాబు, మల్లయ్య, రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు. రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలిన్యూశాయంపేట: రోగ నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కా ర్యదర్శి అరుంధతి పట్నాయక్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్పై గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జి ల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 8రకాల వ్యాధులకు సంబంధించి 2,04,979 మంది రోగులు ఉన్నారని తెలిపారు.వారిలో 3,794 మందికి జూన్ 3 నుంచి రెండో విడత టీబీ, 8 రకాల వ్యాధుల నిర్మూలనకు వైద్య, ఆరోగ్య శాఖ కృషిచేస్తోందని తెలి పారు. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. నేడు శ్రీరుద్రేశ్వరస్వామికి శతఘటాభిషేకం హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం ఉదయం శ్రీరుద్రేశ్వరస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని, పాడిపంటల సమృద్ధి పండాలని, భూ గర్భజలాలు నిండుగా ఉండాలనే సంకల్పంతో రుష్యశృంగపూజ 60వారుణానువాకా లుతో శ్రీ రుద్రేశ్వరుడికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్న ట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ ఉంటుందని తెలిపారు. పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలుఖానాపురం: పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీరాములు, స్రవంతి, సురేశ్ తమ ఇళ్లలో పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పిచ్చికుక్క వారిపై దాడిచేసి గాయపర్చింది. దీంతో మండల కేంద్రంలోని పీహెచ్సీకి వెళ్లి వైద్యచికిత్స చేయించుకున్నారు. నిధులు విడుదల చేయాలని లేఖ! కాళేశ్వరం: కాళేశ్వరాలయ అభివృద్ధికి రూ. 200కోట్ల నిధులు విడుదల చేయాలని మంత్రి శ్రీధర్బాబు లేఖ రాసినట్లు ఆలయవర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు సరస్వతీ నది పుష్కరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పుష్కరాల మొదటిరోజు ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళేశ్వరాలయం అభివృద్ధికి రూ.200కోట్లు మంజూరు చేస్తానని సీఎం సభాముఖంగా హామీ ఇచ్చిన విషయం తెలి సిందే. 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల మంత్రి శ్రీధర్బాబు కాళేశ్వరాలయ అభివృద్ధికి రూ. 200కోట్ల నిధులు విడుదల చేయాలని లేఖ రాసినట్లు తెలిసింది. త్వరలో నిధులు విడుదలు అవుతాయని ఆలయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే గోదావరి తీరం నుంచి ఆలయ పరిసరాల్లో భూసేకరణపై పలు సర్వేనంబర్ల వారీగా సర్వే కూడా చేపట్టారు. అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా రోడ్లు విస్తరణ, శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
నర్సంపేట రూరల్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరం నుంచి కోనాపురం ప్రధాన రహదారి గురిజాల వద్ద రూ.3.20 కోట్లతో వంతెన నిర్మాణ పనులు, గురిజాల నుంచి కోనాపురం వరకు రూ.3.10 కోట్లతో బీటీ రోడ్డు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి చింతగడ్డతండాకు రూ.60 లక్షలతో బీటీ రోడ్డు, ఇటుకాలపల్లి 365 జాతీయ రహదారి నుంచి మేడపల్లి వరకు రూ.6 కోట్లతో బీటీ నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తొలుత బీటీ రోడ్ల నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
మహాశాకంబరీ ఏర్పాట్లపై సమీక్ష
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న మహాశాకంబరీగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా గురువారం కార్యాలయంలో ఈఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ధర్మకర్తలు, మట్వాడ సీఐ గోపి, ట్రాఫిక్ ఎస్సై సాయికిరణ్ పాల్గొని దేవాలయాన్ని పరిశీలించి శాకంబరీ ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు క్యూలైన్లు, తాగునీటి వసతి, బాదంమిల్క్, మజ్జిగ పంపిణీ, అదనంగా ప్రసాదాల విక్రయకౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాలిటెక్నిక్ కళాశాల పక్కన ప్రవేశించి దర్శనం అనంతరం కాపువాడ మీదుగా బయటకు వెళ్లాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా ఈఓ శేషుభారతి దేవాలయంలో పూలమొక్కలు నాటారు. -
అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
గీసుకొండ: పరకాల నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీఓ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ బాధ్యులు కోరారు. ఈ మేరకు గురువారం వారు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు రెండు యాప్లను ఇచ్చి సమాచారం సేకరించాలని ప్రభుత్వం ఆదేశించిందని, గ్రామాల్లో సరిగా ఇంటర్నెట్ లేకపోవడంతో తమ సమయం వివరాల నమోదుకే సరిపోతోందని పేర్కొన్నారు. ఫొటో క్యాప్చర్ను తీసివేయాలని, ఐసీడీఎస్కు సంబంధించిన బాధ్యతలు మినహా ఇతర పనులు అప్పగించవద్దని కోరారు. వర్ధన్నపేట, ధర్మారం సెక్టార్లలో పనిచేస్తున్న 21 సెంటర్లతో దూర భారం పెరుగుతోందని వివరించారు. ఽవాటిలో కొన్నింటిని వరంగల్ ప్రాజెక్టులో కలపాలని పేర్కొన్నారు. మొగిలిచర్ల, పోతరాజుపల్లి, బొడ్డుచింతలపల్లి సెంటర్లలో తలుపులు శిథిలమయ్యాయని, దొంగలు సామాన్లను ఎత్తుకెళ్తున్నారని తెలిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మేక అనితాకుమారి, ప్రతినిధులు ఎం.స్వరూపారాణి, కె.లలిత, ఎం.కోమలత, జె.రేణుక, పి.జ్యోతి, కళ, ఇందిర, ప్రమీల, ఎమేలియా ఎమ్మెల్యేను కలిశారు. -
నాణ్యత డొల్ల.. కోట్లు గుల్ల
● ‘గ్రేటర్’లో ఇష్టారాజ్యంగా రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం ● పనుల్లో నాణ్యతకు తిలోదకాలు.. ప్రజాధనం దుర్వినియోగం ● ముసురుకే రోడ్లన్నీ గుంతలమయం ● మహా నగరవాసులకు తప్పని తిప్పలుపక్క ఫొటోలోని సీసీ రోడ్డు వరంగల్లోని 42 డివిజన్లో ఇటీవల నిర్మించినది. ఈ రోడ్డు నిర్మాణ పనులకు సుమారు రూ.65 లక్షలకుపైగా నిధులు వెచ్చించారు. అలాగే గవిచర్ల క్రాస్రోడ్డు టీచర్స్ కాలనీలో రోడ్లు వేసిన కొద్ది రోజులకే గుంతలు ఏర్పడిన నీరు నిలిచిన ధ్వంసమవుతున్నాయి.సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరంలో నిర్మించిన రోడ్లు, డ్రెయినేజీలు మూడ్రోజుల ముచ్చటగా మారుతున్నాయి. స్మార్ట్ సిటీ, అమృత్, మున్సిపల్ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించి ధ్వంసమవుతున్నాయి. ఇటీవల కురిసిన తేలికపాటి చినుకులకే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని రోడ్లు, డ్రెయినేజీలు నోళ్లు తెరిచి ఉన్నాయి. దీంతో కిందకు ప్రవహించే నీరు లోతట్టు కాలనీలకు చేరి కుంటను తలపిస్తున్నాయి. దీంతో కాలనీలకు అనుసంధానమైన రోడ్లన్నీ గుంతలమయమై నగరవాసులకు నరకప్రాయంగా మారాయి. అలాగే మురుగు, చెత్త నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాంట్రాక్టర్ల సిండికేట్, అధికారుల వత్తాసు.. గ్రేటర్ వరంగల్లో పనులు దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులు వత్తాసు పలుకుతుండటంతో రూ.కోట్లు ఖర్చు చేసిన పనులు కొద్దిరోజుల్లోనే దెబ్బతింటున్నాయనే ఆరోపణలున్నాయి. 2015 నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో పాతుకుపోయిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారు. 2015–2018 సంవత్సరాల్లో సాగిన కుమ్మక్కు, మాముళ్ల వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం లేపాయి.. ఐదారు నెలల క్రితం కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో కాంట్రాక్టర్లు మళ్లీ జట్టుకట్టి పనులు చేస్తున్నారు. ఏడాదిలో వివిధ పద్దుల (స్మార్ట్ సిటీ నిధులు కాకుండా) కింద సుమారు రూ.195 కోట్లతో నగరంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఈ పనులను కొద్ది మంది కాంట్రాక్టర్లు కీలక ప్రజాప్రతినిధుల ఆదేశం, ఇంజనీరింగ్ అధికారుల మద్దతుతో పూర్తి చేశారు. ట్రైసీటిలో చేసిన పనుల్లో చాలాచోట్ల దెబ్బతినడం. తరచూ కాలనీ వాసులు ప్రజావాణిల్లో ఫిర్యాదు చేస్తుండటం వివాదస్పదంగా మారింది. తాజాగా జీడబ్ల్యూఎంసీ కీలక ప్రజాప్రతినిధి అండదండలతో బడా కాంట్రాక్టర్లు రూ.187.24 కోట్ల పనులపై కన్నేసి సిండికేట్ దక్కించుకుంది. కాగా ప్రజాప్రతినిధులు, అధికారుల మద్దతు.. ఎక్సెస్ టెండర్లు, నాసిరకం పనులతో కొందరు కాంట్రాక్టర్లు భారీగా దండుకోగా, కొద్ది రోజులకే దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల ప్రభావం నగరవాసులపై పడుతోంది. వాళ్లకు పర్సంటేజీలు.. ఇంజనీరింగ్ డీబీ సెక్షన్కు 0.25 శాతం, స్థానిక కార్పొరేటర్కు 4, ఆపై ప్రజాప్రతినిధికి 4, ఏఈకి 4, డీఈకి 3, ఈఈకి 2, ఎస్ఈకి 1 శాతం, అడిట్ విభాగం, అకౌంట్స్కు తలా 0.50 శాతం.. ఇలా పర్సంటేజీలు చెల్లించాల్సి వస్తోందని గ్రేటర్ పరిధిలో చేపట్టే రోడ్లు, డ్రెయినేజీ తదితర నిర్మాణం పనులు చేసే కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారన్న చర్చ జరగుతోంది. మట్టి, కంకర రోడ్లు వేశాకా.. తారు వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించి ఒక్కోచోట మట్టిపై నుంచి కంకర పరిచిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు రోడ్డుకు రెండు వైపులా ఎక్కడికక్కడ కోతకు గురై రోడ్లకు గండ్లు పడ్డాయి. ఇక సీసీ రోడ్డు నిర్మాణాలైతే అధ్వానంగా మారాయి. గతంలో ఉన్న తారురోడ్డుపైనే సీసీ రోడ్డును వేశారు. మురికి కాల్వలు నిర్మించాల్సి ఉండగా, అవి లేకుండానే సీసీరోడ్డు వేయగా బురద, మురుగు నీరు రోడ్లపైకి, కాలనీల్లోకి చేరుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై ఫొటో గ్రేటర్ వరంగల్లోని రహమత్నగర్లో గల సీసీ రోడ్డుది. ఈ రోడ్డు పనులు చేస్తున్నప్పుడే నాణ్యత లోపించిందంటూ సంబంధిత కాలనీలకు చెందిన కొందరు ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. ఈ రోడ్డుతో పాటు ఐదు కాలనీల్లో పనులు పూర్తి చేసిన కొద్ది రోజులకే సీసీ రోడ్డు కూలిపోయింది. మురికి కాల్వలు అస్తవ్యస్తం రూ.లక్షలు ఖర్చు చేసి డ్రెయినేజీలు నిర్మిస్తున్నా అవి మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిమెంట్, ఇసుక మోతాదులో వాడకపోవడం వల్ల నాణ్యత లోపిస్తుంది. కాలుతో తన్నితే మురుగు కాల్వలు కూలిపోతున్నాయి. కనీసం వానాకాలం సీజన్ వరద రాకముందే దెబ్బతింటున్నాయి. – నద్దునూరి నాగరాజు, చింతగట్టు -
ఫార్మర్ ఐడీ తప్పనిసరి
నెక్కొండ: వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంలో భాగంగా రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ ఈ రిజిస్ట్రీలో రైతుల భూముల వివరాలను నమోదు చేస్తోంది. పథకాల అమలుకు ప్రతీ రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ (ఎఫ్ఆర్) చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. మే 5 నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. వ్యవసాయశాఖ సిబ్బంది తమ క్లస్టర్ల పరిధిలో ఫార్మర్ రిజిస్ట్రేషన్కు శ్రీకారం చుట్టింది. కాగా, నమోదు ప్రక్రియలో జిల్లాలోనే నెక్కొండ మండలం ముందంజలో ఉంది. పీఎం కిసాన్ అందాలంటే.. రైతుల భూములకు సంబంధించిన వివరాలతో కూ డిన సమాచారాన్ని పొందుపరచనున్నారు. రెవె న్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వి వరాలను రైతు ఆధార్కార్డుకు అనుసంధానం చేసి న ఫార్మర్ ఐడీని కేటాయిస్తారు. పీఎం కిసాన్ లబ్ధి దారులు తదుపరి విడత లబ్ధి పొందేందుకు ప్రామాణికంగా ఫార్మ రిజిస్ట్రేషన్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఫార్మర్ ఐడీని పొందుటకు ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్ను తీసుకొని సమీపంలోని వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించాలి. యాప్లో సాంకేతిక సమస్య.. జిల్లాలో మొత్తం 1,58,177 మంది రైతులు ఉన్నారు. ఇప్పటి వరకు 58,149 (36.76 శాతం) మంది రైతుల వివరాలను ఏఈఓలు యాప్లో నమోదు చేశారు. క్లస్టర్ల పరిధిలోని గ్రామాల వారీగా ఏఈఓలు ప్రతి రోజు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ రైతుల వివరాలను సేకరిస్తున్నారు. రైతు ఆధార్కార్డు, పట్టాదారు పాసుపుస్తకంలోని భూముల వివరాలు, యాప్లో నమోదు చేయగానే 11 నంబర్ల ప్రత్యేక యానిక్ కోడ్ కేటాయిస్తున్నారు. అయితే యాప్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో రైతుల వివరాలను నమోదు చేసేందుకు ఏఈఓలు పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు చెందిన భూముల సమాచారం యాప్లో కనిపించకపోవడంతో వివరాలను నమోదు చేసే ప్రక్రియలో జాప్యం అవుతోంది. అదేవిధంగా రైతుల సెల్ఫోన్లలో ఓటీపీ నంబర్ రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆధార్కు లింక్ చేసిన ఫోన్ నంబర్లను రైతులు వాడకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఏఈఓలు పేర్కొంటున్నారు.రైతులకు 11 నంబర్ల యూనిక్ కోడ్ కేటాయింపు క్లస్టర్ల వారీగా యాప్లో నమోదు చేస్తున్న ఏఈఓలు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన వ్యవసాయ శాఖ రిజిస్ట్రేషన్లో నెక్కొండ మండలం ముందంజజిల్లాలో రైతులు, రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల వివరాలు..మండలం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు నెక్కొండ 14,894 7,551 వర్ధన్నపేట 14,015 6,264 సంగెం 14,996 6,393 నర్సంపేట 12,003 4,457 వరంగల్ 2,061 747 రాయపర్తి 19,360 6,932 పర్వతగిరి 14,341 5,116 చెన్నారావుపేట 11,417 3,813 గీసుకొండ 13,343 4,351 ఖిలా వరంగల్ 5,183 1,689 దుగ్గొండి 14,405 4,677 నల్లబెల్లి 1,3459 3,912 ఖానాపురం 8,700 2,247 మొత్తం 1,58,177 58,149జిల్లాలో రెండు వ్యవసాయ డివిజన్లు.. జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి. మొత్తం క్లస్టర్ల సంఖ్య 53. జిల్లాలో సాగు భూమి విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలు. రైతుల 1,58,177 మంది ఉన్నారు.నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. క్లస్టర్ల వారీగా ఏఈఓలు అన్ని గ్రామాల్లో యాప్లో నమోదు చేస్తున్నారు. గడువుకు ముందే రైతులందరి వివరాలను నమోదు చేయాలనే లక్ష్యంతో ఏఈఓలు పనిచేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో వివరాల నమోదులో జాప్యం ఏర్పడుతోంది. – కె.అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
మాటల మంటలు!
సాక్షి, వరంగల్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాటలు అధికార పార్టీ కాంగ్రెస్లో కల్లోలం రేపుతున్నాయి. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీకి కూడా అస్త్రశస్త్రాలు దొరకడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ‘కొండ’పై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీచేసిన కొండా సురేఖ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశారని స్వయంగా ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు.. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా చెలామణి అవుతున్న కొండా మురళి మాటలతో అందరికీ కార్నర్ అయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరిపై పరోక్షంగా ఘాటైన పదజాలాన్ని ఉపయోగించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎర్రబల్లులేనని విమర్శించడంతో మాటల మంటలకు ఆజ్యం పోసినట్లయ్యింది. దీనికి బదులుగా కొండా మురళిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు.. నాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేడు రేవంత్రెడ్డి సహకారంతో పదవులు పొందింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీలు, సొంత పార్టీ నేతలు, వరంగల్ తూర్పు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇలా కొన్నిరోజుల నుంచే వరంగల్ రాజకీయం అంతా కొండా చుట్టూనే తిరుగుతుండడం గమనార్హం. ఇంకోవైపు పరకాల ఎమ్మెల్యేగా కొండా సుష్మితాపటేల్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలోనే రెండు గ్రూపులవడం, సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.స్వపక్షంతోపాటు బీఆర్ఎస్, బీజేపీకి కార్నరైన కొండా మురళి వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్సీ తీరుతో కాంగ్రెస్ కేడర్లో అయోమయం ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు స్థానిక ఎన్నికల ముందు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పి కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందో..? స్థానిక ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్న కాంగ్రెస్ స్థానిక ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి వరంగల్లోని రాజకీయం మాత్రం చికాకుపరుస్తోంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేసి గ్రామాల్లో రైతులనుంచి మద్దతు కూడగట్టుకుంటామనుకుంటున్న కాంగ్రెస్కు మాత్రం ఇక్కడి ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య వైరుధ్యం తలనొప్పిగా మారిందనే టాక్ ఉంది. అందుకే నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇరువైపుల నుంచి వివరణ తీసుకుందని, అయితే ఏ నిర్ణయం ఉంటుందో చూడాలని కిందిస్థాయి కార్యకర్తలు అంటున్నారు. ముఖ్యనేతల మధ్య ఇలానే వైరుధ్యం కొనసాగితే పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. కిందిస్థాయి కేడర్లో మాత్రం అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఇదేం రాజకీయమని మదనపడుతున్నారు. కొండా ఎపిసోడ్ సీరియల్గా నడుస్తుండడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది. సాధ్యమైనంత తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి చెక్పడేలా కనిపించడం లేదు. -
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
ఎల్కతుర్తి: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. బుధవారం ఆయన ఎల్క తుర్తి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై ప్రవీణ్కుమార్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. సిబ్బంది నిర్వహించిన పరేడ్తోపాటు కిట్ ఆర్టికల్స్ను సీపీ తనిఖీ చేశారు. అనంతరం పోలీస్స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్చేసిన వాహనాలను పరిశీలించారు. వీటికి సంబంధించిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్, కోర్టు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులపై ఆరా తీసి పలు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందితో నేరుగా మాట్లాడి శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని కలిగించడంతోపాటు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ఇందుకు ప్రతీ పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. ఆయన వెంట సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి, సీఐ పులి రమేష్ తదితరులు ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఎల్కతుర్తి పోలీస్స్టేషన్ తనిఖీ -
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
జాతర తేదీలను ప్రకటిస్తున్న పూజారులు● మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులుఎస్ఎస్తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజారులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తారు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు.న్యూస్రీల్ -
కాలనీల్లో నీరు నిల్వకుండా చర్యలు
న్యూశాయంపేట: వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలోని కాలనీల్లో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు.. అఽధికారులను ఆదేశించారు. పైడిపల్లి కొత్తగూడెంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో వర్షపు నీరు తమ ఇళ్లలోకి చేరుతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు బుధవారం మేయర్, ఎమ్మెల్యే కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను షీభారాణి అనిల్కుమార్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఈఈ సంతోష్బాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి -
ఉగ్రామాత, శివదూతీమాతగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఏడో రోజు అమ్మవారిని ఉగ్రామాత, శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఉగ్రామాతగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని శివదూతీమాతగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాండ్ల స్రవంతి, శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేఎఫ్ఐ ఎథిక్స్ కమిషన్ కన్వీనర్గా రాఘవరెడ్డివరంగల్ స్పోర్ట్స్: ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(కేఎఫ్ఐ) ఎథిక్స్ కమిషన్ కన్వీనర్గా, ఖోఖో అసోసియేషన్ సౌత్ జోన్ అధ్యక్షుడిగా తెలంగాణ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, ఖోఖో సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలోని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం ఎథిక్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధామ్ష్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఒక ప్రకటనలో తెలి పారు. తన ఎన్నికకు సహకరించిన ఖోఖో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు సీతారాంరెడ్డిలకు రాఘవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్నాతకోత్సవానికి రండి గవర్నర్ను కలిసి ఆహ్వానించిన కేయూ వీసీ కేయూ క్యాంపస్: ఈ నెల 7వ తేదీన జరగనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని బుధవారం వీసీ కె.ప్రతాప్రెడ్డి హైదరాబాద్లోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మను కలిసి ఆహ్వానించారు. స్నాతకోత్సవం నిర్వహణ సమయం, గోల్డ్మెడల్స్, పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం వివరాలు, కాన్వొకేషన్ ప్రొసీడర్ను గవర్నర్కు తెలిపారు. గవర్నర్ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు ఓకే చెప్పారని సమాచారం. వీసీ వెంట కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ ఉన్నారు. వయోజనులను అక్షరాస్యులుగా చేయాలివిద్యారణ్యపురి: జిల్లాలోని నిర్లక్ష్యరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు బుధవారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. డీఈఓ హాజరై మాట్లాడుతూ మండలస్థాయిలో జరిగే శిక్షణకు ప్రతీ పాఠశాలనుంచి ఒక ఉపాధ్యాయుడు, గ్రామసమాఖ్య సభ్యులు హాజరుకావాలన్నారు. వయోజన విద్య డైరెక్టర్ రమేష్రెడ్డి ఉల్లాస్ యాప్లో నిరక్ష్యరాస్యులైనవారిని గుర్తించి ఎలా నమోదు చేయాలో వివరించారు. కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకానికి(ఈఎల్ఐ) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కమిషనర్ వైడీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి సృష్టించడం, ప్రోత్సహించడం, ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడం, సామాజిక భద్రతను ఈ పథకం ద్వారా మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
‘నిట్’ ఎంతో ఇచ్చింది.. తిరిగి ఇచ్చేద్దాం
ఇంపాక్ట్–99 స్కాలర్షిప్నకు శ్రీకారం కాజీపేట అర్బన్ : ‘నిట్ వరంగల్ మాకు ఎంతో ఇచ్చింది.. తిరిగి ఇచ్చేద్దాం’ అంటూ అల్యూమ్ని 1999వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమకు విద్యనందించిన ఇనిస్టిట్యూట్ రుణం తీర్చుకునే సంకల్పంతో ఇంపాక్ట్ (ఇన్స్పైరింగ్ మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్ అండ్ అల్యూమ్ని కంట్రీబ్యూషన్ టు గెదర్)–99 పేరిట స్కాలర్షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిట్ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆ కార్యక్రమ వాల్పోస్టర్ను డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆవిష్కరించి మాట్లాడారు. ఇక్కడ విద్యనభ్యసించిన 1999 బీటెక్ విద్యార్థులు నిట్లో ప్రస్తుతం చదువుతున్న 2025–26 బ్యాచ్ సెకండియర్ నుంచి ఫోర్త్ ఇయర్ విద్యార్థులతోపాటు ఇటీవల బీటెక్ పూర్తి చేసిన ప్రతిభావంతులైన పిల్లలకు చేయూతనందించేందుకు ఇంపాక్ట్–99 స్కాలర్షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ల్యాప్టాప్, టెక్నికల్ స్కిల్స్ డెవలప్మెంట్లో ఇంపాక్ట్–99 తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నిట్ అల్యూమ్ని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్, సెక్రటరీ రమ, వరంగల్ చాప్టర్ ప్రెసిడెంట్ పులి రవికుమార్, కిరణ్కుమార్, శైలజ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
10లోగా మార్కెట్ ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే
మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్ వరంగల్ చౌరస్తా : వ్యాపారులు, పండ్లు, కూరగాయల, అద్దె బకాయిదారులు మార్కెట్ ఫీజును ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలని వరంగల్ మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేడీ శ్రీనివాస్ మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లిస్తేనే రైతులకు, ఆయా వర్గాలకు మెరుగైన వసతులు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం కూరగాయల వర్తక సంఘం నూతన కార్యవర్గం సభ్యులు.. జేడీకి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మావతి, కార్యదర్శి గుగులోతు రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి జి.రాజేందర్ పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు, పురుగు మందులమ్మిన వ్యక్తిపై పీడీ యాక్ట్
రామన్నపేట : నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తిపై వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్.. పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. శాయంపేట చెందిన నూక రాజేశ్పై పీడీ యాక్టు నమోదు కాగా, మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి.. బుధవారం నిందితుడికి పరకాల జైలులో ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నూక రాజేశ్ మరో ఆరుగురు నిందితులతో కలిసి ముఠాగా ఏర్పడి కాలంతీరిన పురుగుల మందులను ఫర్టిలైజర్ల డీలర్లనుంచి తక్కువ డబ్బులకు కొనుగోలు చేయడంతోపాటు నకిలీ విత్తనాలు, పురుగుల మందులను రైతులకు విక్రయిస్తూ మట్టెవాడ పోలీసులకు ఏప్రిల్ 7వ తేదీన చిక్కారు. నిందితుడు గతంలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న క్రమంలో మట్డెవాడ, సుబేదారి, హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని నేరప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని పీడీయాక్ట్ నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయిస్తే పీడీ యాక్టు నమోదవుతుందని, ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రెండు కేసులు నమోదు చేసినట్లు సీపీ వివరించారు. ఎవరైనా నకిలీ మందులు విక్రయిస్తే 77998 48333 సెల్నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
10లోగా మార్కెట్ ఫీజు బకాయిలు చెల్లించాలి
● మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్ వరంగల్ చౌరస్తా: వ్యాపారులు, పండ్లు, కూరగాయ ల, అద్దె బకాయిదారులు మార్కెట్ ఫీజును ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలని వరంగల్ మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేడీ శ్రీనివాస్ మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లిస్తేనే రైతులకు, ఆయా వర్గాలకు మెరుగైన వసతులు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం కూరగాయల వర్తక సంఘం కలిసి జేడీకి పుష్పగుచ్ఛం అందించింది. కార్యక్రమంలో ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మావతి, కార్యదర్శి గుగులోత్ రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులు నీటిని వృథా చేయొద్దు
ఖానాపురం: పాకాల ఆయకట్టు పరిధిలోని రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. మండలంలోని పాకాల సరస్సు నీటిని ఆయన విడుదల చేశారు. ముందుగా ఆంజనేయస్వామి, కట్టమైసమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పాకాల కాల్వల మరమ్మతుల కోసం డీపీఆర్లు తయారుచేసి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లీకేజీలు ఇప్పటికే అరికట్టామని, వచ్చే సీజన్ నాటికి 80 శాతం నిధులు విడుదల చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్తాస్ జానయ్య మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 1.20 లక్షల మంది రైతులకు సూచనలు చేసినట్లు తెలిపారు. రెండో పంట సాగులో రైతులు వరికి బదులుగా ఇతర పంటలు సాగుచేసి అధిక లాభాలు గడించాలన్నారు. ఈఈ సుదర్శన్రావు, ప్రొఫెసర్ వెంకటనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, తహసీల్దార్ రమేశ్, డీఈ రమేశ్, వెంకటప్రసాదరావు, ముస్తఫా, సాగర్రావు, ఎల్లాగౌడ్, విద్యాసాగర్రావు, మోహన్రెడ్డి, మురళి, ఉపేందర్, వేణుగోపాల్రావు, రవి పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాకాల సరస్సు నీటి విడుదల -
సైడ్ డ్రెయినేజీ నిర్మించాలని వినతి..
నర్సంపేట మున్సి పాలిటీ పరిధిలోని 20వ డివిజన్లో చుక్క కనుకయ్య ఇంటి నుంచి గిరగాని మల్లయ్య ఇంటి వరకు సైడ్ డ్రెయినేజీని నిర్మాణం చేపట్టాలని మాజీ ఎంపీటీసీ రామగోని సౌందర్య కోరారు. ఈమేరకు బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సౌందర్య మాట్లాడుతూ కాల్వ ధ్వంసం కావడంతో ఇళ్లలోకి మురుగు నీరు ప్రవహించి దుర్గంధం వెదజల్లుతూ దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి సైడ్ డ్రెయినేజీ, సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు సౌందర్య తెలిపారు. -
విచారణ పేరుతో ఈటీసీ ప్రిన్సిపాల్ హల్చల్
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో విచారణ కోసం వచ్చానంటూ హసన్పర్తి ఈటీసీ(ఎక్స్టెన్షన్ ట్రెయినింగ్ సెంటర్) ప్రిన్సిపాల్ విజయనాయక్ బుధవారం హల్చల్ చేసింది. కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాలు లేకున్నా ఆమె స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టడం వివాదాస్పదంగా మారింది. ఏ హోదాతో విచారణ చేపట్టడానికి వచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2015లో అప్పటి సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి పథకం కింద గ్రామానికి రూ.10 కోట్లు మంజూరు చేశారు. కాగా, ఈ విషయంలో నిధుల దుర్వినియోగం జరిగిందని సదరు ప్రిన్సిపాల్.. ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళికి నోటీసు ఇచ్చారు. ఆ నిధులతో తనకు సంబంధం లేదని చెప్పినా పట్టించుకోకుండా ఆమె మెమోలు జారీ చేసి విచారణకు వచ్చింది. దీంతో పాటు గ్రామస్తులను కూడా విచారణకు రావాలని కోరింది. గ్రామస్తులు ఆమె తీరును నిరసిస్తూ రాజమౌళికి ఎలా నోటీసులు ఇచ్చారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు అతడిపై ఎవరు ఫిర్యాదు చేశారని, ఎవరి ఆదేశానుసారం వచ్చారని ప్రశ్నించి నిలదీశారు. తనకు గ్రామంలోని ముగ్గురు వ్యక్తులు నోటి మాటతో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టామని ప్రిన్సిపాల్ చెప్పడంతో గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. గ్రామంలోని శిక్షణ కేంద్రం నిర్వహణలో రాజమౌళి సక్రమంగా పనిచేయడం లేదని పలుమార్లు నోటీసులు ఇచ్చామని, ఆయన వివరణ సరిగా లేకపోవడంతో విచారణకు వచ్చామని ఆమె పేర్కొన్నారు. శిక్షణ కేంద్రానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై విలేకరులు ఆమెను వివరణ కోరగా సరిగా స్పందించలేదు. నిరసన తెలిపిన గంగదేవిపల్లి గ్రామస్తులు ఏ అధికారంతో వచ్చారని నిలదీత -
మాటల మంటలు!
స్వపక్షంతోపాటు బీఆర్ఎస్, బీజేపీకి కార్నరైన కొండా మురళి వ్యాఖ్యలు ● మాజీ ఎమ్మెల్సీ తీరుతో కాంగ్రెస్ కేడర్లో అయోమయం ● ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ● స్థానిక ఎన్నికల ముందు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిసాక్షి, వరంగల్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాటలు అధికార పార్టీ కాంగ్రెస్లో కల్లోలం రేపుతున్నాయి. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీకి కూడా అస్త్రశస్త్రాలు దొరకడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొండాపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీచేసిన కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు చేశారని స్వయంగా ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు.. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా చెలామణి అవుతున్న కొండా మురళి మాటలతో అందరికీ కార్నర్ అయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరిపై పరోక్షంగా ఘాటైన పదజాలాన్ని ఉపయోగించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎర్రబల్లులేనని విమర్శించడంతో మాటల మంటలకు ఆజ్యం పోసినట్లయ్యింది. దీనికి బదులుగా కొండా మురళిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు.. నాడు ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేడు రేవంత్రెడ్డి సహకారంతో పదవులు పొందింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీలు, సొంత పార్టీ నేతలు, వరంగల్ తూర్పు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇలా కొన్నిరోజుల నుంచే వరంగల్ రాజకీయం అంతా కొండా చుట్టూనే తిరుగుతుండడం గమనార్హం. ఇంకోవైపు పరకాల ఎమ్మెల్యేగా కొండా సుష్మితాపటేల్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలోనే రెండు గ్రూపులవడం, సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. -
ఈసారి ముందస్తుగానే.. మహాజాతర
ఎస్ఎస్తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజారులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తారు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు. 20 రోజుల ముందుగానే జాతర.. ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన మేడారం మహా జాతర ఈసారి 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది.దీంతో 20 రోజుల ముందుగానే మహా జాతర జరగనుంది. పూజారులు పంచాంగం, కొత్త క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి, అమ్మవార్ల ఘడియలను బట్టి జాతర తేదీలను ఖరారు చేస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి జాతర తేదీలను అమా వాస్య రోజుల్లో పౌర్ణమికి ముందుగా నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి 2026 జనవరి 17 నుంచి అమావాస్య మాసం ప్రారంభం కావడం, జనవరి 31న పౌర్ణమి అవుతుండడంతో మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా జాతర తేదీలను నిర్ణయించారు. అంటే అధిక అమావాస్య రావడంతో ఈసారి జనవరిలోనే నిర్ణయించినట్లు పూజారులు వెల్లడించారు. 2018లో జనవరిలోనే జాతర.. గత మహాజాతరల తేదీలతో పోలిస్తే 2018లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర తేదీలను నిర్ణయించారు. అలాగే 2010లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు, 2012లో ఫిబ్రవరి 8 నుంచి 11వరకు, 2014లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు, 2016లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు, 2020లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు, 2022లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు, 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర సాగింది. 2018లో మాత్రం జనవరి 31 నుంచి జాతర సాగగా.. ఈ దఫా 2026 జనవరి నెలాఖరులోనే జాతర సాగనుంది. అధికార యంత్రాంగం సమాయత్తం మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై సమాయత్తం కానుంది. ఈ సారి ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో ఇప్పటికే మేడారంలో శాశ్వత నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇకనుంచి జిల్లా యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై ప్రణాళికలతో ముందుకెళ్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు.అధిక అమావాస్య రాకతో జనవరిలో నిర్వహణ మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులు 2026 జనవరి 28 నుంచి 31 వరకు.. కొనసాగుతున్న శాశ్వత అభివృద్ధి పనులుజాతర ఇలా.. జనవరి 28వ తేదీ: సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రాక 29వ తేదీ : సమ్మక్క గద్దైపెకి 30వ తేదీ : భక్తుల మొక్కుల చెల్లింపు 31వ తేదీ : దేవతల వనప్రవేశం -
ఇబ్బందులు పడాల్సిందే..
వర్షం పడిందంటే పాకాల రోడ్డు నుంచి ఈ కాలనీకి వెళ్లాంటే ఇబ్బందులు పడాల్సిందే. వరదనీరు అంతా ఈ కాలనీకి వచ్చి చేరుతుంది. వరద వెళ్లిపోయాక సీసీ రోడ్డు మొత్తం బురదమయంగా మారుతుంది. దీంతో ఈ రోడ్డు నుంచి నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – కేతావత్ వెంకన్న, పాకాల రోడ్డు, నర్సంపేట వర్షాకాలం నరకమే.. వర్షాకాలం వచ్చిందంటే కాలనీ వాసులకు నరకమే కనిపిస్తుంది. చిన్నపాటి వానకే వరద నీరు వచ్చి చేరుతుండడంతో కాలనీలోని సీసీ రోడ్డు అంతా జలమయమై ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో కాలనీ మొత్తం దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. – రాంబాబు, మహబూబాబాద్ క్రాస్రోడ్డు, నర్సంపేట ● -
చెత్తను తొలగించాలి
నర్సంపేట రూరల్: గ్రామంలో చెత్తాచెదారాన్ని వెంట వెంటనే తొలగించాలని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి కల్పన ఆదేశించారు. మండలంలోని రాజుపేట గ్రామాన్ని డీపీఓ బుధవారం తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులు, గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రికార్డుల్లో నమోదుచేసిన వాటిని వెంటనే ఆన్లైన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ రామ్మోహన్రావు, పంచాయతీ కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు. వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలి● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బి.సాంబశివరావు పర్వతగిరి: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి వైద్యాధికారులు, సిబ్బంది స మన్వయంలో పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బి.సాంబశివరావు సూ చించారు. కొంకపాక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్, ఐఎల్ఆర్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేసి మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్లు కాకుండా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ అందించా లని కోరారు. ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని, సమయపాలన పాటించాలని, హెడ్క్వార్టర్లో ఉండాలని పేర్కొన్నా రు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమైనందున మలేరియా, డెంగీ, చికున్గున్యా, పైలేరియా, మెదడువాపు తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాపిడ్ యాక్షన్ టీంలను సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసుకొని వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉన్న వెంటనే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహాయంతో తగిన పరీక్షలు, చికిత్స తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సీసీ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఉగ్రామాత, శివదూతీమాతగా భద్రకాళి హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఏడో రోజు అమ్మవారిని ఉగ్రామాత, శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఉగ్రామాతగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని శివదూతీమాతగా అలంకరించి పూజలు జరిపా రు. ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాండ్ల స్రవంతి, అనంతుల శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కాలనీల్లో దుర్గంధం
● శిథిలావస్థకు చేరిన డ్రెయినేజీని చూపిస్తున్న ఈ వ్యక్తి పేరు అఖిల్. నర్సంపేట పాకాల సెంటర్లోని తన ఇంటి సమీపంలో ఉన్న మురుగు కాల్వను అధికారులు మరమ్మతులు చేయడం లేదని తెలిపాడు. దీంతో వర్షం పడితే వరద, మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నా. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పాడు. ఈ పరిస్థితి నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలతోపాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొంది. కాల్వలు లేక రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు ● దోమలు, ఈగలతో వ్యాధుల బారిన ప్రజలు ● జీడబ్ల్యూఎంసీ, పట్టణాల్లో అస్తవ్యస్తంగా డ్రెయినేజీ నర్సంపేట: వర్షాకాలం వ్యాధులు విజృంభిస్తున్నాయి. డ్రెయినేజీల్లో పారాల్సిన మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. వర్షాలు కురిస్తే డ్రెయినేజీలు పొంగిపొర్లి నీరు రోడ్లు ప్రవహిస్తోంది. దీంతో కాలనీల్లో దుర్గంధం వ్యాపించి వ్యాధులబారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టించుకోని పాలకులు, అధికారులు.. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్లో స్వ చ్ఛత,పరిశుభ్రతపై పాలకులు, అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. ఎక్కడ చూసినా శిథిలావస్థకు చేరిన మురుగుకాల్వలే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి నిధులు, పనులు కాగితాలకే పరిమితమై కాంట్రాక్టర్ల దోపిడీకి నిలయంగా మారాయి. ఎన్నికలు వచ్చాయంటే అభివృద్ధిపై గొప్పలు చెప్పుకునే రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగా చెత్త తొలగింపు.. వరంగల్ జిల్లా కేంద్రం తర్వాత నర్సంపేటను ప్రధాన పట్టణంగా చెప్పుకుంటారు. 24 వార్డులు ఉండగా విలీన గ్రామాలతో కలిపి వార్డుల సంఖ్య 30కి చేరింది. 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో డ్రెయినేజీ వ్యవస్థ ఉంది. ఇందులో 90 శాతం కూడా కాల్వలను నిర్మించని పరిస్థితి నెలకొంది. 29 మంది స్వీపర్లు, 18 మంది నైట్ వర్కర్లు, 24 మంది డ్రెయినేజీ క్లీనర్లు, ఒకరు జేసీబీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, 24 మంది ఆటోడ్రైవర్లు, ఏడుగురు జవాన్లతో కలిపి 127 మంది సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ డ్రెయినేజీల్లో చెత్త తొలగింపు ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉంది. నోటీసులకే పరిమితం... పట్టణంలోని ఓపెన్ ప్లాట్లలో పిచ్చిమొక్కలు, మురుగునీరు, వర్షపు నీరు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్లాట్ల యజమానులదే. వారు పట్టించుకోకపోవడంతో ఓపెన్ ప్లాట్లలో మురుగు నీరు పేరుకుపోయి దోమలకు నిలయంగా మారాయి. గత పట్టణ ప్రగతిలో వీటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన నోటీసులు తాత్కాలిక హెచ్చరికలుగానే మారాయి. ప్రతీ వర్షాకాలంలో ఓపెన్ ప్లాట్లు చిన్నపాటి చెరువులుగా మారుతున్నాయి. వాస్తవానికి నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ పట్టణ ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లు ఎన్ని ఉన్నాయో కూడా అధికారుల వద్ద లెక్కలు లేవు. నర్సంపేట పట్టణ వివరాలు.. జనాభా : 60 వేలు వార్డులు : 30 అంతర్గత రోడ్ల విస్తీర్ణం : 180 కిలోమీటర్లు డ్రెయినేజీలు : 350 కిలోమీటర్లు సీసీ డ్రెయినేజీలు : 243 కిలోమీటర్లు కచ్చా నాలాలు : 113 కిలోమీటర్లు -
కొత్త రేషన్కార్డుల జారీని వేగవంతం చేయాలి
న్యూశాయింపేట: కొత్త రేషన్కార్డుల దరఖాస్తుల పరిశీలన, రేషన్కార్డుల్లో అదనంగా పేర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో డిఫాల్టర్ రైస్మిల్లర్స్, రేషన్ కార్డుల పంపిణీ, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, వనమహోత్సవం ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఉన్న డిఫాల్టర్ రైస్మిల్లర్ల జాబితా సిద్ధం చేయాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్కార్డు లబ్ధిదారుల్లో డెత్ కేసులు ఉంటే గ్రామపంచాయతీల నుంచి నివేదికలు సేకరించాలని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళా పెట్రోల్ బంకుల స్థాపనకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని తహసీల్లార్లకు సూచించారు. పీఎం కుసుమ ప్రాజెక్టు కింద సోలార్ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఈఓ జ్ఞానేశ్వర్తో కలిసి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ–2025 పోస్టర్ను కలెక్టర్ సత్యశారద కార్యాలయంలో ఆవిష్కరించారు. డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
వాజేడు: గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో దండకారణ్యంలోని పలు జలపాతాల సందర్శనకు అటవీశాఖ, పోలీసుల అధ్వర్యంలో బ్రేకులు వేశారు. ములుగు జిల్లాలో ప్రాచుర్యం పొందని జలపాతాల సందర్శనకు పర్యాటకులు రావొద్దని కోరుతూ నిషేధం విధించారు. దీంతో గుట్టల సమీపంలో ఉన్న జలపాతాలను సందర్శించడం ఇక కష్టం కానుంది. నిషేధించిన జలపాతాలు ఇవే.. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను ఆనుకుని దండకారణ్యం, కర్రె గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలపైనుంచి జాలువారుతూ వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు ఉన్నాయి. కొంగాల సమీపంలో దుసపాటిలొద్ది, కృష్ణాపురం సమీపంలో భామనసిరి, దూలాపురం సమీపంలోని మాసన్లొద్ది, అరుణాచలపురం సమీపంలో గుండం, వెంకటాపురం(కె)లో ముత్యంధార జలపాతాలు ఉన్నాయి. ఇవి ఇంకా ప్రాచుర్యం పొందలేదు. కానీ, బొగత జలపాతం సందర్శన వచ్చే పర్యాటకులు ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ జలపాతాలను తిలకించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. నిషేధం ఉందని తెలిసినా వెళ్తున్నారు. రక్షణ లేకపోవడంతోనే.. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుండం, ముత్యం ధార, భామన సిరి జలపాతాలు నట్టడవిలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే చాలాదూరం అడవిలో కాలినడకన వెళ్లాలి. సెల్ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఇవి ఇంకా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఇక్కడికి అష్టకష్టాలు పడి వెళ్లిన పర్యాటకులు ప్రమాదాలకు గురైన సందర్భంలో సమాచారం బయటికి తెలిసే అవకాశం ఉండడంలేదు. దీంతో స్థానిక అధికారులు ఇబ్బందులు ప డుతున్నారు. ప్రధానంగా ఈ జలపాతాల వద్ద ఎలాంటి రక్షణ చ ర్యలు, సౌకర్యాలు లేవు. అటవీశాఖ సిబ్బంది వీటిని నిషేధించ డంతోపాటు ఇక్కడికి పర్యాటకులు వెళ్లొద్దని అటువైపు వెళ్లే దారులను బారికేడ్లు పెట్టి మూసివేశారు.ఫ్లెక్సీలను ఏర్పాటు చేశా రు. దొంగ దారిలో వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా ఉంచారు. నిషేధిత జలపాతాలకు వెళ్లొద్దు.. దట్టమైన అటవీప్రాంతంలోని ప్రమాదకర జలపాతాల సందర్శనకు అనుమతులు లేవు. అనవసరంగా పర్యాటకులు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ప్రమాదం జరిగితే రక్షించడానికి ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకుని మాకు సహకరించాలి. – ద్వాలియా, ఎఫ్డీఓ, వెంకటాపురం(కె)బొగతకు రండి.. తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికారులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు. అటవీ, పోలీస్ అధికారుల నిర్ణయం రక్షణ లేకపోవడం.. గత ప్రమాదాలే ప్రధాన కారణం దారులు మూసి.. కాపలాగా ఉన్న సిబ్బంది బొగత జలపాతానికి రావాలంటూ పిలుపు -
గుంతలతో గుబులు
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని అంతర్గత రహదారులు అధ్వానం ● వర్షపు నీరు నిండి ప్రమాదాలపాలవుతున్న వాహనదారులు ● బురదమయంగా మారడంతో పాదచారులకు ఇబ్బందులే ● అధికారులు మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు సాక్షి, వరంగల్/నర్సంపేట: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లోని అంతర్గత రహదారులు గుంతలుగా మారి ప్రజలను భయపెడుతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు ఆ గుంతల్లో నీరు నిలుస్తోంది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్న సందర్భాలున్నాయి. కొన్ని వార్డుల్లో అసలు సీసీ రోడ్లు లేవు. అంతా బురదమయంగా మారి ఇళ్లకు వెళ్లేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ప్రధాన రహదారులపై కూడా గుంతలు ఏర్పడడంతో వాహనాలు మరమ్మతులకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని ‘సాక్షి’ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిది. బాగు చేయండి మహా ప్రభో అంటూ స్థానికులు కోరారు. సంబంధిత అధికారులు కూడా ఈ రోడ్ల పరిస్థితిపై అధ్యయనం చేసి మరమ్మతులు చేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ అంతర్గత రోడ్లలో చాలావరకు నాణ్యత లేమితో కంకరతేలాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుంతలమయమైన రహదారులను మరమ్మతు చేయాలని వాహనదారులు, బాటసారులు కోరుతున్నారు. -
60 ఏళ్లు దాటిన మహిళలతో సంఘాలు
గీసుకొండ: స్వయం సహాయక సంఘాల్లో (ఎస్హెచ్జీ) 60 ఏళ్ల పైబడిన మహిళలు ఉంటే వారితో ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేయిస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) అదనపు సీఈఓ పి.కాత్యాయనీదేవి అన్నారు. ఎలుకుర్తి హవేలిలో మంగళవారం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యురాలు లలిత ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి వారిని సంఘంగా ఏర్పాటు చేసి రుణాలు అందేలా చూస్తానని కాత్యాయనీదేవి హామీ ఇచ్చారు. సంఘంలో చదువురాని వారు, మధ్యలో చదువు మానేసిన వారు పదో తరగతి పాసయ్యేందుకు ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఐబీ డైరెక్టర్ నవీన్, పీఎం రవీంద్రరావు, కరుణాకర్, డీఆర్డీఓ కౌసల్యాదేవి, అదనపు డీఆర్డీఓ ఓ.రేణుకాదేవి, డీపీఎం దయాకర్ తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనీదేవి -
డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం అధికారులకు సన్మానం
గీసుకొండ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బంది, అధికారులు మంగళవారం డీఎంహెచ్ఓ సాంబశివరావు, ప్రోగ్రాం అధికారులను సన్మానించారు. అనంతరం డీఎంహెచ్ఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, వర్షాకాలంలో సంక్రమించే వ్యాధుల నివారణపై దృష్టి సారించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఎఓలు ప్రకాశ్, కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, ఎస్ఓ విజయలక్ష్మి, డీపీఓ అర్చన, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా కుమార షష్టి ఉత్సవం
గీసుకొండ: మండలంలోని ఊకల్హవేలి నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కుమార షష్టి పూజలు ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల కుమారుడు కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరుడు) సర్పరూపంలో కొలువుదీరిన ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో మూల విరాట్కు, వల్మీకలో వశించు నాగేంద్రస్వామి వారికి పంచసూక్త విధానంలో వైభవంగా అభిషేకం చేశారు. అనంతరం రెల్లుగడ్డి, మల్లెపూలతో అలంకరించారు. అర్చనలు, మంత్ర పుష్పతీర్థ వితరణ తదితర పూజా కార్యక్రమాలను ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకుడు శ్రీహర్ష నిర్వహించారు. ఆలయ చైర్మన్ బాబూరావు, వీరారావు, క్లర్క్ రమేశ్, కొత్తగట్టు రాజేందర్, భక్తులు పాల్గొన్నారు. -
సరిపడా యూరియా నిల్వలు
నెక్కొండ: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, పలు ఎరువులు, విత్తన దుకాణాలను ఆమె మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. పంటల దశలను బట్టి మండలాలకు క్రమం తప్పకుండా పంపిణీ చేస్తామని ఆమె పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళనకు గురికావొద్దని సూచించారు. రైతులు పంటలకు మొత్తం ఒకేసారి యూరియాను తీసుకెళ్లకుండా అవసరం ఉంటేనే తీసుకెళ్లాని చెప్పారు. అవసరానికి మించి తీసుకెళ్లడంతో యూరియ కొరత ఏర్పడనుందన్నారు. అధిక యూరియా వాడకంతో పంటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగి దిగుబడి తగ్గుతాయి ఆమె వివరించారు. నానో యూరియా, నానో డీఏపీని పంటల మీద పిచికారీ చేసుకొని మంచి దిగుబడి సాధించాలని కోరారు. వ్యాపారులు యూరియా కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే షాపులను సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ నాగరాజు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ -
శానిటేషన్ సవాల్!
పరకాల: పారిశుద్ధ్య కార్మికులు.. స్వచ్ఛ వాహనాల కొరతతో పరకాల మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ పనులు ఓ సవాలుగా మారాయి. మరోవైపు నిధుల కొరతతో కొత్త డ్రెయినేజీల నిర్మాణం లేక.. రోడ్లపై మురుగునీరు పారుతోంది. 30 ఏళ్లక్రితం నిర్మించిన అస్తవ్యస్థ డ్రెయినేజీల్లోంచి మురుగునీరు పారట్లేదు. నీరు నిలుస్తున్న కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు.. 150కిపైగా కాలనీలు.. 40 వేలకు పైగా జనాభా ఉంది. ఒకే ఒక్క శానిటేషన్ అధికారితో నలుగురు జవాన్లు కేవలం 64 మంది పారిశుద్ధ్య కార్మికులతో శానిటేషన్ పనులు చేపడుతుంటే పాలకులకు ప్రజల ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ ఉందో స్పష్టమవుతోంది. 64 మందిలో సగం మంది కార్మికులు అంటే.. 32 మందికి పైగా.. పట్టణంలోని ప్రధాన రహదారులు.. కూడళ్లలో పారిశుద్ధ్య పనులు చేస్తుండగా.. మిగతా 32 మందిని షిఫ్టుల వారీగా (22 వార్డుల పరిధిలోని ఒక వార్డుకు.. ఇద్దరు కూడా లేని పరిస్థితి) కాలనీల్లో పనులు చేపడుతున్నారు. చెత్తాచెదారం.. పరకాల మున్సిపాలిటీలో గల్లీలన్నీ డంప్ యార్డులను తలపిస్తున్నాయి. చెత్తను తీసుకెళ్లాల్సిన స్వచ్ఛ వాహనాలు వారానికోసారైనా రావట్లేదు. చెత్తాచెదా రాన్ని కాలనీ ప్రజలు ప్రధాన కూడళ్లలో పారబోస్తున్నారు. ఆ చెత్తను కూడా ట్రాక్టర్లలో తరలించకుండా పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చెత్తంతా మళ్లీ కాల్వల్లోనే కలిసిపోతోంది. వృద్ధాప్యం పేరిట కార్మికుల తొలగింపు నెల రోజుల క్రితం పరకాల మున్సిపల్ అధికారులు 15 మంది కార్మికులను వృద్ధాప్యంలో ఉన్నారని తొలగించారు.. అసలే పారిశుద్ద్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండగా వృద్ధాప్యం, వేతనాలు అందించలేని దుస్థితిలో ఉన్నామంటూ 79 మంది కార్మికుల్లో 15 మందిని తొలగించి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి, లేదా కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి ఉండగా నియామకం చేసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. వాహనాలు నిరుపయోగం మున్సిపాలిటీకి 15 వాహనాలుండగా.. 10 వాహనాలు (7 స్వచ్ఛ వాహనాలు, 3 ట్రాక్టర్లు) ఉప యోగంలో ఉన్నాయి. ప్రధాన రహదారుల్ని శుభ్రం చేయడానికి రెండేళ్ల క్రితం రూ.87 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన సొంత వాహనం ఏడాదికే నిరుపయోగంగా మారింది. ఆయా వాహనాల మరమ్మతులకు లక్షలు అవసరమవడంతో తమ వల్ల కాదంటూ అధికారులు చేతులెత్తేశారు. నిధుల్లేక 30 ఏళ్ల కాల్వలే గత్యంతరం నిధులు లేకపోవడంతో పరకాల మున్సిపల్ గత పాలకవర్గం డ్రెయినేజీల నిర్మాణానికి తీర్మాణాలు ప్రయోజనం లేకుండా పోయాయి. దీంతో 30 ఏళ్ల క్రితం చేసిన డ్రెయినేజీలే పట్టణ ప్రజలకు గత్యంతరంగా మారాయి. పరకాలలో అపరిశుభ్రంగా కాలనీలు నిధులు లేక.. 30 ఏళ్ల నాటి డ్రెయినేజీలే గతి 64 మంది కార్మికులు.. 150 కాలనీలకు పారిశుద్ధ్య పనులు 15 వాహనాలు.. ఉపయోగంలో ఉన్నవి పది మాత్రమేఈఫొటోలో ఉన్న మహిళ పేరు జయ. ఈమెది హరితనగర్. ఇప్పటికే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. తమ ఇంటికి సమీపంలో స్థానికులు చెత్త వేస్తున్నారని ఆమె ఆందోళన చెందుతోంది. కోళ్లు, మేకల వ్యర్థాలతో పాటు ఒక్కో సమయంలో చనిపోయిన కుక్కలు, పందుల్ని సైతం తీసుకొచ్చి వేస్తుంటే దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు వరలక్ష్మి, ఈమెది గౌడ వాడ. చెత్త తీసుకెళ్లే స్వచ్ఛ వాహనం వచ్చినట్లు తెలియగానే చెత్త తీసుకొని బయటకు వస్తుంది. కానీ.. అప్పటికే బండి వెళ్లిపోతుంది. ఏం చేయాలో తోచని ఆమె.. చివరికి చెత్తను రోడ్డుపైనే వేస్తోంది. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా వైద్యవృత్తికి న్యాయం చేకూరుతుందని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వైద్యులకు సూచించారు. మంగళవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని కలెక్టరేట్లో కేక్ కట్ చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రతీ పేదవాడికి వైద్యం అందాలని, ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేయాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డి, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారి హిమబిందు, ప్రోగ్రాం అధికారులు మంజుల, డాక్టర్ అహ్మద్లను శాలువాలతో సత్కరించారు. వైద్యుల క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రశంసపత్రాలు, కప్ బహూకరించారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాల్లో భద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆరో రోజు అమ్మవారిని విప్రచిత్తా, మహావజ్రేశ్వరిగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాదాల వితరణ చేశారు. అర్చకులు భద్రకాళి శేషు, ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతర్జాతీయ సదస్సులో సుజాత పరిశోధన పత్రంకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ లైబ్రరీ అసిస్టెంట్ డాక్టర్ సుజాత శ్రీలంకలోని పెరదేనియా సెంట్రల్ యూనివర్సిటీలో గత నెల 26, 27వ తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. తోపుడు బండి (ట్రాలీకార్ట్) అండ్ ఇట్స్ సర్వీసెస్ ఇన్ తెలంగాణ, ఇండియా అనే అంశంపై పరిశోధనపత్రం సమర్పించారు. ఇది ఉత్తమ పత్రంగా ఎంపికై నట్లు ఆమె మంగళవారం ఇక్కడ తెలిపారు. క్యాంపస్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ.. సుజాతను అభినందించారు. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయ భాను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్–1 డిపో సూపర్ లగ్జరీ బస్ (సర్వీస్ నంబర్ 92222) ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయయల్దేరుతుందని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం 90634 07493, 77805 65971, 98663 73825, 99592 26047 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. గురుకులాల్లో అడ్మిషన్ల టార్గెట్ పూర్తి చేయాలిడీఎండబ్ల్యూఓ గౌస్ హైదర్ న్యూశాయంపేట: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్ల లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కేఏ.గౌస్ హైదర్ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు గురుకులాల ప్రిన్సిపాళ్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పేద మైనార్టీలకు అందాల్సిన ఫలాలను వారు అందుకునేలా కృషి చేయాలని, ఇంటింటికీ తిరిగి గురుకులాల్లో అడ్మిషన్లు పొందితే కలిగే లాభాలను వివరించాలని సూచించారు. హనుమకొండ రాయపురలో బుధవారం నిర్వహించనున్న ఇంటింటి ప్రచారంలో తాను కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎండబ్ల్యూఓకు ప్రిన్సిపాళ్లు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో సూపరింటెండెంట్ రాజు, డాక్టర్ సయ్యద్ ఖాజా మొహిసినాబాను, ఆర్ఎల్సీ శ్రీనివాస్, ప్రిన్సిపాళ్లు డాక్టర్ జె.సతీశ్, నీరజ, తదితరులు పాల్గొన్నారు. -
బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం
పరకాల: మల్లక్పేట సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని పరకాల ఆర్డీఓ కె.నారాయణ తెలిపారు. మృతదేహంతో బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు సిద్ధం కావడంతో సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్ ఆర్డీఓ నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. బాలిక మృతిపై విచారణకు పరకాలకు చేరుకున్న సోషల్ వేల్ఫేర్ జోనల్ అధికారి స్వరూపరాణి, ఆర్డీఓ నారాయణ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫిర్యాదు స్వీకరించారు. బాలిక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కోసం కృషి చేస్తామని తెలిపారు. పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ న్యాయం చేయాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు -
‘స్థానికం’ కోసం.. ‘ముందస్తు’గా..
సాక్షిప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలు కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ ‘ముందస్తు’గా సిద్ధమవుతోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం సీనియర్లను రంగంలోకి దింపుతోంది. ఈక్రమంలోనే టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఆ జాబితాను విడుదల చేశారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్కు నియమించిన టీపీసీసీ చీఫ్.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లకు ఇతర జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులను నియమించారు. వరంగల్ (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్గా చిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు, మహబూబాబాద్ (ఎస్టీ)కి వైస్ప్రెసిడెంట్గా మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి, బేబీ స్వర్ణకుమారి, నాగ సీతారాములును నియమించారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కరీంనగర్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను మల్కాజ్గిరి వైస్ప్రెసిడెంట్గా, హన్మాండ్ల ఝాన్సీరెడ్డికి సికింద్రాబాద్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. నల్లగొండకు నమిండ్ల శ్రీనివాస్ను వైస్ప్రెసిడెంట్గా నియమించిన అధిష్టానం.. ఈవీ శ్రీనివాస్రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు భువనగిరి, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామికి సికింద్రాబాద్ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీలుగా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతిని ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్గా నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్చార్జ్లు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు అవకాశం వరంగల్కు చిట్ల సత్యనారాయణ, మహబూబాబాద్కు పొట్ల నాగేశ్వర్రావు ఇతర జిల్లాల ఇన్చార్జులుగా ఓరుగల్లు నేతలు -
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
ఆత్మకూరు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని అక్కంపేటలో ప్రాథమిక పాఠశాల, జెడ్పీ హైస్కూల్, అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి రికార్డుల నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగిందా? అని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కేస్స్టడీలు నమోదు చేస్తున్నారా? అని తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా? అని తెలుసుకున్నారు. మండలంలోని తిరుమలగిరిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని, నర్సరీని పరిశీలించారు. కేజీబీవీలో వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పీహెచ్సీని పరిశీలించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. అక్కంపేటలో రోడ్డు సౌకర్యం కల్పించడానికి ప్రతిపాదనలు చేయాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీఈఓ వాసంతి, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసరావు, కేజీబీవీ జీసీడీఓ సునిత, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఎంఈఓ విజయ్కుమార్, ఈజీఎస్ ఏపీఓ రాజిరెడ్డి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వాసవి, అక్కంపేట హెచ్ఎం ఉపేందర్రెడ్డి, ఐసీడీఎస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ -
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
వాజేడు: గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో దండకారణ్యంలోని పలు జలపాతాల సందర్శనకు అటవీశాఖ, పోలీసుల ఆధ్వర్యంలో బ్రేకులు వేశారు. ములుగు జిల్లాలో ప్రాచుర్యం పొందని జలపాతాల సందర్శనకు పర్యాటకులు రావొద్దని కోరుతూ నిషేధం విధించారు. దీంతో గుట్టల సమీపంలో ఉన్న జలపాతాలను సందర్శించడం ఇక కష్టం కానుంది. నిషేధించిన జలపాతాలివే.. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను ఆనుకుని దండకారణ్యం, కర్రె గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలపైనుంచి జాలువారుతూ వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు ఉన్నాయి. కొంగాల సమీపంలో దుసపాటిలొద్ది, కృష్ణాపురం సమీపంలో భామనసిరి, దూలాపురం సమీపంలోని మాసన్లొద్ది, అరుణాచలపురం సమీపంలో గుండం, వెంకటాపురం(కె)లో ముత్యంధార జలపాతాలు ఉన్నాయి. ఇవి ఇంకా ప్రాచుర్యం పొందలేదు. కానీ, బొగత జలపాతం సందర్శన వచ్చే పర్యాటకులు ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ జలపాతాలను తిలకించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. నిషేధం ఉందని తెలిసినా వెళ్తున్నారు. రక్షణ లేకపోవడంతోనే.. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుండం, ముత్యం ధార, భామన సిరి జలపాతాలు నట్టడవిలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే చాలాదూరం అడవిలో కాలినడకన వెళ్లాలి. సెల్ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఇవి ఇంకా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఇక్కడికి అష్టకష్టాలు పడి వెళ్లిన పర్యాటకులు ప్రమాదాలకు గురైన సందర్భంలో సమాచారం బయటికి తెలిసే అవకాశం ఉండడంలేదు. దీంతో స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ జలపాతాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు, సౌకర్యాలు లేవు. దీంతో అటవీశాఖ సిబ్బంది వీటిని నిషేధించడంతోపాటు ఇక్కడికి పర్యాటకులు వెళ్లొద్దని అటువైపు వెళ్లే దారులను బారికేడ్లు పెట్టి మూసివేశారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దొంగ దారిలో వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా ఉంచారు. నిషేధిత జలపాతాలకు వెళ్లొద్దు దట్టమైన అటవీ ప్రాంతంలోని ప్రమాదకర జలపాతాల సందర్శనకు అనుమతులు లేవు. అనవసరంగా పర్యాటకులు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ప్రమాదం జరిగితే రక్షించడానికి ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకుని మాకు సహకరించాలి. – ద్వాలియా, ఎఫ్డీఓ, వెంకటాపురం(కె) అటవీ, పోలీస్ అధికారుల నిర్ణయం రక్షణ లేకపోవడం.. గత ప్రమాదాలే ప్రధాన కారణం దారులు మూసి.. కాపలా ఉన్న సిబ్బంది బొగత జలపాతానికి రావాలంటూ పిలుపుబొగతకు రావాలంటూ పిలుపు బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికా రులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు. -
తాటికాయలను సందర్శించిన ఆర్డీఓ
ధర్మసాగర్: మండలంలోని తాటికాయల గ్రామంలో ఇటీవల ఓ వివాహితపై జరిగిన దాడి విషయంపై ఆర్డీఓ రాథోడ్ రమేశ్ మంగళవారం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జరిగిన అమానవీయ ఘటన పూర్వాపరాలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు స్థానిక తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● మరొకరి పరిస్థితి విషమం ఎల్కతుర్తి: కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికు చెందిన ఆళ్ల శ్రీహరి(28) మంగళవారం మృతిచెందాడు. ఈఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తపల్లికి చెందిన ఆళ్ల శ్రీహరి(28), మంచినీళ్ల వెంకటేశ్ ఇద్దరు కలిసి ద్విచక్రవాహనం (పల్సర్ బైక్)పై సెంట్రింగ్ కర్రకోసం పీసర గ్రామానికి వెళ్లారు. ట్రాలీలో సెంట్రింగ్ కర్ర ఎక్కించి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. కొత్తకొండ సమీపంలోని సబ్స్టేషన్ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కారు అతివేగంగా శ్రీహరి బైక్ను ఢీకొట్టింది. శ్రీహరికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. వెంకటేశ్కు బలమైన గాయాలవడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కారు డైవర్ ప్రేమ్చంద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు. ఘనంగా కుమారషష్టి ఉత్సవం గీసుకొండ: మండలంలోని ఊకల్హవేలి నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కుమార షష్టి పూజలు ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల కుమారుడు కుమారస్వామి సర్ప రూపంలో కొలువుదీరిన ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. -
ముల్కనూరు సహకార సంఘం అభివృద్ధే ధ్యేయం
ఎల్కతుర్తి: ముల్కనూరు సహకార సంఘం అభివృద్ధే లక్ష్యంగా సభ్యులతో కలిసి కృషి చేస్తానని సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార సంఘంలో ఇటీవల ఐదు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ముల్కనూరు సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు సమావేశమై అధ్యక్షుడిగా అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డిని, ఉపాధ్యక్షుడిగా గజ్జి వీరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహకార సంఘం ఎన్నికల అధికారి కోదండ రాములు సమక్షంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సహకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కాశీ విశ్వనాథరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి మాట్లాడుతూ.. సభ్యులు సమష్టి నిర్ణయాలతో అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. సహకార సంఘం చేపడుతున్న క్రయవిక్రయాలపై సంఘం కొనసాగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముల్కనూరు సహకార సంఘ బలోపేతానికి సభ్యులు మరింత కృషి చేయాలన్నారు. తనపై నమ్మకంతో సంఘం అధ్యక్ష బాధ్యతలు 39వ సారి ఏకగ్రీవంగా అప్పగించినందుకు ఆయన సంఘ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కంది రవీందర్రెడ్డి, అంబాల రాములు, బేల కనుకమ్మ, ఈర్ల మూగయ్య, చెవ్యల్ల బుచ్చయ్య, గుగ్లోతు భాశు, బొల్లపెల్లి వీరారెడ్డి, మండ శ్రీనివాస్, కర్రె మహేందర్, సంఘం జనరల్ మేనేజర్ ఎం.రామ్రెడ్డి, తదితర సభ్యులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఐదుగురు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం -
సీపీని కలిసిన ఏఎస్పీ
వరంగల్ క్రైం: వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం ప్రకాశ్ సోమవారం పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. పేదలకు సత్వరమే న్యాయం అందించేలా కిందిస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంచాలని ఏఎస్పీకి సూచించారు.పరిశోధన కేంద్రంగా పింగిళి మహిళా కళాశాలకేయూ క్యాంపస్: హనుమకొండలోని ప్రభుత్వపింగిళి మహిళా కళాశాలను రీసెర్చ్సెంటర్గా గుర్తించారు. ఈమేరకు హిస్టరీ విభాగం పరిశోధనకు పర్యవేక్షకులుగా ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ కొలిపాక శ్రీనివాస్, డాక్టర్ ఎల్.ఇందిరను నియమించినట్లు కేయూ సోషల్ సైన్స్ డీన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ సోమవారం వెల్లడించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ కోల శంకర్ పాల్గొన్నారు.నేటి నుంచి టికెట్ రిజర్వేషన్కు ఆధార్ తప్పనిసరికాజీపేట రూరల్: భారతీయ రైల్వే జూలై 1 నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు ఆధార్కార్డు తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం రాత్రి స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి ఆన్లైన్ టికెట్ విధానంలో, జూలై 15 నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ రిజర్వేషన్ చేసుకునే వారు తప్పకుండా ఆధార్ జత చేయాలని పేర్కొన్నారు. వారి ఫోన్ నంబర్ కూడా ఆధార్కు లింక్ అయ్యి ఉండాలని రైల్వే శాఖ ఉత్తర్వులు అమలు చేసినట్లు తెలిపారు.కలెక్టర్ను కలిసినప్రభుత్వ ప్రత్యేక పీపీవరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్గా నియమితులైన ఎడవల్లి సత్యనారాయణ సోమవారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పీపీ నర్సింహారావు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ ప్లీడర్ నూకల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.నేడు తూమాటి దొణప్ప శతజయంత్యుత్సవాలుహన్మకొండ కల్చరల్: ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతి కమిటీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యక్షులు దొణప్ప శతజయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు జిల్లా కవులు, సాహితీవేత్తలు పాల్గొనవలసిందిగా కోరారు. -
పరకాల సబ్జైలు తనిఖీ
పరకాల: పరకాల సబ్జైలును జిల్లా జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన ఖైదీలందరినీ కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. ఆయన వెంట జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ క్షమా దేశ్పాండే, పరకాల జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్, పరకాల జైల్ సూపరింటెండెంట్ భగవాన్రెడ్డి, లీగల్ ఎయిడెడ్ కౌన్సిల్ ఎం.కవిత, స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు. పరకాల కోర్టు పరిశీలన సబ్జైలును పరిశీలించిన అనంతరం పరకాల కోర్టు ను జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు పరిశీలించారు. న్యాయవాదుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణి (గ్రీవెన్స్)లో స్వీకరించిన వినతుల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులు జాప్యం చెయొద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్నేహ శబరీష్ నేరుగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ప్రజావాణిలో వచ్చిన వినతుల్ని త్వరగా పరిష్కరించుకోవాలని, వచ్చిన వినతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాలోని పలువురు తహసీల్దార్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 176 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలి వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 130 వినతులు వచ్చాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్కు వచ్చిన అర్జీలు త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి వరంగల్లోని 13వ డివిజన్ దేశాయిపేట సీకేఎం కళాశాల గ్రౌండ్ను ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి. – జన్ను అనిల్కుమార్, వరంగల్ -
పండుటాకుల పడిగాపులు
నెక్కొండ: వృద్ధులు అని చూడకుండా పింఛన్ కోసం వచ్చిన వారిని పోస్టాఫీస్ చుట్టూ రోజూ తిప్పుతున్నారని పింఛనుదారులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు చెట్ల కింద పడిగాపులు కా యాల్సి వస్తోందన్నారు. ఒకవేళ అధికారులు వ చ్చినా మిషన్ పనిచేయడం లేదని కుంటిసాకులు చెప్పుతున్నారని ఆరోపించారు. సార్ వచ్చినప్పుడు ఇస్తారని, రేపు మాపు అంటూ ప్రతీనెల తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై బ్రాంచ్ పోస్టు మాస్టర్ అక్షయ్కుమార్, సబ్ పోస్టు మాస్టర్ రత్నమాలను వివరణ కోరగా స్థానిక పోస్టాఫీస్లో పర్మనెంట్ ఉద్యోగి లేరని, నల్లబెల్లిలో పనిచేస్తున్న ఉద్యోగికి బాధ్యతలు అప్పగించామని, అక్కడ పని ముగించుకుని ఇక్కడి రాగానే పింఛన్ ఇస్తారన్నారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయంనర్సంపేట: విద్యుత్ సరఫరాకు నేడు (మంగళవారం) అంతరాయం ఉంటుందని విద్యుత్ నర్సంపేట ఆపరేషన్ డీఈ తిరుపతి, చెన్నారావుపేట విద్యుత్ ఏఈ జోగ్యానంద్లు సోమవారం తెలిపారు. 33/11కేవీ చెన్నారావుపేట ఉపకేంద్రంలో పవర్ ట్రాన్స్ఫార్మర్ క్రమబద్ధీకరించే క్రమంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. జిల్లాలో మోస్తరు వర్షంసాక్షి, వరంగల్: జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. గత గురువారం కురిసిన వర్షంతో పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రాణం పోసినట్లు కాగా ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పంటలకు మరింత ఊపిరి పోసినట్లయింది. పత్తిలో మొలకెత్తని చోట మళ్లీ విత్తులు విత్తడంతో పాటు వరి పంటకు నారు పోసేందుకు కూడా రైతులు సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ మోస్తరు వర్షం పంటకు కాస్త ఊపిరి పోసినా.. ఇంకా భారీవర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు నిండే అవకాశముందని వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఖానాపురంలో అధిక వర్షం ఖానాపురం మండలంలో అత్యధికంగా 46.4 మిల్లీమీటర్లు, నర్సంపేట 37.2 మి.మీలు, దుగ్గొండిలో 35.6 మిమీలు, నల్లబెల్లిలో 33.2, చెన్నారావుపేటలో 30.2, వరంగల్లో 23.2, గీసుకొండలో 22.8, ఖిలావరంగల్లో 21.8, సంగెంలో 20.2, వర్ధన్నపేటలో 17.8, నెక్కొండలో 15.4, రాయపర్తిలో 13.6, పర్వతగిరిలో 12.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పాలకులుసంగెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కాపులకనిపర్తిలో ఆదివారం రాత్రి రైతు సంఘం ఆధ్వర్యంలో షార్ట్ ఫిలింను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ పేరాల ప్రభాకర్, ఓదెల రాజయ్య, ఆవునూరి రాజు, బోనాల గోపాల్, రైతులు పాల్గొన్నారు. -
రెసిడెన్షియల్ స్కూల్లో ఉద్రిక్తత
పరకాల: పరకాల మండలం మల్లక్పేట శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(గర్ల్స్)లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెసిడెన్షియల్ స్కూల్లోని బాత్రూంలో పరకాలకు చెందిన విద్యార్థిని శ్రీవాణి(15) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బాలిక ప్రాణాలతోనే ఉందని ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, సిబ్బంది మరో ఇద్దరు ఉపాధ్యాయురాళ్లతో కలిసి ఆటోలో పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. కానీ, విద్యార్థిని అప్పటికే చనిపోయింది. రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ తమకు తప్పుడు సమాచారం అందించారంటూ, కూతురు చావుకు కారణం తెలియాలంటూ మల్లక్పేట రెసిడెన్షియల్ ఎదుట తల్లిదండ్రులు ఏకు ఈశ్వర్, నీల ఆందోళన చేపట్టారు. బాలిక మృతి సమాచారం తెలియగానే పరకాల పోలీసులు రెసిడెన్షియల్లో విచారణ జరుపుతుండగానే గేట్ను నెట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. విద్యార్థిని మృతికి ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, ఉపాధ్యాయురాళ్ల వేధింపులే కారణమంటూ గొడవ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన విద్యార్థిని శ్రీవాణి ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్ కృష్ణకుమారితోపాటు ఉపాధ్యాయురాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ రెసిడెన్షియల్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థినుల పట్ల వేధింపులు ఆగాలంటే ప్రిన్సిపాల్ కృష్ణకుమారితో పాటు మరికొందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రేమ వ్యవహారాలంటూ వేధింపులు? గర్ల్స్ హాస్టల్లో ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయంటూ కొందరు ఉపాధ్యాయురాళ్లు తమ పిల్లలను వేధిస్తున్నారంటూ ఆందోళనలో పాల్గొన్న మిగతా విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోయారు. బాలికల మధ్య ప్రేమవ్యవహారాలేంటి? అని తాము అనేకమార్లు ఉపాధ్యాయురాళ్లను నిలదీసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పిల్లలను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ నోటి దురుసుతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తన కూతురు మృతికి కారణమైన ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, హౌస్ మాస్టర్ మీరాబాయితోపాటు పీఈటీ, అసిస్టెంట్ కేర్ టేకర్, స్వీపింగ్ శానిటేషన్ కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి ఏకు ఈశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతితో పరకాల(మల్లక్పేట) టీఎస్డబ్ల్యూఆర్ఎస్లో విషాదం బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన ప్రేమ వ్యవహారాలంటూ వేధింపులు.. భరించలేకపోతున్నామంటున్న విద్యార్థినులు -
కమర్షియల్ యూజర్ చార్జీలపై నిర్లక్ష్యమెందుకు?
