breaking news
Nirmal District Latest News
-
అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్
● ఫేస్ రికగ్నేషన్ ఆధారంగా పౌష్టికాహారం ● ప్రస్తుతం 3 ఏళ్లలోపు చిన్నారులకు.. ● జూలై నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా.. ● పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు లక్ష్మణచాంద: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అ య్యే గుడ్లు, బాలామృతం ప్యాకెట్లు, ఇతర పోషకా హార పదార్థాలు పక్కదారి పడుతున్నాయనే అపవా దు ప్రజల్లో ఉంది. ఈ సమస్యను అధిగమించి, చి న్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన స రుకులు పారదర్శకంగా, సక్రమంగా చేరేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భా గంగా, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార పంపిణీ సమయంలో ఫేస్ రికగ్నేషన్ విధానం తప్పనిసరి చేసింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు, జిల్లా ఐసీడీఎస్ అధికారులు ఈ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై 1 నుంచి అందరికీ.. అంగన్వాడీ కేంద్రాల్లో జూలై 3 నుంచి అందరికీ ఫేస్ రికగ్నేషన్ ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఇదివరకు అంగన్వాడీ టీచర్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఉన్న పోషణ్ ట్రాకర్ యాప్ను అప్డేట్ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి అమలులోకి రానుంది. నూతన విధానంతో ఫేస్ రికగ్నేషన్ ద్వారా యాప్లో ఫొటోతోసహ నమోదు కానుండటంతో క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉండదని అధికారులు అంటున్నారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పోషకాహారం ఎలా అందుతుందో అనే వాటిపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా సులువు కానుంది. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు... అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు అందించే అన్ని రకాల సరుకులు, పోషకాహారం పంపిణీ చేసే సమయంలో ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి చేయడంతో చిన్నారుల తల్లులు, ఇటు బాలింతలు, గర్భిణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు అందాల్సిన అన్ని సరుకులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా చేరుతాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం చిన్నారులకు.. ప్రస్తుతం ఈ ఫేస్ రికగ్నేషన్ విధానం 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు అందించే బాలామృతం, గుడ్లు వంటి అదనపు పోషకాహార పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో, చిన్నారి తల్లి ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఫొటో తీసుకుని, పోషణ్ ట్రాకర్ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాతే సరుకులు అందిస్తున్నారు. ఈ విధానం ద్వారా పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడం సాధ్యమవుతోందని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. జిల్లా సమాచారం.... జిల్లాలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు 926 నిర్మల్ డివిజన్లో 299 ఖానాపూర్ డివిజన్లో 246 భైంసా డివిజన్లో 201 ముధోల్ డివిజన్లో 180 మూడేళ్లలోపు చిన్నారులు 61,061 గర్భిణులు 5,916 బాలింతలు 6,012ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులకు గుడ్లు, బాలామృతం ప్యాకెట్లు అందించే సమయంలో ఫేస్ రికగ్నేషన్ ద్వారా నమోదు చేస్తున్నాం. జూలై 1 నుంచి బాలింతలు, గర్భిణులకు కూడా ఫేస్ రికగ్నేషన్ తర్వాతనే పోషకాహారం అందిస్తాం. ప్రభుత్వం సూచనల మేరకు అమలు చేస్తాం. – నాగమణి, సీడీపీవో నిర్మల్ -
యోగా జీవితంలో భాగం కావాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ దివ్య గార్డెన్ లో యోగా చేస్తున్న ఉద్యోగులు నిర్మల్చైన్గేట్: జిల్లా ప్రజలంతా యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవా లని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివా రం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని దివ్య గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ జూమ్ ద్వారా మాట్లాడారు. ప్రతీరోజు కనీసం 45 నిమిషాలు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. యోగా సాధనతో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిశుమందిర్ విద్యార్థి రామ్కుమార్ మ్యాన్ కోడ్ ప్రక్రియ ద్వారా కళ్లకు గంతలు కట్టుకుని వస్తువులను గుర్తించిన విధానం విశేషంగా ప్రశంసలు అందుకుంది. రామ్ కుమార్ను అదనపు కలెక్టర్ సన్మానించి బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సీపీవో జీవరత్నం, డీఈవో రామారావు, డీఎస్వో కిరణ్కుమార్, డీఎంహెచ్వో రాజేందర్, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఆయుష్ అధికారులు నారాయణరావు, సంధ్యారాణి, వెంకటేశ్వర్లు, శ్రవణ్కుమార్, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు పాల్గొన్నారు. వృత్తిలో ఒత్తిడి దూరం.. నిర్మల్టౌన్: యోగా సాధనతో వృత్తిలో ఒత్తిడి తగ్గుతుందని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో యోగా దినోత్సవం నిర్వహించారు. 150 మంది సిబ్బందితో ఎస్పీ యోగా సాధన చేశారు. యోగా శిక్షకుడు, హెడ్ కానిస్టేబుల్ బాలాజీ పోలీస్ అధికారులకు, సిబ్బందితో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా, నడక వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, డీఎస్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఆర్ఐలు రామ్ నిరంజన్, రమేశ్, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కోర్టు ఆధ్వర్యంలో...ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. యోగాతో మానసిక శరీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో కోర్టు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఆసనాలు చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలో ఎంత అంతర్యం ఉందో.. అందులో యోగాకు ముఖ్యమైన స్థానం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
● గాంధీనగర్కు నదే ఆధారం ● చేపల వేటే వారి ప్రధాన వృత్తి ● నదిని నమ్ముకుని 350 కుటుంబాలు ● మత్స్యకారుల ఊరి కథ
గోదావరి నది తల్లి.. తనను నమ్మిన వారిని ఒడిలో చేర్చుకుని, వారికి ఆసరాగా నిలిచి, జీవనోపాధి అందిస్తూ కాపాడుతుంది. లక్షల ఎకరాలకు సాగునీరందిస్తూ సస్యశ్యామలం చేస్తున్న ఈ నది సోన్ మండలం గాంధీనగర్ గ్రామంలోని 350 కుటుంబాలకు జీవనాధారమైంది. చేపల వేటను ప్రధాన వృత్తిగా భావిస్తూ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో జీవనం సాగిస్తున్న ఈ మత్స్యకారుల జీవనంపై సండే స్పెషల్ స్టోరీ. – లక్ష్మణచాంద/సోన్నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కర్ణాటకలోని బళ్లారి నుంచి కొన్ని కుటుంబాలు ఉపాధి కోసం ఇక్కడకు వచ్చాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, వారు తిరిగి వెళ్లకుండా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న గాంధీనగర్ గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కుటుంబాలే నేడు గాంధీనగర్ గ్రామ మత్స్యకారులుగా జీవనం సాగిస్తున్నాయి. ఊరంతా చేపల వేటే.. గాంధీనగర్ గ్రామంలో మొత్తం 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ఎవరికీ వ్యవసాయ భూములు లేవు. దీంతో, గ్రామంలోని అన్ని కుటుంబాలు చేపల వేటను ప్రధాన వృత్తిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నాయి. ప్రతీరోజు ఉదయం 5 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి తెప్పలపై చేపల వేటకు వెళ్లి, ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య తిరిగి వచ్చి, పట్టిన చేపలను గ్రామంలోని ఒక వ్యక్తికి అమ్ముతారు. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. ఈ విధంగా గ్రామస్తులంతా కలిసి రోజుకు సుమారు ఒక టన్ను చేపలు పట్టి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. వారానికి ఒకసారి చెల్లింపులు గాంధీనగర్ మత్స్యకారులు తాము పట్టిన చేపలను కొనుగోలు చేసన వ్యక్తి వారం రోజుల తర్వాత, ఎవరు ఎన్ని కిలోల చేపలు అమ్మారో లెక్కించి డబ్బులు చెల్లిస్తారు. చేపల రకం, మార్కెట్ పరిస్థితులను బట్టి కిలోకు రూ.70 నుంచి రూ.80 వరకు ధర లభిస్తుందని గ్రామస్తులు తెలిపారు. రోజుకు ఒకరికి సగటున 5 నుంచి 10 కిలోల చేపలు దొరుకుతాయని వారు చెబుతున్నారు. ఎండు చేపలతో అదనపు ఆదాయం ప్రస్తుతం, రోజూ పట్టిన చేపలను వెంటనే అమ్ముతున్నారు. అయితే, జనవరి నెలలో చేపలు ఎక్కువగా లభిస్తాయి. అప్పుడు కొన్ని చేపలు అమ్మి.. మిగిలిన చేపలను కోసి, ఆరబెట్టి అరుగుగా తయారు చేస్తారు. ఈ ఆరబెట్టిన చేపలను ఇంటి ముందు లేదా డాబాలపై ఆరబెడతారు. గ్రామంలో ఎటు చూసినా ఆరబెట్టిన చేపల తోరణాలే కనిపిస్తాయి. ఇది గాంధీనగర్ గ్రామానికి ప్రత్యేకతను తెలియజేస్తుంది. సహకార జీవనం.. గాంధీనగర్ గ్రామ మత్స్యకారుల జీవనం గోదావరి తల్లి ఒడిలో, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆధారంగా సాగుతోంది. చేపల వేటను వృత్తిగా ఎంచుకుని, 350 కుటుంబాలు ఐకమత్యంతో జీవనోపాధిని పొదుతున్నాయి. ఈ గ్రామం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తూ, సహకార జీవనం, స్వావలంబన శక్తిని చాటుతోంది.రోజుకు 8 కేజీలు నేను రోజూ ఉదయం 6 గంటలకు చేపలు పట్టడానికి గోదావరికి వెళ్తాను.8 గంటల వరకు చేపలు పడతా. రెండు గంటల సమయంలో 8 కేజీల చేపలు పట్టుకుని తిరిగి ఇంటికి వచ్చి గ్రామంలోనే అమ్మేస్తా. కేజీ చేపలు రకంను బట్టి రూ.70 నుంచి రూ.80 వరకు ఇస్తారు. ఇలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. – బాలాజీ, మత్స్యకారుడు, గాంధీనగర్ గోదారమ్మను నమ్ముకున్నాం.. చేపల వేట చాలా కష్టమైన పని. కానీ మాకు ఈ పని తప్ప వేరే పని లేదు.. రాదు. మాకు ఎటువంటి వ్యవసాయ భూములు లేవు. చేపల వేటనే జీవనోపాధిగా మల్చుకున్నాం. గోదారమ్మను నమ్ముకున్నాం. కుటుంబ పోషణ కోసం కష్టమైనా చేపల వేట తప్పడం లేదు. ఆదాయ తక్కువే అయినా చేపలవేటతో ఉపాధి పొందుతున్నాం. – సత్వాజీ, మత్స్యకారుడు, గాంధీనగర్ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ ఆదేశించారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ.గౌతమ్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. రెండోదశ ఇళ్లకు సంబంధించిన మార్కింగ్, గ్రౌండింగ్ పనులు నిత్యం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరైన స్థలాల్లో నిర్మాణం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) లబ్ధిదారుల ఓటీపీ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని, ఇందుకోసం వార్డుస్థాయి అధికారులకు నియోజకవర్గాలవారీగా శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, గృహనిర్మాణ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పగలు.. 13 గంటలు!
● శనివారం జిల్లాలో సుదీర్ఘ పగలు.. ● ‘వేసవి ఆయానంతం’గా పేర్కొంటారన్న నిపుణులునిర్మల్ లో శనివారం సాయంత్రం 6:50 గంటలకు సూర్యుని వెలుతురు సుదీర్ఘ పగలుకు కారణం ఇదే.. సాధారణంగా భూమి 23.5 డిగ్రీల వంపు తిరిగి సూర్యుడు చుట్టూ తిరుగుతున్న సమయంలో భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఈ సమయంలోనే వేసవి ఆయనాంతం ఏర్పడుతుంది. సాధారణంగా జూన్ 21 రోజునే భూమి ఉత్తరార్థ గోళం సూర్యుడికి సమీపంగా రావడం వల్ల సూర్యుని కాంతి భూమిపై మరింత ఎక్కువ కాలం కేంద్రీకృతం అవుతుంది. దీంతో పగలు ఎక్కువగా ఉంటుంది. నిర్మల్ఖిల్లా: జిల్లాలో జూన్ 21న శనివారం ప్రత్యేకత సంతరించుకుంది. సాధారణంగా రోజుకు 24 గంటలు ఉంటాయని తెలుసు. అందులో 12 గంటల సమయం పగలు, ఉంటే మరో 12 గంటలు రాత్రి. సూర్యోదయం సూర్యాస్తమయం ప్రకారం పగలు రాత్రి వ్యవధుల్లో చాలా సందర్భాల్లో కాస్త తేడా ఉండటం సహజమే. అయితే శనివారం రోజున మాత్రం జిల్లాలో పగటి సమయం గణనీయంగా పెరిగింది. సాయంత్రం 6:40 దాటిన సూర్యుడు అస్తమించలేదు. పగలు సుదీర్ఘంగా ఉండటం అనే దృగ్విషయాన్ని ‘వేసవి ఆయనాంతం’గా వ్యవహరిస్తారని నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన భౌతికశాస్త్ర నిపుణులు రాఘవేంద్రవర్మ తెలిపారు. జిల్లాలో శనివారం ఉదయం 5:24 గంటలకు సూర్యోదయం కాగా, సూర్యాస్తమయం 7:09 గంటలకు జరిగింది. అంటే దాదాపు 13 గంటలకు పైగా పగలు ఉంది. ఇది ఖగోళశాస్త్రంలో ప్రత్యేకమైన రోజుగా వ్యవహరిస్తారని, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా భిన్నత్వాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ కన్వీనర్గా రామయ్య
ఖానాపూర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ కన్వీనర్గా నంది రామయ్యను అఖిలపక్ష నాయకులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని అర్అండ్బీ విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సాగి లక్ష్మణ్రావు, కోకన్వీనర్లుగా ఆకుల శ్రీనివాస్, బీసీ రాజన్న, కొండాడి గంగారావు, ప్రధాన కార్యదర్శిగా కాశవేణి ప్రణయ్, కోశాధికారిగా ఎనగందుల నారాయణ, ముఖ్య సలహాదారులుగా కొక్కుల ప్రదీప్, పడాల రాజశేఖర్, గౌరికార్ రాజు, శనిగారపు శ్రావణ్, పుప్పాల ఉపేందర్ ఎన్నికయ్యారు. అదనపు కలెక్టర్కు వినతి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ను జిల్లా కేంద్రంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇప్పటికే పలుశాఖలకు కేటాయించిన స్థలాల్లో ఆయా శాఖల కార్యాలయాలు మంజూరుకాలేదని గుర్తు చేశారు. ఆ స్థలాలను రద్దు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించాలని విన్నవించారు. -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టాలి
● డీపీవో శ్రీనివాస్ నర్సాపూర్(జి): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డీపీవో శ్రీనివాస్ ఆదేశించారు. మండలంలోని నర్సాపూర్(జి), కుస్లి గ్రామాల్లోని పారిశుద్ధ్య పనులు, సెగ్రిగేషన్ షెడ్, శ్మశానవాటిక, అంగన్వాడీ కేంద్రాలు, నర్సరీలను శనివారం పరిశీలించారు. సేంద్రియ ఎరువులు తయారుచేసి రైతులకు అమ్మి గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలని సూచించారు. వన మహోత్సవానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. డీపీవో వెంట ఎంపీవో తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాథోడ్ కై లాస్, కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
● జిల్లా జడ్జి శ్రీవాణి భైంసాటౌన్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబి రం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి రాధిక, బైంసా కోర్టు జడ్జి డి.దేవేంద్రబాబుతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అ నంతరం శ్రీవాణి మాట్లాడుతూ.. వివిధ రంగా ల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రజలు తరచూ ఆ రోగ్య పరీక్షలు చేపించుకోవాలని సూచించారు. అనంతరం భైంసా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, ఇతర వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్తదాన శిబిరంలో పాల్గొని పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, పట్టణ వైద్యులు, న్యాయవాదులు, కోర్టు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఆనందయోగం..
కిడ్నాప్ కేసులో ఆరుగురి అరెస్ట్ నిర్మల్ జిల్లాలో ఈనెల 15న సంచలనం సృష్టించిన కిడ్నాప్, హత్యాయత్నం, దొంగతనం కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ను బలోపేతం చేయాలి పార్టీకి కార్యకర్తలే బలమని.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. శుక్రవారం కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. 9లోu 8లోu యోగా.. రెండక్షరాల ఈ సాధనం నిండుజీవితాన్ని మార్చేస్తుంది. నిత్యసాధనతో ఎన్నో అద్భుతాలనూ చూపుతుంది. కొన్నిసార్లు మందులతో నయంకాని రోగాలనూ మాన్పుతుంది. విశ్వానికి మనదేశం అందించిన అద్భుత ఔషధం యోగా. విదేశీయులు సైతం మనదేశానికి వచ్చి యోగసాధన నేర్చుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. మనదైన ఈ యోగాభ్యాసాన్ని అందరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్న లక్ష్యంతో ఏటా జూన్ 21న ‘ప్రపంచ యోగాదినోత్సవం’ నిర్వహిస్తున్నారు. జిల్లాలోనూ ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోనూ చాలామంది యోగాకు కేరాఫ్గా మారారు. తాము సాధన చేస్తూ.. పదిమందితో సాధన చేయిస్తూ.. యోగానందం పొందుతున్నారు. – నిర్మల్జిల్లా కేంద్రానికి చెందిన ముధుల్కర్ అన్నపూర్ణది యోగా కుటుంబం. యోగాకు కేరాఫ్గా మారిన ఆమె తన కుటుంబ సభ్యులనూ యోగసాధనలో, శిక్షణలో భాగం చేశారు. భర్త చంద్రశేఖర్ ప్రోత్సాహంతో చిన్నప్పుడు నిజామాబాద్లో యోగాగురువు ప్రభాకర్ దగ్గర నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుతున్నారు. యోగాతోపాటు నేచర్క్యూర్నూ నేర్చుకున్న అన్నపూర్ణ ఆ రెండింటి సమ్మిళితంగా ఎన్నో వ్యాధులు, రోగాల నుంచి బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నారు. అన్నపూర్ణతో పాటు కుమారులు సుమిత్, సాయికిరణ్, కోడళ్లు నవ్యశ్రీ, నమ్రత యోగా శిక్షకులుగా సేవలందిస్తున్నారు. నిత్యజీవితంలో ఓ భాగంగా.. యోగా అనేది నిత్యజీవితంలో ఓ భాగంగా మారిపోవాలి. ప్రత్యేకంగా అని కాకుండా ప్రతిరోజూ సాధన చేయడం వల్ల జీవితాంతం మంచి ఫలితాలు ఉంటాయి. మా కుటుంబమంతా యోగా నేర్పించడంలో భాగం కావడం ఆనందంగా ఉంది. – అన్నపూర్ణ, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలుయోగా కుటుంబం -
నిర్మల్
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025మహిళా ప్రాంగణాన్ని సందర్శించిన ఆర్డీవో సారంగపూర్: మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలోని మహిళా ప్రాంగణాన్ని నిర్మల్ ఆర్డీఓ రత్నకళ్యాణి శుక్రవారం సందర్శించారు. ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో ఎంపీహెచ్డబ్ల్యూవోకు సంబంధించి శిక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ప్రాంగణంలో వసతి గదులు, భోజనశాలను పరిఽశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీవో వెంట ప్రాంగణం అధికారి విజయలక్ష్మి ఉన్నారు. లక్ష్మణచాంద: ఆసనాలు వేస్తున్న బాలికలుతండ్రి చేస్తున్న యోగాసనాలను చూస్తూ పెరిగిన చైతన్య కేవలం ఐదేళ్లకే తానూ యోగా సాధన ప్రా రంభించింది. క్లిష్టమైన యోగాసననాలను సైతం సులువుగా వేస్తూ ఆకట్టుకుంది. తండ్రి ద్వారా నేర్చుకున్న విద్యలో పట్టు సాధించడమే కాకుండా పట్టా కూడా పొంది, పదిమందికి నేర్పిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని వెంకటాద్రిపేట్కు చెందిన ద్యావరశెట్టి చైతన్య యోగా ఇన్స్ట్రక్టర్గా సేవలందిస్తున్నారు. నిజామాబాద్కు చెందిన చైతన్య తండ్రి ప్రభాకర్ యోగాచార్యులుగా గుర్తింపు పొందారు. ఆయన ప్రోత్సాహంతో యోగాలో స్వల్పకాలంలోనే కఠినమైన ఆసనాల్లోనూ పట్టుసాధించారు. నాసిక్లోని యశ్వంత్రావు చౌహాన్ యూనివర్సిటీ నుంచి డిప్లోమా ఇన్ యోగా పూర్తిచేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ పతకాలు సాధించారు. యోగాను మించింది లేదు.. నిత్యం ఒత్తిళ్లకు లోనవుతున్న ప్రస్తుత సమాజంలో యోగాను మించిన ఔషధం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా తప్పనిసరి. తండ్రి వారసత్వంగా సమాజానికి యోగా అందించడం గర్వంగా ఉంది. – ద్యావరశెట్టి చైతన్యన్యూస్రీల్ఐదేళ్లప్రాయం నుంచే.. -
బాలాజీ.. యోగా గురూజీ
కుభీర్ మండల కేంద్రానికి చెందిన జంగిలి బాలాజీ 1996లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కానిస్టేబుల్గా చేసేవారు. ఒకరోజు ఆయన రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనదారుడు ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొట్టాడు. పలుచోట్ల కాలు విరిగింది. తలలో రెండుచోట్ల రక్త గడ్డకట్టింది. మందులతో తగ్గకుంటే బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కానీ.. అప్పటికే తమ ఇచ్చోడ స్టేషన్ ఎస్సైగా చేసిన భీమన్న ప్రోద్బలంతో యోగా, ప్రాణాయామం నేర్చుకున్న బాలాజీ ఆపరేషన్కు ఒప్పుకోలేదు. నిత్యం.. యోగా, ప్రాణాయామంతోపాటు కపాలభాతి చేయడంతో ఏడాదిన్నర తర్వాత మళ్లీ తలకు చేయించిన స్కానింగ్లో రక్తం గడ్డకట్టిన(బ్లడ్క్లాట్) సమస్య కనిపించనే లేదు. అలా.. స్వయంగా తానే యోగసాధనతో కలిగిన ఫలితాన్ని అనుభవించిన బాలాజీ నిత్యజీవితంలో యోగాను భాగంగా చేసుకున్నారు. దాదాపు 36 ఏళ్లుగా తాను యోగా చేయడం కాకుండా ఆసక్తితో వచ్చేవారికి నిత్యం ఉచితంగా యోగాను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్ పోలీసు ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా జిల్లాకేంద్రంలోని దివ్యనగర్లోని వశిష్ట యోగాసంఘటన్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. నిత్యసాధనతో సత్ఫలితాలు.. యోగాను ప్రతిఒక్కరూ చేయొచ్చు. దీనిని నిత్యజీవితంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. మా ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా నిత్యం జిల్లాకేంద్రంలో ఉచితంగా యోగా నేర్పుతుండటం సంతృప్తినిస్తోంది. –జంగిలి బాలాజీ, క్లూస్టీమ్, నిర్మల్ -
హెల్మెట్ భారం కాదు.. భద్రత!
● చిన్నపారి నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు ● నిబంధనలు పట్టించుకోని వాహనదారులు ● రాష్ డ్రైవింగ్తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత నిర్మల్టౌన్: ఉరుకులు, పరుగుల జీవన గమనంలో వేగం కోసం పరుగెత్తే ప్రయత్నంలో భద్రతను నిర్లక్ష్యం చేస్తూ చాలామంది భారీ మూల్యం చెల్లిస్తున్నారు. చిన్నపాటి అజాగ్రత్తతో నిండు ప్రాణాలు క్షణంలో గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు, గాయాలయ్యే సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తప్పించవచ్చని రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే గమ్యానికి త్వరగా చేరాలనే ఆతృతలో హెల్మెట్ ధరించడాన్ని వాహనదారులు విస్మరిస్తున్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణం డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో 85 శాతం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం లేదని సమాచారం. రోడ్డు ప్రమాదాల్లో 60 నుంచి 70 శాతం మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లే సంభవిస్తున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ గణాంకాలు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి. నామమాత్రపు తనిఖీలు.. పోలీసులు, రవాణాశాఖ అధికారులు హెల్మెట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. తనిఖీలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలు, మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. చట్టం ఇలా.. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 129, 177 ప్రకారం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా విధించే అవకాశం ఉంది. పదేపదే హెల్మెట్ లేకుండా జరిమానా పడిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. రవాణా శాఖ హెచ్చరిక రవాణా శాఖ అధికారులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వచ్చే వాహనాల రిజిస్ట్రేషన్ను నిరాకరిస్తున్నామని, రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ వాహనాల చట్టం కింద జరిమానాతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధ రించకపోవడం వల్ల తమకు, తమ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని, ప్రతీ వాహనదారుడు ని యమ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. నాణ్యమైన హెల్మెట్తో భద్రత.. నాసిరకం హెల్మెట్లు ధరించడం వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించలేం. హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రాప్ గడ్డం కింద సౌకర్యవంతంగా ఉండేలా, తలకు సరిగ్గా సరిపోయేలా ఎంపిక చేసుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఐఎస్ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్లను ధరించాలని రవాణా శాఖ సూచిస్తోంది. నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల్లో తలకు గాయాల తీవ్రత 98 శాతం వరకు తగ్గుతుంది. అదనంగా, దుమ్ము, దూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది. హెల్మెట్ తప్పనిసరి.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ వాహన చట్టం కింద జరిమానా విధించడంతోపాటు, వాహనం సీజ్ చేస్తాం. హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడగలుగుతాం. – దుర్గాప్రసాద్, రవాణా శాఖ అధికారి తలకు గాయం.. ప్రాణాంతకం చాలా వరకు రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలు కావడం వల్ల ప్రాణాలు కోల్పోతుంటారు. తలకు చిన్న గాయమైనా జీవితాంతం దాని ఎఫెక్ట్ ఉంటుంది. టూ వీలర్ మీద వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. దీంతో రోడ్డు ప్రమాదాల సమయంలో 80 శాతం వరకు బాధితులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ బీఎల్ఎన్.రెడ్డి, న్యూరో ఫిజీషియన్, నిర్మల్ -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఆందోళన
ఖానాపూర్: అత్యంత వెనుకబడిన ఖానాపూర్ మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని అఖిలపక్షం నాయకులు ఆకుల శ్రీనివాస్, నంది రామయ్య, లక్ష్మన్రావు, కొండాడి గంగారావు, గౌరీకార్ రాజు, కీర్తి మనోజ్ అన్నారు. ఈమేరు తహసీల్దార్ సుజాతను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని తిమ్మాపూర్ శివారులో ప్రభుత్వం మిగులు భూమి పోను 30 ఎకరాల భూమి ఉందని తెలిపారు. అధికారులు సర్వే చేపట్టి మిగులు భూమి వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ వచ్చేవరకు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా అంతకుముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట ముఖానికి నల్ల గుడ్డలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమాల్లో కొక్కుల ప్రదీప్, రవీందర్, ప్రణయ్, ఉపేందర్, రమేశ్, ప్రణీత్, సతీశ్, నారాయణ, నసీర్, వెంకటేశ్, శ్రావణ్, వెంకటేశ్వర్రావు, మురళి, అజయ్, రవి, భీమన్న, సాయి తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమువుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్జీయూకేటీలో సైబర్ భద్రతపై అవగాహన బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటి)లో ఐసీఐసీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ భద్రతపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, సిబ్బందిలో సైబర్ భద్రతపై అవగాహన పెరిగిందన్నారు. కార్యక్రమంలో డిజిటల్ మోసాలు, సైబర్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించారు. ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ, ఏపీకే ఫైళ్ల ద్వారా వచ్చే మోసాలు, సందేహాస్పద లింకులు, ఫోన్ కాల్ మోసాలు, ఫిషింగ్, గ్రిడ్ టెక్నిక్స్, బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జోనల్ డైరెక్టర్ సత్యపాల్రెడ్డి, దీపక్ మల్హోత్రా మాట్లాడుతూ, ఐసీఐసీఐ బ్యాంక్ 3ఇన్1 డిజిటల్ కార్డు గురించి వివరించారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది శ్రీనివాస్, అసోసియేట్ డీన్లు డాక్టర్ విఠల్, నాగరాజు, చీఫ్ వార్డెన్ శ్రీ మధుసూదన్రెడ్డి, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పుస్తక రచన అభినందనీయం భైంసాటౌన్: తెలంగాణ ఉద్యమంలో ముధోల్ నియోజకవర్గ పాత్రకు పుస్తకరూపమివ్వడం అభినందనీయమని కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలచారి అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతిభవనంలో శుక్రవారం పుస్తకం ఆవిష్కరించి మాట్లాడారు. పుస్తక రచనకు కృషిచేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణగౌడ్, రచయితలను అభినందించారు. కార్యక్రమంలో కార్యదర్శి చాకేటి లస్మన్న, పుస్తక సంపాదకులు పుండలీక్రావు, నాయకులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భవనం ప్రారంభించక..
● వేధిస్తున్న అసౌకర్యాలు ● మరుగుదొడ్లు సరిపడా లేక అవస్థలు ● పెండింగ్లోనే తరగతి గదుల నిర్మాణ పనులు ● ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు ● సాక్షి విజిట్లో తేటతెల్లం ఖానాపూర్: మండలంలోని బాదనకుర్తి ప్రాథమికోన్నత పాఠశాలకు గత ఏడాది రూ.కోటి నిధులతో నిర్మించిన నూతన భవనం ఉన్నప్పటికీ దానిని ప్రారంభించకపోవడంతో పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. గ్రామంలో పురాతన భవనం ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో మండల అధికారుల సూచన మేరకు ఉపాధ్యాయులు విద్యార్థుల తరగతుల నిర్వహణను పురాతన భవనంలో కాకుండా సమీపంలోని ఇతర భవనాల్లో కొనసాగించాల్సి వస్తోంది. -
బీడీ పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలి
సోన్: బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన కోట్ప చట్టాన్ని రద్దు చేయాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రాజన్న డిమాండ్ చేశారు. ఈనెల 21, 22న నిజామాబాద్లో నిర్వహించే టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సోన్ మండలం జాఫ్రాపూర్లో ఏర్పాటుచేసిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమతో ఏడు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో వీరికి ఉపాధి కరువవుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీవన భృతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ)జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి. ఎ.నవీన్, జమున, లక్ష్మి, విజయ, గంగమణి తదితరులు పాల్గొన్నారు. -
భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
● కలెక్టర్ అభిలాష అభినవ్ సారంగపూర్: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని జామ్ గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరి శీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలకు కారణాలు తెలుసుకున్నారు. గ్రామంలో భూములకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నా యా అని గ్రామస్తులను అడుగగా 582 సర్వే నంబరులో ఉన్న భూసమస్యలను గురించి రైతులు, గ్రామస్తులు కలెక్టర్కు వివరించారు. 582 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో అసైన్డ్ పట్టాలు ఇవ్వడంతో ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేకుండా పోయిందని తెలిపారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు రశీదు ఇవ్వడంతోపాటు తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీదేవికి సూచించారు. అవసరమైతే సర్వేయర్ సహాయంతో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల తనిఖీ రెవెన్యూ సదస్సు పరిశీలన అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. స్టాఫ్ రూమ్కు వెళ్లి హాజరు రిజిష్టర్లు పరిశీలించారు. అక్క డి నుంచి మధ్యాహ్న భోజనం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తయారు చేసిన భోజనం పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా పదోతరగతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించి పలు విషయాలపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. పదోతరగతి వార్షిక పరీక్షలకు ముందు నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని కష్టపడి చదవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు అభిలాష్ నెట్బాల్లో, రమ్య బేస్బాల్లో జాతీయస్థాయికి ఎంపికైన విషయం తెలుసుకుని అభినందించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఈవో రా మారావు, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
నిర్మల్
బాసరలో పోలీసుల మాక్ డ్రిల్ బాసర గోదావరి నదిలో ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు. శివంగి, స్పెషల్ టీంలు సుమారు 2 గంటలు నదిలో మాక్ డ్రిల్ చేశారు. 10లోu శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025డిగ్రీలో ప్రవేశాలు సోన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, సోఫీ నగర్లో 2025 –26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ(బీజెడ్సీ), బీఎస్పీ(ఎంజెడ్సీ) ఎంఎస్సీఎస్, బీకాం, కంప్యూటర్, బీకాం జనరల్, బీఏ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ డి.కవిత తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ కళాశాల ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారని తెలిపారు. పూర్తి వివరాలకు 9000599665, 9542556688 సంప్రదించాలని సూచించారు. జిల్లాలో మద్యం, సిగరెట్లను దాటి యువత కొత్త మత్తుపదార్థాలకు బానిస అవుతోంది. గంజాయి ఒక్కటే సమస్య అనుకుంటే, ఇటీవల సరికొత్త మ త్తు రకాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెలలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు ల్యాబ్/ఎక్స్–రే టెక్నీషియన్లు, ఓ యువకుడు శస్త్రచికిత్సల్లో వాడే మిడాజోలం ఇంజెక్షన్లను యువతకు అక్రమంగా అందజేస్తూ పట్టుబడ్డారు. ఈ మందు అతిమాత్రలో ప్రాణాంతకం. ఇక, ఖానాపూర్లో ‘బాటిల్షాట్’ అనే కొత్త పద్ధతిలో యువకులు గంజాయి, బోనోఫిక్స్ మిశ్రమాన్ని బాటిల్లో రంధ్రం చేసి, పెన్ను మూత ద్వారా పీలుస్తున్నారు. ఈ ప్ర మాదకర అలవాటు గురించి తెలియకనే యువ త దీనికి బానిస అవుతోంది. వైట్నర్, దగ్గుమందుల ను కూడా మత్తుకోసం వాడుతున్నవారు ఉన్నారు, ఇది జిల్లా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతోంది. అధికారుల చొరవ. ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ లక్ష్యంతో కలెక్టర్, ‘గాంజా గస్తీ’ కింద ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవగాహన కార్యక్రమాలు, పోలీసు దాడులు, కళాజాతలతో ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ, గంజాయి విక్రయాలు, మత్తు వాడకం తగ్గడం లేదు. జిల్లా కేంద్రం, శివారు ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతోంది. ప్రత్యేక వ్యూహం మత్తురహిత జిల్లా కోసం పోలీసు, అబ్కారీ శాఖలు, జిల్లా అధికారులు సమన్వయంతో ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేసి, గ్రామాల్లో అభివృద్ధి కమిటీల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలి. సమాచారం ఆధారంగా స్పందించే బదులు, మత్తుపదార్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర పర్యవేక్షణ, కఠిన చర్యలు అవసరం. యువతను ఈ ఉచ్చు నుంచి కాపాడేందుకు సమగ్ర విధానం తప్పనిసరి. ఇటీవల ఖానాపూర్ శివారు ప్రాంతాల్లో లభ్యమైన బోనోఫిక్స్ న్యూస్రీల్కొత్తకొత్త మత్తుల్లో... జిల్లా డ్రగ్ ఫ్రీ చేస్తామంటున్న అధికారులు కొత్త డ్రగ్స్ వినియోగిస్తున్న వ్యసనపరులు చర్యలు చేపడుతున్నా.. ఆగని గంజాయి‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ చేస్తామంటూ ఉన్నతాధికారులు చొరవ తీసుకున్నా.. జిల్లాలో మత్తుమందు వినియోగం ఏమాత్రం ఆగడం లేదు. పైపెచ్చు.. సరికొత్త మత్తులో యువత చిత్తవుతోంది. చాలాచోట్ల ఉదయం నుంచే గంజాయి మత్తులో జోగుతూ.. రోజంతా ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఉంటున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ఓ యువకుడి మరణానికి కారణమైన మరో యువకుడు గంజాయి తాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలోనూ జిల్లాలో చాలామంది యువకులు ఇదేమత్తులో రోడ్డుప్రమాదాల బారిన పడి, తమ నిండుప్రాణాలను కోల్పోయారు. తమను కన్నతల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. – నిర్మల్మద్యం, సిగరెట్, గంజాయిని దాటేసి కొత్తకొత్త మత్తుల్లో యువత చిత్తవుతోంది. కొంతకాలంగా గంజాయి ఒక్కటే జిల్లాను కుదిపేస్తోందనుకుంటుంటే.. ఇటీవల సరికొత్త మత్తుపదార్థాల వాడకం వె లుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో జిల్లాకేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు ల్యాబ్/ఎక్స్రే టెక్నీషియన్లు, ఓ యువకుడు శస్త్రచికిత్సల సమయంలో పేషెంట్లకు ఇచ్చే మిడాజోలం అనే మత్తుమందు ఇంజెక్షన్లను యువతకు ఇస్తూ పట్టుబడ్డారు. ఈ మత్తు ఏమాత్రం ఎక్కువైనా ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ఖానాపూర్లో పలువురు యువకులు ‘బాటిల్షాట్’లకు అలవాటు పడటం కలవరం రేపుతోంది. ఒక బాటిల్లో గంజాయి, బోనోఫిక్స్ రెండు మిశ్రమంగా చేసి బాటిల్కి చిన్న రంధ్రం చేసి దానికి పెన్ను మూతను బిగించి గంజాయి, బోనోఫిక్స్ మిశ్రమాన్ని పీలుస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో తెలియకుండానే పీల్చేస్తున్నారు. వైట్నర్, దగ్గుమందులనూ మత్తుకోసం వాడుతున్నవారు ఉన్నారు. గంజాయితో పాటు ఇలా కొత్తకొత్త మత్తుల కోసం జిల్లా యువత పెడతోవలో పోతుండటం కలవరపెడుతోంది. -
మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?
● అవినీతి పెరిగినందునే ఏసీబీ దాడులు ● అధికారులు నిబద్ధతతో పనిచేయాలి ● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి నిర్మల్టౌన్: ‘అసలు నిర్మల్ మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..? అధికారులు ఏం పని చేస్తున్నారు..? వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయంటే ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందో అర్థమవుతోంది. ప్రజలకు సేవలు అందించకుండా, చేస్తున్న పనులపై కనీసం అవగాహన లేకుండా, కేవలం సంపాదనపైనే దృష్టి పెడతామంటే కుదరదు. అలాంటి అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవచ్చు. అధికారులు సిబ్బంది నిబద్ధతతో పని చేయాల్సిందే..’ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మున్సిపల్లో జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. ఆయా శాఖలలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీలో జరుగుతున్న ఆయా పనుల పురోగతిపై కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. అవినీతిపై ఆగ్రహం... నిర్మల్ మున్సిపాలిటీ ఇటీవల ముద్రపడ్డ అవినీతికి కేరాఫ్గా మారిందంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు పనుల నిమిత్తం మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఏం ఆశించకుండా పనులు చేయాలని సూచించారు. నిర్మల్లో సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, డీఈ హరిభువణ్, ఆర్వో అనుప్కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్లాబ్ కిందే చదువులు
భైంసారూరల్: మండలంలోని కుంసర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్లాబ్ కిందే పాఠాలు నేర్చుకుంటున్నారు. మన ఊరు మన బడిలో నూతన భవన నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరు చేశారు. మూడేళ్ల క్రితం స్లాబ్ వేశారు. ఏళ్లు గడుస్తున్న చుట్టు గోడలు నిర్మించలేదు. రోడ్డుపై వెళ్లే వాహనాల శబ్దంతో విద్యార్థులు పాఠాలు వినలేకపోతున్నారు. ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, 45 మంది విద్యార్థులు ఉన్నారు. మాంజ్రి ప్రాథమిక పాఠశాల భవనానికి తలుపులు కిటికీలు లేవు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు 50 మంది విద్యార్థులు ఉన్నారు. -
ఇబ్బందుల మధ్యనే..
