పేపర్‌ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్‌ రికార్డు..! | Saudi based Malayali woman made paper flowers Set Guinness title | Sakshi
Sakshi News home page

పేపర్‌ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్‌ రికార్డు..!

Sep 25 2025 4:48 PM | Updated on Sep 25 2025 7:10 PM

Saudi based Malayali woman made paper flowers Set Guinness title

చాలామంది ఏదో ఒక కళ నేర్చుకుంటుంటారు. అయితే దాన్ని ఏవో కారణాలతో వదిలేయాల్సి రావొచ్చు. అయితే కొందరూ సమయం దొరికితే ఆ కళకు పదును పెట్టుకుంటూ..తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆరితేరిపోతారు. ఆ టాలెంట్‌ ఊరికేపోదు ప్రపంచ మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్‌లో రికార్డు సృష్టించి శెభాష్‌ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందించే సౌది అరేబియాలో ఉంటున్న ఈ భారత సంతతి మహిళ నీను ప్రదీప్‌.

కేరళకు చెందిన నీనుకి చిన్నప్పటి నుంచి చేతికళల పట్ల అమితాసక్తి. అయితే ఉన్నత చదువులు అభ్యసించడం వల్ల ఆ కళను కొనసాగించ లేకపోయింది. అలా ఆమె బీకామ్‌​, ఎంకామ్‌ పూర్తి చేసిన అనంతరం పెళ్లి చేసుకుని సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. ఆ దంపతుల ప్రేమనురాగాలకు గుర్తుగా అరోనా, అలీనా ఇద్దరు పిల్లలు పుట్టడంతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్లై స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించారో అప్పటి నుంచి మంచి తీరిక దొరికింది ఆమెకు. 

ఉదయమే భర్త సామ్సన్‌ జాకబ్‌ ఉద్యోగానికి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తర్వాత చాలా ఖాళీ సమయం దొరికేది. ఆ సమయాన్ని అలా వృధాగా జారిపోనీకూడదని, తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అయిన హ్యాండ్‌ ఆర్ట్‌కి మళ్లీ పదును పెట్టుకునేందుకు రెడీ అయ్యింది. అయితే అందుకు అవసరమయ్యే ఫ్యాన్సీ క్రాఫ్ట్ టూల్స్, ఆర్ట్‌పరికరాలు చాలా ఖరీదుగా ఉండటమేగాక అందుబాటులో కూడా ఉండేవి కాదు. 

దాంతో ఆమె ఇంట్లో దొరికే వేస్ట్‌ మెటీరియల్స్‌ ఎగ్‌షెల్‌, పిస్తా షెల్‌లతో  తన కళను మరింత సృజనాత్మక ధోరణిని జోడించి మెరుగులు పెట్టుకుంది. చెప్పాలంటే వేస్ట్‌తో ఇంటి అలంకార వస్తువులను తయారు చేసే స్థాయికి చేరుకుంది. అలా ఆమె పేపర్‌ పువ్వులు తయారు చేసే కాగితపు ఆర్ట్‌లో ఆరితేరిపోయింది. 

ఫలితంగా ఇల్లంతా నీను చేసిన పేపర్‌ కళాకృతులతో నిండిపోయింది. ఇక కొన్నింటిని ఈవెంట్‌లలోనూ, పలు స్టాల్స్‌ తన కళను ప్రదర్శించేది. అలా ఆమె కళ ప్రజలను ఇంప్రెస్‌ చేయడమే కాదు నేర్చుకునేలా ప్రేరేపించింది. ఇంతలో కోవిడ్‌ 19 రావడంతో తన పనికి బ్రేక్‌పడినా..ఆ లాక్‌డౌన్‌ని కూడా నీను సద్వినియోగం చేసుకునేలా మరింత వేగవంతంగా చేయడంపై పట్టు సంపాదించింది. 

రికార్డుల స్థాయికి..
అలా ఆ నైపుణ్యం ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకునేందుకు దారితీసింది. క్రేప్ పేపర్ ఉపయోగించి ఒక వ్యక్తి తయారు చేసే వివిధ రకాల గరిష్ట పువ్వులకు మించి చేసే సామర్థ్యం నీనులో రికార్డు స్థాయిలో ఉందని ప్రశంసలందుకుంది. అది ఆమెకు గిన్నిస్ టైటిల్‌కు మార్గం సుగమం చేసింది. తన సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో నీను 2023లో గిన్నిస్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. 

దాదాపు రెండేళ్ల తర్వాత గిన్నిస్‌ వాళ్లు స్పందించడంతో ఆ సాహసానికి పూనుకుంది. అలా ఆమె కేవలం 4 గంటల 39 నిమిషాల్లో ఒక వెయ్య నూటొక్క(1101) కాగితపు పువ్వులతో కూడిన 574 అడుగుల పూల ఫ్రేమ్‌ని తయారు చేసి గిన్నిస్‌ రికార్డులకెక్కింది. అభిరుచిగా మొదలైన ఆర్ట్‌..రికార్డుల సృష్టించే స్థాయికి దారితీసింది. అదీగాక ఈ కళలు మానసిక ఉల్లాసం తోపాటు మనపై మనకు నమ్మకాన్ని అందిస్తాయి కూడా.

(చదవండి: కర్ణుని మాదిరి జననం..! కట్‌చేస్తే ఇవాళ స్టార్‌ రేంజ్‌ క్రేజ్‌..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement