breaking news
Nirmal District Latest News
-
పెళ్లింటికి.. ఆర్థిక సాయం
ఇంద్రవెల్లి: ఆదివాసీ, గోండు తెగల్లోనూ చాలామంది వరకట్నాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే అమ్మాయి, అబ్బాయి పెళ్లి ఎవరిదైనా ఆయా గ్రామాల్లో కులస్తులు కానుకలు ఇవ్వకుండా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పెళ్లింటికి చేదోడుగా నిలుస్తున్నారు. మండలంలోని వడగామ్ గ్రామంలో కనక కోసేరావ్ పెళ్లి రెండు రోజుల క్రితం జరిగింది. ఈమేరకు గ్రామస్తులంతా కలిసి రూ.25 వేలు అందించారు. కేస్లాపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కూతురు ఆత్రం రోష్ణకు గ్రామస్తులు రూ.26 వేలు అందించారు. మండలంలోని పిప్రి గ్రామంలో ఆదివారం పెళ్లి పీటలు ఎక్కనున్న ఆత్రం సుజాతకు గ్రామస్తుల ఆధ్వర్యంలో రూ.7,100 అందించారు. ఇలా ఆదివాసీలు తలా కొంత నగదు సేకరించి పెళ్లి కుటుంబా లకు అందించి ఆర్థికంగా మద్ధతిస్తున్నారు. -
మొదలైన ‘పది’ పరీక్షలు..
నిర్మల్ రూరల్/నిర్మల్చైన్గేట్/నిర్మల్ టౌన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు గంట ముందుగానే తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా అనుమతించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులుతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. తొలి రోజు తెలుగు పరీక్ష జరిగింది. మొత్తం 9,747 మంది విద్యార్థులకు 9741 (99.93%) హాజరయ్యారు. ఆరుగురు గైర్హాజరయ్యారు. ప్రైవేట్గా ఒక విద్యార్థి పరీక్ష రాశాడు. పరీక్ష కేంద్రాల తనిఖీ.... పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల, డీఈవో భోజన్న వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని, మాస్ కాపీయింగ్ ప్రోత్సహించవద్దని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ సోమవార్పేటలోని బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో పరిశీలించారు. బెంచీలు, లైటింగ్, తాగునీరు సౌకర్యం గురించి తెలుసుకున్నారు. పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఈవో భోజన్న ఉన్నారు. ఇక ఎస్పీ మేధా మోడల్ స్కూల్ను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలులో ఉన్నందున అనవసరంగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ సాయికిరణ్, ఇన్స్పెక్టర్లు కృష్ణ, సమ్మయ్య, ఎస్సై లింబాద్రి ఉన్నారు. డీఈవో జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, కాస్బా ఉన్నత పాఠశాల, ఈద్గాం ఉన్నత పాఠశాల, జుమ్మేరాత్పేట్ ఉన్నత పాఠశాల, మేధా మోడల్ స్కూల్, రవి హైస్కూల్, వశిష్ఠ, చాణక్య, ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. హిందీ బుధవారం జరుగుతుంది. -
నిర్మల్
ట్రిపుల్ ఐటీలో అంతఃప్రజ్ఞ బాసర ఆర్జీయూకేటీలో శనివారం రెండోరోజు అంతఃప్రజ్ఞ 2కే–26 నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కార్లు, బైక్ల ప్రదర్శన నిర్వహించారు. నృత్య ప్రదర్శనలో ప్రతిభ లక్ష్మఱచాంద: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో భరత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నృత్య ప్రదర్శనలో సోన్ మండలం కడ్తాల్ విద్యార్థి ప్రతిభ కనబర్చింది. గ్రామానికి చెందిన మామిళ్ల ఉమాదేవి–లింగయ్య దంపతుల కూతురు నాలుగేళ్ల సహస్ర స్థానిక నిర్మల్కు చెందిన నృత్య కళాకారిణి నవ్య– వినయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వరూపిణి