లక్ష్మణచాంద: మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను విజిట్ చేయగా ఇక్కడ ఒక తరగతి ఇండోర్ షటిల్ కోర్టులో నిర్వహిస్తుండగా, మూడు తరగతులు అసంపూర్తి భవనంలో నిర్వహిస్తున్నారు. ఉన్న గదులు శిథిలావస్థకు చేరి వర్షంకు ఉరుస్తాయని ఉన్నతాధికారుల ఆదేశాలే మేరకు అందులో తరగతులు నిర్వహించడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. పొట్టపెల్లి ప్రాథమిక పాఠశాల భవనం కూడా శిథాలావస్థకు చేరడంతో పై కప్పు రేకులకు రంద్రాలు పడ్డాయి. అసంపూర్తి భవనంలో తరగతులు -
డయేరియాపై యుద్ధం
● 45 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు ● జిల్లాలో 73,715 మంది చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ మాత్రలు పక్కా ప్రణాళికతో.. జిల్లాలో గుర్తించిన 5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ ఓఆర్ఎస్, జింక్ మాత్రలు అందిస్తాం. 45 రోజులపాటు సాగే ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ ఒక్కరూ డయేరియాతో మృతి చెందొద్దనే లక్ష్యంతో కృషిచేస్తున్నాం. – డాక్టర్ నైనారెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నిర్మల్చైన్గేట్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్నైట్ (ఐడీసీఎఫ్) కార్యక్రమం ఈనెల 16న ప్రారంభమై, వచ్చే నెల 31 వరకు 45 రోజులపాటు జరగనుంది. 5 ఏళ్ల చిన్నారుల్లో నీళ్ల విరేచనాల నియంత్రణ లక్ష్యంగా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల ద్వారా పంపిణీ చేస్తారు. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో ప్రతీ చిన్నారికి ఈ సదుపా యం అందిస్తారు. వర్షాకాలంలో డయేరియా ప్రభా వం పెరగడంతో, ఓఆర్ఎస్ ద్రావణంతో శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ను పునరుద్ధరిస్తారు. చిన్నారుల గుర్తింపు జిల్లాలో 1,88,929 కుటుంబాల సర్వేలో 5 ఏళ్లలో పు 73,715 మంది చిన్నారులను గుర్తించారు. 160 ఏఎన్ఎంలు, 568 ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది వారికి ఓఆర్ఎస్, జింక్ మాత్రలు ఇస్తారు. జింక్ మాత్రల ప్రయోజనాలు జింక్ మాత్రలు డయేరియా సంఖ్యను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 14 రోజుల వినియోగంతో నీళ్ల విరేచనాలు, న్యూమోనియా నివారణ సాధ్యమవుతుంది. డయేరియా వల్ల చిన్నారులు నీరసించకుండా, 13 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 38,429 జింక్ మాత్రలను సిద్ధం చేశారు. ఇటుక బట్టీలు, సంచార జాతుల ప్రాంతాల్లో వాహనాల ద్వారా సేవలు అందిస్తారు -
పనులు నిలిపివేశారు....
సారంగపూర్: మండలంలోని జామ్ ఉన్నత పాఠశాలలో రూ.10 లక్షలతో చేపట్టిన డైనింగ్ హాల్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రూ.3 లక్షలు ఇంకా విడుదల కాకపోవడంతో సదరు కాంట్రాక్టరు పనులను నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆరుబయట భోజనాలు చేసే పరిస్థితి. జామ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో 50 లక్షలతో ఇటీవలే నూతన భవనం నిర్మించారు. పాతభవనం కూలడానికి సిద్ధంగా ఉంది. మంచినీళ్ల ట్యాంకు కోసం దానిని అలాగే ఉంచేశారు. అది కూలిపోతే పెను ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. భైంసాటౌన్: పట్టణంలోని మదీనాకాలనీలోగల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్, ఉర్దూ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. 265 వరకు విద్యార్థులు ఉన్నారు. పది తరగతి గదులు అవసరం. ఐదు గదులే అందుబాటులో ఉన్నాయి. మన ఊరు–మన బడి పనులు మధ్యలో నిలిచాయి. ఒకే గదిలో ఐదు తరగతులు.. కడెం: మండలంలోని ఉడుంపూర్ జీపీ పరిధి గండిగోపాల్పూర్ ప్రాథమిక పాఠశాలలో 23 మంది విద్యార్థ్దులు, ఇద్దరు టీచర్లున్నారు. ఐదు తరగతులు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. అదనపు గదులు అసంపూర్తిగా ఉన్నాయి. తరగతులు సరిపోక.. -
అసంపూర్తి బడి
నిర్మల్ రూరల్ మండలం గంగా పూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన షెడ్డు లేకపోవడంతో వరండాలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. గత విద్యా సంవత్సరం యూడైస్లో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండగా ఈసారి బడిబాటలో నలుగురు పెరిగి సంఖ్య పదికి చేరింది. ఒకే గదిలో అంగన్వాడీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారు.నిర్మల్ రూరల్: సర్కారు బడుల్లో విద్యార్థులు సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు చేపట్టినా ఇంకా పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు–మనబడి పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం సాక్షి జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలను విజిట్ చేయగా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. – మండలంలోని రానాపూర్ ప్రాథమిక పాఠశాలలో మూడు తరగతి గదులు ఉండగా అందులో ఓ గదిని గ్రామపంచాయతీ కోసం, మరొక గది అంగన్వాడీ విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నారు. కొన్నేళ్లుగా కొత్త గ్రామపంచాయతీ భవనం పెండింగ్లో ఉండడంతో పరిపాలన మొత్తం పాఠశాల నుంచే జరుగుతుంది. మధ్యాహ్న భోజన షెడ్డు లేకపోవడంతో పాఠశాల ఎదురుగా ఓ ఇంట్లో తయారుచేసి బడికి తీసుకువస్తున్నారు. డ్యాంగాపూర్ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. గురువారం సాక్షి విజిట్ కి వెళ్లినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఎవరూ లేరు. మధ్యాహ్న భోజన భోజనం తయారు చేసే ఓ మహిళ మాత్రమే ఉంది. అడిగితే సారు... కొత్త పుస్తకాలు తేడానికి చిట్యాల బడికి వెళ్లాడని సమాధానం ఇచ్చింది. ఇదే అదనుగా.. బడికి వచ్చిన విద్యార్థులంతా ఇంటికి వెళ్లిపోయారని పేర్కొంది. ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాల లోనిది. ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య 244. ఇందులో 134 మంది బాలికలు ఉన్నారు. కానీ వీరందరికీ ఒకే ఒక టాయిలెట్ ఉండడంతో విద్యార్థినిలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మూడేళ్ల క్రితం మన ఊరు– మనబడి లో కొత్త మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అవి కట్టే క్రమంలో ఉన్న మరుగుదొడ్లను కూల్చివేశారు. ప్రస్తుతం పాడుబడ్డ ఓ టాయిలెట్ మాత్రమే ఉంది. -
భవన నిర్మాణం ఆపాలని ఆందోళన
లక్ష్మణచాంద: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఎస్సీ కుల(మాల) సంఘ భవన నిర్మాణం పనులు నిలిపివేయాలని కోరుతూ మాదిగ సంఘం సభ్యులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్వారి మడిగెలు(రూములు) ఉండేవని, ఇటీవల అనుమతి లేకుండా ఎస్సీ మాల సంఘం సభ్యులు కూలగొట్టి అక్కడ మాల సంఘ భవనం నిర్మాణం పనులు చేపడుతున్నారన్నారు. నిర్మాణ పనులు నిలిపి వేసి తమకు న్యాయం చే యాలని కోరారు. అనంతరం తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధకు వినతిపత్రం అందజేశారు. -
పొదుపు మహిళలకు అక్షర జ్ఞానం
● ‘ఉల్లాస్’తో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పథకం అమలు ● నిరక్షరాస్యులను గుర్తించే పనిలో డీఆర్డీవో సిబ్బంది నిర్మల్చైన్గేట్: ప్రభుత్వం మహిళా సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ‘ఉల్లాస్’ పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలోని ప్రతీ మహిళ అక్షర జ్ఞానం పొందాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. దశలవారీగా అమలయ్యే ఈ పథకం ద్వారా నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదవడం, రాయడం నేర్పడంతోపాటు, మధ్యలో చదువు మానేసిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఓపెన్ డిగ్రీ వరకు చదివించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డీఆర్డీవో, విద్యాశాఖ సమన్వయంఉల్లాస్ కార్యక్రమం సజావుగా అమలు కావడానికి డీఆర్డీవో, విద్యాశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటవుతుంది. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంఈవో, ఐకేపీ ఏపీఎం, గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, వీఏవో, సంఘాల అధ్యక్షురాళ్లు, కార్యదర్శులు బాధ్యతలు నిర్వహిస్తారు. నిరక్షరాస్యులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సర్వే వివరాలను ఈ యాప్లో నమోదు చేస్తారు. చదువు మధ్యలో మానేసిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివేలా ప్రోత్సహిస్తారు. సంఘాల్లో చదువుకునేవారు లేకుంటే సభ్యు ల పిల్లలతో కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సర్వే పూర్తయిన వెంటనే వాలంటీర్ల సాయంతో కార్యక్రమం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సామాజిక సాధికారతఉల్లాస్ పథకం ద్వారా చదవడం, రాయడం నేర్ప డం ద్వారా సామాజిక సాధికారత సాధించడమే ప్రధాన లక్ష్యం. అధికారిక సమాచారం ప్రకారం, మహిళా సంఘాల్లో 50 శాతం మంది మాత్రమే సంతకం చేయగలరు, మిగిలిన వారు వేలిముద్రలు వే స్తున్నారు. ఈ పథకం ద్వారా అందరికీ చదవడం, రాయడం నేర్పడంతోపాటు, మధ్యలో చదువు మా నేసిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, డిగ్రీ వరకు చదివించనున్నారు. అదనంగా, స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. బ్యాంకింగ్లో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. వలంటీర్లుగా అక్షరాస్యులుడీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించిన తర్వాత, 15–20 మందితో గ్రూపులను ఏర్పా టు చేస్తారు. మహిళా సంఘాల్లోని అక్షరాస్య మహిళలను వలంటీర్లుగా ఎంపిక చేసి, నిరక్షరాస్యులకు చదువు నేర్పే బాధ్యత అప్పగిస్తారు. వీరు ఎలాంటి పారితోషికం లేకుండా సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విద్యాశాఖ నుంచి పుస్తకాలు, గ్రామస్థాయి ఉపాధ్యాయుల సహకారంతో ఈ పథకం విజయవంతం కానుంది. జిల్లా వివరాలుమండలాలు 1818 ఏళ్లు నిండిన సభ్యులపై దృష్టిఈ పథకం ప్రధానంగా 18 ఏళ్లు నిండిన మహిళా సంఘ సభ్యులపై దృష్టి సారిస్తుంది. జిల్లా స్థాయిలో డీఆర్డీవో, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే ప్రారంభించారు. ఇప్పటి వరకు 31,323 మంది నిరక్షరాస్య మహిళలను గుర్తించారు. సంఘాల్లో అక్షరాస్యులైన సభ్యులను వాలంటీర్లుగా నియమించి, నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం నేర్పిస్తారు. ఐదుగురు నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారు. గ్రామ స్థాయిలో సర్వే పూర్తి చేసి, నిరక్షరాస్యుల సంఖ్యను ఖరారు చేస్తారు.అవగాహన కల్పిస్తున్నాం.. 2030 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అక్షరాస్యత సాధించే దిశగా ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపట్టాయి. మహిళా సంఘంలోని నిరక్షరాస్యులకు చదువు చెప్పేందుకు కార్యాచరణ రూపొందించాం. విద్యాశాఖ అధికారులు, డీఆర్డీవో ఆధ్వర్యంలో సమష్టిగా ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటాం. – తిరుపతిరావు, సహాయ ప్రాజెక్టు అధికారి -
సాగులో సవాళ్లు..!
నిర్మల్కేజీబీవీల్లో నూతన మెనూ కేజీబీవీల్లో బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెనూలో పలు మార్పులు చేసింది. ● వరి ధాన్యం మద్దతు ధర రూ.69 పెంచిన కేంద్రం ● పచ్చిరొట్ట ఎరువుల సబ్సిడీ 10 శాతం తగ్గించిన రాష్ట్రం ● దొడ్డు రకం వడ్లకు ఇప్పటికీ బోనస్ లేదు ● సన్న వడ్లు దిగుబడి రాదు.. ● అవసరానికి అంద ని రైతు భరోసాగురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 20258లోu ఉపకరణాల దరఖాస్తు గడువు పొడిగించాలి నిర్మల్చైన్గేట్: దివ్యాంగుల సహాయ ఉపకరణాల దరఖాస్తు గడువు ఈనెల 30 వరకు పొడిగించాలని కోరుతూ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సట్టి సాయన్న బుధవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపకరణాలకోసం ఈనెల 7 నుండి 18 వరకు కేవలం 11 రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి మారుమూల ప్రాంత దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యం, నాయకులు సముద్రాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. భైంసా : జిల్లాలో గోదావరి నది తీరంలో వరి పంట ప్రధాన వ్యవసాయంగా కొనసాగుతోంది. 53 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతంలో దాదాపు 70 వేల ఎకరాలకుపైగా వరి సాగవుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 18 లక్షల ఎకరాల్లో సింహభాగం వరి పంటే ఉంది. అయితే, భారీ వర్షాలతో నది ఉప్పొంగి పంట నష్టం జరుగుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దీంతోపాటు, తక్కువ మద్దతు ధర, సబ్సిడీల తగ్గింపు, దొడ్డు రకం వరికి బోనస్ లేకపోవడం, పంటల బీమా అమలు చేయకపోవడం వంటి సమస్యలు రైతులను కలవరపెడుతున్నాయి. సబ్సిడీ తగ్గింపుతో భారం..సాగులో భూమి సారవంతం కోసం రైతులు జీలుగులు, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులను వినియోగిస్తారు. గతేడాది 60 శాతం సబ్సిడీతో 30 కేజీల జీలుగు బస్తా రూ.1,116, 40 కేజీల జనుము బస్తా రూ.1,448కి అందుబాటులో ఉండేవి. ఈ ఏడాది సబ్సిడీని 50 శాతానికి తగ్గించడంతో 30 కేజీల జీలుగుబస్తా రూ.2,138, 40 కేజీల జనుము బస్తా రూ.2,510కి పెరిగింది. ఈ ధరల పెంపుతో రైతులు పచ్చిరొట్ట ఎరువులు కొనలేక, ప్రైవేటు దుకాణాల్లో పెసర బ్యాగులు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దొడ్డు వడ్లకు ఇవ్వని బోనస్..నిర్మల్ జిల్లాలో వరి సాగులో 60 శాతం రైతులు దొడ్డు రకం వరిని పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నప్పటికీ, దొడ్డు రకానికి ఈ సౌకర్యం లేదు. సన్నరకం వరి సాగు చేసే రైతులు చీడపీడల నివారణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉండగా, ఎకరానికి 14 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. అయితే, దొడ్డు రకం వరి ఎకరానికి 25 క్వింటాళ్లకు పైగా దిగుబడినిస్తుంది. అయినా దొడ్డు రకానికి బోనస్ లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మద్దతు ధర, సబ్సిడీల తగ్గింపు, దొడ్డు రకం వరికి బోనస్ లేకపోవడం వంటి సమస్యలు రైతుల ఆర్థికస్థితిని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం వరి రైతులకు న్యాయమైన మద్దతు ధర, సబ్సిడీలు, బోనస్ సౌకర్యాలను అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు భరోసా ఆలస్యం.ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అందించే పెట్టుబడి సాయం ఆలస్యం అవుతోంది. మొదటి ఏడాది చాలా మందికి రైతుభరోసా ఇవ్వలేదు. గత యాసంగిలో కూడా ఐదెకరాల లోపు మాత్రమే రైతుభరోసా చెల్లించింది. అదీ ఆలస్యమైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి కోసం మళ్లీ అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు వరి రైతులకు ఈయేడు కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్నాం. 30 కేజీల జీలుగు సంచి 50 శాతం సబ్సిడీతో రూ.2,138 చెల్లించి తీసుకెళ్లాలి. 40 కేజీల జనుము సంచి 50 శాతం సబ్సిడీతో రూ.2,510 చెల్లించి తీసుకెళ్లాలి. 30 కేజీల పచ్చిరొట్ట విత్తనాలు రెండున్నర ఎకరాలకు సరిపోతాయి. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి పెసర వేస్తున్నాం పచ్చిరొట్ల విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏటా జీలుగు, జనుము చల్లేవాళ్లం. ఈ ఏడాది 30 కిలోల బస్తా రూ.2,138 చెల్లించాల్సి వస్తోంది. అంత మొత్తం పెట్టి ఏ రైతు కొనలేడు. – కొండ శ్రీనివాస్, న్యూపోచంపాడ్దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం దొడ్డురకం వరిధాన్యానికి బోనస్ ఇవ్వాలి. సన్నాలకు క్వింటాలుకు రూ.500 చెల్లిస్తుంది. అయినా సన్నాల సాగుకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దిగుబడి తగ్గిపోతుంది. వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – రఘునాథ్, వాలేగాంమద్దతు ధర పెరగలేదు కేంద్ర ప్రభుత్వం వరి పంట మద్దతు ధర అంతగా పెంచలేదు. క్వింటాలుకు రూ.69 మాత్ర మే పెంచింది. దీంతో రైతులు నష్టాలపాలవుతారు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా మద్దతు ధర అంతగా పెరగడంలేదు. – సుంకరి దత్తు, ఇలేగాంన్యూస్రీల్మద్దతు ధర నామమాత్రం పెంపుకేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వరి ధాన్యం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని గతేడాదితో పోలిస్తే కేవలం మూడుశాతం మాత్రమే పెంచింది. సాధారణ వరిధాన్యం క్వింటాల్కు రూ.2,369, ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2,389గా నిర్ణయించింది, ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం రూ.69 పెరుగుదల మాత్రమే. ఇతర పంటలతో పోలిస్తే వరి ధర పెంపు అత్యంత తక్కువగా ఉందని రైతులు పెదవి విరుస్తున్నారు. మినుములపై రూ.400, కందులపై రూ.450, జొన్నపై రూ.328, మొక్కజొన్నపై రూ.175, సజ్జలపై రూ.150, రాగులపై రూ.579, వేరుశెనగపై రూ.480, సోయాబీన్పై రూ.436, పొద్దుతిరుగుడుపై రూ.441, పత్తిపై రూ.589, ఒలిసెలపై రూ.820 పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సమయంలో బీజేపీ వరిధాన్యం క్వింటాల్కు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, తక్కువ పెంపుతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
లారీ ఢీకొని ఒకరు..
భెంసాటౌన్: పట్టణంలోని సాత్పూల్ వంతెన సమీపంలో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తానూర్ మండలం బెలతరోడకు చెందిన చెంచుల సాయినాథ్(37) బుధవారం బెల్తరోడ వెళ్లి బైక్పై భైంసా తిరిగి వస్తున్నాడు. సాత్పూల్ వంతెన వద్దకు చేరుకోగా, నిర్మల్ వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న సాయినాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎండీ గౌసుద్దీన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపినాథ్ తెలిపారు. సాయినాథ్కు భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. -
కేజీబీవీల్లో నూతన మెనూ
● పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ● విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు ● పెరిగిన మెస్చార్జీలతో విద్యార్థినుల హర్షంలక్ష్మణచాంద: నిరుపేద బాలికలు మధ్యలో చదువు ఆపేయకుండా, వారిని అక్కున చేర్చుకుని కేజీబీవీలు వసతితో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. కేజీబీవీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కేజీబీవీ విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కేజీబీవీ బాలికల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. దీంతో 2025 –26 విద్యా సంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించనున్నారు. పెరిగిన మెస్ చార్జీలు గతంలో 6 –10, ఇంటర్ విద్యార్ధులందరికీ ఒకే విధంగా నెలకు రూ.1225లు ప్రభుత్వం అందించేది. కానీ నేడు నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1330లు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540లు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2100లు అందించనున్నారు. నూతన మెనూ ఇదే.. ఉదయం..టమాట కిచిడి, సాంబారు, బూస్టు, పూరి, రాగి జావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్తో పాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. ఇందులో అరటి పండు, జామ, వాటర్ మిలన్, బొప్పాయి, సపోట వంటి పండ్లు అందించాలి. మధ్యాహ్నం..టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడక బెట్టిన గుడ్డు, చికెన్ అందించాలి. సాయంత్రం..ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి. రాత్రి వేళ..వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, అయిదుసార్లు గుడ్లు, ప్రతీరోజు నెయ్యి అందించాలి. ఉమ్మడి జిల్లా కేజీబీవీల సమాచారం.. జిల్లా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య ఇంటర్ కాలేజీలు విద్యార్థుల సంఖ్య మొత్తం నిర్మల్ 18 3600 14 2240 5840 మంచిర్యాల 18 3786 15 1080 4866 ఆదిలాబాద్ 18 4800 13 680 5480 కుమురంభీం 15 3027 13 1069 4096 -
తల్లి మెడలో గొలుసు అపహరించిన కుమారుడు
మందమర్రిరూరల్: తల్లి మెడలోని రెండు తులాల బంగారు గొలుసు దొంగిలించిన కుమారుడిని మందమర్రి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం మందమర్రి సర్కిల్ పోలీస్స్టేషన్లో సీఐ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరై వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు వైపు నివాసం ఉండే విజయపురి పుల్లమ్మ అనే వృద్ధురాలు గత నెల 24న అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి పుల్లమ్మ మెడలో గొలుసు దొంగిలించినట్లు మనుమడు శివ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల సూచనలు, సాంకేతికత ఆధారంగా ఇంటి వారే దొంగతనం చేసి ఉంటారనే కోణంలో పుల్లమ్మ కుమారుడు శంకరయ్యపై నిఘా ఉంచారు. ఆయన అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్ల తానే దొంగిలించినట్లు నేరం అంగీకరించాడు. ఈ మేరకు శంకరయ్య వద్ద నుంచి రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న ఎస్సై రాజశేఖర్, క్రైంటీం కానిస్టేబుళ్లు మహేశ్, రాకేశ్లను ప్రత్యేకంగా అభినందించారు. -
అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తా
● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిసారంగపూర్: అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జామ్ నుంచి బోరింగ్తండా వరకు రూ.3.20 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రారంభించారు. అనంతరం సారంగాపూర్, బీరవెల్లిలో లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులు వేగంగా పనులు చేపడితే నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆందోళన మండలంలోని దుర్గానగర్కు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్పందించిన ఎ మ్మెల్యే వెంటనే పీఆర్ డీఈఈ తుకారాం, ఆర్అండ్ బీ అధికారులతో మాట్లాడారు. గురువారం పనులు ప్రారంభమవుతాయని, కానిపక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ వ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు గంగారెడ్డి, తక్కల రమణారెడ్డి, రాజేందర్ రెడ్డి, విలాస్, తిరుమలాచారి, నారాయణ, కొరిపెల్లి రాజు, ఆర్వీ రమణ, తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణానికి భూమిపూజ నిర్మల్చైన్గేట్: పట్టణంలోని బంగల్పేట్ కాలనీలో రూ.10 లక్షల నిధులతో చేపట్టిన ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదిరాజ్ల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి, నాయకులు పాతర్ల గణేశ్, ఆనంద్, పాతర్ల హరీష్, యాటకారి సాయన్న, పాతర్ల వెంకటి, పరమేశ్, దేవిదాస్, జింక సూరి, జుట్టు దినేష్, గిల్లి విజయ్, గవాస్కర్, చరణ్ మౌర్య, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
భూ వివాదంలో ఇరువర్గాల దాడి
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ శివారులో జరిగిన భూ వివాదంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తాళ్లగురిజాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన పనాస గణేశ్ ఆకెనపల్లి శివారు సర్వే నంబర్ 64లో ఉన్న భూమిని మంగళవారం సాయంత్రం దున్నే క్రమంలో పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన సింగతి హైమావతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. దాడిలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కూల్చివేతకు సిద్ధంగా కళాశాల భవనం
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిథిలావస్థలో గల పురాతన భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆధ్వర్యంలో చర్యలకు ఉపక్రమించారు. భవనం శిథిలావస్థకు చేరిందని కూలితే విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఇంజినీర్ అఖిలేష్తో కలిసి బుధవారం కూల్చివేత అనుమతుల కోసం కొలతలు తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. వేలాది మంది విద్యార్థులు చదువుకున్న భవనం కూల్చివేస్తున్న విషయం తెలియగా పలువురు కలత చెందుతున్నారు. ఈ భవనాన్ని 1969లో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఖానాపూర్ పోలీస్స్టేషన్కు కొణతం దిలీప్ఖానాపూర్: గతంలో సోషల్మీడియాలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్మీడియా రాష్ట్ర ఇన్చార్జి కొణతం దిలీప్పై నమోదైన కేసులో భాగంగా బుధవారం ఆయన ఖానాపూర్ పోలీస్స్టేషన్లో హాజరయ్యారు. ఫిబ్రవరిలో నమోదైన కేసులో ఇది వరకే బెయిల్ మంజూరైనప్పటికీ ప్రతీ బుధవారం పోలీస్స్టేషన్కు హాజరు కావాల్సి ఉంది. ఈక్రమంలో పోలీసులు గంటల తరబడి ఆయన పోలీస్స్టేషన్లో నిరీక్షించేలా చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీస్స్టేషన్ బయట పెద్దఎత్తున గుమిగూడారు. బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారంకుభీర్: మండలంలోని బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారంతో సమీప ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం బెల్గాం గ్రామ శివారులోని చేనులో పని చేసే వారికి ఎలుగుబంటి కన్పించడంతో వారు భయంతో కేకలు వేయగా సమీప అడవిలోకి పారిపోయింది. మండలంలోని బ్రహేశ్వర్, మార్లగొండ అడవుల్లో ఎలుగుబంట్లు ఉన్నట్లు సమాచారం ఉంది. ఎలుగుబంటి కనిపించిందన్న వార్త వ్యాపించడంతో అడవుల సమీపంలోని గ్రామాల ప్రజలు అడవివైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ విషయమై అటవీ అధికారి లక్ష్మణ్ను బుధవారం వివరణ కోరగా ఐదు నుంచి ఆరు ఎలుగుబంట్లు ఉన్నాయని, అవి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఇద్దరు వ్యక్తుల బైండోవర్
లక్సెట్టిపేట: మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే ఇద్దరు వ్యక్తులను స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధనిశెట్టి సతీశ్, కారుకూరి మల్లేశ్ అనే వ్యక్తులు గత కొద్ది రోజుల నుంచి కారణం లేకుండానే 100 నంబర్కు డయల్ చేస్తున్నారు. పలుమార్లు ఈవిధంగా డయల్ చేస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, ఎలాంటి సమస్యలు లేకున్నా ఫోన్ చేస్తున్నందున బైండోవర్ చేసినట్లు తెలిపారు. -
కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
సారంగపూర్: కౌలురైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. మండలంలోని ఆలూరులో సర్వే నిర్వహించి కౌలురైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో కౌలు రైతుల ఆధీకృత సాగుదారుల చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్రెడ్డి సర్కారు కౌలురైతుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తుండడంతో పంటనష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి కౌలురైతుల చట్టాన్ని తీసుకుని వచ్చి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక సభ్యులు రమాకాంత్, రాకేశ్, షారూఖ్, శివాకర్, శ్రీనివాస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్చైన్గేట్: జిల్లాలో వర్షాలు, వరదల వల్ల ప్రజలు ప్రాణాలు, ఆస్తులు కోల్పోకుండా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లడ్ మాన్యువల్పై సంబంధిత శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తుల నిర్వహణ కేవలం స్పందనకే పరిమితం కాకుండా, ప్రమాద నివారణ, తీవ్రత తగ్గింపు, పునరావాసం, పునర్నిర్మాణం దశల్లో ముందస్తుగా ప్రణాళికలు ఉండాలన్నారు. వర్షాకాలానికి ముందు నదులు, వాగులు, కుంటలలో నీటి ప్రవాహ మార్గాలను శుభ్రం చేయాలని, పట్టణాల్లో డ్రెయినేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని, పాడైన రహదారులను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు. రిజర్వాయర్ల గేట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులు, గోదావరి పరీవాహక గ్రామాల్లో నివసించే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుల నీటిమట్టాలను నిరంతరం గమనిస్తూ దిగువ గ్రామాలకు సమాచారం అందించాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న బ్రిడ్జిలు, రహదారులను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. వైద్యులు, సిబ్బంది స్థాని కంగా అందుబాటులో ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల సమయంలో పశువులను మేతకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం మండలాల వారీగా వరద ప్రభావిత ప్రాంతాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రరెడ్డి, ఆర్డీవో రత్నాకళ్యాణి, రెవెన్యూ, విద్యుత్, ఫైర్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు బాసటగా రైతు భరోసా నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రైతులకు బాసటగా నిలుస్తోందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వానాకాలం 2025 సీజన్కు సంబంధించి జిల్లాలో 1,86,400 మంది రైతులకుగానూ మంగళవారం నాటికి డీబీటీ ద్వారా 1,33,135 మందికి రూ.112.86 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి త్వరలోనే నిధులు జమ కాబోతున్నట్లు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా పెట్టుబడి సాయం అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
కార్మికులు హక్కుల రక్షణకు ఉద్యమించాలి
నిర్మల్చైన్గేట్: కార్మికులు హక్కుల రక్షణకో సం ఉద్యమించాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రాజన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీడీ ఫ్యాక్టరీలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో 44 చట్టాలను నాలుగు కోడ్స్గా మార్చి యాజమాన్యాలకు అనుకూలమైన చట్టాలు చేయడం అన్యాయమన్నారు. బీడీ పరిశ్రమపై విధించిన 28 శాతం జీఎస్టీ తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, పోశెట్టి, రాజేందర్, లక్ష్మణ్, రాజు, మురళి, నరసయ్య, గంగామణి, లక్ష్మి, విజయ, కమల, కవిత, అరుణ, శ్రీనివాస్, చిన్నయ్య, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులు చట్టపరంగా పరిష్కరించాలి
● ఎస్పీ జానకీ షర్మిలభైంసాటౌన్: అర్జీదారుల ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో భైంసా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్లో సూచనలు చేశారు. అనంతరం భరోసా కేంద్రంలో షీ టీమ్ సిబ్బందితో కుటుంబ కలహాల కేసుల్లో ఇరు పార్టీల వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఓ వృద్ధ దంపతులు తమ కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఎస్పీని కలిసి మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన ఎస్పీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు గోపినాథ్, నైలు, మల్లేశ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలిభైంసాటౌన్: వర్షాకాలం నేపథ్యంలో వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. బుధవారం డీఆర్డీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన మాక్డ్రిల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్డీఎఫ్ సిబ్బంది విపత్తుల సమయంలో ప్రజలను ఎలా కాపాడాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్కుమార్, సీఐ గోపినాథ్, సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నిర్మల్చైన్గేట్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన బసండ్ల ముత్యం బుధవారం నిర్మల్ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ డబ్బాతో కలెక్టరేట్కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. గమనించిన కార్యాలయ సిబ్బంది అతడి నుంచి పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ అతడిని స్టేషన్కు తరలించి వివరాలు సేకరించారు. ముత్యం మాట్లాడుతూ గ్రామంలోని తన సొంత భూమిని వేరొకరు కబ్జా చేశారని ఆరోపించాడు. కబ్జాదారుడు మూడు రోజుల నుంచి తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు. బౌలర్లదే జోరుమంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తుండగా బుధవారం జరిగిన పోటీల్లో బౌలర్లదే హవా కొనసాగింది. రెడ్, బ్లూ జట్ల మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరగ్గా, బ్లూ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెడ్ జట్టు బౌలర్లు అద్బుతంగా రాణించగా, డి.లక్ష్మణ్ 4 కీలక వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో రెడ్జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీరామ్ 53 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడని కోచ్ ప్రదీప్ తెలిపారు. -
బస్సు ఢీకొని ఒకరి మృతి
భైంసారూరల్: మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ (49) అనే వ్యక్తి దేగాం గ్రామంలో బస్సు ఢీకొట్టిన సంఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన బొడిగంవార్ చంద్రశేఖర్ –సుశీల దంపతులు బుధవారం బాసరకు వెళ్తున్నారు. దేగాం బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచిచూస్తున్న క్రమంలో చంద్రశేఖర్ను భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దేగాం చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. -
సమస్యల పరిష్కారానికి వేదిక
ఖానాపూర్: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందేలా చూడడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక పనిచేస్తుందని వేదిక చైర్మన్ ఇ.నారాయణ తెలిపారు. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలోని ఈఆర్వో ఆఫీస్ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్–2, నిజామాబాద్) ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్, మామడ మండలాలకు చెందిన వినియోగదారులు సదస్సులో పాల్గొన్నారు. నారాయణ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక కార్యాలయాల్లోని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అయినా పరిష్కారం కాకపోతే నిజామాబాద్లోని సీజీఆర్ఎఫ్ కార్యాలయంలో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుంచి 9 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు జాతీయ మానవహక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ వకీల్తో పాటు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ఆర్ ఉపాలి, బీజేపీ నాయకులు నాయిని సంతోష్, తదితరులు పలు సమస్యలపై వేర్వేరుగా వినతిపత్రాలను ఇచ్చారు. సమావేశంలో కన్జూమర్స్ ఫోరం టెక్నికల్ సభ్యుడు రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యుడు కిషన్, ఎస్ఈ సుదర్శనం, డీఈఈ నాగరాజు, ఏడీ శ్రీనివాస్, ఏఈ రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చి ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేయాలి
ఖానాపూర్: ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశాకే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్రాథోడ్ అన్నారు. పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్హాల్లో మంగళవారం మాట్లాడారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి ప్రజాకోర్టులోనే ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబితేనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినట్టు అని పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల నిధులన్నీ ఎక్కువగా కేంద్రప్రభుత్వానివే అని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి అప్పుల బాధ తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అంకం మహేందర్, ఆకుల శ్రీనివాస్, పుప్పాల ఉపేందర్, కీర్తి మనోజ్, రవీందర్రెడ్డి, గిరి, వెంకట్రాములు, రమేశ్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. పరిశుభ్రత పాటించాలి నిర్మల్చైన్గేట్: వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ సూచించారు. పట్టణంలోని ఆదర్శనగర్లో మంగళవారం చేపట్టిన డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధులు దరిచేరవని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, మహిళా శిశు అభివృద్ధిశాఖ, ఐకేపీ సిబ్బందితో కలిసి ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడి యా అధికారి రవీందర్, డాక్టర్ తేజస్విని, ఆరోగ్య పర్యవేక్షకులు భోజారెడ్డి, మతిన్, ఆరోగ్య సహాయకులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదిలోనే అన్నదాత చిత్తు!
నిర్మల్అడ్రస్ లేని అత్యవసర సేవలు బాసర అమ్మ చెంత అత్యవసర సేవలు అంద డం లేదు. గోదావరిలో మునిగినా, రోడ్డు ప్ర మాదం జరిగినా చికిత్సకు భైంసా లేదా నిజామాబాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి.● జిల్లాలో నకిలీ విత్తనాలు.. నిషేధిత రసాయన మందులు ● డీఏపీ కొరతతో రైతులకు ఇబ్బందులు ● అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు ● నిద్రమత్తులో జిల్లా వ్యవసాయ శాఖ గుడిలో గుప్తనిధుల వేట కడెం మండలం కల్లెడ, దోస్త్నగర్ మధ్యన ఉన్న కొండపై వెలసిన లక్ష్మీనారసింహ ఆలయంలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. 9లోu బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 20258లోu పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ● సీనియర్ సివిల్ జడ్జి రాధిక నిర్మల్టౌన్: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాలలో సదుపాయాలపై ఆరా తీశారు. తరగతి గదుల సౌలభ్యం, తాగునీరు వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పాముల బెడద లేకుండా చూడాలని తెలిపారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటాలన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు చదువు ప్రాధాన్యత తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది లింగగౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, పీడీ భూమన్న, స్నేక్ స్నాచర్ వనీల్, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, దశరథ్, విద్యార్థులు పాల్గొన్నారు. భైంసాటౌన్: ఖరీప్ సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. భూములు సాగుకు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు లో బిజీగా ఉన్నారు. అయితే ఇదే అదనుగా నకిలీ దందాకు తెరలేపారు వ్యాపారులు. రైతులు అడిగిన విత్తనాలు, ఎరువులు కాకుండా గుర్తింపు లేని కంపెనీల విత్తనాలు, ఎరువులు అంటగడుతూ ఆదిలో నే రైతులను చిత్తు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసపోతున్నారు. భైంసా మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన రైతు దండేకర్ రాందాస్, భైంసాలోని ఓ విత్తన డీలర్ వద్ద రవి ఉన్నతి రకం సోయా విత్తనాలు కొనుగోలు చేశాడు. విత్తనాలను విత్తే సమయంలో అవి చెడిపోయి ఉన్నట్లు గుర్తించాడు. వ్యా పారిని సంప్రదించగా, వారు కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని సమాధానం ఇచ్చారు. సోమవారం రాందాస్ కొందరు రైతులతో కలిసి భైంసాలోని ఏడీఏ కార్యాలయానికి వెళ్లగా, అధికారులు అందుబాటులో లేరు. చివరకు ఓ అధికారి వచ్చి, వ్యాపారితో ఫోన్లో మాట్లాడి మరో విత్తన సంచి సర్దుబాటు చేయాలని సూచించారు. డీఏవోను సంప్రదించినా ఇదే సమాధానం రావడం గమనార్హం. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దు కాణాల్లో కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 575 సంచుల 20:20 ఎరువులు, 117 డీఏపీ బస్తాలు, 26 పొటాష్ బస్తాలు అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. అంతేకాక, సరైన బిల్లులు లేని 24.5 లీటర్ల నిషేధిత గ్లైఫోసెట్ మందును స్వాఽ దీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు జిల్లా వ్యవసాయ శాఖ మొక్కుబడి పనితీరుకు అద్దం పడుతోంది. డీఏపీ కొరత.. జిల్లావ్యాప్తంగా డీఏపీ కొరత తీవ్రంగా ఉంది. జిల్లాకు 7 వేల టన్నుల డీఏపీ అవసరమని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా, 6 వేల టన్నుల స్టాక్ వచ్చింది. 90 శాతం అమ్ముడైనట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో డీలర్లు డీఏపీ లేదని రైతులకు చెబుతున్నారు. తెలిసిన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మహారాష్ట్రకు ఎరువులను తరలిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కుభీర్ ప్రాంతంలో ఎరువుల లోడ్తో వెళ్తున్న వాహనం పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. సహకార సంఘాలకు కూడా డీఏపీ పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడంతో, రైతులు అధిక ధరలకు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. న్యూస్రీల్అధిక ధరలకు విక్రయండీఏపీ రూ.1,450కి కొన్నా... డీఏపీ కొరత పేరుతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నేను భైంసాలోని ఓ దుకాణంలో 8 సంచులు కొన్న. ఒక్కొక్కటి రూ.1,450 చొప్పున ఇచ్చారు. బిల్లు అడిగితే ఇవ్వడం లేదు. కొందరికి రూ.1,350 ధర వేసి రశీదు ఇస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – సాయినాథ్, రైతు, భైంసా ఫిర్యాదు చేయాలి.. జిల్లాలో డిమాండ్ మేరకు ఎరువుల స్టాక్ ఉంది. మొత్తం 6 వేల టన్నులకుగాను 5 వేల టన్నులు జిల్లాకు చేరింది. ప్రస్తుతం డీలర్ల వద్ద మరో 1,600 టన్నులు అందుబాటులో ఉంది. డీలర్లు డీఏపీ స్టాకు లేదన్నా, అధిక ధరకు విక్రయించినా వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారిభైంసా మార్కెట్లో కొందరు వ్యాపారులు డీఏపీ బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డీఏపీ బస్తా రూ.1,350కి విక్రయించాల్సి ఉండగా, రూ.1,400 నుంచి రూ.1,500కి, 20:20 బస్తా రూ.1,280కి ఉండగా, రూ.1,300 నుంచి రూ.1,350కి, 10:26:26 బస్తా రూ.1,800కి విక్రయిస్తున్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు స్టాక్ లేదనే సమాధానం వస్తోంది. ఈ నిర్లక్ష్య వైఖరి రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. -
సర్వే నంబర్ 241..!
