కాంగ్రెస్‌ ఫ్లెక్సీల చించివేత | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఫ్లెక్సీల చించివేత

Mar 4 2026 7:12 AM | Updated on Mar 4 2026 7:12 AM

గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు ఆర కట్ల సాయి భక్తులకు స్వాగతం పలుకుతూ ఏ ర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియన వ్యక్తులు సోమవారం రాత్రి చించివేసి తొలగించినట్లు స్థాని కులు తెలిపారు. మచ్చాపూర్‌ నుంచి కొమ్మాల ఆల య ముఖ ద్వారం వరకు సాయి తన అభిమాన నా యకులు, కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో స్థానిక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటోలు లేకపోవడంతో ఆయన అభిమానులు దీన్ని తప్పుపట్టి, చించివేసినట్లు సమాచారం. ఈ విషయమై సాయి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతుండగా చించి వేసిన సదరు నాయకులు ఆయనకు క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. ఇనుగాల వెంకట్రాంరెడ్డి, దొంతి మాధవరెడ్డిల ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సొంత పార్టీ వారే చించివేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement