టీజీ మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలి. ఎకరానికి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి చివరకు రెక్కల కష్టం కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోవాలి.
– టి.సారయ్య, ఉపాధ్యక్షుడు, ఎంఏసీఎస్, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి
దళారులు ఇబ్బంది పెడుతున్నారు..
మార్క్ఫెడ్ అధికారులు సరైన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. ఖరీఫ్లోనూ రైతులకు మక్కలు అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు యాసంగి మొక్కజొన్నల విషయంలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలి
– రామారపు సాంబయ్య,
రైతు, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి


