అవగాహన అవసరం
నాడు నిజాం పాలకుల నుంచి మొదలు.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరధామం సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి స్ఫూర్తిని ఇచ్చేలా తెలంగాణ జేఎసీ నాయకత్వంలో ఉద్యమాలు చేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత పరకాల జిల్లా కేంద్రం.. రెవెన్యూ డివిజన్ కోసం పోరాటాలు చేయగా.. చివరకు రెవెన్యూ డివిజన్ దక్కింది. రాజకీయాల కోసం ఎన్నికలు కాకుండా పరకాల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా. విద్యాసంస్థల అభివృద్ధికి మాజీ సీఎం వైఎస్సార్ను నేటి పాలకులు స్ఫూర్తిగా తీసుకోవాలి.
– డాక్టర్ సిరికొండ శ్రీనివాసాచారి, ఎస్వీ విద్యాసంస్థల అధినేత


