breaking news
Warangal District Latest News
-
నేడు కన్నెపల్లికి కేటీఆర్
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్హౌస్(కన్నెపల్లి)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఆయనవెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బరాజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ బృందంతో కలిసి కేటీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు చేశారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం కన్నెపల్లి పంపుహౌస్, పరిసరాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీపంప్హౌస్ పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో పర్యటన -
ఉద్యోగాల పేరుతో దళారుల దందా!
●కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఇక వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారనుంది. మరో మూడునాలుగు నెలల్లో ఎంజీఎంను 24 అంతస్తుల భవనంలోకి మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు దళారులు కొత్త దవాఖానలో ఉద్యోగాలిప్పస్తామని దందా చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 788 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పత్రికల్లో వచ్చిందని వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు బయటివారితో కలిసి ఈ దందాకు శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త భవనం ప్రారంభం కాగానే పోస్టులను సిద్ధం చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని, అందులో ఉద్యోగాల భర్తీ చూసుకుంటామని నమ్మిస్తున్నట్లు చెబుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరం పెడుతూ, అడ్వాన్స్గా డబ్బులిస్తేనే జాబితాలో ఉంటారని చెబుతున్నారు. ఎంజీఎంలో ఇప్పుడున్న కాంట్రాక్టు ఈ నెలతోనే అయిపోతుందని, కొత్తవారు వచ్చేవరకు వారుంటారని, ఆ తర్వాత మీకే ఉద్యోగాలిప్పిస్తామని దళారులు బేరసారాలు సాగిస్తున్నట్లు చర్చి జరుగుతోంది. ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులు వారి మాట లు నమ్మకుండా ఎంజీఎంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వైద్యులను అడిగి క్లారిఫై చేసుకోవడంతో వారి దందా బయటపడుతోంది. అలాగే, ఎంజీఎంలో పనిచేసిన వారిని కూడా ఉద్యోగాలు, దళారుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకు ఈ ఉద్యోగాలకు జీఓ రాలేదు, పోస్టుల వివరాలు రాలేదు, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదు. నోటిఫికేషన్ కూడా రాకున్నా దళారుల మాయలో నిరుద్యోగులు పడే అవకాశం లేకపోలేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దు. దళారుల జోలికి వెళ్లి మోసపోవద్దు. ఎలాంటి ఉద్యోగాలైనా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఉద్యోగాల నియామకంపై ఎలాంటి సమాచారం లేదు. అనవసరంగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు దళారుల వలలో పడొద్దు. దళారుల సమాచారం తెలిస్తే కలెక్టర్, ఏసీబీ, ఇన్చార్జ్కు తెలియజేయండి. – డాక్టర్ రాంకుమార్రెడ్డి, ఎంజీఎం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొలువులు ఇప్పిస్తామని బేరసారాలు అడ్వాన్స్ డబ్బులు ఇస్తే జాబితాలో ఉంటారని నిరుద్యోగులకు గాలం ఎలాంటి పుకార్లు నమ్మొద్దని అధికారుల సూచన -
ఉద్యోగాల పేరుతో దళారుల దందా!
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఇక వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారనుంది. మరో మూడునాలుగు నెలల్లో ఎంజీఎంను 24 అంతస్తుల భవనంలోకి మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు దళారులు కొత్త దవాఖానాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని దందా చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 788 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పత్రికల్లో వచ్చిందని వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు బయటివారితో కలిసి ఈ దందాకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త భవనం ప్రారంభం కాగానే పోస్టులను సిద్ధం చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని, అందులో ఉద్యోగాల భర్తీ చూసుకుంటామని నమ్మిస్తున్నట్లు చెబుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరం పెడుతూ, అడ్వాన్స్గా డబ్బులిస్తేనే మా జాబితాలో ఉంటారని చెబుతున్నారు. ఎంజీఎంలో ఇప్పుడున్న కాంట్రాక్టు ఈ నెలతోనే అయిపోతుందని, కొత్తవారు వచ్చేవరకు వారుంటారని, ఆ తర్వాత మీకే ఉద్యోగాలిప్పిస్తామని దళారులు బేరసారాలు సాగిస్తున్నట్లు పులువురు చర్చించుకుంటున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు వారి మాటలు నమ్మకుండా ఎంజీఎంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వైద్యులను అడిగి క్లారిఫై చేసుకోవడంతో వారి దందా బయటపడుతోంది. అలాగే, ఎంజీఎంలో పనిచేసిన వారిని కూడా ఉద్యోగాలు, దళారుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకు ఈ ఉద్యోగాలకు జీఓ రాలేదు, పోస్టుల వివరాలు రాలేదు, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదు. నోటిఫికేషన్ కూడా రాకున్నా దళారుల మాయలో నిరుద్యోగులు పడే అవకాశం లేకపోలేదు. ఉద్యోగాలు ఇస్తామనే పుకార్లు నమ్మవద్దు.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దు. దళారుల జోలికి వెళ్లి మోసపోవద్దు. ఎలాంటి ఉద్యోగాలైనా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఉద్యోగాల నియామకంపై ఎలాంటి సమాచారం లేదు. అనవసరంగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు దళారుల వలలో పడొద్దు. దళారులు సమాచారం తెలిస్తే కలెక్టర్, ఏసీబీ, ఇన్చార్జ్ సూపరింటెండెంట్కు సమాచారం ఇవ్వాలి. – డాక్టర్ రాంకుమార్రెడ్డి, ఎంజీఎం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొలువులు ఇప్పిస్తామని బేరసారాలు అడ్వాన్స్ డబ్బులు ఇస్తే జాబితాలో ఉంటారని నిరుద్యోగులకు గాలం ఎలాంటి పుకార్లు, షికార్లు నమ్మవద్దని అధికారుల సూచన -
కోర్టు భవన పనుల పరిశీలన
వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలోని పాత మున్సిపాలిటీ భవనాన్ని మున్సిఫ్ కోర్టుకు కేటాయించి పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. జిల్లా జడ్జి నిర్మలాగీతాంబ శనివారం సందర్శించి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను వేగవంతంగా పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కోర్టు కార్యకలాపాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందు కు వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 18న ప్రత్యేక లోక్ అదాలత్వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈనెల 18న ప్రత్యేకలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఇరుపక్షాలు రాజీమార్గంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు పేర్కొన్నారు. దీనిపై మళ్లీ పైకోర్టుల్లో అప్పీలు చేసుకునే ఆవకాశం ఉండదని, వివాదానికి అక్కడితో పూర్తి ముగింపు పడుతుందని వివరించారు. డీఎల్ఎస్ఏను సంప్రదించి, కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని జడ్జి కోరారు. ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా దామోదరబాయి నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా దామోదరబాయి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ చంద్రశేఖర్ విధులు నిర్వర్తించారు. బాధ్యతలు స్వీకరించిన ఇన్చార్జ్ సూపరింటెండెంట్ దామోదరబాయికి హెచ్ఓడీలు, ప్రొఫెసర్, ఆర్ఎంఓలు, వైద్యు సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శాలువాలతో సన్మానించారు. అనధికార లేఔట్లపై చర్యలు వర్ధన్నపేట: అనధికార లేఔట్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా టౌన్ అండ్ ప్లానింగ్ ఆఫీసర్(డీటీసీపీఓ) జ్యోతి హెచ్చరించారు. మండలంలోని ఇల్లంద గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శనివారం ఆమె సందర్శించారు. పలు అభివృద్ధి పనులు, లేఔట్లు, పంచాయతీ రికార్డులు, పౌర సేవల చార్ట్ను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి శంకర్రావు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లౌఔట్కు అనుమతులు పొందాలన్నారు. అ భివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: క్రిసిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు కుట్టుమిషన్లు, ఈ–బైక్లు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జి మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ పథకం కోసం ఈనెల 18లోగాలోగా tgobmms. cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు భరోసా నిధుల జమ ఖిలా వరంగల్: జిల్లాలో 6 ఎకరాల్లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసిందని జిల్లా వ్యవసాయాఽధికారి విజయ నిర్మల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 1,55,396 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.145.99 కోట్లు భరోసా నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు. శాంతివనంలో అడవి బాదం నర్సంపేట: నర్సంపేటకు చెందిన వనప్రేమి గోకా రామస్వామి పది సంవత్సరాల క్రితం యానాం నుంచి తెచ్చిన అడవి బాదం విత్తనాన్ని శాంతివనంలో నాటాడు. 30 అడుగుల వరకు పెరిగిన ఆ చెట్టు ఇప్పుడు కాయలు కాస్తోంది. శనివారం గాలి వానకు కొన్ని కొమ్మలు విరిగాయి. వాటికి కాసిన ఈ కాయలు చూడడానికి బాలా బాగున్నాయి. లోపల ఉన్న తామర గింజల మాదిరిగా ఉన్నవాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. -
కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్ధంతి
న్యూశాయంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, జిల్లా అధికారులు, మాజీ కార్పొరేటర్ మరుపల్లి రవి పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలి న్యూశాయంపేట: ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి 85 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ పంటసాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు వెల్లడించారు. పంటమార్పిడి పద్ధతులు పాటిస్తూ, కూరగాయల సాగు ప్రోత్సహించాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఏఓ విజయనిర్మల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులను నియంత్రించాలి
హన్మకొండ అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గురుకుల విద్యాలయాల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆర్బీఎస్కే, ఐడీఎస్పీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి, పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, దోమల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో యూరియా, నీటి కొరత లేదు ‘వరంగల్, హనుమకొండ జిల్లాల్లో యూరియా కొరత లేదు. రానున్న 90 రోజుల పాటు తాగునీటి ఇబ్బందులు ఉండవు’ అని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పరిస్థితులను ఆయనకు వివరించారు. దొడ్డి కొమురయ్య ఆశయాలు ఆదర్శం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మానస రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు భీమారంలో టీబీ ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ హసన్పర్తి: క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో భీమారం పాత గ్రామపంచాయతీ ఆవరణలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్షయ–ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సందర్శించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మదన్మోహన్రావు, ట్రెయినీ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ రోహిత్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, తహసీల్దార్ కిరణ్కుమార్, వైద్యాధికారులు డాక్టర్ భరత్, డాక్టర్ మానస, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, టీబీ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి న్యూశాయంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈసందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, జిల్లా అధికారులు, మాజీ కార్పొరేటర్ మరుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా డాక్టర్ మదన్మోహన్
రామన్నపేట: హనుమకొండ డీఎంహెచ్ఓ రామ్కుమార్ వైద్యులు, సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలతో పెద్దఎత్తున ఉద్యోగులు ఆందోళన చేయడంతో సెలవులో వెళ్లిపోయారు. ఈక్రమంలో శనివారం ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా డాక్టర్ మదన్మోహన్ బాధ్యతలు తీసుకున్నారు. హసన్పర్తి డిప్యూటీ సివిల్ సర్జన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణారావును డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డిలతో పాటు ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. వరంగల్ క్రైం: ఆరోగ్యం బాగుండాలంటే దినచర్యలో మార్పు అవసరమని వరంగల్ సీపీ ఎస్.శ్వేత అన్నారు. శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్లో నిర్వహించిన వారాంతపు పరేడ్ను ఆమె పర్యవేక్షించారు. సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధత, శారీరక దృఢత్వంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్య పరిరక్షణకు రోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామం, యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు అంతయ్య, సత్యనారాయణ, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీశ్, శ్రీధర్, చంద్రశేఖర్, ఉదయ్భాస్కర్, ఇన్స్పెక్టర్లు వెంకన్న, సువర్ణ, సుజాత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూలో శనివారం మూడు విభాగాల్లో కంప్యూటర్సైన్స్, ఫిజిక్స్, కామర్స్ విభాగాల్లో డిపార్ట్మెంటల్ కమిటీలు, సబ్జెక్టుల ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. హాజరైన అభ్యర్థులకు డెమోలు నిర్వహించారు. కామర్స్ విభాగంలో ఇంటర్వ్యూలకు 69 మంది అభ్యర్థులను పిలవగా 58 మంది, ఫిజిక్స్లో 16 మంది అభ్యర్థులకుగాను 9 మంది, కంప్యూటర్ సైన్స్లో 19 మందికి 14మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఖిలా వరంగల్: ఈనెల 6న వరంగల్ ఎంజీఎం జంక్షన్లోని వెంటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ (వీసీసీ)లో పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ నిరోధక టీకాలు వేయనున్నట్లు ఎంజీఎం సమీపంలోని పశువైద్య శాల డాక్టర్ అంబిక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధి పశువైద్య కళాశాల మామునూరు, వరంగల్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు వేయించాలని కోరారు. వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈనెల 18న ప్రత్యేకలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎల్ఎస్ఏను సంప్రదించి, కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని జడ్జి కోరారు. న్యూశాయంపేట: క్రిసిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు కుట్టుమిషన్లు, ఈ–బైక్లు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈపథకం కోసం ఈనెల 18లోగాలోగా tgobmms. cgg. gov.inలో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. -
‘సర్’ను పారదర్శకంగా పూర్తి చేయాలి
న్యూశాయంపేట/ఖిలా వరంగల్: ‘సర్’ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలని అదనపు ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాకు శనివారం వచ్చిన ఆయనకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద మొక్క అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్తో కలిసి సర్ అమలు తీరుపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజవర్గంలోని ఖిలా వరంగల్ మండలంలో ఆర్డీఓ సుమ, ఏఓ ఫణికుమార్, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్తో కలిసి శనివారం ఆయన సర్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటి సర్వే, ఓటరు వివరాల ఽధ్రువీకరణ, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులు తప్పనిసరిగా ఓటరు జాబితాలో ఉండేలా చూడా లని, ఎన్నికల సంఘం నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. -
నేడు కన్నెపల్లికి కేటీఆర్
● ఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు ● లక్ష్మీపంప్హౌస్ పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో పర్యటన కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్హౌస్(కన్నెపల్లి)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఆయనవెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బరాజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ బృందంతో కలిసి కేటీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు చేశారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం కన్నెపల్లి పంపుహౌస్, పరిసరాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. -
● ఒప్పించారు.. మెప్పించారు
బడి బాగుంటే భవిష్యత్ బాగుంటుందని నమ్మారు. ఎంఈఓ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ముక్తకంఠంతో బడిని బతికించాలని నినదించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే లాభాలేంటో వివరించారు. మొత్తానికి ఏళ్లుగా మూతబడి ఉంటున్న పాఠశాలలకు పునర్జీవం పోశారు. మూతబడిన వాటిని ముందుండి నిలబెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది పునఃప్రారంభమైన పాఠశాలలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలో మూతబడిన పలు సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం తెరిపించడంలో సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులది కీలకపాత్ర సత్ఫలితాలిచ్చిన జయశంకర్ బడిబాట ఒనగూరే ప్రయోజనాలు వివరించడంతో సక్సెస్ -
పత్తి ఉత్పాదకత పెంపే లక్ష్యం
● రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ ● పక్కాగా ‘కపాస్ కాంతి మిషన్’ అమలు ● 1300 హెక్టార్లలో క్లోజర్ స్పేసింగ్ ప్రదర్శన క్షేత్రాలుఖిలా వరంగల్: పత్తి సాగులో ఉత్పాదకత పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ కపాస్ కాంతి మిషన్ పథకం ప్రవేశ పెట్టింది. 2026–27 నుంచి 2030–31 వరకు ఈ పథకం అమలు చేయనుంది. ఈ పథకంలో భాగంగా ఎంపికై న రైతులకు ఉచితంగా నాణ్యమైన పత్తి విత్తనాలు అందించి, ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించనున్నారు. పత్తి ఉత్పాదకతను హెక్టారుకు 755 కిలోల లింట్ వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ దూరంలో పత్తి సాగు.. తక్కువ దూరంలో పత్తిని విత్తే ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నారు. (క్లోసర్ స్పేసింగ్) విధానంతో 1,300 హెక్టార్లలో ఎంపిక చేసిన 3,250 ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు రూ.182 కోట్ల నిధులు కేటాయించారు. ఈ ప్రదర్శన క్షేత్రాల్లో పాల్గొనే రైతులకు ఉచితంగా విత్తనాలు అందించి శాసీ్త్రయ పద్ధతిలో సాగు చేయించనున్నారు. దీంతో ఎకరాకు మొక్కల సంఖ్య పెరిగి దిగుబడి అధికమవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల పేర్కొన్నారు. 500 ఎకరాల్లో సమగ్ర పంట యాజమాన్యం జిల్లాలోని 13 మండలాల్లో 200 హెక్టార్లలో సమగ్ర పంట యాజమాన్యం (ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్) కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు రూ.15లక్షల నిదులు ప్రభుత్వం కేటాయించింది. ఈ పద్ధతిలో ఎరువుల సమతుల్య వినియోగం, పురుగుల సమగ్ర నివారణ, నీటి నిర్వహణ, పంట సంరక్షణ వంటి అంశాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈమిషన్లో విత్తనాల పంపిణీతోపాటు రైతులకు శాసీ్త్రయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. సద్వినియోగం చేసుకోండి : డీఏఓ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న నాణ్యమైన విత్తనాలను రైతులంతా సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయ నిర్మల సూచించారు. పలు మండలాల్లో పత్తి విత్తనాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలన
హన్మకొండ అర్బన్: జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి బాలసముద్రం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం బీఎల్ఓలతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి కాజీపేట అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అడిషనల్ సీఈఓ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కాజీపేట మండలం న్యూశాయంపేటలో శనివారం సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అడిషనల్ సీఈఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు సీహెచ్.రాజు, రవీందర్రెడ్డి, అదనపు తహసీల్దార్ రమేశ్, ఆర్ఐ శివ, డీసీసీ కార్యవర్గ సభ్యుడు మామిండ్ల సురేశ్, బీఎల్ఓలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. -
వర్షాకాలంలో ఇబ్బందులు కలగొద్దు
గ్రేటర్ కమిషనర్ వెంకన్న కాశిబుగ్గ: వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నాలాలు, చెరువులు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండలోని ఎస్బీహెచ్ కాలనీ, వడ్డేపల్లి చెరువు, సమ్మయ్యనగర్, బృందావన్ కాలనీ, పద్మాక్షమ్మ ఆలయ పరిసరాలతో పాటు వరంగల్లోని బొందివాగు, అంబేడ్కర్నగర్, కరీమాబాద్, చిన్న వడ్డేపల్లి చెరువు, ఆటోనగర్ ప్రాంతాల్లో పర్యటించి పనులు పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని, పూడిక, చెత్త తొలగించాలని ఆదేశించారు. -
మేడారంలో విషాదం.. కారు ఢీకొని బాలుడి మృతి
హైదరాబాద్: వరంగల్ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి కుటుంబంతో వచ్చిన ఓ బాలుడిని ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో మృతి చెందాడు. నార్లాపూర్ ఎస్ఐ అచ్చ కమలాకర్ తెలిపిన మేరకు.. అమీర్పేటకు చెందిన అలిమేకల పురుషోత్తం కుటుంబంతో కలిసి శుక్రవారం మేడారానికి వెళ్లి ఎంఎస్ఆర్ గదిలో దిగారు.చేవెళ్ల మండలం ఏలూరు గ్రామానికి చెందిన అరకటిక అరుణ్ కుటుంబం కూడా పక్కగదిలో దిగింది. ఈ క్రమంలో అరుణ్ నాలుగేళ్ల కుమారుడు తండ్రి వద్ద ఉన్న కారు తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. ఆ సమయంలో గది ముందు ఆడుకుంటున్న కౌశిక్ (7)పైకి కారు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం కంటతడి పెట్టించింది. మరోవైపు, ప్రమాదానికి కారణమైన చిన్నారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మృతుడి తండ్రి పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. -
20 ఏళ్ల తర్వాత పాఠశాల పునఃప్రారంభం
గీసుకొండ: సూర్య తండాలో 20 సంవత్సరాల క్రితం మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎట్టకేలకు తెరుచుకుంది. సర్పంచ్ బానోత్ రాఘవేంద్ర ప్రత్యేక చొరవ తీసుకుని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు, గీసుకొండ మండల విద్యాశాఖధికారి రవీందర్తో కలిసి పునఃప్రారంభించారు. అనంతరం డీఈఓ, ఎంఈఓ పాఠశాలను పరిశీలించి నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తులతో మాట్లాడి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవాభావం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాల గురించి వివరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించే తల్లిదండ్రుల ఇంటి పన్ను, నల్లా పన్నులు గ్రామపంచాయతీకి తానే చెల్లిస్తానని సర్పంచ్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 20 ఏళ్ల తర్వాత పాఠశాల పునః ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా నియమితులైన ఇద్దరు ఉపాధ్యాయులు, గీసుకొండ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శరత్, సూర్య తండా ఉపసర్పంచ్ వాంకుడోత్ రాధ, గ్రామపంచాయతీ కార్యదర్శి వీరేశ్కుమార్, కాంగ్రెస్ గ్రామ మాజీ అధ్యక్షుడు లావుడియా రాజన్న, పాలకవర్గ సభ్యులు, గ్రామలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కీటక జనిత వ్యాధులను నియంత్రించాలినర్సంపేట: ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి, కీటక జనిత వ్యాధులను నియంత్రించాలని జిల్లా మలేరియా అధికారి రజిని సూచించారు. నర్సంపేట డివిజన్ పరిధిలోని పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు కీటక జనిత వ్యాధులు మలేరియా, డెంగీపై అవగాహన కల్పించాలన్నారు. దోమ పుట్టకుండా, కుట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదైన డెంగీ, మలేరియా కేసుల గురించి సమీక్షించి విధుల్లో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. సబ్ యూనిట్ ఆఫీసర్ జేతురాం, హెచ్ఈఓ సదానందం, సూపర్వైజర్లు దామోదర్రెడ్డి, రాజు, కీర్యా, హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, టీహబ్ సిబ్బంది పాల్గొన్నారు. పాడి గేదెలతో స్థిరమైన ఆదాయంసంగెం/గీసుకొండ: రైతులు వ్యవసాయంతోపాటు పాడి గేదెల పెంపకంతో స్థిరమైన ఆదాయం పొందవచ్చునని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సభ్యులు రాజేశ్వరి అన్నారు. సంగెం మండల కేంద్రంలోని విజయ డెయిరీ, చింతలపల్లి, గీసుకొండ మండలం మరియపురం, ఊకల్ హవేలీ గ్రామాలను శుక్రవారం ఆమె సందర్శించారు. పాడి రైతులను కలిసి క్షేత్రస్థాయిలో పరకాల డెయిరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాడి పశువులు, పాల దిగుబడి, మార్కెటింగ్, పాల నాణ్యత తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు మేనేజర్ డాక్టర్ అరుణ్, అంజనాశేషు, డిప్యూటీ మేనేజర్ డాక్టర్ రాజేశ్వర్రావు, డీఆర్డీఓ నాగపద్మజ, ఏడీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి బాలకృష్ణ, ఇందిరా మహిళా డెయిరీ జీఎం కృష్ణ, డీపీఎం వరలక్ష్మి, ఏపీఎంలు సారయ్య, ఈశ్వరయ్య, రాజ్కుమార్, సంగెం మండల సమాఖ్య అధ్యక్షురాలు ఉమాదేవి, గీసుకొండ ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక, కాంగ్రెస్ సంగెం మండల అధ్యక్షుడు ఇండ్ల రవికుమార్, నాయకులు మాధవరెడ్డి, బండి రాధిక, సీసీలు సురేశ్, నర్సయ్య, శ్రీలత, మరియపురం సర్పంచ్ తిరుమలరెడ్డి అర్పితరెడ్డి, దిలీప్రెడ్డి, ఉపసర్పంచ్ శివప్రసాద్, వీఓ జ్యోతి, సంధ్య, వీఓఏలు జయలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో మార్కెట్లోకి డెయిరీ ఉత్పత్తులు
పరకాల: త్వరలో మార్కెట్లోకి పరకాల ఇందిరా మహిళా డెయిరీ పాల ఉత్పత్తులు రానున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి వెల్లడించారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎన్డీడీబీ అధికారులతో పాటు డీఆర్డీఏ అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సమీక్ష నిర్వహించారు. పరకాల ఇందిరా మహిళా డెయిరీ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమంలో ఎన్డీడీబీ, సెర్ప్ అధికారులు, సంబంధిత అధికారులతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన పరకాల పట్టణ శివారులోని పెద్ద రాజీపేట వద్ద జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి గురించి తెలుసుకున్న ఆయన పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు వల్ల స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా డెయిరీకీ ఎన్డీడీబీ మద్దతు అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి సమీక్ష -
జేఎన్ఎస్ను సందర్శించిన సీపీ
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత శుక్రవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. ఈసందర్భంగా హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ సీపీకి స్వాగతం పలికి స్టేడియంలోని క్రీడా వసతులు వివరించారు. అనంతరం కమిషనర్ స్టేడియం ఆవరణతో పాటు స్విమ్మింగ్ పూల్ను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి డీవైఎస్ఓను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులతో కమిషనర్ ముచ్చటించారు. కార్యక్రమంలో వరంగల్ డీఎఫ్ఓ, ములుగు డీఎఫ్ఓ, స్టేడియం సిబ్బంది, కోచ్లు, క్రీడాకారులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో ప్రతిభ కనబర్చి హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 4, 7న రిపోర్ట్ చేయాలని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న 40 మంది బాలికలకు జూలై 4న, 40 మంది బాలురకు జూలై 7న జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, హనుమకొండలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ధ్రువపత్రాలు, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అడ్మిషన్ పూర్తయిన వెంటనే హాస్టల్లో చేరాల్సి ఉటుందని, లగేజీతో హాజరుకావాలని పేర్కొన్నారు. రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి కళాశాలలో తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. హసన్పర్తి: ఇందిరమ్మ రాజ్యం అంటే కూల్చివేతలా.. ఓటు వేసి గెలిపిస్తే రోడ్డున పడేస్తారా అని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని 2వ డివిజన్ గుండ్లసింగారంలో అధికారులు ఇటీవల కూల్చిన ఇళ్లను శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర పహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావుతో కలిసి సందర్శించారు. వంటవార్పు కార్యక్రమం చేస్తున్న గుడిసెవాసులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహ, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్.స్టాలిన్, జిల్లా కార్యవర్గసభ్యులు రాములు, లక్ష్మణ్, సదానందం, భి క్షపతి, రాజేందర్, మొగిలి, గోపాల్ ఉన్నారు. వెలుగుల తల్లి సన్నిధిలో చీకట్లుహన్మకొండ కల్చరల్: కోట్ల రూపాయల ఆదాయం లభించే ఈ దేవాలయంలో చాలా రోజుల నుంచి జనరేటర్ పనిచేయట్లేదు. బ్యాటరీ, ఇన్వర్టర్ కూడా పనిచేయట్లేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు రాత్రి 8 గంటల వరకు దేవాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్చకులు చమురుతో దీపాలు వెలిగించి అమ్మవారికి పూజలు జరిపారు. ఈవిషయంపై సిబ్బందిని ప్రశ్నించగా.. మాడవీధుల నిర్మాణంలో భాగంగా కొత్త జనరేటర్ను తగిన చోట అమర్చాల్సి ఉందని తెలిపారు. భక్తులు చీకట్లోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. -
స్నేహం పేరిట నమ్మక ద్రోహం
రవి–శిరీష దంపతులు (ఫైల్)చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బుడిగె రవి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి హైదరాబాద్కు వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రంగంలో అనుభవం వచ్చాక హైదరాబాద్లోని హయత్నగర్లో ఒక బియ్యం దుకాణం పెట్టుకున్నాడు. తర్వాత కేసముద్రం మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. హయత్నగర్లో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్ల లను చదివిస్తున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ సాధించానని సంబరపడుతున్న సమయంలో రవి–శిరీష దంపతులకు కొంత మందితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్షిప్లా మారింది. ఓ వ్యక్తి, అతడి భార్య.. రవి, శీరిష దంపతులను తమ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని మాటిచ్చారు. లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా భాగస్వామ్యం ఇవ్వకపోగా.. ప్రశ్నించిన రవి దంపతులను బెదిరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘట్కేసర్ బీబీనగర్ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని చెట్ల పొదల్లో పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.అమ్మా, నాన్న లేండి.. రవి, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు తొమ్మిదేళ్ల సుశాంత్, ఆరేళ్ల విద్వాంస్ అనాథలయ్యారు. ‘అమ్మా, నాన్న లేండి’ అంటూ చిన్నారులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు. -
మాకు దిక్కెవరు?
‘అమ్మానాన్న.. మమ్మల్ని స్కూల్కు ఎవరు పంపిస్తారు? కొసరి.. కొసరి గోరుముద్దలెవరు తినిపిస్తారు? తమ్ముడిని, నన్ను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు’ అంటూ రవి, శిరీష దంపతుల కుమారులు సుశాంత్, విద్వాన్ష్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా, వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బులు వసూల్ చేయడానికి పడుతున్న ఇబ్బందుల వల్ల ఇద్దరు భార్యాభర్తలు 20 రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారని, కనీసం తిండి కూడా సక్రమంగా తినట్లేదని ఇరుగుపొరుగు వారు తెలిపినట్లు మృతుడి బంధువులు చర్చించుకుంటున్నారు. -
వినూత్న డిజైన్లతో వస్త్రాలు తయారు చేయాలి
కాజీపేట అర్బన్: మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలు తయారు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండలోని ఇండస్ట్రియల్ పార్క్లోని కాకతీయ టెక్స్టైల్ పార్క్, వివర్స్ వెల్ఫేర్స్ పొదుపు పరపతి పరస్పర సహాయక సంఘం, ఐటీ సెజ్, గ్రానైట్ పరిశ్రమలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ.. 164 యూనిట్లతో ఉన్న టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక టె క్నాలజీతో గ్రానైట్, మార్బుల్స్ తయారు చేయడం అభినందనీయమని అన్నారు. ఐటీ సెజ్లో పని చేస్తున్న యువత ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్కుమార్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి నాయక్, కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి.. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ చాహత్ తెలిపారు. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఇండస్ట్రియల్ పార్క్లో విస్తృత పర్యటన -
‘భద్రకాళి’ సాక్షిగా ప్రమాణాల రభస
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలం, టెండర్ల వ్యవహారం శుక్రవారం వరంగల్ నగరంలో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ‘కుడా’భూముల వేలంలో అ క్రమాలు జరిగాయని ఆరోపిస్తూ భద్రకాళి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించగా, దీనికి ప్రతిగా కుడా చైర్మ న్ వెంకట్రాంరెడ్డి అదే ఆలయంలో ప్రమాణం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరు వర్గాల కార్యక్రమాల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో భద్రకాళి ఆలయం వద్ద హైడ్రామా నెలకొంది. చన్నీటి స్నానం.. అరెస్టుతో హైడ్రామా శుక్రవారం ఉదయం భద్రకాళి ఆలయానికి చేరుకున్న కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆలయ సమీపంలో చన్నీటితో స్నానం చేసి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మర్రి యాదవరెడ్డిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యాదవరెడ్డిని తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసు వాహనంలోనుంచే మర్రి యాదవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం సత్యానికి భయపడి అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆలయంలో ప్రమాణం చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విమర్శలు, ప్రతివిమర్శలు.. ● కుడా లేఅవుట్, టెండర్ల వ్యవహారంలో నూటికి నూరు శాతం అక్రమాలు జరిగాయని, ఫార్మసిస్టులు, వైద్యులు, ఎన్నారైలను బెదిరించి వేలంలో పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. గజం రూ.1.50 లక్షలు పలికే భూమిని సిండికేట్ ద్వారా రూ.60 నుంచి రూ.65 వేలకే కట్టబెట్టారని పేర్కొన్నారు. ప్రమాణం చేసేందుకు వచ్చిన కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఎలాంటి పిలుపు ఇవ్వని తననూ పోలీసులు నిర్బంధించారని విమర్శించారు. ● బీఆర్ఎస్ నేతల విమర్శలపై స్పందించిన ఇనగాల వెంకట్రాంరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కుడాలో జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరుగుతోందని తెలిపారు. బాలసముద్రంలో రూ.150 కోట్ల విలువైన కుడా భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించారని ఆరోపించారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్పై కుడా నిధుల వినియోగం, వెంచర్ల పేరిట జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.‘కుడా’ భూముల వేలం, టెండర్లపై దుమారం అవినీతి జరిగిందని బీఆర్ఎస్.. జరగలేదని కాంగ్రెస్ పరస్పర సవాళ్లు చన్నీటి స్నానాలు, పసుపు నీళ్లతో శుద్ధి.. అరెస్టులు, ఆందోళనలు వరుస పరిణామాలతో భద్రకాళి దేవస్థానం వద్ద హైడ్రామా చన్నీటి స్నానం చేస్తున్న కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి -
వరంగల్
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 20267స్నేహితులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే.. అతను మాత్రం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు. చిన్నప్పటి నుంచి తాను ప్రత్యక్షంగా అనుభవించిన పేదరికాన్ని జయించాలనుకున్నాడు. హైదరాబాద్ వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. అనుభవాన్ని మూటగట్టుకుని సొంతంగా రైస్ షాపు ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాడు. పేదరికాన్ని తరిమేశాననుకుంటున్న తరుణంలో స్నేహం రూపంలో మోసం ఎదురైంది. చివరికి ఆ స్నేహ బంధం ప్రాణాలనే హరించింది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నారు. – చెన్నారావుపేటభరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకొని మోసం అనాథలైన వారి ఇద్దరు కుమారులు చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం -
నిఘా సరే.. బ్యాకప్ ఏది?