● ఉన్నది 40 ఎకరాలు.. 77 ఎకరాలకు పట్టాలు! ● యాకర్పెల్లిలో భూ వివాదం ● అధికారుల తప్పిదంతో రైతులకు శిక్ష ● ఏళ్లుగా భూముల కోసం గొడవలు.. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే.. ఇటీవల కలెక్టర్ ఆదేశించిన విధంగా సర్వేయర్లతో టీం ఏర్పాటు చేసి భూమి కొలతలు చేయిస్తాం. అలాగే మోఖాపై(సాగుచేసుకుంటున్న) రైతులు ఎవరు, సాగు చేయకుండా పట్టాలు పొందిన వారు ఎవరు అనే విషయాలను పరిశీలిస్తాం. దాని ఆధారంగా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తాం. అనంతరం ఒరిజినల్ పట్టాదారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీదేవి, తహసీల్దార్, సారంగాపూర్రెవెన్యూ వ్యవస్థలో లోపాలు 241 సర్వే నంబర్లోని భూ వివాదం రెవెన్యూ వ్యవస్థలోని పారదర్శకత, కచ్చితత్వం లోపాలను స్పష్టం చేస్తుంది. గతంలో అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో తప్పిదాలు ఈ సమస్యకు దారితీశాయి. ఆన్లైన్ రెవెన్యూ రికార్డులు వాస్తవ భూ విస్తీర్ణంతో సరిపోలకపోవడం, అసైన్డ్ భూముల జారీలో అస్పష్టత వంటివి రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ సమస్య రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి పథకాల అమలును కూడా అడ్డుకుంటోంది. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, క్షేత్రస్థాయి సర్వేలు, కఠినమైన పర్యవేక్షణ ద్వారా ఇటువంటి సమస్యలను నివారించవచ్చు. సారంగపూర్: మండలంలోని యాకర్పెల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 241లోని అసైన్డ్ భూమి వివాదాల కేంద్రంగా మారింది. ఈ సర్వే నంబర్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 40.46 ఎకరాల భూమి ఉంది. ఈమేరకే రైతులకు పట్టాలు ఉండాలి. కానీ, భూమికి మించి అధికంగా పట్టాలు జారీ కావడంతో రైతులు, అన్నదమ్ములు, క్రయవిక్రయదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఈ సర్వే నంబర్కు సంబంధించిన ఫిర్యాదులు సర్వసాధారణమయ్యాయి. అధికారులు ‘‘241 సర్వే నెంబరా?’’ అని ఎదురు ప్రశ్న వేస్తూ కామన్ అన్నట్లు చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే భూ సమస్యకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా పట్టాలు.. 241 సర్వే నంబర్లో వాస్తవంగా 40.36 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, గతంలో 32 మంది భూమిలేని రైతులకు అసైన్డ్ పట్టాలు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఈ సర్వే నంబర్లో మరో 50 మందికి పైగా పట్టాలు జారీ అయ్యాయి. ఆన్లైన్ రెవెన్యూ రికార్డులలో ఈ భూమి విస్తీర్ణం 77.17 ఎకరాలుగా నమోదైంది, అంటే 36 ఎకరాల 21 గుంటలు అధికంగా నమోదు చేశారు. అక్రమ పట్టాలతో రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) సమస్య ఉత్పన్నమై, రైతులు రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ఈ సమస్యకు మూల కారణం గతంలో పనిచేసిన వీఆర్వోలు. డబ్బులు తీసుకుని ఇష్టారీతిన పట్టాలు జారీ చేశారని రైతులు భూమిని విక్రయించినప్పుడు కొనుగోలుదారుల పేరిట కొత్త పట్టాలు జారీ చేసినా, విక్రయించిన రైతుల పేర్లు రికార్డుల నుంచి తొలగించకపోవడం ఒక సమస్య. అలాగే, మరణించిన రైతుల పట్టాలను వారసుల పేరిట మార్పు చేసినప్పుడు పాత రికార్డులను తొలగించకపోవడంతో భూమి విస్తీర్ణం అధికంగా నమోదైంది. ఈ నిర్లక్ష్యం ఫలితంగా 241 సర్వే నంబర్లో నిత్యం పంచాయితీలు, గొడవలు జరుగుతున్నాయి. పరిష్కారం దిశగా అడుగులు కలెక్టర్ అభిలాష అభినవ్ ఇటీవల భూభారతి రెవె న్యూ సదస్సులో యాకర్పెల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సమయంలో రైతులు ఈ సమస్యను వివరించారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న కలెక్టర్, తహసీల్దార్ శ్రీదేవి నేతృత్వంలో సర్వేయర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమి టీ భూమి కొలతలు తీసి, వాస్తవంగా సాగు చేస్తు న్న రైతులకు మాత్రమే పట్టాలు జారీ చేయాలని సూచించారు. సాగులో లేనివారి పేర్లు తొలగించా లని పేర్కొన్నారు. రైతులు ఈ ప్రతిపాదనకు సమ్మ తి తెలుపడంతో, రెవెన్యూ సదస్సు తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సోన్: మండల కేంద్రంతోపాటు సిద్ధులకుంట, మాదాపూర్, సంఘంపేట్, న్యూవెల్మల్ గ్రా మాలలో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. వివిధ గ్రామాలలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు మంజూరు పత్రాలు అందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, రాష్ట్ర ప్రభు త్వ నిధుల ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం న్యూవెల్మల్ గ్రామంలో వీడీసీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీవో రాజేశ్వర్, డీఈ తుకారం, ఎంపీడీవో సురేశ్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్, గంగన్న, మండల అధ్యక్షుడు గంగారెడ్డి, మహిపాల్రెడ్డి, విజయ, సాగర్, బీడీసీ చైర్మన్ వేణు పాల్గొన్నారు. -
అర్చకులకు శుభవార్త
● బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు ● జిల్లాలో 273 మందికి లబ్ధి లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులు, ధూప దీప నైవేద్యం (డీడీఎన్) అర్చకులకు బీమా, రిటైర్మెంట్ ప్ర యోజనాలతో కూడిన కొత్త విధానాలను ప్రకటించింది. ఈ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా అర్చకు లలో సంతోషాన్ని నింపింది. దీర్ఘకాలంగా ఆలయాల్లో సేవ చేస్తున్న వారి ఆర్థిక భద్రతను బలో పేతం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సాయం పెంపు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా ప్రారంభమైన ధూప దీప నైవేద్యం(డీడీఎన్) పథకం, అర్చకులకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించబడింది. ప్రారంభంలో నెలకు రూ.2,500గా ఉన్న సహాయం, 2015లో రూ.6 వేలకు(పూజా ద్రవ్యాలకు రూ.2 వేలు, అర్చకుడికి రూ.4 వేలు) అందించారు. 2023లో రూ.10 వేలు(పూజా ద్రవ్యాలకు రూ.4 వేలు, అర్చకుడికి రూ.6 వేలు) పెరిగింది. ఈ పెంపు అర్చకుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది. జిల్లాలో 273 మందికి లబ్ధి.. జిల్లాలో డీడీఎన్ పథకం కింద 273 ఆలయాలు ఉ న్నాయి. వీటిలో ఎ కేటగిరీలో 2, బి కేటగిరీలో 4, సి కేటగిరీలో 1 ఆలయం ఉన్నాయి. ఈ పథకం ద్వారా అర్చకులకు నిరంతర సహాయం అందుతోంది, అయితే కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. వేతనాలు ఆలస్యం జిల్లాలో డీడీఎన్ పథకం కింద సేవలందిస్తున్న అర్చకులు గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించి, బకాయిలను విడుదల చేయాలని అర్చకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రయోజనాలు ఇలా.. ప్రభుత్వం అర్చకులకు అందించే ప్రయోజనాలు విభిన్న రకాలుగా రూపొందించబడ్డాయి. రిటైర్మెంట్ గ్రాట్యూటీ: రెగ్యులర్ అర్చకులు: 20 ఏళ్లకుపైగా సేవలకు రూ.8 లక్షలు, 15–20 ఏళ్ల సేవలకు రూ.6 లక్షలు, 10–15 ఏళ్ల సేవలకు రూ.4 లక్షలు, 10 ఏళ్లలోపు మరణిస్తే రూ.2 లక్షలు. డీడీఎన్ అర్చకులు: 20 ఏళ్లకు పైగా సేవలకు రూ.4 లక్షలు, 15–20 ఏళ్ల సేవలకు రూ.3 లక్షలు, 10–15 ఏళ్ల సేవలకు రూ.2 లక్షలు. మరణానంతర సహాయం: అర్చకులకు ఎక్స్–గ్రేషియాగా రూ.50 వేలు, అంతిమ సంస్కారాలకు రూ.30 వేలు. ఉపనయనం గ్రాంట్: రూ.50 వేలు ఇంటి నిర్మాణం: డీడీఎన్ అర్చకులకు రూ.50 వేలు, రెగ్యులర్ అర్చకులకు రూ.4 లక్షల రుణ సహాయం. విద్యా పథకం: గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్డీ కోర్సులకు ఏటా రూ.35 వేలు రీయింబర్స్మెంట్. మెడికల్ సహాయం: మెడికల్ బోర్డు సిఫారసుతో గరిష్టంగా రూ.2 లక్షలు. వివాహ పథకం: రెగ్యులర్ అర్చకులకు రూ.2 లక్షల రుణం, డీడీఎన్ అర్చకులకు రూ.1,01,116, మహిళా అర్చకులు/వారి కుమార్తెల వివాహానికి రూ.1,25,000. -
నిర్మల్
.. గోదావరిలో దీపమే! బాసర వద్ద గోదావరిలో భక్తుల ప్రాణాలకు భద్రత కరువైంది. పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. భద్రత, రణక్ష చర్యలు కానరావడం లేదు. మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025నిర్మల్ మెడికల్ కాలేజీ యోగా వాక్ నిర్మల్టౌన్: యోగాతో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణంరాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం ‘యోగా వాక్ ’ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారుల గుండా ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎస్ఎంవో నారాయణరావు, డాక్టర్ సంధ్యారాణి, డీపీవో శ్రావణ్, డీపీవో నవీన్, ఆయుష్ విభాగం సభ్యులు, ఆశ వర్కర్లు, యోగా శిక్షకురాలు చైతన్య, ప్రదీప్పవిత్ర, పరికిపండ్ల స్వదేశ్, ఎస్పీ రవీంద్ర, అడప నవీన్ పాల్గొన్నారు. హాస్టల్ కొంత ఇబ్బందే.. మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న భవనం సెకండియర్ వరకు పెద్దగా ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు. కానీ.. మూడోసంవత్సరంలోకి అడుగుపెడితే ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికీ ఇక్కడ విద్యార్థుల వసతికి కొంత సమస్యగానే ఉంది. బాలురకు కళాశాల భవనంలోనే హాస్టల్ వసతి కొనసాగిస్తున్నారు. బాలికలకు మాత్రం పాలిటెక్నిక్ కళాశాల భవనంలో వసతి ఏర్పాటు చేశారు. ఇద్దరికీ ప్రత్యేకంగా వసతి గృహాలను నిర్మించాల్సిన అవసరం ఉంది.నిర్మల్: జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న మెడికల్ కాలేజీపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కత్తి వేలాడుతోంది. వైద్యకళాశాల రెండో ఏడాదిలోకి అడుగుపెట్టినా పాలకుల పట్టింపులేనితనంతో చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. కాలేజీ అనుమతి రద్దు చేసేదాకా పరిస్థితి తెచ్చుకోవద్దని ఎన్ఎంసీ హెచ్చరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 కాలేజీలపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈనెల 18న నేరుగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)ని ఆదేశించింది. డీఎంఈతోపాటు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సైతం వర్చువల్గా అందుబాటులో ఉండాలని సూచించింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం డీఎంఈ, ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. అదే భవనంలో.. రెండేళ్లలో 20 ఎకరాలలో రూ.166 కోట్లతో శాశ్వత మెడికల్ కళాశాల భవనాలు అందుబాటులోకి వచ్చేలా నిర్మాణాలు చేపడతామని మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ సమయంలో అప్పటి పాలకులు తెలిపారు. రెండేళ్లు గడిచినా.. సెకండియర్ తరగతులు ప్రారంభమైనా భవనాల ఊసులేదు. ఇప్పటికీ కొత్త భవనాలకు అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం భీమన్నగుట్ట పక్కన కొనసాగుతున్న మెడికల్ కాలేజీ భవనం జిల్లా ఆస్పత్రి కోసం కేటాయించింది. ఐదెకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. అనంతరం జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయించడంతో అదేస్థలంలో రూ.40 కోట్లతో మొదటి సంవత్సరం విద్యార్థులకు సరిపోయేలా, వారి బోధనకు వీలుగా నిర్మాణం మార్చారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరానికి చేరుకున్నా.. కొత్త భవనాల జాడ కనిపించడం లేదు. బోధనా సిబ్బంది అవసరమే.. ఎన్ఎంసీ చేసిన హెచ్చరికల్లో ప్రధానంగా వైద్య విద్యార్థులకు కావల్సిన బోధనా సిబ్బంది లేరన్న విషయం ప్రధానంగా ఉంది. నిర్మల్ మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం 62 మంది వైద్యులు ఉన్నారు. రాష్ట్రంలోని మిగతా మెడికల్ కాలేజీలతో పోలిస్తే ఇక్కడ సరిపడా బోధనా సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. కానీ.. మున్ముందు ఈ సిబ్బంది సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కనీసం వందమంది ఉండాల్సిన అవసరం ఉంది. సీఎం సమీక్ష.. ఎన్ఎంసీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోనే మెడికల్ కాలేజీల తీరుపై సోమవారం సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కళాశాలల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ వేయాలని సూచించారు. మూడేళ్లలో అన్ని వసతులు సమకూర్చాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. మరోవైపు బుధవారం డీఎంఈ, ప్రిన్సిపాళ్లతో నేషనల్ మెడికల్ కమిషన్ ఏం మాట్లాడుతుందో.. ఏం చర్యలు తీసుకుంటుందో..అన్న విషయంపైనే కొంత కలవరం నెలకొంది. న్యూస్రీల్పెద్దగా ఇబ్బంది లేదు.. రాష్ట్రంలోని మిగతా కాలేజీలతో పోలిస్తే నిర్మల్ వైద్యకళాశాలలో పెద్దగా ఇబ్బందులు లేవు. ఇక్కడ భవనం, సిబ్బంది ప్రస్తుతానికి సరిపడా ఉన్నారు. ఎన్ఎంసీతో వర్చువల్ సమావేశానికి హాజరు అవుతాము. – శ్రీనివాస్, ప్రిన్సిపాల్, మెడికల్కాలేజీ -
రైతులకు తీపికబురు
● నేటి నుంచి ఖాతాల్లో ‘రైతు భరోసా’ ● జిల్లాలో 1.50 లక్షల మందికి లబ్ధి ● సుమారు రూ.228 కోట్లు చెల్లించే అవకాశం లక్ష్మణచాంద: తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సాగు పనులు ఇప్పుడిప్పు డే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ వానాకాలం సీజన్కు ఎకరాకు రూ.6 వేల చొప్పున మంగళవారం నుంచి రైతుల ఖాతా ల్లో పెట్టుబడి సాయం జమ చేయనుంది. జిల్లాలోని 1.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు సంక్షేమ పథకాలు రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. 24 గంటలు నా ణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరాతోపాటు, రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ రైతులను ఆదుకుంటోంది. ఈ పథకాలు రైతులకు పంటల సాగులో గణనీయమైన మద్దతు అందిస్తున్నాయి. అర్హుల వివరాలు సమర్పణ జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, వానాకాలం సీజన్కు రైతు భరో సా పథకానికి అర్హులైన 1.5 లక్షల మంది రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పంపినట్లు తెలిపారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో ఈ రైతులను గుర్తించామని పేర్కొన్నారు. రూ.228 కోట్లు జమ రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 1.5 లక్షల మంది రైతులకు రూ.228 కోట్లు జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్ తెలిపారు. రైతులు వ్యవసాయ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 68 అర్జీలు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందించి, పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల స్థితిపై సమీక్షించారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి తక్షణమే స్పందించాలన్నారు. వానాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం జరుగకుండా చూడాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చెత్త బండి రావడం లేదు.. మేము బంగల్పేట సమీ పంలో ఉన్న నాగనాయిపేట కాలనీవాసులం. ఏడాదిగా మా కాలనీకి చెత్త బండి రావడం లేదు. మున్సిప ల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ప్రజావాణిలో కూడా రెండుసార్లు ఫిర్యాదు చేశాను. చెత్త బండి రాక రోడ్డుపై వేసిన చెత్తను కోతులు, పందులు చిందరవందర చేస్తున్నాయి. దోమలు, ఈగలు, దు ర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. చెత్త బండి వచ్చేలా చూడండి. – నవీన్, నాగనాయి పేట్చేపల వేటకు అనుమతి ఇప్పించండి మేము దస్తురాబాద్ మండలం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులం. 1974 నుంచి చేపల వేటకు లైసెన్సులు పొందుతూ చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నాం. రాంపూర్కు చెందిన మత్స్యకారులు అక్కడ చేపలు పట్టకూడదని మమ్మల్ని కర్రలతో కొట్టి, మా కళ్లలో కారంపొడి చల్లి, గొడ్డళ్లతో దాడి చేస్తున్నారు. 61 కుటుంబాలకు చెందిన మేము ఇదే వృత్తిపై ఆధారపడి ఉన్నాం. రాంపూర్ మత్సకారులపై చట్టరీత్యా చర్య తీసుకుని మాకు చేపల వేటకు అనుమతి ఇప్పించండి. – దస్తురాబాద్ మత్స్యకారులు నకిలీ నియామక పత్రంతో మోసం.. మాది పెంబి మండలం మందపల్లి గ్రామం. రెండేళ్ల క్రితం ఖానాపూర్ మండలం రాజురాకు చెందిన కొల్పుల హరీశ్ నా కుమారునికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.ఆరు లక్షలు తీసుకున్నాడు. ఆదాయ పన్ను శాఖలో సహాయకునిగా నియమిస్తున్నట్టు చూపించే నియామక పత్రం అందజేశాడు. తనకు పరిచయం ఉన్నచోట కొన్ని రోజులు ఉద్యోగం చేయించి తొలగించారు. గత అక్టోబర్లో పెద్దమనుషులను తీసుకెళ్లి న్యాయం అడగగా డబ్బులు జనవరిలో తిరిగి ఇస్తానని కాగితం రాసి ఇచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బు అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. – జల్ల నర్సయ్య, మందపల్లి కలెక్టర్ అభిలాష అభినవ్ -
ఊరిలోనే నాణ్యమైన విత్తనాలు
● గ్రామాల్లో ఉత్పత్తికి జయశంకర్ యూనివర్సిటీ శ్రీకారం ● నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం పేరుతో కార్యక్రమం ● ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతుల ఎంపిక ● వరి, కంది, పెసర విత్తనాలు పంపిణీనిర్మల్చైన్గేట్: రైతులు నాణ్యమైన విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నారు. ఏటా వేల మంది నాసిరకం విత్తనాలు కొని నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అయినా నకిలీ దందా ఆగడం లేదు. అమాయక రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. నకిలీ, కల్తీ విత్తనాల వల్ల పంట దిగుబడులు తగ్గి నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం‘ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం గ్రామీణ రైతులతో నాణ్యమైన వరి, పెసర, కంది విత్తనాలు ఉత్పత్తి చేయించి, వాటిని స్థానిక రైతులకు సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో రూపొందించబడింది నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి.. రైతులు నాణ్యమైన విత్తనాలను పొందలేక, ప్రైవేట్ కంపెనీల నకిలీ విత్తనాల కారణంగా పంటలు తెగుళ్లకు గురై, దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన విశ్వవిద్యాలయం, స్థానిక గ్రామాల్లోనే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం రైతులకు నామమాత్రపు ధరలకు నాణ్యమైన విత్తనాలను అందించడంతోపాటు, వారిని స్వయం సమృద్ధిలో భాగస్వాములను చేస్తుంది. శాస్త్రవేత్తల పర్యవేక్షణ.. ఈ కార్యక్రమంలో రైతులకు అందించిన విత్తనాలను వానాకాలం సీజన్లో సాగు చేయిస్తారు. విత్తన శుద్ధి నుంచి పంట దిగుబడి వచ్చే వరకు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిరంతర పర్యవేక్షణ సాగిస్తారు. నారు పోయడం, నాటు వేయడం, తెగుళ్ల నివారణ వంటి అంశాల్లో రైతులకు సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తారు. ఈ ప్రక్రియ నాణ్యమైన దిగుబడిని నిర్ధారిస్తుంది. గ్రామీణ రైతులకు ప్రయోజనాలు ఈ కార్యక్రమం ద్వారా ఉత్పత్తి అయిన వరి, పెసర, కంది ధాన్యాలను గ్రామంలోని ఇతర రైతులకు విత్తనాలుగా అందుబాటులో ఉంచుతారు. ఈ విత్తనాలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడిని సాధించవచ్చు. దీనివల్ల వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదనంగా, నకిలీ విత్తనాలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. రైతులు నష్టాల నుంచి రక్షించబడతారు. ఈ కార్యక్రమం రైతుల స్వయం సమృద్ధిని ప్రోత్సహిస్తూ, వ్యవసాయంలో నాణ్యత, విశ్వసనీయతను పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. స్థానిక గ్రామాల్లో నాణ్యమైన విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఈ కార్యక్రమం రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని, వ్యవసాయ ఉత్పాదకతను బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం వచ్చిన కిట్లు 1188 మొత్తం మండలాలు 19 కందులు 361 బస్తాలు వరి 355 బస్తాలు పెసర 334 బస్తాలుజూన్ 2న నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య కార్యక్రమం అమలు.. ‘నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం‘ కార్యక్ర మం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం కింద, ప్రతీ రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులను ఎంపిక చేసి, వారికి వరి, పెసర, కంది విత్తనాలను అందజేస్తారు. ఈ వి త్తనాలను విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు, ఇది నాణ్యతకు హామీ ఇస్తుంది. జిల్లాలో అమలు: నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో 396 రెవెన్యూ గ్రామాల నుంచి మొత్తం 1,188 మంది రైతులను ఎంపిక చేశారు. వీరిలో.. 355 మందికి 10 కిలోల వరి విత్తన బస్తాలు.. 334 మందికి 4 కిలోల పెసర విత్తన బస్తాలు.. 361 మందికి 4 కిలోల కంది విత్తన బస్తాలు పంపిణీ చేస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి గ్రామాల వారీగా ముగ్గురు రైతులను ఎంపిక చేసి నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు పొందవచ్చు. పంట దిగుబడులు వచ్చాక విత్తనాలను మిగతా రైతులకు తక్కువ ధరకు విక్రయించుకోవచ్చు. నకిలీ బెడద తప్పడమే కాకుండా మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి -
బిల్లుల కోసం బడికి తాళం
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ ఎస్ఎంసీ చైర్మన్, కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ సోమవారం ఆందోళనకు దిగారు. ఉదయం పాఠశాల ప్రారంభానికి ముందే తాళం వేసి, పెట్రోల్ డబ్బాతో పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరుబయటే ఉండాల్సి వచ్చింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పెంబి ఎస్సై అజయ్, ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించాడు. రూ.23 లక్షల బిల్లులు పెండింగ్కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘మన ఊరు–మన బడి’, ఎన్ఆర్ఈజీఎస్ పథకాల కింద రూ.40 లక్షల నిధులతో పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, కిచెన్ షెడ్, ఇతర మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపాడు. ఈ పనులకు రూ.17 లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారని, రూ.23 లక్షలు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నాడు. గతంలో కలెక్టర్తోసహా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులుపనుల కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు ఇంట్లోని బంగారం, పశువులు, ఇతర ఆస్తులు విక్రయించినా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని కాంట్రాక్టర్ వాపోయాడు. అనంతరం కలెక్టరేట్కు వెళ్లి ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్ను కలిసి మరోసారి వినతిపత్రం అందించాడు. -
పాఠశాలలో ఎకో క్లబ్లు
● పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ● ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంవిద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎకో క్లబ్ల ద్వారా విద్యార్థులకు కింది అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. శక్తి ఆదా: విద్యుత్, ఇతర శక్తి వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం. నీటి పొదుపు: నీటి వృథాను నివారించడం, సంరక్షణ పద్ధతులు. ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ: ఒక్కసారి వాడే ప్లాస్టిక్ను తగ్గించడం. స్థిరమైన ఆహార వ్యవస్థలు: స్థానిక, స్థిరమైన ఆహార ఎంపికలను ప్రోత్సహించడం. వ్యర్థాల తగ్గింపు: వ్యర్థాలను తగ్గించడం, రీసైక్లింగ్ను ప్రోత్సహించడం. ఆరోగ్యకర జీవనశైలి: పర్యావరణ అనుకూల జీవన శైలిని అలవాటు చేసుకోవడం. ఈ–వ్యర్థ నిర్వహణ: ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం. ఈ అంశాలపై సంవత్సరం పొడవునా వివిధ కార్యక్రమాలు, వర్క్షాప్లు, పోటీల ద్వారా విద్యార్థులకు పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుంది.లక్ష్మణచాంద: ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి పేరి ట మానవ చర్యలతో ప్రకృతి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవ మనుగడ, జీవవైవిధ్యానికి పెను ముప్పు తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపడుతోంది. విద్యార్థులను పాఠశాలస్థాయి నుంచే పర్యావరణ సంరక్షణలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర విద్యాశాఖ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్లను ఏర్పాటు చేయడం, ఈ సంవత్సరం నుంచి వాటిని ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పునర్నామకరణం చేయడం జరిగింది. పర్యావరణ సంరక్షణకు నూతన దిశ పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను చురుకై న భాగస్వాములను చేసేందుకు గతంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సంవత్సరం నుంచి ఈ క్లబ్లను ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పిలవడం ద్వారా మరింత ఉత్తేజకరమైన కార్యకలాపాలను చేపట్టేందుకు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ క్లబ్లను నూతనంగా ఏర్పా టు చేయాలని, ఆగస్టు 31 లోపు సంబంధిత వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వబడ్డాయి. ఎకో క్లబ్ల విస్తరణ జిల్లాలో 577 ప్రాథమిక పాఠశాలలు, 89 ప్రాథమి కోన్నత పాఠశాలలు, 164ఉన్నత పాఠశాలలు సహా మొత్తం 830 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల కు పర్యావరణ అవగాహనను పెంపొందించే లక్ష్యాన్ని విద్యాశాఖ నిర్దేశించింది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు హెచ్ఎంలకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎకో క్లబ్ల నిర్మాణం, కార్యకలాపాలు ప్రతీ పాఠశాలలో ఐదు ఎకో క్లబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి క్రింది విధంగా ఉంటాయి. నీటి నిల్వ క్లబ్: నీటి పొదుపు, సంరక్షణపై అవగాహన. నేల నిర్వహణ క్లబ్: నేల సంరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై దృష్టి. శక్తి నిర్వహణ క్లబ్: శక్తి వనరుల సమర్థవంతమైన వినియోగం. వ్యర్థ నిర్వహణ క్లబ్: వ్యర్థాల తగ్గింపు, రీసైక్లింగ్. జీవవైవిధ్య క్లబ్: జీవవైవిధ్య సంరక్షణ, పరిరక్షణ. ప్రతీ క్లబ్లో చురుకై న 10 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. దీని ద్వారా ఒక్కో పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ఈ క్లబ్లు సంవత్సరం పొడవునా వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పిస్తాయి.చర్యలు తీసుకుంటాం పాఠశాలస్థాయి నుంచి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఎకో క్లబ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ఎకో క్లబ్లను ఏర్పాటు చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించాం. ఎకో క్లబ్లను ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకుంటాం. – మోహన్ రావు, ఎకో క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ -
ఏడాదిలో ఎన్నో.. చేయాల్సినవి మరెన్నో..
నిర్మల్: జిల్లా ఆరో కలెక్టర్గా అభిలాషఅభినవ్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాదవుతోంది. కలెక్టర్గా తొలిపోస్టింగ్ జిల్లాలోనే తీసుకున్న ఆమె ఎన్నో పనులను విజయవంతంగా పూర్తిచేశారు. జిల్లాచరిత్రలో తొలిసారి ‘నిర్మల్ ఉత్సవాలు’ ని ర్వహించి ఓ ట్రెండ్ సెట్ చేశారు. బాలశక్తి లాంటి వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రస్థాయిలో జిల్లాపేరును నిలబెట్టారు. పాలనాపరంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ఎన్నో పనులు చేపట్టినా.. కలెక్టర్గా మరెన్నో జిల్లావాసుల ఆశలు పూర్తిచేయాల్సి ఉంది. పాలనలో తన ముద్ర సీరియస్ అధికారిగా పేరొందిన ఆశిష్సంగ్వాన్ తర్వాత కలెక్టర్గా నియమితులైన అభిలాష అ భినవ్ ఎలా ఉంటారోనన్న ఆతృత జిల్లా అధి కారులతో సహ ప్రజల్లోనూ ఉండేది. తాను క్ర మంగా జిల్లాపై పట్టు పెంచుకుంటూ వివిధ రంగాల్లో ప్రగతికి పునాది వేశారు. బాలశక్తి నుంచి భూముల రక్షణ వరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలులో విశేష కృషి చేశారు. చేసినవాటిలో కొన్ని.. ● అంగన్వాడీల నుంచి ఉన్నతపాఠశాలల వర కు సదుపాయాలు మెరుగుపరచడంతో పా టు.. హాస్టళ్లలో రాత్రిపూట ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో కలెక్టర్ రాత్రి బస చేస్తూ.. వారి సమస్యలు తెలుసుకున్నారు. ● వైద్యరంగంలో పలు ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. ఖానాపూర్ ఆస్పత్రిలో కొత్తగా ఆర్థో విభాగం ఏర్పాటైంది. జిల్లా ఆస్పత్రిలో డాక్టర్ల నియామకంతో ప్రసవాల సంఖ్య పెరిగింది. ● కలెక్టర్ అభిలాషఅభినవ్ స్వయంగా ప్రారంభించిన బాలశక్తి కార్యక్రమానికి రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి 2024 సెప్టెంబర్ 20న ‘బాలశక్తి’ ప్రారంభించారు. 19వేల మంది విద్యార్థులకు హెల్త్ స్క్రీనింగ్, 1,274 మందికి కంటి అద్దాలు అందించారు. ● ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఆక్రమించిన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. భైంసా, నర్సాపూర్(జి), లోకేశ్వరం మండలాల్లో రూ.కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకున్నారు. ● నిర్మల్ ఉత్సవాల పేరిట జిల్లాచరిత్రను ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం ప్రారంభించారు. జిల్లా చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని ఈ ఉత్సవాల్లో చాటారు. ● పథకాల అమలులో పారదర్శకత పాటించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, భూముల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు, ధాన్యం కొనుగోళ్లలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ● ప్రజల ఫిర్యాదులకు స్పందిస్తూ ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఫోన్ద్వారా కూడా ప్రజల సమస్యలను తెలుసుకునే విధానాన్ని ప్రారంభించారు. ● మహిళా సంఘాలకు క్యాంటీన్లు, రుణ వితరణతోపాటు త్వరలో పెట్రోల్ బంక్ల నిర్వహణకు అవకాశమిస్తుండగా.. మైత్రి క్లినిక్, డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మహిళా శక్తి భవనం త్వరలో ప్రారంభం కానుంది. సమష్టిగా ముందుకు.. ఏడాదికాలం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాను. మున్ముందు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి సహకారంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తాను. – అభిలాషఅభినవ్, కలెక్టర్ చేయాల్సినవెన్నో.. ● ప్రధానంగా జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇథనాల్ పరిశ్రమ వివాదాస్పదమైంది. ఆయిల్ పామ్ పరిశ్రమ కూడా అలాగే తయారైంది. పారిశ్రామిక ప్రగతికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ● కాళేశ్వరం పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన 27వ ప్యాకేజీని ప్రారంభించినా.. ఇప్పటికీ నీటిని ఎత్తిపోయడం లేదు. 28వ ప్యాకేజీ పనులే పూర్తి కాలేదు. ● జిల్లా వరుసగా రెండుసార్లు పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆ స్థానం దిగజారింది. మళ్లీ ప్రథమ స్థానానికి ప్రణాళికలు వేయాలి. ● ప్రధానంగా పర్యాటకంగా జిల్లాలో అభివృద్ధి శూన్యం. చేసేందుకు చాలా అవకాశాలున్నాయి. వాటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ● జిల్లాకేంద్రంలో కబ్జాలు కామన్గా మారాయి. ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. మున్సిపల్లో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అభిలాషపై ఇప్పటికీ జిల్లా ఆశలు కలెక్టర్గా నియమితులై నేటికి ఏడాది -
నిర్మల్
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025గోదావరి నది నుంచి మృతదేహాలను బయటకు తీసుకువస్తున్న బాధిత కుటుంబీకులుఆర్జీయూకేటీ అధ్యాపకుడికి డాక్టరేట్ బాసర: ఆర్జీయూకేటీ ఎలక్ట్రానిక్స్ అండ్ క మ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ బత్తిన ఉపేందర్రావుకు ఉ స్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అందజేసింది. ‘ఇన్వెస్టిగేషన్స్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫెక్టెడ్ గ్రౌండ్ స్ట్రక్చర్ ఆన్ మైక్రోస్ట్రిప్ పాథ్ ఆంటెన్నా’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టరే ట్ ఇచ్చింది. ఉపేందర్రావును ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, అధ్యాపకులు ఆదివారం అభినందించారు. ఈ పరిశోధన ద్వారా వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థల్లో హై డేటా రేట్ స్పీడ్ సాధ్యం కావచ్చని ఇన్చార్జి వీసీ వెల్లడించారు. మదన్ (ఫైల్)రాకేశ్, భరత్ (ఫైల్) ● నీట మునిగి ఐదుగురు మృతి ● మృతులంతా 22 ఏళ్లలోపు వారే ● నిర్మల్ జిల్లా బాసర వద్ద ఘటన ● మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములు ● మిన్నంటిన తల్లిదండ్రుల రోదన ● ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహంభైంసా/భైంసాటౌన్/బాసర: బాసర గోదావరి నది ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. పుణ్యస్నానాలకు నదిలోకి దిగిన యువకులను పరలోకాలకు పంపింది. వివరాలు.. హైదరాబాద్లో స్థిరపడిన రాజస్థాన్ కు చెందిన వ్యాపారి ప్రేమ్రాంకు భరత్ (16), మదన్ (18), రాకేశ్ (20) ముగ్గురు సంతానం. వీరిని హైదరాబాద్లో చదివిస్తున్నాడు. ప్రేమ్రాం తన మరదలి కొడుకై న వినోద్ (19)కు హైదరాబాద్లోనే ఎస్సార్ నగర్లో నీట్ కోచింగ్ ఇప్పించాడు. విద్యాసంవత్సరం ఆరంభంలో ప్రేమ్రాం ఎప్పటిలాగే తన భార్య సోను, ముగ్గురు కొడుకులతోపా టు మరదలి కొడుకైన వినోద్, బంధువుల కుమారుడు రుతిక్ (22)ను ఆదివారం రైలులో సరస్వతీ అమ్మవారి దర్శనానికి బాసరకు పంపించాడు. బా సరకు చేరుకున్న వీరు ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలాచరించేందుకు వెళ్లారు. స్నాన ఘట్టా ల వద్ద నీరు మురికిగా ఉందని గోదావరినది మధ్యలో తేలిన ఇసుక తిన్నెల వద్ద స్నానం చేయాలని ని ర్ణయించుకున్నారు. అక్కడికి బోటులో వెళ్లి స్నానా లు చేస్తున్నారు. ఈ క్రమంలో లోతు తెలియక ప్రే మ్రాం–సోను దంపతుల ముగ్గురు కొడుకులతో పాటు మరదలి కుమారుడు వినోద్, మరో యువకుడు రుతిక్ నీట మునిగి విగతజీవులయ్యారు. వీరి మృతదేహాలను భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ప్రేమ్రాం–సోను కుమారుల మృతదేహాలతోపాటు వినోద్ మృతదేహాన్ని రాజస్థాన్కు పంపించారు. బంధువుల కుమారుడైన రుతిక్ మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాసర ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. తల్లడిల్లిన తల్లి హృదయం తన ముగ్గురు కొడుకులను కోల్పోయిన తల్లి సోను కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆస్పత్రిలో కొడుకుల మృతదేహాలపై రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ముగ్గురు కొడుకులను కోల్పోయిన తాను ఇక బతికుండలేనని గుండెలవిసేలా రోదించింది. ఏదైనా వాహనం కింద పడి చనిపోతానని బయటకు పరుగెత్తింది. సమీప బంధువులు ఓదార్చి ఆమెను పక్కకు తీసుకెళ్లారు. జవాబు లేని ప్రశ్నలు ఆదివారం బాసర గోదావరిలో యువకులను పోగొ ట్టుకున్న కుటుంబీకులు ఆవేదనతో అడిగిన ప్రశ్నలు జవాబులు లేనివిగా మిగిలాయి. నీటిలో మునుగుతున్న తమ పిల్లలను కాపాడాలని ప్రాధేయపడ్డా ఎవరూ దగ్గరికి రాలేదని వాపోయారు. నది నీటిలో మునిగి కొన ఊపిరితో ఉన్న తమ పిల్లలను కాపాడాలని అరిచినా గోదావరి పరిసరాల్లో ఓ వైద్యుడు, సిబ్బంది కనిపించలేదన్నారు. సీపీఆర్ చేసినా, అ త్యవసర వైద్య సేవలు అక్కడే అంది ఉంటే పిల్లలు బతికేవారని బాధిత కుటుంబీకులు వాపోయారు. నీటి లోతు తెలిపే హెచ్చరించే బోర్డులు కూడా ఎక్క డా లేవని, అంబులెన్స్లో ఆస్పత్రికి వచ్చినా సరైన సేవలు అందలేదని ఆరోపించారు. బాధిత కుటుంబీకులు భైంసా ఏరియాస్పత్రిలో మీడియా ఎదుట అడిగిన ప్రశ్నలు జవాబులు లేనివిగా మిగిలాయి. వరుస ఘటనలతో.. బాసరలో ఇటీవలి కాలంలో ఇలాంటి వరుస ఘట నలు జరుగుతున్నా పట్టింపు కరువైంది. మే 26న మహారాష్ట్ర నుంచి వచ్చిన కులదీప్బాబాసాహెబ్ అనే బాలుడు, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్కు చెందిన యువకుడు బొల్లమల రాజు పుణ్యస్నానాల కోసం గోదావరిలోకి దిగి నీట మునిగి ఇదే ప్రాంతంలో మృతి చెందారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో మృతిచెందినా రక్షణ చర్యలు కరువయ్యాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం లేదు. లోతు, బురద ప్రాంతాల్లోనూ బోట్లు తిప్పుతున్నా నియంత్రించడంలేదు. స్నానఘట్టాల వద్ద చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతోనే భక్తులు అవగాహన లేకుండా గోదావరిలోని లోతైన ప్రాంతాలకు స్నానాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆలయ అధికారులు భక్తుల రక్షణ చర్యలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. గజ్జలమ్మదేవికి పూజలు కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు పూజలు చేశారు. గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, హారతి, అర్చ న, పల్లకీసేవ నిర్వహించగా అధికసంఖ్యలో పాల్గొన్నారు. బోనాలను నైవేద్యంగా సమర్పించారు. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. తేమ లేకుండానే విత్తనం రుతుపవనాలు వచ్చినా తొలకరి వర్షాలు ఇంకా పలకరించనేలేదు. అయినా మృగశిర కార్తె ప్రారంభం కావడంతో రైతులు ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టారు.8లోu న్యూస్రీల్ఫాదర్స్ డే రోజునే ఘటన ఫాదర్స్ డే రోజే ఐదుగురు యువకులు దుర్మరణం చెందడం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అని చెప్పి రైలెక్కిన ముగ్గురు కొడుకులు తిరిగి రాని లోకాలకు వెళ్లడాన్ని ప్రేమ్రాం జీర్ణించుకోలేకపోతున్నాడు. తన కొడుకులతోపాటు మరదలి కొడుకు, బంధువుల కుమారుడి మృతి వార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ నుంచి భైంసా ఏరియాస్పత్రికి చేరుకున్నాడు. విగతజీవులైన కొడుకులను చూసి బోరున విలపించాడు. -
క్రీడా పాఠశాల పిలుస్తోంది
● నేటి నుంచి ఎంపిక పోటీలు ● మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రక్రియ ● ఎంపికై తే నాలుగో తరగతిలో ప్రవేశంనిర్మల్ టౌన్: క్రీడా పాఠశాల ఆహ్వానిస్తోంది. చ దువుతోపాటు క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు ఇదో మంచి అవకాశం. విద్యార్థులను ఉ త్తమ క్రీడాకారులుగా తయారు చేస్తూ.. కార్పొరే ట్ స్థాయి విద్య అందించేందుకు రాష్ట్రంలో మే డ్చల్ జిల్లాలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలా బాద్లో ప్రాంతీయ క్రీడా పాఠశాలలున్నాయి. ఇందులో 2025–2026 విద్యాసంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశం కోసం ఎంపిక పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాల కోసం మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈనెల 16నుంచి 19వరకు మండలస్థాయి, 23నుంచి 26వరకు జిల్లాస్థాయి, జూలై 1నుంచి 5వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 25 న నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వారికి స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కల్పిస్తారు. అ థ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, రో యింగ్, వాలీబాల్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లి ఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్లో శిక్షణ ఇస్తారు. శారీరక సామర్థ్య పరీక్షలు ఇలా.. విద్యార్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్, 610 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఇలా తొమ్మిది విభాగా ల్లో 27 మార్కులకు గాను ఫిజికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు విధానం ఇలా.. ప్రవేశ ఎంపికకు విద్యార్థులు ఒరిజినల్ ఆధార్ కార్డు, నాలుగో తరగతి చదువుతున్న సర్టిఫికెట్, వయస్సు ఽధ్రువీకరణ పత్రం, మూడో తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు దరఖాస్తుకు జత చేయాలి. 8–9 ఏళ్లుండి 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య పుట్టినవారు అర్హులు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు https:tgss. telangana. gov. in లో వివరాలు నమోదు చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి స్పోర్ట్స్ స్కూళ్లలో నాలుగో తరగతిలో ప్రవేశానికి మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. స్పోర్ట్స్ స్కూళ్లలో సాధించే సర్టిఫికెట్లతో క్రీడా కోట కింద ప్రత్యేక రిజర్వేషన్, ఉన్నత విద్య, ఉద్యోగాలు పొందేందుకు అవకాశముంటుంది. క్రీడలపై ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలకు 7013396536, 9346655441 నంబర్లలో సంప్రదించాలి. – శ్రీకాంత్రెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి -
జీవిత గమ్యాన్ని నిర్దేశించారు
మాది రాజస్థాన్లోని సవాయి మాదాపూర్ జిల్లా మలర్నా చౌర్ గిరిజన గ్రామం. నాన్న సీతారాం మీనా. డీపీఆర్వోగా పనిచేశా రు. 1నుంచి 7వరకు హిందీ మీడియంలో, 8 నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివాను. బీహెచ్యూలో ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. నాన్న నాకు బాల్యం నుంచే క్రమశిక్షణతో కూడిన జీవిత గమ్యాన్ని నిర్దేశించారు. ఆ దిశగా ప్రోత్సహించారు. ఐఐటీ అనంతరం సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇంట్లో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ విషయాన్ని నాకు తెలియనివ్వకుండా చదువుపైనే దృష్టి సారించాలని సూచించారు. ఉన్నత ఉద్యోగంతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పేవారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేఽసేవారు. సివిల్స్లో ఐదు సార్లు నిరాశ ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే దిశగా మరింత కష్టపడాలని వెన్నుతట్టారు. ఆ ప్రోత్సాహంతోనే ఆరో ప్రయత్నంలో 458వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్గా ఎంపికయ్యా. నా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో మా నాన్నే నాకు రోల్మోడల్. – యువరాజ్ మర్మాట్, సబ్కలెక్టర్, ఉట్నూర్ తల్లిదండ్రులతో యువరాజ్ మర్మాట్ -
ఐదు సార్లు విఫలమైనా వెన్నుతట్టారు
మాది ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామం. నాన్న సత్యనారాయణ జర్నలిస్టు. చిన్నప్పటి నుంచి ఆయనే నాకు స్ఫూర్తి. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను ఐఆర్ఎస్గా ఎంపికయ్యానంటే అది నాన్న అందించిన ప్రోత్సాహమే. చదువు ప్రాధాన్యతతో పాటు ఎన్నికష్టాలు ఎదురైనా లక్ష్యసాధనను మాత్రం వీడొద్దని ఆయన నుంచే నేర్చుకున్నా. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇంద్రవెల్లిలో చదివాను. 6నుంచి 10 వరకు కాగజ్నగర్ జవహర్ నవోదయలో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్లో పూర్తిచేశా. ఐఐటీ గౌహతిలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక సివిల్స్కు సన్నద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలో 12 మార్కులతో వెనుకబడ్డాను. రెండో ప్రయత్నంలో మెయిన్స్ కూడా రాలేదు. ఇలా ఐదు ప్రయత్నాల్లో నిరాశే ఎదురైంది. ఆరో ప్రయత్నంలో ఢిల్లీలో కోచింగ్ తీసుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అయినా నా చదువు, భవిష్యత్తు విషయంలో నాన్న ఎప్పుడూ రాజీ పడలేదు. అనునిత్యం నాలో ఆత్మవిశ్వాసం నింపుతూ ప్రోత్సహించారు. పరీక్షలు రాసే సమయంలో భోజనం కూడా చేయకుండా ఓపికగా సెంటర్ వద్దే బయట వేచి ఉండేవారు. ఆరో ప్రయత్నంలో 790వ ర్యాంకు సాధించాను. ప్రస్తుతం నాగ్పూర్లోని ఐఆర్ఎస్ శిక్షణ సంస్థలో ఇన్కంటాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా శిక్షణ పొందుతున్నా. ఇది ముమ్మాటికీ మా నాన్న అందించిన విజయమే. – శుభం రేకుల్వర్, ఐఆర్ఎస్ -
సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే
భైంసా: ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని శని వారం హైదరా బాద్లో కలిశారు. నియోజకవర్గ అభివృద్దికి నిధులు ఇవ్వాలని కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని విన్నవించారు. ఈ స్కూల్ కోసం స్థలం ఉందని తెలిపారు. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి మంజూరైన రూ.42 కోట్ల పనులను మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టేలా ఆదేశించాలని పేర్కొన్నారు. అర్లి పురాతన వంతెనకు కొత్త ప్రతిపాదన ప్రకారం మళ్లీ మంజూరు ఇవ్వాలని విన్నవించారు. 2023లో భారీ వర్షాలతో అప్పట్లో చెరువులు తెగి భారీ నష్టం సంభవించిందని, ఇందుకు సంబంధించిన మరమ్మత్తుల కోసం అప్పట్లో అధికారులు ప్రతిపాదనలు పంపించారని తెలిపారు. నిర్మల్ నుంచి రామేశ్వరానికి బస్సు నిర్మల్టౌన్: ఈ నెల 27న నిర్మల్ నుంచి రామేశ్వరానికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఈ బస్సు రామేశ్వరానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనం చేసుకుని నిర్మల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ బస్సు బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతుందని తెలిపారు. మొత్తం ఆరు రోజులు, ఒకరికి రూ.7,250 అప్ అండ్ డౌన్ చార్జి ఉంటుందని వివరించారు. వివరాలకు 9959226003, 8328021517 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
● గమ్యం నిర్దేశించి.. దిక్సూచిగా నిలిచి ● లక్ష్యసాధనలో ఆ త్యాగం అనిర్వచనీయం ● నేడు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం
– మరిన్ని కథనాలు 8లోuనాన్న.. రెండక్షరాల పదమే అయినా ప్రతీ ఒక్కరి జీవితంలో విడదీయరాని బంధం. బాల్యంలో వేలుపట్టి నడక నేర్పే తొలిగురువుగా.. తప్పట డుగులు సరిదిద్దే మార్గదర్శిగా.. లక్ష్యసాధనలో దిక్సూచిగా నిలిచే ఆ స్ఫూర్తి ప్రదాత పాత్ర అనిర్వచనీయం. కనుపాపలను తీర్చిదిద్దే ఆ కనురెప్పల మాటున కనిపించని త్యాగాలెన్నో. బిడ్డల విజయ తీరాన అది ఆనంద బాష్పమై వికసిస్తోంది. జీవిత పయనంలో బాధలెన్ని ఎదురైనా పిల్లల వికాసానికి బాటలు వేసే ఆ అలుపెరగని బాటసారికి సలాం చేయాల్సిందే. తాను సాధించని విజయాలను వారి రూపంలో చూసుకుని మురిసిపోయే ఆ ప్రేక్షకుడికి నీరాజనం పలకాల్సిందే. ఉన్నతస్థాయికి ఎదిగిన తమ విజయంలో ఆయనదే అగ్రస్థానమంటున్నారు ఆ బిడ్డలు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ సక్సెస్లో నాన్న పాత్రపై పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – నిర్మల్/కైలాస్నగర్ -
అద్దె భవనాలు.. అరకొర సిబ్బంది..
