కదం తొక్కిన కార్మిక లోకం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నినదిస్తూ కార్మిక లోకం కదం తొక్కింది. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్, హనుమకొండలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. సమ్మె సందర్భంగా వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. సమ్మెకు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ తదితరులు సంఘీభావం ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళన అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు అందించారు.