నృత్య కళాక్షేత్రం తరఫునన ముందస్తు ఉగాది ఉత్సవాల్లో పాల్గొంది. సహస్ర అద్భుతంగా నృత్యం చేసి అందరినీ ఆకట్టుకుంది. నిర్మల్చైన్గేట్: పదేళ్లకోసారి దేశవ్యాప్తం చేపట్టే జనగణన 2021లో కరోనా మూలంగా నిలిచిపోయింది. దీంతో 2027లో జనగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా మే 11 నుంచి జూన్ 1 వరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపడతారు. దీనికోసం జిల్లాకు ఒక మాస్టర్ ట్రైనీని ఎంపిక చేశారు. నిర్మల్ జిల్లాకు మాస్టర్ ట్రైనర్గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.గంగారెడ్డి ఈనెల 5 నుంచి 8 వరకు హైదరాబాద్లో శిక్షణ పొందారు. అలాగే జిల్లాలో ఫీల్డ్ ట్రైనర్లుగా 26 మందిని ఎంపిక చేశారు. మొదటి దశలో ఇళ్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణన ఎంతగానో దోహదపడుతోంది. పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం ఈ జనగణన నిర్వహిస్తుండగా.. చివరిసారిగా 2011లో చేపట్టింది. జిల్లాలో ఈ గణన రెండు దశల్లో జరగనుంది. మొదటగా ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో దశలో జనాభా గణన 2027, ఫిబ్రవరిలో జరగనుంది. మూడు రోజుల శిక్షణ.. హౌస్ లిస్టింగ్ నుంచి ఇంటింటి సర్వే పూర్తయ్యేదాకా మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలకు మండల చార్జ్ ఆఫీసర్ పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, చార్జ్ ఆఫీసర్లుగా టీపీవో/మేనేజర్లు అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం 26 మంది ఫీల్డ్ ట్రైనర్లకు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 430 రెవెన్యూ గ్రామాల్లో జనగణన చేపట్టేందుకు మే 11 నుంచి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపట్టనున్నారు. ఇళ్ల సంఖ్య, కుటుంబాల సంఖ్య ఆధారంగా ఎన్యుమరేటర్లను నియమించి, వచ్చే ఏడాది జనగణన చేపట్టనున్నారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా.. ఈసారి జన గణనను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. మొబైల్ యాప్లో, వెబ్ పోర్టర్లను ఉపయోగించి ఈ ప్రక్రియ ఉండనుంది. అలాగే ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఈ ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతీ మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి..? గణన ప్రక్రియ ఎలా నిర్వహించాలి అనే అంశాలపై అధికారులకు శిక్షణతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ అనంతరం అధికారులు బ్లాక్లను గుర్తించి ఎంపిక చేసిన ఎన్యూమరేటర్ల ద్వారా ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. నేటి నుంచి చార్జ్ ఆఫీసర్లకు, 28 నుంచి ఫీల్డ్ ట్రైనర్స్కు శిక్షణ 2011 లెక్కల ప్రకారం జిల్లా వివరాలు.. భౌగోళిక విస్తీర్ణం : 3,692.3 స్క్వేర్ కిలోమీటర్ రెవెన్యూ గ్రామాలు : 430 మండలాలు : 18 మున్సిపాలిటీలు : 3 పంచాయతీలు : 400 జనాభా (2011 లెక్కల ప్రకారం) : 7,09,418 పురుషులు : 3,46,721 మహిళలు : 3,62,697 కుటుంబాలు : 1,65,763 కొత్త జిల్లాల్లో మొదటిసారి..ఉమ్మడి ఆదిలాబాద్ను నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారిగా పూర్తిస్థాయి జనగణన ఇదే. ప్రతీ జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూ పొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమై న సమాచారం అందనుంది. -
కట్నం ఇడే కాద్ తోద్..
అంటున్న ‘కొలాం’ సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు. సాత్నాల మండలం జామినిలో ఈనెల 10న కట్నం లేకుండా నిర్వహించిన ‘కొలాం’ వివాహ వేడుక -
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
లక్ష్మణచాంద/మామడ: కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు. లక్ష్మణచాంద, మామడ మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. రాచాపూర్ రూ.69 లక్షలు, పొట్టపల్లి(కె)లో రూ.62 లక్షలు, లక్ష్మణచాందలో రూ.1.83 కోట్లు, పార్పల్లిలో రూ.81.40 లక్షలతో చేపట్టే పనులను ప్రారంభించారు. సోన్ మండలం న్యూవెల్మల్లో రూ.62 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మామడల మండలం నూస్వాంగ్వి గ్రామంలో రూ.77.70 లక్షల విలువైన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. న్యూబొప్పారం గ్రామంలో రూ.1.10 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. కూచన్పల్లిలో రూ.31.90 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ఎంపీడీవో రాధ, డీటీ బాబుసింగ్, లక్ష్మణచాంద మండల అధ్యక్షుడు చిన్నయ్య, సోన్ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, సర్పంచులు ఓస కవిత, ముఖేష్, మహేశ్, పుష్ఫ, అశ్విన్రెడ్డి, సూరి, తిరుపతి, రాచకొండ సాగర్, నరేశ్, అంకం మమత, మాజీ ఎంపీపీలు అడ్వాల రమేశ్, మాజీ ఎంపీపీ హరీశ్, మాజీ సర్పంచ్ ముత్యంరెడ్డి, ఉప సర్పంచ్ వర్ష రవి, రవీందర్, పోశెట్టి, నాయకులు బాపురెడ్డి, రాజారెడ్డి, రంజిత్కుమార్, నాగయ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులతో భోజనం తన పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని కేజీబీవీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కింద కూర్చోని కలిసి భోజనం చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ కవిత, ఎస్వో నవిత తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత లేదు
నిర్మల్చైన్గేట్:జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, మండలస్థాయి అధికారులు ప్రజల ఆందోళనలు తొలగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచి, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్తో కలిసి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, పలు రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో సరిపడినన్ని ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నా రు. గృహావసరాల సిలిండర్లు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ఆయా పౌర సేవల ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చేయొద్దని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు. గ్యాస్ ఏజెన్సీల తనిఖీ కలెక్టర్ ఆదేశాలతో గ్యాస్ ఏజెన్సీలను తహసీల్దార్లు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో స్టాక్, అమ్మకానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. సిలిండర్ల కృత్రిమ కొరత సష్టించొద్దని నిర్వాహకులను ఆదేశించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో అమ్మినా, పక్కదారి పట్టించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భైంసాలో తనిఖీ.. భైంసాటౌన్: పట్టణంలోని కృప గ్యాస్ ఏజెన్సీని డీసీఎస్వో రాజేందర్ శనివారం తనిఖీ చేశారు. సిలిండర్ నిల్వలు, బుకింగ్స్, డెలివరీ, తదితర వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ కొరత ఉందన్న ఆందోళనతో ఎక్కువగా బుకింగ్ చేసుకుంటున్నారని, దీంతో సర్వర్ స్లో అవుతోందన్నారు. ఈ సమస్య కూడా రెండురోజుల్లో పరిష్కారమవుతుందని తెలిపా రు. ఆయన వెంట భైంసా తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ ప్రకాశ్ రాథోడ్ ఉన్నారు. గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసిన ఏఎస్పీ నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీలను ఏఎస్పీ సాయికిరణ్ తనిఖీ చేశారు. వినియోగదారులకు సరైన సేవలు అందుతున్నాయా.. గ్యాస్ సిలిండర్ల నిల్వ విధానం, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. ఏజెన్సీల వద్ద ఉన్న రికార్డులు, స్టాక్ వివరాలు, డెలివరీ విధానం పరిశీలించారు. భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని ఏజెన్సీ యజమానులకు సూచించారు. అక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