కాజీపేట అర్బన్: వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నా.. బ్యాకప్ లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. చూసి తరించేందుకు తప్ప ఏదైనా ఘటన జరిగితే రికార్డు చేసి తెలిపేలా కెమెరాలకు బ్యాకప్ లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతీ రోజు జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు భూక్రయవిక్రయదారులు, కార్యాలయ సిబ్బంది కార్యకలాపాలు రికార్డు చేయడంతోపాటు అక్రమాలను నిఘా నేత్రం గమనిస్తుందనే భయం ఉంటే ఎలాంటి పొరపాట్లకు తావుండదు. అన్ని కెమెరాలూ అంతే.. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ల ఎదురుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కెమెరా కనిపెడుతూ మానిటర్లో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. కానీ, సబ్ రిజిస్ట్రార్ల ఎదురుగా ఉన్న రెండు సీసీ కెమెరాలు ఎప్పుడు పని చేస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ అవి పని చేసినా రికార్డు కాదు.. దీంతో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు మళ్లీ ఫుటేజీ చూసుకునే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ, రికార్డు సెక్షన్లోనూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం సరిగ్గా పనిచేయకపోవడంతో భూక్రయవిక్రయదారులు తమను వేధిస్తున్న వారిని పట్టించేందుకు తోడ్పడని సీసీ కెమెరాలు ఉన్నా.. లేకున్నా ఒకటే కదా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు సెక్షన్లో దస్త్రాలకు భద్రత కరువు ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానమని నానుడి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విలువైన, ఏళ్లనాటి దస్త్రాలను భద్రపర్చే రికార్డు సెక్షన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ, వీటికి బ్యాకప్ లేక దస్త్రాలకు భద్రత లేకుండాపోయింది. ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో నిఘా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలకు బ్యాకప్ ఏర్పాటు చేయాలని భూక్రయవిక్రయదారులు కోరుతున్నారు. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలకు లేని బ్యాకప్ రికార్డు సెక్షన్లోని దస్త్రాలకు భద్రత కరువు -
సర్ జోరు..!
సాక్షి, వరంగల్: జిల్లా పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,76,953 మంది ఓటర్లకు సంబంధించి ప్రక్రియ చేపట్టగా.. ఇప్పటివరకు 92.88 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. 795 మంది బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఓటర్ల నుంచి తిరిగి వచ్చిన ఫారాలను డిజిటలైజేషన్ చేసి పరిశీలించే ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఈసీ నిర్దేశించిన గడువులోపు ప్రతి ఓటరును చేరుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. తదుపరి దశపై అధికారుల దృష్టి.. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో దరఖాస్తుల పంపిణీ దాదాపు పూర్తి అయ్యింది. ప్రస్తుతం అధికారులు తిరిగి వచ్చిన ఫారాల ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల మ్యాపింగ్, స్వీయ మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తున్నారు. అర్హులైన ప్రతిఓటరు పేరు తుది జాబితాలో ఉండేలా ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేస్తున్నారు. జిల్లాలో 7.76 లక్షల మందికి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటివరకు 8,254 దరఖాస్తులు ఓటర్ల నుంచి స్వీకరణ క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరుగుతున్న 795 మంది బీఎల్ఓలు నియోజకవర్గాల వారీగా పురోగతి ఇలా.. నియోజకవర్గం ఓటర్లు ఫారాల డిజిటలైజేషన్ అందిన బీఎల్ఓ పంపిణీ ఫారాలు పరిశీలన నర్సంపేట 2,40,244 2,30,167 2,34,682 5,249 2,978 వరంగల్ తూర్పు 2,60,437 2,36,481 2,58,379 677 364 వర్ధన్నపేట 2,76,272 2,54,978 2,73,287 2,328 1,159 మొత్తం 7,76,953 7,21,626 7,66,348 8,254 4,501 -
చారిత్రక సంపదను సంరక్షించాలి
● సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ● తల్లిదండ్రులతో కలిసి నెక్కొండ గురుద్వార్లో పూజలునెక్కొండ: మండల కేంద్రంలోని గురుద్వార్లో ఉన్న 200 సంవత్సరాల నాటి పవిత్ర గ్రంథం, చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకు సంరక్షించాల్సిన అవసరం ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ (డీఐజీ) సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన తల్లిదండ్రులతో కలిసి గురుద్వార్ను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డీఐజీ, వారి కుటుంబ సభ్యులకు సిక్కు మతపెద్దలు స్వాగతం పలికారు. అనంతరం గురుద్వార్లోని 200 ఏళ్లనాటి పవిత్ర గ్రంథాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించారు. ఈ సందర్భంగా సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మాట్లాడుతూ గురుద్వార్లోని ఆధ్యాత్మిక వాతావరణం ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. సిక్కు సంఘం సభ్యులను కలిసి గురుద్వార్ చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత, గ్రంథం ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నెక్కొండ సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేందర్, గురుద్వార్ నిర్వాహకులు సర్దార్ దర్బార్సింగ్, సర్దార్ ప్రేంసింగ్ తదితరులు పాల్గొన్నారు. నేడు పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లు రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి కళాశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులు, చెల్లించాల్సిన ఫీజు, అవసరమైన ఇతర పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. సమయానికి హాజరై అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. -
స్నేహం పేరిట నమ్మక ద్రోహం
రవి–శిరీష దంపతులు (ఫైల్)చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బుడిగె రవి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి హైదరాబాద్కు వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రంగంలో అనుభవం వచ్చాక హైదరాబాద్లోని హయత్నగర్లో ఒక బియ్యం దుకాణం పెట్టుకున్నాడు. తర్వాత కేసముద్రం మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. హయత్నగర్లో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్ల లను చదివిస్తున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ సాధించానని సంబరపడుతున్న సమయంలో రవి–శిరీష దంపతులకు కొంత మందితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్షిప్లా మారింది. ఓ వ్యక్తి, అతడి భార్య.. రవి, శీరిష దంపతులను తమ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని మాటిచ్చారు. లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా భాగస్వామ్యం ఇవ్వకపోగా.. ప్రశ్నించిన రవి దంపతులను బెదిరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘట్కేసర్ బీబీనగర్ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని చెట్ల పొదల్లో పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.అమ్మా, నాన్న లేండి.. రవి, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు తొమ్మిదేళ్ల సుశాంత్, ఆరేళ్ల విద్వాన్ష్ అనాథలయ్యారు. ‘అమ్మా, నాన్న లేండి’ అంటూ చిన్నారులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు. -
‘భద్రకాళి’ సాక్షిగా ప్రమాణాల రభస
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలం, టెండర్ల వ్యవహారం శుక్రవారం వరంగల్ నగరంలో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ‘కుడా’భూముల వేలంలో అ క్రమాలు జరిగాయని ఆరోపిస్తూ భద్రకాళి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించగా, దీనికి ప్రతిగా కుడా చైర్మ న్ వెంకట్రాంరెడ్డి అదే ఆలయంలో ప్రమాణం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరు వర్గాల కార్యక్రమాల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో భద్రకాళి ఆలయం వద్ద హైడ్రామా నెలకొంది. చన్నీటి స్నానం.. అరెస్టుతో హైడ్రామా శుక్రవారం ఉదయం భద్రకాళి ఆలయానికి చేరుకున్న కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆలయ సమీపంలో చన్నీటితో స్నానం చేసి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మర్రి యాదవరెడ్డిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యాదవరెడ్డిని తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసు వాహనంలో నుంచే మర్రి యాదవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం సత్యానికి భయపడి అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆలయంలో ప్రమాణం చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విమర్శలు, ప్రతి విమర్శలు.. ● కుడా లేఔట్, టెండర్ల వ్యవహారంలో నూటికి నూరు శాతం అక్రమాలు జరిగాయని, ఫార్మసిస్టులు, వైద్యులు, ఎన్నారైలను బెదిరించి వేలంలో పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. గజం రూ.1.50 లక్షలు పలికే భూమిని సిండికేట్ ద్వారా రూ.60 నుంచి రూ.65 వేలకే కట్టబెట్టారని పేర్కొన్నారు. ప్రమాణం చేసేందుకు వచ్చిన కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఎలాంటి పిలుపు ఇవ్వని తననూ పోలీసులు నిర్బంధించారని విమర్శించారు. ● బీఆర్ఎస్ నేతల విమర్శలపై స్పందించిన ఇనగాల వెంకట్రాంరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కుడాలో జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరుగుతోందని తెలిపారు. బాలసముద్రంలో రూ.150 కోట్ల విలువైన కుడా భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించారని ఆరోపించారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్పై కుడా నిధుల వినియోగం, వెంచర్ల పేరిట జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.‘కుడా’ భూముల వేలం, టెండర్లపై దుమారం అవినీతి జరిగిందని బీఆర్ఎస్.. జరగలేదని కాంగ్రెస్ పరస్పర సవాళ్లు చన్నీటి స్నానాలు, పసుపు నీళ్లతో శుద్ధి.. అరెస్టులు, ఆందోళనలు వరుస పరిణామాలతో భద్రకాళి దేవస్థానం వద్ద హైడ్రామా చన్నీటి స్నానం చేస్తున్న కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి -
మాకు దిక్కెవరు?
‘అమ్మానాన్న.. మమ్మల్ని స్కూల్కు ఎవరు పంపిస్తారు? కొసరి.. కొసరి గోరుముద్దలెవరు తినిపిస్తారు? తమ్ముడిని, నన్ను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు’ అంటూ రవి, శిరీష దంపతుల కుమారులు సుశాంత్, విద్వాన్ష్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా, వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బులు వసూల్ చేయడానికి పడుతున్న ఇబ్బందుల వల్ల ఇద్దరు భార్యాభర్తలు 20 రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారని, కనీసం తిండి కూడా సక్రమంగా తినట్లేదని ఇరుగుపొరుగు వారు తెలిపినట్లు మృతుడి బంధువులు చర్చించుకుంటున్నారు. -
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026
స్నేహితులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే.. అతను మాత్రం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు. చిన్నప్పటి నుంచి తాను ప్రత్యక్షంగా అనుభవించిన పేదరికాన్ని జయించాలనుకున్నాడు. హైదరాబాద్ వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. అనుభవాన్ని మూటగట్టుకుని సొంతగా రైస్ షాపు ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాడు. పేదరికాన్ని తరిమేశాననుకుంటున్న తరుణంలో స్నేహం రూపంలో మోసం ఎదురైంది. చివరికి ఆ స్నేహ బంధం ప్రాణాలనే హరించింది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నారు. – చెన్నారావుపేటభరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకుని మోసం.. అనాథలైన ఇద్దరు చిన్నారులు వరంగల్ జిల్లా పాపయ్యపేటలో విషాదం -
బీఎల్ఓలు ఇళ్లను సందర్శించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బీఎల్ఓలు తమ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఇళ్లను స్వయంగా సందర్శించి ఓటరు వివరాలను నమోదు చేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత శాతం సర్ పూర్తయ్యింది, ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయో ఈఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ట్రాన్స్జెండర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి నియోజకవర్గంలో కొందరు ట్రాన్స్జెండర్లు సర్ నమోదుకు ముందుకు రావడంలో సంకోచిస్తున్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ ప్రతి పౌరుడికి ఓటు రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపారు. ట్రాన్స్జెండర్లు కూడా దేశ పౌరులేనని, వారికి సర్పై అవగాహన కల్పించి వంద శాతం నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు పి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ టీం సభ్యుల తనిఖీకాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ టీం సభ్యులు తనిఖీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ టి.పద్మావతి, డీటీ జాకీర్ హుస్సేన్ ఇంటింటికి ఫారాల పంపిణీ, పూర్తి చేయడం, యాప్ తీరును శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అలాగే, పలు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, సూపర్వైజర్ వంశీ, సిబ్బంది ఉన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలోని ప్రతీ సీడీపీఓ తన పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్ప న, పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాలపై సీడీపీఓలు, సంక్షేమాధికారితో గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీడీపీఓలు నెలకు కనీసం 150 కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. పిల్లలతో మాట్లాడడం, వంటశాల పరిశుభ్రత, స్టాక్ పరిశీలన, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించి ఫొటోలు నివేదికలను అదేరోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కొందరు సీడీపీఓలు విధుల్లో నిర్లక్ష్యం వహించడం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేస్తున్న సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లను అభినందించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. సీపీని కలిసిన వరంగల్ కలెక్టర్ న్యూశాయంపేట: వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతను కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసమస్యల సత్వర పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన అవసరాన్ని ఇరువురు అధికారులు ప్రస్తావించారు. -
ఫీవర్.. ఫియర్
● ఆరు నెలల్లో జ్వరాల విజృంభణ ● జిల్లాలో 4,205 కేసులు నమోదు ● వానాకాలంతో సీజనల్ వ్యాధుల ముప్పు ● అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులుసాక్షి, వరంగల్: వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశముంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలవరకు సాధారణ జ్వరాలు, విరేచనాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్ వంటి రోగాలు జనాలను బెంబెలెత్తించాయి. ఆరు నెలల్లో అత్యధికంగా 4,205 జ్వరాల కేసులు నమోదయ్యాయి. అనంతరం అక్యూట్ డయేరియల్ డిసీజ్ (విరేచనాలు) 3,087 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 1,008, టైఫాయిడ్ 218 కేసులు నమోదయ్యాయి. డెంగీ కేసులు ఇప్పటివరకు 27, మలేరియా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. వైరల్ హెపటైటిస్, హెచ్1ఎన్1, చికున్గున్యా వంటి వ్యాధులు నమోదుకాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. జూలైలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య విభాగం అధికారులు సూచిస్తున్నారు. సీజన్లో కలుషిత నీరు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా ఈ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ● ఏప్రిల్లో అత్యధికంగా 828 జ్వరాల కేసులు నమోదయ్యాయి. ● మే నెలలో విరేచనాల కేసులు 964కు చేరాయి. ● జనవరి, ఫిబ్రవరి, మార్చిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా నమోదై తర్వాత తగ్గుముఖం పట్టాయి. ● ఏప్రిల్లో 52 కేసులతో టైఫాయిడ్ గరిష్ట స్థాయికి చేరింది. ● ఇప్పటివరకు డెంగీ 27 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ● ఆరు నెలల్లో మలేరియా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. నెల జ్వరాలు విరేచనాలు శ్వాసకోశ టైఫాయిడ్ డెంగీ ఇన్ఫెక్షన్లుజనవరి 745 394 257 31 4 ఫిబ్రవరి 637 242 221 26 8 మార్చి 772 426 254 44 8 ఏప్రిల్ 828 584 115 52 2 మే 672 964 92 38 4 జూన్ 551 477 69 27 1 మొత్తం 4,205 3,087 1,008 218 27ఆస్పత్రుల్లో రద్దీ.. వాతావరణంలో మార్పులు, వర్షాకాలం ప్రారంభం కావడంతో జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, విరేచనాల వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లలోనూ రోగుల రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరం రెండు, మూడు రోజులకు మించి కొనసాగినా, విరేచనాలు తీవ్రంగా ఉన్నా స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలని, యాంటీబయాటిక్స్ను ఇష్టానుసారంగా వాడొద్దని సూచిస్తున్నారు. నీరు నిల్వ లేకుండా చూడాలి..వైద్యులు సూచించిన ప్రకారం మరిగించిన నీటినే కాచి తాగాలి. బయట ఆహారం తినడం తగ్గించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసి, దోమల నివారణ చర్యలు చేపట్టాలి. మూడు రోజులకుపైగా జ్వరం కొనసాగినా, విరేచనాలు తీవ్రమైతే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. – డాక్టర్ సాంబశివరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
ఘన వ్యర్థాలను సమర్థంగా నిర్వహించండి
గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్వహణను పటిష్టంగా కొనసాగించాలని కమిషనర్ టి.వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాల పురోగతిపై కమిషనర్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ఎస్ఈ రాజ్కుమార్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోశ్కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. బండ్ పనులు త్వరగా పూర్తి చేయండి కాజీపేట రూరల్: గ్రేటర్ వరంగల్ నగరంలోని వడ్డేపల్లి బండ్పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వడ్డేపల్లి బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ పరిశీలన ధర్మసాగర్: ప్రజలకు రోజూ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలని కమిషనర్ ఇంజనీర్లను ఆదేశించారు. ధర్మసాగర్ రిజార్వాయర్ను పరిశీలించిన ఆయన ఇంజినీర్లకు పలు సూచలిచ్చారు. నాణ్యతతో కూడిన తాగు నీరందించాలని కోరారు. -
వరంగల్
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026ఈవీ బస్సు.. భద్రత తుస్సుహన్మకొండ: విద్యుత్ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్ రీజియన్లో వరంగల్–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది. స్పందించని జేబీఎం యాజమాన్యం వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్ రీజియన్లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. -
సమన్వయంతో పనిచేయాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వరంగల్ క్రైం: లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలు సకాలంలో అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. కమిషనరేట్ పరిధి వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సీపీ శ్వేత బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ కేసును సున్నితంగా విచారించాలని సూచించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు ప్రతి దశలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రజాపాలన ధ్యేయం
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి దామెర: గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రజాపాలన ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. దామెర మండలంలో రూ.1.26 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ల్యాదెళ్ల, దుర్గంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 10వేల మంది మహిళలు సభ్యులుగా చేరారని, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం డెయిరీ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ల్యాదెళ్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించినట్లు, త్వరలో మినీ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్గా రూపుదిద్దుకుంటుందన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని స్వాగతించకుండా, వ్యక్తిగత ఆరోపనలు చేయడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. సమావేశంలో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, సర్పంచ్లు బొంకూరి రవియాదవ్, దాసి శ్రీకాంత్, పొలెపాక శ్రీనివాస్, ఊరుగొండ ఉపసర్పంచ్ నంద్యాల శ్రవణ్ రెడ్డి, పీఆర్ డీఈ యుగేందర్, ఏఈ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దుబాసి రాజేందర్, జిల్లా కార్యదర్శి సదిరం పోశాలు, మాజీ అధ్యక్షుడు మన్నెం ప్రకాశ్ రెడ్డి, నాయకులు శ్రీధర్ రెడ్డి, భిక్షపతి, రాజేందర్, కూనమల్ల రవీందర్, యూత్ నాయకులు నల్ల సుధాకర్, పొలెపాక ప్రశాంత్, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి
హన్మకొండ: పోలీసు శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఏబీఎస్ఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు హనుమకొండలోని పోలీసు హెడ్క్వార్టర్స్ కూడలి నుంచి అంబేద్కర్ కూడలి వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. కూడలిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మంద నరేష్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో 5 వేల ఉద్యోగాలకు కాకుండా 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 ఏళ్లు, ఎస్సైకి 38 సంవత్సరాల వయోపరిమితి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ నాయకులు భరత్, రణధీర్, వేణు, సూర్య, పవన్, శ్రీనివాస్, ప్రణయ్, పవన్, కార్తీక్, వేణు, సాయి కిరణ్, వెంకటేష్, భిక్షపతి, నవ్య, ప్రసన్న, కళ్యాణి, భాగ్య, హిమబిందు పాల్గొన్నారు. -
రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కాజీపేట అర్బన్: రీ సర్వే చేయడం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలో గురువారం భూ కొలతల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల రీ సర్వే అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో భూముల హద్దు రాళ్లు దొరకడం లేదని, సర్వే నంబర్ గుర్తించడం, హద్దులు నిర్ణయించడం ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఇందుకు రీ సర్వే చక్కటి మార్గం అని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోవర్స్, డీజీపీఎస్ సాయంతో ఇంచు భూమి కూడా తప్పిపోకుండా సర్వే జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట మండల తహసీల్దార్ సీహెచ్.రాజు, సర్వే విభాగం డిప్యూటీ ఇన్స్పెక్టర్ సారంగపాణి, భూములు కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రుణాల వసూళ్లపై దృష్టి పెట్టాలిసీ్త్ర నిధి రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, రుణాలు దుర్వినియోగం చేసిన వారి నుంచి తప్పనిసరిగా రికవరీ చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. రుణ వసూళ్లు సీ్త్ర నిధి యాప్ ద్వారానే నిర్వహించాలని, అర్హులైన మహిళలకు రుణాల మంజూరులో పురోగతి సాధించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లో సీ్త్ర నిధి రుణాల మంజూరు, వసూళ్లు, బ్యాంక్ అనుసంధానంపై డీఆర్డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, రీజినల్ మేనేజర్, డీపీఎంలు, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో డీపీఎంలు అనిత, రాజేంద్ర ప్రసాద్, రీజినల్ మేనేజర్ రమేశ్, ఏపీఎంలు, సీ్త్ర నిధి సిబ్బంది పాల్గొన్నారు. మెరుగైన పురోగతి సాధించాలివిద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్) నమోదు వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఎఫ్ఆర్ఎస్ అమలు, అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల మూసివేత, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, శిథిల భవనాల తొలగింపు తదితర అంశాలపై డీఈఓ, ఎంఈఓలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డీఈఓ గిరిరాజ్ గౌడ్, ఎంఈఓలు ఉన్నారు.అంగన్వాడీ టీచర్గా మారిన కలెక్టర్కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అమ్మవారిపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీచర్గా మారి ఆటపాటలతో కూడిన విద్యను బోధించారు. ఈ బొమ్మ ఏంటో మీకు తెలుసా? అని అడుగుతూ చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించడంతో పాటు ఆటపాటలతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. -
ఈవీ బస్సు.. భద్రత తుస్సు
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026హన్మకొండ: విద్యుత్ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్ రీజియన్లో వరంగల్–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది. స్పందించని జేబీఎం యాజమాన్యం వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యంనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్ రీజియన్లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. -
సీపీని కలిసిన కలెక్టర్
న్యూశాయంపేట: వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతను కమిషనరేట్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసమస్యల సత్వర పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన అవసరాన్ని ఇరువురు అధికారులు ప్రస్తావించారు. 18న ప్రత్యేక లోక్ అదాలత్వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నెల 18న చెక్బౌన్స్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మపర్సన్లు వీబీ నిర్మలా గీతాంబ, ఎం.రామకృష్ణ సునీత తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ కోసం ఇప్పటి వరకు వరంగల్లో 2,364 ఎన్ఐ యాక్ట్ కేసులు, హనుమకొండలో 4,362 ఎన్ఐ యాక్ట్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులను పరిష్కరించేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. లోక్ అదాలత్పై ఎటువంటి సలహాలు, సందేహాలు, న్యాయ సాయం కోసం న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవచ్చని సూచించారు. న్యాయమూర్తి జె.మైత్రేయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రదీప్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ ఉపేందర్ ఉన్నారు. సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలిరాయపర్తి: సర్ సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. తిర్మలాయపల్లి, కొండూరు గ్రామాలను గురువారం ఆమె సందర్శించి సర్వేను పరిశీలించారు. అనంతరం సర్ సర్వేతోపాటు సాదాబైనామా దరఖాస్తులపై మండల కేంద్రంలోని తహసీల్లార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ‘పీఎం సూర్యఘర్’ను వినియోగించుకోవాలి నర్సంపేట: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ సూచించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ముకుల్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్తో గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, టీజీ రెడ్కో ఫీల్డ్ ఆఫీసర్ నవీన్కుమార్యాదవ్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనకునే పేద ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి తెలిపారు. అర్హులు www.telanganaepass.cgg.gov.inలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. -
అంగన్వాడీలను తనిఖీ చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలోని ప్రతి సీడీపీఓ తన పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాలపై సీడీపీఓలు, సంక్షేమాధికారితో గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీడీపీఓలు నెలకు కనీసం 150 కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. కొందరు సీడీపీఓలు విధుల్లో నిర్లక్ష్యం వహించడం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేస్తున్న సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లను అభినందించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న తపాలా ఉద్యోగి అరెస్ట్ఖానాపురం: గంజాయి తరలిస్తున్న తపాలా శాఖ ఉద్యోగిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం అరెస్టు వివరాలను ఎస్సై వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పుట్టలభూపతికి చెందిన మాలోత్ కల్యాణ్ తపాలా శాఖ ఉద్యోగి. బుధవారం 2.38 కిలోల (రూ.1,01,900 విలువ) గంజాయిని హనుమకొండలో విక్రయించడానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అశోక్నగర్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి నుంచి గంజాయి, సెల్ఫోన్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయిని రవాణా చేస్తున్న కల్యాణ్ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
డీఎఫ్ఓ ముకుందరెడ్డి బాధ్యతల స్వీకరణ
న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీశాఖాధికారిగా జి.ముకుందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను హనుమకొండ రేంజ్ అధికారులు టి.శ్రీనివాస్, జే.శిరీష, కాకతీయ జూపార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, పరిపాలన అధికారి పి.మంజుల, సిబ్బంది రాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ రిజిస్ట్రార్గా వల్లి సుబ్బలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. చిట్స్ సహాయ రిజిస్ట్రార్ తస్లీమా, సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నెల 18న చెక్బౌన్స్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్లు వీబీ నిర్మలా గీతాంబ, ఎం.రామకృష్ణ సునీత తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ కోసం ఇప్పటి వరకు వరంగల్లో 2,364 ఎన్ఐ యాక్ట్ కేసులు, హనుమకొండలో 4,362 ఎన్ఐ యాక్ట్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులను పరిష్కరించేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. లోక్ అదాలత్పై ఎలాంటి సలహాలు, సందేహాలు, న్యాయ సాయం కోసం న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవచ్చని సూచించారు. న్యాయమూర్తి జె.మైత్రేయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రదీప్, వరంగల్ బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు సీహెచ్.ఉపేందర్, చిట్ఫండ్ కంపెనీ, బ్యాంకు అధికారులు, న్యాయవాదులున్నారు. రామన్నపేట: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి నేడు(శుక్రవారం) దరఖాస్తుల స్వీకరణ, జూలై 4న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తెలిపారు. జూలై 2 నాటికి సివిల్ ఇంజనీరింగ్లో ఒకటి, సివిల్ ఇంజినీరింగ్ (రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్)లో 21, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో 2, మెకానికల్ ఇంజినీరింగ్లో 35 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.5,080 ఫీజుతో పాటు నిబంధనల ప్రకారం స్పాట్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డు (అర్హులైతే), ఎస్సెస్సీ మార్కుల మెమో, పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో వ్యక్తిగతంగా ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్కు హాజరుకావాలని సూచించారు. -
సమన్వయంతో పనిచేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వరంగల్ క్రైం: లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలు సకాలంలో అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. కమిషనరేట్ పరిధి వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సీపీ శ్వేత బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ కేసును సున్నితంగా విచారించాలని సూచించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు ప్రతీ దశలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో సీట్లు ఖాళీ
కాళోజీ సెంటర్: పేద, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికల కోసం ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) ఏర్పాటు చేసింది. అయితే, జిల్లాలోని కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. మొత్తం 10 కేజీబీవీలు ఉండగా.. అందులో 6 తరగతి నుంచి 10వ తరగతి వరకు 183 సీట్లు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సులకు సంబంధించి 168, ద్వితీయ సంవత్సరంలో 247 సీట్లు ఖాళీలు ఉన్నాయి. అందుబాటులో 3,280 సీట్లు.. అన్ని కేజీబీవీల్లో కలిపి మొత్తం 3,280 సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు కేవలం 2,682 (84 శాతం) మంది విద్యార్థినులు మాత్రమే ప్రవేశాలు పొందారు. ఇంకా 598 (16 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రచార లోపమో, పర్యవేక్షణ లోపమో కానీ.. అర్హులైన పేద విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ప్రతి పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు తరగతికి 40 సీట్ల చొప్పున 200 మంది, ఇంటర్లో డబుల్ స్ట్రీం కాలేజీల్లో 160 (మొత్తం 360 సీట్లు) సీట్ల సామర్థ్యం ఉంది. ఈ ఏడాది నెక్కొండ కేజీబీవీకి కొత్తగా ఎంఎల్టీ కోర్సు మంజూరైంది. ఆయా కేజీబీవీల్లో కోర్సులు ఇలా.. చెన్నారావుపేట, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం కేజీబీవీల్లో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఖానాపురం, రాయపర్తి, వర్ధన్నపేటలో ఎంపీసీ, బైపీసీ, దుగ్గొండి, పర్వతగిరి, నెక్కొండలో ఎమ్మెల్టీ కోర్సు ఉంది. ఈ విద్యాసంవత్సరం నుంచి మూడు కేజీబీవీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసింది. ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థినులను జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయనున్నారు. విద్యార్థినులకు శిక్షణ.. జిల్లాలోని పలు కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రభుత్వం పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఖానాపురం కేజీబీవీలో నీట్ శిక్షణ కేంద్రం, వర్ధన్నపేటలో జేఈఈ, ఐఐటీ శిక్షణ కేంద్రం, గీసుకొండలో క్లాట్ (లా ప్రవేశ పరీక్ష) శిక్షణ కేంద్రం నిర్వహించనున్నారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు.. మూడు ప్రతిష్టాత్మక ‘యంగ్ ఇండియా’ కేంద్రాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష టీజీఆర్జేసీ ద్వారా పూర్తి కాగా.. ఆరో తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 12న మూడు కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఖాళీలను ఎస్ఓలు భర్తీ చేస్తారు..జిల్లాలో ఉన్న 10 కేజీబీవీల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన చేస్తున్నాం. అన్ని తరగతుల్లో కలిపి 598 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆయా కేజీబీవీల ఎస్ఓలు ఖాళీలను భర్తీ చేయడానికి కృషిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘యంగ్ ఇండియా’ కేంద్రాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహిస్తాం. – కొల్లూరి ఫ్లోరెన్స్, జీసీడీఓ ఇప్పటివరకు 84 శాతం ఎన్రోల్మెంట్ యంగ్ ఇండియా స్కూళ్లుగా 3 విద్యాలయాలు అప్గ్రేడ్ ఈనెల 12న ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అధికారుల ఏర్పాట్లువివిధ కోర్సుల్లో ఖాళీల వివరాలు.. తరగతులు ఇంటర్ కేజీబీవీ (6–10 వరకు) ఫస్టియర్ సెకండియర్ చెన్నారావుపేట 0 13 28 దుగ్గొండి 9 18 19 గీసుకొండ 20 20 0 ఖానాపురం 0 19 51 నల్లబెల్లి 20 15 00 నెక్కొండ 58 32 00 పర్వతగిరి 5 7 23 రాయపర్తి 12 34 52 సంగెం 0 0 55 వర్ధన్నపేట 59 10 19 మొత్తం 183 168 247 -
వరంగల్
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026జంపన్న వాగులో భద్రతేది? పుణ్యస్నానాల కోసం మేడారంలోని జంపన్నవాగులో దిగుతున్న భక్తులు నీటిలోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. నర్సంపేటలో అత్యధికంగా 80 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ప్రస్తుతం అక్కడ భూగర్భజలాలు 5 నుంచి 6.5 మీటర్ల లోతులో ఉన్నప్పటికీ, వర్షాభావం కొనసాగితే రానున్న నెలల్లో నీటి మట్టం మరింత దిగజారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ఖానాపురంలో 63 శాతం, గీసుగొండలో 70 శాతం వర్షపాతం లోటు నమోదవగా, అక్కడ భూగర్భజలాలు 7 నుంచి 9 మీటర్ల లోతులో ఉన్నాయి. వ్యవసాయ బోర్లపై ఆధారపడే రైతులకు ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యమైతే బోర్లు ఎండిపోవడం వంటి పరిస్థితులతో సాగునీటి అవసరాలకు సైతం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వర్షపాతంలోటు భూగర్భజల పరిస్థితిసాక్షి, వరంగల్: జిల్లాలో ప్రకృతి రెండు వైపులా పరీక్ష పెడుతోంది. ఒకవైపు జూన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం.. మరోవైపు అదే ప్రాంతాల్లో భూగర్భజల మట్టం కూడా గణనీయంగా దిగజారడం భవిష్యత్లో నీటి కొరతకు సంకేతాలిస్తోంది. వర్షాభావం, భూగర్భజలాల క్షీణత ఒకేసారి ఎదురవుతున్న ఈ శ్రీడబుల్ ఎఫెక్ట్శ్రీ జిల్లాలోని ఐదు మండలాలను ఆందోళనలోకి నెట్టింది. ఇప్పటికై నా విస్తారంగా వర్షాలు కురవకపోతే ఖరీఫ్ సాగుతోపాటు తాగునీటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. జూలైలో కురవాల్సిన వర్షం కంటే అధికంగా వాన పడితేనే జనాల తిప్పలు తప్పనున్నాయి. పర్వతగిరి, సంగెం మండలాల్లో తీవ్ర ఆందోళన.. జిల్లాలోని పర్వతగిరి, సంగెం మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదముంది. ఒకవైపు పర్వతగిరిలో 77 శాతం వర్షపాతం లోటు ఉండగా, మరోవైపు అక్కడే భూగర్భజలాలు 11 మీటర్లకు పైగా దిగజారాయి. సంగెం మండలంలో 57 శాతం వర్షాభావం ఉండగా తీగరాజుపల్లిలో నీటి మట్టం 13.01 మీటర్ల లోతుకు చేరింది. ఈ రెండు ప్రాంతాల్లో జూలైలో కూడా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే బోర్లలో నీటి లభ్యత తగ్గే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. తాగునీటికీ ఇబ్బందే.. -
వర్షం లోటు.. జలం లోతు!