● ఇదీ జిల్లాలో పశువైద్యశాలల పరిస్థితి ● మూగజీవాలకు అందని వైద్యం ● ఇబ్బంది పడుతున్న పశు పోషకులుమామడ: జిల్లాలోని 19 మండలాల పరిధిలో పశువులకు వైద్య సేవలు అందించేందుకు 3 ఏరియా పశు వైద్యశాలలు (నిర్మల్, ఖానాపూర్, ముధోల్), 29 పశువైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 పశువైద్య ఉపకేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 1,31,866 మేకలు, 5,02,576 గొర్రెలు, 1,77,954 ఆవులు–ఎద్దులు, 1,19,073 గేదెలు, 2,77,266 దేశీ కోళ్లు ఉన్నాయి. అయినా సౌకర్యాలు, సిబ్బంది కొరత పశువైద్య సేవలను దెబ్బతీస్తున్నాయి. సొంత భవనాలు లేక.. బాసర, అస్టా, కల్లూర్, దస్తూరాబాద్ గ్రామాల్లో పశు వైద్యశాలలు ఉన్నా సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో లేదా ఇతర శాఖల భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ గ్రామాల్లో పశువైద్యశాలల నిర్మాణానికి రూ.25 లక్షలు, పశువైద్య ఉపకేంద్రాల నిర్మాణానికి రూ.16 లక్షల నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాక అరకొర సౌకర్యాలతో సేవలు అందిస్తున్నారు. కొన్నిచోట్ల సొంత భవనాలు ఉన్నా, ప్రహరీ గోడలు, టాయిలెట్ సౌకర్యాలు లేక సిబ్బంది, పశుపోషకులు ఇబ్బందిపడుతున్నారు. సిబ్బంది కొరత.. జిల్లాలోని 47 పశువైద్య కేంద్రాల్లో 103 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 28 పశువైద్య పోస్టులకు 22 మంది మాత్రమే పనిచేస్తున్నారు. భైంసా, ఇలేగాం, బీర్నంది, లోకేశ్వరం, బోసి తదితర 6 కేంద్రాల్లో పశువైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొరిటికల్లో పశువైద్యశాల ఉన్నప్పటికీ, పశువైద్యాధికారి పోస్టు మంజూరు కాకపోవడంతో కంపౌండర్ పశువులకు వైద్యం అందిస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని పశుపోషకులు డిమాండ్ చేస్తున్నారు. పోస్టు మంజూరు చేయాలి మా గ్రామంలో పశువైద్యశాల ఉన్నా వైద్యాధికారి పోస్టు మంజూరు చేయలేదు. దీంతో సిబ్బందితో వైద్యం అందిస్తున్నారు. వైద్యాధికారి పోస్టు మంజూరు చేసి పశువులకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. – రవి, కొరిటికల్, పశుపోషకుడు సీజనల్ వ్యాధుల నివారణలో సవాళ్లు వర్షాకాలంలో పశువులకు గుండెవాపు, జబ్బవాపు, గొర్రెలకు చిటుకు వ్యాధి వంటివి సోకే ప్రమాదం ఎక్కువ. వీటిని నివారించేందుకు టీకాలు వేయాల్సి ఉంటుంది. అయితే, సిబ్బంది కొరత, అరకొర సౌకర్యాలు ఈ ప్రక్రియను కష్టతరం చేస్తున్నాయి. అవసరమైనప్పుడు ఇతర కేంద్రాల నుంచి సిబ్బందిని పంపించి సేవలు అందిస్తున్నారు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. -
‘కాకా’ మా రియల్ హీరో
నెన్నెల: మా నాన్న గడ్డం వెంకటస్వామి(కాకా) మా కుటుంబానికి రియల్ హీరో. ఆయన పెద్ద కొడుకుగా పుట్టడం నా అదృష్టం. తమ్ముడు వివేక్తోపాటు సోదరీమణులకు ఇంత చక్కటి జీవితాలను ఇచ్చినందుకు ఆయనకు ఎల్లకాలం రుణపడి ఉంటాం. వివేక్కు, నాకు ప్రస్తుతం సమాజంలో లభిస్తున్న గౌరవం, మర్యాదల క్రెడిట్ మొత్తం మా నాన్నగారికే పోతుంది. చిన్ననాడు నడక నేర్పిన నాటి నుంచి పాఠశాల, కళాశాల విద్య ఆయన మార్గనిర్దేశంలోనే కొనసాగాయి. నాన్న ఆశీర్వాదంతోనే రాజకీయాల్లోకి రాగలిగాను. ఎస్సీఏ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలు అందించగలిగాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వెంకటస్వామి చేసిన కృషి అందరికీ తెలుసు. ఆయన చివరి శ్వాస వరకు నిరుపేదల అభ్యున్నతి కోసం తాపత్రయ పడిన వ్యక్తి. కాకా సూచన మేరకు డాక్టర్ అంబేద్కర్ పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేసి 1.50లక్షల మందికి ఉన్నత చదువులు అందించగలిగాం. ఫాదర్స్డే సందర్భంగా నాన్నగారిని స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేస్తాను. అందరికీ ఫాదర్స్డే శుభాకాంక్షలు. – గడ్డం వినోద్, బెల్లంపల్లి ఎమ్మెల్యే కాకాతో వినోద్, వివేక్(ఫైల్) -
అనుక్షణం అండగా నిలిచారు..
మాది తలమడుగు మండలంలోని గిరిజన గ్రామమైన పల్సి(బి)తండా. నాన్న జాదవ్ గోవింద్ రావు హెడ్ కానిస్టేబుల్. మా ఊరిలో తొలి ప్రభు త్వ ఉద్యోగి నాన్నే. చదువుతోనే గొప్ప భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి. చిన్నతనం నుంచే నాకు విద్యా ప్రాధాన్యతను వివరించారు. ఒకటి నుంచి ఐదు వరకు ఉట్నూర్లో, ఆరు నుంచి పదో తరగతి వరకు కాగజ్నగర్ నవోదయలో చదివాను. ఇంటర్ హైదరాబాద్లో, తిరుచ్చి ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా ను. నాన్న పోలీస్ శాఖలో పనిచేస్తుండటంతో జిల్లాకు వచ్చిన ఎస్పీ, కలెక్టర్ల గొప్పతనం, వారికి సమాజంలో ఉండే గౌరవం గురించి చెప్పేవారు. ఆ దిశగా లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించేవారు. దీంతో బీటెక్ పూర్తికాగానే ఐఏఎస్ సాధించాలని నిర్ణయించుకున్నాను. తొలి నాలుగు ప్రయత్నాల్లో విఫలమయ్యాను. ఐదో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్కు ఎంపికై నా అందులో చేరలేదు. 2024లో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యాను. ప్రస్తుతం ముస్సోరిలో శిక్షణలో ఉన్నా. పోలీస్ ఉద్యోగమంటే సెలవులుండేవి కావు. కానీ నేను పరీక్షలు రాసే సమయంలో నాన్న నా వెంటే ఉండేవారు. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అనుక్షణం నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన పడిన కష్టం, అందించిన మార్గదర్శనంతోనే నేను విజయం సాధించగలిగాను. – జాదవ్ సాయి చైతన్య, ఐఏఎస్ -
నాన్నే.. రోల్మోడల్..
నిర్మల్: మానాన్న బీఎన్.సర్కార్. జార్ఖండ్ కేడర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. మేం నలుగురం పిల్లలం. ఇద్దరు అక్కచెల్లెళ్లం. ఇద్దరు అన్నదమ్ములు. మా అందరినీ నాన్న బాగా చదివించారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మా గురించి ప్రతిరోజు ఆలోచించేవారు. అందుకు తగ్గట్లుగానే ఈరోజు అందరం ఉన్నత స్థాయిలో స్థిరపడ్డాం. న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చదివిన నాన్న మమ్మల్ని కూడా చదువులో ప్రోత్సహించారు. అందుకే పబ్లిక్ పాలసీలో డబుల్ మాస్టర్స్, సోషియాలజీలో మాస్టర్స్ చదివాను. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకోవాలని నాన్నే నాకు సూచించారు. ఐఏఎస్ సాధించడంలోనూ నాన్న అడుగడుగునా వెన్నుతట్టి ప్రోత్సహించారు. నా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికీ చాలా విషయాల్లో నాన్నే రోల్మోడల్. – అభిలాష అభినవ్, కలెక్టర్, నిర్మల్ -
నిగ్వాలో ఖాళీ బిందెలతో నిరసన
కుభీర్: మండలంలోని నిగ్వా గ్రామంలో నీటి సమస్యను నిరసిస్తూ మహిళలు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఎండాకాలంలో గ్రామంలోని బోర్లు ఎండిపోయాయి. కొన్నింటి మోటార్లు కాలిపోయాయి. వాటికి పంచాయతీ కార్యదర్శి సిందూజ మరమ్మతులు చేయించడం లేదని తెలిపారు. సమస్య పరిష్కరించకుంటే కలెక్టర్ వద్దకు వెళ్తామని హెచ్చరించారు. నీటి సమస్యపై ఎంపీవో మోహన్సింగ్ని ప్రశ్నించగా కార్యదర్శి సిందూజను వివరణ కోరామని తెలిపారు. మరమ్మతులకు అవసరమైన డబ్బులు పంచాయతీలో లేవని తెలిపినట్లు పేర్కొన్నారు. -
ఒక్కరోజే 3,022 కేసులు పరిష్కారం
● మెగా లోక్అదాలత్కు విశేష స్పందన ● ప్రారంభించిన కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్జి శ్రీవాణినిర్మల్టౌన్: సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేర కు నిర్మల్, బైంసా, ఖానాపూర్ కోర్టుల్లో శనివారం మెగా లోక్ అదాల్ నిర్వహించారు. ఇందులో 8 సివిల్, 2,888 క్రిమినల్, 67 బ్యాంకు రికవరీ, 59 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించారు. జిల్లా కోర్టులో.. జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో లోక్అదాలత్ను కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా క లెక్టర్ మాట్లాడుతూ, జాతీయ లోక్అదాలత్ను స ద్వినియోగం చేసుకుని కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. కేసులు ఏళ్లుగా పెండింగ్లో ఉండటంతో మానసిక, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని, సమయం వృథా అవుతుందని తెలిపారు. ఇరు పక్షాలు రాజీకి వచ్చి లోక్అదాలత్లో సత్వర న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివా హాలు, మాదకద్రవ్యాలు, నైతిక విలువలపై కళాజాత బృందాలతో గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. రాజీ పద్ధతిలో కేసుల పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి మాట్లాడుతూ క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఆస్తి సంబంధిత కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. విడాకుల కేసులను పరిష్కరించుకున్న దంపతులను అభినందించారు. లోక్ అదాలత్కు వచ్చినవారికి పులిహోర ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, డీఎల్ఎస్ఎ సెక్రటరీ రాధిక, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నరేందర్, కోర్టు అధికారులు, న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు. భైంసాలో 1,720 కేసులు.. భైంసాటౌన్: పట్టణంలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి డి.దేవేంద్రబాబు మొత్తం 1,720 కేసులను పరిష్కరించారు. బ్యాంకు సంబంధిత కేసుల్లో రూ.55.08 లక్షలు రికవరీ చేయించారు. పీపీవో అరుణ, బెంచ్ సభ్యులు డి.చిన్న, టి.సుమిత్సింగ్, సబ్ సూపరింటెండెంట్ డి.ప్రశాంత్, సిబ్బంది చిట్టెవార్ చంద్రకాంత్ పాల్గొన్నారు. -
గ్రామాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే
నిర్మల్చైన్గేట్: వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డీఎంహెచ్వో రాజేందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు అధికంగా ప్రబలినచోట ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నిర్వహణ అధికారులు డాక్టర్ ఆశిష్రెడ్డి, డాక్టర్ సౌమ్య, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, డీపీవో రామచందర్ జిల్లాలోని వైద్యాధికారులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులకు అక్షరాలు నేర్పాలి
● డీఈవో రామారావు నిర్మల్ రూరల్: విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని డీఈవో రామారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వయోజన విద్యపై మండల స్థాయి సిబ్బందికి శుక్రవారం ఇచ్చిన శిక్షణ శిబిరంలో మాట్లాడారు. మొదట గ్రామ, మండల , జిల్లా స్థాయిలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. శిక్షణకు హాజరైన మండల విద్యాధికారులు, సెర్ప్ సిబ్బంది సీఆర్పీలు, ఐఆర్పీలు అందరూ సమన్వయంతో, స్వయం సహాయక బృందాల ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. శిక్షకులను నియమించి అక్షరాస్యులుగా చేయాలన్నారు. డీఆర్డీవో ఇన్చార్జి పీడీ నాగవర్ధన్, మెప్మా పీడీ సుభాష్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, వయోజన విద్య కోఆర్డినేటర్ తిరుపతిరావు, డీపీఎం సాయిప్రసాద్, నర్సయ్య, ప్రవీణ్కుమార్, ఎంఈవోలు, ఏపీఎం, సీసీలు, సీఆర్పీలు ఐఆర్పీలు పాల్గొన్నారు. ప్రవేశాలు పెంచాలి..నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని డీఈవో రామారావు సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మంజులాపూర్ ప్రైమరీ పాఠశాలను పరిశీలించారు. నూతనంగా నమోదైన విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల విద్యార్హతలను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. అనంతరం ఆయా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్, ఎస్వో రాజేశ్వర్, హెచ్ఎం కవితారాణి, ఉపాధ్యాయులు సుధీర్, ఉమామహేశ్వర్రెడ్డి, కావ్య తదితరులు పాల్గొన్నారు. -
తప్పించారా.. తప్పుకున్నారా!
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ఆ బాధ్యతల నుంచి తప్పించారా.. లేక ఆమే తప్పుకున్నారా.. అనే చర్చ ప్రస్తుతం పార్టీలో సాగుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జిలు సీతక్క తమను పట్టించుకోవడం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు అప్పట్లో ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. అప్పుడే తాను జిల్లా ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆమె మీనాక్షి ముందే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అటు నుంచి ఇటు.. ఇటునుంచి అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ప్రస్తుతం ఉమ్మడి నిజామాబా ద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించారు. అక్క డి నుంచి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి ఆదిలాబాద్కు ఇన్చార్జిగా కేటాయించారు. ప్రస్తుతం పార్టీలో ఈ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముందు జూపల్లి ఇక్కడి నేతలను సమన్వయం చేస్తూ పార్టీ విజయానికి ఏ విధంగా కృషి చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీతక్కకు కలిసిరాని ఎన్నికలు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కకు ఆదిలాబాద్ పార్లమెంట్, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరగడం కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని చర్చ సాగింది. ఇదే విషయంలో మీనాక్షి నటరాజన్ పార్టీ ఓటమికి కారణాలపై ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ప్రధానంగా విశ్లేషించారు. అంతేకాకుండా ఇటీవల హైదరాబాద్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలను ఒక్కొక్కరి నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాతనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మార్పు ఖాయమనే ప్రచారం సాగింది. కొత్త ఇన్చార్జి మంత్రికి సవాలు.. ఉమ్మడి జిల్లాకు కొత్త ఇన్చార్జి మంత్రిగా రానున్న జూపల్లికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే ఆయన ముందున్న ప్రధాన సవాలు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో నాలుగు చోట్ల బీజేపీ, రెండు చోట్ల బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ప్రాతినిధ్యం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందినవారు నియోజకవర్గ ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే. వీటిపై ప్రభావం పడేనా.. పార్టీ పరంగా ప్రస్తుతం పట్టణ, మండల, బ్లాక్ కమిటీలతోపాటు డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. కమిటీలకు సంబంధించి ఇప్పటికే ప్రతి మండలం, పట్టణంలో సమావేశాలు నిర్వహించి ఐదేసి పేర్లను అధిష్టానానికి నివేదించారు. అది ఖరారు కావాల్సి ఉంది. ఆ తర్వాత ఈనెల చివరిలో డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక మంచిర్యాలకు కొక్కిరాల సురేఖ, నిర్మల్కు శ్రీహరిరావు, కుమురంభీం ఆసిఫాబాద్కు విశ్వప్రసాద్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. కొత్త ఇన్చార్జి మంత్రి డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే ఆసక్తి పార్టీలో నెలకొంది. ‘జిల్లా ఇన్చార్జి మంత్రి’పై సర్వత్రా చర్చ హాట్టాపిక్గా సీతక్క మార్పు గతంలోనే ఆమైపె ‘మీనాక్షి’కి ఫిర్యాదు అప్పట్లోనే తప్పుకుంటానన్న మినిస్టర్ -
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
బాసర : ఆర్జీయూకేటీలో విద్యార్థులకు ప్రేరణా త్మక ఉపన్యాసం, అకడమిక్ పరంగా విజయాలు అందుకునేందుకు, మానసిక ఉత్సాహాన్ని కలిగించేందుకు ప్రత్యేక ప్రేరణాత్మక శిక్షణ శుక్రవారం నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ శ్రమ, ఆత్మవిశ్వాసం సమయపాలన వంటి విలువలపై దృష్టి సారించాలన్నారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న క్లాసులు, మెంటరింగ్ ప్రోగ్రాంలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకమైన విద్యా సహాయం అందిస్తున్న అధ్యాపకుల కృషిని అభినందించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డాక్టర్ మహేశ్, డాక్టర్ విఠల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిర్మల్
ఆటపాటల బడి.. అంగన్వాడీ మహిళా, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ పేరిట ఈనెల 10 నుంచి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం.. ప్రాణదానం ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. 9లోu శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 20258లోu ఇన్చార్జి మంత్రిని కలిసిన డీసీసీ అధ్యక్షుడు నిర్మల్చైన్గేట్: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కాంగ్రెస్ కండువాతో సత్కరించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఇన్చార్జి మంత్రి సూచించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, నిర్మల్ నియోజకవర్గ నాయకులు ఉన్నారు ఇదిగో.. ఇది ఇంకో ముచ్చట. ‘గొలుసుకట్టు’ను తెంపేస్తూ చెరువులనే చెరబట్టే కథ. ఇక్కడ కూడా ఫస్ట్ ఫొటోను చూడండి. ఇది జిల్లాకేంద్రంలోనే మల్లన్నగుట్ట హరిహరక్షేత్రం ఎదురుగా మొన్నటిదాకా ఉన్న ఓ పేద్దకుంట. అవును పెద్దదిగా ఉండేది.. ఇప్పుడది చిన్న గుంతలా మారిపోయింది. కాదు మార్చేశారు. గొల్లపేట చెరువు అలుగు ఈ కుంటలో చేరి, ఇక్కడి నుంచి ఇబ్రహీం చెరువులోకి నీళ్లు వెళ్లేలా ‘గొలుసుకట్టు’ విధానంలో భాగమైన కుంట ఇది. కొంతమంది స్థానికులు బతుకమ్మ కుంటగానూ పిలుస్తుంటారు. నిర్మల్: ‘మాది రాయల్ నిర్మల్.. మస్తుంటది..’ అంటూ చాలామంది గొప్పలు చెబుతుంటారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో ముచ్చట్లు పె డుతుంటారు. కానీ.. రియల్గా నిర్మల్ నిమ్మలంగా లేదన్నది వాస్తవం. రాష్ట్రంలోనే కబ్జాలకు పెట్టింది పేరుగా నిర్మల్ పేరు మార్మోగుతోంది. గొలుసుక ట్టు చెరువులు, కాలువలు, కందకాలు, చివరకు ప్ర భుత్వ స్థలాలు, పురావస్తు కట్టడాలు దేన్నీ విడిచి పె ట్టకుండా చెరబడుతున్నారు. మారుమూల సందుల్లోనే కాదు.. సాక్షాత్తు అందరూ చూసే ప్రధాన రహ దారుల పక్కనే ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఆక్రమణలో చరిత్ర ఆనవాళ్లు..! రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అణువణువునా నిమ్మలలో చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. కానీ.. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నారు. చరిత్రకు సమాధి కట్టేస్తున్నారు. ● అంతటా.. పాతబావులంటూ పాడుబడినవాటిని తవ్వి, పర్యాటక ప్రదేశాలు చేస్తున్నారు. ఇక్కడేమో అంతా ఉల్టాపల్టా.. మంచిగా ఉన్న పాతకాలం బావులను పూడ్చేస్తున్నారు. ● సర్ద్మహల్కు నీటినందించే ఏనుగులబావిని నామరూపాలు లేకుండా చెత్తతో నింపేస్తున్నారు. పాతగ్రంథాలయం, ఫైర్ స్టేషన్ వెనుక, మున్సిపల్ నుంచి ఈద్గాం వెళ్లేదారిలో గల ఈబావి చాలా పెద్దగా ఉండేది. దాన్నిప్పుడు మొత్తం మున్సిపల్ చెత్తతో పూడ్చేస్తున్నారు. ఇదే అదనుగా అక్కడ క్రమంగా ఆక్రమణలకు అడుగులు పడుతున్నాయి. ● సమీకృత మార్కెట్.. పేరు చెప్పి ఒకప్పటి చారిత్రక భవనమైన అర్బన్ తహసీల్ కార్యాలయాన్ని కూల్చేశారు. ఇంతటితో ఆగకుండా దానివెనుకే.. ఒకప్పటి అద్భుత నిర్మాణమైన సరస్సునూ పూడ్చేశారు. సమీకృత మార్కెటు నిర్మాణానికి కనీసం అడుగు కూడా ముందుకు పడటం లేదు. కానీ.. ఈ ఖాళీ జాగాపై ఆక్రమణల కన్నుపడుతోంది. ● ప్రియదర్శినినగర్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వెనుక ఉన్న గజ్గఢ్ చుట్టూ ఉన్న కందకాన్ని ఇప్పటికే మట్టితో నింపేసి ఆక్రమించేశారు. గ తంలో ‘సాక్షి’ వరుస కథనాలు రాయడంతో అప్పటి కలెక్టర్ వరుణ్రెడ్డి స్పందించి ట్రెంచ్ కొ ట్టించడంతో కొంతభాగం కందకం మిగిలింది. ● చారిత్రక చైన్గేట్కు ఇరువైపులా ఒకప్పటి చారిత్రక కందకం నామరూపాలు లేకుండా పోతోంది. జీవోల పేర్లు చెప్పి ఇప్పటికే ఓ దిక్కు కందకాన్ని సగానికి పైగా ఆక్రమించారు. మరోదిక్కూ అదే తరహా కబ్జా కొనసాగుతోంది. ● బంగల్పేట్ శివారులో ఉన్న బురుజులన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. ● ఎక్కడా ఉండని మరో విచిత్రమైన విషయమేంటే.. చుట్టూ బలమైన, ఎత్తయిన రాతిగోడ కట్టడం ఉన్న శ్యాంగఢ్ లోపల కొందరికి పట్టాభూములు ఉండటం. మున్సిపల్ స్థలాలూ.. అవీ ఇవీ అని తేడా లేకుండా కబ్జాల కొనసాగుతున్నాయి. సర్కారు జాగాల్లోనూ పాగా వేస్తున్నారు. పట్టణాన్నీ చూసుకోవాల్సిన మున్సిపల్లోనే దొంగ ఇంటినంబర్లు ఇస్తూ.. ఈ కబ్జాలకు ప్రోత్సాహమిస్తున్నారు. గుట్టలు, పురావస్తు కట్టడాల్లోనూ ఇళ్లను కట్టేస్తున్నారు. అసలు బల్దియా.. తన ఆస్తులనే కాపాడుకోలేని స్థితికి చేరుతోంది. ఒకప్పుడు కమిషనర్ ఉండేందుకు ఉన్న క్వార్టర్ను కూల్చేశారు. ఆ స్థలానికి కనీసం ఫెన్సింగ్ కూడా పెట్టలేదు. ఇప్పటికే పలుచోట్ల కందకాలు, కాలువల్లో ఆక్రమణలు చేయడంతో మురుగునీరుకూ దారి లేకుండా పోయింది. అందుకే ప్రతీ వానాకాలం ప్రధాన రహదారి, శివాజీచౌక్లు నీటమునుగుతున్నాయి. ఏళ్లుగా ముంపు ముంచేస్తున్నా.. కబ్జాలపై మాత్రం చర్యలు కనిపించడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు సకాలంలో స్పందించకపోతే.. ఊరికంటూ ఏదీ మిగలదని నిర్మల్వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. న్యూస్రీల్ జిల్లా కేంద్రంలో ఆగని ఆక్రమణలు ప్రభుత్వ స్థలాల్లోనే అక్రమ పాగాలు పురావస్తు ఆస్తులూ.. అన్యాక్రాంతం సర్కారు జాగాలకు ‘ఇంటి నంబర్లు’ఇక.. ఈ ఫొటో చూస్తే సిన్మా అర్థమవుతుంది. రెండేళ్ల కిందట పెద్దగా ఉన్న కుంట ఇప్పుడిలా అయింది. ఇంకో విషయం అలుగును డ్రైనేజీ లెక్క కట్టేసి చెరువులకు విడిచిపెట్టారు. అంటే.. రేపొద్దున ఇక్కడ ఇళ్లు కట్టుకుంటే, ఆ ఇళ్ల డ్రైనేజీ నీళ్లన్నీ చెరువులకు పోవాల్సిందే. చర్యలు చేపడుతున్నాం.. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పలుచోట్ల అక్రమ కట్టడాలను తొలగించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పురాతన కట్టడాల పరిరక్షణ చర్యలు చేపడతాం. – జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
బడుగులపై పిడుగులు
● ఏటా ఉమ్మడి జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం ● పంట చేన్లలో మరణాలు, జీవాల మృత్యువాత ● అవగాహన లేక పెరుగుతున్న ముప్పుస్మార్ట్ఫోన్లలోనూ.. వాతావరణ మార్పులు ఇప్పుడు స్మార్ట్ఫోన్లలోనూ తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్, వాట్సాప్ల్లోనూ అలర్ట్ పొందవచ్చు. ఐఎండీ(ఇండియన్ మెటీరియలాజిక్ డిపార్ట్మెంట్)తోపాటు పిడుగు పడే ప్రాంతాలను ముందుగానే తెలియజేసే ‘దామిని’తోపాటు ఇతర యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా స్థానిక కేవీకే, వ్యవసాయ, ప్రణాళిక శాఖ అధికారుల వద్ద వాతావరణ పరిస్థితులు ముందస్తుగా తెలుసుకోవచ్చు. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ముందస్తుగా తెలుసుకుంటూ ప్రాణాలతోపాటు ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా పిడుగుపాటుకు ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అధికంగా పంట చేన్లలో పని చేస్తుండగానే మృత్యువాత పడుతున్న ఘటనల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు చనిపోతుండడం తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. పేద, మధ్య తరగతి రైతు కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. బాధిత కుటుంబాలకు కోలుకోలేని నష్టం జరుగుతోంది. వానా కాలంలో పశువులు, జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ప్రతీ సీజన్లో అనేకమంది తమ జీవాలను కోల్పోతున్నారు. పిడుగుపాటుపై చాలామందికి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. ఎక్కువగా చేన్లలో పని చేస్తున్నసమయంలోనే నష్టం జరుగుతోంది. పంట చేన్లలో పని చేసే రైతులు మ రింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిడుగు అంటే.. ఆకాశంలో సహజసిద్ధంగా ఏర్పడే విద్యుత్పాతమే పిడుగుగా పేర్కొంటారు. సూర్యరశ్మి అధికంగా తాకి, తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్లి, అధిక బరువున్న రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి. ఈ రెండింటి మధ్య దూరం పెరిగితే ధనావేశం గాలి కోసం భూమి వైపు రుణావేశా మేఘాలు వచ్చే క్రమంలో శక్తివంతమైన విద్యుదుత్పాతం ఏర్పడుతుంది. దీనినే పిడుగు అంటారు. ఒక్కో పిడుగు వేల డిగ్రీల సెల్సియస్ శక్తిని విడుదల చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని చోట్ల ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా పిడుగులు పడతాయి. రూ.6లక్షలు పరిహారం గతంలో కేవలం ఆపద్బంధు పథకం కింద నామమాత్రంగానే పరిహారం చెల్లించేవారు. ప్రస్తుతం పిడుగుపాటుకు మరణించిన వారికి రూ.6లక్షలు పరిహారంగా అందజేస్తున్నారు. పిడుగుపాటుతో మరణించినట్లు స్థానిక రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులు ధ్రువీకరించాలి. అయితే పరిహారం పొందడంలో కొన్నిసార్లు జాప్యం జరుగుతోంది. చెట్ల కింద ఉండొద్దు వర్షం పడితే చాలామంది చెట్ల కింద తడవకుండా ఉండేందుకు వెళ్తుంటారు. అయితే చెట్లు, ఎత్తయిన కొండలు, నీటి నిల్వ ప్రదేశాలు మరింతగా పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. చెట్ల కింద చెరువులు, కాలువల వద్ద ఉండకూడదు. ఒకే చోట అందరూ గుంపులుగా ఉండకూడదు. ఒకే రోజు ఆరుగురు ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిప్పిరిలో పంట చేనులోనే నలుగురు, బేల మండలం సాంగిరిలో ఇద్దరు మొత్తం గురువారం ఒకే రోజులో ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఉట్నూరు మండలం కుమ్మరితండాలో పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారు. జాగ్రత్త మరవద్దు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు తప్పించుకోవచ్చు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ శబ్దాలు వినిపిస్తే వెంటనే అక్కడ నుంచి దూరంగా వెళ్లాలి. పంట చేన్లలో ఉన్నప్పుడు వీలైనంత తొందరగా ఇళ్లకు చేరుకోవాలి. సమీపంలో ఉన్న నివాస స్థలాలకు వెళ్లాలి. ఇళ్లలో విద్యుత్ పరికరాలు వినియోగించరాదు. సెల్ఫోన్లు, చార్జింగ్ చేయడం, ఐరన్, వాటర్ హీటర్లు, గీజర్లు వాడరాదు. ఇళ్లకు లైటనింగ్ కండక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. -
పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ
నిర్మల్టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, పోలీస్ స్టేషన్లో లేదా మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 88 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో శుక్రవారం వాటిని అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మార్కెట్లో చౌకగా వస్తుందని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 1,416 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐటీ కోర్, వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. -
నాళాలు శుభ్రం చేయాలి
నిర్మల్చైన్గేట్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నాళాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని జౌలి నాళా, చైన్గేట్, దివ్యనగర్ పార్క్, రాంజీ గోండు విగ్రహ పరిసర ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. నీటి ప్రవాహానికి అంతరాయం కలగకుండా నాళాల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి తొలగించాలన్నారు. ప్రజలు నాళాల్లో చెత్త వేయకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పట్టణంలోని పార్కులను శుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. పార్కులకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, అధికారులు హరిభువన్, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాస్ పాల్గొన్నారు. -
వరదల నివారణకు చర్యలు తీసుకోండి
● మంత్రి ‘పొంగులేటి’ ఆదేశం నిర్మల్చైన్గేట్: వర్షాకాలం నేపథ్యంలో వరదల కారణంగా జరిగే నష్టాన్ని నివారించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి కృష్ణ, గోదావరి నదుల పరీవాహక జిల్లాల కలెక్టర్లతో గురువారం సమీక్ష నిర్వహించారు. సాధారణం కన్నా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖ లు సమన్వయంతో పనిచేసి వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు, వరదలతో తలెత్తే ఏమైనా సమస్యలు, నివేదికలను తక్షణమే ప్రభుత్వానికి అందజేయాలన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో గతంలో సంభవించిన వరదలపై అధ్యయనం చేసి ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎలాంటి అపాయాలు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్మిట్టల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. -
ఐక్యంగా ముందుకెళ్దాం
నిర్మల్టౌన్: క్రిస్టియన్లు అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ సంజయ్ఆనంద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి సమీపంలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ కమ్యూనిటీకి గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. పాస్టర్లు, చర్చిలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఎన్సీసీ అందరికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎన్సీసీ అధ్యక్షుడిగా ప్రభాకర్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ ఏలియా, క్రిస్టియన్లు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బడికి..
నిర్మల్● వినూత్నంగా విద్యార్థులకు స్వాగతం ● యూనిఫాంలు, పుస్తకాలు అందించిన అదనపు కలెక్టర్, ఆర్జేడీ శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025పునరావాస సమస్యలు పరిష్కరిస్తాం కడెం: కవ్వాల్ పునరావాస గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్డీవో వేణుబాబు అన్నారు. డిమాండ్లను పరిష్కరించాలని పాత గ్రామాలకు తరలివెళ్లిన రాంపూర్, మైసంపేట్ వాసులతో గురువారం మాట్లాడారు. వారి డిమాండ్లు తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని కొత్తమద్దిపడగ సమీపంలోని పునరావాస కాలనీని, సాగు భూములను పరిశీలించారు. నిర్మల్ రూరల్: నూతన విద్యా సంవత్సరం గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది. జిల్లాలోని ప్ర భుత్వ, ప్రైవేటు పాఠశాలలను మామిడి తోరణాలతో సుందరంగా అలంకరించారు. పాఠశాలలన్నీ పండుగ వాతావరణంలో ప్రారంభించారు. తొలి రోజు తమ తల్లిదండ్రులతో విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు పూలు, బెలూన్లు అందించి సాదరంగా, వినూత్నంగా స్వాగతం పలికారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు పూల మొక్కలు అందించి తరగతి గదిలోకి ఆహ్వానం పలికారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థులు పూర్తిస్థాయిలో హాస్టళ్లకు చేరుకోలేదు. ఉదయం పూట వర్షం పడడంతో జిల్లావ్యాప్తంగా తొలిరోజు విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. గ్రామాల్లో ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. యూనిఫాం, పుస్తకాల పంపిణీ... విద్యా సంవత్సరం తొలిరోజు అధికారులు విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి మామడ మండలంలోని కొరటికల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల, మామడ కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాం, నోటుబుక్కులు అందించారు. డీఈవో రామారావు నిర్మల్ మండలం తల్వేద ప్రాథమిక పాఠశాల, మామడ మండలం సంతోష్ నగర్ ప్రాథమిక పాఠశాల, జిల్లా కేంద్రంలోని కురన్నపేటలో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు అందించారు. తొలిరోజు 55 శాతం హాజరు.. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 55.25 శాతం మంది విద్యార్థులు బడులకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 48,563 మంది విద్యార్థులు చదువుతుండగా, 26,830 మంది హాజరయ్యారు. శుక్ర, శనివారాల్లో విద్యార్థుల హాజరు శాతం మెరుగవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రైవేటుకు దీటుగా విద్య సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లాలో 23 పాఠశాలలను ఎంపిక చేశారు. 8లోu న్యూస్రీల్ -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ‘జూపల్లి’
● మంత్రి వివేక్కు మెదక్ జిల్లా బాధ్యతలు ● నిజామాబాద్కు మంత్రి సీతక్క కై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర ఎకై ్సజ్, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన ధనసరి అనసూయ సీతక్కను నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆది వాసీల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్కు సీతక్కను ఇన్చార్జిగా నియమించారు. పార్లమెంటు ఎన్నికల వరకు ఆమె ఉత్సాహంగానే పనిచేశారు. జిల్లా అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో నిరాశకు గురైన ఆమె నాటి నుంచి జిల్లాపై అంతగా ఆసక్తి చూపలేదు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం దాదాపుగా తగ్గించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లో సీతక్క బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాల ఇన్చార్జి మంత్రుల మార్పు జరిగితే సీతక్క జిల్లా బాధ్యతల నుంచి తప్పుకుంటారనే చర్చ గత కొంతకాలంగా సాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇన్చార్జి మంత్రుల జాబితాతో ఆ విషయం స్పష్టమైంది. కొత్తగా రానున్న జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీనియర్ మంత్రి కావడంతో జిల్లాకు మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఇటీవల కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్వెంకటస్వామికి మెదక్ జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
నేరస్తుల గుర్తింపులో కొత్త అడుగు
● పోలీసుల చేతికి ఆధునిక టెక్నాలజీ ● జిల్లా వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్లకు పంపిణీ ● ఈ పరికరంతో నేరగాళ్ల గుర్తింపు సులభం నిర్మల్టౌన్: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో నేరగాళ్లు అధికారులను ఏమార్చేందుకు ఎత్తుగడలు వేస్తున్న నేపథ్యంలో, పోలీసులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా ‘ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’ (అంబిస్)ను అమలు చేస్తున్నారు. గతంలో వేలిముద్రలు, అరచేతి ముద్రలు మాత్రమే సేకరించగా, ఇప్పుడు ముఖం, కళ్లు, అరికాళ్ల స్కాన్తోపాటు చేతిరాత, ఒడ్డూ–పొడవు, బరువు, సంతకం వంటి భౌతిక కొలతలను భద్రపరుస్తారు. ఈ వివరాలు నేరగాళ్లను సులభంగా గుర్తించడంలో పోలీసులకు సహాయపడతాయి. ఏఐ ఆధారిత వ్యవస్థ.. జిల్లాలో తొలిసారిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత అంబిస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా నేరగాళ్ల ప్రవర్తన, స్థానాలు, అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేయవచ్చు. ముఠా కార్యకలాపాలను పసిగట్టడంలో ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ చట్టం–2022 ఆధారంగా ఈ డేటా సేకరణ చట్టబద్ధంగా జరుగుతుంది. అంబిస్ పరికరాల వినియోగం.. గతంలో ఆఫీజ్ టెక్నాలజీతో వేలిముద్రలు, అరచేతి ముద్రలు మాత్రమే తీసుకోగా, అంబిస్లో డెల్ ఆప్టిప్లెక్స్ ఆల్–ఇన్–వన్ 7420, ఐరిస్ బిఎం–20 (కళ్ల స్కానర్), ఎప్సన్ వి39 (పాదముద్ర స్కానర్), లాజిటెక్ సి270 వెబ్క్యామ్, హెల్త్ సెన్స్ బిఎస్ 161 (ఎలక్ట్రానిక్ వెయిట్ మెషిన్), పాపిలోన్ పామ్ లైవ్ స్కానర్ వంటి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. 12 పోలీస్ స్టేషన్లకు.. జిల్లాలోని 12 పోలీస్ స్టేషన్లకు అంబిస్ పరికరాలను ఎస్పీ జానకీ షర్మిల గురువారం అందజేశారు. ఈ పరికరాల వినియోగంపై సందేహాలకు ఫింగర్ ప్రింట్ ఇన్ఛార్జ్ ఏఎస్ఐ కిరణ్ను సంప్రదించాలని సూచించారు. గుర్తింపు సులభం.. ఈ నూతన అంబిస్ టెక్నాలజీ ఉపయోగించి నేరగాళ్లను చాలా సులభంగా గుర్తిస్తాం. ఈ పరికరంపై పోలీసులు నైపుణ్యత తమ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న వివిధ రకాల నేరాలు, సస్పెక్ట్ చెక్ ఫింగర్ ప్రింట్ సేకరించి కేసుల చేదనకు కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ తమ విధులను శ్రద్ధగా నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో, నిబద్ధతతో పనిచేయాలి. – జానకీషర్మిల, ఎస్పీ -
పిల్లలను బాల కార్మికులుగా మార్చొద్దు
ముధోల్: బడీడు పిల్లలను బాలకార్మికులుగా మార్చవద్దని, 14 ఏళ్లలోపు పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాసమితి ప్రధాన కార్యదర్శి రాధిక అన్నారు. మండలంలోని తరోడా ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించిన బాల కార్మికుల నిర్మూలన దినోత్సవంలో మాట్లాడారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనికి పంపకుండా బడికి పంపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. కార్యక్రమంలో ముధోల్ ఎస్సై బిట్లా పెర్సీస్, మండల విద్యాధికారి రమణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు నీలిమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
● పిడుగుపాటుకు ఆరుగురు మృతి ● విత్తనాలు వేస్తుండగా దుర్ఘటన ● భర్త, కూతురిని కోల్పోయిన మహిళ ● తల్లులకు దూరమైన కొడుకు, బిడ్డ ● గాదిగూడ, బేల మండలాల్లో ఘటనలు ● చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
సాక్షి, ఆదిలాబాద్/నార్నూర్/బేల: వారంతా మట్టి మనుషులు.. మట్టినే నమ్ముకుని జీవించేవారు.. ఆ మనుషుల మధ్య ఉన్న ఆత్మీయత ఎంతచెప్పినా తక్కువే.. భార్యాభర్తలిద్దరు తమ పిల్లలతో కలిసి సొంత చేనులో విత్తనాలు వేస్తున్నారు. విత్తనాలు వేసే మిగతావారు కూడా ఈ కుటుంబానికి దగ్గరి సంబంధీకులే. అంతా ఆదివాసీ గిరిజనులే. వీరంతా హుషారుగా విత్తనాలు వేశారు. మధ్యాహ్నం కావడంతో 14 మంది ఒకే దగ్గర భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో వర్షం రావడంతో అంతా వెళ్లి సమీపంలోని చిన్న గుడిసెలో ఒకే దగ్గర కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి పక్కనున్న టేకు చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది. ఉలిక్కిపడేలోపే గుడిసెలోని నలుగురు ప్రాణాలు విడిచారు. ఆ మట్టిపైనే నేలకొరిగారు. మిగతా వారు చెల్లాచెదురుగా పడిపోయి గాయాలతో బయటపడ్డారు. ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పిప్పిరి గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘటన. మరో రెండు ఘటనల్లో బేల మండలంలోని ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మొత్తంగా పిడుగుపాటుకు ఆరుగురు మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని కలిగించాయి. బాధిత కుటుంబాల్లో విషాదం.. గాదిగూడ మండలం పిప్పిరికి చెందిన పెందూర్ మాధవరావు తన చేనులో భార్య, కుమారులు, కూతురుతో పాటు దగ్గరి సంబంధీకులైన 14 మందితో కలిసి గురువారం మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. పిడుగుపాటుకు గురై మాధవరావు, ఆయన కూతురు పెందూర్ సంజన అలియాస్ సుజాత, సంబంధీకులు సిడం రంభాబాయి, మంగం భీమ్బాయి మృతిచెందారు. ఈ ఘటనలో మాధవరావు భార్య పెందూర్ రేణుక, ఇద్దరు కుమారులు పెందూర్ జంగు, పెందూర్ శేఖు గాయపడ్డారు. సిడం రాంబాయి కుమారుడు సిడం శంకర్, మంగం భీమ్బాయి కూతురు మంగం నందిని కూడా గాయాలపాలయ్యారు. వీరితో పాటు దగ్గరి సంబంధీకులైన హెచ్కే ఈశ్వర్, మర్సుకోల అంజలి, మర్సుకోల సోము, గెడం శంభు, గుణవంత్రావు కూడా గాయపడ్డారు. ఇక బేల మండలంలోని సాంగిడి, సోన్కాస్ గ్రామాల్లో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపాటుకు మహిళా కూలీలు గెడం నందిని, కోవ సునీత మృతిచెందారు. వీరిరువురికి భర్త, పిల్లలున్నారు. కాగా, క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని పలువురు పరామర్శించారు. భీంబాయి (ఫైల్) మాధవ్రావు (ఫైల్) సునీత (ఫైల్) రంభాబాయి (ఫైల్)సుజాత (సంజన) (ఫైల్) మృతుల వివరాలు పిడుగు పడిన ఘటనలో గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన తండ్రి, కూతురు పెందూర్ మాధవ్రావు (45), పెందూర్ సుజాత అలియాస్ సంజన (16), మాధవ్రావుకు దగ్గరి సంబంధీకులైన సిడం రంభాబాయి (40), మంగం భీమ్బాయి (45) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బేల మండలం సాంగిడి గ్రామంలో పిడుగుపాటుకు గురై గెడం నందిని (30), సోన్కాస్ గ్రామంలో కోవ సునీత (40) ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా రెండు వేర్వేరు ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇందులో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడున్నారు. -
వాతావరణం
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముంది.భూ ఆక్రమణలపై ఫిర్యాదు ఖానాపూర్: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరైన అధి కారులకు తిమ్మాపూర్ పరిధిలో పలుచోట్ల జరి గిన భూఆక్రమణలపై పట్టణవాసులు ఫిర్యా దు చేశారు. తిమ్మాపూర్ శివారులోని సాయిబా బా ఆలయ సమీపంలోగల ఫారెస్ట్ కాంట్రాక్ట ర్స్ అసోసియేషన్కు చెందిన భూమికి జారీ చే సిన పట్టాదారు పాస్బుక్ రద్దు చేయాలని తి మ్మాపూర్ వీడీసీ నాయకులు కోరారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని భూమిని ఖానాపూర్ పరిధిలోని పలు కు లసంఘాలకు కేటాయించగా ఆక్రమణకు పా ల్పడుతున్నారని తెలిపారు. దీనిపై విచారణ చే పట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, స త్తన్పల్లి గ్రామంలో తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ స దస్సులో 57, స్థానిక రెవెన్యూ కార్యాలయ ఆ వరణలో సీనియర్ అసిస్టెంట్ సబిత ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 49 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్ఐలు సత్యనారాయణ, నాగేశ్ తెలిపారు. నాయకులు బీసీ రాజన్న, స తీశ్రావు, కొత్తపెల్లి సురేశ్, మైలారపు గంగాధర్, నేతశ్యాం, లాండేరి కిషన్, అప్కారి నర్స య్య, దాసరి భీమన్న, ద్యావతి రాజేశ్వర్, బీసీ రమేశ్, మంత్రరాజం దేవేందర్ ఉన్నారు. -
ఓబీసీలు అస్తిత్వాన్ని కాపాడుకోవాలి
నిర్మల్ఖిల్లా: ఓబీసీల సమస్యలపై దృష్టిసారించి అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పెన్షనర్స్ భవన్ సమావేశ మందిరంలో బుధవారం బీసీ సంఘాల నాయకులతో కలిసి ‘ఓ బీసీల పోరుబాట’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారి, మ ధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్సింగ్ ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. పుస్తకంలో ఓబీసీల వెనుకబాటు, కులవృత్తులపై జరి గిన సామాజిక ఆర్థిక దోపిడీ, ఓబీసీ కమిషన్ల చారిత్రక పరిణామాలు, రిజర్వేషన్లు, సమకాలి న ఓబీసీ స్థితిగతుల విశ్లేషణ ఉంటుందని వివరించారు. ఓబీసీలు సంఘటితమైతేనే ఆశించి న ప్రయోజనాలు సాధించుకోవచ్చని తెలిపా రు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, బీజేపీ నాయకుడు రావుల రాంనాథ్, జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు నరేంద్రబాబు, రాష్ట్ర ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు స్వదేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కడదామా.. వద్దా?
● సందిగ్ధంలో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు ● ప్రకటనకే పరిమితమైన ఉచిత ఇసుక ● అంచనాకు మించిపోతున్న ఖర్చులు ● ముగ్గులు పోసుకునేందుకు నిరాసక్తత పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన ఇళ్లు మంజూరు చేసిన ఇళ్లు 768 మార్కింగ్ పూర్తి చేసినవి 364 బేస్మెంట్ దశలో ఉన్నవి 122 రూఫ్ లెవెల్లో ఉన్నవి 20 మొదటివిడత బిల్లుల చెల్లింపు 79నిర్మల్చైన్గేట్: ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి మొగ్గు చూపడంలేదు. చేతిలో సరిపడా డ బ్బులు లేకపోవడం, మెటీరియల్ ధరలు గణనీ యంగా పెరగడం, కూలీ ఖర్చు రెట్టింపు కావడం, నిర్మాణం 400 గజాలకు మించకూడదనే ప్రభుత్వ నిబంధన.. తదితర కారణాలతో చాలామంది ఇంటి నిర్మాణానికి సుముఖంగా లేరు. యూనిట్ విలువ, క్షేత్రస్థాయిలోని వాస్తవ ఖర్చులకు పొంతన లేక జంకుతున్నారు. కొందరు అప్పు చేసి నిర్మాణాలు ప్రారంభిస్తుండగా, మరికొందరు ఖర్చుల భయంతో ప్రొసీడింగ్స్ను రద్దు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 400 మంది లబ్ధిదారులు ఇప్పటివరకు ముగ్గులు కూడా పోయలేదు. జిల్లాకు 10,500 ఇళ్లు జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 10,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుకు రూ.5లక్షలను వివిధ దశల్లో చెల్లించేందుకు నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల లబ్ధి దారులకు 1,444 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 1,159 నిర్మాణాలకే అనుమతులు లభించాయి. వీటిలో 364 ఇళ్లకు ముగ్గు పోశారు. 79 మందికి మాత్రమే మొదటిదశ చెల్లింపులు జరిగాయి. జిల్లాలోని 18మండలాల్లో 15 మోడల్ హౌస్ల నిర్మాణం చేపట్టగా ఐదు బేస్మెంట్, ఐదు స్లాబ్, నాలుగు రూఫ్ దశల్లో ఉన్నాయి. లబ్ధిదారులపై ధరాభారం రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించారు. ఇది ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో లబ్ధిదారులు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.5,500 లేదా స్థానికంగా లభించే ఇసుకకు రూ.3వేలు చెల్లిస్తున్నారు. సిమెంట్, ఇసుక, ఇనుము, ఇటుక ధరలు అమాంతం పెరిగాయి. ఈ భారం భరించలేక కొందరు నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ అదనపు డబ్బులు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు.దశలవారీగా చెల్లింపులు ఇలా.. బేస్మెంట్ లెవెల్కు రూ.లక్ష రూఫ్ లెవెల్ విత్ వాల్స్కు రూ.లక్ష స్లాబ్ లెవెల్కు రూ.2లక్షలు నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష -
సర్కారు బడి పిలుస్తోంది
నిర్మల్గురువారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2025దేశ విధానాలు ప్రపంచానికే దిక్సూచి నిర్మల్చైన్గేట్: భారత దేశ విధానాలు ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనపై జిల్లా కేంద్రంలో బుధవారం ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ పాలనలో దళిత నేత, గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి కట్టబెట్టిన విషయాన్ని గుర్తు చే శారు. కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేసినందునే భారత్ ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థికశక్తిగా అవతరించిందని పేర్కొన్నా రు. కార్యక్రమంలో నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, అంజుకుమార్రెడ్డి, రాజు, రాజేశ్వర్రెడ్డి, కమల్నయన్, అర్జు న్, సాగర్, పోశెట్టి, కార్తిక్, సుష్మారెడ్డి, లక్ష్మారె డ్డి, వెంకటరెడ్డి, శ్రావణ్, రాజేందర్, నారాయణరెడ్డి, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ఖిల్లా/నిర్మల్ రూరల్: దాదాపు 50రోజుల వేసవి సెలవుల అనంతరం నేడు బడిగంట మోగనుంది. ఇన్నాళ్లు సెలవులను ఎంజాయ్ చేసిన వి ద్యార్థులంతా ఇక పాఠశాల బాట పట్టనున్నారు. జి ల్లాలో ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1,150 మంది విద్యార్థులు నూతనంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశం పొందారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మొదటిరోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించేందుకు అంతా సిద్ధం చేశారు. జిల్లాలో 48,874 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చదువుకుంటున్నా రు. వీరికి ఒక్కోజత యూనిఫామ్ కోసం ప్రభుత్వం ఇప్పటికే వస్త్రం సరఫరా చేసింది. 96శాతం యూని ఫామ్ కుట్టు పనులు పూర్తయినట్లు సంబంధిత అధి కారులు తెలిపారు. మరో మూడురోజుల్లో పూర్తిస్థాయిలో అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే పార్ట్–1లో భాగంగా జిల్లాకు 3,27,110 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటికే 3,19,999 ఆయా మండలాలకు చేరుకున్నాయి. పార్ట్–2 పుస్తకాలు ఆగస్టులో రానున్నట్లు సమాచారం. సిద్ధమైన పాఠశాలలు జిల్లాలోని పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలలను అందంగా అలంకరించి పునఃప్రారంభానికి సిద్ధం చేశా రు. విద్యార్థులు గురువారం నుంచి బడిలో అడుగి డుతున్న సందర్భంగా పలుచోట్ల వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిరోజే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులతోపాటు యూనిఫాంలు పంపిణీ చేయనున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యను అందించేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో చదివి ప్ర స్తుతం ఉన్నతంగా ఎదిగిన జిల్లాకు చెందిన పలు వు రు అధికారులు వేసవి సెలవుల అనంతరం తొలిరో జు బడికి వెళ్లిన అనుభవాలు పంచుకున్నారు. న్యూస్రీల్ నేటి నుంచి పునఃప్రారంభం సిద్ధమవుతున్న విద్యార్థులు ముస్తాబైన ప్రభుత్వ స్కూళ్లు నేడే పాఠ్యపుస్తకాల పంపిణీజిల్లాలోని పాఠశాలల వివరాలు ప్రభుత్వ పాఠశాలలు 836 ప్రైవేట్ పాఠశాలలు 211 బాలురు 27,953 బాలికలు 34,094 మొత్తం 62,047 ప్రభుత్వ ఉపాధ్యాయులు 3,467 ‘సర్కారు’లోనే చదివి డాక్టర్నయ్యా నిర్మల్ఖిల్లా: చిన్నప్పటి నుంచి ప్రభుత్వ బడిలోనే చదివాను. సెలవుల తర్వాత బడికి వెళ్లాలంటే సంతోషమనిపించేది. కొత్త పుస్తకాలు, కొత్త బట్టలు, కొత్త చెప్పులు కొత్త తరగతి ఇలా అన్నీ కొత్తవే కావడంతో సంబురమనిపించేది. ఇప్పటికీ పాఠశాల తొలిరోజు జ్ఞాపకాలు గుర్తొస్తే మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. – అప్పాల చక్రధారి, చిన్నపిల్లల వైద్యుడు, నిర్మల్ -
ఘనంగా వటసావిత్రి వ్రతం
నిర్మల్ఖిల్లా: వటసావిత్రి వ్రతం సందర్భంగా బుధవారం ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాకేంద్రం సమీపంలో శ్రీగిరి క్షేత్రంలో ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వట సావిత్రి వ్రతం నిర్వహించి గురుమాత రాజరాజేశ్వరీదేవి, ఆర్కారి రాజవ్వ వ్రతం నేపథ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి హాజరై పూజలు చేశారు. గురుస్వామి శనిగారపు చిన్నయ్య, సముందర్పల్లి కిషన్, గణేశ్, దినేశ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న మహిళలు -
బడిని బతికించిన పెద్దసారు..
కడెం: మండలంలోని ఎలగడప ప్రభుత్వ పాఠశాల మూతబడే స్థితి నుంచి పూర్వవైభవాన్ని నిలబెట్టుకుంటోంది. గతేడాది ఐదుగురే విద్యార్థులుండగా గత జూలైలో బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయుడు కూచనపెల్లి శ్రీనివాస్ బడిని ఎలాగైనా బతికించాలనుకున్నారు. గ్రామస్తుల సహకారంతో విద్యార్థుల సంఖ్య 5నుంచి 25 పెంచారు. వేసవి సెలవుల్లోనూ శ్రీనివాస్ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రవేశాల పెంపునకు కృషి చేశారు. ఈనెల 6నుంచి బడిబాట నిర్వహించి 45మంది విద్యార్థులను చేర్పించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 68కు చేరింది. -
పత్రికాస్వేచ్ఛపై దాడి గర్హనీయం
నిర్మల్: పత్రికాస్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఖండిస్తున్నామని జిల్లా జర్నలిస్టు సంఘాలు, ప్రెస్క్లబ్ నాయకులు, పాత్రికేయులు పేర్కొన్నారు. కొమ్మినేని అరె స్టు, ఏపీలోని సాక్షి కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులపై జిల్లాకేంద్రంలో మంగళవారం నిరసన తెలిపారు. స్థానిక విశ్రాంతి భవ నం నుంచి గాంధీపార్క్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డా రు. టీయూడబ్ల్యూజే(143) నేషనల్ కౌన్సిల్ మెంబ ర్ అల్లం అశోక్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జ్లిలా ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య మాట్లాడు తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న మీడియాపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. వేరొకరి వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్టు కొ మ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదించి అరెస్టు చేయ డం, సాక్షి మీడియాపై దాడులు చేయడం దారుణ మన్నారు. నిరసనలో జర్నలిస్టు సంఘాల, ప్రెస్క్లబ్ నాయకులు, జిల్లా పాత్రికేయులు, పాకాల ఫౌండేషన్ చైర్మన్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ శాఖ ఇస్తరో..!
● మంత్రి వివేక్కు పోర్ట్పోలియోపై చర్చ ● కేటాయింపుపై కొనసాగుతున్న కసరత్తు ● ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా అవకాశం గత ఏడాదిన్నరగా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేక ప్రజలు, నాయకులు, అధికారులకు పరిపాలనలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాజాగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మంత్రి పదవి రావడం ఊరటనిచ్చింది. మరోవైపు రాష్ట్రం ఏర్పడ్డాక, తూర్పు జిల్లా నుంచి తొలిసారిగా మంత్రి పదవి లభించింది. గత ప్రభుత్వంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండగా.. ఈసారి మంచిర్యాల జిల్లాకు అవకాశం లభించింది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన తదితరవన్నీ జిల్లాకు మంత్రి లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం అన్ని పథకాల అమలులో ఇన్చార్జి మంత్రి కీలకంగా మారారు. ప్రస్తుతం మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్నారు. అభివృద్ధి, పథకాల అమలుపై సమీక్షలు, సమావేశాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇకపై వివేక్ ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పర్యవేక్షణలో సులువు కానుంది. ప్రభుత్వ పరంగా వేడుకలు, అధికారిక కార్యక్రమాలు మంత్రి హోదాలో జరగనున్నాయి. శాఖలపై కసరత్తురెండో విడతలో మంత్రులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ ప్రమాణం స్వీకారం చేశారు. వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. మంత్రి మండలిలో ఖాళీగా హోం, మున్సిపల్, గనులు, కార్మిక, పశుసంవర్ధక, పాడి, సంక్షేమ శాఖలు, ఇతర శాఖలు ఖాళీగా ఉండడంతోపాటు రెండేసి, మూడేసి శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారికి ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనిపై కసరత్తు చేస్తుండగా, త్వరలోనే స్పష్టత రానుంది. వివేక్పైనే ఆశలుగత 17 నెలలుగా ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా లేకపోవడంతో నాయకులతోపాటు ప్రజలకు లోటు ఏర్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిలో ఒక్క రికైనా మంత్రి పదవి వస్తుందని ముందునుంచీ ప్రచారం ఉంది. పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజాగా వివేక్నే ఖరారు చేయడంతో ఆయనపై ఉమ్మడి జిల్లా వాసుల ఆశలు ఉన్నాయి. నిధులు, విధులు, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు తదితరవన్నీ ఉమ్మడి జిల్లా నుంచి బలంగా వినిపించాల్సి ఉంటుంది. తన నియోజకవర్గం చెన్నూరుతోపాటు మి గతా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, గిరిజన ప్రాంతాలు, సింగరేణి తదితర అనేక సమస్యలు ఉన్నాయి. సీఎంను కలిసిన మంత్రి, ఎంపీ..చెన్నూర్: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. -
పంట పండింది!
● యాసంగిలో భారీగా ధాన్యం దిగుబడి ● చివరి దశలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ● ఖానాపూర్, సారంగపూర్ మండలాల్లోనే ఇంకా ధాన్యం.. ● ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తామంటున్న అధికారులు లక్ష్మణచాంద: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. 19 మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్ఎస్సీఎస్ల ఆధ్వర్యంలో 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టారు. ఇప్పటి వరకు 41,048 మంది రైతుల నుంచి 1,84,640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 17 మండలాల్లో కొనుగోళ్లు పూర్తికాగా, సారంగాపూర్, ఖానాపూర్ మండలాల్లో మాత్రమే కొనసాగుతున్నాయి. బుధవారంతో ఈ కేంద్రాల్లోనూ కొనుగోళ్లు ముగుస్తాయని పౌరసరఫరాల అధికారులు తెలిపారు. లక్ష్యాన్ని మించి సేకరణ..ఈ యాసంగి సీజన్లో 1,62,414 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకో గా, 1,85,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించా రు. ఇంకా 360 మెట్రిక్ టన్నుల కొనుగోలు పెండింగ్లో ఉంది. ఇది బుధవారంతో పూర్తవుతుందని అ ధికారులు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ ధాన్యం కొనుగోలుచేశామని వెల్లడించారు. రైతులకు చెల్లింపులుఇప్పటివరకు 22,738 మంది రైతులకు రూ.223 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన 18,305 మంది రైతులకు చెల్లింపులు త్వరలో పూర్తవుతాయని అధికారులు తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలుమే నెలలో అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసినప్పటికీ, తడిసిన వరిని కూడా కొనుగోలు చేసి రైతులకు ఊరటనిచ్చారు. ఈ సీజన్లో రైతులకు అనుకూలంగా కొనుగోళ్లు సాగినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీగా ధాన్యం దిగుబడి.. ఈ యాసంగిలో జిల్లాకు నిర్ధేశించుకున్న లక్ష్యం కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. ఈసారి పంట దిగుబడి భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 1,84,640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 22,738 మంది రైతులకు రూ.223 కోట్లు చెల్లించాం. బుధవారంతో కొనుగోళ్లు పూర్తవుతాయి. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే డబ్బులు జమ అవుతాయి. – సుధాకర్, పౌరసరఫరాల శాఖ డీఎం యాసంగి ధాన్యం కొనుగోలు లక్ష్యం 1,62,414 మెట్రిక్ టన్నులు -
88 ఏళ్ల వయసులో కోర్టుకు..
నిర్మల్: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలా నికి చెందిన సాధు ఇందిరమ్మ(88) ఏళ్ల వయసులో కోర్టు మెట్లు ఎక్కింది. ఆస్తుల విషయంలో కుటుంబంలో గొడవ జరగడం, బంధువులు ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో న్యాయం కోసం నిర్మల్ కోర్టును ఆశ్రయించింది. విచారణలో భాగంగా మంగళవారం ఇందిరమ్మ వాగ్మూలం ఇవ్వాల్సి ఉండడంతో కు టుంబ సభ్యులు ఆమెను కోర్టుకు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జూనియర్ సివిల్ జడ్జి రవీందర్ బెంచ్ దిగి.. బయటకు వచ్చారు. వృద్ధురాలి వాంగ్మూలం తీసుకున్నారు. -
గిరిజనుల తిరుగుబాటు
● పాత ఊళ్లకు తరలిన రాంపూర్, మైసంపేట్ వాసులు ● పరిహారం కోసం పోరుబాట ● పాత ఊరిలో గుడిసెలు, అక్కడే మకాంకడెం: కడెం మండలం రాంపూర్, మైసంపేట్ గ్రామాలు కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా కోసం ఖాళీ చేయించి ఏడాది గడిచింది. అయినా పునరావాస ప్యాకేజీలో భాగంగా హామీ ఇచ్చిన పరిహారం, సౌకర్యాలు అందకపోవడంతో గ్రామస్తులు తిరుగుబాటు ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో నిర్వాసితులు తమ పాత ఊళ్లకు తిరిగి వెళ్లి, గుడిసెలు వేసుకుని మకాం పెట్టారు. పునరావాసంలో అసంతృప్తిగతేడాది ఏప్రిల్లో అటవీ శాఖ రాంపూర్, మైసంపేట్ గ్రామాలను ఖాళీ చేయించి, కడెం మండలం పాతమద్దిపడగ సమీపంలో పునరావాస కాలనీకి తరలించింది. ఈ గ్రామాల్లోని 142 కుటుంబాల్లో 94 కుటుంబాలకు ప్యాకేజీ–1 కింద రూ.11.80 కోట్లతోపాటు 5 హెక్టార్ల విస్తీర్ణంలో విద్య, విద్యుత్, తదితర సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. నచ్చన్ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు సమీపంలో 94 కుటుంబాలకు వ్యవసాయ భూములు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మిగిలిన 48 కుటుంబాలకు ప్యాకేజీ–2 కింద రూ.15 లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించారు. అయితే, ఈ హామీలు పూర్తిగా అమలు కాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లుపునరావాస ప్రక్రియలోని లోపాలను సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారి డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. ● కేటాయించిన భూములను సాగుకు అనుకూలంగా చదును చేయాలి. ● వ్యవసాయ భూములకు త్రీ–ఫేజ్ విద్యుత్ సౌకర్యం, సాగు నీటి వసతి కల్పించాలి. ● భూములకు వెంటనే రెవెన్యూ పట్టాలు అందజేయాలి. ● 48 కుటుంబాలకు రూ.15 లక్షల నగదు పరిహారం పూర్తిగా అందించాలి. ● 94 కుటుంబాలకు ఉపాధి కోసం రూ.3 లక్షల రుణం అందజేయాలి. ● పునరావాస కాలనీలో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించాలి. ● పునరావాస కాలనీని గ్రామ పంచాయతీగా గుర్తించాలి. పాత గ్రామాల్లో గుడిసెలు.. పరిహారం, సౌకర్యాలు అందకపోవడంతో గ్రామస్తులు తమ పాత గ్రామాలైన రాంపూర్, మైసంపేట్లకు తిరిగి వెళ్లి గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పాటు చేశారు. వంటవార్పు చేసుకుంటూ అక్కడే ఉంటామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నారు.ఆందోళన చెందొద్దు రాంపూర్, మైసంపేట్ వాసులు ఆందోళన చెందొద్దు.పు నరావాస గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పూర్తిస్థాయి ప్యాకేజీ త్వరలో అందజేస్తాం. పట్టాలు ప్రింటింగ్ దశలో ఉన్నాయి. పట్టాలతోపాటు గిరి వికాసం కింద సాగునీటి సౌకర్యం, రుణాలు అందించే అవకాశం ఉంది. ఇందిర సౌర జల పథకం ద్వారా కూడా లబ్ధి పొందవచ్చు. – భవానీశంకర్, ఎఫ్డీవోఎట్లా బతుకుడు పునరావాసంలో భాగంగా మాకు అందించిన భూములకు కరెంటు, నీటి సౌకర్యం లేవు. భూములు సాగు యో గ్యంగా లేవు. ఇక్కడికి వచ్చి ఏడాది గడిచినా వ్యవసాయం లేకపోవడంతో కూలీ పనులకు పోతున్నం. పాత గ్రామాల్లో బావులు, విద్యుత్ సౌకర్యం ఉన్నాయి. అందుకే పరిహారం ఇచ్చి భూములు సాగు యోగ్యంగా చేసే వరకు ఇక్కడే వ్యవసాయం చేసుకుంటాం. – కోవ ప్రవీణ్, మైసంపేట్ -
ఏరువాక సంబురం..!
కుంటాలలో పత్తి విత్తనాలు విత్తుతున్న రైతులుఅందకూర్లో ఎడ్లబండిపై పొలం పనులకు వెళ్తున్న కూలీలు కుంటాల/తానూరు/భైంసారూరల్: మృగశిర కార్తె ప్రవేశించిన మరుసటి రోజు సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతులు మంగళవారం పొలంబాట పట్టారు. పొలం పనులు చేస్తూ బిజీగా కనిపించారు. కొందరు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్లారు. మరికొందరు సోయా, పత్తి విత్తనాలు విత్తారు. -
అటవీ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవె న్యూ, అటవీ, విద్యుత్, ఆర్అండ్బీ, పంచా యతీరాజ్, ఇరిగేషన్ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. మారుమూల గిరిజన, అటవీ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు అటవీశాఖకు ప్రపోజల్స్ పంపించాలని సూచించారు. విద్యుత్ లైన్ల ఏర్పాటుకు పరివేష్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలని సూచించారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగస్వాములవ్వాలి
నిర్మల్చైన్గేట్: బాల కార్మికు వ్యవస్థ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి.రాధిక అన్నారు. అంతర్జాతీయ బాలకార్మిక నిర్మూలన దినోత్సవం సందర్బంగా సీ్త్ర, శిశు, వయోజనులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, బాల కార్మిక నిర్మూలన చట్టంపై అవగాహన కార్యక్రమం గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక ప్రత్యేక అతిథిగా హాజరై బాల కార్మిక చట్టం ముఖ్యాంశాలను వివరించారు. పిల్లల హక్కులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి దేవి మురళి, ఎస్సై సందీప్, బాలల సంరక్షణ అధికారి శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్ లైన్ ఇన్చార్జ్ కోఆర్డినేటర్ గంగాధర్, మిషన్శక్తి కోఆర్డినేటర్ సబిత పాల్గొన్నారు.నిర్మల్ నుంచి రామేశ్వరానికి బస్సు నిర్మల్టౌన్: నిర్మల్ నుంచి రామేశ్వరానికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు రామేశ్వరానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనం చేసుకుని నిర్మల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే 36 మంది ప్రయాణికులు ఉంటే ఎక్కడికై నా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రయాణపు తేదీ, చార్జీ వివరాలకు 9959226003, 8328021517 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కంద కాల తవ్వకం ఆపాలి
నిర్మల్చైన్గేట్: పేదలు సాగు చేసుకుంటున్న భూముల్లో కందకాల తవ్వకం ఆపాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి కె.రాజన్న కోరారు. ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపి పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.రాజన్న మాట్లాడుతూ సారంగాపూర్ మండలం జౌలి గ్రామంలో 50 ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వి వారిని తరిమేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.రామలక్ష్మణ్, సాయినాథ్, సుదర్శన్, గంగాధర్ పాల్గొన్నారు. -
హద్దులు చూపించాలి
నాకు వారసత్వంగా సర్వే నంబర్ 167లో విస్తీర్ణం 5.14 ఎకరాల భూమి ఉంది. నా భూమి పక్కన గల 163 సర్వేనంబర్లో ఉన్న వారితో కొంత భూతగాదా జరిగింది 2023 డిసెంబర్లో, నా భూమి హద్దులు చూపించాలని నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ పేరు మీద చలానా కట్టాను. అధికారులు వచ్చి భూమి కొలువగా 163 సర్వే నంబర్ నుంచి నాకు కొంత భూమి వస్తుందని తేలింది. నా ప్రత్యర్థి, నేను మరోసారి భూమి కొలవాలని ఏడీకి చలాన్ కట్టాం. నేటికీ సర్వే అధికారులు కచ్చితంగా మా భూమి ఇది అని హద్దులు చూపడం లేదు. – పల్సీ దేవీదాస్, లింబాకే డీసీవోపై చర్యలు తీసుకోవాలి మహమ్మద్ నబీ అనే వ్యక్తి 16 సంవత్సరాల వయస్సు(మైనర్గా) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సత్తనపల్లిలో సెప్టెంబర్ 20, 1994లో సబ్ స్టాఫ్గా ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఇదే వ్యక్తి మహమ్మద్ నబీ, షేక్ నబీ పేర్లతో చలామణి అయి సొసైటీ నుంచి జీతం తీసుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో 2006లో వార్డు మెంబర్గా పోటీ చేశాడు. 2012 వరకు వార్డు మెంబర్ విధులు నిర్వర్తిస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కూడా జీతం తీసుకున్నాడు. ఇప్పుడు అతడిని డీసీవో రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహమ్మద్ నబీపై చర్యలు తీసకుని అతను పొందిన జీతాన్ని రికవరీ చేయాలి. – బలష్టు రాజన్న, గోడల పంపు -
కొత్త మంత్రులను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
నిర్మల్చైన్గేట్: నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావు సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభా కాంక్షలు తెలిపారు. సామాజిక న్యాయం అమలు కోసం పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కృషి చేస్తున్నారన్నారు. కొత్త మంత్రులు శ్రీహరి, లక్ష్మణ్కుమార్తో శ్రీహరి -
పరిహారం కోసం పోరుబాట
● పాత గ్రామాల్లో గుడిసెలు వేసి, వంటవార్పు కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామస్తులు పరిహారం కోసం పోరుబాట పట్టారు. గ్రామాలను ఖాళీ చేసి ఏడాది గడిచినా పరిహారం అందలేదని సోమవారం రాంపూర్, మైసంపేట్ పాత గ్రామాల్లో గుడిసెలు వేసి, అక్కడే వంట వార్పు చేశారు. పునరావాస గ్రామాల్లో సాగు భూములను చదునుచేయించడం, పట్టాలు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. లేదంటే పాత గ్రామల్లోనే వ్యవసాయం చేసుకుంటామన్నారు. ఉడుంపూర్ ఎఫ్ఆర్వో అనిత పునరావాస గ్రామస్తులతో మాట్లాడి డీఎఫ్వోకు పరిస్థితిని తెలియజేశారు. -
అక్రమ పట్టా తొలగించాలి
నాకు కుంటాల మండలంలో 1.2 ఎకరాల భూమి ఉంది. మా తమ్ముడు నాకు తెలియకుండా ఆ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నడు. ఇప్పుడు నాకు రైతుబంధు కూడా రావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. అక్రమ పట్టా రద్దు చేయండి. – జక్కుల గజ్జన్న, కుంటాల సర్వే నంబర్ మిస్సింగ్ మేము ముగ్గురం అన్నదమ్ములము. మా అన్న పట్టా భూమి అయిన 314/1లో 19 గుంటలు, 408/అ/1 లో 6 గుంటలు ఉంది. ఆ భూమిని నేను 2018 లో కొనుగోలు చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సర్వే నంబర్లు ఆన్లైన్లో కనిపించడం లేదు. ఇప్పటికే 20 సార్లు అధికారులకు పిర్యాదు చేశాను. సమస్య పరిష్కరించండి – కోరిపల్లి రవి, పోన్కల్ భూమి సర్కారుదంటున్నారు.. మాది కుంటాల మండలం అంబకంటి. 220, 324 సర్వే నంబర్లు మా అమ్మ కురుమే భూమి పేరుమీద 5.31 సాగుభూమి 1950 నుంచి 1970 వరకు ఉంది. తర్వాత కాలంలో ఈ భూమి సర్కారుది అంటున్నారు. పదేళ్లుగా తిరుగుతునా న్యాయం జరగడం లేదు. మా అమ్మ పేరు మీద ఉన్న భూమి వారసులమైన మా పేరిట రిజిస్టర్ అయ్యేలా చూడాలి. – గజ్వరి విట్టల్, అంబకంటి -
పునఃప్రారంభానికి సిద్ధం
నిర్మల్విప్లవ వీరుడా.. ఇక సెలవు..! అడవిలో రక్తపు సింధూరమై 30 ఏళ్ల తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చిన అడెల్లు మృతదేహం ఎర్రని వర్ణపు తాకిడికి తడిసి ముద్దయింది. ● డీఈవో రామారావుమంగళవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 20258లోuబ్యాడ్మింటన్లో ప్రతిభ నిర్మల్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8న మంచిర్యాల్లో నిర్వహించిన చాంపియన్షిప్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అండర్–11 సింగిల్స్లో అర్జున్ 2వ స్థానంలో, డబుల్స్లో అర్జున్, అమన్ మొదటి స్థానంలో నిలిచారు. అండర్–11 బాలికల డబుల్స్ విభాగంలో శ్రీకతి, హర్షిత రెండోస్థానంలో నిలిచారు. అండర్–13 సింగిల్స్లో శ్రీహర్షిత్ మొదటి స్థానంలో నిలిచాడు. అండర్– 15 మిక్స్డ్ డబుల్స్లో ఆరాధ్య, శ్రీహర్షిత్ రెండోస్థానం సాధించారు. అండర్–15 బాలికల డబుల్స్లో ప్రతిభ, సహర్షి రెండో స్థానంలో నిలిచారు. ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సుధాకర్, వన్నెల భూమన్న, సందీప్, ప్రశాంత్, మాణిక్యం, భారత్, శ్రీనివాస్, ముత్యం విద్యార్థులను అభినందించారు. లక్ష్మణచాంద: మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను పునఃప్రారంభానికి సిద్ధం చేశామని డీఈవో తెలిపారు. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై జిల్లా విద్యాధికారి పి.రామారావుతో ఇంటర్వ్యూ. సాక్షి: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయా? డీఈవో: జిల్లాలో మొత్తం 787 ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈనెల 12న పాఠశాలల పునఃప్రారంభానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. సాక్షి: పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు మొదలయ్యాయా, ఎలా చేయిస్తున్నారు? డీఈవో: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సూచనల మేరకు ఇప్పటికే పాఠశాలలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామపంచాయతీ సిబ్బందితో పనులు చేయించాం. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేయడంతో పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. సాక్షి: శిథిలావస్థకు చేరిన పాఠశాలలో ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఈవో: జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తొలగించడానికి ఎంపీడీవో, ఎంఈవో, ఇంజినీరింగ్ సిబ్బందికి తగిన మార్గదర్శకాలు జారీ చేశాం. ఈ విషయమై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో దగ్గరుండి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. శిథిలావస్థకు చేరిన పాఠశాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించాం. సాక్షి: విద్యార్థుల సంఖ్య పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఈవో: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రొషెసర్ జయశంకర్ బడిబాట. ఇందులో భాగంగా ప్రతీ పాఠశాల ఉపాధ్యాయులు వారి పరిధిలోని గ్రామాల్లో 6–14 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి వారికి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను తెలియజేస్తూ తమ పిల్లలను చేర్పించేలాగా అవగాహన కల్పించాలని సూచించాం. అదేవిధంగా పాఠశాలలోని గత విద్యార్థులు సాధించిన పురోగతిని తెలియజేస్తూ పిల్లల సంఖ్యను పెంచడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు బాధ్యతతో విద్యార్థుల నమోదు పెంచేలాగా ఎంఈవోల ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సాక్షి: అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలో చేపడుతున్న పాఠశాలల పనులు పూర్తయ్యాయా? డీఈవో: జిల్లా వ్యాప్తంగా 628 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు చేపట్టడం జరిగింది. ఇందులో ఇదివరకే 590 పాఠశాలల్లో పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలిన 38 పాఠశాలల్లో చివరి దశలో ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి అవి కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నాయా? డీఈవో: పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి వసతిని, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది. ఏమైనా మరమ్మతులు ఉంటే వేసవిలోనే పూర్తి చేయాలని సూచించడం జరిగింది. అన్ని పాఠశాలలో ప్రారంభం నాటికి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేలాగా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా.. ఎంత మందిని సర్దుబాటు చేశారు. డీఈవో: కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది. అటువంటి పాఠశాలలో ప్రస్తుతం సర్దుబాటు ప్రక్రియ జరుగుతోంది. పాఠశాలల ప్రారంభంనాటికి ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: విద్యార్థులకు అవసరమైన నోటుబుక్స్, పాఠ్య పుస్తకాలు ప్రారంభంరోజు అందిస్తారా? డీఈవో: జిల్లాలో మొత్తం విద్యార్థులకు పార్ట్ 1 పుస్తకాలు 3,40,220 అవసరం కాక ఇదివరకే అన్ని ఎంఈవో కార్యాలయాలకు సరఫరా చేశాం. అక్కడ నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. సాక్షి: మొదటి రోజే యూనిఫామ్ అందిస్తారా? డీఈవో: జిల్లాలో మొత్తం 48,874 మంది విద్యార్థులకు ఒక జత చొప్పున యూనిఫాం స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో కుట్టించాం. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల వద్దకు వెళ్లి ఒక జత యూనిఫామ్ తీసుకోవడం జరుగుతుంది. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేస్తాం. న్యూస్రీల్ -
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి
● మంత్రి సీతక్కనిర్మల్చైన్గేట్: మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతతో కూడుకున్న విషయమని, కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు, ప్రభుత్వ పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని, అక్టోబర్ 2 నాటికి ప్రారంభించేందుకు అవసరమైన స్థలాలను కలెక్టర్లు గుర్తించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిర మహిళా శక్తి భవనాల పనులను నవంబర్లోపు పూర్తిచేయాలన్నారు. అంగన్వాడీలు జూన్ 11న పునఃప్రారంభం కావడంతో చిన్నారులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని, ‘అమ్మమాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నారు. కొత్తగా అంగన్వాడీలు నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేయాలన్నారు. పాఠశాలల ప్రారంభరోజునే యూనిఫాం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 90 శాతం యూనిఫాంల స్టిచింగ్ పూర్తయ్యిందన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం అమలుతో జిల్లాలో ఇప్పటి వరకు 1,460 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని పాఠశాలల ప్రారంభంరోజే 48,874 మంది విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పనులు అనంతపేట సమీపంలో వేగంగా సాగుతున్నాయని తెలిపారు. పెట్రోల్ బంక్ల ఏర్పాటు చేసేందుకు సంబంధిత కార్యాచరణ మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. ఎస్టీ మహిళలు, మారుమూల ప్రాంత మహిళలు స్వయం సహాయక బృందాల్లో తక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త సభ్యుల చేర్పు కోసం గ్రామ పంచాయతీస్థాయిలో సమీక్ష జరుపుతున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో పి.రామారావు, డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. -
గోడు చెప్పుకున్నా.. గోస తీరడం లేదు!
● ప్రజావాణి అర్జీల పరిష్కారం జాప్యం ● కలెక్టరేట్ చుట్టూ బాధితుల ప్రదక్షిణ ● సమస్యలు పరిష్కారం కావడం లేదని అసంతృప్తి.. ● అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కన్నీటితో వేడుకున్నా.. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్నుఆ్నరు. నాలుగు నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని పార్ట్ టైం సిబ్బంది, వితంతు, దివ్యాంగ పింఛన్ రావడం లేదని, కాల్వ కింద భూమి పోతే నష్టపరిహారం రాకుండా అడ్డుకున్నారని ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పలువురు వినతులు సమర్పించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశొర్ కుమార్ అర్జీలు స్వీరించారు. వివిధ సమస్యలపై 73 అర్జీలు వచ్చాయి. సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం అన్ని మండలాల సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఏవో సూర్యారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష చేసి, పనులు వేగవంతం చేఆయాలని ఆదేశించారు. గోవధశాల తరలించాలి మేము ఖానాపూర్ పట్టణంలోని శ్రీసాయినగర్, శ్రీరాంనగర్ కాలనీవాసులం. మా కాలనీలో ఉన్న గోవధశాల వలన ఇబ్బంది పడుతున్నాం. వీటి నుంచి వచ్చే వ్యర్థాలను కుక్కలు, పందులు లాక్కొని ఇళ్ల ముందు వేస్తున్నాయి. దుర్వాసన వస్తోంది. అనారోగ్యంపాలవుతున్నాం. గతంలో కూడా అనేకసార్లు అధికారులకు విన్నవించాం. వధశాలను పట్టణ శివారుకు తరలించాలి. – సాయి నగర్, శ్రీరాంనగర్ కాలనీ వాసులు -
వైభవంగా గజ్జలమ్మ జాతర
కుంటాల: మండల కేంద్రంలోని శ్రీగజ్జలమ్మ జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవా రికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి ఉల్లి గడ్డలు, ఓమ, పేలా లు, పుట్నాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గజ్జ లమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకూ నైవేద్యం సమర్పించారు. పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కుంటాలకు చెందిన జుట్టు శ్రీధర్ దంపతులు అమ్మవారికి గ్రాము బంగారు ముక్కుపుడక బహూకరించారు. ఆలయ కమిటీ ఆ ధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. పుష్కరిణి ప్రారంభంకుంటాల మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు అల్లాల శారద–శ్రీనివాస్రావు దంపతులు గజ్జలమ్మ ఆలయ ఆవరణలో పుష్కరిణి నిర్మించగా వేద పండితుడు గురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. గోదావరి నది జలాలతో కోనేరులో శిఖరంపై గజ్జలమ్మ విగ్రహాన్ని ఉంచి అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయానికి పోటెత్తిన భక్తులు -
ప్రజాధనం పట్టదా?
ఈ ఫొటోలూ.. సోన్ మండలం శాకెర వద్ద స్వర్ణనదిపై నిర్మించిన చెక్డ్యామ్కు సంబంధించినవి. ఇటీవల ఈ డ్యామ్లో కొంత భాగాన్ని పేల్చివేయడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగానూ విమర్శలకు దారితీసింది. ప్రతీ వానాకాలంలో స్వర్ణ నీరు వృథాగా గోదావరిలో కలిసిపోతోంది. ఈ నీటిని ఒడిసిపట్టి పంటలకు అందించడంతో పాటు నిర్మల్ పట్టణానికి కొంతమేర తాగునీటిని అందించేందుకు 2016లో రూ.4.60కోట్లతో 175మీటర్ల పొడవుతో శాకెర శివారులో చెక్డ్యామ్ నిర్మించారు. అయితే.. రెండేళ్ల క్రితం సిద్ధాపూర్ సమీపంలోని జీఎన్ఆర్ కాలనీ జలప్రళయంలో చిక్కుకోవడానికి ఈ చెక్డ్యామే కారణం కావచ్చంటూ వాదనలు మొదలయ్యాయి. శాసీ్త్రయంగా ఎంతవరకు సమంజసమనేది తేలలేదు. మరోవైపు రూ.కోట్లు పెట్టి కట్టేముందు ఈ డ్యామ్తో ఎలాంటి ముంపు ఏర్పడుతుందన్న అంచనా వేయలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ముంపు ప్రాంతంలో నివాసం ఉండేందుకు జీఎన్ఆర్ కాలనీకి ఎవరు, ఎలా అనుమతిచ్చారన్న విషయమూ మరోసారి చర్చకు వస్తోంది. నిర్మల్: ఏ అభివృద్ధి పని చేపట్టాలన్నా ప్రభుత్వాని కి పక్కా లెక్కలుంటాయి. ఎలాంటి అంచనాలు, ముందస్తు లెక్కలు వేయకుండా పనులు చేపట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. ఏ నిర్మాణాలు చేయాలన్నా.. ముందుగా వాటితో కలిగే లాభనష్టాలను లెక్కవేసుకున్న తర్వాతే చేపట్టాల్సి ఉంటుంది. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుంటేనే పనులు ముందుకు సాగాలి. కానీ.. ఇటీవల కొంతభా గం పేల్చేసిన శాకెర చెక్డ్యామ్ విషయంలో అధికా రులు అవేమీ పట్టించుకోలేదా? గాలికి కట్టేశారా? అని జిల్లావాసులు వాదన లేవనెత్తుతున్నారు. కూల్చివేతపై భిన్న వాదనలుఎక్కడ ఏ డ్యామ్నిర్మించాలన్నా కచ్చితంగా ముంపు ప్రాంతాలను అంచనా వేయాల్సి ఉంటుంది. ని ర్మల్ సమీపంలో శాకెరలోనూ అలాగే నిర్మించారు. కానీ.. పైభాగంలోగల జీఎన్ఆర్ కాలనీ మూడేళ్లుగా వరదనీటిలో మునుగుతోంది. ఈ కారణంగా ఈ కాలనీకి దిగువన స్వర్ణ నదిలో గల చెక్డ్యామ్ ఎత్తు తగ్గిస్తే ముంపు తగ్గుతుందంటూ ఓ వాదన మొదలైంది. దీంతో ముంపు ప్రభావం తగ్గుతుందంటూ కొంతమంది ఈ అభిప్రాయాన్ని బలంగా తీసుకువచ్చారు. అసలు.. జీఎన్ఆర్ కాలనీ మునగడానికి ఈ చెక్డ్యామే కారణమంటూ శాసీ్త్రయంగా తేల్చకుండా నే కూల్చారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాలనీవాసుల క్షేమం కోసం చేపడుతున్న పనుల్లో భాగంగా ఈ పని చేశామంటూ ప్రభుత్వం తరఫున సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎలా అనుమతులిచ్చారో!ఎగువన ప్రాజెక్టు, దిగువన వానాకాలంలో ఉధృతంగా ప్రవహించే గోదావరి నది పరీవాహకంలో, అది కూడా ముంపు ప్రాంతంలో ప్రజలు నివాసం ఉండేలా ఓ కాలనీకి ఎలా అనుమతులిచ్చారన్న వా దన ఇప్పటికీ ఉంది. ఈ వెంచర్ ప్రారంభంలోనే అప్పటి నిర్మల్ మున్సిపల్ కమిషనర్ దీన్ని అడ్డుకు నే ప్రయత్నం చేయగా, రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి మరీ ఇక్కడ వెంచర్ ఏర్పాటు వేశారు. అప్పట్లో ఏమాత్రం ముందుచూపు లేకుండా నది ఒడ్డునే ప్లా ట్లు చేశారు. ఊరికి కాస్త దూరమైనా.. తమకు అనుకూల ధరలో రావడంతో చాలామంది మధ్యతరగ తి కుటుంబీకులు అక్కడ ప్లాట్లు కొనుక్కుని ఇళ్లు క ట్టుకున్నారు. మూడేళ్లుగా ముంపు కష్టాలెదురవుతుండగా వారంతా లబోదిబోమంటున్నారు. ఇలా జరుగుతుందని ముందే చెబితే.. ఇక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టేవాళ్లమే కాదని వాపోతున్నారు. తమకు ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదే నదికి ఓవైపు ఉన్న జీఎన్ఆర్ కాలనీ మూడేళ్లుగా మునుగుతుండగా, మరోవైపు ముంపు ప్రాంతంలోనే డబుల్బెడ్రూంలు ఎలా నిర్మించారన్న వాదనా చర్చకు వస్తోంది. ఇటీవల కొంతభాగం పేల్చి కూల్చిన చెక్డ్యామ్ రూ.లక్షలు వెచ్చించేది కూల్చడానికా? పేల్చివేతలకు బాధ్యులు ఎవరో? పాలకులు, అధికారుల్లో తప్పెవరిది? ముంపు తప్పుతదనే గ్యారంటీ ఏది? చెక్డ్యామ్ కూల్చడంపై భిన్నవాదనలుఇరువర్గాల మాటల యుద్ధంజీఎన్ఆర్ కాలనీకి ముంపు తప్పించేందుకు చేపడుతున్న పనుల్లో భాగంగానే పాలనపరమైన ఆదేశాలతో శాకెర చెక్డ్యామ్లో కొంతభాగంలో ఎత్తు తగ్గించేందుకు పేల్చివేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జీఎన్ఆర్ కాలనీ ముంపు వెనుక ఒకప్పటి పాలకులు ఉన్నారంటూ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఆరోపిస్తుంటే.. తాజాగా చెక్డ్యామ్ పేల్చివేతపై ప్రజా ధనం వృథా చేస్తున్నారంటూ మాజీ ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, మా జీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వర్గాల మధ్య మా టలయుద్ధం కొనసాగుతోంది. అసలు.. శాకెర చెక్డ్యామ్ ఎత్తు తగ్గించడంతో వరద ముంపు తప్పుతుందా? అనే విషయమై ఎవరూ స్పష్టతనివ్వడం లేదు. ఈ సీజన్లో వచ్చే వర్షాలే ఏది సరైన నిర్ణయమో తేల్చాల్సి ఉంది. -
చెరువుల వద్ద పర్యాటకుల సందడి
మామడ: మండలంలోని తుర్కం, యెంగన్న చె రువుల వద్దకు పర్యాటకులు తరలివచ్చారు. హై దరాబాద్ నుంచి వచ్చి ఎకో టూరిజం ద్వారా చె రువులను సందర్శించారు. విధి ఫౌండేషన్కు సంబంధించిన సభ్యులు, వలంటీర్లు చెరువుల వద్దకు శనివారం రాత్రి చేరుకుని అట వీశాఖ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చే శారు. ఆదివారం సఫారీ వాహనంలో చెరువుల వద్దకు చేరుకుని సమీపంలో ఉండే పక్షులను కె మెరాల్లో బంధించారు. ప్రకృతి అందాలు తిలకించారు. ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గ్రేహె డ్ ఫిష్, ఈగల్, విష్లింగ్ డక్, పైడ్ కుకూ పక్షుల ను గుర్తించారు. అటవీ ప్రత్యేకత పర్యాటకులకు అధికారులు వివరించారు. ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావు, ఎఫ్బీవో సరిత, సిబ్బంది ఉన్నారు.తుర్కం చెరువు వద్ద పర్యాటకులు -
వివేక్ అనే నేను...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూ ర్ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్ త రువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఇప్పటికే గడ్డం ఫ్యామిలీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉండగా ఎంపీగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచే వివేక్కు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయినప్పటికీ జిల్లా నుంచే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, బెల్లంపల్లి వినోద్ కూడా పోటీలో ఉండగా చివరకు అధిష్టా నం వివేక్ వెంకటస్వామికే మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో వివేక్ వర్గీయులు శనివారం నుంచే జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూర్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకొన్నారు. చెన్నూ ర్ పట్టణానికి చెందిన పార్టీ నాయకులు మంత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. భీమారంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. దండేపల్లిలో మాల సామాజిక వర్గం నాయకులు సంబరాలు జరుపుకొన్నారు. హామీలు నెరవేర్చడమే లక్ష్యం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని మీడియాతో మంత్రి వివేక్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని ఈ సందర్భంగా తెలిపారు. మంత్రిని కలిసిన నాయకులు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రా క్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్ నీలకంఠేశ్వర్రావు, మందమర్రి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నీలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్, కోటపల్లి మాజీ సర్పంచులు కుమ్మరి సంతోష్, గట్టు లక్ష్మణ్గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జేక శేఖర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకుడు గుర్రం రాజన్న పాల్గొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ చెన్నూర్ నుంచి అన్నయ్య వినోద్ తర్వాత మంత్రిగా తమ్ముడికి ఛాన్స్ ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, వినోద్కు ఆశాభంగం తీవ్ర నిరాశలో ప్రేమ్సాగర్రావు కొంతకాలంగా కేబినెట్లో తనకు తప్పనిసరిగా స్థానం ఉంటుందని ఆశించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు తీవ్ర ఆశాభంగం కలిగింది. దీంతో ఆయన వర్గీయులు శనివారం నుంచే తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రేమ్సాగర్రావును బుజ్జగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగి ఆయనకు పలు విధాలుగా నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. -
బాల్య వివాహమంటూ తప్పుడు ఫిర్యాదు
ఖానాపూర్: మండలంలోని మేడంపల్లి గ్రామంలో ఆదివారం మైనర్ను ఇదే గ్రామానికి చెందిన యువకుడికిచ్చి బాల్యవివాహం చేస్తున్నట్లు ఎవరో 1098 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చే శారు. దీంతో ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోలీస్శాఖ అ ధికారులు శనివారం రాత్రి మేడంపల్లి గ్రామానికి చే రుకున్నారు. మైనర్లకు వివాహం చేయవద్దని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అయితే సదరు కు టుంబీకులు తమ కుమార్తె మేజర్ అని, ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించారు. అయితే ఇది ఆకతాయిల పనిగా భా వించిన అధికారులు వెనుదిరగడంతో ఆదివారం యువతి వివాహాన్ని జరిపించారు. దీంతో ఇరు కుటుంబాలవారు ఊపిరిపీల్చుకున్నాయి. ● మేజర్గా తేలడంతో జరిగిన పెళ్లి -
కేంద్రం కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలి
నిర్మల్చైన్గేట్: పోడు భూములను అటవీ భూములుగా మార్చే కేంద్ర ప్రభుత్వ కుట్రల ను ఐక్యంగా తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర క మిటీ సభ్యులు ఆడివయ్య, ఉడుత రవీందర్ పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం ఇంద్రనగర్లోని పార్టీ కార్యాలయంలో దుర్గం నూతన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించగా వీరు హాజరై మాట్లాడారు. ఖానాపూర్ ప్రాంతాన్ని కొత్తగా టైగర్ జోన్గా ప్రకటించడం అన్యాయమని, ఈ ప్రకటనతో జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. ఇటీవల పట్టాలున్న భూముల్లో నూ రైతులను సాగు చేసుకోనివ్వడంలేదని తెలిపారు. దీని వెనుక గిరిజనులు, గిరిజనేతరులను ఊళ్ల నుంచి తరిమివేసే కుట్ర ఉందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గౌత మ్ కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బొ మ్మెన సురేశ్, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంబు, ఫసియొద్దీన్, అవర్గ ముత్యం, నాగేల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
పీఎస్సార్ను కలిసిన మీనాక్షి నటరాజన్
మంచిర్యాలటౌన్: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కలిశారు. పీఎస్సార్కు కాకుండా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంతో వారి ద్దరూ ఆయనను కలిసి బుజ్జగింపు యత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, మొదటి నుంచి పార్టీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాపాడుకుంటూ వచ్చిన పీఎస్సార్కే మంత్రి పదవి వస్తుందని పార్టీ నాయకులంతా భావించారు. తీరా పదవి రాకపోవడంతో ఆయన వర్గీయుల్లో నైరాశ్యం నెలకొంది. -
ఘనంగా చండీయాగం
కుంటాల: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు అల్లాల శారద–శ్రీనివాస్రావు దంపతులు గజ్జలమ్మ ఆలయ ఆవరణలో పుష్కరిణి నిర్మించగా, శనివారం గురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా చండీహోమం నిర్వహించారు. ఉదయం నుంచి గ ణపతి పూజ, పుణ్యాహవాచనం, నాంది, రక్షాబంధన, వాస్తు ఆరాధన, ద్వారపూజ, అఖండ దీప స్థాపన, అంకురార్పణ, వాస్తు క్షేత్రపాలక యోగిని నవగ్రహ సర్వతోభద్ర మంటపారాధన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, పంచగవ్య పంచామృత నది జల సంప్రోక్షణ, చండీహోమం, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
ప్రార్థన చేస్తున్న చిన్నారి త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను శనివారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సందేశం వినిపించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిత్రులు, బంధువులకు కుర్బానీ అందించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద వివిధ పార్టీల నాయకులు ముస్లింలను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఎస్పీ జానకీ షర్మిల, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. – నిర్మల్ టౌన్ -
చివరకు వివేక్కే..?
● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి.. ● చెన్నూర్ ఎమ్మెల్యేకు కేబినెట్లో చోటు ● ప్రేమ్సాగర్రావు, వినోద్ను పక్కన బెట్టిన అధిష్టానం ● ఆదివారం ప్రమాణ స్వీకారం.. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాకు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దా టింది. మంత్రి పదవి కోసం మొదటి నుంచి కొనసాగుతున్న పీటముడి వీడింది. ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. గతేడాదిన్నరగా తర్జనభర్జనలు కొనసాగగా ఆదివారం కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇ చ్చింది. మాల సామాజికవర్గం నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాదిగ సామాజికవర్గం కోటాలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ ఖరారు అయినట్లు తెలిసింది. ముగ్గురి మధ్య పోటీ..జిల్లా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చె న్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పో టీ పడ్డారు. గాంఽధీభవన్ నుంచి ఢిల్లీ వరకు పీసీ సీ స్థాయి నుంచి ఏఐసీసీ అధిష్టానం దాకా ము గ్గురూ ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకున్నారు. చివరకు అధిష్టానం వివేక్నే ఖరారు చేసింది. దీంతో ప్రేమ్సాగర్, వినోద్ కంగుతి న్నారు. వారి అనుచరులూ ఊహించని షాక్కు గురయ్యారు. కొద్ది రోజులుగా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమన్న నమ్మకంతో ఉన్నా రు. వివేక్కు పదవి రావడం వారికి మింగుడు ప డటం లేదు. మరోవైపు చెన్నూర్ ఎమ్మెల్యే వర్గీ యులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ రాజకీయ ప్రస్థానంకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్లో చేరారు. చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతు న్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయన కు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానా లు వచ్చాయి. అధిష్టానం తొలి విడతలోనే పద వి ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా స మీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణ లు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమో దం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మ రో వైపు బెల్లంపల్లి ఎమ్మెల్యే తన సోదరుడు వి నోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రయత్నించారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధి ష్టానం వివేక్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో వ్యక్తి..చెన్నూర్ నుంచి గెలిచిన వారిని మంత్రి పదవులు వరిస్తున్నాయి. గతంలో బోడ జనార్దన్, గడ్డం వినోద్ మంత్రులుగా పనిచేశారు. తాజాగా గడ్డం వివేక్ వెంకటస్వామికి ఛాన్స్ దక్కింది. 1999 నుంచి 2004 వరకు అప్పటి ఎమ్మెల్యే బోడ జ నార్దన్ చంద్రబాబు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు ప్రస్తుత బెల్లంపల్లి, ఎమ్మెల్యే నాటి చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా వివేక్కు కూడా కేబినెట్ బెర్త్ ఖరారైంది. దీంతో చెన్నూర్ నియోజకవర్గానికి మూడోసారి మంత్రి పదవి వరించనుంది. -
కరాటే బెల్ట్ గ్రేడ్ పరీక్షలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని అమ్ముల భూ షణ్ కరాటే అకాడమీలో 30 రోజులుగా కరా టే నేర్చుకున్న విద్యార్థులకు శనివారం వాసవీ ప్రైమరీ పాఠశాలలో బెల్ట్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 50మంది విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు తేజేంద్రసింగ్ భాటియా, పాఠశాల ప్రిన్సిపల్ సుహాసిని, కరాటే అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, చిరంజీవి, వంశీ, మృణాళిని, వినయ్కుమార్, నక్షత్ర తదితరులు పాల్గొన్నారు. -
నో బీపీ.. నో షుగర్
● వృద్ధాప్యం వచ్చినా దరిచేరని రోగాలు ● బయటి ఫుడ్డు తినకపోవడమే కారణం ● అన్ని వంటలు నేటికీ కట్టెలపొయ్యిపైనే ● ఇంటింటా మట్టి పాత్రల వినియోగం ● ఆదర్శంగా నిలుస్తున్న మిద్దెచింత గ్రామంకడెం: మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఈరో జుల్లో 30 ఏళ్లకే బీపీ, షుగర్ రావడం కామన్ అయిపోయింది. కానీ.. ఏడు పదుల వయస్సు దాటినా వీరికి నేటికీ బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు దరి చేరలేదు. కనీసం కళ్లద్దాల అవసరం కూడా రా నీయకుండా హ్యాపీగా కాలం గడుపుతున్నారు. ఇందుకు కారణం వీరు బయటి ఆ హారం ముట్టరు. వారు పండించిన జొన్నలు, రాగులు, పప్పు దినుసులు, కూరగాయలనే ఆ హారంగా తీసుకుంటారు. దీంతో వారికి ఎలాంటి రోగాలు రావు. వృద్ధాప్యంలోనూ చలాకీగా ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తారు. ఎలాంటి రోగాలు దరి చేరనీయకుండా సంపూర్ణ ఆరోగ్యకర జీవితం గడుపుతున్న కడెం మండలంలోని మిద్దెచింత గ్రామస్తుల లైఫ్స్టైల్పై సండే స్పెషల్.. ప్రకృతి ఆహారమే ముద్దుప్రకృతిలో లభించే దుంపలు, ఆకుకూరలు, వేర్లను మిద్దెచింత వాసులు ఆహారంగా తీసుకుంటారు. ఈ మారుమూల ఆదివాసీ గ్రామానికి ఇప్పటికీ విద్యు త్ సౌకర్యం లేదు. ఆయిల్ ఇంజన్ల సాయంతో సా గునీరు అందిస్తూ వారికి కావాల్సిన అన్ని రకాల పంటలు పండిస్తారు. ఇప్ప పువ్వు, కంది కట్టెలను ఉడికించి జొన్న పిండితో బూరెలు చేసుకుని తిన డం వీరికి ఇష్టం. కంది పంట కోసిన తర్వాత ఇప్ప బూరెలు చేసుకునేందుకు కందికట్టెను ఏడాదంతా ఇళ్లలో నిల్వ చేసుకుంటారు. జొన్నరొట్టె, జొన్న, మక్క అంబలి, పెసర, మినుము, కంది, అనుములు వీరు పండించే ప్రధాన పంటలు. అడవిలో దొరికే కేస్కగడ్డ విషపూరితమైనదైనా దానిని ఏడుసార్లు ఉడికించి ఆహారంగా తీసుకుంటారు. కొబ్రాసీరు అనే వేర్లతో వీరు టీ చేసుకుని తాగుతారు. ఈ కారణంగానే ఎలాంటి రోగాలు తమ దరికి చేరవని గ్రామస్తులు చెబుతున్నారు. వారు పండించిన పంటలే ఆహారంగా తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కళ్లద్దాలు అవసరం లేదు నాకు 82 ఏళ్లు. ఇప్పటివరకు బీపీ, షుగర్ రాలేదు. ఎలాంటి రోగాలూ లేవు. మా గ్రామంలో వృద్ధులెవరికీ నేటికీ కళ్లద్దాలు రాలేదు. మాకు కరెంట్ లేనందునా చీకటి పడకముందే ఆహారం తీసుకుంటాం. సమయానికి నిద్రపోతాం. – ఆడ సోము పాత తరాన్ని అనుసరిస్తున్నాం మేము పాత తరాన్ని అనుసరిస్తున్నాం. చి న్నప్పటి నుంచి రసాయనాలు వేయని పంటలనే ఆహారంగా తీసుకుంటున్నాం. వ్యవసాయ పనుల్లో ముందుంటాం. కూరగాయలు, దినుసులు పండించి మార్కెట్లో విక్రయిస్తాం. – ఆత్రం మానిక్రావు -
నిర్మల్ జిల్లా... కళల ఖిల్లా
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కవులు, కళాకారులు, చరి త్రకారులకు నిలయంగా మారిందని ప్రముఖ కవి డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో పాటే మా ప్రాణం సంగీత అకాడమీ, బన్నీ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన శిక్షణ శిబిరంలో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసాపత్రాలు, పతకాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్య క్రమంలో నృత్య శిక్షకురాలు నవ్య, కళాకారుడు చెని కారపు నాగరాజు, నరేశ్, మంజుల, శ్వేత, స్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ని ఘటనపై విచారణ చేపట్టాలి
భైంసాటౌన్: కుభీర్ మండలంలోని అంతర్నిలో ప్రభుత్వ పాఠశాల భవనం కూ లిన ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పీ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారులను పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంతర్ని ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. బాధ్యులైన డీఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులున్నారు. -
ఇదెక్కడి ప‘రేషాన్’!
● మూడునెలల కోటాతో ఇబ్బందులు ● బయోమెట్రిక్ జాప్యంతో గంటల తరబడి క్యూ ● ఉదయం నుంచే దుకాణాల వద్ద పడిగాపులుభైంసాటౌన్: వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డుదారులకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ముందస్తుగా ఒకేసారి పంపిణీ చేస్తున్నాయి. ఒక్కో యూనిట్కు కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక కిలో కలిపి మొత్తం ఆరు కిలోల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వ ఉద్దేశం సానుకూలమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పంపిణీ ప్రక్రియలో జాప్యం, సాంకేతిక సమస్యలతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయోమెట్రిక్ సమస్యలతో...రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ విధానం ప్రధాన అడ్డంకిగా మారింది. సాధారణంగా ప్రతీ నెల ఒక్కసారి వేలిముద్ర ద్వారా బియ్యం పొందే లబ్ధిదారులు, ఈసారి మూడు నెలల రేషన్ కోసం ఆరుసార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోలకు ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం అందించే ఒక కిలోకు మరోసారి వేలిముద్ర వేయడంతో పాటు, వేర్వేరుగా కాంటా చేయడం వల్ల ఒక్కో లబ్ధిదారు?3కు 15 నిమిషాల సమయం పడుతోంది. దీనితో పంపిణీ ప్రక్రియలో గణనీయమైన జాప్యం జరుగుతోంది. అదనంగా, ఈ–పోస్ యంత్రాల్లో సర్వర్ సమస్యలు తలెత్తడం లబ్ధిదా రుల ఆందోళనను మరింత పెంచుతోంది. భారీ క్యూ, సౌకర్యాల కొరతరేషన్ దుకాణాల వద్ద ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి పనులు, బయటి వ్యవహారాలను వదిలి రేష న్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. అంతేకాక, దుకాణా ల వద్ద నీడ వసతులు లేకపోవడంతో ఎండలో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితులు లబ్ధిదారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిల్వలపై ఆందోళనసాధారణంగా ప్రతీ నెల 16 నుంచి 20 తేదీల మధ్య రేషన్ బియ్యం పంపిణీ పూర్తవుతుంది. అయి తే, ఈసారి మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో బియ్యం నిల్వలు అయిపోతాయన్న భయంతో కార్డుదారులు రేషన్ దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ దీర్ఘ క్యూలు, ఆలస్యం వల్ల బియ్యం అందుతుందో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు పంపిణీ కొనసాగించాలని వారు కోరుతున్నారు. సమస్యల పరిష్కారానికి సూచనలుప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బయోమెట్రిక్ ప్రక్రియను సరళీకరించి, ఒక్కసారి వేలిముద్రతో మొత్తం బియ్యం పొందే వి ధంగా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అలా గే, సర్వర్ సమస్యలను త్వరగా పరిష్కరించడం, రేషన్ దుకాణాల వద్ద నీడ వసతులు, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. ఈ చర్యలు అమలైతే లబ్ధిదారుల ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. మూడు గంటలు వేచి ఉన్నా... రేషన్ బియ్యం తీసుకునేందుకు మూడు గంటలపాటు వేచి ఉన్నా. ఒక్కొక్కరికి ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తుంది. దీంతో గంటల తరబడి ఆలస్యమవుతోంది. దుకాణాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేవు. ఎండలో నిల్చోలేక ఇబ్బంది పడుతున్నాం. – సాయినాథ్, భట్టిగల్లి, భైంసాఇంటి పని వదులుకుని... మూడునెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నరని దుకాణంకు వస్తే, ఇక్కడ గంటల కొద్ది ఆలస్యమైతుంది. ఆరుసార్లు వేలిముద్ర తీసుకుంటున్నరు. ఇంటి పని వదులుకుని దుకాణం వద్దనే గంటల తరబడి నిల్చున్న. – అనితా బాయి, భట్టిగల్లి, భైంసా -
అడెల్లు.. అమర్రహే!
● ముగిసిన ఉద్యమ ప్రస్థానం ● బీజాపూర్ ఎన్కౌంటర్లో ‘మైలారపు’ మృతి ● మూడు దశాబ్దాలుగా అరణ్యంలోనే.. ● విషాదంలో పొచ్చెర గ్రామం ● మృతదేహం అప్పగించాలంటున్న కుటుంబీకులు, గ్రామస్తులు బోథ్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాల ఉద్యమ కెరటం నింగికెగిసింది. నూనుగు మీసాల ప్రాయంలో అడవిబాట పట్టి విప్లవోద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్(53) ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు మృతి చెందాడు. ఉదయం నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. బాల్యం నుంచి అభ్యుదయ భావాలు కలిగిన అడెల్లు మరణవార్త జిల్లాలోని పొచ్చెర గ్రామాన్ని తీవ్రంగా కలిచివేసింది. 30 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను ఆ ఊరు గుర్తు చేసుకుంది. అడెల్లు ప్రస్థానం ఇదీ..అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామం. తల్లిదండ్రులు పోతన్న–పోషవ్వకు నలుగురు సంతానం. పెద్ద అడెల్లు, సీతారాం, అడెల్లు, చిన్న అడెల్లు. తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. దున్నే వాడిదే భూమి నినాదం, పేదరికం అడెల్లును నక్సల్ వైపు నడిపించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయనను 1989లో జరిగిన భూపోరాటం ఆకర్షించింది. అడెల్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరులతో కలిసి కూలి పనులకు వెళ్తుండేవాడు. భూస్వాముల పెత్తందారితనాన్ని తరచూ ప్రశ్నించేవాడు. విద్యాభ్యాసం..బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. 1989లో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నిర్మల్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. రాడికల్ నుంచి దళంలోకి..రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చురుగ్గా పాల్గొనేవాడు. అధ్యక్షుడిగా పనిచేశాడు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచాడు. ఈ క్రమంలోనే 1995 ప్రాంతంలో నక్సలైటుగా మారాడు. దళంలోకి ప్రవేశించాడు. మొదట బోథ్ దళ సభ్యుడిగా పని చేసిన ఆయన ఇంద్రవెల్లి డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగాడు. అక్కడి నుంచి చత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పూర్తిస్థాయి పట్టు సాధించాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివి జన్ కమిటీకి సారథ్యం వహిస్తూ.. కరోనా సమయంలో ఉమ్మడి జిల్లాలో రిక్రూట్మెంట్ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. గతంలో అడెల్లు దళా న్ని పట్టుకోవడమే లక్ష్యంగా పోలీస్ బలగాలు ఉమ్మ డి జిల్లాలోని తిర్యాణి, మంగి, బోథ్, పెంబి, ఖానా పూర్, మామడ ప్రాంతాల్లో జల్లెడ పట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. పలుమార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నట్లు వినికిడి. 2020 సెప్టెంబర్ 19న కదంబ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అడెల్లుపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. కంతి లింగవ్వతో వివాహం..అడెల్లు దళంలో చేరిన సందర్భంలోనే అప్పటికే అందులో కొనసాగుతున్న నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కంతి లింగవ్వతో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కీలక సభ్యులుగా ఎదిగారు. లింగవ్వ జిల్లా కమిటీ సభ్యురాలిగా ప్రధాన భూమిక పోషించారు. మంగీ ప్రాంతంలో రిక్రూట్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. 2022 డిసెంబర్లో లింగవ్వ మహారాష్ట్ర, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. అప్పటి నుంచి అడెల్లు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లారని తెలుస్తోంది. ఎట్లున్నడో అనుకునేలోపే..కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేయాలని వారికి పట్టున్న అడవుల్లో కూంబింగ్ షురూ చేసింది. ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందిన తరుణంలో అడెల్లు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడోనని కుటుంబీకులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త వారి గుండెను చెరువు చేసింది. చివరి చూపు కోసం మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు. చివరి చూపు చూడాలని ఉంది నా తమ్ముడు అడెల్లును చివరి చూపు చూడాలని ఉంది. చిన్నతనంలో దళంలోకి వెళ్లాడు. ప్రజల కోసమే పని చేశాడు. ఇంతకాలం ఎక్కడున్నా బతికే ఉన్నాడనే ఆశ ఉండేది. ఇప్పటికి దాదాపు 30 ఏళ్లు దాటింది చూసి. మృతదేహాన్ని అప్పగించాలని కోరుతున్నా. – మైలారపు సీతారం, అడెల్లు సోదరుడు, పొచ్చెర మంచి చేయాలన్న తపన ఉండేది చిన్నప్పటి నుంచి అడెల్లుకు మంచి చేయాలన్న తపన ఉండేది. పేదల పట్ల సేవాగుణం చూపుతూ అందరితో కలివిడిగా ఉండేవాడు. బాగా చదువుకునేవాడు. అడెల్లు ఎన్కౌంటర్లో చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. – నడికుంట నడిపి అడెల్లు, గ్రామస్తుడు -
బడిబాట లక్ష్యం పెంచాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్సారంగపూర్: బడిబాట కార్యక్రమం ద్వారా గతేడాదికన్నా అధికంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, లక్ష్యాన్ని మించి అడ్మిషన్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని యాకర్పెల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మండల వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులను చేర్పించారని ఎంఈవో మధుసూదన్ను అడిగి తెలుసుకున్నారు. గతేడాది 6వేల పైచిలుకు విద్యార్థుల లక్ష్యం చేర్చుకున్నామని తెలిపారు. ఈసారి లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్, తహశీల్దార్ శ్రీదేవి, ఎంపీవో అజీజ్ఖాన్, ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులుఅపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. యాకర్పల్లి గ్రామంలో నిర్వహించిన రెవె న్యూ సదస్సును అదనపు కలెక్టర్ కిశోర్కుమార్తో కలిసి పరిశీలించారు. మొత్తం 36 దరఖాస్తులు రా గా అందులో 19 దరఖాస్తులు కేవలం 241సర్వే నంబర్పైనే రావడంతో ఇదేంటని తహసీల్దార్ శ్రీదేవిని అడిగారు. తహసీల్దార్ బదులిస్తూ 241సర్వే నంబరు ప్రభుత్వ భూమి అని కలెక్టర్కు వివరించారు. దీని విస్తీర్ణం 40.36 ఎకరాలని తెలిపారు. ఇదే సర్వే నంబరులో అసైన్డ్ పట్టాలు 40.36 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా 77.17 ఎకరాలకు పట్టాలు జారీ చేశారని పేర్కొన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన కలెక్టర్ ఇదేలా సాధ్యమని తహశీల్దార్ను అడిగారు. కాలక్రమేణా పట్టామార్పిడులు జరిగిన నేపథ్యంలో, అసలు పట్టాదారులు మరణించగా వారి వారసుల పేర్ల పై మార్పిడి, క్రయ విక్రయాల నేపథ్యంలో ఇలాంటి పొరపాటు జరిగి ఉండవచ్చని వివరించారు. సమస్య పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక టీమ్ ఏర్పాటు చేసి 40.36 ఎకరాల భూమిని సర్వే చేయించాలని తహశీల్దార్కు సూచించారు. ప్రస్తు తం సాగుచేస్తున్న రైతుల వివరాలు సేకరించి ఎవరైతే సాగుచేస్తున్నారో వారికే పట్టాలు ఉంచి మిగతా వారి పట్టాలు రద్దు చేయాలని ఆదేశించారు. అనంతరం యాకర్పెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మొక్కలు నాటారు. వరదల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి నిర్మల్చైన్గేట్: వర్షాకాలంలో సంభవించే వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబరులో జిల్లా ఫ్లడ్ మ్యానువల్–2025 పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది జిల్లాలో నమోదైన వరదల వివరాలు, వాటి తీవ్రత, వాటివల్ల జరిగిన ఆస్తి, పంట నష్టం తదితర సమాచారాన్ని ఈ పుస్తకంలో సమగ్రంగా పొందుపరిచినట్టు తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు వంటి అంశాలు ఈ మ్యానువల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ కుమార్, ముఖ్య ప్రణాళికాధికారి జీవరత్నం పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ – 2010 నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం – 2010, మహిళ శిశు రక్షణ చట్టాల అమలు, పర్యవేక్షణ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మహిళా శిశు రక్షణ చట్టాల అమలులో నిర్లక్ష్యం వహించొద్దని పేర్కొన్నారు. ఆసుపత్రులు రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయకూడదని, ప్రతీ ఆస్పత్రిలో రేటు చార్ట్ను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ప్రతీ ఆస్పత్రిలో కనీస ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, బయో మెడికల్ వేస్ట్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ వైద్య సంస్థలు, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ ల్యాబ్లు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదు చేసుకోవాలన్నారు. పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలన్నారు. లింగ నిర్ధారణ చర్యలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 7337448722 ను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. అన్ని వివరాలను ఆన్లైన్లో సమయానికి అప్డేట్ చేయాలన్నారు. అనంతరం పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం, అమ్మ రక్ష పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేందర్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్ సింగ్, డీసీహెచ్ఎస్ సురేశ్, సరోజ, సునీల్, ప్రైవేట్ వైద్య సంస్థల ప్రతినిధులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మూగజీవాలపాలిట.. మృత్యుపాశాలు
● అప్రమత్తతతోనే ప్రమాదాలు నివారించవచ్చంటున్న అధికారులు ● తీగలు తెగితె వెంటనే సమాచారం ఇవ్వాలని సూచనలక్ష్మణచాంద: వర్షాకాలంలో విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చని వి ద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంతో మూగజీవాలు మృత్యువాతపడుతున్నాఇ. ఆస్తి నష్టం జరుగుతోంది. తెగిపడిన విద్యుత్ తీగలను తాకడం, సొంతంగా మరమ్మతులు చేయడం వంటి వి ప్రమాదకరమని, ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిర్మల్ విద్యుత్ శాఖ డీఈ డి.నాగరాజు సూచించా రు. రైతులు, విద్యుత్ వినియోగదారులు వర్షాకా లంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సలహాలు ఇచ్చారు. విద్యుత్ తీగలతో అప్రమత్తంతెగిన తీగలను తాకొద్దు: విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా లేదా లూజుగా ఉన్నా వాటిని తాకకూడదు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. తడి బట్టలు ఆరవేయొద్దు: ఇండ్లలో విద్యుత్ తీగలపై తడి బట్టలు ఆరవేయడం వల్ల షాక్ సంభవించే ప్ర మాదం ఉంది. జీఐ దండెం వైర్లలో ఇన్సులేషన్ సరి గ్గా లేకపోతే విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంది. రేకులతో జాగ్రత్త: ఇంటి ముందు స్టీల్ రేకులు విద్యుత్ తీగలకు తాకకుండా చూసుకోవాలి, ఎందుకంటే వీటికి కూడా విద్యుత్ సరఫరా జరిగే అవకా శం ఉంది. పశువులను కట్టవద్దు: ఇనుప విద్యుత్ స్తంభాలకు పశువులను కట్టివేయడం మానుకోవాలి, ఇది ప్రమాదకరం. తీసుకోవాల్సిన జాగ్రత్తలుసర్వీస్ వైర్ల సమస్య: వర్షాకాలంలో సర్వీస్ వైర్లకు కార్బన్ వచ్చి విద్యుత్ సరఫరా సరిగ్గా జరగకపోతే, వాటిని మార్చుకోవాలి. విద్యుత్ తీగల దూరం: ఇండ్లకు ఆనుకొని విద్యుత్ తీగలు లేకుండా చూసుకోవాలి. ఎర్తింగ్ ఏర్పాటు: ఇంటి విద్యుత్ వైరింగ్కు సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ వైర్లను తాకకూడదు. సెల్ఫోన్ జాగ్రత్తలు: చార్జింగ్లో ఉన్న సెల్ఫోన్తో మాట్లాడటం, తడి చేతులతో స్విచ్ ఆఫ్ చేయడం వంటివి నివారించాలి. చేతులను గుడ్డతో తుడిచి స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత చార్జింగ్ వైర్ తీయాలి. ప్రమాద సమయంలో చర్యలువిద్యుత్ షాక్ నివారణ: ఎవరైనా విద్యుత్ షాక్కు గురైతే, ఆత్రుతగా వారిని తాకకూడదు. విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ వస్తువులతో వారిని విద్యుత్ సంబంధం నుంచి వేరు చేయాలి. సొంత మరమ్మతులు వద్దు: సొంతంగా విద్యుత్ మరమ్మతులు చేయడం వల్ల ప్రాణాంతక ప్రమాదాలు సంభవించవచ్చు. ఎల్లప్పుడూ విద్యుత్ శాఖ సిబ్బంది సహాయం తీసుకోవాలి. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు నివారించడాని కి రైతులు, వినియోగదారులు పై సూచనలను కచ్చి తంగా పాటించాలని డీఈ నాగరాజు సూచించారు. విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు. జాగ్రత్తలతో ప్రమాదాలకు దూరం వర్షకాలంలో రైతులు, విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తగా ఉంటే విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిన, లూజ్గా ఉన్నా, ట్సాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు పోయినా సిబ్బందికి తెలియచేయాలి. వెంటనే తమ సిబ్బంది సరి చేస్తారు. ఏ సమస్య వచ్చినా తమ సిబ్బందికి సమాచారం ఇస్తే వెంటనే సరిచేస్తాం.తెలిసీ తెలియక సొంతంగా మరమ్మత్తుతులు చేపట్టి ప్రమాదాల భారీన పడొద్దు. మా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారిస్తారు. – డి.నాగరాజు, డీఈ నిర్మల్ కడెం మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్కుగురై ఆరు ఎడ్లు మృతి చెందాయి. లక్ష్మణచాంద మండలం పార్పెల్లి తాండాలో విద్యుత్ షాక్తో నాలుగు రోజుల క్రితం గేదెలు మృతిచెందాయి. గడిచిన నెల రోజుల్లో విద్యుత్షాక్తో పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. రైతులకు ప్రత్యేక సూచనలు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు: పంట చేనుల్లో ట్రాన్స్ఫార్మర్లను కనీసం 6 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలి. గడ్డి నివారణ: విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గడ్డి లేకుండా చూసుకోవాలి. ఇది పశువులను ఆకర్షించకుండా ప్రమాదాలను నివారిస్తుంది. పశువుల జాగ్రత్త: పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి. ఫెన్సింగ్ నిబంధనలు: పంటల చుట్టూ అటవీ జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసే ఫెన్సింగ్కు విద్యుత్ సరఫరా చేయడం చట్టవిరుద్ధం. రైతులు దీనిని నివారించాలి. చేపల పట్టుట: చేపలు పట్టడానికి విద్యుత్ వినియోగించడం కూడా చట్టవిరుద్ధం. ఇటువంటి చర్యలకు పాల్పడరాదు. -
ఇంకుడుగుంతల పరిశీలన
కుంటాల: మండలంలోని ఆయా గ్రామాల్లో ఈజీఎస్ కింద నిర్మించిన ఇంకుడుగుంతల ను సెంట్రల్ వాటర్ కమిటీ మెంబర్ సతీశ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతలు తోడ్పడుతా యని తెలిపారు. జలశక్తి అభియాన్లో భా గంగా కేంద్ర అవార్డు కోసం ఇంకుడుగుంత ల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైనాన్స్ మేనేజర్ సందీప్, ఎంపీడీవో లింబాద్రి, ఏపీవో నవీన్, టీఏలు మా ధురి, శశిధర్, జైసింగ్, దేశ్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలున్నారు. -
చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలి
నిర్మల్టౌన్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగా హన కలిగి ఉండాలని జిల్లా జడ్జి శ్రీవాణి సూ చించారు. గురువారం ప్రపంచ పర్యావరణ ది నోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ది వ్యపార్క్లో వాకర్స్కు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొక్క నాటారు. అనంతరం వివిధ చట్టాల గురించి తెలిపారు. బాలికల చట్టాల వినియోగాన్ని వివరించారు. కార్యక్రమంలో సెషన్స్ జడ్జి రాధిక, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, న్యాయవాదులు పాల్గొన్నారు. భూసమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలిమామడ: భూసంబంధిత సమస్యలపై దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. దరఖాస్తుల వివరాలను అధికా రులు రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినో త్సవం సందర్భంగా గ్రామంలో మొక్క నాటా రు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో సుశీల్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
● ప్రతిపనికీ ఎంతో కొంత ఇవ్వాల్సిందే ● ‘రెవెన్యూ’ సెక్షన్లోనే వరుస దాడులు ● తాజాగా ఏసీబీకి చిక్కిన ఉద్యోగులు ● గతంలోనూ ఆఫీసర్లు పట్టుబడిన వైనం
నిర్మల్: ‘అరె.. మున్సిపాలిటీలో పనుందిరా..’ అని ఎవరైనా అంటే వెంటనే.. ‘ఎంతోకొంత ఇస్తే నే పనైతుందిరా..’ అని టక్కున చెబుతున్నారంటే.. ఇక్కడ పైసావసూల్ ఏ స్థాయిలో ఉందో అ ర్థం చేసుకోవచ్చు. ఇందుకు వరుసగా జరుగుతు న్న అవినీతి నిరోధకశాఖ దాడులే నిదర్శనం. ఓవై పు ఇలా వరుసగా ఏసీబీ దాడులవుతున్నా.. ప్రధానంగా రెవెన్యూ సెక్షన్ తీరుమారక పోవడం గమనార్హం. ఇంటి నంబర్ ఇవ్వడానికి రూ.ఆరువేల లంచం తీసుకుంటూ గురువారం నిర్మల్ మున్సి పాలిటీ రెవెన్యూ విభాగం సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ సంతోష్, కాంట్రాక్ట్ ఉద్యోగి షో యబ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వాళ్లు చే యాల్సిన పనే అయినా.. అందుకు సరిపడా ప్రభుత్వం వేతనం ఇస్తున్నా.. అదనంగా లంచం ఇవ్వనిదే మున్సిపాలిటీల్లో ఏ పనీ చేయడం లేదు. దాడులు చేస్తున్నా.. కేసులు పెడుతున్నా.. జిల్లాలో అవినీతి నిరోధకశాఖ అధికారులు తర చూ దాడులు చేస్తున్నా.. కేసులు పెడుతున్నా.. వ సూలు రాజాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతీ పని కో రేటు కడుతూ వసూలు చేస్తూనే ఉన్నారు. తమ వద్ద పనికోసం వచ్చింది పెద్దోడా.. పేదోడా.. అనే తేడా కూడా చూడకుండా ఎంతో కొంత ఇవ్వాల్సిందే అంటున్నారు. ప్రధానంగా మున్సిపల్, రె వెన్యూశాఖల్లో ఈ తరహా లంచావతారులు చాలా మంది ఉన్నారు. ఇందులో కొంతమంది బాహా టంగానే డబ్బులు ఆశిస్తూ పనులు చేస్తుండగా, మరికొందరు కిందిస్థాయి, కాంట్రాక్ట్, అవుట్సో ర్సింగ్ సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నా రు. అధికారుల వసూళ్ల దాహానికి గతంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది బలయ్యారు. ‘రెవెన్యూ’లో దోపిడీపర్వం బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటాయన్న ట్లు డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడే లంచాల లెక్కలు ఉంటున్నాయి. రెవెన్యూశాఖ అంటేనే చాలా మంది అధికారులు, సిబ్బంది పైసా ఇవ్వనిదే పని చేయరన్న పేరుంది. ఇక మున్సిపాలిటీల్లోని రెవె న్యూ విభాగమూ అదే దారిలో నడుస్తోంది. సకా లంలో పన్నులు వసూలు చేయని ఈ సెక్షన్ పైసలు దండుకునే పనిలో ఉందన్న ఆరోపణలున్నా యి. ఒక్క నిర్మల్ మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలోనే ఏడాది వ్యవధిలో ముగ్గురు అధికారులు, సి బ్బంది ఏసీబీకి పట్టుబడ్డారంటే.. ఈ సెక్షన్లో ఏ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయో అంచనా వేయొచ్చు. ప్రధానంగా ఇంటినంబర్ల కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నా యి. ప్రభుత్వ స్థలాలకూ ఇంటినంబర్లు కేటాయిస్తూ.. కబ్జా చేసుకోవడానికి అవకాశమిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఏసీబీ దాడికి సస్పెన్షన్కు గురైన అధికారికి బాధ్యతలు ఇవ్వడంపైనా ఫిర్యాదులున్నాయి. అయినా కలెక్టర్, స్థానిక సంస్థలను చూసుకోవాల్సిన అడిషనల్ కలెక్టర్ స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థాయిని బట్టి వసూళ్లు నెలనెలా ప్రభుత్వం ఇచ్చే వేతనాన్ని చాలామంది అధికారులు, సిబ్బంది లెక్కలోకి తీసుకోవడం లే దు. తాము చేయాల్సిన పనే అయినా.. ‘ఈ పని చేస్తే నాకేంటి..’ అన్నట్లుగా కొందరు ఉన్నతాధికా రులే మాట్లాడుతున్నారు. కొంతమంది అధికారులు, సిబ్బంది అక్రమ సంపాదనపై సదరు కార్యాలయాల్లో పనిచేసేవాళ్లే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. లంచాలు తీసుకునే సార్లతోపాటు సర్కారు చేసే పనుల్లో వాటాలు చూసుకునే అవినీ తిపరులూ తక్కువేం లేరు. జిల్లాలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది దాకా ఎవరిస్థాయిని బట్టి వారు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.నిర్మల్ మున్సిపల్ కార్యాలయంజిల్లాలోని పలు ఘటనలు గతేడాది జనవరి 25న నిర్మల్ మున్సిపాలిటీ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్వో) గంగాధర్, బిల్కలెక్టర్ నవంత్ ఓ ఇల్లు అసెస్మెంట్కు సంబంధించి రూ.3,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గతేడాది నవంబర్ 13న నిర్మల్ మున్సిపల్లో ఇన్చార్జి ఆర్ఐ, ఎస్టాబ్లిష్మెంట్ (సీ–సెక్షన్)ను కూడా చూస్తున్న జూనియర్ అసిస్టెంట్ షాకీర్ఖాన్ తమ విభాగంలోనే పనిచేసే బిల్కలెక్టర్ భరత్కు సంబంధించి సర్వీస్బుక్లో నమోదు కోసం రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తాజాగా ఇంటినంబర్ కేటాయింపు కోసం రూ.6వేలు వసూలు చేస్తూ ఇన్చార్జి ఆర్ఐ సంతోష్, అవుట్సోర్సింగ్ సిబ్బంది షోయబ్ ఏసీబీకి పట్టుబడ్డారు. -
నిర్మల్
నాణ్యతలేని విత్తనం? ఏటా నాణ్యతలేని విత్తనాలతో జిల్లా రైతులు నష్టపోతూనే ఉన్నారు. కొనుగోలు సమయంలో దుకాణాల నుంచి రశీదులు తీసుకున్నా పరిహారం అందడం లేదు.10లోu శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 20252020 ఏప్రిల్లో జిల్లాలో తొలి కేసు జిల్లాలో 2020 ఏప్రిల్లో తొలి కరోనా కేసు నమోదైంది. లాక్డౌన్తో పాటు రకరకాల పద్ధతుల ద్వారా కరోనాను ప్రభుత్వం కట్టడిచేసింది. తిరిగి 2021 మార్చి నెలలో కరోనా రెండవ వేవ్ విజృంభించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా కొందరు మత్యువాత పడిన విషయం తెలిసిందే. 2021 ఏడాది చివరలో కరోనా జీరోకు పడి పోయింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్తో పెద్ద ప్రమాదం లేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలిభైంసాటౌన్: డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. గురువారం పట్టణంలోని గాంధీగంజ్లో పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్లు, ఇతర వివరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. డీల ర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని సూ చించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏడీఏ వీణ, ఏవోలు రవి, గణేశ్ ఉన్నారు. 20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఒక వార్డులో 20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినవారికి ఈ వార్డులో చికిత్స అందిస్తారు. ప్రతీ బెడ్కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. కరోనా నివారణకు అవసరమైన మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బెడ్లు స్వీయ నియంత్రణ పాటించాలి ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. కరోనా వైరస్పై జిల్లా వైద్యాశాఖ అప్రమత్తంగా ఉంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహిస్తాం. జిల్లాలో ఇంకా కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేశాం. – డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వో చికిత్స అందించేందుకు సిద్ధం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాం. జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే రోజుకు 800–900 వరకు అవుట్ పేషెంట్లు, 200 మంది ఇన్పేషెంట్లకు చికిత్స చేస్తున్నాం. కోవిడ్, సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేకవార్డులు సిద్ధం చేస్తున్నాం. అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెట్టాం. – గోపాల్సింగ్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్మల్చైన్గేట్: కొద్దిరోజుల క్రితం దేశంలోకి కోవిడ్ భూతం మళ్లీ ప్రవేశించింది. మరోవైపు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే కాలమిది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హె చ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ వైద్యకళాశాల అనుబంధ ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తోంది. నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 280 పడకలుండగా అన్నింటికీ ఆక్సిజన్ కనెక్షన్ ఉంది. 10 వేల లీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. 20 పడకల కోవిడ్ వార్డును అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేశారు. భైంసా ఏరియా ఆస్పత్రిలో 100 పడకలు ఉండగా ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అన్ని ఆస్పత్రుల్లో మందులు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. నిర్మల్తో పాటు జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు కోవిడ్ పరీక్ష కిట్లు రావాల్సి ఉంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కా న్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొ త్తంగా కరోనా కొత్త వేరియంట్తోపాటు సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. అప్రమత్తమైన అధికారులు కోవిడ్, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా అధి కార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ పరీక్షల నిర్వహణ, చికిత్స కు ఏర్పాట్లు చేస్తున్నారు. మందులు, కిట్లు మొదలైనవి సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో ప్రత్యేకవార్డు సిద్ధం చేస్తున్నారు. వార్డులో బెడ్లు, ఫ్యాన్లు, వెలుతురు వచ్చేలా మరమ్మతులు చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరాకు పైపులైన్లు సరి చేస్తున్నారు. సీజనల్ వ్యా ధులకు గురయ్యే వారికోసం జీజీహెచ్లో 20 పడకలు, భైంసా ఏరియా ఆస్పత్రి, ఖానాపూర్, నర్సాపూర్ (జి) పీహెచ్సీల్లో బెడ్లు సిద్ధం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో జ్వరాలు మే మూడో వారం నుంచి వాతావరణం చల్లబడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలు బు, జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలోని ఫీవర్ వార్డులోనూ పదుల సంఖ్యలో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు గానే పరిగణించి వైద్యాధికారులు చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అనుకుని భయపడవద్దని, వాతా వరణ మార్పులతోనే సీజనల్ వ్యాధులు వస్తుంటాయని వారు చెబుతున్నారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ‘పది’ పరీక్షలకు తొమ్మిది మంది గైర్హాజరునిర్మల్ రూరల్: జిల్లాలో గురువారం నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు మొత్తం 35మంది విద్యార్థులకు 26మంది హాజరు కాగా తొమ్మిది మంది గైర్హాజరయ్యా రు. జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్లోగల బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి పరమేశ్వర్ తనిఖీ చేశారు. గోరక్ష చట్టాలు అమలు చేయాలినిర్మల్చైన్గేట్: చట్టవిరుద్ధంగా కొనసాగుతు న్న గోవధ శాలలను మూసి గోరక్ష చట్టాలను అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం గోరక్ష జిల్లా సంయోజక్ జట్టి వెంకటేశ్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో గుల్జార్ మార్కెట్, బాగులవాడ, పింజరు గుట్ట, గాజులపేట్, ఈద్గం, సోఫీనగర్, విశ్వనాథ్పేట్, బుధవార్పేట్, బోయవాడ ప్రాంతాల్లో జరుగుతున్న గోవధ ను వెంటనే ఆపాలని కోరారు. ఆక్రమణలో ఉన్న గోచర భూములను విముక్తి చేసి, గు ర్తింపు పొందిన గోశాలలకు నిధులు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. గోఆధారిత వ్య వసాయం చేస్తున్న రైతులు, గోపోషకులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని కోరా రు. జన సమూహాల మధ్య పశుకళేబరాల నుంచి నూనె, టీ పొడి లాంటివి తయారు చేసే కర్మాగారాలు వెంటనే మూసివేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరారు. అందుబాటులోకి వచ్చిన సీటీ స్కాన్ యూనిట్ నిర్మల్చైన్గేట్: మొక్క నాటుతున్న అభిలాష అభినవ్నిర్మల్ రూరల్: మొక్క నాటుతున్న డీఈవోన్యూస్రీల్ ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో కలెక్టర్ అభిలాష అభినవ్ -
● రూ.6వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ● ప్రోత్సహించిన ఇన్చార్జి ఆర్ఐ కూడా.. ● ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఆఫీసర్లు
ఆశపడ్డారు.. పట్టుబడ్డారునిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. బాధితుడు తన గృహానికి ఇంటి నంబర్ కేటాయించడానికి అవుట్ సోర్సింగ్ ఉ ద్యోగి షోయబ్కు రూ.6వేలు ఇస్తుండగా అధి కారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆది లాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ ఇంటి యజమాని ఇటీవల ఇంటి నిర్మాణం పూర్తి చేశాడు. ఆ ఇంటికి సంబంధించిన అసిస్మెంట్ (ఇంటి నంబర్) కోసం చలానా కట్టి మున్సిపల్ రెవెన్యూ సెక్షన్లోని సంబంధిత అ ధికారులను కలిశాడు. ఇందుకు రూ.6వేలు లంచం ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్ షోయబ్ అహ్మద్ డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఆ యజ మాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వా రి సూచన మేరకు ఆ యజమాని బిల్ కలెక్టర్కు లంచం ఇస్తుండగా గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారులు షోయబ్ను విచారించగా.. లంచం తీసుకునేలా సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ ఆర్ఐ సంతోష్ ప్రోత్సహించారని తెలిపాడు. ఈ మేరకు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎ స్పీ తెలిపారు. ప్రభుత్వశాఖల ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 లేదా 9440446108 నంబర్లకు తెలుపాలని, సమాచారం ఇచ్చిన వా రివివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నిర్మల్ మున్సిపల్లో ఏసీబీకి పట్టుబడ్డ ఇన్చార్జి ఆర్ఐ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి -
మిల్లర్లపై చట్టపరమైన చర్యలు
నిర్మల్చైన్గేట్: దీర్ఘకాలంగా సీఎంఆర్ ధాన్యాన్ని ఇవ్వని రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారుల ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందే సీఎంఆర్ (కస్టమర్ మిల్లింగ్ రైస్) ధా న్యాన్ని దీర్ఘకాలంగా ఇవ్వని రైస్మిల్లర్లపై రెవె న్యూ రికవరీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కొంతమంది మిల్లర్లకు నోటీసులు జారీ చేసి, వారి ఆస్తులను గుర్తించి బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఇంకా బకాయిలున్న మిల్లర్లను గుర్తించి వారి ఆస్తులను బ్లాక్ చే యడంతో పాటు, బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సిందిగా సూచించారు. భవిష్యత్లో ఇలాంటి మిల్లర్లకు బ్యాంక్లు ఎలాంటి రుణాలు మంజూరు చేయకూడదని సూచించారు. మండ ల స్థాయిలో విత్తనాల దుకాణాలపై నిరంతర త ని ఖీలు నిర్వహించాలని, నకిలీ విత్తనాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆ ర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
● భూసారం పెరిగే అవకాశం ● అధిక దిగుబడులు సాధ్యం
లక్ష్మణచాంద: పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించే అవకాశమున్నట్లు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఏటా ఒకే రకమైన పంట సాగు చేస్తే భూమిలో సారం క్రమంగా తగ్గి దిగుబడులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. పంట మార్పిడి విధానంతో నేలలో పోషకాలు వృద్ధి చెందుతాయని, తద్వారా దిగుబడి పెరిగే అవకాశముంటుందని పేర్కొంటున్నారు. చీడపీడలకు అడ్డుకట్ట ఒకే పంటను ఒకే పొలంలో వరుసగా సాగు చేస్తే చీడపీడల ఉధృతి పెరుగుతుంది. పురుగు జీవితచక్రం నిరాటంకంగా ముగించుకుని పంటలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశముంటుంది. పంట మార్పి డి చేసినప్పుడు పురుగు జీవితచక్రం నాశనమవుతుంది. వేగంగా వృద్ధి చెందే కొన్ని రకాల పురుగుల ను పంట మార్పిడి విధానంతో అదుపు చేయవ చ్చు. ఒకే లోతు వ్యవస్థ కలిగిన పత్తి, మిరప, వాణిజ్య పంటలను పంట మార్పిడి చేయకుండా సాగు చేస్తే ఒకే లోతు పొర నుంచి పోషకాలు తీసుకోవడంతో నేల పూర్తిగా నిస్సారమవుతుంది. వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న పంటలు నేల పైపొరల నుంచి పోషకాలను గ్రహిస్తాయి. నేల భౌతిక లక్షణాలు, స్వభావం దెబ్బతినకుండా ఉండటానికి చీడపీడల ఉధృతి నిరోధానికి పంట మార్పిడి చేయాలి. ప్రయోజనాలివే.. వరి తర్వాత మినుము, పెసర, శనగ లాంటి పంటలు సాగు చేస్తే వరిలో వచ్చే సుడి దోమ, టుంగ్రో వైరస్ తెగుళ్లను నివారించవచ్చు. పత్తి వేసిన పొలంలో మొక్కజొన్న, జొన్న, నువ్వు, మినుము లాంటి పంటలు సాగు చేస్తే పత్తి పంటను ఆశించే లద్దె పురుగు, పచ్చ పురుగుల బెడదను అరికట్టవచ్చు. జొన్న, మొక్కజొన్న తర్వాత కంది సాగు చేస్తే కా యతొలుచు పురుగు ఉధృతి తగ్గుతుంది. వరి వేసిన పొలాల్లో ముందుగా పుప్పు ధాన్యాలు సాగు చేస్తే నేల సారవంతమవుతుంది. వేరుశనగలో ఆకుముడతను నివారించేందకు పప్పు జాతికి చెందిన పంటలతో మార్పిడి చేయాలి. కంది, మిరప పంటల్లో ఎండు తెగులు నివారణకు జొన్న, మొక్కజొన్న పంటలతో మార్పిడి చేయాలి. నులిపురుగు సమస్య అ ధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప లాంటి పంటల సాగును కొన్ని సంవత్సరాల వరకు ఆపా లి. ఆహార పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలను పప్పు జాతి పంటలైన పెసర, మినుము, వేరుశనగ లాంటి పంటలతో పంట మా ర్పిడి చేయాలి. ఆహార వాణిజ్య పంటలను పశుగ్రా స పంటలతో ఒకసారి, పప్పు జాతి పంటలతో మ రోసారి పంట మార్పిడి చేయడం లాభదాయకం. మార్పిడితో మంచి దిగుబడి అన్నదాతలు ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వే యొద్దు. పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. దీంతో నేల సారం పెరిగి పంటలకు పోషకాలు స మృద్ధిగా అందుతాయి. తద్వారా మంచి ది గుబడులు సాధించవచ్చు. రోగ కారక పురుగుల జీవితచక్రం ముగియడంతో పంటలపై రోగాల ఉధృతి తగ్గుతుంది. – వసంత్రావు, ఏవో, లక్ష్మణచాంద -
క్యాన్సర్ రోగులకు ఉపశమనం
● నిర్మల్లో చికిత్సకు ఏర్పాట్లు ● పెద్దాస్పత్రిలో ప్రత్యేక వార్డులు ● త్వరలో అందుబాటులోకి సేవలునిర్మల్చైన్గేట్: జిల్లాలోని క్యాన్సర్ రోగులకు మంచిరోజులు రానున్నాయి. చాపకింద నీరులా మానవాళిని కబళిస్తున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు సర్కారు బోధనాస్పత్రుల్లో ప్రత్యేక సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని వై ద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో 20 చొప్పున పడకలతో జెరియాట్రిక్ వార్డులు, క్యాన్సర్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. క్యాన్సర్ కేర్ కేంద్రంలో 10 పడకలను వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు.. మిగతా 10 పడకలను పాలియేటివ్ కేర్ (పక్షవాతంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగించే) నిమిత్తం వినియోగించనున్నారు. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో ఇదివరకే పాలియేటివ్ కే ర్ కేంద్రం ఉంది. ఇక్కడ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకూ చికిత్స అందిస్తుండగా సేవలు విస్తరించనున్నారు. జెరియాట్రిక్ వార్డులు, క్యాన్సర్ కేర్ కేంద్రాలను ఇటీవల ప్రారంభించాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. స్థానికంగానే చికిత్స జిల్లా జనరల్ ఆస్పత్రిలో త్వరలో అందుబాటులోకి రానున్న జెరియాట్రిక్ వార్డు, కీమోతెరపీ లాంటి సే వల కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఇద్దరు వై ద్యులు, ఆరుగురు నర్సింగ్ ఆఫీసర్లు ప్రత్యేకంగా హైదరాబాద్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. జిల్లా జ నరల్ ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రా గానే చాలామంది క్యాన్సర్ బాధితులు రెగ్యులర్ చె కప్లకు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే వీరి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ పొందన్నారు. బాధితులు పెరుగుతున్నందునే.. కేన్సర్ బారిన పడిన కొందరికి కీమోతోపాటు రేడియేషన్ థెరపీ అవసరమవుతుంది. కానీ.. ప్రభుత్వ పరంగా ఆ సౌకర్యం లేకపోవడంతో హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తోంది. నాన్ కమ్యూనబుల్ డిసీజ్ ప్రోగ్రామ్ ద్వారా కేన్సర్ బాధితులను గుర్తిస్తుండగా.. మహిళా ఆరోగ్య కార్యక్రమం ద్వారా బ్రెస్ట్, ఓ రల్, సర్వైకల్ కేన్సర్ బాధితుల గుర్తింపు కొనసాగుతోంది. వీరిలో వ్యాధి ప్రారంభ దశలో ఉంటే జిల్లాలోనే చికిత్స అందిస్తుండగా, సీరియస్ కేసులకు ప్రత్యేకంగా వార్డు లేదు. దీంతో కీమో, రేడియేషన్ థెరఫీ కోసం వారిని హైదరాబాద్కు పంపిస్తున్నా రు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేన్సర్ బాధితులు పె రుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడిక ల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో ప్రత్యేకసెంట ర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జెరియాట్రిక్ వార్డులతో ప్రయోజనాలు మధుమేహం, హైపర్టెన్షన్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లాంటివి ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు ఉండటంతో వృద్ధాప్యంలో వాటిని ఎదుర్కోవటం కష్టతరమవుతోంది. అలాంటివారికి ప్రత్యేక వార్డుల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు (జెరియాట్రిషన్లు) అందుబాటులో ఉంటారు. వృద్ధులకు సరిపడా ఔషధాలు, చికిత్స అందిస్తారు. శారీరక, మానసిక, సామాజిక, ఆరోగ్య అంశాలను సమగ్రంగా పరిశీలిస్తారు. వృద్ధులు ఎదుర్కోబోయే సమస్యలను ముందస్తుగానే గుర్తిస్తారు. ప్రతీ రోగి అవసరాలకు అనుగుణంగా చికిత్స విధానం రూపొందిస్తారు. ఒంటరిత నం, ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక సమస్యల ను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తారు. వృద్ధాప్యంలో ఆరో గ్యకరమైన జీవనశైలి కోసం వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేక సంరక్షణతో రోగులు త్వరగా కోలుకుంటారు. కీమోథెరపీ, కౌన్సెలింగ్ ఒకేచోట..రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచటంతో పాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడే సహజ సామర్థ్యాన్ని పెంచేందుకు క్యాన్సర్ కేర్ కేంద్రాలు దోహదపడతాయి. క్యాన్సర్కు స్థానికంగా చికిత్స అందుబాటులో ఉండటంతో దూరప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. సమయం, డబ్బు ఆదా అవుతాయి. ప్రత్యేక క్యాన్సర్ కేర్ కేంద్రాలు ఉండటంతో రోగ నిర్ధారణ, చికిత్స త్వరగా ప్రారంభమవుతాయి. ఇవి రోగ నియంత్రణకు సహాయపడతాయి. క్యాన్సర్ చికిత్సలో నైపుణ్యం కలిగిన వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటారు. ఈ కేంద్రాలు క్యాన్సర్ గురించి సమాజంలో అవగాహన కల్పించటానికి, నివారణ చర్యలను ప్రోత్సహించటానికి తోడ్పడతాయి. కీమోథెరపీ, కౌన్సెలింగ్ లాంటి సేవలు ఒకేచోట అందుబాటులో ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి జిల్లా జనరల్ ఆస్పత్రిలో త్వరలో ప్రారంభించనున్న జెరియాట్రిక్, క్యాన్సర్ చికిత్స సేవలను జిల్లా ప్రజలు సద్విని యోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. చాలామంది నిరుపేదలకు ఈ సేవలు ఉచితంగా అందనున్నాయి. – రాథోడ్ సునీల్ కుమార్, జిల్లా జనరల్ ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ వార్డులు సిద్ధం చేశాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సూచన ల మేరకు త్వరలోనే జి ల్లా ప్రజలకు ఈ సేవల ను అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికో సం వైద్యులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించాం. – డాక్టర్ గోపాల్సింగ్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
భూసమస్యలపై దరఖాస్తు చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్లోకేశ్వరం: భూసమస్యల పరిష్కారానికి దరఖా స్తులు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం మండలంలోని ఎడ్దూర్, వట్టోలి గ్రామాల్లో నిర్వహించిన భూభారతి సదస్సులకు హాజరయ్యారు. రైతుల దరఖాస్తుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అర్లి నుంచి ఎడ్డూర్ వరకు అధ్వానంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి, బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. అదనపు కలెక్టరు కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీ ల్దార్ సర్వరాజ్ అహ్మద్, డీటీ రవీందర్ ఉన్నారు. నర్సాపూర్ (జి): మండలంలోని బూరుగుపల్లి (కె) గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు ని ర్వహించగా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరయ్యారు. అంతకుముందు సమీప ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలను సందర్శించారు. బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో చర్లపల్లిలో 12, బూరుగుపల్లి (కె)లో ఒక దరఖాస్తు వచ్చిన ట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీటీ వాహిదొద్దీన్, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేశ్కుమార్ పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలిగించొద్దు నిర్మల్చైన్గేట్: రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో సూచించారు. సోష ల్ మీడియాలో వైరలైన గ్రామ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వీడియోపై జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెవె న్యూ సదస్సులో రైతుపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్సైని సస్పెండ్ చేసి, విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3నుంచి 20వరకు రెండోవిడత సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 36 రెవెన్యూ గ్రామాల్లో వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. -
నిర్మల్