● సీరియస్గా ఫోకస్ పెట్టండి ● అధికారులకు వార్నింగ్ ఇచ్చిన బల్దియా కమిషనర్ వరంగల్ అర్బన్: నగరంలో కమర్షియల్ యూజర్ చార్జీల విధింపులు, వసూళ్లపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మామూళ్ల మత్తు’ వార్తకు స్పందించిన కమిషనర్ ఉదయమే బల్దియా వింగ్ అధికారుల వాట్సాప్ గ్రూప్లో వార్త క్లిప్పింగ్ను షేర్ చేశారు. అనంతరం బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డి, హెచ్ఓ రాజేశ్తో కమిషనర్ సమావేశమయ్యారు. నగరంలో ఉన్న వాణిజ్య సంస్థలు, వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు, పరిధిలోకి రాని సంస్థలపై వివరణ అడిగారు. -
‘ఇందిరమ్మ’ నిర్మాణాలు వేగవంతం చేయాలి
రాయపర్తి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం రాయపర్తి మండలంలోని మైలారం, రాగన్నగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ని ర్మాణాలు చేపట్టాలన్నారు. మేసీ్త్రలు, కాంక్రీట్, సి మెంట్, ఇసుక, ఐరన్ ధరలు ఏవిధంగా ఉనన్నాయ ని అడిగి తెలుసుకునన్నారు. అనంతరం రాగన్నగూడెంలో ఈజీఎస్ కింద నిర్మిస్తున్న పాంపాండ్, రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలను పరిశీలించారు. తిర్మలాయపల్లిలోని కేజీబీవీని పరిశీ లించి పలుసూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ, ఇందిరమ్మ ఇళ్ల నోడల్ అధికారి రామిరెడ్డి, హౌసింగ్ డీఈ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, తహసీలల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
సమస్యలు త్వరగా పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 130 వినతులు రాగా రెవెన్యూ 54, గృహనిర్మాణం 20, ఇతర శాఖలకు సంబంధించినవి 56 దరఖాస్తులు రాగా ఆయాశాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలన్నారు. ఆర్టీఐ, గ్రీవెన్స్ సమస్యలు పరిష్కరించి ఈ–ఫైలింగ్లో సర్క్యూలేట్ చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా తదితర శాఖలు శాఖాపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.రేషన్షాపులను మహిళా సంఘాలకు కేటాయించాలి జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు మహిళా గ్రూపులకు కేటాయించాలి. మహిళలకు ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా వరకు రేషన్డీలర్లకు రెండేసి షాపులున్నాయి. వాటిని మహిళలకు కేటాయించాలి. – కలకోట్ల మాలతి, చింతల్ప్రభుత్వ భూమిని కాపాడాలి వరంగల్లోని 13వ డివిజన్ దేశాయిపేట సీకేఎం కళాశాల గ్రౌండ్ను ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి. – జన్ను అనిల్కుమార్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గ్రీవెన్స్లో 130 దరఖాస్తులు -
రైతుల సంక్షేమానికి పెద్దపీట
రాయపర్తి: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం రాయపర్తి మండలకేంద్రంలో రూ.14.17 కోట్ల వ్యయంతో 20 మె ట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారదతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్నబియ్యం ఇస్తున్న ప్ర భుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఆర్థిక సంక్షో భం ఉన్నా.. ప్రజా సంక్షేమం ఆగకుండా పని చేస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. ‘స్థానికం’లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
వైద్యచికిత్సతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ‘వంగర’ వైద్యురాలు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీ నిత్యం గర్భిణులు, మహిళలు, రోగులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వైద్యం కోసం వారంతా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అక్కడి వైద్యురాలు రుబీనా. ఆమె కేవలం చికిత్సలు అందించడమే కాకుండా జబ్బు రావడానికి కారణాలు. ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అని రోగులకు విడమర్చి చెబుతున్నారు.పేదల కష్టాలను దగ్గర్నుంచి చూశారు. వారి జబ్బులకు కారణం తెలుసుకున్నారు. వారి ఆర్థిక వెనుకబాటుకు అనారోగ్యమే కారణమని గ్రహించారు. ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అని చెప్పాలనుకున్నారు. అందుకే ఆమె డాక్టరయ్యారు. అనా రోగ్యంతో వచ్చిన రోగికి వైద్యమందించడమే కాదు.. వారికి అవగాహన కల్పిస్తే మరోసారి అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.ఇందుకోసం సొంతఖర్చులతో లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఫలితంగా ఇప్పుడా ప్రభుత్వ వైద్యురాలి వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. నేడు (మంగళవారం) నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా పేదల ఆరోగ్య నేస్తం వంగర పీహెచ్సీ వైద్యురాలు సయ్యద్ రుబీనాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.ఆరోగ్య విద్య.. పుస్తక పఠనంవంగర పీహెచ్సీ వైద్యురాలిగా చేరిన తర్వాత ఆస్పత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకనబర్చడం మొదలెట్టారు. సమీప గ్రామాల్లో క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీ, షుగర్, బీపీ వంటి వ్యాధులపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భం దాల్చిన మహిళల్ని కలిసి ప్రైవేట్కు వెళ్లకుండా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేలా, ప్రసవం చేయించుకునేలా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పిస్తున్నారు. ఫలితంగా వంగర పీహెచ్సీకి రోజూ దాదాపు 70 నుంచి 100 మంది ఓపీ చూపించుకుంటున్నారు. డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో పేషెంట్లతో పుస్తకాలు చదివిస్తున్నారు. ఇందుకోసం లై బ్రరీ ఏర్పాటుచేశారు. ఆమె సొంత ఖర్చులతో హెల్త్ గైడ్, హెల్త్ కేర్, ఆరోగ్య వ్యాయామ విద్య, ఆరోగ్య నిధి, ఆ రోగ్య విజ్ఞాన శాస్త్రం, యోగా, వంటిల్లే వైద్యశాల వంటి పుస్తకాలను కొనుగోలు చేసి రోగులతో చదివిస్తున్నారు.అవగాహనే కొండంత అండ..అనారోగ్యంతో వచ్చినవారికి మందులిచ్చి పంపించడం అందరూ చేస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణాలు. మరోసారి అలా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబితే ఆ వైద్యుల్ని ఎవరైనా మరిచిపోతారా? అచ్చం రుబీనా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. వచ్చిన వారికి తన పరిధిలో పూర్తి సాయం చేస్తున్నారు. ఒక ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇళ్లంతా బాగుంటుందని ఆమె నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేస్తూ మందులిస్తున్నారు.ప్రజల ఆరోగ్యమే నా కర్తవ్యంఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు టీబీ మీద, డ్రగ్స్ మీద పరేడ్ గ్రౌండ్లో మేం చేసిన స్కిట్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే వ్యాధులపై అవగాహన సాధారణంగా చెప్పకుండా స్కిట్ల ద్వారా, పాటల ద్వారా అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఇప్పుడు నా పీహెచ్సీ పరిధిలో 27,000 పాపులేషన్ ఉంది. వారు ఆరోగ్యంగా ఉండడమే నా కర్తవ్యం.– రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు, వంగర -
పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్గా మార్చాలి
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సెమీరెసిడెన్షియల్గా మార్చాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించిన డీటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను సెమిరెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ పాలు అందించాలన్నారు. అంతరాలను పెంచేలా వివిధ రకాల పాఠశాలలు కాకుండా అందరూ కలిసి చదువుకునేలా ఒకేరకమైన పాఠశాలలను ఏర్పాటు చేసి అందరికి సమాన అవకాశాలు ఉన్న నాణ్యమైన విద్యను అందించాలన్నారు. -
బొగతలో సండే సందడి
మల్లూరులో పూజలుములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. – మంగపేటములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి ఆదివారం పర్యాటకులు తరలివచ్చారు. దీంతో బొగత జలపాతం పరిసరాలు పర్యాటకులతో కోలాహలంగా మారాయి. పర్యాటకులు బొగత జలపాతం వద్ద ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచి వచ్చి 20 మంది పర్యాటకులను కుట్టినట్లు తెలిసింది. –వాజేడు -
సాగుకు భరోసా
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం రైతులకు అందించింది. జిల్లాలోని 1,56,403 మంది రైతుల ఖాతాల్లో విడతల వారీగా రూ.162.38 కోట్లు జమ చేసింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందడంతో పంటల సాగుపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీజన్కు ముందుగానే పెట్టుబడి సాయం అందడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో 3,08,320 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను రైతులు సాగుచేస్తున్నారు. వరి 1,43,803 ఎకరాలు, మొక్కజొన్న 9,820 ఎకరాలు, పతిపత్తి 1,26,173 ఎకరాలు, కంది 1,180 ఎకరాలు, మిర్చి 9 వేల ఎకరాలు, పసుపు 950 ఎకరాలు, ఇతర పంటలు 17, 400 ఎకరాల్లో సాగవుతున్నాయి. సాగు ప్రారంభంలోనే .. సాగు పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. దుక్కులు దున్నడానికి, విత్తనాలు విత్తేందుకు పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పింది. బంగారు ఆభరణాలు సైతం కుదువపెట్టి అప్పులు తేవాల్సి వచ్చేది. ఈ ఏడాది ఆ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేయడంతో రైతుల మోముల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పత్తి విత్తనాలు విత్తగా కొన్ని చోట్ల కలుపు తీస్తున్నారు. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక పోవడంతో వరిసాగు పనులు ఆలస్యమవుతున్నాయి. పచ్చిరొట్ట విత్తనాలు వేశారు. వర్షాలు పడి చెరువులు, జలాశయాలు నిండితే నార్లు పోయనున్నారు. ముందుగా బావుల కింద ఇప్పటికే నార్లుపోసి నాట్లు వేయటం ప్రారంభించారు. జిల్లాలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న 2,203 మంది రైతులు నుంచి ఈనెల 20 వరకు వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీరి వివరాలను మండల వ్యవసాయ కార్యాలయాల్లో అధికారులు నమోదు చేశారు. త్వరలో వీరి ఖాతాల్లోనూ రైతు భరోసా డబ్బులు జమకానున్నాయి. మండలాల వారీగా రైతు భరోసా జమ ఇలా (రూ.కోట్లలో) మండలం రైతులు నగదు చెన్నారావుపేట 11,407 10.92 దుగ్గొండి 14,375 13.11 ఖానాపురం 8,656 8.78 నల్లబెల్లి 13,444 14.26 నర్సంపేట 11,914 9.75 నెక్కొండ 14,819 14.98 గీసుకొండ 12,950 12.58 ఖిలా వరంగల్ 4,891 4.14 పర్వతగిరి 14,211 16.27 రాయపర్తి 19,289 24.09 సంగెం 14,846 15.03 వరంగల్ 1,716 1.44 వర్ధన్నపేట 13,885 17.03 1,56,403 162.38నాకు భరోసానిచ్చింది.. నాకు కాంట్రపల్లి గ్రామంలో 1.17 ఎకరాల భూమి ఉంది. ఆభూమిలో ఏటా వరి సాగు చేస్తున్నా. రైతు భరోసా సాయం కింద 1.17 ఎకరాలకు రూ.8,550 బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. రెండేళ్లుగా సకాలంలో పెట్టుబడి రాక వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి వరి సాగు చేశా. ఈ ఏడాది సకాలంలో రైతు భరోసా అందడంతో నేను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డా. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశా. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటా. – ఉమాదేవి మహిళా రైతు, కాట్రపల్లి, సంగెం మండలంన్యూస్రీల్రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం 1,56,403 మంది ఖాతాల్లో రూ.162.38 కోట్లు జమ వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తప్పిన ప్రదక్షిణలు జిల్లాలో 3,08,320 ఎకరాల్లో వివిధ పంటల సాగుప్రతీ సీజన్కు రైతు భరోసా.. జిల్లాలో మొత్తం 1,56,403 మంది రైతుల ఖాతాల్లో రూ.162.38 కోట్లు జమయ్యాయి. కేవలం కొద్ది రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో అందించింది. ఈసారి విత్తనాలు, ఎరువులు, కూలీలు, ఇతర పంటల పెట్టుబడికి ఈ డబ్బులు రైతులకు భరోసానిచ్చాయి. అలాగే, ప్రతీ సీజన్కు రైతు భరోసా సాయం జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. – అనురాధ జిల్లా వ్యవసాయ అధికారి -
అద్దె గదుల లీజులో అక్రమాలు!
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఆదాయంపై అధికారులు దృష్టి సారించడం లేదు. కొందరు లీజు అగ్రిమెంట్ చేసుకొని వాటిని సబ్ లీజుకు ఇస్తూ అక్రమ మార్గంలో నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ లేదా టెండర్లో తక్కువ ధరకే దక్కించుకుంటున్నారు. షాపింగ్ సముదాయాల ద్వారా వస్తున్న ఆదాయం కంటే వాటిని లీజుకు పొందిన వారు ఇతరులకు వాటిని అద్దెకు ఇచ్చి మరింత సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగ వేలం వేస్తే మున్సిపాలిటీకి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బినామీల హవా! ఆదాయాన్ని సమకూర్చే మున్సిపాలిటీకి 94 దుకాణ సముదాయాలు ఉన్నాయి. ఇందులో 10 నుంచి 15 వరకు బినామీలతో నడుస్తున్నాయి. మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న 33 సముదాయాలతోపాటు నెహ్రూ సెంటర్లో 30, సెంట్రల్ బ్యాంకు కాంప్లెక్స్లో మరికొన్ని దుకాణ సముదాయాలకు మార్కెట్ పరంగా చూస్తే అత్యధిక డిమాండ్ ఉంది. కానీ, కొన్నేళ్లుగా రెన్యువల్ చేస్తూ వస్తుండడంతో బయటి అద్దెలకంటే తక్కువ స్థాయిలో మున్సిపాలిటీకి చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి 33 శాతం అద్దె పెంచాల్సి ఉంది. దానికి అనుగుణంగా అద్దె పెరుగుతూ వస్తుంది. 25 సంవత్సరాలు మాత్రమే ఈ విధంగా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో అద్దెకు తీసుకున్న వ్యక్తులు బినామీకి ఇచ్చుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలు గాలికి.. లీజుకు తీసుకున్న వారే దుకాణ సముదాయాలను ఉపయోగించుకోవాలి. సబ్ లీజు ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించకూడదు. ప్రతీ సంవత్సరం రూ.80 లక్షల ఆదాయం వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ లీజు వ్యవహారంలో అధికారులు చూసీచూడనట్లు ఉండడం వల్ల మున్సిపాలిటీకి నష్టం వాటిల్లుతోంది. క్షేత్రస్థాయిలో లీజు ఒప్పందాలకు విరుద్ధంగా ఇతరులు నిర్వహిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. బహిరంగ వేలం నిర్వహిస్తాం.. మున్సిపాలిటీలో దుకాణ సముదాయాలకు ప్రతీ మూడేళ్లకు ఒకసారి లీజు అగ్రిమెంట్ రెన్యువల్ అవుతుంది. త్వరలో నెహ్రూ సెంటర్, గర్ల్స్ హై స్కూల్ ఏరియాల్లోని షాపింగ్ కాంప్లెక్స్లకు నిబంధనల ప్రకారం 25 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి బహిరంగ వేలం నిర్వహిస్తాం. లీజు పొందిన వ్యక్తులు సబ్ లీజుకు ఇస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – భాస్కర్, మున్సిపల్ కమిషనర్ ఆదాయంపై దృష్టి సారించని అధికారులు -
బ్యాంకు డిపాజిట్లు రూ.219.20 కోట్లు
రామన్నపేట : వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్స్లో ఆదివారం బ్యాంక్ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపా రం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గోపాల్పూర్, మహబూబాబాద్, జనగామ, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్కుమార్, మహమ్మద్ గౌసొద్దీన్, ఒడితర పవన్కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు, వరంగల్, హనుమకొండ డీసీఓలు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్రావు, సేల్స్ ఆఫీసర్ కె.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ: మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రయాణికుల నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 30న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రయాణికులు 8977781103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతో పాటు, సలహాలు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. డాక్టర్ వేణుకు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జన్) డాక్టర్ గాదె వేణు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు–2025ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వారు ఈ అవార్డును ఆయనకు అందించి సన్మానించారు. డాక్టర్ వేణు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. గతంలో ఆయన వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్, వరంగల్లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో వైద్యసేవలు అందించారు. తన స్వగ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలివిద్యారణ్యపురి: టీచర్లకు బదిలీలు, పద్నోతుల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్రాజు ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణతో అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, భర్తీ చేసేందుకు వెంటనే బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న కరువుభత్యం విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, ఉపాధ్యక్షులు వి.రాజారామ్, జ్యోతి, కార్యదర్శులు సీఎస్ఆర్.మల్లిక్, కె.సదా నందం, ఎం.ప్రసన్నానంద్, కె.శశిధర్రెడ్డి, ఆడి ట్ కమిటీ కన్వీనర్ జి.భాస్కర్రావు, బాధ్యులు ఎ.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవా రం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమి షనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, నగర ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలి రామన్నపేట: కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని గుమస్తాల సంఘం కార్యదర్శి గున్నాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సీఐటీయూ నాయకులతో కలిసి వరంగల్లోని వ్యాపారులకు ఆదివారం సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికుల హక్కులకు ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదాని, అంబానీలాంటి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. కార్మికులు సమ్మెలో పాల్గొని తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్, సహాయ కార్యదర్శి సింగారపు బాబు, జిల్లా కమిటీ సభ్యులు అప్పాజీ వాణి ఉన్నారు. -
కొత్త మెనూ.. కడుపునిండా తిను!