హన్మకొండ: వాతావరణం వేసవిని తలపిస్తోంది. వర్షాలు కురవకపోవడం, పెరిగిన జల వినియోగంతో హనుమకొండ జిల్లాలో జలమట్టం తగ్గుతూ వస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సమృద్ధిగా ఒక్క వర్షం కూడా కురవలేదు. కనీస సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడంతో వానాకాలం సాగు ఇప్పటికీ చాలా చోట్ల ప్రారంభం కాలేదు. వర్షాలు లేక సాగు అవసరాల కోసం రైతులు భూగర్భజలాలు తోడుతున్నారు. గతేడాదితో పోలిస్తే భూగర్భజలాలు కొద్దిగా పైనే ఉన్నప్పటికీ... గత మే నెలతో పోలిస్తే పడిపోయాయి. హనుమకొండ జిల్లాలో సగటున మే నెలాఖరులో 6.17 మీటర్ల లోతులో ఉన్నాయి. పాతాళానికి జలాలు.. జిల్లాలో ఈ ఏడాది 69 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని ప్రభావం భూగర్భజలాలపై పడుతోంది. ఫలితంగా ప్రతీ నెల భూగర్భజలాలు పడిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోతే సాగు, తాగు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. భూగర్భ జల శాఖ జిల్లాలోని 25 ప్రాంతాల్లో బోర్లు తవ్వించి ఫీజో మీటర్లు అమర్చి వాటి ద్వారా భూగర్భ జల మట్టం కొలతలను సేకరిస్తోంది. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని సేకరిస్తోంది. జిల్లాలోని వేలేరు మండలం పీచర్లలో అత్యధికంగా 16.3 మీటర్ల లోతున భగర్భజలాలు పడిపోయాయి. భీమదేవరపల్లి వంగరలో 13.30 మీటర్లు, కొత్తపల్లిలో 11.20, జగన్నాథపూర్లో 10.90, నడికూడ మండలం చర్లపల్లిలో 12.65 మీటర్ల లోతు, హసన్పర్తి నాగారంలో 9.15 మీటర్లు, భూగర్భజలాలు పడిపోయాయి. పడిపోతున్న భూగర్భ జలాలు జిల్లాలో కానరాని వాన రైతన్నల ఎదురుచూపులు -
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కిడ్స్ ప్లేస్కూల్స్ను బుధవారం అధికారులు సీజ్ చేశారు. డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఆదేశాల మేరకు వండర్ కిడ్స్, బచ్పన్, కిడ్జి ప్లేస్కూ ల్స్ను మూసివేశారు. అదేవిధంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే పేరుతో నిర్వహిస్తున్న మై చోటా ప్లేస్కూల్స్ను కూడా సీజ్ చేసినట్లు హనుమకొండ ఎంఈఓ నెహ్రూ తెలిపారు. ఆయా స్కూళ్లలో నోటీసులు అంటించి, తల్లి దండ్రులకు కూడా సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేట దర్గా ప్రాంతంలో గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న హ్యాపీహ్యాపీ ప్లేస్కూ ల్ను సీజ్ చేశామని కాజీపేట ఎంఈఓ బి.మనోజ్కుమార్ తెలిపారు. ఈ ప్లేస్కూల్లో చదువుతున్న విద్యార్థులను సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఎంఈఓ వెంట సీఆర్పీలు ప్రవీణ్కుమార్, రాంప్రసాద్ తదితరులు ఉన్నారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని గిరిరాజ్గౌడ్ తల్లిదండ్రులను కోరారు. కేయూ క్యాంపస్: ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్ స్టడీ టూర్కు జర్మనీ వెళ్లారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్లడించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్, రూసా కేయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు. జర్మనీ పర్యటనలో ఆయన ఈనెల 6 వరకు ఉండనున్నారు. నయీంనగర్: టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ‘కుడా’ రెండేళ్ల అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ను వారికి అందజేశారు. రెండేళ్ల కాలంలో వరంగల్ మహానగర పరిధిలో మౌలిక వసతుల కల్పన, మాస్టర్ ప్లాన్ విస్తరణ, ల్యాండ్ పూలింగ్, కాళోజీ కళాక్షేత్రం వంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి తదితర అంశాలను చైర్మన్ వివరించారు. సీఎం రేవంత్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ‘కుడా’ను ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నట్లు ఆ యన తెలిపారు. ఇనగాల వెంట ఎమ్మెల్యే నాగరాజు, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రాంనరసింహారెడ్డి, నాయకులు ఉన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్కు చెందిన పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు, ప్రముఖ రుగ్వేద పండితుడు సూర్యనారాయణ ఘనాపాఠి, శివసుబ్రహ్మణ్య ఘనాపాఠి సోదరులు రుగ్వేద సుధాకర బిరుదు అందుకున్నారు. ఈ మేరకు శ్రుతి స్మృతి ట్రస్ట్ బాధ్యులు హైదరాబాద్లోని స్కందగిరి దేవాలయంలో 33 రోజులుగా రుగ్వేద ఘనపారాయణం నిర్వహించారు. ఆగమ సామ్రాట్ భద్రకాళి శేషు ఈ కార్యక్రమంలో పాల్గొని పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు ప్రదానం చేశారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతీస్వామి ఘనాపాఠి సోదరులకు రుగ్వేద సుధాకర బిరుదు అందజేశారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆపద సమయంలో వీరోచిత సేవల్లో ముందువరుసలో ఉంటారు. చాలామంది అధికారులు ఐక్యతకు మారుపేరుగా నిలుస్తారు. ఇవన్నీ బొమ్మకు ఒక వైపు మాత్రమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో చాలాకాలంగా సమస్యలు తిష్టవేశాయి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతివాటంతో పోలీస్ శాఖ పరువు మసకబారుతోంది. సీపీలుగా పనిచేసిన తరుణ్జోషి, ఏవీ రంగనాథ్, అంబర్కిషోర్ ఝా, సన్ప్రీత్సింగ్ తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేసినప్పటికీ అవినీతి అధికారులపై పూర్తిస్థాయిలో చర్యలు లేకుండా పోయాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధికారులు కమిషనరేట్ను అంటిపెట్టుకుంటున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముందు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి. పార్కింగ్ సమస్య.. నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా షాపింగ్ కాంప్లెక్స్లకు పార్కింగ్ లేకుండా పోయింది. హనుమకొండ, వరంగల్ చౌరస్తాలో 10 నిమిషాలు ద్విచక్రవాహనాలను సైతం పార్కింగ్ చేసి షాపింగ్ చేసే పరిస్థితులు లేవు. పార్కింగ్ స్థలాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ పోలీస్ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్ పెరగడం వల్ల మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ప్రతిపాదించి చాలా రోజులు అవుతోంది. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏఆర్లో ఎక్కడి వారు అక్కడే.. పోలీస్ శాఖలో లా అండ్ అర్డర్తో పాటు ఏఆర్ విభాగం చాలా కీలకం. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్ఎస్సై, ఆర్ఐ, ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్ను వదలడం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్ వ్యాపారం, సెటిల్మెంట్లకు కొంత మందికి పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి. నేతల అండ.. నిబంధనలు తూచ్ వరంగల్, హనుకొండ, కాజీపేట సబ్ డివిజన్లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈఅధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను వారి ప్రైవేట్ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగడంతో తగదాలు సృష్టించి సెటిల్మెంట్లు సైతం చేయడం గమనార్హం. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్ వేటుపడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. దృష్టి సారిస్తే... మొదటి నుంచే పాలనాపరంగా కఠినంగా వ్యవహరిస్తూ, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తే వరంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. చైతన్యానికి మారుపేరుగా ఉన్న వరంగల్ ప్రజలు నిస్వార్థంతో పనిచేసిన ఎంతో మంది అధికారులకు జీవిత కాలం సరిపోయే కీర్తి ప్రతిష్టతలను అందించారు. ఏది ఏమైనా నూతన సీపీ ఆల్ ది బెస్ట్. వరంగల్ సబ్ డివిజన్లో కరువైన లా అండ్ ఆర్డర్.. పేదల కోసం భూ పోరాటం ఉధృతంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హన్మకొండ అర్బన్: పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు సాధించే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గబోమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం భారీ పికెటింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే కలెక్టరేట్కు చేరుకున్న వామపక్ష నాయకులు, కార్యకర్తలు అధికారులను, సిబ్బందిని లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పికెటింగ్ కొనసాగుతుండగా సుబేదారి పోలీసులు వామపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, వామపక్ష శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం త క్కళ్లపల్లి శ్రీనివాసరావుతోపాటు పలువురు నాయకులను సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించారు. కా ర్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ జిల్లా నాయకులు కర్రె భిక్షపతి, జి.ప్రభాకర్రెడ్డి, ఎన్.హంసారెడ్డి, నేదునూరి జ్యోతి, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్గా పోచయ్య కాశిబుగ్గ : వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్గా (ఎఫ్ఏసీ) ఆచార్య జి.పోచయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. వర్ధన్నపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న పోచయ్యను సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్గా నియమిస్తూ కళాశాల ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం పదవీ విరమణ పొందిన ప్రిన్సిపాల్, డా క్టర్ ధర్మారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న ప్రిన్సిపాల్ పోచయ్యను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. బల్దియా అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇన్వార్డులో ఇద్దరు మహిళా ఉద్యోగుల మధ్య మనస్పర్థలు తలెత్తడం, విధుల్లో బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో వారికి విధులను గుర్తు చేసినట్లు అడిషనల్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్వార్డులో నమోదైన దరఖాస్తులు ఆయా విభాగాలకు పంపించడంలో జాప్యం అవుతోందని ఇన్వార్డు ఉద్యోగులు చందన, శ్రుతిని తన చాంబర్కు పిలిపించి దరఖాస్తులను త్వరితగతిన చేరవేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ ఇబ్బందులతోనే శ్రుతి తన స్వగృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. వాస్తవాలను పక్కన పెట్టిన బల్దియా ఉద్యోగులు, అధికారులపై నింద మోపడం సరికాదన్నారు. ఈ ఘటనలో సీ–1 సూపరింటెండెంట్, ఇతర ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) సెక్రటరీగా జిల్లా కేంద్రంలోని టీపీటీ ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆదిరాజు శైలజ నియమితులయ్యారు. ఈమేరకు డీఈఓ, డీసీఈబీ చైర్మన్ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు డీసీఈబీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ బి.రాంధన్ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నియమించిన శైలజ బుధవారం సాయంత్రం డీఈఓ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఏఆర్లో పాతుకుపోయిన అధికారులు నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ వరంగల్ సబ్ డివిజన్లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్ సెటిల్మెంట్లో జోక్యం చేసుకొని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించి సబ్ డివిజన్లోని ఒక్కరిద్దరు అధికారులు సెటిల్మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. సీసీఎస్లో కదలరు.. వదలరు దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత మంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్ను వదలట్లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్స్నాచింగ్లు జరుగుతున్నా.. దొంగలు దొరకట్లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్ తయారైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్ అయిన చాలామంది అధికారులు కమిషనరేట్ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్లైన్లలో పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు మహిళా సిబ్బంది, మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలి. -
పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయాలి
● జిల్లా పంచాయతీ అధికారి కల్పన గీసుకొండ : నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని గ్రామాల్లో కచ్ఛితంగా అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన హెచ్చరించారు. బుధవారం ఆమె డివిజనల్ పంచాయతీ అధికారి వేదవతితో కలిసి మండలంలోని కొనాయమాకుల, విశ్వనాథపురం, కొమ్మాల గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, వ్యాపార నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో కల్పన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధికి, ప్రగతికి నిబంధనల అమలు ఎంతో కీలకమన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకుంటే షాపులు సీజ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వాణిజ్య, వ్యాపార లావాదేవీలు నిర్వహించినా తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ (వ్యాపార అనుమతి పత్రం) కలిగి ఉండాలని డీపీఓ స్పష్టం చేశారు. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు, దుకాణాలు, కమర్షియల్ లావాదేవీలు నిర్వహించే వారంతా గ్రామ పంచాయతీల నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలని ఆదేశించారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు కొనసాగిస్తే పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం దుకాణాలను సీజ్ చేయడంతోపాటు, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల ఆర్థిక పురోగతి, ఆదాయవృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, శాసీ్త్రయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణకు ప్రజల్లో చైతన్యం తేవాలని డీపీఓ పిలుపునిచ్చారు. గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన వ్యర్థాలు, ఈ–వ్యర్థాలను వేరుచేయడం కోసం నిర్ధేశించిన నాలుగు రకాల చెత్త బుట్టల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థల నుంచి చెత్తను విడివిడిగా సేకరించేలా పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయాన్నే గ్రామాల్లో పర్యటించి, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని డీపీఓ హెచ్చరించారు. కార్యక్రమంలో గీసుకొండ ఇన్చార్జ్ ఎంపీఓ శేషాంజన్ స్వామి, కొనాయమాకుల, కొమ్మాల సర్పంచులు వజ్ర రాజు, కన్నెబోయిన యమున ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శులు రామారావు, శ్రీధర్, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల అభివృద్ధికి అడుగులు
ఖానాపురం: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ప్రభుత్వం భవనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న భవనాలను ఆధునికీకరించడంతోపాటు పలు నూతన భవనాల మంజూరుకు నిధులు మంజూరు చేసింది. భవనాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లా అధికారులు సమయాత్తం అవుతున్నారు. దీంతో దివ్యాంగ పిల్లల అభివృద్ధికి తోడ్పాటు అందనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 13మండలాల్లోని దివ్యాంగుల కోసం 2013 సంవత్సరంలో నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట, వరంగల్ ప్రాంతాల్లో భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులను భవిత కేంద్రాలకు తీసుకొచ్చి ప్రత్యేకంగా శిక్షణ, చదువులు నేర్పించేవారు. కానీ ప్రభుత్వం ఇటీవల కాలంలో మండలానికి రెండు చొప్పున భవిత కేంద్రాలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో మండలానికి రెండు చొప్పున భవిత కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.9.50లక్షలతో నిర్మాణాలు చేయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో నూతనంగా ఖానాపురం మండలంలో 2, చెన్నారావుపేటలో 1, సంగెంలో 1, దుగ్గొండిలో 2, నల్లబెల్లిలో 1, గీసుగొండలో 1, రాయపర్తిలో 1, ఖిలావరంగల్లో 1 చొప్పున భవనాలు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు నాలుగు భవిత కేంద్రాల నిర్మాణాలు పూర్తియ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. పలు మండలాల్లో పాఠశాలల ఆవరణలో ఉన్న వాటినే ఆధునికీకరిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల్లో పలు చిత్రాలను సైతం చిత్రించారు. భవనాలతోపాటు దివ్యాంగుల కోసం మూత్రశాలలు నిర్మిస్తున్నారు. ఐఈఆర్పీల ద్వారా అభివృద్ధి దివ్యాంగ విద్యార్థులను ఐఈఆర్పీలు భవిత కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది. భవిత కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రైమరీ విద్యాభ్యాసం చేస్తారు. దివ్యాంగుల్లో మార్పు కోసం ఫిజికల్ డెవలప్మెంట్, శారీరక స్కిల్, డ్రెస్సింగ్ స్కిల్స్, వినికిడి శిక్షణ, దృష్టి అభివృద్ధి, బ్రెయిన్ శిక్షణ, ఓరియంటేషన్, మొబిలిటీ శిక్షణ, పాఠశాల సిద్దత, జీవన నైపుణ్యాలు, ఆటలు, యోగా, సంగీతం, కళా కార్యకళాఫాలు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్, స్పీచ్థెరపీలు నేర్పిస్తారు. సాధారణ పిల్లల్లా మారడానికి కేంద్రంలో ప్రతీ రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. కొంత సమయం కేటాయించి భవిత కేంద్రంలో పాఠాలు బోధిస్తారు. ఫిజియోథెరపీ అవసరమయ్యే వారి కోసం భవిత కేంద్రాలకే ఫిజియోథెరపిస్ట్లను తీసుకొస్తారు. సదరం సర్టిఫికెట్లు లేని వారి కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే సదరం క్యాంపులకు తరలించి అర్హులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తారు. జిల్లాలో భవిత కేంద్రాల ఏర్పాటు ప్రత్యేక భవనాల నిర్మాణం -
విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలి
విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు విజయలక్ష్మీబాయి విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు, సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి జిల్లా విద్యాశాఖాధికారి, ఎంఈఓలను ఆదేశించారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ, అర్బన్ మండలాల విద్యాశాధికారులు, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జయశంకర్ బడిబాటలో ఎంతమంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు, ప్రీప్రైమరీలో విద్యార్థుల నమోదు ఎలా ఉంది, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ, హనుమకొండ, కాజీపేట మండలాల పాఠశాలల్లో అల్పాహారం పంపిణీపై ఆరా తీశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల నమోదు 33 వేలకుపైగా నమోదు లక్ష్యంగా ఉందని, ఇప్పటివరకు 28 వేల వరకు అడ్మిషన్లు అయ్యాయని తెలిపారు. విద్యార్థుల వివరాలను యూడైస్లో పేర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 10 వరకు వి ద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకునేలా కృషిచేయాలని విజయలక్ష్మిబాయి సూచించారు. ఎంఈఓలు నెహ్రూ, శ్రీనివాస్, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు మ హేశ్, మన్మోహన్, సునీత, సుమాదేవి ఉన్నారు. -
ప్రారంభానికి సిద్ధం చేస్తున్నాం
జిల్లాలో భవిత కేంద్రాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో పనులు ప్రారంభించాం. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలో నాలుగు భవిత కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. భవనాల నిర్మాణాలన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. – శ్రీనివాస్, డీఎస్ఓ దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ జిల్లాలోని దివ్యాంగులను గుర్తిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం పాఠశాల పరిధిలో ఉన్న భవనాల్లో వారికి శిక్షణ ఇస్తున్నాం. సాధారణ విద్యార్థుల్లా దివ్యాంగులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా స్కిల్స్ నేర్పిస్తున్నాం. తల్లిదండ్రులు భవిత కేంద్రాలను వినియోగించుకోవాలి. – పాలకుర్తి మహేందర్, ఐఈఆర్పీ, ఖానాపురం -
కొత్త సీపీకి సవాళ్ల స్వాగతం!
వరంగల్ క్రైం: వరంగల్ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆపద సమయంలో వీరోచిత సేవల్లో ముందువరుసలో ఉంటారు. ఇవన్నీ బొమ్మకు ఒక వైపు మాత్రమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో చాలాకాలంగా సమస్యలు తిష్టవేశా యి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతి వాటంతో పోలీస్ శాఖ పరువు మసకబారుతోంది. సీపీలుగా పనిచేసిన తరుణ్ జోషి, ఏవీ రంగనాథ్, అంబర్కిషోర్ ఝా, సన్ప్రీత్సింగ్ తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేసినప్పటికీ అవినీతి అధికారులపై పూర్తిస్థాయిలో చర్యలు లేకుండాపోయాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధి కారులు కమిషనరేట్ను అంటిపెట్టుకుంటున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముందు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి. పార్కింగ్ సమస్య.. నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగు తోంది. చాలా షాపింగ్ కాంప్లెక్స్లకు పార్కింగ్ లేదు. హనుమకొండ, వరంగల్ చౌరస్తాలో 10 నిమిషాలు ద్విచక్రవాహనాలను సైతం పార్కింగ్ చేసి షాపింగ్ చేసే పరిస్థితులు లేవు. పార్కింగ్ స్థలాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ పోలీస్ అధికారులు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్ పెరగడం వల్ల మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ప్రతిపాదించి చాలా రోజులు అవుతోంది. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏఆర్లో ఎక్కడి వారు అక్కడే.. పోలీస్ శాఖలో లా అండ్ అర్డర్తో పాటు ఏఆర్ విభాగం చాలా కీలకం. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్ఎస్సై, ఆర్ఐ, ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్ను వదలడం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్ వ్యాపారం, సెటిల్మెంట్లకు కొంత మందికి పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి. సీసీఎస్లో కదలరు.. వదలరు దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత మంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్ ను వదలట్లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్స్నాచింగ్లు జరుగుతున్నా.. దొంగలు దొరకట్లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్ తయారైనట్లు విమర్శలున్నాయి. వరంగల్ సబ్ డివిజన్లో కరువైన లా అండ్ ఆర్డర్.. వరంగల్ సబ్ డివిజన్లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్ సెటిల్మెంట్లో జోక్యం చేసుకొని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించి సబ్ డివిజన్లోని ఒక్కరిద్దరు అధికారులు సెటిల్మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. నేతల అండ.. నిబంధనలు తూచ్ వరంగల్, హనుకొండ, కాజీపేట సబ్ డివిజన్లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈఅధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను వారి ప్రైవేట్ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగడంతో తగదాలు సృష్టించి సెటిల్మెంట్లు సైతం చేయడం గమనార్హం. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్ వేటుపడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఏఆర్లో పాతుకుపోయిన అధికారులు నగరంలో తీవ్రమైన ట్రాఫిక్కమిషనరేట్ను వీడని అవినీతి అధికారులు.. అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్ అయిన చాలామంది అధికారులు కమిషనరేట్ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్లైన్లలో పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు మహిళా సిబ్బంది, మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలి. -
ప్రజలకు మెరుగైన సేవలందిస్తా
● శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం ● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ● కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలం సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమి షనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. అమ్మవారికి సీపీ శ్వేత పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని బుధవారం వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ శ్వేత సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అర్చకులు ఆమెను ఘనంగా స్వాగతించారు. సీపీ శ్వేత అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కమిషనర్ వెంట ఏసీపీ సత్యనారాయణ, సీఐ సుజాత తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచాలి
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఐనవోలు: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని పంథిని గ్రామాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా పంథిని ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ సెంటర్ను సందర్శించారు. డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, నర్సరీ, గ్రామ పంచాయతీ కార్యాలయం, పల్లె దవాఖానాను సందర్శించారు. ప్రాథమిక పాఠశాల 5, 9వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ సెంటర్లో అందుతున్న సేవలు తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. నర్సరీని సందర్శించి మొక్కల పెంపకంపై ఆరా తీశారు. పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎస్ఐఆర్ గురించి బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. పల్లె దవాఖానాలో అందుతున్న సేవలు పరిశీలించారు. అనంతరం చింతకుంటలోని అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండగా వారితో మాట్లాడారు. రెండు రోజుల నుంచి మాత్రమే వారు పాఠశాలకు వస్తున్నారని గుర్తించి అధికారులను ప్రశ్నించారు. విద్యార్థుల నమోదు లేకపోతే ప్రాథమిక పాఠశాల గుర్తింపు రద్దవుతుందన్నారు. ఈక్రమంలో చింతకుంటలో ఓ రైతు భూములు పట్టాలు కావడం లేదని పిర్యాదు చేయగా.. కారణం ఏంటని తహసీల్దార్ను అడిగారు. ఐనవోలు మండలంలో చాలా చోట్ల సమస్యలు ఉన్నాయని వాటిని క్రమక్రమంగా ఆర్డీఓ సహకారంతో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సర్పంచ్ శ్రీరాం భూపాల్రావు, జిల్లా శిశు సంక్షేమ అధికారి విశ్వజ, డీపీఓ రమాకాంత్, డీఎల్పీఓ గంగా భవాని, తహసీల్దార్ విక్రమ్కుమార్, ఎంపీడీఓ నర్మద, ఎంఈఓ పులి ఆనందం, ఎంపీఓ రఘుపతిరెడ్డి, ఏపీఓ నక్క కుమారస్వామి, సెక్రటరీ మాలతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ● కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలం సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్కు చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించా రు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పో లీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. -
నాసిరకం, అధిక ధరలపై ఉక్కుపాదమే
● జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయచంద్ర పరకాల: అధిక ధరలకు, నాసిరకం ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించినా, ఒకదాంతో ఒకటి లింక్ పెట్టి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి విజయచంద్ర హెచ్చరించారు. పరకాలలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీ చేశారు. ఐదు దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. సరైన డాక్యుమెంట్లు, రికార్డులు సమర్పించకపోవవడంతో తదుపరి ఆదేశాల వచ్చే వరకు విక్రయాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. మరికొంతమంది దుకాణాదారులు నిబంధనల ప్రకారం స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, ధరల పట్టికలు ప్రదర్శించకపోవడంతో యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 10 మంది వ్యవసాయాధికారులతో కలిసి జిల్లా వ్యవసాయాధికారి చేపట్టిన తనిఖీలతో స్థానిక వ్యాపారులు కలవరపడ్డారు. తనిఖీల్లో పరకాల ఏడీఏ ఆదిరెడ్డి, ఏఓ శ్రీనివాస్తో పాటు దామెర, ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, హసన్పర్తి, కాజీపేట, ఐనవోలు, ఎల్కతుర్తి మండలాల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు
ఖానాపురం: అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం మండలంలోని అశోక్నగర్ భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి భవనంలోని మూత్రశాలలు, డోర్లను పరిశీలించి దివ్యాంగులతో మాట్లాడారు. అనంతరం పక్కనే ఉన్న ప్రాథమిక, హైస్కూల్లోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనంలో నాణ్యత లేకపోవడం, తక్కువగా వంట చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి కూరలు సరిగా లేకపోవడంతో నిర్వాహకులను మందలించారు. భోజనంలో రాళ్లు వస్తున్న విషయాన్ని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బియ్యాన్ని పరిశీలించగా దొడ్డు, సన్న రకాల కలయిక ఉన్నట్లు గుర్తించి సివిల్సప్లయీస్ అధికారులకు తెలిపి విచారణ చేపట్టాలన్నారు. పక్కనే అంగన్వాడీ కేంద్రం మూడు నెలలుగా తెరవడంలేదని తెలుసుకుని డీడబ్ల్యూఓకు వీడియో కాల్ చేసి చూపించారు. అంగన్వాడీ టీచర్ పదవీ విరమణ పొందితే సెంటర్ ఎలా మూసివేస్తారని ఆగ్రహించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు. హైస్కూల్లో ఎంఓఎంబీ నిధుల గోల్మాల్పై పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో డీఈఓను విచారణకు ఆదేశించారు. మనుబోతులగడ్డలో భవిత కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. బేంచీలు లేవని తెలపడంతో కేజీబీవీలో వృథాగా ఉన్న బేంచీలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని మహిళలు బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా.. పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డీఈఓ రంగయ్యనాయుడు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ నంగునూరి రమేష్, ఎంఈఓ చరణ్సింగ్, ఇన్చార్జ్ హెచ్ఎం వాగ్య, హెచ్ఎం నర్సింహులు, సొసైటీ డైరెక్టర్ ఆబోతు అశోక్ ఉన్నారు. కలెక్టర్ సత్యశారద అశోక్నగర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై ఆగ్రహం అంగన్వాడీ మూసివేతపై అసహనం‘సర్’ను వేగవంతం చేయాలి.. జిల్లాలో ‘సర్’ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మనుబోతులగడ్డలో ‘సర్’ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో 795 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 7.9లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పది మందికో బీఎల్ఓ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం పూర్తయిందని, ఇందులో నర్సంపేట 85 శాతంతో మొదటి స్థానంలో.. వరంగల్ తూర్పు 65 శాతంతో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు, బీఎల్ఓలు ఐడెంటీ కార్డులతో తప్పకుండా ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. -
వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
వరంగల్ అర్బన్ : వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో జీడబ్ల్యూఎంసీ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో స్వనిధి మహోత్సవ్–2026 కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రుణాలు అందించిన బ్యాంకర్లు, వీధి వ్యాపారులను సన్మానించారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎల్డీఎం మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్ కుమార్, డీఎంసీ రజిత రాణి, రమేష్ పాల్గొన్నారు. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలిహన్మకొండ అర్బన్: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించాలి
● కలెక్టర్ సత్యశారద● ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాల తనిఖీ ● విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరికి షోకాజ్ నోటీసులుకాశిబుగ్గ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించి, ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే విధంగా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మంగళవారం వరంగల్లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి తనిఖీ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ వైద్యుడికి, ఏఎన్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్కే ధర్మరాజు, అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అనసూర్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించారు. కళాశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు అంకితభావంతో విద్యాబోధన చేయాలని సూచించారు. మిషన్ ఎయిడ్స్ సురక్షను విజయవంతం చేయాలి న్యూశాయంపేట: జాతీయ స్థాయిలో లక్ష్య సాధన దిశగా మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న మూడు నెలల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి 95 శాతం లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. హెచ్ఐవీతో జీవిస్తున్న ప్రతీ రోగి క్రమం తప్పకుండా మందులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నోడల్ అధికారి సమ్రేస్, రాష్ట్ర బేసిక్ సర్వీసెస్ జేడీ డాక్టర్ జయలక్ష్మి, టార్గెటెడ్ ఇంటర్ వెన్స్న్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్, రాష్ట్ర సమన్వయ కర్త కామేశ్వర్రావు, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ అరుణ్కుమార్ జోషి, స్వప్న మాధురి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ పంటను సాగుచేయాలి
● జిల్లా ఉద్యానశాఖ అధికారి కమలాకర్రెడ్డి ఎల్కతుర్తి : ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉందని రైతులు భవిష్యత్ దృష్ట్యా ఆయిల్పామ్ పంటను సాగుచేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి కమలాకర్, జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎడవెల్లి రవీందర్రెడ్డి ఎనిమిది ఎకరాల భూమిలో ఆయిల్పామ్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్పామ్ పంట సాగు వల్ల మంచి ఆదాయంతో పాటు కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. రైతు భరోసాకు ఈనెల 5వ తేదీలోపు దరఖాస్తు పత్రాలను వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలన్నారు. ఆయిల్ పామ్ పంట చాలా లాభదాయకంగా ఉంటుందని ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకుంటే వీలైనంత తొందరలో మొక్కలను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారి శంకర్, ఉద్యాన శాఖ మండల అధికారి సుస్మిత, వ్యవసాయ శాఖ అధికారి రాజ్కుమార్, ఏఈఓ రోజా, రైతులు పాల్గొన్నారు. -
పీహెచ్డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలి
కేయూ క్యాంపస్: పీహెచ్డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలని పరిశోధక విద్యార్థులు మంగళవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెన్యువల్ ఫీజు పెంచడంతో విద్యార్థులపై భారం పడుతోందని పేర్కొన్నారు. పరిశోధక విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపకార వేతనాలు అందడం లేదని, రెన్యువల్ ఫీజు తగ్గించి, ఫీజు చెల్లింపునకు గడువు పెంచాలని కోరారు. విద్యార్థులు కలకోట్ల సుమన్, డి.తిరుపతి, బొస్క నాగరాజు, మహబూబ్పాషా, మంద శ్యాం, చందు, గణపాక సురేశ్, గుగులోత్ శ్రీనివాస్ ఉన్నారు. -
వరంగల్
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026స్మార్ట్ క్లాసులున్నా..సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలి సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. సాక్షి, వరంగల్: ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలల్లో జిల్లాలో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. రూ.కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలు, డిజిటల్ తరగతి గదులు, నైపుణ్య ఆధారిత బోధన అందుబాటులోకి వచ్చినప్పటికీ విద్యార్థుల నమోదు తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో 2024 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు మూడేళ్లలో మొత్తం 1,543 మంది విద్యార్థుల తగ్గుదల నమోదు అవడం ఆందోళన కలిగిస్తోంది. గణనీయంగా పడిపోతున్న చేరికలు.. కొన్ని పీఎంశ్రీ పాఠశాలల్లో అడ్మిషన్ల చేరికలు గణనీయంగా పడిపోయాయి. టీఎస్ఎంఎస్ చెన్నారావుపేటలో 483 నుంచి 322కు, గీసుగొండలో 492 నుంచి 331కు, పర్వతగిరిలో 401 నుంచి 205కు, నెక్కొండలో 447 నుంచి 337కు తగ్గింది. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పర్వతగిరిలో 642 నుంచి 466కు, రాయపర్తిలో 675 నుంచి 478కు పడిపోయింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నరేంద్రనగర్లో మాత్రం 735 నుంచి 718కు స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదైంది. తగ్గుదలకు కారణాలేంటంటే.. పీఎంశ్రీ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూమ్లు, ఆధునిక ల్యాబ్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, క్రీడా సదుపాయాలు, సాంకేతిక ఆధారిత బోధన వంటి ప్రత్యేకతలు కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఈ సౌకర్యాలపై గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, ప్రైవేట్ పాఠశాలల ప్రచారం ప్రభావంతో ఆశించిన స్థాయిలో కొత్త అడ్మిషన్లు నమోదు కావడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు, ఇంగ్లిష్ మీడియంపై తల్లిదండ్రుల ఆసక్తి వంటి అంశాలు ప్రభుత్వ పాఠశాలల నమోదుపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఒకే కుటుంబంలోని పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించే ధోరణి కూడా పెరిగినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో తగ్గుతున్న అడ్మిషన్లు మూడేళ్లలో ఏకంగా 1,543 మంది విద్యార్థుల తగ్గుదల 2024–25లో 6,507 మంది ఉంటే ప్రస్తుతం 4,964 మాత్రమే వందల సంఖ్యలో నమోదు తగ్గడంతో ఆందోళన సకల సౌకర్యాలున్నా..పెరగని చేరికలుచేరికలు తగ్గిన పాఠశాలలు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ రాయపర్తి: 675 నుంచి 478 టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పర్వతగిరి: 642 నుంచి 466 టీఎస్ఎంఎస్ సంగెం: 632 నుంచి 473 టీఎస్ఎంఎస్ చెన్నారావుపేట: 483 నుంచి 322 టీఎస్ఎంఎస్ పర్వతగిరి: 401 నుంచి 205 -
ఒక్కటిగా ఆలోచిస్తేనే అభివృద్ధి
● జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చిన్నస్వామిగీసుకొండ: కులమత భేదాలను మర్చిపోయి ‘మేము–మీరు’ అనే భావనను విడిచిపెట్టి అందరూ ఒక్కటిగా ఆలోచిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు నమిండ్ల చిన్నస్వామి తెలిపారు. మంగళవారం మండలంలోని బొడ్డు చింతలపల్లిలో సర్పంచ్ పోగుల వనిత అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పౌర హక్కుల దినోత్సవ సభలు కేవలం ఎస్సీ/ఎస్టీ వాడల్లోనే కాకుండా నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులతో మాట్లాడి వారి చదువు, ఆరోగ్యం, పోషణపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ ఆర్ఐ మధు చంద్ర, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్, మెడికల్ ఆఫీసర్ సుధా, ఉప సర్పంచ్ నెరేళ్ల శైలజ, పంచాయతీ సెక్రటరీ ముక్కెర ఆనంద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
వరంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలి
ఎల్కతుర్తి: మామునూరు ఎయిర్పోర్టు ప్రక్రియను వేగవంతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్పష్టం చేశారు. సూరారంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. వరంగల్ అభివృద్ధి, కేంద్రం నిధులు, ఎయిర్పోర్టు, ఎరువుల సరఫరా తదితర అంశాలపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు మంత్రి ఘాటుగా స్పందించారు. కొత్తగా జాతీయ అధ్యక్షుడు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరంగల్ జిల్లాలో బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా పదేళ్లు అధికారంలో ఉండి ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదన్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని తెలిపారు. హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో రూ.ఐదు వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. స్మార్ట్సిటీ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కార్పొరేషన్లో మెజారిటీ లేకుండా మేయర్ అవుతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలవకుండా చైర్మన్, మేయర్ ఎలా అవుతారో చెప్పాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.10 వెళ్తే తిరిగి కేవలం రూ.3 మాత్రమే వస్తున్నాయని విమర్శించారు. వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు జాతీయ అధ్యక్షుడికి సవాల్ విసిరారు. పార్టీ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, నాయకులు బొమ్మనపల్లి అశోక్రెడ్డి, ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, గూటం జోగిరెడ్డి, రావుల రమేశ్, బచ్చు బాబురావు, పుల్లూరి శ్రీధర్రావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, తదితర నాయకులు పాల్గొన్నారు. ఎయిర్పోర్టు ప్రక్రియను వేగవంతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ -
ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయి?
కమలాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మూడు విడతల రైతుభరోసా ఇవ్వలేదని, ఎన్నికల్లో గొప్పగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కమలాపూర్ మండలంలోని 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు హామీ మేరకు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, యాప్ రైతులకు మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత కీలకమో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం, మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ప్రజలకు పూర్తిగా అర్థమవుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ తౌటంఝాన్సీ, తహసీల్దార్ సురేశ్, ఆర్ఐ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి -
ఫలితం ఆలస్యం!
నర్సంపేట: ఏ భూమిలో ఏ పంట పండుతుందో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు ఎంతగానో దోహదపడతాయి. రైతులు ఇష్టానుసారంగా ఎరువు వాడడంతో జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు భూసార పరీక్షలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఫలితాల ఆధారంగా ఎరువులు ఏ మోతా దో వాడాలనే విషయాలను రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తారు. తద్వారా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రతీ ఏడాది భూసార పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే, వాటి ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతుండడంతో రైతులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు మట్టి నమూనా ఫలితాలను అందుకోకపోవడంతో ఇష్టానుసారంగా ఎరువులు వాడడం వల్ల ప్రతీకూల ప రిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లాలో ప్రతీ రెవెన్యూ గ్రామం నుంచి 10 మట్టి నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోని ల్యాబ్కు అధికారులు పంపారు. ఫలితాలు రాకపోవడానికి ఏ చేయాలో తెలియక రైతులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వ విధానం ఇది.. పంటల సాగు భూముల్లో మట్టి నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని ల్యాబ్కు పంపాల్సి ఉంది. ఇందుకోసం రైతుల వారీగా ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రక్రియ కాస్త మందగించింది. ఇప్పుడిప్పుడే కొన్నిచోట్ల గ్రామాల వ్య వసాయ విస్తరణాధికారులు మట్టి నమూనా ఫలి తాలను ఆన్లైన్ చేస్తున్నారు. దీంతో ఫలితాల వెల్ల డి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో సేకరించిన నమూనాల ఫలితాలు ఇప్పటికీ అందలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో జిల్లాలో 1,830 మట్టి న మూనాలు సేకరించి ల్యాబ్కు పంపగా, కేవలం 295 ఫలితాలు మాత్రమే అందాయని అధికారుల ద్వారా తెలిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హనుమకొండలో ఒకటే ల్యాబ్ ఉండడంతో భూసార పరీ క్ష ల ఫలితాలు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మట్టి నమూనాల సేకరణ 1,830 ఫలితాలు వచ్చినవి 295 భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ ఫలితాల వెల్లడిలో జాప్యం నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం రైతులకు తప్పని తిప్పలుఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మర్రి నర్సింగం. ఇతనిది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామం. గతంలో రెండుసార్లు భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలను జిల్లా కేంద్రంలోని ల్యాబ్కు పంపాడు. ఏడాది గడిచినా ఫలితాలు అందలేదు. 20రోజుల క్రితం కూడా వ్యవసాయ అధికారులు వచ్చి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షల కోసం ల్యాబ్కు పంపినా నేటికీ ఫలితం రాలేదు. భూసార పరీక్షల ఫలితాలు ఆలస్యం అవుతున్నాయనడానికి ఇది ఓ నిదర్శనం. -
పెళ్లయిన వారం రోజులకే..
హసన్పర్తి: పెళ్లయిన వారం రోజుల్లోనే నవవరుడిని విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. తండ్రిని రక్షించడానికి వెళ్లి తండ్రితో పాటు అతడు మృతిచెందిన విషాద సంఘటన నగరంలోని 55వ డివిజన్ భీమారంలో మంగళవారం చోటు చేసుకుంది. భీమారానికి చెందిన ఉప్పు సాంబయ్య (62) ఎఫ్సీఐలో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యాడు. సాంబయ్యకు భార్య రమ, ముగ్గురు కుమారులు శివ కుమార్, రంజిత్ కుమార్, శరత్ కుమార్ (32) ఉన్నారు. పెద్ద కుమారుడు శివకుమార్ కరోనా సమయంలో మృతి చెందగా.. రంజిత్కుమార్, శరత్కుమార్ మాత్రం తండ్రితోనే ఉంటున్నారు. చిన్న కుమారుడు శరత్కుమార్ సీఏ పూర్తిచేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. జూన్ 24న వివాహం.. శరత్కుమార్ పెళ్లి జూన్ 24న నగరానికి చెందిన ఓ యువతితో ఘనంగా జరిగింది. పెళ్లికి వారం ముందు సెలవు పెట్టి వచ్చినట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం భీమారంలోని ఓ ఫంక్షన్హాల్లో విందు నిర్వహించారు. కాగా, సోమవారం రాత్రి నవ వధువుతో కలిసి శరత్కుమార్ తన బర్త్డే వేడుకలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఫ్లెక్సీ తొలగించే క్రమంలో ప్రమాదం.. పెళ్లిని పురస్కరించుకుని ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంగళవారం చినుకులు పడడంతో ఆ ఫ్లెక్సీ తొలగిస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. తండ్రిని రక్షించే క్రమంలో శరత్కుమార్కు కూడా కరెంట్ షాక్ తగిలింది. ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతిచెందారు. తండ్రి కొడుకుల మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో వరుడి దుర్మరణం తండ్రిని కాపాడే క్రమంలో ఇద్దరి మృతి భీమారంలో విషాదఛాయలు -
పాపం పసివాళ్లు!
వరంగల్ క్రైం: కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. కంటికి రెప్పలా ఉండాల్సిన వారే కామాంధులవుతున్నారు. బుడిబుడి అడుగులేస్తున్న వారి నుంచి మొదలు.. స్కూలు, కాలేజీకి వెళ్లే వారి దాకా అడుగడుగునా లైంగిక వేధింపులు. అఘాయిత్యాలు. చట్టాలు ఎంత కఠినతరం చేసినా చిన్నారులపై పైశాచికత్వం ఆగట్లేదు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిత్యం వెలుగుచూస్తున్నాయి. కామాంధుల వికృత చేష్టలను తల్లిదండ్రులు, పిల్లలు సైతం గుర్తించలేకపోతున్నారు. పెరుగుతున్న కేసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రతియేటా పోక్సో, రేప్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీస్స్టేషన్ వరకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. విషయం బయటకు తెలిస్తే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కొందరు తల్లిదండ్రులు.. తండ్రి, తాత, బాబాయ్, ఇలా అయిన వారి నుంచే ప్రమాదం వస్తోందని కుమిలిపోయే చిన్నారులు మరికొందరు. గ్రేటర్ వరంగల్ నగరంలో అనేకం. పోక్సో కేసుల నమోదుపై అవగాహన పెరగడం వల్ల ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు రావడంతో కొంతలో కొంతైన బాధితులకు న్యాయం జరుగుతోంది. భరోసా కేంద్రం బాధితులను అక్కున చేర్చుకోని ఓదార్చుతోంది. ‘భరోసా’ఇస్తూ.. కమిషనరేట్లోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో పోక్సో కేసులు వేగంగా నమోదు కావడంతో బాధితులు భరోసా కేంద్రానికి వస్తున్నారు. బాధితులకు కావాల్సిన అన్ని రకాల సేవలను భరోసా కేంద్రం అందిస్తోంది. తక్షణమే వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నిందితులకు శిక్ష పడే వరకు అన్ని రకాలా అండగా నిలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో 2022 నుంచి ఇప్పటి వరకు 45 మందికి శిక్ష పడింది. ఇందులో ఇద్దరికి జీవిత ఖైదు పడగా.. మరికొంత మంది 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. జిల్లా మహిళా సంక్షేమ అధికారి నుంచి 587 మంది బాధితులకు రూ.1.84 కోట్ల ఆర్థికసాయం అందింది. జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి 11 మంది బాధితులకు రూ.19.78 లక్షలు ఆర్థిక సాయం అందింది. విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 87 మంది బాధితులకు రూ. 5.64 లక్షలు అందాయి. భరోసా కేంద్రంలో సత్వర సాయం అందడం వల్ల బాధితులు కొంత ఉపశమనం పొందుతున్నారు. కమిషనరేట్ పరిధిలో మరికొన్ని ఘటనలు.. ● పక్కింట్లో జామకాయలు తెచ్చుకునేందుకు వె ళ్లిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఎవరికై నా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. తండ్రి లేని చిన్నారి భయంతో తనకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరికి చెప్పుకోలేదు. దీన్ని అదునుగా తీసుకుని పలుమార్లు బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడడంతో చి న్నారి గర్భం దాల్చింది. అనారోగ్యానికి గురవడంతో వైద్యులు పరీక్షించి తల్లికి విషయం చె ప్పారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది.కోర్టు కామాంధునికి జీవిత ఖైదు విధించింది. ● మానసికంగా బలహీనురాలైన 16 ఏళ్ల బాలికను వరుసకు చిన్నాన్న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అఘాయిత్యం చేశాడు. ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడి వదిలేయడంతో ఎక్కడికెళ్లాలో తెలియక నరకం చూసింది. విషయం తల్లికి తెలియడంతో అతడిని జైల్లో పెట్టారు. ● తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో అక్క ఇంట్లో తలదాచుకున్న 15 ఏళ్ల అమ్మాయిపై బావ తమ్ముడు బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు. అక్క ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కమిషనరేట్ పరిధిలో పోక్సో, రేప్ కేసుల నమోదు ఇలా..పోక్సో కేసులురేప్ కేసులు13619661541083052606920262022202420232024కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న పోక్సో కేసులు అభంశుభం తెలియని చిన్నారులపై పైశాచికత్వం శిక్షలు పడుతున్నా తగ్గని నేరాలు బాధితులకు అండగా భరోసా కేంద్రం కమిషనరేట్ పరిధిలో తాగిన మైకంలో 12 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు కడుపున పుట్టిన బిడ్డపై అత్యాచారం చేయడం చూసిన తల్లి ఫిర్యాదు మేరకు కామాంధుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. కోర్టు సుమారు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. -
కమిషనరేట్ పరిధిలో పోక్సో, రేప్ కేసుల నమోదు ఇలా..
196136108696160525430సంవత్సరంవరంగల్ క్రైం: కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. కంటికి రెప్పలా ఉండాల్సిన వారే కామాంధులవుతున్నారు. బుడిబుడి అడుగులేస్తున్న వారి నుంచి మొదలు.. స్కూలు, కాలేజీకి వెళ్లే వారి దాకా అడుగడుగునా లైంగిక వేధింపులు. అఘాయిత్యాలు. చట్టాలు ఎంత కఠినతరం చేసినా చిన్నారులపై పైశాచికత్వం ఆగట్లేదు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిత్యం వెలుగుచూస్తున్నాయి. కామాంధుల వికృత చేష్టలను తల్లిదండ్రులు, పిల్లలు సైతం గుర్తించలేకపోతున్నారు. పెరుగుతున్న కేసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రతియేటా పోక్సో, రేప్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీస్స్టేషన్ వరకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. విషయం బయటకు తెలిస్తే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కొందరు తల్లిదండ్రులు.. తండ్రి, తాత, బాబాయ్, ఇలా అయిన వారి నుంచే ప్రమాదం వస్తోందని కుమిలిపోయే చిన్నారులు మరికొందరు. గ్రేటర్ వరంగల్ నగరంలో అనేకం. పోక్సో కేసుల నమోదుపై అవగాహన పెరగడం వల్ల ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు రావడంతో కొంతలో కొంతైన బాధితులకు న్యాయం జరుగుతోంది. భరోసా కేంద్రం బాధితులను అక్కున చేర్చుకోని ఓదార్చుతోంది. ‘భరోసా’ఇస్తూ.. కమిషనరేట్లోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో పోక్సో కేసులు వేగంగా నమోదు కావడంతో బాధితులు భరోసా కేంద్రానికి వస్తున్నారు. బాధితులకు కావాల్సిన అన్ని రకాల సేవలను భరోసా కేంద్రం అందిస్తోంది. తక్షణమే వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నిందితులకు శిక్ష పడే వరకు అన్ని రకాలా అండగా నిలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో 2022 నుంచి ఇప్పటి వరకు 45 మందికి శిక్ష పడింది. ఇందులో ఇద్దరికి జీవిత ఖైదు పడగా.. మరికొంత మంది 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. జిల్లా మహిళా సంక్షేమ అధికారి నుంచి 587 మంది బాధితులకు రూ.1.84 కోట్ల ఆర్థికసాయం అందింది. జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి 11 మంది బాధితులకు రూ.19.78 లక్షలు ఆర్థిక సాయం అందింది. విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 87 మంది బాధితులకు రూ. 5.64 లక్షలు అందాయి. భరోసా కేంద్రంలో సత్వర సాయం అందడం వల్ల బాధితులు కొంత ఉపశమనం పొందుతున్నారు. 2025202620232022కమిషనరేట్ పరిధిలో తాగిన మైకంలో 12 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు కడుపున పుట్టిన బిడ్డపై అత్యాచారం చేయడం చూసిన తల్లి ఫిర్యాదు మేరకు కామాంధుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. కోర్టు సుమారు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పక్కింట్లో జామకాయలు తెచ్చుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఎవరికై నా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. తండ్రి లేని చిన్నారి భయంతో తనకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరికి చెప్పుకోలేదు. దీన్ని అదునుగా తీసుకుని పలుమార్లు బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడడంతో చిన్నారి గర్భం దాల్చింది. అనారోగ్యానికి గురవడంతో వైద్యులు పరీక్షించి తల్లికి విషయం చెప్పారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. కోర్టు కామాంధునికి జీవిత ఖైదు విధించింది. మానసికంగా బలహీనురాలైన 16 ఏళ్ల బాలికను వరుసకు చిన్నాన్న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అఘాయిత్యం చేశాడు. ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడి వదిలేయడంతో ఎక్కడికెళ్లాలో తెలియక నరకం చూసింది. విషయం తల్లికి తెలియడంతో అతడిని జైల్లో పెట్టారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో అక్క ఇంట్లో తలదాచుకున్న 15 ఏళ్ల అమ్మాయిపై బావ తమ్ముడు బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు. అక్క ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న పోక్సో కేసులు అభంశుభం తెలియని చిన్నారులపై పైశాచికత్వం శిక్షలు పడుతున్నా.. తగ్గని నేరాలు బాధితులకు అండగా భరోసా కేంద్రం -
పాఠశాలల్లో తనిఖీలు!
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలతో ఈ విద్యాసంవత్సరం 2026–27లోనూ తనిఖీలు చేపట్టనున్నారు. ఈమేరకు ఇటీవల తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిద్యాసంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమై కొనసాగుతుండగా.. తాజాగా అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలను కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓలను ఆదేశించారు. దీంతో డీఈఓలు మళ్లీ తనిఖీ బృందాల ఏర్పాటు కోసం ఉపక్రమించారు. గత విద్యాసంవత్సరంలో తనిఖీ బృందాల్లో బాధ్యతలను నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ఆసక్తి ఉంటే ఈసారి అవకాశం కల్పించనున్నారు. లేకపోతే మళ్లీ కొత్తవారికి అవకాశం ఇస్తారు. తనిఖీ బృందంలో పనిచేసేవారు విధులకు దూరం అవుతారు. దరఖాస్తుల స్వీకరణ హనుమకొండ జిల్లాలో అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలకు 39 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా.. డీఈఓలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో తనిఖీ బృందాల్లో పనిచేసినవారు ఆసక్తి ఉంటే.. సంబంధిత ఎంఈఓల నుంచి సిఫార్సుతోకూడిన సమ్మతి పత్రాన్ని డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరం దరఖాస్తు చేసుకోని ఉపాధ్యాయులు ఈసారి తమ హెచ్ఎంల, ఎంఈఓల ద్వారా తమ దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పాఠశాల విధులకు దూరం.. తనిఖీ బృందాల విధుల్లో పాల్గొననుండడంతో కొందరు స్కూల్ అసిస్టెంట్లు పాఠశాల విధులకు దూరం కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత (ఎస్ఏ) ఉండడంతో హైస్కూళ్లలో సబ్జెక్టుల టీచర్ల కొరత ఏర్పడనుంది. ఫలితంగా విద్యాబోధనపై ప్రతికూల ప్రభావం పడనుంది. అడ్మిషన్ల ప్రక్రియ తర్వాతే ఆయా జిల్లాల్లోని పాఠశాలల్లో టీచర్లను సర్దుబాటు కూడా చేస్తారు. 457743795163945437330బృందాల వివరాలు ఇలా..ఆసక్తి ఉన్న టీచర్ల కొనసాగింపు మళ్లీ కొత్తగా దరఖాస్తుల స్వీకరణ విధులకు దూరమవుతున్న పలువురు ఉపాధ్యాయులు ఇప్పటికే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత! ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యాబోధన విద్యార్థులు అభ్యసన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలివ్వడం. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల బోధన పరిశీలన. పాఠశాలల సందర్శన సమయాల్లో గమనించిన అంశాల ఆధారంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఎజెండాను సిద్ధం చేస్తారు. -
పీహెచ్డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలి
కేయూ క్యాంపస్: పీహెచ్డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలని పరిశోధక విద్యార్థులు మంగళవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెన్యువల్ ఫీజు పెంచడంతో విద్యార్థులపై భారం పడుతోందని పేర్కొన్నారు. పరిశోధక విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపకార వేతనాలు అందడం లేదని, రెన్యువల్ ఫీజు తగ్గించి, ఫీజు చెల్లింపునకు గడువు పెంచాలని కోరారు. విద్యార్థులు కలకోట్ల సుమన్, డి.తిరుపతి, బొస్క నాగరాజు, మహబూబ్పాషా, మంద శ్యాం, చందు, గణపాక సురేశ్, గుగులోత్ శ్రీనివాస్ ఉన్నారు. న్యూశాయంపేట: హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ శాఖ అధికారిగా జి.ముకుందారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ డీఎఫ్ఓగా విధులు నిర్వహించిన లావణ్యను మహబూబాబాద్కు బదిలీ చేశారు. హనుమకొండ జిల్లా డీఎఫ్ఓగా ముకుందారెడ్డి గురువారం బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది. నయీంనగర్ : రోడ్లు, భవనాల శాఖ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా పి.సురేష్బాబు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను సమన్వయం చేసుకొని రోడ్లు, భవనాల శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనలు పరిశీలించి పరిష్కరిస్తామని ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 13 ఫోన్ కాల్స్ స్వీకరించారు. ప్రయాణికుల సమస్యలు నమోదు చేసుకున్నారు. కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సందర్శించారు. మంగళవారం సూపరింటెండెంట్ చాంబర్లో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఆయన వెంటన ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డి తదితరులు ఉన్నారు. హన్మకొండ అర్బన్: నిర్మాణ వ్యర్థాలు విలువైన వనరులని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కేంద్ర డైరెక్టర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఆస్కీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై శిక్షణలో ఆయన మాట్లాడారు. నిర్మాణ వ్యర్థాలను చెరువులు, రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో వేస్తే పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వాటిని సేకరించి, వేరు చేసి, తిరిగి ఉపయోగిస్తే సహజ వనరుల పరిరక్షణతోపాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఇటుకలు, కాంక్రీట్, రాళ్ల వంటి వ్యర్థాలతో రహదారులు, పేవర్ బ్లాకులు, ఇతర నిర్మాణ సామగ్రిని తయారు చేయవచ్చని వివరించారు. హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
శిక్ష పడుతుందనే భయం కలగాలి
వరంగల్ క్రైం : నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నిందితులకు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలను కోర్టు నిరూపించి నేరస్తులకు శిక్ష పడటంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు దర్యాప్తు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని సీపీ అభినందిస్తూ మంగళవారం ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. గతేడాది నుంచి నేటివరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 41 కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలకు కోర్టులో శిక్షలు అమలయ్యాయని తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాము, ఏసీపీలు డేవిడ్రాజు, సతీశ్బాబు, సదయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీనివాస్, సంతోషి, రవి కిరణ్, హరిచంద్ర ప్రసాద్, బృందా దేవి, దుర్గాబాయి, రాజమల్లారెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవీందర్ రావు, కిరణ్ కుమార్, నీజర, ఇన్స్పెక్టర్లు సంజీవ్ రావు, మల్లయ్య పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను కమిషనర్ మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అదనపు డీసీపీలు సురేష్కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు అంతయ్య, సురేంద్ర, ఆర్ఐలు సతీష్, స్పర్జన్ రాజ్, హనుమకొండ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఆర్ఎస్ఐ శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
ఈ ఏడాది విద్యాసంవత్సరంలో పీఎంశ్రీ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు అధికారులు గ్రామాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి, ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నాం. కొందరు అడ్మిషన్లు తీసుకున్నా.. వారి పాఠశాలల నుంచి టీసీలు తీసుకురాకపోవడం, కొత్తవారు తరగతులకు హాజరుకాకపోవడంతో యూడైస్లో అప్డేట్ కాలేదు. ఇవేకాకుండా కొత్త విద్యార్థులను చేర్పించేందుకు అందరూ కృషి చేస్తున్నారు. –బి.రంగయ్యనాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి -
భర్త ఇంటి ఎదుట బైఠాయింపు
కమలాపూర్: తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడని, తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టింది ఓ మహిళ. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. ఐనవోలు మండలం వెంకటాపూర్కు చెందిన శ్రీజకు గుండేడుకు చెందిన డెంగు రాజుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నంగా రూ.12 లక్షల నగదు, 16 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. పైళ్లెన మూడు నెలల నుంచి భర్త, అత్త తీవ్ర వేధింపులకు గురి చేస్తూ శారీరకంగా, మానసికంగా వేధించారని, ఆ తర్వాత పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరుగగా తనదే తప్పు అని ఒప్పుకుని హైదరాబాద్కు తీసుకెళ్లాడని తెలిపింది. అక్కడ మద్యం సేవించి వచ్చి తనను కొట్టేవాడని ఆరోపించింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లి వచ్చేవాడని, ఆన్లైన్లో పేకాట ఆడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని వచ్చి అదనపు కట్నం కోసం వేధిస్తూ పుస్తెల తాడుతో ఉరి బిగించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన మేన మరదలుతో ఉంటున్నాడని, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని తనను ఇంట్లోంచి తరిమేశాడని కంట తడి పెట్టుకుంది. సుమారు 20 నెలలుగా తాను పుట్టింట్లోనే ఉంటున్నానని, పోలీసుల వద్దకు పిలిపించినా తనకేమీ ఇవ్వనన్నాడని ఆరోపించింది. ఇచ్చిన కట్నం మొత్తం తమకు ఇచ్చి న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది. -
గుడిసెలు లేని గ్రామాలే లక్ష్యం
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్: గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మండలంలోని ఎల్కుర్తి, జానకీపురం గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో 26 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, 39 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఏనాడూ ఒక్క పనిచేయని సన్నాసులు చాలా మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచులు సుధాకర్, జగన్ మోహన్రెడ్డి, మాచర్ల జ్యోతి, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్ భావ్సింగ్, ఎంపీడీఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్గా మారిన కలెక్టర్
కాజీపేట అర్బన్: పరిపాలనా విధుల్లో నిత్యం బిజీబిజీగా గడిపే కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సోమవారం చిన్నారులతో సరదాగా గడిపారు. టీచర్గా మారి పాఠాలు చెప్పారు. చిన్నారుల తో ముచ్చటించారు. కాజీపేట మండలం న్యూశాయంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ చాహత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రీస్కూల్ విద్యార్థులతో ముచ్చటించి స్కూల్ యూనిఫాం నచ్చిందా, మీ పేర్లు ఏంటి అంటూ ఆప్యాయంగా పలకరించారు. తరగతి గదిలో బోర్డుపై ఏబీసీడీలు రాసి విద్యార్థులను ప్రశ్నించారు. ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ విశ్వజ, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో సోమవారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం దంపతులు దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్త వల్ల పాములు సంచరిస్తున్నట్లు పేషెంట్లు, అటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం వ్యవధిలో రెండుసార్లు పాములు పిల్లల వార్డులోకి రావడం భయాందోళనకు గురిచేసింది. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘పిల్లల వార్డులో పాము ప్రత్యక్షం’ వార్తకు అధికారులు స్పందించారు. పాములు పట్టేవారిని పిలిపించారు. ఎంత ప్రయత్నించినా పాము దొరక్కపోవడంతో స్నేక్స్ క్యాచర్ వెనుదిరిగివెళ్లినట్లు తెలుస్తోంది. పిల్లల వార్డుతో పాటు పలు వార్డుల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థ పదార్థ్ధాలు, పనికిరాని సామగ్రి ఉండడంతో పాములు తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రం చేయించి, పాముల బెడదను తొలగించాలని అటెండెంట్లు కోరుతున్నారు. ఖిలా వరంగల్: మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ను సోమవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్కు టీజీ ఎస్పీ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించగా.. కలెక్టర్కు పోలీసులు గౌరవందనం సమర్పించారు. అనంతరం కమాండెంట్తో కలిసి కలెక్టర్.. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి అధునాతన రెస్క్యూ పరికరాలు అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ ఈ.వీరన్న, రాజేందర్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్ఐ రవి, ఆర్ఐలు కార్తీక్, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్ ఉన్నారు. -
సీపీగా ఎన్.శ్వేత
● 2012 బ్యాచ్ అధికారిణికి వరంగల్ కమిషనరేట్ బాధ్యతలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు డీఐజీగా అదనపు బాధ్యతలు ● కమిషనరేట్కు వస్తున్న తొలి మహిళా అధికారి ● సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ బదిలీ ● క్రైం డీసీపీగా ఎస్పీ(ఎన్సీ) కిషన్ సింగ్ నియామకంసాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనర్గా ఎన్.శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ (లాఅండ్ఆర్డర్)గా ఉన్న ఆమెను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వరంగల్ సీపీగా పనిచేసిన సన్ప్రీత్ సింగ్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్గా బదిలీ చేశారు. శ్వేత తెలంగాణ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణిగా ఎస్పీ, డీసీపీగా పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. వరంగల్ సీపీ బాధ్యతలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జోన్–4 డీఐజీగా కూడా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తొలి మహిళా కమిషనర్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటివరకు అంతా పురుషులే సీపీగా నియమితులయ్యారు. శ్వేత వరంగల్ కమిషనరేట్కు నియమితులైన తొలి మహిళా పోలీస్ కమిషనర్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (బీఈ) పూర్తి చేసిన ఆమె ఆ తరువాత సివిల్స్ రాశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆమె జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత, నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మహిళల భద్రత కోసం ప్రతీ డివిజన్లో ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్నారు. మహిళా సిబ్బంది స్వయంసమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా డ్రైవింగ్, ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇప్పించారు. అదేవిధంగా హైదరాబాద్ ఉత్తర మండల డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ)గా పనిచేశారు. అదేవిధంగా 2021లో సిద్దిపేట పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. తద్వారా సిద్దిపేట కమిషనరేట్కు తొలి మహిళా కమిషనర్గా సరికొత్త రికార్డు సృష్టించారు. ఆమె టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో, ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించే వినూత్న సర్వే విధానాలను ప్రవేశపెట్టడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 16 మాసాలకే సన్ప్రీత్ సింగ్ బదిలీ... ఇప్పటివరకు పనిచేసిన సీపీ సన్ప్రీత్ సింగ్ సుమారు 16 మాసాల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. ఆయన 2025, మార్చి 8న వరంగల్ కమిషనరేట్కు సీపీగా వచ్చారు. మొదట్లో ప్రజలతో సరిగా గ్రీవెన్స్ లేదని, బయట ఎక్కువ కదలికలు లేవన్న ఆరోపణలు తప్ప శాంతిభద్రతల విషయంలో ఎక్కడా తగ్గలేదన్న పేరుంది. బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ఒక్కరిద్దరు ప్రజాప్రతినిధుల లేఖల సిఫారసులు పట్టించుకోలేదని, వారడిగిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. శాంతిభద్రతలు, నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యల విషయంలో ఎక్కడా రాజీపడలేదని ఆశాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఫోన్లో పరస్పరం గొడవ పడ్డారన్న ప్రచారం ఉంది. క్రైమ్స్ డీసీపీగా కిషన్ సింగ్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం డీసీపీగా డి.కిషన్ సింగ్ను నియమించారు. ప్రస్తుతం ఆయన టీజీ–ఐసీసీసీ టెక్నికల్ విభాగంలో నాన్ కేడర్ ఎస్పీగా ఉన్నారు. ఇప్పటిదాకా కమిషరేట్లో ఖాళీగా ఉన్న క్రైం డీసీపీ పోస్టులో కిషన్సింగ్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి
న్యూశాయంపేట: హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించిన గడువును ఆరు నెలలు పొడిగించాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కమిటీలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. సోమవారం హనుమకొండలోని సీపీఎం కార్యాలయంలో ఆయా పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో అనేక మంది ఓటర్లు ఇప్పటికీ తమ వివరాలు నమోదు చేసుకోలేదని, గ్రామీణ ఓటర్లు వివరాల నమోదులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శులు ప్రభాకర్రెడ్డి, షేక్ బాషుమియా, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.భిక్షపతి, నాయకులు చుక్కయ్య, దుర్గయ్య, వెంకట్, వీరన్న, టి.భిక్షపతి, అశోక్ స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షపు నీటిని ఒడిసిపట్టాలి
దామెర: వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జల సంరక్షణ నోడల్ ఆఫీసర్ డి.చైతన్య అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకుడుగుంతల ఏర్పాటుతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. ఎగువ నుంచి దిగువకు నీరు ప్రవహించే స్ధలాలను గుర్తించి పాండ్లను నిర్మించుకోవాలన్నారు. నీటి వనరుల పెంపు కోసం ఇళ్లల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఏపీఓ శారద, ఈసీ రాజేశ్, టీఏలు సురేందర్, ప్రిసిల్లా, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సనా సెక్యూరిటీ ఏజెన్సీ బాధ్యుడు సాహెబ్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ (బీ1) జక్కలొద్ది బాలుర గురుకులంలో డిప్యూటీ వార్డెన్ (మేల్–1), జువాలజీ జూనియర్ లెక్చరర్ (జనరల్–1), కేయూ క్రాస్ రోడ్డులోని వరంగల్ (బాలికలు–1) గురుకులంలో జూనియర్ లెక్చరర్ బాటనీ (ఫిమేల్–1) పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 4వ తేదీలోపు హనుమకొండ పాత ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఉన్న సనా సెక్యూరిటీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 0870 – 3558539, 81060 78890 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. ఎంజీఎంలో పేషెంట్ కేర్ సిబ్బంది వసూళ్లు కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పేషెంట్ కేర్గా పనిచేస్తున్న సిబ్బంది రోగుల, వారి సహాయకుల నుంచి డబ్బులు వసూలు చేయడం సాధారణంగా మారింది. వైద్యం కోసం వచ్చిన వారికి సహాయం చేస్తున్నామని చెబుతూ బాహటంగానే డబ్బులు తీసుకోవడం పరిపాటిగా మారింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద రోగుల నుంచి అందినకాడికి దండుకోవడం నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. రేడియాలజీ విభాగంలోని ఎక్స్రే విభాగం వద్ద ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించునేవారు కరవయ్యారు. అధికారుల నియంత్రణ లేకపోవడం, సంబంధిత కాంట్రాక్టర్ అజమాయిషీ లేకపోవడం వల్ల పేషెంట్ కేర్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్నత వైద్యాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. టీఎన్జీఓ సంఘం జిల్లా కార్యవర్గ నియామకం ఖిలా వరంగల్: టీఎన్జీఓ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా గాదె వేణుగోపాల్, కార్యదర్శిగా పాలకుర్తి సదానందం, కోశాధికారిగా కిరణ్కుమార్ నియమితులయ్యారు. టీఎన్జీఓ భవనంలో జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్కిషన్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా కేంద్ర సంఘం సహ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రకటించారు. కార్యక్రమలో సిటీ అధ్యక్షుడు శంకేసి రాజేష్, కార్యవర్గ సభ్యులు వంశీధర్ బాబు, జి.రాజు, రమాదేవి, ఇంద్రాసేన రెడ్డి, రజినీకాంత్, శరత్, రామకృష్ణ, గణేష్, యూసూఫ్, జ్యోతి, సునీత, పద్మ, కవిత, నాయర్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ సర్వే పరిశీలన మామునూరు: ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని లక్ష్మీపురం, రంగశాయిపేట, రాంగోపాలపురంలో కొనసాగుతున్న స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (సర్) సర్వేను కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం పరిశీలించారు. మార్గదర్శకాల మేరకు ప్రతీ ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్లకు ఎన్యూరేషన్ ఫారాలు అందజేసి కచ్చితమైన వివరాలు నమోదు చేయాలని బీఎల్ఓలను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుమ, తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు. అవకతవకలకు తావివ్వొద్దు కాళోజీ సెంటర్: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ కోరారు. ఈ మేరకు డీఈఓ రంగయ్య నాయుడికి సంఘం ప్రధాన కార్యదర్శి సి.సుజన్ ప్రసాదరావుతో కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన సర్దుబాటుపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ఈసారి అలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సదానందం, కార్యదర్శి వేణుగోపాల్, అధ్యక్షుడు -
మొరాయించిన సర్వర్
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వెబ్సైట్, సర్వర్ మొరాయించడంతో భూక్రయవిక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. ఐదేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వెబ్సైట్తో పాటు సర్వర్ అప్గ్రేడేషన్లో భాగంగా ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపేశారు. సోమవారంతో మళ్లీ మొదలైన రిజిస్ట్రేషన్లు స్పీడ్గా జరుగుతాయని ఆశించినప్పటికీ భూ క్రయవిక్రయదారులకు నిరాశే మిగిలింది. సోమవారం 108 స్లాట్లకు 86 స్లాట్లు బుక్ కాగా, ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం మూడు దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి. 56 స్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయని, మిగతా స్లాట్లు రీస్లాట్స్ చేసుకోవాల్సిందేనని ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సైదులు తెలిపారు. దీంతో భూక్రయ విక్రయదారులు సాయంత్రం 7 గంటల వరకు వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
స్వచ్ఛతకు నాలుగు డబ్బాలు
సాక్షి, వరంగల్: ఒక కుటుంబం రోజుకు రెండు నిమిషాలు కేటాయించి చెత్తను విడదీస్తే.. నగరం మొత్తం పరిశుభ్రంగా మారుతుంది. ’చెత్త’గా కనిపించేది నిజానికి ఒక విలువైన వనరు. దాన్ని కలిపేస్తే సమస్య, విడదీస్తే సంపద. అందుకే పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా ఇప్పటికే మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో అమలు చేస్తున్న తడి, పొడిచెత్త డబ్బాలతో పాటు గృహ, ప్రమాదకర వ్యర్థాల డబ్బాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకనుంచి పచ్చ, నీలి, ఎరుపు, నలుపు నాలుగు డబ్బాల్లో ఇంటి యజమానుల నుంచే వేర్వేరుగా చెత్త సేకరణ జరపాలని ఆదేశిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడా అమలుచేసేందుకు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభల్లో అధికారులు చెత్త డబ్బాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా చెత్తను తడి, పొడి, ప్లాస్టిక్, ప్రమాదకర వ్యర్థాలుగా విడదీసి సంపదగా మార్చనున్నారు. ఇది సేంద్రియ ఎరువు, రీసైక్లింగ్ ముడిసరుకు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడనుంది. గ్రేటర్ వరంగల్లోనే ఎక్కువ చెత్త.. జిల్లాలోని నర్సంపేటలోని 30 డివిజన్లలో రోజువారీగా 18 టన్నులు, వర్ధన్నపేటలోని 12 విడిజన్లలో ఐదు మెట్రిక్ టన్నులు, పరకాలలోని 22 డివిజన్లలో 10 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో మాత్రం 480 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మొత్తంగా 513 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఒక్క గ్రేటర్ వరంగల్లోనే అత్యధికంగా 480 టన్నులు ఉండడం ఇక్కడా తీవ్రతను తెలుపుతోంది. అందుకే ఇక్కడ నాలుగు డబ్బాల విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రతీ కుటుంబం చెత్తను ఇంట్లోనే విడదీసి ఇవ్వడంపై అవగాహన కల్పించడం, నగరవాసులు కూడా క్రమంతప్పకుండా వేర్వేరు చేసి ఇవ్వడంతోనే విజయవంతమవుతుంది.ఇలా చేస్తే లాభం ఏంటంటే.. డంపింగ్యార్డులకు వెళ్లే చెత్త పరిమాణం తగ్గుతుంది. తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేయొచ్చు. ప్లాస్టిక్, కాగితం వంటి పొడిచెత్తను రీసైక్లింగ్కు పంపొచ్చు. దుర్వాసన, ఈగలు, దోమల సమస్య తగ్గుతుంది. కాలనీలు పరిశుభ్రంగా ఉంటాయి. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇక మరింత మెరుగ్గా చెత్త సేకరణ చర్యలు 2 బిన్ల స్థానంలో 4 బిన్ల విధానం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కొత్త విధానం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా అమలుకు కసరత్తు పర్యావరణ పరిరక్షణలో ప్రతీ కుటుంబం భాగస్వామ్యం కావాలికూరగాయల తొక్కల నుంచి కంపోస్ట్, ప్లాస్టిక్ నుంచి రీసైక్లింగ్, కాగితం నుంచి కొత్త ఉత్పత్తులు తయారవుతాయి. కానీ ఇవన్నీ ఒకే డబ్బాలో కలిపేస్తే ’చెత్త’గానే మిగిలిపోతాయి. ఇంటి వద్దే చెత్తను నాలుగు రకాలుగా విడదీసి అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతీ కుటుంబం భాగస్వామ్యం కావచ్చు. ఇప్పటికే ఉన్న రెండు డబ్బాల విధానం స్థానంలో నాలుగు డబ్బాల విధానం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా అమలు చేస్తాం. –టి.వెంకన్న, కమిషనర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ -
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● గ్రీవెన్స్కు 249 ఫిర్యాదులున్యూశాయంపేట: ప్రజల అర్జీలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఫిర్యాదుదారుల అర్జీలను కలెక్టర్ స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ వేదికగా వినతుల స్వీకరణ కార్యక్రమం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగింది. ప్రజావాణికి 249 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అందులో రెవెన్యూకు సంబంధించినవి 82, మున్సిపల్ శాఖ 65, హౌసింగ్ 31, డీఆర్డీఓ 5, ఇతర శాఖలకు సంబంధించినవి 66 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. అలాగే, వరంగల్ రెవెన్యూ డివిజన్లో 7, నర్సంపేట రెవెన్యూ డివిజన్లో 17 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.భూమి పట్టా చేయించుకుని బెదిరిస్తున్నాడు వర్ధన్నపేట మండలం పీరంగడ్డలో మాకు ఒక ఎకరం 30 గుంటల భూమి ఉంది. వృద్ధులైన మాకు తెలియకుండా మా పెద్ద కుమారుడు దౌర్జన్యంగా పట్టా చేయించుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. తహసీల్దారుకు కూడా ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలి. – బి.లచ్చమ్మ, సారయ్య దంపతులు, పీరంగడ్డ భూమి పట్టా చేయండి నాకు ఇద్దరు కుమారులు. మాకున్న 15 గుంటల భూమిని చిన్న కుమారుడు చనిపోయాక నాకు, నా పెద్ద కుమారుడికి తెలియకుండా నా చిన్న కోడలు అక్రమంగా ఆమె పేరుమీద పట్టా చేయించుకుంది. దాంతో మాకు జీవనోపాధి లేకుండా పోయింది. పంచాయితీ పెట్టితే మా మీదనే నిందారోపణలు చేసింది. తిరిగి ఆ భూమిని నాపేరు మీద పట్టా చేయండి. – పి.పూలమ్మ, నర్సక్కపేట, నల్లబెల్లి -
వృద్ధులకూ హాస్టల్
● గ్రేటర్ నగరంలో పెరుగుతున్న కల్చర్ ● సకల వసతులతో హాస్టళ్ల ఏర్పాటు ● ఫుల్ ఎనర్జిటిక్ అవుతున్న వృద్ధులుసాక్షి, వరంగల్: మార్కెట్లో బాయ్స్, గర్ల్స్ హాస్టల్ చూశాం. మారుతున్న కుటుంబ వ్యవస్థకు అనుగుణంగా ప్రస్తుతం వృద్ధుల హాస్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లో ఉన్న వారు.. ఉద్యోగరీత్యా బాగోగులు చూసుకోలేనివారు తమ తల్లిదండ్రులను ఈ హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. హాస్టల్లో చేరిన వృద్ధులు సైతం తమ ఏజ్ గ్రూప్ వాళ్లతో ఆనందంగా గడుపుతున్నారు. ప్రత్యేక శ్రద్ధ.. ఒంటరిగా జీవించలేని వృద్ధులు. నిరంతర వైద్య పర్యవేక్షణ కరువైన వారు. తమ వయసు వారితో ఆనందంగా గడపాలనుకునే వారి కోసం నగరంలో వృద్ధుల హాస్టళ్లు ఏర్పాటయ్యాయి. కాగా వీటిలో స్టార్ హోటల్కు తీసిపోకుండా ఇక్కడ వసతులు కల్పిస్తున్నారు. వృద్ధుల ఆరోగ్య దృష్ట్యా ప్రత్యేక ఆహార నియమాలు, నెలనెలా వైద్యపరీక్షలు, నర్సింగ్ సేవలు, మందుల పర్యవేక్షణ, అత్యవసర అంబులెన్స్, సీసీ కెమెరాల భద్రత, పిల్లలు విదేశాల్లో ఉన్నా వీడియో కాల్ ద్వారా ప్రతీ రోజు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. ఒంటరితనానికి మందు... కొత్త స్నేహాలు ఈ హాస్టళ్లలో వృద్ధులు కేవలం గదుల్లోనే ఉండిపోవడం లేదు. ఉదయం యోగా, ధ్యానం, సాయంత్రం నడక, భజనలు, పుస్తక పఠనం, పుట్టినరోజు వేడుకలు, పండుగల సంబరాలు... ఇలా రోజంతా చురుకుగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమలాంటి వయసువారితో గడపడంతో చాలామంది వృద్ధులు మళ్లీ జీవితంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కొందరైతే ‘ఇక్కడికి వచ్చిన తర్వాతే మళ్లీ స్నేహితులు దొరికారు’ అని చెప్పడం ఈ హాస్టళ్ల ప్రత్యేకతను తెలియజేస్తోంది. సకల వసతులు కల్పిస్తున్నాం..నేను గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సమయంలో ఓ అమ్మను తప్పనిసరి పరిస్థితుల్లో చేర్చుకున్నాం. అప్పుడే ఆలోచన పుట్టింది వృద్ధుల హాస్టల్ ఏర్పాటు చేయాలని. సకల వసతులతో నెలన్నర క్రితం హాస్టల్ ఏర్పాటు చేశాం. హెల్త్ కండీషన్ను బట్టి రూ.10 వేల నుంచి చార్జ్ చేస్తున్నాం. – మెరుగు సంపత్, వృద్ధుల హాస్టల్ నిర్వాహకుడు, హనుమకొండ -
గిరిజనుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం
● మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ హన్మకొండ : గిరిజనుల అభివృద్ధికి కేంద్రంలోని న రేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మాజీ ఎంపీ ప్రొఫెసర్, అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు గిరిజన తెగలను ఎస్టీలో కలిపిందని వివరించారు. ఆదివాసీ గిరిజన మహిళ ద్రౌపది ము ర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీది అన్నారు. ‘వికసిత్ భారత్–2047– గిరిజన అభివృద్ధి’ అనే అంశంపై నేడు హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మేధోమధనం నిర్వహించనున్నారన్నారు. బీ జేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు గిరిజన అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్లు వ్యతిరేకించాయన్నారు. గిరిజన అభివృద్ధికి ప్రాధాన్యం ఇ స్తున్న మోదీ ప్రభుత్వం 23 ఏకలవ్య స్కూళ్లు ఏర్పా టు చేసిందని, సమ్మక్క సారలమ్మ గిరిజన యూ నివర్సిటీ ఏర్పాటుతోపాటు రూ.899 కోట్లు కేటా యించిందని వివరించారు. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ట్రైబల్ డిక్లరేషన్ పేరుతో మోసం చేసిందని దుయ్యబట్టారు. నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల వెంకటరమణ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, యాప సీతయ్య, రావు పద్మ, గంట రవికుమార్, కొండేటి శ్రీధర్, దిలీప్ నాయక్, మల్లాడి తిరుపతి రెడ్డి, బన్న ప్రభాకర్, అజ్మీరా కృష్ణవేణి, స్వరూప, పగడాల కాళీప్రసాద్, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు. -
పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి.. పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం వారు సంయుక్తంగా ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు తప్పనిసరి చుక్కల మందు వేయించాలన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. 84,301 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ దుర్గారామ్ కుమార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్, మాస్ మీడియా అధికారి సుభాష్, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఈవీ శ్రీనివాస్ పాల్గొన్నారు. పల్స్పోలియో 96 శాతం పూర్తి రామన్నపేట: జాతీయ పల్స్పోలియో కార్యక్రమం తొలి రోజు (ఆదివారం) హనుమకొండ జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.డి. రామ్కుమార్ తెలిపారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 84,301 మంది చిన్నారులకు గాను పోలియో బూత్లు, ట్రాన్సి ట్ పాయింట్లు, మొబైల్ బృందాల ద్వారా 81,139 మంది చిన్నారులకు (96 శాతం) పోలియో చుక్కలు అందించినట్లు వెల్లడించారు. మొదటి రోజు పోలియో చుక్కలు తీసుకోలేని మిగిలిన చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు.. ఆరోగ్య సిబ్బందికి సహకరించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్ఓ రామ్కుమార్ విజ్ఞప్తి చేశారు. -
నేటి కేటీఆర్ పర్యటన వాయిదా
హన్మకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం వరంగల్ పర్యటన వాయిదా పడినట్లు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సోమవారం ఆయన హనుమకొండ హంటర్ రోడ్డులోని మైదానంలో బీఆర్ఎస్ వరంగల్ తూర్పు కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. అయితే కేటీఆర్ జ్వరంతో బాధపడుతుండడంతో వాయిదా వేసినట్లు వివరించారు. ఎప్పుడు జరిగేది తర్వాత తెలుపుతామని నరేందర్ తెలిపారు.తాపీమేసీ్త్రగా మారిన పాట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జిసంగెం: ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుమా.. చూసి మోసపోకుమా అనే సినీ గేయాన్ని గుర్తుకు వచ్చేలా పాట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జి లింగాల నర్సింహరెడ్డి ఆయన స్వగ్రామం సంగెం మండలం గవిచర్లలో తాపీమేస్త్రిగా మారారు. గ్రామంలోని తీగల చెరువు మత్తడిని 15 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం స్థానిక రైతులు సంబంధిత ఐబీ అధికారులకు తెలిపారు. దీని మరమ్మతులకు నిధులు లేవని, ప్రతిపాదనలు పంపామని నిధులు మంజూరైన తర్వాత పనులు చేస్తామని చెప్పడంతో వానలు వస్తే చెరువులో నీరు నిల్వ ఉండదని రిటైర్డ్ జడ్జి స్థానిక రైతులతో కలిసి కూల్చిన మత్తడిని తన సొంత ఖర్చులతో స్వయంగా సరిచేసి ఆది వారం పునరుద్ధరించారు. ఆయన వెంట రైతులు లింగాల నవీన్రెడ్డి, భాస్కర్రెడ్డి, సామల మధు, బాషిపాక రాజు ఉన్నారు. పిల్లల వార్డులో పాము ప్రత్యక్షం ● సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో భయం.. భయం కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పాముల భయం నెలకొంది. తాజాగా శనివారం ఎస్ఎన్సీయూ పిల్లల వార్డులోని సింక్ వరకు ఓ పాము రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. పసికందులు ఉండే ఫొటోథెరపి రూంలోకి పాము వచ్చి బల్లిని నోటకరుచుకోవడంతో సిబ్బందితోపాటు తల్లులు భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత పాము వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా మూడు రోజుల క్రితం కూడా ఓ పాము వచ్చిందంటూ పేషంట్ల అటెండెంట్లు తెలిపారు. ఇలా పాములు వస్తే మా బిడ్డలు, పసికందుల పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. పాముల విషయంపై ఇన్చార్జి ఆర్ఎంఓ డాక్టర్ సృజన్ను వివరణగా కోరగా... పాము వార్డులోకి వచ్చినట్లు తెలిసిందని, అప్పుడు తాను కలెక్టరేట్లో ఉన్నానని చెప్పారు. అయినా వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించామని తెలిపారు. పాములు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్ వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ క మిషనర్ ఇసంపెల్లి జోనా ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నేడు వరంగల్కు నితిన్ నబీన్
హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సోమవారం వరంగల్నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు గిరిజన ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. 4.40 నుంచి 5 గంటల వరకు హోటల్లో ఉంటారు. 5.10కి భద్రకాళి దేవస్థానం చేరుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు వెళ్తారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పార్టీ నాయకులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేల దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, వన్నాల వెంకటరమణ, జలగం రంజిత్, కుసుమ సతీష్, గుజ్జ సత్యనారాయణ రావు, సండ్ర మధు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం.. సమావేశం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలమైదానంలో కార్యకర్తలతో సమావేశం -
అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు ఆదర్శం
● చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు ● ఘనంగా 30వ మహాజన సభకాశిబుగ్గ: తెలంగాణలో ఆదర్శ బ్యాంకుగా అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు సేవలు అందిస్తున్నామని ఆ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు అన్నారు. ఆదివారం వరంగల్ తిలక్ రోడ్డులోని కేవీఎస్ ఫంక్షన్ హాల్లో బ్యాంక్ 30వ మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బ్యాంకు మంచి లాభాలతో నడుస్తోందని, వచ్చే సంవత్సరం నుంచి హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల్లో శాఖలను విస్తరించనున్నట్లు తెలిపా రు. డిజటల్ సేవలను విస్తృతంగా అందిస్తున్నామని, సామాజిక బాధ్యతగా కేంద్రం బీమా సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ ఆపరేషన్ చే యించుకున్న వారికి వైద్య సాయం కింద రూ. 25,116 అందిస్తున్నట్లు, ఇక నుంచి ఈ డబ్బులను రూ.40 వేలకు పెంచుతామన్నారు. బ్యాంకు సేవలను జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరా రు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
కట్టు తప్పుతున్న ఖాకీలపై కొరడా
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టు తప్పుతున్న అధికారులపై పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ కొరడా ఝులిపిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వేటు వేస్తున్నా మిగతా వారికి భయం ఉండడం లేదు. భూ వివాదంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రావును ఏఆర్కు అటాచ్డ్ చేసి 24 గంటల గడవకముందే పీడీఎస్ బియ్యం వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.అబ్బయ్య, బచ్చన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే హమీద్ను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్లో కలకలం సృష్టించింది. భూ వివాదాల్లో తలదూర్చవద్దని, ఇతర సెటిల్మెంట్లు చేయొద్దని పోలీస్ ఉన్నతాధికారులు నెలవారీ నేర సమీక్ష సమావేశాల్లో పదేపదే చెబుతున్నా కొందరి తీరులో మార్పురావడంలేదు. పోస్టింగ్ ఉన్న రోజుల్లోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న కక్కుర్తి.. చివరికి ఉద్యోగం ఊడేదాకా తెచ్చుకుంటోంది. పోలీస్ శాఖకు అవినీతి మరకలు.. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిస్టర్ కూల్గా పేరుంది. కానీ నిబంధనలను అతిక్రమించిన అధికారులపై తనదైన శైలిలో చర్యలు చేపడుతున్నారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై నిఘా (ఎస్బీ) అధికారులతో నివేదికలు తెప్పించుకోవడంతోపాటు క్యాట్పార్టీ అధికారులతో కూడా సమాచారం తెప్పించుకుని చర్యలు తీసుకుంటున్నారు. ● ఒకే సబ్ డివిజన్లో పనిచేసిన ఏసీపీ నందిరాంనాయక్, ఇన్స్పెక్టర్ గోపి, సబ్ ఇన్స్పెక్టర్ విఠల్పై సస్పెన్షన్ వేటు పడడం అప్పట్లో కమిషనరేట్లో సంచలనంగా మారింది. ● మామునూరు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన సమయంలో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఒంటేరు రమేశ్తోపాటు ఆయన గన్మెన్పై వేటు పడింది. ● ఏప్రిల్ 29న హసన్పర్తి పోలీస్ స్టేషన్లో రాత్రి విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ టి.రాములు మ ద్యం మత్తులో ఉండడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. ● ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబు ల్గా పనిచేస్తూ అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వాటిని తీర్చలేని వారిపై వేధింపులకు పాల్పడిన ట్లు వచ్చిన ఆరోపణలపై ఏఆర్ హెడ్ కానిస్టేబు ల్ యాదగిరిపై వేటు పడింది. అదేరోజు చెన్నారావుపేట పీఎస్ కానిస్టేబుల్పై వచ్చిన ఆరోపణల్లో సతీశ్పై వేటు పడింది. ● ఏప్రిల్ 23న అవినీతి ఆరోపణలపై నర్సంపేట ఎస్సై రవికుమార్, ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్కుమార్పై వేటు పడింది. ● విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై ఏప్రిల్ 10న ఆత్మకూరు ఎస్సై సతీశ్పై వేటు పడింది. ● మద్యం మత్తులో ఓ షాపు యజమానిపై చెయ్యి చేసుకున్నందుకు మిల్స్కాలనీ ఎస్సై శ్రీకాంత్, మద్యం మత్తులో విధులు నిర్వర్తించిన మడికొండ హెచ్సీ మోహన్రావుపై వేటు పడింది. ● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే తప్పుడు మాటలు చెప్పి నాలుగేళ్లు లైంగికదాడి, ఆపై బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సీసీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ గోదారి రాజ్కుమార్ను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ● మహిళా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మిల్స్ కాలనీ సబ్ ఇన్స్పెక్టర్ సురేశ్పై వేటు పడింది. ..ఇలా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కాసుల కోసం వెంపర్లు ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములు..సెటిల్మెంట్లకే ప్రాధాన్యం.. పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారుల ప్రాధాన్యాలు మారిపోయాయి. భూములు, సెటిల్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం మొదలవడంతో వ్యవసాయ భూముల దగ్గర జరుగుతున్న పంచాయితీలు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. వరంగల్ సబ్ డివిజన్లో పర్యవేక్షణ అధికారి (ఏసీపీ )లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్ తన పరిధిలో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన సొంత కారు వచ్చింది అంటే ఆ రోజు పెద్ద సెటిల్మెంట్ జరిగి నట్లు సిబ్బంది కోడై కూస్తున్నారు. ● పరకాల సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ తన దగ్గర పనిచేసే ఎస్సైలకు నెలవారీ మామూళ్ల చిట్టాను అందించి వాటి వసూళ్లకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆయన నోటి నుంచి పెద్ద రాజకీయ నాయకుల పేర్లు చెప్పి సిబ్బందిని భయాభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణాలు వినిపిస్తున్నాయి. ● కాజీపేట సబ్ డివిజన్లో ఓ పీఎస్లో వింత పరిస్థితి నెలకొంది. అక్కడ ఓ ఇన్స్పెక్టర్ కేసుల నమోదులో తీవ్ర నిర్లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆరోపణాలు ఉన్నాయి. దీంతో ఇన్స్పెక్టర్ రైటర్ ఇదే అదునుగా భావించి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పీడ్ పెంచిన వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులపై అవినీతి ఆరోపణలు.. వరుస సస్పెన్షన్లతో కలకలం -
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ రెడ్డికాలనీలోని వికాస్ మాస్టర్జీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలు ఆదివారం ముగిశాయి. ‘కుడా’ మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గ్రాండ్ చాంపియన్ అర్జున్ను స్ఫూర్తిగా తీసుకుని చెస్లో రాణించాలన్నారు. పాఠశాల ఏఓ నాగరాజు మాట్లాడుతూ చిన్నారులు సెల్ఫోన్కు దూరంగా ఉంటూ ఆట, చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జూలై 11, 12వ తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి రాపిడ్ రేటింగ్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. ఆర్బిటర్స్ ప్రేమ్సాగర్, రజనీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
పీవీ .. ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి
హన్మకొండ: ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కా ర్యాలయంలో మాజీ ప్ర ధాని పీవీ నర్సింహారావు జయంతి నిర్వహించా రు. ఈ సందర్భంగా ిపీవీ చిత్ర పటానికి సీఎండీ, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు కె.వెంకటరమణ, నాగ ప్రసాద్, సీజీఎంలు రవీంద్రనాథ్, కిషన్, జాయింట్ సెక్రటరీ శ్రీ కృష్ణ, జీఎంలు హేమంత్ కుమార్, మనోహర్ స్వామి, వేణు బాబు, కళాధర్, జయరాజ్, వెంకట కృష్ణ, తిరుపతి, ప్రభావతి, డి.ఈ టెక్నికల్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
● టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్కుమార్కాళోజీ సెంటర్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్కుమార్ మాట్లాడుతూ 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. శాసీ్త్రయ అంశాలను సిలబస్ నుంచి తొలగించడం, మూడ విశ్వాసాలను పెంపొందించే విధంగా, విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా ఉన్న నూతన విద్యావిధానం (ఎన్ఈపీ2020)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతనం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుజన్ప్రసాదరావు, ఉపాధ్యక్షుడు నామోజు శ్రీనివాస్, కోశాధికారి ఎస్ఏ రావూఫ్ తదితరలు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులూ.. ఆలోచించండి!
