ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
విద్యుత్ దీపాల వెలుగుల్లో వేయిస్తంభాల ఆలయం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేయిస్తంభాల ఆలయంలో శనివారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, భరత్శర్మ, శ్రీమన్నారాయణ, ప్రద్యుమ్నశర్మ, అర్చకుడు ప్రణవ్ ఉదయం 5 నుంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవమూర్తులకు నందివాహనసేవ, ఎదురుకోళ్లు నిర్వహించారు. అనంతరం శ్రీసూర్యనారాయణ దేవాలయంలో శ్రీరుద్రేశ్వరీశ్రీరుద్రేశ్వరస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవవిగ్రహాల ముందు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి జ్యోతివెలిగించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం ప్రదోషకాల పూజ నిర్వహించారు.
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