కాజీపేట: విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే ఆలోచనలతో నూతన సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన ఆహార పట్టిక అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. వారంలో అయిదు సార్లు కోడిగుడ్లు, నెలలో రెండు సార్లు మాంసం, రోజూ నెయ్యి వడ్డించాలని నిర్ణయించారు. నూతన వంటకాల తయారీకి అనుగుణంగా వంట మనుషులకు విద్యాశాఖ అధికారులు తగిన శిక్షణ ఇప్పించారు. పెరిగిన మెస్ చార్జీలు హనుమకొండ జిల్లాలో 9 కేజీబీవీలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సరికొత్త రుచులతో వంటకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా మెస్చార్జీలను పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి నెలకు మెస్ ఛార్జీ రూ.1,225 ఉండేది. ప్రస్తుతం రూ.1,740కి పెంచింది. పర్యవేక్షణతో అమలు ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నూతన మెనూను రూపొందించింది. దీని అమలుకు కార్యాచరణ అమలుకు ఆదేశాలను జారీ చేసింది. జిల్లా, మండల అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తేనే కొత్త ఆహార పట్టిక అమలకు నోచుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారంమెనూ ఇలా.. ఉదయం: అల్పాహారంలో టమాటా కిచిడీ, రాగిజావ, ఇడ్లీ, సాంబర్, పాలు (బూస్ట్), పూరి, పులిహార, బోండా, ఉప్మా, చపాతీ, జీరా రైస్, అరటి పండు ఇవ్వాలి. మధ్యాహ్నం: అన్నంతో పాటు టమాటా పప్పు, నెయ్యి, రసం, పెరుగు, ఉడికించిన గుడ్డు, చికెన్, మటన్ ఇవ్వాలి. సాయంత్రం: ఉడికిన పెసలు, శనగలు, ఎగ్బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి రాత్రి: అన్నంతో పాటు వివిధ రకాల కూరలు, సాంబర్, మజ్జిగ ఇవ్వాల్సి ఉంటుంది. -
స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తాం..
వరంగల్ అర్బన్: స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తామని నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారు. బల్దియా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం భద్రకాళి బండ్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్(వీధి ఆహార విక్రయాదారుల వంట కళల ప్రదర్శన, అమ్మకం) కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరగాల్సిన కార్యక్రమం వివిధ కారణాలు, వర్షం కారణంగా 6 గంటలకు ప్రారంభమై రాత్రి 8.30 గంటలకు ముగిసింది. ఈసందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్ట్రీట్ వెండర్స్ గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకు రుణాలను ఎలాంటి గ్యారెంటీ లేకుండా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పేద వర్గాలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈసందర్భంగా 30 స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా.. శుచి, శుభ్రత బాగుందని హాజరైన నగర ప్రజలు, అతిథులు అభినందించారు. కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మెప్మా స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసూనరాణి, రవీందర్, రాజేశ్వర్రావు, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గ్రూపులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం ఫుడ్ ఫెస్టివల్లో మేయర్, ఎమ్మెల్యే -
మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి
● తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ హన్మకొండ: మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. హనుమకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీలోని రాధ గ్రాండ్ బాంక్వెట్ హాల్లో ఆదివారం జరిగిన తెలంగాణ మీసేవ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలాంటి దరఖాస్తు చేయకూడదని సూచించారు. అనంతరం తెలంగాణ మీసేవ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా దేశిని రమేశ్, ప్రధాన కార్యదర్శిగా జక్కు రాజు, కోశాధికారిగా పేరాల సురేందర్, ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి శ్యాంప్రసాద్, కొయ్యడ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా గుగులోత్ సతీశ్, గజ్జెల రమేశ్, సంయుక్త కోశాధికారులుగా నాంపల్లి ఆంజనేయులు, బండి కిరణ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పుల్లూరు సునీల్, చెన్న విద్యాసాగర్, మీడియా ఇన్చార్జ్లుగా వేముల రాజేందర్, గూడూరు అనిల్కుమార్, మహిళా కోఆర్డినేటర్లుగా సామల రమాదేవి, కట్ల మమత, అధికార ప్రతినిధిగా చాట్ల రాజు ఎన్నికయ్యారు. సర్వసభ్య సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ను నూతన కార్యవర్గం సన్మానించింది. -
బ్యాంక్ డిపాజిట్లు రూ.219.20 కోట్లు
రామన్నపేట: వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్స్లో ఆదివారం బ్యాంక్ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ.. రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపారం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈఆర్థిక సంవత్సరంలో గోపాల్పూర్, మహబూబాబాద్, జనగాం, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్కుమార్, మహమ్మద్ గౌసొద్దీన్, ఒడితర పవన్కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు, వరంగల్, హనుమకొండ డీసీఓ లు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్రావు, సేల్స్ ఆఫీసర్ కె.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్రావు -
మామూళ్ల మత్తు
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలివిద్యారణ్యపురి: టీచర్లకు బదిలీలు, పద్నోతుల ప్రక్రియ చేపట్టాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్. రవీందర్రాజు ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణతో అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, భర్తీ చేసేందుకు వెంటనే బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న కరువుభత్యం విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, ఉపాధ్యక్షులు వి.రాజారామ్, జ్యోతి, కార్యదర్శులు సీఎస్ఆర్.మల్లిక్, కె.సదా నందం, ఎం.ప్రసన్నానంద్, కె.శశిధర్రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ జి.భాస్కర్రావు, బాధ్యులు ఎ.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’హన్మకొండ: మెరుగైన సేవలు అందించేందు కు ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 30న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ఉదయం 11నుంచి 12గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రయాణికులు 89777 81103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహా లు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. డాక్టర్ వేణుకు అవార్డు గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జన్) డాక్టర్ గాదె వేణు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు–2025ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వారు ఈ అవార్డును ఆయనకు అందించి సన్మానించారు. డాక్టర్ వేణు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. గతంలో ఆయన వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్, వరంగల్లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో వైద్యసేవలు అందించారు. తన స్వగ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో మోస్తరు వర్షంహన్మకొండ: హనుమకొండ జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. నెల రోజులుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్ట పంటల మొలకలు వాడిపోతున్న క్రమంలో కురిసిన వర్షం జీవం పోసింది. రాత్రి 10 గంటల వరకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. దామెర మండలం పులుకుర్తిలో 38.5 మిల్లీమీ టర్లు, వరంగల్ పైడిపల్లి 34.5, కమలాపూర్ 30.8, శాయంపేట 29.3, వేలేరు 28.3, హసన్పర్తి 25.5, హనుమకొండ పెద్దమ్మగడ్డ 24.3, కాజిపేట మడికొండ 18.8, దామెర 17.3, కాజీపేట 17, నడికూడ 16, పరకాల 10.5, ఐనవోలు 10, హసన్పర్తి నాగారం 9.5, భీమదేవరపల్లి 9.3, ఆత్మకూరులో 8.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ● ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించి, తరలించినందుకు విస్తీర్ణం ఎస్ఎఫ్టీల ఆధారంగా మూడు స్లాబుల్లో నెలకు రూ.60 నుంచి రూ.1,200 వరకు చెత్త పన్ను విధించి ఆస్తి, నీటి పన్నులో జోడించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ● వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు నిత్యం రూ.వేలు, లక్షల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. భారీగా చెత్త వెలువడే కమర్షి యల్ షాపుల నుంచి ప్రతినెలా యూజర్ చార్జీల సొమ్ము మాత్రం వసూలు చేయట్లేదు. ఇలా.. గత 11 ఏళ్లుగా 5శాతం వరకు మాత్రమే కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి వసూలు చేస్తుండడంతో బల్దియాకు రావాల్సిన సూమారు రూ.10 కోట్లపైచిలుకు ఆదాయానికి గండిపడింది.వరంగల్ అర్బన్: వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. జాతీయ, అంతర్జాయ సంస్థలు వెలిశాయి. నగరంలో షాపులు, హోటళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ఉదయమే తెరుచుకుంటాయి. అప్పటికే వీధులు, రహదారుల ను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేసి వెళ్లిపోతారు. ఆతర్వాత షాపు యజమానులు వచ్చి దుకాణాలు తెరిచి శుభ్రం చేయగా.. వచ్చిన చెత్తాచెదారాన్ని తిరిగి షాపుల ఎదుట డ్రెయినేజీ, కాల్వలు, రహదా రులపై పడేయడంతో నగరం అపరిశుభ్రంగా మారుతోంది. ఆస్పత్రుల స్థాయి ఆధారంగా, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఫాస్ట్పుడ్ సెంటర్లు, బేకరీ లు, ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు, ప్రైవేట్ విశ్రాంతి భవనాలు, క్లబ్బులు, కూరగాయల, వ్యవసాయ మార్కెట్లకు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ప్రైవేట్ హాస్టళ్లు, హోల్సేల్ పండ్ల వ్యాపారులు, పెద్ద హోటళ్లు, మిడిల్ స్థాయి హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు, ఫంక్షన్ హాళ్లు ప్రతి నెలా వ్యర్థాల సేకరణకుగాను బల్దియాకు నిర్ణీత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. యూజర్ చార్జీల వసూలేది? ఆయా సంస్థలు, వ్యాపార కేంద్రాల నుంచి చెత్తాచెదారం వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వాటి విస్తీర్ణం ఆ ధారంగా యూజర్ చార్జీలు వసూలు చేయాలనే ఆలోచన వరంగల్ బల్దియాకు 2013 సంవత్సరంలో వచ్చింది. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి షాపుల నుంచి చెత్తను తరలించేందుకు యూజ ర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. సర్వే చేసి 1,674 సంస్థలను గుర్తించారు. ఆయా సంస్థల నుంచి ఎంత వసూలు చేయాలో ఖరారుచేసి 2014 నుంచి వసూళ్ల ప్రక్రియ ప్రారంభించారు. రెండేళ్ల పాటు 50శాతానికి పైగా వసూలు చేసిన ప్రజారోగ్యం సిబ్బంది తదుపరి క్రమేపీ విస్మరిస్తున్నారు. తొలుత 1,674 వాణిజ్య సంస్థలు ప్రస్తుతం బల్దియా రికార్డుల్లో 427 కుచించుకుపోయాయి. ఈ ఏడాది చార్జీలు రూ.31 లక్షలు నిర్ణయించగా.. ఇప్పటి వరకు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు లెక్కలు చెప్పడం అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. కంపు.. కంపు బల్దియా సిబ్బంది నిర్లక్ష్యం.. అవినీతి కారణంగా కమర్షియల్ కాంప్లెక్స్లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. నిత్యం షాపుల నుంచి వెలువడే చెత్తనంతా రెండు కాంప్లెక్స్ల నడుమ, కాంప్లెక్స్ చుట్టూ ఖాళీ స్థలాల్లో నింపేస్తున్నారు. మురుగు వాసన వస్తున్నా.. ఈగలు, దోమలు విజృంభిస్తున్నా అటు బల్దియా, ఇటు కాంప్లెక్స్ల యజమానులు, వ్యాపారులు పట్టించుకోవట్లేదు. వ్యాపార సముదాయాల నుంచి వెలువడే చెత్తను రోజూ బల్దియా వాహనాల్లో వేయాలంటే యూజర్ చార్జీలు చెల్లించాలి. ఇది ఇష్టం లేని కొందరు వ్యాపారులు ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.. వాణిజ్య సంస్థలను స్పెషల్ డ్రైవ్ నిర్విహించి గుర్తిస్తాం. లోపాలను సరిచేసుకుంటాం. యూజర్ చార్జీలను నిబంధనల మేరకు వసూలు చేస్తాం. – రాజేశ్, బల్దియా సీఎంహెచ్ఓ ● లెక్కలు పక్కా చేస్తున్న సిబ్బందిన్యూస్రీల్‘కమర్షియల్’ నుంచి కాసుల పంట శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో జవాన్ల అక్రమ వసూళ్లు! యూజర్ చార్జీల వసూళ్లలో నిర్లక్ష్యం ఆదాయంపై పట్టించుకోని గ్రేటర్ అధికార, పాలక వర్గాలు నగరంలో ప్రజారోగ్యం పచ్చిమోసం!ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి.. గత పదిన్నరేళ్ల కాలంలో సూమారు రూ.10 కోట్లకుపైగా యూజర్ చార్జీల ద్వారా బల్దియా ఆదాయం సమకూరాలి. కానీ.. ఇంత వరకు ఎంత మంది వద్ద సొమ్ము వసూలు చేశారో, ఎవరు ఎగ్గొట్టారో చిక్కుముడిగా మారింది. వాణిజ్య సంస్థల నుంచి ప్రతీ నెల జవాన్లు యూజర్ చార్జీలను వసూలు చేయాలి. ఆన్లైన్ రశీదు ఇవ్వాలి. బల్దియా వద్ద లెక్కాపత్రం లేదు. వసూలు చేయాల్సిన కొంతమంది జవా న్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో యూజర్ చార్జీలతో సంబంధం లేకుండా నెలవారీ మా మూళ్లకు పాల్పడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఆస్పత్రులు, హాస్టల్స్, టిఫిన్ సెంట ర్లు ఇలా ప్రతీ వాణిజ్య సంస్థకు మరీ లెక్కగట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వసూలు చేసి బల్దియాకు చెల్లించాల్సిన సొమ్మును 90శాతం మందికిపైగా సిబ్బంది తమజేబుల్లో నే వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.పై ఫొటో హనుమకొండ చౌరస్తా సిటీ బస్టాప్ సమీపంలోది. రెండు కాంప్లెక్స్ల నడుమ ఒక మీటర్ ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో నిత్యం షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను పడేస్తున్నారు. గుట్టలుగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఈగలు ముసురుకుంటున్నాయి. ఇది ఒక చౌరస్తాలో మాత్రమే కాదు. సిటీలోని చాలా కాంప్లెక్స్లలోని పరిస్థితి.వారు అడగరు.. వీరు ఇవ్వరు! వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను తీసుకెళ్లే క్రమంలో ఎంతో కొంత, నెలవారీగా వసూలు చేస్తున్నారు. ఇందుకుగాను యజమానులు, వ్యాపారులు చెల్లించిన సొమ్ముకు రశీదులు అడగడం లేదు. వీరు ఇవ్వడం లేదు. బల్దియా ప్రజారోగ్య శాఖ అధికారులు, కమిషనర్లు యూజర్ చార్జీల వసూళ్లపై కనీసం సమీక్షలు, పురోగతిపై సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు. దీంతో బల్దియా రికార్డుల్లో ప్రతి నెలా యూజర్ చార్జీల సొమ్ము భారీగా పేరుకుపోయింది. అనధికారిక వసూళ్లే అందుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. పాలకవర్గం పెద్దలు, నూతన కమిషనర్ ఈ సొమ్ము రాబట్టుకుంటారా? లేక వదిలేస్తారా? లేకపోతే శానిటరీ సిబ్బందిపై చర్యలు చేపడతారా? అనేది వేచి చూడాల్సిందే. -
‘పంచాయతీ’కి ముందస్తు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందుకు సాగుతున్నారు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 210 గ్రామపంచాయతీలు, 12 మండల పరిషత్లు, 1,986 వార్డులు, అంతే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కలను కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అధికారులు సరిచేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేసి అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం ఓటర్లు 3,72,646 జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,81,772 మంది పురుషులు, 1,90,872 మంది మహిళలు, ఇతరుల కేటగిరీలో ఇద్దరు ఓటర్లుగా నమోదై ఉన్నారు. గ్రామాల్లో 1,169 పోలింగ్ కేంద్రాల్లో 200కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 755 పోలింగ్ కేంద్రాల్లో 201నుంచి 400 మంది ఓటర్లు ఉన్నారు. 62 కేంద్రాల్లో 401 నుంచి 650 మంది వరకు ఉన్నారు. మొత్తం 1,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఇప్పటికే బ్యాలెట్స్ ప్రింటింగ్, ఇతర స్టేషనరీ సిద్ధంగా ఉంది. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంతం ఆదేశాలతో కార్యాలయ సిబ్బంది ఎన్నికలకు సంబంధించి ముందస్తు పనులు చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికీ, ముందస్తుగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. -
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పరకాల: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డితో కలిసి పరకాల మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ప్లానింగ్, రెవెన్యూ విభాగాల పనితీరుపై సమీక్షించారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వర్షాకాలంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోపోతే ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, విద్యా, వ్యాపార వాణిజ్య సంస్థల ముందు చెత్త వేసే వారికి జరిమానాలు విధించాలని కమిషనర్ సుష్మను ఆదేశించారు. ఫాగింగ్, స్ప్రే నిర్వహణ కోసం కావాల్సి న మిషన్లు కొనుగోలు చేయాలని, మున్సిపల్ మిగులు నిధులతో జేసీబీ, స్వచ్ఛ వాహనాలు కొనాలని సూచించారు. అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య సిబ్బందికి సమాచారాన్ని డిస్ప్లే చేయాలన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, మున్సిపల్ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి రోడ్డుపై చెత్త వేసే వారికి జరిమానా -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
పీవీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: రాజనీతిజ్ఞుడు, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో శనివారం పీవీ నరసింహారావు 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పీవీ ఆలోచనలు, ఆర్థిక సంస్కరణలు భారత్ను అభివృద్ధివైపు తీసుకెళ్లాయన్నారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జంక్షన్లోని పీవీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు బంక సంపత్, నాయిని లక్ష్మారెడ్డి, అంకూస్ పాల్గొన్నారు. -
కుల్లా, నిత్యక్లిన్నా క్రమాలలో శ్రీభద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళీ దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు శనివారం అమ్మవారిని కుల్లాక్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయంనుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లాగా పూజలు నిర్వహించి, వారాహి అమ్మవారిగా అలంకరించారు. షోడశీక్రమాన్ని అనుసరించి స్నపనమందిరంలోని భోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు
● డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ ● ఆయన స్థానంలో ఎన్.శుభంప్రకాశ్ నియామకం.. బాధ్యతల స్వీకరణసాక్షి, వరంగల్: వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు పడింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వివిధ సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్కార్ట్ కల్పించి మెమోలు అందుకున్నారు. కాంగ్రెస్ నేత నవీన్రాజ్కు ఏ పదవి లేకున్నా కూడా పోలీసు భద్రత కల్పించి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్న ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సందర్భాలున్నాయి. కేవలం 15నెలల పాటు పనిచేసిన నందిరాంనాయక్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆస్థానంలో 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎన్.శుభంప్రకాశ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శుభంప్రకాశ్ 2024లో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆరు నెలలపాటు ట్రెయినీ ఐపీఎస్గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కరీంనగర్ రూరల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. ఏసీపీగా రానున్న ఆయనకు వరంగల్పై కొంత అవగాహన ఉంది. కాగా, ఆయన సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ డివిజన్ పోలీసులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి
నర్సంపేట: విద్యుత్ వినియోగదారులు, రైతులు తమ పరిధిలోని ఉన్న విద్యుత్ సమస్యలను సెక్షన్ ఆఫీసర్ (అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్), గ్రామస్థాయిలో ఉండే లైన్మెన్కు తెలియజేయాలని వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతంరెడ్డి సూచించారు. ఈ మేరకు నర్సంపేట డివిజన్ పరిధిలోని 33కేవీ లైన్ను శనివారం ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. భారీ వర్షాలు, గాలి దుమారంతో విద్యుత్ తీగలు తెగి పడితే వెంటనే సమాచారాన్ని ఏఈలకు తెలియజేయాలని కోరారు. తడిగా ఉన్న స్తంభాలను ముట్టుకోకూడదన్నారు. విద్యుత్ ప్రమాదాలపై అత్యంత జాగ్రత్త వహించాలని, ఇంటిలోకి వచ్చే సర్వీస్ వైరు ఎలాంటి అతుకులు లేకుండా, ఇనుప రేకుల గుండా వెళ్లకుండా చూడాలని తెలిపారు. ఇళ్లలో నాణ్యమైన వైరింగ్ వాడాలని, రైతులు స్విచ్ బోర్డు, మోటార్ స్టార్టర్ల వద్ద భద్రతా ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించాలని సూచించారు. రైతులు, వినియోగదారులు స్వయంగా కరెంటు పనులను చేసుకోకూడదని పేర్కొన్నారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా టీజీ ఎన్పీడీసీఎల్ టోల్ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీఈ టెక్నికల్ ఎ.ఆనంద్, నర్సంపేట డీఈ పి.తిరుపతి, ఏడీలు, ఏఈ, సిబ్బంది పాల్గొన్నారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
కుల్లా, నిత్యక్లిన్నా క్రమాల్లో శ్రీభద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు శనివారం అమ్మవారిని కుల్లాక్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయంనుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లాగా పూజలు నిర్వహించి, వారాహి అమ్మవారిగా అలంకరించారు. షోడశీక్రమాన్ని అనుసరించి స్నపనమందిరంలోని భోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు కృషి
నర్సంపేట రూరల్: ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం నర్సంపేటలోని వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్, వివిధ విభాగాధిపతులతో శనివారం సమీక్ష నిర్వహించారు. వైద్య కళాశాలలో బోధన, బోధనేతర, ల్యాబ్, సిబ్బంది, కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య విద్యార్థినుల వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రికి సంబంధించి ఓపీ విభాగం, ఆరోగ్యశ్రీ తదితర విభాగాలను సందర్శించారు. వివిధ విబాగాల్లో వనరుల కొరత, యూజీ మెడికల్ ఎడ్యుకేషన్, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన, సమకూర్చాల్సిన సౌకర్యాలపై క్షుణ్ణంగా చర్చించారు. ఆస్పత్రికి, వైద్య కళాశాలకు డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బంది, ఇతర పరికాలపై అడిగి తెలుసుకున్నారు. ఐపీ సేవలు తర్వితగతిన ప్రారంభించాలని, వాటికి కావాల్సి వసతుల కల్పనకు కలెక్టర్ కృషి చేస్తారని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.కిషన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శ్రీదేవి, పలు విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు
సాక్షి, వరంగల్: వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు పడింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వివిధ సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్కార్ట్ కల్పించి మెమోలు అందుకున్నారు. కాంగ్రెస్ నేత నవీన్రాజ్కు ఏ పదవి లేకున్నా కూడా పోలీసు భద్రత కల్పించి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్న ఆయన తరచూ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సందర్భాలున్నాయి. కేవలం 15నెలల పాటు పనిచేసిన నందిరాంనాయక్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆ స్థానంలో 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎన్.శుభంప్రకాశ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శుభంప్రకాశ్ 2024లో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆరు నెలలపాటు ట్రెయినీ ఐపీఎస్గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కరీంనగర్ రూరల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. ఏసీపీగా రానున్న ఆయనకు వరంగల్పై కొంత అవగాహన ఉంది. దీంతో శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగానే ఉండే అవకాశముంది. కాగా, ఆయన సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ డివిజన్ పోలీసులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ ఆయన స్థానంలో ఎన్.శుభంప్రకాశ్ నియామకం.. బాధ్యతల స్వీకరణ -
వరంగల్
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
వైద్యాధికారులకు సమ్మె నోటీసు అందజేత
గీసుకొండ: దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె సందర్భంగా ఆ రోజు తాము విధులకు హాజరు కావడం లేదంటూ ఏఐటీయూసీ నాయకులు శనివారం నర్సంపేట, వర్ధన్నపేట డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ ఐ.ప్రకాశ్, డాక్టర్ కొమురయ్యకు సమ్మె నోటీసు అందజేశారు. సార్వత్రిక సమ్మెలో జాతీయ ఆరోగ్యమిషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొంటారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేశ్, ఎన్హెచ్ఎం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియ న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేశ్ఖన్నా తెలిపారు. ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. యూనియన్ ఉపాధ్యక్షుడు ఆచంట అభిషేక్, జిల్లా అధ్యక్షులు జన్ను కొర్నేలు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు యాకూబ్పాషా తదితరులు పాల్గొన్నారు. కొమ్మాల ఆలయ ఆదాయం రూ.8.39 లక్షలుగీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఈ ఏడాది ఏప్రిల్ 9 నుంచి 80 రోజలపాటు రూ.8,39,225 ఆదాయం సమకూరిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. శనివారం ఆలయంలో లెక్కించగా హుండీల ద్వారా రూ.2,44,200, పలు రకాల ఆర్జిత సేవల ద్వారా రూ.5,95,025 ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకుడిగా డి.అనిల్కుమార్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్ర, ఆలయ ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ వీరాటి లింగారెడ్డి, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలురాయపర్తి: నకిలీ విత్తనాలు అమ్మితే కేసులతోపాటు కఠిన చర్యలు తప్పవని రెండో అదనపు న్యాయ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి హారిక హెచ్చరించారు. విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులు, విత్తన డీలర్లకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లో అమ్ముతున్న ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను కొనుగోలు చేయవద్దని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో లీగల్ అడ్వయిజర్ రజిని, వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివా స్,ఎస్సై ముత్యం రాజేందర్, ఏఓ గుమ్మడి వీరభద్రం,ఏఈఓలు,రైతులు,డీలర్లు పాల్గొన్నారు. గంజాయి స్వాధీనంవర్ధన్నపేట: గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన వర్ధన్నపేటలో జరిగింది. ఎస్సై చందర్ కథనం ప్రకారం.. వర్ధన్నపేటలోని వరంగల్ ఖమ్మం రహదారిలో ఉన్న ఓ స్కూల్ వద్ద శనివారం తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా పల్సర్ బైక్పై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేశారు. రూ.1,36,000 విలువైన రెండు కిలోల 720 గ్రాముల గంజాయి, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లా ముస్తాఫానగర్కు చెందిన నిందితులు అఫ్రోజ్, మహేశ్ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై చందర్ తెలిపారు. -
రైతుల సంక్షేమానికి పెద్దపీట
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జాతీయ ఆహార భద్రత, పోషణ్ మిషన్ ఆధ్వర్యంలో పప్పు దినుసుల విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. అలాగే, కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం (భద్రత కిట్) అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ, సహాయ వ్యవసాయ సంచాలకులు కె.దామోదర్రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, జాతీయ ఆహార భద్రతా కన్సల్టెంట్, పి.సారంగం, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, పాల్గొన్నారు. -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
హనుమకొండ జిల్లాలో 89.95%, వరంగల్ జిల్లాలో 60.73% ఉత్తీర్ణత విద్యారణ్యపురి: ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్ని శుక్రవారం విడుదల చేశారు. హనుమకొండ జిల్లాలో 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 416 మంది 89.85 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ డి.వాసంతి తెలిపారు. బాలురు 277 మందికి 249 మంది, బాలికలకు 186 మందికి 167 మంది ఉతీర్ణులైనట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో 60.73 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై లోకాయుక్తలో ఫిర్యాదుఎంజీఎం: వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు చేయాలనే ఒప్పందం, నష్టపోయిన అర్హులైన 400 మెడికల్ విద్యార్థులకు న్యాయం జరగాలని, అవినీతి అధికారులపై విచారణ చేపట్టాలని కోరుతూ వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకున్నా.. 400 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడం, ఈక్రమంలో గతేడాది అర్హులైన 400 మెడికల్ సీట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి దాటిపోవడంపై జరిగిన అవినీతిపై విచారణ కోసం లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసినట్లు వినియోగదారుల మండలి ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు. మధ్యవర్తిత్వ ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్గా వాణివరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వ కేసుల ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్ (స్పెషల్ జీపీ)గా న్యాయవాది పోలసాని వాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాసన – న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం మూడేళ్ల వరకు వర్తిస్తుందని, నెలకు రూ.60 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన పోలసాని వాణి 18 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె జీవిత భాగస్వామి శ్రీనివాసరెడ్డి కూడా న్యాయవాదే. ఈసందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంవరంగల్ స్పోర్ట్స్: గణతంత్ర (జనవరి 26) దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారు, అందుకు సంబంధించిన పత్రికల్లో ప్రచురితమైన ఫొటోలు, నాలుగు సెట్లను రూపొందించి జూలై 25లోగా హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న యువజన, క్రీడల కార్యాలయంలో అందజేయాలని కోరారు. అంతేకాకుండా www:https://padmaawards.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిర్ణీత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు. బాలల సంరక్షణే లక్ష్యంకాజీపేట అర్బన్: బాలల రక్షణే లక్ష్యంగా బాలల సంరక్షణ కేంద్రాలు పని చేయాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమకొండలోని ప్రభుత్వ బాలసదనం, ఫాతిమానగర్లోని డివైన్ మెర్సీ, స్పందన మానసిక దివ్యాంగుల కేంద్రాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులతో కలిసి తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించాలని, భవనాలకు ఫిట్నెస్ కలిగి ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సంస్థల నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అన్నమనేని అనిల్చందర్రావు, సభ్యుడు సందసాని రాజేంద్రప్రసాద్, ఇన్చార్జ్ డీసీపీఓ ప్రవీణ్కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.