మైనర్ డ్రైవింగ్తో పెరుగుతున్న ప్రమాదాలు సాక్షి, వరంగల్: ‘మా బాబు బాగా డ్రైవింగ్ చేస్తా డు..’ ‘స్కూల్కు వెళ్లడానికి మాత్రమే..’ అంటూ మై నర్ల చేతికి బైక్లు ఇస్తున్న తల్లిదండ్రులు.. తెలియకుండానే వారి ప్రాణాలతో పాటు అమాయకుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తున్నారు. వారం రోజుల క్రితం పర్వతగిరి మండల కేంద్రంలో మైనర్ నడిపిన బైక్ ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తన ప్రాణం కూడా పోయింది. క్షణం నిర్లక్ష్యం ముగ్గురి కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్ను సీరియస్గా తీసుకున్న వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.. మైనర్ డ్రైవింగ్ హాట్స్పాట్లుగా ఉండే స్కూళ్లు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఉదయం ఎనిమిది నుంచి పది గంటలు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య మైనర్లు ఎక్కువ వాహనాలు నడుపుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సెకనులోనే.. మైనర్లకు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియదు. ఓవర్టేకింగ్, వేగ నియంత్రణ, బ్రేకింగ్ వంటి విషయాల్లో అనుభవం లేకపోవడంతో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదంగా మారుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న విద్యార్థుల్లో గణనీయమైన సంఖ్య మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు. ‘ఈ నెల 21న పర్వతగిరి మండల కేంద్రంలో 17 ఏళ్ల చరణ్ నడుపుతున్న బైక్.. ఎదురుగా వస్తున్న వడ్లకొండ ఎల్లగౌడ్(58), ఎండీ అహ్మద్ (58) ప్రయాణిస్తున్న బైక్ను వేగంతో ఢీకొనడంతో చరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఎల్లగౌడ్, అహ్మద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అలాగే, చరణ్ బైక్పై ఉన్న అతడి స్నేహితుడు చరణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదంతా సెకన్ల వ్యవధిలో జరిగింది’ అని పోలీసులు గుర్తు చేస్తున్నారు. పిల్లలకు ప్రేమతో ఇచ్చే బైక్.. ప్రాణాలకే ముప్పు చట్టం కఠినమే.. అయినా మారని పేరెంట్స్ తీరు స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవడంతో పోలీసుల ప్రత్యేక డ్రైవ్లు ఇటీవల పర్వతగిరిలో ఇద్దరి ప్రాణాలు తీసి మృతి చెందిన మైనర్‘ఇంటి నుంచి స్కూల్కు దగ్గర దూరమే అనే భావన. పిల్లల ఒత్తిడికి తల్లిదండ్రులు లొంగిపోవడం. పోలీసులు పట్టుకోరనే నిర్లక్ష్యం. స్నేహితుల ప్రభావంతో బైక్ నడపాలనే ఆసక్తి. సోషల్ మీడియాలో స్టంట్ల ప్రభావం’ ఈ అంశాలతోనే మైనర్ డ్రైవింగ్లు ఎక్కువవుతున్నాయుని సీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ‘18 ఏళ్లలోపు పిల్లలు బైక్ నడిపితే కేసు కేవలం వారిపైనే కాదు. వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా యజమానిపైనా నమోదవుతుంది. భారీ జరిమానాతో పాటు జైలు శిక్షకూ అవకాశముంది. భవిష్యత్లో లైసెన్స్ రావడం కష్టమవుతుంది. పిల్ల లు అడిగారని బైక్ ఇవ్వడం కంటే వారి భద్రత కోసం ‘ఇంకా రెండేళ్లు ఆగు’ అని చెప్పడం గొప్ప ప్రేమ. చిన్న నిర్లక్ష్యం జీవితాంతం తీరని విషాదంగా మారకముందే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి’ అని సీపీ సన్ప్రీత్ సింగ్ సూచించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్ డ్రైవింగ్పై నమోదైన కేసుల వివరాలు సంవత్సరం కేసులు 2024 174 2025 191 2026 96 ఏం పరిణామాలుంటాయంటే.. 18 ఏళ్లు పూర్తయితేనే ద్విచక్ర వాహనం నడపాలి ౖలెసెన్స్ తప్పనిసరి మైనర్కు బైక్ ఇస్తే వాహన యజమానిపై కూడా కేసు రూ.25 వేల వరకు జరిమానా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం వాహనం రిజిస్ట్రేషన్పై చర్యలు భవిష్యత్లో డ్రైవింగ్ లైసెన్స్పై ప్రభావం -
ఆర్థిక సంస్కరణల రూపశిల్పి పీవీ
● వంగరలో ఘనంగా పీవీ జయంతి భీమదేవరపల్లి: భారత మాజీ ప్రధానమంత్రి, ‘భారతరత్న’ పీవీ.నరసింహారావు జయంతి వేడుకలను ఆదివారం వంగరలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, పీవీ కుటుంబ సభ్యులు పీవీ మదన్మోహన్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు పీవీ.. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఏసీపీ ప్రశాంత్రెడ్డి సీఐ పులి రమేశ్, ఎస్ఐ దివ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పి.రాజిరెడ్డి, ఎల్కతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెంపల్లి ఐలయ్య, జిల్లా కార్యదర్శి ఆదరి రవీందర్ యాదవ్, ముల్కనూరు సర్పంచ్ జాలి ప్రమోద్రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిదురాల స్వరూప, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్ ఉన్నారు. -
సమస్యలు.. సవాళ్లు
● గ్రేటర్లో అభివృద్ధికి ప్రతిబంధకాలెన్నో.. ● కీలక ప్రాజెక్టులు ● రానున్న ఎన్నికలు, పౌర వేదనలు ప్రతిష్టాత్మకంనేడు గ్రేటర్ వరంగల్ పరిపాలన పగ్గాలు చేపట్టనున్న కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: నలుగురు యువ ఐఏఎస్ అధికాణిల తర్వాత గ్రేటర్ వరంగల్కు నాన్ ఐఏఎస్ అధికారి తేజవత్ వెంకన్న కమిషనర్గా సోమవారం(నేడు) బాధ్యతలు స్వీకరించనున్నారు. అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న గ్రేటర్ వరంగల్లో కీలక ప్రాజెక్టులను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ), ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. ప్రస్తుతమున్న 66 డివిజన్లను 100 డివిజన్లుగా పునర్విభజన చేయాలని మహా నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవేళ డివిజన్లు పెరిగితే డీ లిమిటేషన్ ప్రక్రియ కత్తిమీద సాము వంటింది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పాలకవర్గం లేకపోయినప్పటికీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆదేశాలను అమలు చేయడం, పరిపాలన చక్కదిద్దడం కొంత కఠినమైన వ్యవహరమే. ఈనేపథ్యంలో.. రాష్ట్ర మున్సిపల్ శాఖకు చెందిన నాన్ ఐఏఎస్ అధికారి (గూప్–1) అధికారిగా పలు మున్సిపాలిటీల్లో, జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కలిగి ఉన్న కొత్త కమిషనర్ తేజవత్ వెంకన్న చాకచక్యంతో బాధ్యతతో పనిచేస్తూ, సమస్యలను సవాళ్లను అధిగమించాల్సిన తరుణమిది. పాలన గాడినపాడేనా? మహా నగరంలో మరోమారు నాన్ ఐఏఎస్ పాలన మొదలుకానుంది. 2011లో ఐఏఎస్యేతర కమిషనర్గా జక్కుల శంకరయ్య పనిచేశారు. తర్వాత 2019 జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా పనిచేసిన గ్రూప్–1 అధికారి రవికిరణ్ ఆరునెలల పాటు పని చేశారు. తాజాగా అదే స్థాయి అధికారి వెంకన్న కమిషనర్గా విధుల్లో చేరనున్నారు. జవాబుదారీతనమేది? కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో సమస్యలపై ప్రజలు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు జవాబుదారీతనం కరువైంది. వింగ్ అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. కొత్త ఇంటి నంబర్లు, పేరు మార్పిడి, ఆస్తుల విభజన, కొత్త నల్లా కనెక్షన్, ట్రేడ్ లైసెన్స్, మార్టిగేజ్ రిలీజ్ ఇలా.. ఏది కావాలన్నా పైసలిస్తేనే పనులు చేస్తున్నారని ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. సిటిజన్ చార్టర్ నిబంధనలు పట్టించుకోవట్లేదు. నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయి. -
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ● జిల్లాలో 95.04 శాతం పూర్తి గీసుకొండ: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని ధర్మారం కాకతీయ హైస్కూల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో పాల్గొని ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల నిండు జీవితానికి పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమన్నారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం కోసం తల్లిదండ్రులు వారి ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డిప్యూటీ డీఎంహెచ్ఓ, డిస్టిక్ట్ ఇమ్యూనెజేషన్ ఆఫీసర్ ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రాజమౌళి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సాజిద, సయ్యద్ ఇక్తాదర్, సబ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ శౌర్య శరణ్య, సూపర్వైజర్ కిరణ్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 95.04 శాతం లక్ష్యం పూర్తి జిల్లాలో తొలిరోజు (ఆదివారం) పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 75,621 మంది చిన్నారులకు 71,869 (95.04 శాతం) మందికి పల్స్పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. పోలియో చుక్కలు తీసుకోలేని మిగిలిన చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. -
చేపల వేటకు వెళ్లి..
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి చిట్యాల: మానేరు వాగులో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామ శివా రులో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మనబోతుల రఘుపతి, బిస్కుల ఈశాంత్, ఏదుల రంజిత్, భుక్యా సమ్మయ్య గ్రామ శివారులోని మానేరు వాగులో విద్యుత్ తీగలతో చేపల వేటకు వెళ్తూ మేకల రాజు(30)కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. దీనికి మొదటగా రాజు నిరాకరించినా బలవంతంగా ఒప్పించి తీసుకెళ్లారు. వాగు వద్ద అక్రమంగా మోటారు స్టార్టర్ ఫ్యూజ్ నుంచి తీగలు లాగి నీటిలో కరెంట్ షాక్ పెడుతూ చేపలు పట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో కట్టె విద్యుత్ వైరుకు అడ్డు రావడంతో వాగు ఒడ్డున ఉన్న రాజును పిలిచి ఆ వైరును తీయమని కోరారు. దీంతో ఆ కట్టెను తీస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నలుగురిని పోలీసులు అదుపుతోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి దేవక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్ తెలిపారు. మృతుడికి భార్య మళ్లీశ్వరి ఉంది. -
నర్మెట సీఐ, ఎస్సైల సస్పెన్షన్
బచ్చన్నపేట/ నర్మెట : నర్మెట సీఐ అబ్బయ్య, బచ్చన్నపేటలో గతంలో పని చేసి వీఆర్ఎస్కు అటాచ్డ్ అయిన ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025లో బచ్చన్నపేట ఎస్సైగా వచ్చిన హమీద్ దాదాపు 16 నెలల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు. సుమారు నాలుగు నెలల క్రితం మండలంలోని సాల్వాపూర్ గ్రామ సమీపంలో పీడీఎఓస్ బియ్యం పట్టుకుని నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. కానీ పట్టుకున్న మొత్తం బియ్యం చూపించకుండా తక్కువ తూకం నమోదు చేశారనే విషయంలో సీఐ, ఎస్సైలు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ విషయమై సీపీకి ఫిర్యాదు చేయగా ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులతో విచారణ చేయించారు. ఇందులో పీడీఎస్ బియ్యం తక్కువ తూకం నమోదు చేశారనే విషయం నిరూపణ అయ్యింది. దీంతో సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్హమీద్ను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హమీద్.. ఎస్సై ఎస్కే అబ్దుల్హమీద్ పలు చోట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేవరుప్పుల మండలంలో పని చేసిన సమయంలో కూడా ఏసీబీ ట్రాప్నకు అయ్యారు. ఆ తర్వాత వీఆర్ అటాచ్డ్ అయి బచ్చన్నపేటకు వచ్చినప్పటి నుంచి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల పోచన్నపేట గ్రామ వాగు నుంచి ఇసుకను అనుమతులు లేకుండా తరలించడానికి కొంత మొత్తాన్ని ఆశించారని సీపీకి ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణ వాస్తవమని రుజువు కావడంతో వీఆర్కు అటాచ్డ్ చేస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. తిరిగి పీడీఎస్ బియ్యం ఆరోపణ కూడా నిరూపణ కావడంతో ఏకంగా సస్పెండ్ చేశారు. బచ్చన్నపేటలో సస్పెండ్ల పర్వం.. బచ్చన్నపేటలో పని చేసిన పలువురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. 2024లో పని చేసిన అప్పటి ఎస్సై నవీన్కుమార్ కూడా ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యారు. ఆ సమయంలో ఉన్న నర్మెట సీఐ నాగబాబు మరో కేసులో సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు పీడీఎస్ బియ్యం విషయంలో సీఐ అబ్బయ్య, ఎస్సై హమీద్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. -
జాతరకు వెళ్లొస్తూ మృత్యుఒడికి..
కమలాపూర్ : అసోంలో జరిగిన కామాక్యదేవి జాతరకు వెళ్లొస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్కు చెందిన కళ్లెం శ్రీనివాస్(50), చల్లా వెంకటేష్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన తూర్పాటి భార్గవ్(35), హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన తూర్పాటి హరిబాబు కలిసి అసోంలో ఇటీవల జరిగిన కామాక్యాదేవి జాతరకు వెళ్లి తిరిగి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఉప్పల్లో అదుపు తప్పి ఓ ఇంటి గోడను ఢీకొని డ్రైనేజీలోకి దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కళ్లెం శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, తూర్పాటి భార్గవ్, సీహెచ్.వెంకటేష్, తూర్పాటి హరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కమలాపూర్, నడికూడ 108 అంబులెన్స్ల్లో వెంటనే క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తూర్పాటి భార్గవ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై మృతుడు కళ్లెం శ్రీనివాస్ కుమారుడు పవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఉప్పల్లో ఘటన -
నేడు వరంగల్కు నితిన్ నబీన్
● బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి ● గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం.. సమావేశం ● ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలమైదానంలో కార్యకర్తలతో సమావేశం హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సోమవారం వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు గిరిజన ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. 4.40 నుంచి 5 గంటల వరకు హోటల్లో ఉంటారు. 5.10కి భద్రకాళి దేవస్థానం చేరుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు వెళ్తారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పార్టీ నాయకులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేలా దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, వన్నాల వెంకటరమణ, జలగం రంజిత్, కుసుమ సతీశ్, గుజ్జ సత్యనారాయణ రావు, సండ్ర మధు తదితరులు పాల్గొన్నారు. -
మరో రెండు నెలలైతే..
మరో రెండు నెలలైతే ఏడాది కాలం (80శాతం శిక్షణ) పూర్తవుతుంది. ఆగస్టు–సెప్టెంబర్ నెలలో తిరిగి సుమంత్ స్వదేశానికి వచ్చేవాడు. పెళ్లిచేసుకున్నాక మరో 20 శాతం శిక్షణ పూర్తి చేసుకోవడానికి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తానని సుమంత్ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఫోన్ కాల్తో కుప్పకూలిన కుటుంబం శనివారం వచ్చిన ఒక ఫోన్కాల్ ఆ కుటుంబాన్ని తలకిందులు చేసింది. ‘సుమంత్ ప్రయాణిస్తున్న శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది... అతడు ఇక లేడు’ అనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. -
నేటి కేటీఆర్ పర్యటన వాయిదా
హన్మకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం వరంగల్ పర్యటన వాయిదా పడినట్లు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సోమవారం ఆయన హనుమకొండ హంటర్ రోడ్డు హెలిఫాంట్ కూడలిలోని మైదానంలో బీఆర్ఎస్ వరంగల్ తూర్పు కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. అయితే కేటీఆర్ జ్వరంతో బాధపడుతుండడంతో వాయిదా వేసినట్లు వివరించారు. ఎప్పుడు జరిగేది తర్వాత తెలుపుతామని నరేందర్ తెలిపారు. నేడు బల్దియా గ్రీవెన్స్వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, నగర పౌరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుంచి కేయూ బీఫార్మసీ పరీక్షలు కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసీం ఇక్బాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29, జూలై 1, 3, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు. జర్మనీ పర్యటనకు పింగిళి కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్బాబు విద్యారణ్యపురి: జర్మనీలో స్టడీ టూర్కు రాష్ట్రం నుంచి వెళ్తున్న అధికారిక విద్యా ప్రతినిధి బృందంలో హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సురేశ్బాబు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి ఆదివారం తెలిపారు. జూన్ 28 నుంచి జూలై 6వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుందని తెలిపారు. జర్మనీలో ఉన్నత విద్యావిధానాలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ విద్యాసంస్థల భాగస్వామ్యం, పరిశోధన, వినూత్న పాఠ్యప్రణాళికలపై అధ్యయనం చేసే బృందంలో మొత్తం 35మంది ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో తాన్సీ ప్రతిభకమలాపూర్: ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన సంగెం తాన్సీ సత్తా చాటింది. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ సీనియర్ మహిళా విభాగం, జూనియర్ మహిళా విభాగంలో రెండు సిల్వర్ మెడల్స్తోపాటు 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సబ్ యూత్ విభాగంలో బ్రౌంజ్ మెడల్ కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి చాంపియన్ షిప్లో తాన్సీ నాలుగు పతకాలు సాధించడంపై కోచ్ వారణాసి సందీప్కుమార్, తాన్సీని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అభినందించారు. -
రేపు ‘రైతు భరోసా’ విడుదల
ఖిలా వరంగల్: వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 30 (మంగళవారం) నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రైతు భరోసా పథకంలో ఎకరానికి రూ.6వేల చొప్పున జిల్లాలో మొత్తం 1,56,769 మంది రైతుల ఖాతాల్లో రూ.162.80కోట్లు జమ కానున్నాయి. 13 మండలాల్లో నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు మరో 2 వేల మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పాత విధానంలోనే చెల్లింపు.. గత సీజన్లలో ఎకరం, రెండు ఎకరాలు, మూడెకరాలు.. ఇలా భూమి ఎంత ఉన్నా.. రోజుకో ఎకరం చొప్పున మొత్తం రైతులకు అందేవరకు రైతు ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం వానాకాలం సీజన్కు యాసంగి మాదిరిగా ఎకరా చొప్పున విడుదల చేస్తారా? లేక రైతులు కలిగి ఉన్న మొత్తం విస్తీర్ణానికి అందిస్తారా? అనే సందేహం రైతులను వెంటాడుతోంది. అయితే తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేసి తదుపరి రెండు, మూడు ఎకరాలు.. ఇలా పెంచుకుంటూ దాదాపు పది రోజులు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాగు ప్రారంభంలోనే .. వానాకాలం సాగు పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. దుక్కులు దున్నడానికి, విత్తనాలు నాటేందుకు పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పనుంది. సాగు ప్రారంభంలోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తుండటంతో ఇబ్బందులు తొలగనున్నాయి. కొత్త వారికీ అవకాశం.. నూతనంగా పట్టా పాస్బుక్ పొందిన రైతులకు సైతం రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు పత్రం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్లతో జూలై 5వ తేదీ వరకు ఆయా రైతు వేదికల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు రైతు భరోసా సాయం పొందుతున్న ప్రస్తుత లబ్ధిదారుల్లో బ్యాంకు ఖాతా మార్చుకోవాల్సిన రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. జిల్లాకు రూ.162.80 కోట్లు కేటాయింపు 1,56,769 మంది రైతులు కొత్తగా పట్టాపాస్ పుస్తకం పొందిన వారికి కూడా.. -
నది.. హతవిధి
ప్రస్తుతం నీరు తగ్గి కనిపిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులుత్రివేణి సంగమం వద్ద గతేడాది జూన్ 28న పుష్కరఘాట్కు చేరిన వరద(ఫైల్)కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ప్రతీ ఏడాది జూన్ 20 నాటికే సమృద్ధిగా వర్షాలు కురిసి గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగేవి. కానీ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనా ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో గోదావరిలో నీటి ప్రవాహం కదలడం లేదు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రాణహిత, తెలంగాణ నుంచి వచ్చే గోదావరి నదులు ప్రస్తుతం స్వల్ప స్థాయి నీరుతోనే దర్శనమిస్తున్నాయి. గతేడాది ఇదే నెల 28 నాటికి గోదావరి నీరు పుష్కర ఘాట్ మెట్ల వరకు చేరి ప్రవహించిందని స్థానిక రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల ముగుస్తున్నా వర్షాలు ఆలస్యం కావడంతో భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందని, వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో మళ్లీ రెండోసారి విత్తుతున్నారు. ఇప్పటికై నా వరుణుడు కరుణించి విస్తారంగా వర్షాలు కురిసి గోదావరిలో నీటి ప్రవాహం పెరగాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు. నీటి ప్రవాహం లేకపోవడంతో కదలని గోదావరి ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు ఫలితంగా స్వల్పస్థాయి నీటితోనే దర్శనమిస్తున్న నది -
అలరించిన స్వరవైభవం
హన్మకొండ చౌరస్తా : ఘంటసాల గంధర్వ గానా మృత వేదిక, లిటిల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గానకళ తపస్వి డా క్టర్ శరత్ చంద్ర దర్శకత్వంలో ఆదివారం హనుమకొండ పద్మాక్షి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన ‘స్వర వైభవం’ అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జగదీశ్ బాబు, ప్రొఫెసర్ తిరుపతయ్య హాజరై మా ట్లాడుతూ వర్ధమాన గాయనీగాయకులను ప్రోత్సహించడం, సంగీత సంస్కృతిని భావితరాలకు చేరవేయడమే ఈ సంస్థ లక్ష్యమన్నారు. సుమారు 50 మంది గాయనీగాయకులు పాల్గొని ఘంటసాలతో పాటు పలువురు ప్రముఖ గాయకుల మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉపేందర్, నిమ్మల శ్రీనివాస్, ఎంఎల్ రావు, దేవేంద్రాచారి, టీవీ రమేశ్, చోటు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న టీజీపీఎస్సీ చైర్మన్ హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఐఏఎస్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. -
సమస్యలు.. సవాళ్లు
● గ్రేటర్లో అభివృద్ధికి ప్రతిబంధకాలెన్నో.. ● కీలక ప్రాజెక్టులు ● రానున్న ఎన్నికలు, పౌర వేదనలు ప్రతిష్టాత్మకంవరంగల్ అర్బన్: నలుగురు యువ ఐఏఎస్ అధికారుల తర్వాత గ్రేటర్ వరంగల్కు నాన్ ఐఏఎస్ అధికారి తేజవత్ వెంకన్న కమిషనర్గా సోమవారం(నేడు) బాధ్యతలు స్వీకరించనున్నారు. అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న గ్రేటర్ వరంగల్లో కీలక ప్రాజెక్టులను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ), ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. ప్రస్తుతమున్న 66 డివిజన్లను 100 డివిజన్లుగా పునర్విభజన చేయాలని మహా నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవేళ డివిజన్లు పెరిగితే డీ లిమిటేషన్ ప్రక్రియ కత్తిమీద సాము వంటింది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పాలకవర్గం లేకపోయినప్పటికీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆదేశాలను అమలు చేయడం, పరిపాలన చక్కదిద్దడం కొంత కఠినమైన వ్యవహారమే. ఈనేపథ్యంలో.. రాష్ట్ర మున్సిపల్ శాఖకు చెందిన నాన్ ఐఏఎస్ అధికారి (గూప్–1) అధికారిగా పలు మున్సిపాలిటీల్లో, జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కలిగి ఉన్న కొత్త కమిషనర్ తేజవత్ వెంకన్న చాకచక్యంతో బాధ్యతతో పనిచేస్తూ, సమస్యలను సవాళ్లను అధిగమించాల్సిన తరుణమిది. పాలన గాడినపడేనా? మహా నగరంలో మరోమారు నాన్ ఐఏఎస్ పాలన మొదలుకానుంది. 2011లో ఐఏఎస్యేతర కమిషనర్గా జక్కుల శంకరయ్య పనిచేశారు. తర్వాత 2019 జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్గా పనిచేసిన గ్రూప్–1 అధికారి రవికిరణ్ ఆరునెలల పాటు పని చేశారు. తాజాగా అదే స్థాయి అధికారి వెంకన్న కమిషనర్గా విధుల్లో చేరనున్నారు. జవాబుదారీతనమేది? కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో సమస్యలపై ప్రజలు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు జవాబుదారీతనం కరువైంది. వింగ్ అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. కొత్త ఇంటి నంబర్లు, పేరు మార్పిడి, ఆస్తుల విభజన, కొత్త నల్లా కనెక్షన్, ట్రేడ్ లైసెన్స్, మార్టిగేజ్ రిలీజ్ ఇలా.. ఏది కావాలన్నా పైసలిస్తేనే పనులు చేస్తున్నారని ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. సిటిజన్ చార్టర్ నిబంధనలు పట్టించుకోవట్లేదు. నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయి. నేడు గ్రేటర్ వరంగల్ పరిపాలన పగ్గాలు చేపట్టనున్న కమిషనర్ వెంకన్న -
మరో రెండు నెలలైతే..
మరో రెండు నెలలైతే ఏడాది కాలం (80శాతం శిక్షణ) పూర్తవుతుంది. ఆగస్టు–సెప్టెంబర్ నెలలో తిరిగి సుమంత్ స్వదేశానికి వచ్చేవాడు. పెళ్లిచేసుకున్నాక మరో 20 శాతం శిక్షణ పూర్తి చేసుకోవడానికి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తానని సుమంత్ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఫోన్ కాల్తో కుప్పకూలిన కుటుంబం శనివారం వచ్చిన ఒక ఫోన్కాల్ ఆ కుటుంబాన్ని తలకిందులు చేసింది. ‘సుమంత్ ప్రయాణిస్తున్న శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది... అతడు ఇక లేడు’ అనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
● సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్క సాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్న ఈ సమావేశంలో రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. తాజా మార్కెట్ ధరల ప్రకారమే భూసేకరణ.. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఈ ప్రాజెక్టుకు మొత్తం 244.23 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని తెలిపారు. 2020–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి సీతక్క 2020–21లో జారీ చేసిన పాత భూసేకరణ అవార్డును ఉపసంహరించి, తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలతో వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో రామప్ప–లక్నవరం కెనాల్ పూర్తయ్యేలా.. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమై 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, వచ్చే వారంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఆసక్తి ఉంటే అపార అవకాశాలు
హసన్పర్తి: నేర్చుకోవాలనే ఆసక్తిన్నవారికి సృజనాత్మక రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత నీతా లుల్లా అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ, హామ్స్టెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్సార్ యూ ‘స్కూల్ ఆఫ్ డిజైన్ పవర్డ్ బై హాక్స్టెక్’ను శనివారం నీతా లుల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా నీతా లుల్లా మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా డిజైన్ విద్య కూడా నిరంతరం మారాలని సూచించారు. హామ్స్టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ అజితా యోగేష్ మాట్లాడుతూ మూడు దశలుగా డిజైన్ విద్యలో హామ్స్టెక్ సంపాదించిన అనుభవాన్ని ఎస్సార్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ విద్యార్థులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ నిపుణుల మార్గదర్శకత్వం, అంతర్జాతీయ అవకాశాలు, విజయవంతమైన కెరీర్కు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ దీపక్గార్గ్ మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించడంలో ఎస్సార్ యూ స్కూల్ ఆఫ్ డిజైన్ ముందు వరుసలో ఉంటోందని చెప్పారు. ఈ సందర్భంగా నీతా లుల్లా బృందం ర్యాంప్పై ప్రదర్శనలు ఇచ్చింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా ఎస్సార్యూలో డిజైన్ స్కూల్ ప్రారంభం -
ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేయాలి
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాకు తొలి విడత మంజూరైన 3,243 ఇళ్ల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. వనమహోత్సవం కింద 8 లక్షల మొక్కలను నాటాలని సూచించారు. గుడిసెల్లో నివసిస్తున్న 2,074 మంది అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని, రూఫ్ రీప్లేస్మెంట్ దశలో ఉన్న 615 మంది లబ్ధిదారుల వివరాలను కూడా పరిశీలించాలని సూచించారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్పోలియోకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 0–5 సంవత్సరాల వయస్సు గల 84,301 మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా చూడాలని అన్నారు. -
రేవంత్ పాలనలో ఒరిగిందేమి లేదు
● బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ హన్మకొండ: రేవంత్రెడ్డి పాలనలో ప్రజలు, రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారం హనుమకొండ హంటర్రోడ్లోని వేద బాంక్వెట్ హాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్తులను కొల్లగొట్టడం, ప్రజలను వంచించడం మినహా చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని సమదృష్టితో చూస్తోందన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన కొత్తగా చేస్తున్నదేమి కాదని, దీనిపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ముస్లింలు అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లింలని సీఎం రేవంత్ అంటున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనతోనే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని, 12 ఏళ్ల నరేంద్రమోదీ పాలనలో రాష్ట్రానికి కేంద్రం రూ.130 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. ఒక్క రైల్వేకు రూ.3,000 కోట్లు ఇచ్చిందని, రైల్వే స్టేషన్లను అధునీకరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారని, ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 29న హనుమకొండలోని అశోక హోటల్లో జరిగే ఆదివాసీ గిరిజన సదస్సు, అనంతరం సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే బీజేపీ పోలింగ్ బూత్, ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని లక్ష్మణ్ వివరించారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్రెడ్డి, గంట రవికుమార్, నాయకులు మార్తినేని ధర్మారావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా అందుబాటులో ఉంది..