పర్యావరణమే పరమౌషధం! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గుతుండగా ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తంజేస్తున్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కథనం.. పంట మార్పిడి విధానమే మేలు గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 202512లోu ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి భైంసాటౌన్: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు ఫోన్లో సూచనలు చేశారు. అలాగే భరోసా కేంద్రంలో కుటుంబ కలహాలకు సంబంధించి కేసుల్లో ఇరు పార్టీలకు కౌన్సెలింగ్ ఇప్పించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు గోపీనాథ్, నైలు, మల్లేశ్, డీఎస్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఎస్సైలు శ్రీనివాస్, శంకర్, మహిళా ఎస్సై పెర్సిస్, షీ టీమ్ సిబ్బంది, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ పాల్గొన్నారు. నిర్మల్: ఊరూరా.. వాడవాడలా.. జిల్లా నలుమూలలా గంజాయి భూతం వ్యాపించింది. యువతరా న్ని మత్తుకు బానిసలుగా మార్చి, వారి జీవితాలను నాశనం చేస్తోంది. దారుణమేమంటే.. బడీడు పిల్ల ల భవితనూ పీల్చేస్తోంది. నాలుగు డబ్బులు సంపాదించాలన్న కొంతమంది స్వార్థం సమాజాన్ని నాశ నం చేసే దిశగా తీసుకెళ్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా గంజాయిదందా విస్తరించడం ఆందోళనకరమైన విషయం. కొందరి స్వార్థం.. సమాజం నాశనం కుభీర్ నుంచి కడెం దాకా జిల్లావ్యాప్తంగా గంజా యి గుప్పుమంటోంది. పోలీసులు, ఎక్సైజ్ అధికా రులు చేస్తున్న దాడుల్లో మారుమూల పల్లెలు, తండాల్లో గంజాయి సాగుతో పాటు మత్తుమందును పీలుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే కొన్ని శివారు ప్రాంతా లు గాంజా అడ్డాలుగా మారాయి. అడ్డదారుల్లో ఎ క్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలన్న కొంతమంది స్వార్థానికి సమాజమే నాశనమవుతోంది. తక్కువ పైసలతో ఎక్కువ మత్తు వస్తుందంటూ యువతను గంజాయివైపు ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల గంజాయితో పాటు మత్తుమందు ఇంజక్షన్ల ను విక్రయిస్తున్న ముఠా ఏకంగా జిల్లాకేంద్రంలోనే వెలుగులోకి రావడం తెలిసిందే. యువతతో మత్తు ఎక్కించడమే కాకుండా వారినే విక్రేతలుగా మారుస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రతో పాటు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి గంజాయి వస్తోంది. గతంలో కొంతమంది యువకులు జిల్లా నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లి గంజాయి విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బడీడు పిల్లలకూ.. జిల్లాలో గంజాయి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యువత వరకే ఆగిపోకుండా ఈ మత్తు బడీడు పిల్లలకూ చేరుతోంది. జిల్లాకేంద్రంతో పాటు పలు గ్రామాల్లోనూ బడిపిల్లలు గంజాయి బారినపడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది గంజాయికి బానిసలుగా మారి, డబ్బుల కోసం తమ ఇంట్లోనే దొంగతనాలు చేసిన దాఖలాలున్నాయి. పలువురు యువకులు రో డ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలూ కోల్పోయా రు. ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్ల లను డీ అడిక్షన్ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. స్థాని కంగా కాకుండా నిజామాబాద్, హైదరాబాద్ ఆస్పత్రులకు వెళ్లి మానసిక చికిత్స చేయిస్తున్నారు. పెరుగుతున్న ఫిర్యాదులు జిల్లాలో రోజురోజుకూ గంజాయి తీవ్రతతో పాటు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల సమష్టి నిర్ణయం తీసుకున్నారు. గంజాయి విముక్త నిర్మల్ జిల్లా చే యాలన్న లక్ష్యంతో ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్తుమందులపై ఉక్కుపాదం మోపేందుకు అందరి సహకారం కావాలంటున్నా రు. ఇప్పటికే ‘గాంజా గస్తీ’ పేరిట ఎస్పీ జానకీషర్మి ల పకడ్బందీగా గంజాయి అమ్మకాలపై దాడులు చే పడుతున్నారు. మత్తుపదార్థాలకు సంబంధించి స మాచారం 8712659599 నంబర్లో ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. ఈ నంబర్కు వస్తున్న ఫిర్యాదులు, వరుస తనిఖీల ఆధారంగా కొంతకాలంగా చాలా మంది గంజాయి విక్రేతలను పట్టుకుంటున్నారు. అవగాహన కల్పించేందుకు.. అవగాహన లోపం కారణంగానే ఎక్కువమంది యువకులు, విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నట్లు తేలడంతో ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’లో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అభిలాషఅభినవ్ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ బృందానికి సంబంధించిన వాహనా నికి పచ్చజెండా ఊపారు. జిల్లా పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి బృందాలతో జిల్లా నలుమూలలా గంజాయితో కలిగే అనర్ధాలతో పాటు బాల్యవివాహాలు, బాలకార్మికులు తది తర అంశాలపైనా అవగాహన కల్పించనున్నట్లు క లెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో విష్ణువర్ధన్, కళాకారులు సుదర్శన్, నాగరాజు, రఘునాథ్, లక్ష్మణ్, మాధవి తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ ఫ్రీ నిర్మల్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్‘పది’ సప్లిమెంటరీకి ఏడుగురు గైర్హాజరు నిర్మల్ రూరల్: జిల్లాలో బుధవారం నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 11 మందికి గాను నలుగురు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల నిర్వహణ అధి కారి ముడారపు పరమేశ్వర్ తనిఖీ చేశారు. న్యూస్రీల్డీఎస్సీ–2024 టీచర్కు షోకాజ్ నోటీస్! నిర్మల్ రూరల్: డీఎస్సీ–2024లో నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందినందుకు రాష్ట్ర విద్యాశా ఖ అధికారులు ఓ ఉపాధ్యాయునికి షోకాజ్ నో టీస్ జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశా రు. జిల్లాకు చెందిన గైని సునీల్కుమార్ డీఎస్సీ–2024లో ఎస్జీటీ ఉద్యోగం పొందాడు. సర్టిఫికె ట్ వెరిఫికేషన్ సమయంలో అతను నకిలీ పత్రాలు అందించి ఉద్యోగం పొందినట్లు విద్యాశాఖ కు ఫిర్యాదులు అందాయి. రాష్ట్రంలోని ఇతర జి ల్లాల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు అందడంతో విద్యాశాఖ అధికారులు క్షుణ్ణంగా వి చారణ చేపట్టారు. విచారణలో గైని సునీల్ అందించిన స్పెషల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. దీంతో స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉపాధ్యాయుని అనర్హుడిగా ప్రకటించి షోకాజ్ నోటీస్ జారీ చేయాల్సిందిగా డీఈవో రామారావును ఆదేశించారు. జిల్లాలో ‘మత్తు’పై ఉక్కుపాదం గంజాయి రహిత జిల్లాకు కృషి కలెక్టర్, ఎస్పీ సంయుక్త కార్యక్రమం ఊరూరా.. వాడవాడలా అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ ‘గాంజా గస్తీ’ చేపడుతున్న ఎస్పీ మత్తుతో భవిష్యత్ అంధకారం మత్తుపదార్థాల కారణంగా యువత భవిష్యత్ అంధకారమవుతోంది. ఉజ్వల భవిష్యత్ను చేతులారా నాశనం చేసుకోవద్దు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన ప్రారంభించిన ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ కార్యక్రమంలో అందరం భాగస్వాములమవుదాం. మత్తురహిత జిల్లాకు కృషిచేద్దాం. – అభిలాషఅభినవ్, కలెక్టర్ కలిసికట్టుగా కృషి చేస్తేనే.. జిల్లాలో మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలపై శాఖాపరంగా సీరియస్గా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే ‘గాంజా గస్తీ’ చేపడుతున్నాం. యువతను కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ ‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ కోసం ఐక్యంగా ముందుకురావాల్సిన అవసరముంది. – జానకీషర్మిల, ఎస్పీ -
రైతుల చెంతకే రెవెన్యూ సదస్సులు
● కలెక్టర్ అభిలాష అభినవ్లక్ష్మణచాంద/నిర్మల్ రూరల్: రైతుల భూసమస్యలు పరిష్కరించడానికి రైతుల చెంతకే రెవెన్యూ అధికారులు వస్తారని సదస్సులు ఏర్పాటు చేస్తారని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని కనకాపూర్లో, నిర్మల్ రూరల్ మండలం అక్కపూర్లో మంగళవారం నిర్వహించిన రెవెన్యు సదస్సులకు అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్తో కలిసి హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన కలెక్టర్కు ఎంపిడీవో రాధ కనకాపూర్ నర్సరీలో పెంచిన పైన్ ఆపిల్ మొక్క అందించి స్వాగతం పలికారు. తమ నర్సరీలో పెంచిన మొక్కతో స్వాగతం పలకడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు తనకు ఇద్దరు కుమారులని సమానంగా భూములు పంపకం చేసి ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించగా స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ అన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గతంలో అన్నదాతలు తమ భూసమస్యల పరిష్కారానికి రోజుల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే వారని, సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డి సూచనల మేరకు జిల్లాలలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతి పోర్టల్తో రైతులు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు. గ్రామాలలో సదస్సులు నిర్వహించడానికి రెండు రోజుల ముందుగానే గ్రామంలో చాటింపు చేయించి రైతులకు తెలిసేలాగా చేస్తున్నామన్నా రు. తమ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సమయంలో ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలిపితే రశీదు పొందాలని సూచించారు. ఈనెల 20వ తేదీ వరకు రెండో విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. రెవెన్యూ అధికారులు దరఖాస్తులను స్వీకరించి, వెంటనే రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. కుంటాల మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సదస్సులు నిర్వహించామని, అక్కడ వచ్చిన సమస్యలలో 50 శాతం పరిష్కరించామని తెలిపారు. సదస్సులలో తీసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరిస్తామని వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూసమస్యలు పరిష్కరించు కోవాలని సూచించారు. అక్కాపూర్ పాఠశాలలో తరగతిగదులు, ఇంకుడు గుంత, లైటింగ్ వంటి వసతులను కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధ, ఎంపీవో అమీర్ఖాన్ పాల్గొన్నారు. -
● కొన్ని నిర్మాణ దశలో.. ● మరికొన్ని శిథిలావస్థలో.. ● తాత్కాలిక రోడ్లతో పొంచి ఉన్న ప్రమాదం
ఖానాపూర్ :ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్, అంబేడ్కర్ నగర్ శివారు ప్రాంతాల్లో రెంకొని వాగుపై సుమారు రూ.10 కోట్లతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. అధికారుల అలసత్వం కారణంగా తుది దశ పనులు సకాలంలో పూర్తి కాలేదు. ఈ వంతెన 20కి పైగా గ్రామాలతోపాటు మంచిర్యాల, జన్నారం వైపు వెళ్లే ప్రధాన రహదారిగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో చిన్నపాటి వరదలకే గతంలో తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు నెలల తరబడి రాకపోకలు నిలి చిపోయాయి. ఈ ఏడాది కూడా వానాకాలం మొదలైనా వంతెన పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. సుభాష్నగర్లో.. సుభాష్నగర్ శివారులో హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు మీదుగా వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ ఏడాది కూడా ఆ పరిస్థితి తప్పేలా లేదు. గతంలో వర్షాల కారణంగా ఈ రోడ్డు పలుమార్లు కొట్టుకుపోయాయి. దీంతో వాగు అవతలి వైపున ఉన్న మైనారిటీ స్కూల్ విద్యార్థులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిహద్దు గ్రామాల్లో లో–లెవల్ వంతెనలు.. తానూరు : మహారాష్ట్ర సరిహద్దులోని ఝరి(బి), ఝరి(బి) తండా, మొగ్లి, మసల్గా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో లో–లెవల్ వంతెనల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే వాగులో వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. పొలాలు, చేల వద్దకు ఎరువులు తీసుకెళ్లడం కష్టమవడంతో రైతులు ముందస్తుగా నిల్వలు చేసుకుంటున్నారు. భారీ వర్షాలు కురిస్తే మొగ్లి, మసల్గా గ్రామాల నుంచి మండల కేంద్రమైన తానూరుకు చేరాలంటే 10 కిలోమీటర్లు చుట్టుకోవాల్సి వస్తోంది. అధికారులు హైలెవల్ వంతెనలు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి
● డీఈవో రామారావు నిర్మల్ రూరల్: వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని డీఈవో రామారావు సూచించారు. డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం నాటికి బడులన్నిటినీ శుభ్రపరచి రెడీ చేయాలన్నారు. ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇందులో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే వసతులు, సౌకర్యాలను వివరించాలని సూచించారు. ఇందులో అధికారులు రమణారెడ్డి, సమన్వయకర్తలు రాజేశ్వర్, నరసయ్య, ప్రవీణ్కుమార్, సలోమి కరుణ, శ్రావణి, మహేశ్వర్, కృష్ణవేణి, ఎంఈవోలు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
కడెం: నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడి సాధ్యమని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.శేషు, మండల వ్యవసాయాధికారి పి.దినేశ్ అన్నారు. మండలంలోని పెద్దబెల్లాల్ రైతు వేదికలో ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. సాగులో నాణ్యమైన విత్తనం ప్రాముఖ్యతను రైతులకు తెలియజేశారు. విత్తనాలను పంపిణీ చేశారు. ఇందులో ఏఈవోలు నవీన్, జె.సాయికృష్ణ, డి.శాలిని, రైతులు పొద్దుటూరి సంతోష్ రెడ్డి, అకుల శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
అంతర్జాతీయ సదస్సులో.. ఐఐటీ హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో బాసర ఆర్జీయూకేటీ నుంచి 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు.8లోu బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రుతిక్కుమార్ ప్రతిభ కుంటాల: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన అట్టోలి రుతిక్కుమార్ ప్రతిభ కనబర్చాడు. కుంటాలకు చెందిన చింత ప్రభ–అట్టోలి సంజీవ్కుమార్ దంపతుల రెండో కుమారుడు రుతిక్కుమార్ సోమవారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 874 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 137 ర్యాంకు సాధించాడు. తండ్రి సంజీవ్ కుమార్ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మామడ మండలంలో వాటర్షెడ్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. తల్లి ప్రభ కుభీర్ మండలంలోని గోడాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. రుతిక్ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు నిర్మల్ వాసవి పాఠశాలలో, ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివి పరీక్షలు రాసి అర్హత సాధించాడు. సతీశ్.. ఊళ్లో ఉంటే పిల్లల చదువులకు కష్టమవుతుందని కుటుంబంతో కలిసి నిర్మల్ వచ్చి అద్దెకుంటున్నాడు. ఉన్న పొలం కౌలుకు ఇచ్చి, జిల్లాకేంద్రంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా కష్టపడుతున్నాడు. భార్య టైలరింగ్ చేస్తూ చేదోడుగా నిలుస్తోంది. పాప, బాబు ఇద్దరినీ పేరున్న స్కూల్లోనే వేశారు. ఈమధ్య సరైన మార్కెట్ లేకపోవడంతో ఉద్యోగం, పార్ట్టైం సంపాదన ఇబ్బందికరంగా మారింది. ఇంతలోనే జూన్ రానే వచ్చింది. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలంటే ఆ స్థాయిలో ఫీజుల చెల్లింపులు చదివించాల్సిందే. ఏ ఉద్దేశంతోనైతే ఊరు వదిలి పట్టణం వచ్చామో..! అది నెరవేరుతుందా..! అన్న డైలామాలో పడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేసేది ఫీజుల కోసం బంగారం తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. బడీడు పిల్లలున్న ప్రతీ ఇంట్లో ఇప్పుడు వారి చదువులు, ఫీజుల ముచ్చటే నడుస్తోంది.నిర్మల్: పాఠశాలలు మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళన పెరుగుతోంది. పరిమిత వసతులు, సామాన్యమైన బోధనా పద్ధతులతో నడిచే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపేందుకు ఇష్టపడక, అధిక ఫీజులతో కూడిన ప్రైవేటు చదువులు కొనేందుకు కష్టపడుతున్నారు. విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారడం, ఫీజుల భారం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు తల్లిదండ్రులను కలవరపరుస్తున్నాయి. తల్లిదండ్రులకు ఆర్థిక భారం విద్యా సంవత్సరం ఆరంభం అంటేనే తల్లిదండ్రులకు ఆందోళన మొదలవుతుంది. పుస్తకాలు, యూ నిఫామ్లు, బస్సు ఛార్జీలు, పరీక్ష ఫీజులు, వార్షిక ఫీజులు వంటి ఖర్చులు ఒక్క నెలలోనే కుటుంబ ఆదాయాన్ని గణనీయంగా ఖాళీ చేస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రులు ఏడాది పొడవునా కష్టపడి సంపాదించిన డబ్బును ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. కొంతమంది తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేయడం, ఆస్తులను అమ్మడం వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కొరత, బోధనా నాణ్యతలో లోపాలు తల్లిదండ్రులను ప్రైవేటు పాఠశాలల వైపు నెట్టివేస్తున్నాయి. అయితే, ఈ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి, అధిక ఫీజులతో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి. పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు.. ప్రస్తుత పోటీ యుగంలో పిల్లలు విజయవంతం కావాలంటే నాణ్యమైన విద్య అవసరమని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ ఆలోచనతో, చాలామంది తమ పిల్లలను జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు పంపి, హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఐదు, ఆరు తరగతుల నుంచే ఈ ప్రయాణం మొదలవుతోంది. ఆర్థికంగా స్థిరంగా ఉన్న కుటుంబాలకు ఈ ఖర్చులు పెద్ద భారం కాకపోవచ్చు, కానీ పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ఆర్థిక ఒత్తిడిని భరించలేక నలిగిపోతున్నాయి. ‘పిల్లలకు మంచి చదువు అందిస్తే ఆస్తులు లేకపోయినా భవిష్యత్తు బాగుంటుంది‘ అనే ఆలోచనతో ఎన్ని కష్టాలైనా భరిస్తూ ముందుకు సాగుతున్నారు. ‘క్యాష్’ చేసుకుంటున్న స్కూళ్లు.. తల్లిదండ్రుల ఈ ఆవేదనను, ఆశలను కొన్ని ప్రైవేటు పాఠశాలలు నగదుగా మార్చుకుంటున్నాయి. ‘వరల్డ్, ఒలింపియాడ్, టెక్నో, ఐఐటీ, ప్రైమ్‘ వంటి ఆకర్షణీయమైన పేర్లతో, తాము ప్రత్యేకమైన విద్యను అందిస్తున్నామని ప్రచారం చేస్తూ, విద్యా చట్టాలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల బలహీనతను ఈ పాఠశాలలు వినియోగించుకుంటున్నాయి. ఈ పాఠశాలలపై నియంత్రణ లేకపోవడం, బాధ్యతాయుతమైన అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఫలితంగా, ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ, తల్లిదండ్రులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. కరాటే బెల్ట్లు ప్రదానం నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఝాన్సీలక్ష్మీబాయి ఉచిత కరాటే శిక్షణలో 30 రోజులుగా బాలికలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. మంగళవారం కరాటే బెల్ట్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 11 మంది బాలికలకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తేజేందర్సింగ్ భాటియా, ఉపాధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్, అమ్ముల భూషణ్, కరాటే శిక్షకురాలు మృణాళిని, తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ త్వరలో పాఠశాలల పునఃప్రారంభం ఏటా పెరుగుతున్న ఫీజులు మంచిచదువు పేరిట వల ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ నిర్మల్టౌన్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జూన్ 1 నుంచి 30 వరకు 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ జానకీషర్మిల మంగళవారం తెలిపారు. పబ్లిక్ మీటింగ్లు, ఊరేగింపులు ధర్నాలకు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిషేధిత ఆయుధాలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వాడరాదన్నారు. డీజేలు , లౌడ్ స్పీకర్ వంటివి పెట్టొద్దని తెలిపారు. ఈ సమయంలో నియమాలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ కింద శిక్ష అనుభవిస్తారని వెల్లడించారు. విద్యార్థుల నమోదుకు కళాజాతఅమలు కాని ఉత్తర్వులునిబంధనలు పాటించాలి.. ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించాలి. ఫీజులను ఇష్టారీతిన పెంచడానికి లేదు. ఈ విద్యాసంవత్సరం వీటిపై దృష్టిపెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిసదుపాయాలతో విద్యనందిస్తున్నాం. –రామారావు, డీఈవో ఫీజుల నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు పాఠశాలల ఆగడాలు అంతేలేకుండా పోయాయి. 2017 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతత్వంలోని ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 2018 మార్చిలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తూ ఏటా 10 శాతం ఫీజులను పెంచుకోవచ్చునని ప్రతిపాదనలు చేసింది. కానీ ఇంత వరకు ఆ కమిటీ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. 2020 ఏప్రిల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు నంబర్ 46ను జారీ చేసింది. జీవో నంబర్ 01 ప్రకారం ట్యూషన్ ఫీజులను నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ, ఉత్తర్వుల అమలుకు విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మొదలుకుని మండల విద్యాశాఖ అధికారులకు వరకు ఒక్కరు కూడా ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. అధికారుల తీరుపై అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో తరగతుల వారీగా నెలకు స్కూళ్ల ఫీజులు(రూ. లలో).. తరగతి కనిష్టం గరిష్టం నర్సరీ 800 1,200 1వ 950 1,800 2వ 1,000 2,000 3వ 1,100 2,500 4వ 1,200 3,000 5వ 1,300 3,000 6వ 1,350 3,500 7వ 1,400 4,000 8వ 1,500 4,000 9వ 1,550 4,500 10వ 1,600 5,000 -
సంక్షేమంలో ముందంజ
నిర్మల్● స్వరాష్ట్రంలో అభివృద్ధి పథం ● అన్నివర్గాలకు సమన్యాయం ● జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి ● రాష్ట్రఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ● జిల్లాకేంద్రంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపరేడ్ కమాండెంట్గా ఏఎస్పీ నిర్మల్ టౌన్: హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకల్లో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా కమాండెంట్గా ప్రాతినిధ్యం వహించారు. సీఎం రేవంత్రెడ్డికి తన సిబ్బందితో గౌరవ వందనం చేశారు. ఎస్పీ జానకీషర్మిల అభినందించారు. జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిశారు జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. IIలోuమంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినో త్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నటరాజ కళానికేతన్ ఎప్పం రంజిత ఆధ్వర్యంలో సుష్మ గ్రూప్ సభ్యులు పేరణి నృత్యం, స్వరూపిణి నృత్య కళాక్షేత్రం నవ్య ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు అదివో అల్ల దివో.., పాడ్యాం పాండవం నిత్య శ్రేషన్, బన్నీ సారథ్యంలో జయహో జయహో తెలంగాణ.. రాజశేఖర్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాన్విత గ్రూపు కారం పొడితో కదిలిన సెల్లె.. రోకల్ బండతో కదిలిన పల్లె పాటకు తెలంగాణ నృత్యం.. భైంసా పట్టణానికి చెందిన శర్వాణి సంగీత నృత్య అకాడమీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని కీర్తిస్తూ నృత్యం.. శివ సాయి కళాక్షేత్రం కుభీర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి తెలిసేలా నృత్యం చేశారు. అనంతరం కళాకారులకు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల బహుమతులు అందజేశారు. డ్రగ్ ఫ్రీ నిర్మల్ లక్ష్యంగా.. నిర్మల్చైన్గేట్: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎస్పీ జానకీషర్మిలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో కళాజాత నిర్వహించనున్నట్లు వివరించారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాలల చట్టాలపైనా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ మూడు నెలలుగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజా గస్తీ కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలోనే యువత డ్రగ్స్కు దూరంగా ఉండేలా కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నిర్మల్: ‘అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలతో స్వరాష్ట్రం సాధించుకుని 11 ఏళ్లు నిండాయి. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్–2047 విజన్తో సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ముందుకుసాగుతోంది’ అని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో అధికారిక వేడుక నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సందేశాన్ని చదివి వినిపించారు. ఎందరో అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ అన్నిరంగాల్లో దశదిశలా అభివృద్ధి చెందుతోందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాగా మారిన నిర్మల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ.. అన్నిరంగాల్లో ముందంజలో నిలిపే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. పథకాలతో ప్రజలకు లబ్ధి.. ● ప్రజాప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే సంక్షేమ పథకాలను ప్రారంభించిందన్నారు. ఆర్టీసీబస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,83,85,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. ● ప్రజాపాలనలో భాగంగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామన్నారు. ● భూభారతి ద్వారా ప్రజల భూసంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు చెప్పారు. జిల్లాలో కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, 667భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నామన్నారు. ● రైతుసంక్షేమమే ధ్యేయంగా జిల్లాలో 71,565 కుటుంబాలకు రూ.658కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభరోసా కింద 1.36 లక్షల మంది రైతులకు రూ.121కోట్లు ఖాతాల్లో జమచేశామని తెలిపారు. ● విద్య, వైద్యరంగాల్లో జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు రాజయ్య వివరించారు. అమ్మరక్షిత కార్యక్రమం ద్వారా 977 మంది గర్భిణులకు కౌన్సెలింగ్, వైద్యసేవలు, పోషణ మార్గదర్శకాలు అందించామన్నారు. ఈఏడాది పదోతరగతి ఫలితాల్లో జిల్లా 96.70 శాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు. ● కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక చొరవతో చేపట్టిన బాలశక్తి ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని వివరించారు. ఇప్పటి వరకు 19 వేల మంది విద్యార్థులకు హెల్త్స్క్రీనింగ్ చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలను అందించడం అభినందనీయమన్నారు. అలాగే నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జిల్లా చారిత్రక, సాహిత్య, కళానైపుణ్యాలను ప్రస్తుత తరానికే తెలిపే ప్రయత్నం చేశారన్నారు. ● జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు మహిళలు, పిల్లల కోసం పోలీసుశాఖ కృషిచేస్తోందన్నా రు. ఎస్పీ జానకీషర్మిల ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో తొలిసారి మహిళాకానిస్టేబుళ్లతో శివంగిటీమ్ను తయారు చేయడం ప్రశంసనీయమన్నారు. ● గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రస్థాయిలో ఎన్నోవిజయాలను సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. బ్యాంకు లింకేజీ రుణాల రికవరీలో రాష్ట్రస్థాయిలో మళ్లీ మొదటి స్థానం సాధించడం, సమీకృత వ్యవసాయానికి పెప్సికో పురస్కారం అందడం అభినందనీయమన్నారు. అన్నిశాఖల ద్వారా ఆయారంగాల్లో వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి అనసూయ సీతక్క, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. . దుబాయ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఖానాపూర్: దుబాయ్లోని జేబల్ అలీ ప్రాంతంలో ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గల్ఫ్ కార్మికులు తెలంగాణ తల్లి చిత్రపటం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు సాగర్, లక్ష్మణ్, గంగాధర్, రాకేశ్, వినయ్, పవన్సాయి, పెద్ది రవి తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలునిర్మల్ రూరల్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో 312 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, సోమవార్పేట్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షలు సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగనున్నాయి. హాల్ టికెట్లు ఇప్పటికే విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా పరీక్షల అధికారి పరమేశ్వర్ తెలిపారు. -
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● క్యాంపు కార్యాలయంలోఘనంగా అవతరణ వేడుకలు
అమరుల త్యాగఫలమే తెలంగాణ నిర్మల్చైన్గేట్: సుదీర్ఘ పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ వేడుకలు క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. మొద ట పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచి, బహుమతులను అందజేశారు. వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, అధికారులు, కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో... రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జిల్లా పరి షత్ కార్యాలయంలో కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ జెండా ఎగురవేశారు. జెడ్పీ సీఈవో గోవింద్, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. -
అందరికీ సమాన సేవలు
నిర్మల్టౌన్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు పోలీసు సిబ్బంది మరింత బాధ్యతతో పని చేయాలని, ధనిక, పేద తేడా లేకుండా అందరికీ సమాన సేవలు అందించా లని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీ సులకు ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి సేవా పతాకాలు అందుకున్న 17 మంది పోలీసులను అభినందించారు. అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్రెడ్డి, ప్రవీణ్కుమార్, కృష్ణ, సమ్మయ్య, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో..
నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్/ఖానాపూర్: జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కార్యాలయంలో ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ముధోల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామారావుపటేల్, ఖానాపూర్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జాతీయ పతాకాలు ఎగురవేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రజాసంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ప్రభుత్వం ఆదర్శంగా నిలుపుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ సిందే ఆనంద్రావు, ఏఎస్పీ అవినాష్కుమార్ జెండా ఆవిష్కరణలు చేశారు. -
భూభారతిపై ఆశలు
● నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు.. ● ధరణిలో పూర్తి వివరాలు లేక ఇబ్బందులు ● పెండింగ్లోనే వందల అర్జీలు ● కొత్త చట్టంతో పరిష్కారం అయ్యేనా? ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతుపేరు కొకినోల్ల రుక్మాబాయి. భైంసా మండలం ఇలేగాం శివారులో 203/క సర్వే నంబరులో రెండు ఎకరాల భూమి ఉంది. గత ప్రభుత్వం 645936 నంబరుతో ముద్రించిన 351 క్రమ సంఖ్య ఆధారంగా పట్టాపాసుపుస్తకం జారీ చేసింది. 010435 యూనిక్ ఐడీ నంబరు కేటాయించి ఆన్లైన్లో వివరాలు నమోదుచేసింది. తర్వాత రెవెన్యూ సర్వే నిర్వహించి పట్టాపాసుపుస్తకంపై అన్ని సరిగ్గా ఉన్నాయని ముద్రించింది. ఆన్లైన్లో పహణీ తీసుకుని భైంసాలోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరేళ్ల క్రితమే పంటరుణం తీసుకుంది. మరుసటి ఏడాది ధరణిలో కొత్త పట్టాపాసుపుస్తకం ఇవ్వలేదు. ఆన్లైన్లో మహిళా రైతు వివరాలు నమోదుచేయలేదు. దీంతో ఆన్లైన్లో గతంలో ఉన్న వివరాలన్ని కనిపించకుండాపోయాయి. కొత్త పహణీ రాకపోవడంతో రుణం రీషెడ్యూల్ కావడంలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇప్పటీ పట్టాపాసుపుస్తకం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన సాయం కూడా అందడంలేదు. రుణ మాఫీకి అర్హత ఉన్నా.. కాలేదు. భైంసా: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో జిల్లాలో భూ సమస్యలు పెరిగాయి. ఒకరి భూమి మరొకరి పేరిట నమోదైంది. ఉన్న భూమి మాయమైంది. కొందరికి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినా ఆన్లైన్లో భూమి చూపించడం లేదు. ఇలా అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. పాసుపుస్తకంలో భూమి ఉన్న పొజీషి యన్లో లేక పోవడం, వారసత్వంగా రావాల్సిన పౌతి కోసం ధరణిలో ఆప్షన్ లేకపోవడం రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రతిసారి జిల్లా రైతులు తమ ఇబ్బందులను అధికారులకు చెబుతునే ఉన్నారు. వెంటాడుతున్న ఇబ్బందులు... జిల్లా రైతులను ధరణి సమస్యలు వెంటాడుతున్నా యి. జిల్లాలో సాదాబైనామాల ద్వారా భూములు కొని క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఇచ్చారు. కొందరి దగ్గర రశీదులు ఉన్నాయి. మరికొందరి దగ్గర లేవు. దరఖాస్తులు ఇచ్చిన వారిలో చాలా వరకు క్రమబద్ధీకరణజరుగలేదు. పట్టాభూములై ఉండి కూడా నిషేధిత జాబితాలో వివరాలు చేర్చారు. చాలా మంది రైతుల పట్టాపాసుపుస్తకాల్లో భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు రావడం, ఒకరి విస్తీర్ణం మరో రైతు పేరున చేర్చడం వంటి సమస్యలు ఉన్నాయి. గ్రామాల్లో ఎటుచూసినా హద్దుల సమస్య ప్రధానంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో పంటపొలాలకు వెళ్లేదారులు, జరినాలాలు, మూసి వేసిన రైతులకు అక్రమంగా పట్టాలు జారీచేశారు. జరినాలాలు మూసుకుపోవడంతో వర్షాకాలంలో రైతుల పంటపొలాలు జలమయమవుతున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా జరినాలాల భూముల వివరాలు ఎక్కడ కూడా నమోదుచేయడంలేదు. కొత్త చట్టంపై ఆశలు.. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి అమలు కానుంది. ఇప్పటికే కుంటాల మండలం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొని రైతుల వద్దకే అధికారులు వస్తారని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లోనూ మంగళవారం నుంచి భూ భారతి అమలు కానుంది. ప్రతీ మండలంలో ప్రత్యేక బృందాలు గ్రామాలకు వెళ్లి భూ భారతి సదస్సు నిర్వహించి రైతుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈలోగా జిల్లావ్యాప్తంగా గ్రీవెన్స్లలో రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని మండల రెవెన్యూ అధికారులను జిల్లా రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పరిష్కారంకాని సమస్యల అర్జీలు ఇచ్చేందుకు బాధిత రైతులు ఎదురుచూస్తున్నారు. -
చెక్పోస్టు తనిఖీ చేసిన సీఐ
జన్నారం: మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఏ ర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును ఇటీవల బాధ్యతలు స్వీకరించిన లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి తని ఖీ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను తరలించే అవకాశం ఉన్నందువల్ల ముందస్తుగా ప్ర తీ వాహనాన్ని తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. ఒకరిపై కేసు ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్కు చెందిన మహ్మద్ అలీమొద్దీన్ సోమవారం మహారాష్ట్ర నుంచి పశువులను తీసుకువచ్చి వధించేందుకు సిద్ధంగా ఉంచాడు. తన ఇంటి ముందు కట్టి ఉంచిన ఎనిమిది ఎద్దులను వన్టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొని గోశాలకు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. -
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు?
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్లో గతేడాది నవంబర్లో మహిళ హత్యకు గురైన సంఘటన సంచలనం సృష్టించింది. కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన కూస లక్ష్మి (55) స్నేహితురాలు భీమక్కతో కలిసి మంచిర్యాలలోని గణేశ్నగర్లో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. కొంత కాలం తర్వాత ఇద్దరు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. నవంబర్ 30న అదే ఇంట్లో లక్ష్మి హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా నాలుగు రోజుల క్రితమే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో పోలీసులకు సవాల్గా మారింది. ఎట్టకేలకు హత్యకు సహకరించిన ఓ మహిళతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
బైక్ దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్టౌన్: పట్టణంలో కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముఠాను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమయత్ నగర్కు చెందిన జాదవ్ గంగాధర్, గణేశ్, దిగంబర్ జల్సాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో డమ్మీ తాళాలను ఉపయోగించి 8 బైక్లను అపహరించారు. వాటిని అమ్మేందుకు స్థానిక బంగల్పేట్ శివారుకు వెళ్లినట్లు సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. -
సీవోఈ విద్యార్థుల ప్రభంజనం
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్–2025 పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ప్రకటించింది. ఇందులో కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా సీవోఈ విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు గత మే 18న నిర్వహించారు. 14 మంది పరీక్షకు హాజరుకాగా ఐదుగురు అత్యుత్తమ ర్యాంకులు, మరో నలుగురు ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. సదరు విద్యార్థులను ర్యాంకుల ప్రాతిపదికన మంగళవారం నుంచి కౌన్సిలింగ్కు పిలవనున్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు షేక్ సుభాన్ 32,278, ఎస్.ఆదర్శ్ 3,285, కె.రంజిత్ 3,438, జి.చరణ్ 4,346, డి.రాజేందర్ 5,414 ర్యాంకులు సాధించి విజయ దుందుభి మోగించారు. కె.రామ్చరణ్ తేజ 296, సీ.హెచ్.సాయికుమార్ 311, ఎస్.వెంకటేశ్వర్ 1,952, బి.అంజిబాబు 4,790 ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్కుమార్, లెక్చరర్లు ప్రత్యేకంగా అభినందించారు. -
ఎస్ఆర్ విద్యార్థుల విజయకేతనం
ఐఐటీ అడ్వాన్స్డ్లో అల్ఫోర్స్కు ర్యాంకులుజేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ విజయభేరికొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సోమవారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్స్డ్–2025 ఫలితాల వివిధ కేటగిరీల జా తీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. అజ్మీరా పురుషోత్త్తంనాయక్ 166వ ర్యాంకు సాధించగా.. పి.ఎన్.సాయిధృవ 557, ఎన్.అనిరుధ్సాయి 657, బి.ఆదిత్య 945, బి.విష్ణు 1,203, ఎం.అక్షిత 1,224, వి.హృషికేశ్ 1,329, ఆర్.గోవర్ధన్ 1,506, జె.వామిక 1,604, బి.చైశ్రవ్ రాజు 1,640, ఇ. శశిలాల్ 1,899, కె.విరేంద్రప్రసాద్ 2,120, డి.కార్తీక్రెడి్డ్ 2,150, ఎస్.విఘ్నేశ్ 2,293, డి.అభిరామ్ 2,349, ఎ.శశిప్రితమ్ 2,463, ఇ.అంకిత్సాయి 2,613, మహ్మద్ అబ్ధుల్ హక్ 2,766, డి.విశాల్ 2,917 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. వెయ్యి లోపు నలుగురు, 2వేల లోపు 11 మంది, 3వేల లోపు 19 మంది వి ద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. కరీంనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎస్.పవన్ 204వ ర్యాంక్, ఎం.కార్తీక్ 1,009, బానోవత్ సుమన్ 1,049, బుర్ర మాధవ్ 1,471, నీరటి శ్రీచరణ్జోష్ 1,321, గుగులోతు శేఖర్ 1,328, ముదిగంటి రుషిశ్వర్రెడ్డి 2,318, దొనకొండ సాయిచందన 3,218, దయ్యాల రాజ్కుమార్ 6,519వ ర్యాంకు సాధించి విద్యాసంస్థల ప్రతిభను మరింత పెంచారని విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అహర్నిశల కృషి ఇంతటి ఘన విజయానికి తోడ్పడ్డాయని వివరించారు. అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ సంతోష్ రెడ్డి, డీజీఎం, సీఈవో, జోనల్ ఇన్చార్జిలు, అకాడమిక్ డీన్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. కరీంనగర్: జేఈఈ–అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 40వ ర్యాంకు, నిఖిత్నాయక్ 194, డి.మహేశ్ 225, రఘుపతి 226, బి.సిద్ధిక 1,107, సీహెచ్.ఐశ్వర్య 1,129, ఠాగూర్ 1,274, నవదీప్ 1,701, నిస్సీ జాస్పర్ 2,172, ఎ.అజయ్ 3,077, అక్షర 4,524 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రణాళిక, మెరుగైన విద్యా బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఉత్తమ ర్యాంకులు సాధించామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులు అవలంబించిడం జరుగుతుందని, ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తమ కాలేజీలో ఫీజు రాయితీ ఇస్తున్నామని వివరించారు. ఈఏడాది నుంచి ఐఐటీ–అడ్వాన్స్డ్ లాంగ్టర్మ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాబోయే నీట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ ర్యాంకుల సాధన కేవలం ట్రినిటీ కళాశాలలకే సాధ్యమని, విద్యార్థుల కృషి, యాజమాన్యం భరోసా, అధ్యాపకుల శ్రద్ధ వల్లే ఈ ఫలితాలు అని తెలిపారు. క్యాంపస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ద ర్శించుకునేందుకు సోమవారం తెలంగాణ, ఆ ంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆల య అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. 1000 రూపాయల అభ్యాసం టికెట్లు 280, 150 అక్షరాభ్యాసం టికెట్లు 425, వివిధ ఆర్జిత సేవల టికెట్ల ద్వారా ఆలయానికి రూ.8.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కొనసాగుతున్న క్రికెట్ ఎంపిక పోటీలుమంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అ సోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేష న్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. సోమవారం గుడిపే ట్ బెటాలియన్లో గ్రీన్, యెల్లో జట్లకు పోటీలు నిర్వహించగా మొదటి ఇన్నింగ్స్లో గ్రీన్ జ ట్టు 328 పరుగులు, యెల్లో జట్టు 274 పరుగులు సాధించాయి. రెండో ఇన్నింగ్స్లో యెల్లో జ ట్టు 158 పరుగులు, గ్రీన్ జట్టు 274 పరుగులు సాధించగా, గ్రీన్ జట్టు విజయం సాధించినట్లు కోచ్ ప్రదీప్ తెలిపారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా జి.చరణ్, బెస్ట్ బ్యాట్స్మెన్గా అవినాశ్ జాదవ్, బెస్ట్ బౌలర్గా అనిరుధ్ నిలిచారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణమంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. పది, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఐటీఐలో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 1, 2024 నాటికి 14సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. మొదటి దఫా అడ్మిషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దాఖలు ఈ నెల 2నుంచి 21 వరకు ఉంటుందని తెలిపారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఆయా ఐటీఐలో సంప్రదించాలని సూచించారు. తెలంగాణలో సింగరేణి కీలకంమందమర్రిరూరల్: తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ కీలకమని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం మందమర్రి ఏరియా జీఎం దేవేందర్ ఆధ్వర్యంలో సింగరేణి హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కొత్త బొగ్గు బావులు వస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏరియా జీఎం దేవేందర్, ఎస్వో టూ జీఎం విజయ్ప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
బాసర: బాసర ఆర్జీయూకేటీ క్యాంపస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలంగాణ ఉద్యమ చరిత్రను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఒక సామూహిక చైతన్యమని, సమానత్వం కోసం సాగిన పోరాటమన్నారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ, ఎంటెక్ కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్స్ డాక్టర్ విట్టల్, నాగరాజు, డాక్టర్ మహేష్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కన్వీనర్ ప్రభాకర్ రావు, పీడీ శ్యాంబాబు, పీఈటీలు స్వప్న, వసంత, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, పాల్గొన్నారు. ఉట్నూర్రూరల్: ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మహనీయుల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలపై వివరించారు. -
సత్తా చాటిన ‘సహనా’
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సహనారెడ్డి జాతీయస్థాయిలో 3,860 ర్యాంకు సాధించి సత్తా చాటింది. జిల్లాకేంద్రానికి చెందిన సాదు సారిక–రాంరెడ్డి దంపతుల పెద్ద కుమార్తె సహనారెడ్డి చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణిస్తోంది. పాఠశాల విద్యను స్థానిక అల్ఫోర్స్ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాదులోని నారాయణ కళాశాలలో అభ్యసించింది. మెయిన్స్ ఫలితాల్లో 99.49 పర్సెంటైల్, అడ్వాన్స్డ్ 3,860 ర్యాంకును కై వసం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంకును సాధించినట్లు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఆసిఫాబాద్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన రామ్చరణ్ (14)కు ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కాలుకు వేసిన ఇనుప రాడ్డును (ఇంప్లాంట్ రిమూవల్ ఆఫ్ క్లానికల్ బోన్ ఆపరేషన్) తొలగించారన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఉండడంతో రానున్న రోజుల్లో జిల్లా ఆసుపత్రిలో హెర్నియా, ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు కూడా ఆందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రోగులకు నాణ్యమైన సేవలను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఆపరేషన్ విజయవంతంగా చేసిన వైద్యులు తిరుమలేష్, నర్సింగ్ స్టాఫ్ సుమిత్ర, హేమలతతో పాటు థియేటర్ అసిస్టెంట్ మౌనికను అభినందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సూపరింటెండెంట్ కృష్ణ, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.