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మలదుగ్గొండి: జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు యాప్లో బుక్ చేసుకుని యూరియా తీసుకోవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల అన్నారు. మండల పరిధిలోని గిర్నిబావిలో పలు విత్తన, ఎరువుల దుకాణాలను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల వివరాలను పరిశీలించారు. యాప్లో యూరియా బుక్ చేసుకున్న వారికి అందించారా లేదా అనే వివరాలను యాప్లో తనిఖీ చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొంత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. భూమి సరిపడా తడిసిన తర్వాతనే విత్తనాలు వేయాలని సూచించారు. రైతుబరోసా కోసం రైతులు తమ వివరాలను ఏఈఓ లకు అందించాలన్నారు. గతంలో అన్ని సరిగా ఉండి అకౌంట్లలో డబ్బులు జమకాని వారు, కొత్తగా పాస్బుక్లు వచ్చిన వారు జులై 5వ తేదీలోగా తమ వివరాలను అందించాలని సూచించారు. పీఎం కిసాన్ కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఏఓ సూచించారు. ఆమె వెంట ఏఓ గాజుల శ్యామ్, ఏఈఓలు హన్మంతు, విజయ్నాయక్ ఉన్నారు. -
మామునూరుకు మహర్దశ
మామునూరు: వరంగల్ మామునూరుకు మాహర్దశ పట్టనుంది. ఉమ్మడి రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన పశుపరిశోధన స్థానం, టీఎస్ఎస్పీ బెటాలియన్, పోలీస్ శిక్షణ కళాశాల, పశుపాలిటెక్నిక్, కృషివిజ్ఞాన కేంద్రం, వెటర్నరీ డిగ్రీ కళాశాలు ఇక్కడ ఉన్నాయి. నూతనంగా మామునూరుకు విమానాశ్రయం పునరుద్ధరణతోపాటు ఈవీ ఆర్టీసీ బస్డిపో, క్రికెట్ స్టేడియం, పరిశ్రమల ఏర్పాటు, హనుమకొండ నుంచి వరంగల్ ఆర్డీఓ కార్యాలయం తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద చెరువును అధునిక హంగులతో మినీ ట్యాంక్బండ్ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే మామునూరు మండల కేంద్రంగా ప్రకటించాలని సాధన సమితి ఉద్యమాలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మామునూరుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలనే లక్ష్యంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక దృష్టిసారించారు. జాతీయ రహదారి పక్కనే పశుసంవర్థక శాఖకు చెందిన సుమారు ఆరు ఎకరాల భూమి ఉండగా.. మూడు ఎకరాల్లో ఈవీ బస్డిపోను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. రోడ్డు పక్కన విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, నివేదికను కలెక్టర్కు అందజేశారు. వరంగల్ ఆర్డీఓ టి.సుమ శనివారం పశుసంవర్థక శాఖ స్థలాన్ని సందర్శించారు. తహసీల్దార్ ఇక్బాల్తో కలిసి ఈవీ డిపో ఏర్పాటు, క్రికెట్ స్టేడియం, పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసినట్లు తెలిసింది. స్థానికులు, ఆర్టీసీ అధికారులో ఆర్డీఓ మరోసారి చర్చించారు. మామునూరు పరిధిలోని అనేక ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈవీ ఆర్టీసీ డిపో ఏర్పాటు కోసం సర్వే అధికారులు రంగంలోకి దిగి కొలతలు వేసి భూమి విస్తీర్ణం తెలియజేయాలని ఆమె ఆదేశించారు. దీనిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందజేయనున్నట్లు ఆర్డీఓ సుమ పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అఽధికారులు, స్థానికులు ఎర్ర విజయ్కుమార్, మాచర్ల కుమారస్వామి, మన్నె బాబురావు, బండి సాంబయ్య యాదవ్, మన్నె భిక్షపతి, దేవానందం, పాపిరెడ్డి, కోటేశ్వర్ పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026
శాయంపేట: ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు నాలికె భిక్షపతి. శాయంపేట మండల కేంద్రానికి చెందిన ఈయనకు సొంతగా రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని 15 రోజుల క్రితం కురిసిన తొలకరి జల్లులకు మొత్తం 8 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాడు. వర్షాలు కురవకపోవడంతో శుక్రవారం పత్తి విత్తనాలకు స్ప్రింక్లర్లతో నీటిని వెదజల్లాడు. ట్రాక్టర్తో బోజ, పల్టర్ కొట్టడానికి, దుక్కి దున్నడానికి, విత్తనాలకు మొత్తం రూ.45 వేలు ఖర్చయ్యిందని వాపోయాడు. వర్షం లేక విత్తనాలు ఎండిపోతున్నట్లు చెప్పాడు. ఈ పరిస్థితి ఒక్క నాలికె భిక్షపతిది మాత్రమే కాదు.. జిల్లాలోని అనేక మంది రైతులది. -
రేవంత్ పాలనలో ఒరిగిందేమి లేదు
బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ హన్మకొండ: రేవంత్రెడ్డి పాలనలో ప్రజలు, రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారం హనుమకొండ హంటర్రోడ్లోని వేద బాంక్వెట్ హాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని సమదృష్టితో చూస్తోందన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన కొత్తగా చేస్తున్నదేమి కాదని, దీనిపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ముస్లింలు అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లింలని సీఎం రేవంత్ అంటున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనతోనే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని, 12 ఏళ్ల నరేంద్రమోదీ పాలనలో రాష్ట్రానికి కేంద్రం రూ.130 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 29న హనుమకొండలోని అశోక హోటల్లో జరిగే ఆదివాసీ గిరిజన సదస్సు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళా శాల మైదానంలో జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని లక్ష్మణ్ వివరించారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతో ష్రెడ్డి, గంట రవికుమార్, నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, గువ్వల బాలరాజు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రావు పద్మ, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, వన్నాల వెంకటరమణ ఉన్నారు. -
కేటీఆర్పై విజిలెన్స్ విచారణ చేయాలి
‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిహన్మకొండ చౌరస్తా: కుడాకు సంబంధించిన రూ.45 కోట్ల నిధులను చట్టవిరుద్ధంగా కార్పొరేషన్కు బదిలీ చేయించిన మాజీ మంత్రి కేటీఆర్పై విజిలెన్స్ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈకార్ కేసు మాదిరిగా కుడా నిధులను సైతం మంత్రి హోదాలో ఆనాడు కేటీఆర్ తన ఇష్టానుసారంగా కార్పొరేషన్కు మళ్లించాడన్నారు. వేలంలో కుడాకు రూ.50 కోట్ల నష్టం జరుగుతుందని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.150 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని, కుడా భూములను కబ్జా నుంచి కాపాడేందుకు బ్లూప్రింట్ తీశామని వివరించారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేశామని అన్నారు. -
‘సర్’ పారదర్శకంగా చేపట్టాలి
● పరకాల ఆర్డీఓ వెంకన్న సంగెం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పారదర్శకంగా చేపట్టాలని పరకాల ఆర్డీఓ డీఎస్. వెంకన్న బీఎల్ఓలను ఆదేశించారు. మండల పరిధిలోని కాపులకనిపర్తిలో సర్ ప్రక్రియను ఆయన శనివారం పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు ఫారాల అందజేత, సర్వే చేస్తున్న వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరపాట్లకు తావులేకుండా ఎన్యూమరేషన్ ఫారాలను పూరించాలన్నారు. అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించవద్దని అధికారులకు సూచించారు. అనంతరం బీఎల్ఓలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంగెం తహసీల్దార్ గనిపాక రాజ్కుమార్, సూపర్వైజర్ నరేందర్, బీఎల్ఓలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
దుగ్గొండి: గుప్త నిధుల కోసం కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తవ్వకాలు చేపట్టగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మండల పరిధిలోని నాచినపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని పోచమ్మ ఆలయం వీధిలో ఓ వ్యక్తికి చెందిన పెరటి భూమిలో 8 మంది అనుమానాస్పదంగా చుట్టూ పరదాలు కట్టి గుంత తవ్వుతున్నారు. గుంతలో పసుపు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, దీపాలు వెలిగించి ఉంచారు. ఇది గమనించిన చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురై సర్పంచ్ పెండ్యాల రాజుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 8 మంది వ్యక్తులను పోలీస్స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. అయితే భూమి యజమాని మాత్రం ఎల్ల మ్మ ఆలయం కడుతున్నానని ఒకసారి, మైసమ్మను ప్రతిష్టించుకుంటున్నానని పొంతన లేని సమాధానం ఇస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్కసాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి సీతక్క పాల్గొన్న ఈ సమావేశంలో రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణపై అధికారులు నివేదిక సమర్పించారు. తాజా మార్కెట్ ధరల ప్రకారమే భూసేకరణ.. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఈ ప్రాజెక్టుకు మొత్తం 244.23 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని తెలిపారు. 2020–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి సీతక్క భూసేకరణకు తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. రెండేళ్లలో రామప్ప–లక్నవరం కెనాల్ రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమై 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, వచ్చే వారంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
103.8
111.9105.5116.6125.2112.0127.9135.9136.6145.5132.566%35.083%18.770%31.790%12.096%4.584%18.057%54.482%24.286%18.540.073%44.5 -
సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలి
న్యూశాయంపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అన్ని శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి బి.బాలమాయాదేవి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేసిన 10 థీమ్లకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంబంధిత శాఖల అధికారులు వివరాలు సమర్పించారు. వివిధ శాఖల వారీగా సాధించిన పురోగతితో పాటు లక్ష్యాల సాధన, ఎదురవుతున్న సమస్యలు, చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమా, ఉమారాణిలతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక అధికారి బాలమాయాదేవి -
కరుణించని వరుణుడు
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026హన్మకొండ కల్చరల్: శనిత్రయోదశిని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్శర్మ ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో శనీశ్వర ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారు. విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డైట్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ప్రవేశాలకు ఈనెల 29న మూడోదశ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు హనుమకొండలోని ప్రభుత్వ డైట్ (జిల్లా విద్యాశిక్షణ సంస్థ) ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్ బి.రంగయ్యనాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజనల్ సర్టిఫికెట్లు, ర్యాంకు కార్డు, హాల్టికెట్, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, టీసీ, ఎన్సీసీ, క్రీడలు, పీఎస్ ధ్రువపత్రాలు తీసుకొని హాజరుకావాలని సూచించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు ఈనెల 30న ఆప్షన్లు ఇచ్చుకోవాలని, జూలై 4న మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, 9న కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆయన కోరారు. హన్మకొండ: నూతనంగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులు జూలై ఐదో తేదీలోపు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి వి.విజయచంద్ర కోరారు. ఈ నెల 15వ తేదీలోపు సీసీఎల్ఎ ద్వారా భూభారతి పోర్టల్ నమోదైన రైతులు ఏఈఓలను కలిసి వివరాలు అందించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సీజన్లో రైతు భరోసా సాయం అందని రైతులు తమ బ్యాంకు ఖాతాలు సరి చేసుకుని, ఫోన్ నంబర్గా తప్పుగా నమోదైన రైతులు, ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లు అనుసంధానమైన రైతులు వెంటనే సవరణలు చేసుకోవాలని, ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ విధిగా చేయించుకోవాలని కోరారు. వరంగల్ స్పోర్ట్స్: కిక్ బాక్సింగ్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి.రామాజంనేయులు, ఒలింపిక్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కై లాశ్యాదవ్, లీగల్ అడ్వైజర్లు సత్యనారాయణ, తిరుమల, విరందరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్గా బండారి సంతోష్, జనరల్ సెక్రటరీగా సిరిగిరి తిరుపతి, కోశాధికారిగా సాదినేని శ్యాంకుమార్, వైస్ ప్రెసిడెంట్గా సీహెచ్ సుప్రియ, జాయింట్ సెక్రటరీగా ఎస్.సాంబశివ, కార్యవర్గ సభ్యులుగా పి.దినేశ్తేజ, పి.గణేశ్తేజ ఎన్నికయ్యారు. సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 17 జిల్లాలు వర్షపాతం లోటుతో ఉండగా ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయి. వర్షాధార వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రైతులు విత్తనాలు సిద్ధం చేసుకున్నా, సరిపడా వానలు లేక సాగు పనులు నత్తనడకన సాగుతున్నాయి. జూన్ 1 నుంచి 24 వరకు రాష్ట్రంలో సాధారణంగా 101.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 84.9 మిల్లీమీటర్లే కురిసింది. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు జిల్లాలో 58 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ స్థాయిలో వర్షాలు కురిస్తేనే సాగు పూర్తి స్థాయిలో ఊపందుకునే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. నత్తనడకన ‘సాగు’తోంది.. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, కందులు వంటి పంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. సాధారణంగా జూన్ రెండో వారానికి రైతులు విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు. అయితే ఈసారి ఆశించిన వర్షాలు లేకపోవడంతో చాలామంది రైతులు విత్తనాలు వేసే పనులను వాయిదా వేశారు. చిన్నపాటి వర్షానికి కొందరు రైతులు విత్తనాలు నాటినా భూమిలో తేమ లేకపోవడంతో అవి వాడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సంమృద్ధిగా కురిస్తే మళ్లీ విత్తనాలు విత్తాల్సిన పరిస్థితి నెలకొనడంతో పెట్టుబడి ఖర్చు తడిసిమోపెడవుతుందని రైతులు వాపోతున్నారు. వచ్చే రెండు వారాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే సాగు గాడిలో పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.జిల్లా వ్యాప్తంగా తగ్గిన వర్షపాతం ఇప్పటికే 58శాతం లోటు.. సాగుపై తీవ్ర ప్రభావం వాడిపోతున్న పత్తి విత్తనాలు ఎదురుచూస్తున్న అన్నదాతలు ఈవీ బస్డిపో నిర్మాణానికి ఆర్డీఓ స్థలపరిశీలన క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కార్యాచరణ అంతర్జాతీయ స్థాయిలో ఇండస్ట్రీ ఏర్పాటు ఆర్డీఓ కార్యాలయం తరలింపునకు ప్రతిపాదనలు మినీ ట్యాంక్బండ్గా పెద్ద చెరువు అభివృద్ధికి చర్యలుఫొటోలో కనిపిస్తున్న రైతు సంగెం మండల కేంద్రానికి చెందిన ఉండిల మల్లికార్జున్. ఇతనికి 5 ఎకరాల భూమి ఉంది. కొద్దిపాటి వర్షానికి ట్రాక్టర్తో దుక్కి దున్నుంచి పత్తి గింజలు విత్తాడు. దుక్కి చేసినందుకు ఖర్చు కాకుండా ఎకరం అచ్చు తోలడానికి రూ.1,000, పత్తి గింజలకు రూ.1,500, నాటడానికి రూ.1.200 ఎకరానికి రూ.3,700 ఖర్చు అయింది. ఈ లెక్కన 5 ఎకరాలకు రూ.18,500 ఖర్చయింది. చినుకు జాడ లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తడకపోవడంతో మరోసారి విత్తనాలు నాటాలంటే మరో రూ.18,500 పెట్టుబడి పెట్టాల్సి ఉందని ఆందోళన చెందుతున్నాడు. ఈ ఫొటోలోని రైతుపేరు నల్ల రాజిరెడ్డి, దుగ్గొండి మండలం నాచనపల్లి గ్రామానికి చెందిన ఇతను మూడు ఎకరాల వ్యవసాయ భూమిని రూ.లక్షకు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కురిసిన చిన్నపాటి వర్షానికి రెండు సార్లు పత్తి విత్తనాలు వేశాడు. ఆపైన వర్షం ముఖం చాటేసింది. పదను సరిపోక మొలక పైకి రాలేక విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. దీంతో మూడోసారి విత్తనాలు కొనాలంటే మళ్లీ డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఈ నెల 30 తర్వాత వర్షాలు కురిసినా.. పత్తి విత్తనాలు వేస్తే పంటకాలం మారిపోతుందని పంట చేతికొచ్చే సమయంలో గులాబీ రంగు పురుగు ఆశించి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నాడు. ఇక పత్తి పెట్టడం మానుకోవడమే ఉత్తమమని భావిస్తున్నాడు. అత్యధిక లోటు వర్షపాతం: హనుమకొండ –96 శాతం, ఎల్కతుర్తి –89శాతం, కాజీపేట –89 శాతం, ఆత్మకూరు –87 శాతం, ఐనవోలు –83 శాతం, హసన్పర్తి –82 శాతం, దామెర –81 శాతం, శాయంపేట –71 శాతం, ధర్మసాగర్ –69 శాతం, వేలేరు –68 శాతం, కమలాపూర్ –65 శాతం, నడికూడ –64 శాతం లోటు వర్షపాతం : భీమదేవరపల్లి –58 శాతం, పరకాల –54 శాతం, అత్యధిక లోటు వర్షపాతం: వరంగల్ –84 శాతం, గీసుకొండ –72 శాతం, ఖిలావరంగల్ –96 శాతం, సంగెం –61 శాతం, పర్వతగిరి –84 శాతం, నెక్కొండ –75 శాతం, చెన్నారావుపేట –70 శాతం, నర్సంపేట –80 శాతం లోటు వర్షపాతం: ఖానాపురం–56 శాతం, నల్లబెల్లి –30 శాతం, రాయపర్తి –23 శాతం సాధారణ వర్షపాతం: వర్ధన్నపేట –17 శాతం, దుగ్గొండి –రెండు శాతం -
వామపక్షాల ర్యాలీ ఉద్రిక్తం
హన్మకొండ: పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు హనుమకొండ, వరంగల్ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం పేదలతో కలిసి ర్యాలీ ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద పేదలతో కలిసి వామపక్షపార్టీల నాయకులు రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం ఇక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలికి చేరుకోగానే మరోసారి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతోపాటు మరికొందరు నాయకులను అరెస్టు చేశారు. పోలీసులు వాహనంలో నాయకులను తరలిస్తుండగా కార్యకర్తలు, పేదలు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జూలై 1న హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్ల ఎదటు పికెటింగ్ నిర్వహించి, జూలై 6న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రాష్ట్రస్థాయిలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె భిక్షపతి, షేక్ బాష్మియా, సీపీఎం హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు జి.ప్రభాకర్రెడ్డి, సీహెచ్ రంగయ్య, నాయకులు జ్యోతి ఉన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలిలో బైఠాయింపు కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, నాయకుల అరెస్ట్ -
5,513 ఎకరాల్లో మాత్రమే పంటల సాగు..
హన్మకొండ: కోటి ఆశలతో వానాకాలం సాగుకు సిద్ధమైన రైతులతో ప్రకృతి దోబూచులాడుతోంది. సీజన్ ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా చినుకు జాడలేదు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కనీస వర్షపాతం నమోదు కాలేదు. పంటల సాగుకు సిద్ధమైన రైతులు ఆదిలోనే ఆందోళనకు గురవుతున్నారు. రోహిణి, మృగశిర కార్తెలు పోయి ఆరుద్ర కార్తె ప్రవేశించినా వరుణుడు కరుణించకపోవడంతో ఏం చేయాలో రైతన్నకు పాలుపోవడం లేదు. జిల్లావ్యాప్తంగా ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయని ఆశించారు. వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎల్నినో ప్రభావంతో వర్షాలు రోజురోజుకూ దూరమవుతున్నాయి. గత సంవత్సరం జూన్ 26 నాటికి జిల్లాలో సగటు సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు కాగా.. 79.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది ఇదే సమయానికి జిల్లా సగటు సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు కాగా.. 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది సాధారణ సాగు విస్తీర్ణం 2,43,357 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి 54,790 ఎకరాల్లో సాగు చేశారు. 77 శాతం లోటు వర్షపాతం.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సగటు సాధారణ విస్తీర్ణం 117.8 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటివరకు 27 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 77 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రధానంగా జిల్లా కేంద్రం హనుమకొండలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 125.2 మిల్లీమీటర్ల కాగా.. 4.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇక్కడ 96 శాతం తీవ్రలోటు ఉంది. విత్తనాలు వేయలేదు.. పరకాల: వాతావరణం చల్లగా ఉందని.. తొలకరి వర్షం పడగానే ఎంతో సుంబురపడ్డం. కానీ, పంటసాగుకు అనుకూలమైన వర్షాలు లేక దుక్కులు దున్ని విత్తనాలు వేయకుండా వదిలిపెట్టాల్సి వచ్చింది. 5 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయడానికి కూడా సిద్ధం చేసుకున్నా. – దుమాల మొగిలి, రైతు మల్లక్పేటకార్తెలు పోతున్నా.. కానరాని వానజాడ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు కురిసిన వర్షం 27 మిల్లీమీటర్లు మాత్రమే.. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సెంట్రల్ జోన్ పోలీసులు కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ఏర్పాటు చేసిన 2కే రన్ను కలిసి సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంట్రాంరెడ్డి, డీసీపీలు ధార కవిత, అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
‘కుడా’లో కుంభకోణం
● మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: ప్లాట్ల వేలంలో ‘కుడా’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణానికి పాల్పడ్డారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ల వేలంలో కమీషన్ తీసుకుని కాకతీయ పట్టణాభివృద్ధికి తీవ్ర నష్టం కలిగించారన్నారు. గజానికి బహిరంగ మార్కెట్లో రూ.1.30 లక్షలుండగా.. అగ్గువకు గజానికి రూ.65 వేల నుంచి రూ.69 వేల వరకు విక్రయించారని ఆరోపించారు. ‘కుడా’ వైస్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ ప్లాట్ల వేలంలో జరిగిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందని, వేలాన్ని రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సిరాజుద్దీన్, దర్శన్ సింగ్, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్, కుసుమ లక్ష్మీ నారాయణ, పులి సారంగపాణి, నయీమొద్దీన్, నార్లగిరి రమేష్, సల్వాజి రవీందర్ రావు, గండు అశోక్ యాదవ్, గౌస్ ఖాన్, శ్రీధర్, అఫ్జల్, రామ్మూర్తి, ప్రభాకర్, గండ్రకోట రాకేష్ యాదవ్, శివకుమార్, షాబాద్, ఎస్కే మహమూద్, ఫెరోజ్, శ్యామ్ రెడ్డి, మనోజ్, కనకరాజు, నాయిని రవి యాదవ్, తక్కళ్లపల్లి వినీల్ రావు, శ్రీకాంత్ చారి, పాల్గొన్నారు. -
భర్తీ ఎప్పుడు?
● సీకేఎంలో ఇంకా ఖాళీగా ఆర్ఎంఓ పోస్టు ● పీజీ విద్యార్థికి ఆర్డర్ ఇవ్వడంపై అయోమయం!కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్ఎంఓ పోస్టు భర్తీ కావట్లేదు. గత మూడు నెలల నుంచి ఈ అధికారి పోస్టు భర్తీ కాకపోవడంతో ఇన్చార్జ్ ఆర్ఎంఓలు బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఆర్ఎంఓ స్థాయి అధికారి లేకపోవడం వల్ల వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బదిలీల్లో పీజీ విద్యార్థికి ఆర్డర్ ఇటీవల జరిగిన బదిలీల్లో సీకేఎం ఆస్పత్రి ఆర్ఎంఓగా ఓ పీజీ విద్యార్థినికి ఆర్డర్ ఇవ్వడం అయోమయానికి గురిచేసింది. సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో గైనిక్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న డాక్టర్ గీతాలక్ష్మికి ఆర్ఎంఓగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వీస్ కోటాలో ఓబీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఆర్ఎంఓగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాల్లో ఆర్ఎంఓగా విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. గైనిక్ కోర్సు పూర్తి చేయనివారికి ఎలా ఆర్డర్ ఇచ్చారని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఇక్కడ రిపోర్టు చేయకుండానే తిరిగి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులకు వివరించినట్లు సమాచారం. -
జూనియర్ లెక్చరర్ల ప్రొబేషన్ ప్రకటించాలి
హన్మకొండ అర్బన్/విద్యారణ్యపురి: 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్లకు వెంటనే ప్రొబేషన్ ప్రకటించి, ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ–475) రాష్ట్ర కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓ) భవన్లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారంలో జాప్యం కొనసాగితే.. చేపట్టే ప్రతీ ఉద్యమానికి టీజీఓ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అనంతరం 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్ల ప్రొబేషన్ ప్రకటన, ఇంక్రిమెంట్ల మంజూరు తదితర డిమాండ్లపై పలు తీర్మానాలను రాష్ట్ర కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది జీవీఎల్ మూర్తి, టీజీఓ నాయకులు ఆసనాల శ్రీనివాస్, డాక్టర్ వసుకుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, డాక్టర్ ప్రవీణ్కుమార్, టీజీజేఎల్ఏ నాయకులు జె.కురుమూర్తి, శోభన్బాబు, నాయిని శ్రీనివాస్, రేమిడి మల్లారెడ్డి, గోస్కుల హరగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నియామకాల ఊసేలేదు..!
కాళోజీ సెంటర్ : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేసి, వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల (హెల్పర్స్) నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తమై నియామక ప్రక్రియలో నిమగ్నమవగా.. మన జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా భర్తీ ప్రక్రియ ముందుకుసాగడంలేదు. జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ ప్రాజెక్టులు ఉండగా 919 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2018 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ ప్రక్రియను 2022 వరకు సాగదీసి నియామకాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకపోవడంతో వేల సంఖ్యలో నిరుద్యోగులు ఎదరుచూస్తున్నారు. పాత లెక్కల ప్రకారం 63 మంది టీచర్లు, 289 ఆయా(హెల్పర్స్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ లెక్కలు తీస్తే మరిన్ని ఖాళీల సంఖ్య పెరిగే అవగాశం ఉంది. తాజా ఖాళీల వివరాలేవి ? జిల్లాలో ప్రస్తుతం ఎన్ని అంగన్వాడీ టీచర్, ఆయా(హెల్పర్) పోస్టులు ఖాళీగా ఉన్నాయనే కనీస సమాచారం కూడా జిల్లా సంక్షేమ శాఖ అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. అధికారుల వద్ద ప్రస్తుతం ఉన్నవి పాత ఖాళీల వివరాలే. 2018 నుంచి ఇప్పటి వరకు వయోపరిమతి తీరి ఎంత మంది పదవీ విరమణ చేశారు? వ్యక్తిగత కారణాలతో ఎంత మంది రాజీనామా చేశారు? కొత్తగా ఏర్పడిన ఖా ళీలు ఎన్ని? అనే లెక్కలు తేల్చడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఆశయానికి తూట్లు.. సుదీర్ఘకాలం తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలందించాలనే ప్రభుత్వ ఆశయానికి సంబంధిత శాఖ అధికారుల తీరు విరుద్ధంగా మారింది. దీంతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉంది. ఇతర జిల్లాల్లో ఖాళీల జాబితా, రిజర్వేషన్, రోస్టర్ లెక్కలు తీసి నోటిఫికేషన్ విడుదల చేయగా వరంగల్ జిల్లాలో మాత్రం ఎలాంటి ప్రక్రియ చేపట్టకపోవడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన తాజా ప్రకటనతో ఈ నియామకాల ద్వారా ఉద్యోగం సాధించవచ్చని ఆశగా ఎదురుచూస్తున్న అర్హులైన మహిళా నిరుద్యోగులు.. అధికారుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తక్షణమే జిల్లాలోని అంగన్వాడీ ఖాళీల వివరాలను సేకరించి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఖాళీల జాబితాకు సమయం పడుతుంది ప్రస్తుతానికి మా వద్ద తాజా ఖాళీల వివరాలు లేవు. వాటిని సేకరించడానికి చాలా సమయం పడుతుంది. రోజూ కలెక్టరేట్ నిర్వహించే సమావేశాలకు వెళ్లడంతోనే సమయం గడిచిపోతోంది. ఆ మీటింగ్లకు ఎప్పుడు వెళ్లాలి. ఈ పనులు ఎప్పుడు చేయాలి. జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది చెప్పడానికి కొంత సమయం పడుతుంది. – బి.రాజమణి, డీడబ్ల్యూఓ అంగన్వాడీల్లో కొలువులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ జిల్లాలో ప్రారంభంకాని ప్రక్రియ తొమ్మిదేళ్ల క్రితం నాటి లెక్కలతోనే కాలయాపన తాజా ఖాళీలపై స్పష్టత లేని వైనం ప్రాజెక్టు ఏరియా టీచర్ ఆయా(హెల్పర్) నర్సంపేట 21 94 వర్ధన్నపేట 19 66 వరంగల్ 23 129 మొత్తం 63 289 -
జూనియర్ లెక్చరర్ల ప్రొబేషన్ ప్రకటించాలి
హన్మకొండ అర్బన్/విద్యారణ్యపురి: 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్లకు వెంటనే ప్రొబేషన్ ప్రకటించి, ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ–475) రాష్ట్ర కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓ) భవన్లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారంలో జాప్యం కొనసాగితే.. చేపట్టే ప్రతీ ఉద్యమానికి టీజీఓ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అనంతరం 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్ల ప్రొబేషన్ ప్రకటన, ఇంక్రిమెంట్ల మంజూరు తదితర డిమాండ్లపై పలు తీర్మానాలను రాష్ట్ర కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. హైకోర్టు న్యాయవాది జీవీఎల్ మూర్తి, టీజీఓ నాయకులు ఆసనాల శ్రీనివాస్, శ్రీనివాస్, డాక్టర్ సురేశ్, డాక్టర్ ప్రవీణ్కుమార్, టీజీజేఎల్ఏ నాయకులు జె.కురుమూర్తి, శోభన్బాబు, శ్రీనివాస్, రేమిడి మల్లారెడ్డి, గోస్కుల హరగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బస్స్టేషన్ పనుల్లో నిర్లక్ష్యం వద్దు
● ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి వరంగల్ చౌరస్తా: నూతన హంగులతో రోల్ మోడల్గా నిర్మిస్తున్న వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం తగదని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. స్మార్ట్సిటీలో భాగంగా రూ.75 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని, పనుల్లో మరింత వేగం పెంచాలని సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను, అధికారులను ఆయన హెచ్చరించారు. వరంగల్ నగరాన్ని అద్భుతమైన ఐటీ, పర్యాటక హబ్గా తీర్చిదిద్దే క్రమంలో మెరుగైన రవాణా వ్యవస్థ ఎంతో కీలకమని, ఇందుకోసం ‘కుడా’ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులు
● 170 మంది కేటాయింపు ● 60 మంది జాయినింగ్ కాశిబుగ్గ: ఎట్టకేలకు ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు. దవాఖానా నుంచి బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎవరూ జాయిన్ అవకపోవడంతో తొలుత అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎంలో పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు బీఎస్సీ, జనరల్ నర్సింగ్, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి నర్సింగ్ స్టాఫ్ను రప్పించారు. స్టాఫ్ నర్సుల స్థానంలో వీరు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నారు. ఖాళీగా 284 పోస్టులు ఎంజీఎం దవాఖనాలో రోగులకు సేవలు అందించడానికి 478 మంది స్టాఫ్నర్సులు అవసరం ఉండగా.. కేవలం 194 మందితో వైద్యసేవలు అందిస్తున్నారు. మరో 284 పోస్టులు ఖాళీగానే ఉంటున్నా యి. ఈనేపథ్యంలో ఎంజీఎంలో పేషెంట్ల సేవల కోసం స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు) కొరత గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు బదిలీ అయిన వారి స్థానంలో 170 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అలాగే హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఐదుగురు స్టాఫ్ నర్సులను అలాట్ చేసినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం బ్యాచ్కు సంబంధించిన వీరు రెండు రోజుల నుంచి ఎంజీఎంలో జాయిన్ అ వుతున్నారు. ఇప్పటి వరకు 60 మంది స్టాఫ్ నర్సులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మిగతావారు కూ డా సోమవారం వరకు జాయిన్ కావొచ్చని నర్సింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంజీఎంలోని అత్యవసర చికిత్సలు, పలు వార్డుల్లో నర్సింగ్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. -
ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి గీసుకొండ : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15, 16వ డివిజన్లలో హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయ్, మాజీ మేయర్ గుండు సుధారాణితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. 16వ డివిజన్లోని కీర్తి నగర్లో రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్క్, ధర్మారంలోని గరీబ్ నగర్లో రూ.11 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచి నీటి పైపు లైన్ నిర్మాణ పనులకు, మొగిలిచర్ల ప్రాంతంలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు, రెడ్డిపాలెంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. -
జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా వెంకన్న
● ఇన్చార్జ్ బాధ్యతల నుంచి చాహత్ బాజ్పాయ్ ఇక రిలీవ్వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా తేజావత్ వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా (కోర్ అర్బన్ రీజియన్–మెట్రో రైలు) కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్గా సుమారు సుమారు 8 నెలు పనిచేసిన చాహత్ బాజ్పాయ్కు హనుమకొండ కలెక్టర్గా పదోన్నతి లభించింది. ప్రభుత్వం బల్దియాకు కమిషనర్ను నియమించకపోవడంతో ఇన్చార్జ్ కమిషనర్గా సుమారు మూడు నెలలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆమెకే జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు అప్పగించారు. జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్గా కొనసాగుతున్న చాహత్ బాజ్పాయ్ని ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. వెంకన్న మరిపెడ వాసి కొత్త కమిషనర్ తేజావత్ వెంకన్న మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన వారు. 2007లో గ్రూప్–1 అధికారి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)గా ఎంపికయ్యారు. బోధన్, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్, జీహెచ్ఎంసీలోని చందానగర్, శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్, జీహెచ్ఎంసీలోనే సౌత్ జోన్ జోనల్ కమిషనర్గా సేవలందించారు. ప్రస్తు తం హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేస్తున్నారు. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, నగరపాలన, ప్రజాసేవల మెరుగుదలలో అనుభవం కలిగిన వెంకన్నను ప్రభుత్వం తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించింది. ఆయన నేడో రేపో కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. -
వరంగల్ ఓసిటీలో ప్లాట్ల వేలం
● వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన ఏజే మిల్లు కార్మికుడు ● 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఉద్రిక్తత కాశిబుగ్గ: వరంగల్ ఓ సిటీలోని ప్లాట్ల వేలం ఉద్రిక్తతకు దారితీసింది. ఆజంజాహి మిల్లు కార్మిక సంఘం నాయకులు ర్యాలీగా రావడం, ఓ కార్మికుడు ఏకంగా వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వరంగల్ ఓ సిటీలోని 98 ప్లాట్లకు అధికారులు శుక్రవారం ఉదయం వేలానికి ఏర్పాట్లు చేశారు. అయితే, దీనికి ముందే పలు కార్మిక సంఘాల నాయకులు పురాతన వాటర్ ట్యాంకు ప్రాంతం నుంచి ర్యాలీగా వేలం నిర్వహించే క్లబ్ వరకు తరలివచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆజంజాహిమిల్లు కార్మికులకు ప్లాట్లు కేటాయించాలని, ప్లాట్ల వేలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గద్దల సంజీవ అనే కార్మికుడు వాటర్ ట్యాంకు ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తర్వాత యశోద అనే కార్మికురాలితో పాటు మరో నలుగురు ట్యాంకు ఎక్కడానికి ప్రయత్నించారు. అలాగే, పోలీసులు పైకి రాకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకు మెట్ల మధ్యలో టైరు కాల్చి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే ట్యాంకుపై నుంచి దూకుతామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి నిరసనకారులను కిందికి దింపారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులతో కలిసి ట్యాంకు వరకు ర్యాలీకి యత్నించారు. తాము కలెక్టర్ను కలిసి సమస్యలు విన్నవిస్తామని పోలీసులకు తెలిపారు. దీంతో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐలు కర్రె స్వామి, షూకూర్ ఆధ్వర్యంలో 17 మందిని పోలీసు వాహనం ఎక్కించి మట్టెవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం యథాఽవిధిగా వేలం కొనసాగించారు. 39 ప్లాట్ల విక్రయం.. గజానికి గరిష్ట ధర రూ.75 వేలునయీంనగర్: వరంగల్లోని ఓసిటీ టౌన్షిప్లో ‘కుడా’ అధికారులు శుక్రవారం ప్లాట్లకు వేలం నిర్వహించారు. మొత్తం 45 రెసిడెన్షియల్ ప్లాట్లను వేలానికి ఉంచగా 39 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ప్లాట్లకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస (అప్సెట్) ధర గజానికి రూ.48 వేలు ఉండగా.. అన్ని ప్లాట్లు అధిక ధరకే అమ్ముడుపోయాయి. గజానికి గరిష్టంగా రూ.75 వేల ధర పలికింది. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు వేలం నిర్వహించారు. యుని సిటీ ప్లాట్ల వేలం వాయిదా ఉనికిచర్లలో కుడా ఆధ్వర్యంలో ఈ నెల 28 (ఆదివారం) నిర్వహించాల్సిన యుని సిటీ రెసిడెన్షియల్ ప్లాట్ల వేలం జూలై 5కు వాయిదా వేసినట్లు ‘కుడా’ వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలుదారులు ఈ మార్పును గమనించాలని కోరారు. -
వరంగల్ ఓసిటీలో ప్లాట్ల వేలం
కాశిబుగ్గ: వరంగల్ ఓ సిటీలోని ప్లాట్ల వేలం ఉద్రిక్తతకు దారితీసింది. ఆజంజాహి మిల్లు కార్మిక సంఘం నాయకులు ర్యాలీగా రావడం, ఓ కార్మికుడు ఏకంగా వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వరంగల్ ఓ సిటీలోని 98 ప్లాట్లకు అధికారులు శుక్రవారం ఉదయం వేలానికి ఏర్పాట్లు చేశారు. అయితే, దీనికి ముందే పలు కార్మిక సంఘాల నాయకులు పురాతన వాటర్ ట్యాంకు ప్రాంతం నుంచి ర్యాలీగా వేలం నిర్వహించే క్లబ్ వరకు తరలివచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆజంజాహిమిల్లు కార్మికులకు ప్లాట్లు కేటాయించాలని, ప్లాట్ల వేలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గద్దల సంజీవ అనే కార్మికుడు వాటర్ ట్యాంకు ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తర్వాత యశోద అనే కార్మికురాలితో పాటు మరో నలుగురు ట్యాంకు ఎక్కడానికి ప్రయత్నించారు. అలాగే, పోలీసులు పైకి రాకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకు మెట్ల మధ్యలో టైరు కాల్చి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే ట్యాంకుపై నుంచి దూకుతామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి నిరసనకారులను కిందికి దింపారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులతో కలిసి ట్యాంకు వరకు ర్యాలీకి యత్నించారు. తాము కలెక్టర్ను కలిసి సమస్యలు విన్నవిస్తామని పోలీసులకు తెలిపారు. దీంతో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐలు కర్రె స్వామి, షూకూర్ ఆధ్వర్యంలో 17 మందిని పోలీసు వాహనం ఎక్కించి మట్టెవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం యథాఽవిధిగా వేలం కొనసాగించారు. వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన ఏజే మిల్లు కార్మికుడు 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఉద్రిక్తత -
ప్రబలేదాకా పట్టించుకోరా?
వరంగల్ అర్బన్: వర్షాకాలం ప్రారంభమైంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, అతిసారా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఏటా జూన్ మొదటి వారంలోనే సీజన్ వ్యాధులపై ముందస్తుగా అప్రమత్తం కావాలి. బల్దియా, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది, సామాజిక కళాకారులతో కలిసి ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది ఇంతవరకు కార్యాచరణ లేదు. వ్యాధులు విజృంభించిన తర్వాత మందులు ఇచ్చే కన్నా ముందు జబ్బులు రాకుండా నివారించగలిగితే అందరికీ ఎంతో ప్రజయోజనమని మహానగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కార్యాచరణ లేదు.. ప్రజారోగ్య విభాగం, అర్బన్ మలేరియా విభాగం ఉమ్మడిగా గ్యాంగ్వర్క్ చేయాలి. 66 డివిజన్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. ఎందుకో రెండేళ్లుగా ఇలాంటి చర్యలేమీ కనిపించడం లేదు. వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తే పేరుకుపోయి కనిపిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నా.. సాధారణ పారిశుద్ధ్య పనులు చేయట్లేదు. వారానికోసారి మురుగు కాల్వలు తీయట్లేదు. డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మురుగు కాల్వలు శుభ్రం చేసేందుకు ప్రైవేట్ శానిటేషన్ కార్మికులతో గ్యాంగ్వర్క్ నిర్వహించేవారు. ఈసారి ఆలస్యంగా మొదలు పెట్టారు. కొన్ని డివిజన్లలో ఇంతవరకు గ్యాంగ్వర్క్ ప్రారంభం కాలేదు. కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దోమల బెడద తప్పదా? నగరంలో దోమల బెడద తప్పేలా లేదు. వర్షాకాలం మొదలైంది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. దోమల తీవ్రత పెరిగింది. వాస్తవానికి లార్వా దశలోనే దోమల ఉత్పత్తి పెరగకుండా చూడాలి. దోమల నివారణ అర్బన్ మలేరియా విభాగానికి పెను సవాలే. కాజీపేట, హనుమకొండ, వరంగల్, విలీన గ్రామాల్లోని పలు కాలనీల నుంచి దోమలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ స్థలాలు, డ్రెయినేజీల్లో వ్యర్థాలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. వీటి నివారణ కోసం అర్బన్ మలేరియా సిబ్బంది బృందాలుగా ఏర్పడి డివిజన్ల వారీగా గ్యాంగ్వర్క్ చేయాలి. అందుకోసం ప్రత్యేక షెడ్యూల్ను ఇంతవరకూ తయారు చేయలేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మలేరియా సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే దోమల నివారణ సాధ్యమవుతుంది. దోమల ఉత్పత్తి పెరగకుండా నగర ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇంటింటా తిరగాలి. డెంగీ, మలేరియా, విషజ్వరాలు ప్రబలితే వెంటనే అర్బన్ మలేరియా సిబ్బంది రంగంలోకి దిగాలి. ఆ దిశగా చర్యలేమి లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య శిబిరాల ఊసే లేదు నగరంలో అధికారికంగా 185 మురికివాడలు, విలీన గ్రామాల్లో 80 మురికివాడలు ఉన్నాయి. పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలతోపాటు పేదలుంటున్న కాలనీల్లో ఉచిత వైద్యశిబిరాల కోసం షెడ్యూల్ ప్రకటించాలి. రోగాలపై కళాకారులతో ప్రజలను జాగృతం చేయాలి. కానీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంతవరకు మేల్కొనకపోతే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితే. అర్బన్ మలేరియా విభాగానికి సుస్తీ.. బల్దియా అర్బన్ మలేరియా విభాగం 14 నెలలుగా అనారోగ్యం బారిన పడింది. మలేరియా అధికారి మాధవరెడ్డి హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు. దీంతో సీఎంహెచ్ఓ రాజారెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. బల్దియాలో ఇద్దరు హెల్త్ ఇన్స్పెక్టర్లు, ఆరుగురు హెల్త్ అసిస్టెంట్లు, 160 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిపై రోజువారీగా పర్యవేక్షణ కరువైంది. కనీసం రోజువారీగా బావుల్లో మందు వేయడం, డ్రెయినేజీల్లో రసాయనాలు చల్లడం, ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ చేయడం వంటి పనులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని బయాలజిస్ట్ పోస్టు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాచరణ రూపొందిస్తున్నాం.. నగరంలోని చాలాకాలనీల్లో 8 వేల వరకు ప్రైవేట్ ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో పిచ్చి మొక్కలు పెరిగి, మురుగునీరు స్తంభించిపోయి దోమల ఉధృతి పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అన్ని విభాగాల సహకారం తీసుకుంటాం. – రాజారెడ్డి, ఇన్చార్జ్ బయాలజిస్ట్హనుమకొండ రాగన్న దర్వాజా మెయిన్ రోడ్డులో రోడ్డుపై పారుతున్న మురుగు నీరు -
జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా వెంకన్న
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా తేజావత్ వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా (కోర్ అర్బన్ రీజియన్–మెట్రో రైలు) కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్గా సుమారు సుమారు 8 నెలు పనిచేసిన చాహత్ బాజ్పాయ్కు హనుమకొండ కలెక్టర్గా పదోన్నతి లభించింది. ప్రభుత్వం బల్దియాకు కమిషనర్ను నియమించకపోవడంతో ఇన్చార్జ్ కమిషనర్గా సుమారు మూడు నెలలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆమెకే జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు అప్పగించారు. జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్గా కొనసాగుతున్న చాహత్ బాజ్పాయ్ని ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. -
ఎంజీఎంకు స్టాఫ్ నర్సులొచ్చారు..
కాశిబుగ్గ: ఎట్టకేలకు ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు. దవాఖానా నుంచి బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎవరూ జాయిన్ అవకపోవడంతో తొలుత అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎంలో పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు బీఎస్సీ, జనరల్ నర్సింగ్, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి నర్సింగ్ స్టాఫ్ను రప్పించారు. స్టాఫ్ నర్సుల స్థానంలో వీరు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నారు. ఖాళీగా 284 పోస్టులు ఎంజీఎం దవాఖనాలో రోగులకు సేవలు అందించడానికి 478 మంది స్టాఫ్నర్సులు అవసరం ఉండగా.. కేవలం 194 మందితో వైద్యసేవలు అందిస్తున్నారు. మరో 284 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఈనేపథ్యంలో ఎంజీఎంలో పేషెంట్ల సేవల కోసం స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు) కొరత గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు బదిలీ అయిన వారి స్థానంలో 170 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అలాగే హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఐదుగురు స్టాఫ్ నర్సులను అలాట్ చేసినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం బ్యాచ్కు సంబంధించిన వీరు రెండు రోజుల నుంచి ఎంజీఎంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు 60 మంది స్టాఫ్ నర్సులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మిగతావారు కూడా సోమవారం వరకు జాయిన్ కావొచ్చని నర్సింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంజీఎంలోని అత్యవసర చికిత్సలు, పలు వార్డుల్లో నర్సింగ్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. 170 మంది కేటాయింపు 60 మంది జాయినింగ్ -
సర్దుబాటుకు సన్నాహాలు!
శనివారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2026విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభు త్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కొన్ని చోట్ల ఉపాధ్యాయుల అవసరం ఉంది. పలుచోట్ల పాఠశాలల్లో మిగులు టీచర్లు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ (పని సర్దుబాటు) చేయనున్నారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గత విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు, సబ్జెక్టుల వారీగా టీచర్ల అవసరాలను పరిగణనలోకి తీసుకొని వర్క్ అడ్జెస్మెంట్ చేశారు. అవసరం ఉన్న పాఠశాలలకు విద్యార్థుల నమోదు తక్కువగా ఉండగా.. మిగులు ఉన్న 158 మంది టీచర్లను అడ్జెస్ట్మెంట్చేశారు. ఆ తర్వాత జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని సుమారు 30 మంది టీచర్లను అకడమిక్ ఫ్యానల్ తనిఖీ బృందాలుగా నియమించారు. ఆయా టీచర్ల స్థానంలో మరో 30 మంది టీచర్లను వర్క్ అడ్జెస్ట్మెంట్ చేశారు. మొత్తంగా 188 మంది టీచర్లను వర్క్ అడ్జెస్ట్మెంట్ చేశారు. తనిఖీ బృందాల్లోని 30 మంది టీచర్లు ఈ విద్యాసంవత్సరం ప్రస్తుతం తిరిగి తమ పాఠశాలల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. 158 మంది టీచర్లు గత విద్యాసంవత్సరం ఏ పాఠశాలల్లోనైతే వర్క్అడ్జెస్ట్మెంట్ కింద పనిచేశారో ఆయా పాఠశాలల్లోనే ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. వారిని యథావిధిగా ఆయా పాఠశాలల్లోనే కొనసాగిస్తున్నారు. 29న ఎంఈఓలతో డీఈఓ సమావేశం.. జిల్లాల్లో అవసరం మేరకు పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులను వర్క్ అడ్జెస్ట్మెంట్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన, దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్ అడ్జెస్ట్మెంటు చేయాలని ఆదేశించారు. దీంతో హనుమకొండ జిల్లాలో ఏ పాఠశాలల్లో ఎంత మంది టీచర్లు ఉద్యోగ విరమణ పొందారు, దీర్ఘకాలిక సెలవుల్లో ఏ మండలంలో ఎంతమంది ఉన్నారనేది జిల్లా విద్యాశాఖ 14 మండలాల ఎంఈఓల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఈమేరకు ఎక్కడెక్కడ ఇంకా మిగులు టీచర్లు కూడా ఉన్నారని తెలుసుకుంటున్నారు. టీచర్ల వర్క్అడ్జెస్ట్మెంట్పై ఈనెల 29 హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఎంఈఓల సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 20 వరకు నమోదు ఆధారంగా.. పాఠశాలల వారీగా ఈనెల 20వరకు విద్యార్థుల న మోదు ఆధారంగా, అలాగే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల అవసరాలను అంచనా వేసి వర్క్అడ్జెస్ట్మెంట్ చేయాలి. ఉద్యోగ విరమణ పొందిన, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి స్థానంతోపాటు త్వరలోనే మళ్లీ పాఠశాలల తనిఖీ బృందాలుగా కూడా మరో 39 మంది టీచర్లను నియమించన్నారు. దీంతో వారి స్థానంలో కూడా టీచర్ల సర్దుబాటు చేయాల్సినఅవసరం ఉంటుంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి టీచర్లు తక్కువగా ఉండడం, విద్యార్థులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మిగులు టీచర్లను గుర్తించి అవసరం ఉన్న పాఠశాలలకు వర్క్అడ్జెస్ట్మెంట్ చేయాలి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, కొన్ని హైస్కూళ్లలో పలు సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇప్పటికే పలువురు హెచ్ఎంలు తమకు సబ్జెక్టు టీచర్లు అవసరం ఉన్నారని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. జిల్లాలో 36 ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా.. అందులో ఈ విద్యాసంవత్సరం ఒక పాఠశాల మాత్రమే తెరుచుకుంది. రిటైర్డ్, సెలవుల్లో ఉన్న టీచర్ల స్థానంలో వర్క్ అడ్జెస్ట్మెంట్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులతో అధికారుల కసరత్తు గత విద్యాసంవత్సరం హనుమకొండ జిలాల్లో 188 మంది సర్దుబాటు విద్యార్థుల సంఖ్య ఇలా.. గతవిద్యాసంవత్సరం 475 పాఠశాలల్లో 33,982 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు వెళ్లిపోయారు. ఈనెల 23 వరకు 26,408 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. జూలై వరకు ఈసంఖ్య పెరగనుందని భావిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని టీచర్ల సర్దుబాటు ఉంటుంది. టీచర్ల సంఖ్య ఇలా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2,708 టీచర్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 2,256 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 452 టీచర్ల పోస్టులు వేకెన్సీలుగా ఉన్నాయి. -
‘కుడా’లో కుంభకోణం
మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: ప్లాట్ల వేలంలో ‘కుడా’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణానికి పాల్పడ్డారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ల వేలంలో కమీషన్ తీసుకుని కాకతీయ పట్టణాభివృద్ధికి తీవ్ర నష్టం కలిగించారన్నారు. గజానికి బహిరంగ మార్కెట్లో రూ.1.30 లక్షలుండగా.. అగ్గువకు గజానికి రూ.65 వేల నుంచి రూ.69 వేల వరకు విక్రయించారని ఆరోపించారు. ‘కుడా’ వైస్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ ప్లాట్ల వేలంలో జరిగిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు రూ.50 కోట్ల నష్టం వాటిల్లిందని, వేలాన్ని రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సిరాజుద్దీన్, దర్శన్ సింగ్, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్, కుసుమ లక్ష్మీ నారాయణ, పులి సారంగపాణి, నయీమొద్దీన్, నార్లగిరి రమేష్, సల్వాజి రవీందర్ రావు, గండు అశోక్ యాదవ్, గౌస్ ఖాన్, శ్రీధర్, అఫ్జల్, రామ్మూర్తి, ప్రభాకర్, గండ్రకోట రాకేష్ యాదవ్, శివకుమార్, షాబాద్, ఎస్కే మహమూద్, ఫెరోజ్, శ్యామ్ రెడ్డి, మనోజ్, కనకరాజు, నాయిని రవి యాదవ్, తక్కళ్లపల్లి వినీల్ రావు, శ్రీకాంత్ చారి, పాల్గొన్నారు. -
నాణ్యత పాటించకపోతే బిల్లుల్లో కోత
గ్రేటర్ వరంగల్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించకపోతే బిల్లుల్లో కోత పెడతామని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. వరంగల్లో ఏనుమాముల ఏరియా, ధర్మారం రోడ్డు, డాక్టర్స్కాలనీ, కాశిబుగ్గలో గురువారం ఆమె పర్యటించారు. అభివృద్ధి పనులు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలిచ్చారు. కాశిబుగ్గ సీతారామాంజనేయ ఆలయంలో పూర్తి చేసిన గ్రానైట్ ఫ్లోరింగ్ పనులను కలెక్టర్ కొలతలు వేసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఈ సంతోశ్బాబు, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, డీఈలు రంగారావు, సురేశ్, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
పెండింగ్ డీఏలు చెల్లించాలి
● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ కాళోజీ సెంటర్ : పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్ డీఏలను ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ పిలుపుమేరకు టీఎస్ యూటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హనుమకొండ కాళోజీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ 36 నెలలు గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలు పెండింగ్లో పెట్టారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ డీఏలను విడుదల చేయాలన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. నూతన విద్యావిధానం (ఎన్ఈపీ–2020) ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ మాట్లాడుతూ.. తరగతికో ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు. డిప్యూటీ డీఈఓలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ కాలేజీ లెక్చరర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లకు టెట్ మినహాయించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలన్నారు. జూలై, ఆగస్టు నెలలో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. అనంతరం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సృజన్ ప్రసాదరావు మాట్లాడారు. నిరసన అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నామోజు శ్రీనివాస్, జిల్లా కోశాధికారి రవుఫ్, జిల్లా కార్యదర్శులు కందగట్ల రమేష్, నాయకులు గుండు కర్ణాకర్, సత్యనారాయణ, సంపత్, అరవింద్ కుమార్, కుమారస్వామి, రవీందర్, రామరాజు, జోగయ్య ప్రసాద్ పాల్గొన్నారు. -
పీహెచ్సీ భవన నిర్మాణ పనుల పరిశీలన
ఖిలా వరంగల్: వరంగల్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను గురువారం డీఎంహెచ్ఓ సాంబశివరావు పరిశీలించారు. పనులు నాణ్యతగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టకు సూచించారు. అనంతరం యూపీహెచ్సీని సందర్శించి రోగులకు అందుతున్న సేవలు, వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలను సమీక్షిచారు. రోగులకు అందుతున్న సేవలు, వైద్య రికార్డులు, ఔషధాల లభ్యత, మాతా శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, యూ వీన్ ఎన్సీడీ, టీకా కార్యక్రమాలు తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూ శాయంపేట: జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం(ఎన్ఎస్ఎపీ), జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్) కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ యజమాని మరణించి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం రూ.20వేలు అంజేయనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు, మరణ, ఆదాయ, కుటుంబ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఫొటోతో మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
ఏడు ఎకరాలకు ప్రత్యేక సర్వే..
మిగిలిన ఏడు ఎకరాల భూమి గుంటలుగా ఉండటంతో వాటి స్వరూపం, విస్తీర్ణం, యాజమాన్య వివరాల నిర్ధారణ కోసం ప్రత్యేక సర్వే చేపట్టాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఈ సర్వే పూర్తయిన వెంటనే పరిహారం చెల్లించనున్నారు. మరో 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఇంకోవైపు భూమి హద్దుల స్థిరీకరణకు ఇప్పటికే ఏఏఐ బిడ్లు పిలిచిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులను టెండర్లు పిలిచే అవకాశముంది. ఇప్పటికే రన్వే రహదారి గురించి నిట్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఉడాన్ –2016 (ఉడో దేశ్ కీ ఆమ్ నాగరిక్) పథకం కింద మామూనూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్లో ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇది అందుబాటులోకి వస్తే అనేకమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశముంది. -
హాట్ సీట్ దక్కేదెవరికో?
● వరంగల్ రిజిస్ట్రార్ పోస్ట్ కోసం పైరవీలు ● ఏడాదిగా ఎఫ్ఏసీ.. ఇటీవల పదోన్నతితో ఖాళీ ● నియామకంపై సర్వత్రా చర్చకాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ పోస్ట్ మళ్లీ ఓ సారి ఖాళీ కానుంది. దీంతో హాట్ సీట్గా పేరుగాంచిన వరంగల్ డీఆర్ పోస్ట్ దక్కేదెవరికో అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. 2024లో అటెండర్ స్థాయి నుంచి డీఐజీ స్థాయి వరకు జరిగిన బదిలీల్లో భాగంగా జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న హరికోట్ల రవి హైదరాబాద్ ఆడిట్ విభాగంలో చేరగా, హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఫణీందర్ జిల్లా రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిలోపే డిప్యుటేషన్పై.. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన ఫణీందర్ ఏడాదిలోపే డిప్యుటేషన్పై హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లా ఎఫ్ఏసీగా బదిలీ అయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ గతేడాది జూలైలో వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ ఎఫ్ఏసీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రవీణ్కుమార్ ఇటీవల డీఐజీగా పదోన్నతి పొంది ఖాళీగా ఉన్న కరీంనగర్ డీఐజీ పోస్ట్ ఉత్తర్వులు అందుకున్నారు. దీంతో ఏడాదిలోపే మళ్లీ జిల్లా రిజిస్ట్రార్ పోస్ట్ ఖాళీ అయ్యింది. తిరిగి డిప్యుటేషన్పై వెళ్లిన ఫణీందర్ బాధ్యతలు స్వీకరిస్తారా? లేక పూర్తిస్థాయి అధికారిగా హాట్ సీట్ను దక్కించుకుంటారా? అనే చర్చ కొనసాగుతోంది. పైరవీల పరంపర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు పదోన్నతి రేసులో ఉన్నారు. దీంతో జిల్లా రిజిస్ట్రార్గా వరంగల్లో చేరేందుకు ఇద్దరు జాయింట్ –1 సబ్ రిజిస్ట్రార్లు గురిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లు సైతం పదోన్నతి లభిస్తే వరంగల్ డీఆర్ పోస్ట్ మాకే కావాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు పైరవీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ సత్యశారద కాళోజీ సెంటర్ : ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మిడ్ డే మిల్స్ కమిటీ సమావేశంలో పథకం అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అన్ని ఇంటర్ కళాశాలలకు ప్రత్యేక అధికారులను నియమించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వైవీ గణేష్ను ఆదేశించారు. అధికారులు కళాశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, విద్యార్థుల నుంచి అభిప్రాయాలను సేకరించి భోజన నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు కాళోజీ సెంటర్ : జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేర్టేకర్లు, సీఆర్పీలు, ఐజీఆర్పీ, ఏఎన్ఎంలు, హాస్టల్ సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులు, బాధ్యతలు, విద్యార్థులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. కొంతమంది సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, అసభ్యకర భాష, ప్రవర్తన సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే తక్షణమే సవరణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ‘సర్’ హెల్ప్ డెస్క్ ప్రారంభం కాశిబుగ్గ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై సందేహాల నివృత్తిచేయడానికి వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను కలెక్టర్ సత్యశారద గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె హెల్ప్ డెస్క్ పనితీరును పరిశీలించి, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన సేవలను ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అందించాలన్నారు. అనంతరం వరంగల్ కొత్తవాడ. దేశాయిపేట, దేశాయిపేటలో ఎస్ఐఆర్ సర్వేను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. గడువులోగా స్కూల్ పనులను పూర్తి చేయాలి వరంగల్ చౌరస్తా: విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (టీఐఆర్ఎస్) పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ మండలం పైడిపల్లిలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్సియల్ స్కూల్ పనులను గురువారం ఆమె పరిశీలించారు. నిర్మాణంలో వాడుతున్న సిమెంట్ గ్రేడ్, ఇనుము నాణ్యత, ఇటుకల దృఢత్వం గురించి ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమావేశాలు, కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ గణేష్, ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, టీబీసీడీఓ పుష్పలత, డీఈఓ రంగయ్య నాయుడు, ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ, సీఎంఓ కట్ల శ్రీనివాస్, జీసీడీఓ ఫ్లోరెన్స్, ప్లానింగ్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ రావు, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ భూమిలో బంగారం లభ్యం?
● కోపాకులపాడులో కూలీలకు దొరికిన పుత్తడి ● 50 తులాల హారం, పుస్తెలు, పుస్తెల్లోని గుండ్లు ఉన్నట్లు ప్రచారంచెన్నారావుపేట: మండల కేంద్రంలోని కోపాకుల చెరువు సమీపంలోని కోపాకుల పాడు వ్యవసాయ భూముల్లో బుధవారం కూలీ పనులు చేస్తున్న వారికి బంగారం దొరికినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కోపాకులపాడులో కొన్ని సంవత్సరాల క్రితం గ్రామం ఉన్న ప్రాంతం ప్రస్తుతం వ్యవసాయ భూములుగా మారింది. చెన్నారావుపేట, ఈర్యాతండాలకు చెందిన ప్రజలు అక్కడ చాలాఏళ్ల నుండి వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో దేవతా విగ్రహాలు లభించాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కోపాకుల పాడులోని ఓ రైతు భూమిని కౌలుకు తీసుకున్న రైతు ట్రాక్టర్తో లోతు దుక్కిదున్ని పత్తి విత్తనాలు వేశాడు. పత్తి మొలకల్లో కూలీలు గడ్డి కలుస్తుండగా.. బంగారు కంఠహారం, పుస్తెలు, పుస్తెల్లో ఉండే గుండు దొరికినట్లు గ్రామంలో గుసగుసలు వినిస్తున్నాయి. ఆ హారం 50 తులాల వరకు ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఇంతా జరిగినా పోలీసులకు తెలియకపోవడం గమనార్హం. దేవతామూర్తులకు చెందిన నగలేనా..? కోపాకులపాడు నలువైపులా వ్యవసాయ భూముల్లో శిథిలమైన దేవాలయాలు ఉన్నాయి. శివాల యం, హనుమాన్ దేవాలయం, మైసమ్మ తదితర ఆలయాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం వ్యవసా య భూముల్లో కూలీలకు దొరికిన బంగారం నగలు దేవతామూర్తులకు అలంకరించే విధంగానే ఉన్నట్లు సమాచారం.కూలీలకు దొరికినట్లుగా భావిస్తున్న బంగారం -
ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలి
నర్సంపేట: ‘సర్’ ప్రక్రియలో ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి అసలైన ఓటర్లను గుర్తించాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) సంధ్యారాణి అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ను ఆమె ప్రారంభించి ఆమె మాట్లాడారు. సర్ ప్రక్రియలో భాగంగా అధికారులు, సిబ్బంది పారదర్శకంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో బాలికలదే పైచేయి కాళోజీ సెంటర్: ఇటీవల నిర్వహించిన టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 86.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో మొత్తం 503 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 437 మంది ఉత్తీర్ణత సాధించారు. 208 మంది బాలికల్లో 185(88.94 శాతం) మంది, 295 మంది బాలురలో 252 మంది(85.42శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలపై డీఈఓ రంగయ్యనాయుడు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రేపు కిట్స్ కళాశాలలో మెగా జాబ్ మేళా కాళోజీ సెంటర్ : వరంగల్ జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27 శనివారం భారీ మెగా జాబ్ మేళా ‘వరంగల్ కౌశల్ మహోత్సవ్ – 2026’ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి.సాత్విక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ), స్కిల్ ఇండియా, ఎన్ఎస్డీసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. హసన్పర్తి ఎర్రగట్టు సమీపంలోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల (కిట్స్) లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని 5 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయని, ఉద్యోగాలతోపాటు డిజిటల్ స్కిల్లింగ్, అప్రెంటిస్షిప్, ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ఇతర వివరాల కోసం 88000 55555, 1800 123 9626 నంబర్లలో సంప్రదించాలని కోరారు. నితిన్ నబిన్ పర్యటనను విజయవంతం చేయాలి గీసుకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హనుమకొండలో పాల్గొనే సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవుని మేఘనాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాదారపు శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటలో డివిజన్ స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. డివిజన్ అధ్యక్షుడు ల్యాదల్ల ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బిల్లా రమేశ్, నాయకులు రాదారపు మల్లికార్జున్, బందెల రేణుక తదితరులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబా ద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరి గొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. మాదకద్రవ్యాల నివారణకు కృషిచేయాలి దామెర: మాదకద్రవ్యాల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒగ్లాపూర్ సమీపంలోని ఎంజేపీ, సాంఘిక సంక్షేమ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.