నిర్మల్ఖిల్లా: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొ నే నైపుణ్యం ప్రతి ఒక్కరికీ అవసరమని జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) అధికారులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో శుక్రవారం 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విపత్తుల వేళ చేపట్టాల్సిన చర్యలపై ఎ న్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ మన్మోహన్ యాద వ్ తన బృందంతో భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు తదితర విపత్తుల సమయంలో ఎలా స్పందించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే అంశాలపై ప్రదర్శన నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 హెల్ప్లైన్కు సమాచారం అందించే విధానాన్ని వివరించారు. గాయపడిన వారికి తక్షణ సాయం అందించేందుకు సీపీఆర్ విధానంపై విద్యార్థులతో ప్రదర్శన ఇప్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్, జిల్లా అగ్నిమాపక అధికా రి ప్రభాకర్, జిల్లా క్రీడల అధికారి కాంత్రెడ్డి, జిల్లా ఎన్ఎస్ఎస్ అధికారి అర్చన, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జాకీర్ హుస్సేన్, అధ్యాపకులున్నారు. -
నిర్మల్
టీకాలతో జీవాలకు రక్ష పాడిపశువుల్లో గాలికుంటు నివారణకు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఊరూరా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. టీకాలు వేసి వాటితో కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నారు. అడిషనల్ డీజీపీని కలిసిన కలెక్టర్ నిర్మల్చైన్గేట్: శుక్రవారం జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ (బెటాలియన్) సంజయ్కుమార్ జైన్ను పట్టణంలోని అటవీశాఖ వసతిగృహంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క అందించారు. అడిషనల్ డీజీపీని కలిసినవారిలో ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే ఉన్నారు. నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వంటగ్యాస్పై పడింది. వంటగ్యాస్కు కొరత ఏర్పడనుందని ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చ ర్యలు చేపట్టింది. అయినా ఫలితం లేకుండా పో తోంది. గృహ వినియోగ గ్యాస్కు కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినా భయంతో వినియోగదారులు భారీగా ముందస్తు బుకింగ్కు యత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు ‘ప్యానిక్ బుకింగ్’ పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ప్రభావం ఐవీఆర్ఎస్ (ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) బుకింగ్స్ మీద పడి సర్వర్ స్తంభించిపోతోంది. ప్యానిక్ బుకింగ్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వర్ను స్లో డౌన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్యాస్ ఏజెన్సీలు కూడా అంగీకరిస్తున్నాయి. నిబంధనలు కఠినతరం గ్యాస్ బుకింగ్ విషయంలో ప్రభుత్వం పరిమితులు విధించింది. సింగిల్ సిలిండర్కు 21 రోజులు, డబుల్ సిలిండర్కు 30 రోజులు వేచి చూడాలి. 21రోజుల తర్వాత సిలిండర్ బుక్ చేస్తే.. రెండున్నర రోజుల్లో డెలివరీ చేసేలా తాజాగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కాకపోతే, ఇప్పటిదాకా బుకింగ్ చేయగానే సిలిండర్ ఇస్తున్నారు. ఇక ముందుమాత్రం కచ్చితమైన గడువు పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయిల్ కంపెనీల జిల్లా కో–ఆర్డినేటర్ల నుంచి డీలర్ల వరకు ఆదేశాలు జారీచేశారు. దీనిపై కో ఆర్డినేటర్లను ‘సాక్షి’ సంప్రదించగా, గృహ విని యోగ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని చెబుతున్నా రు. జిల్లా వ్యాప్తంగా ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలన్నింటి పరిధిలో 1,39,430 ఎల్పీ జీ డొమెస్టిక్ కనెక్షన్లుండగా, వినియోగదారులకు ప్ర స్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంటున్నారు. అక్రమ నిల్వలపై దాడులు గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా నిల్వచేసిన వారిపై పౌర సరఫరాలశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిర్మల్లోని పలు హోటళ్లలో బుధ, శుక్రవారాలు తనిఖీలు చేశారు. 16 హోటళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 29 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని హోటళ్లలోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. భైంసాటౌన్: భైంసాలోని గ్యాస్ ఏజెన్సీ ఎదుట బారులుతీరిన వినియోగదారులు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు 16 మొత్తం కనెక్షన్లు 2,51,785 జనరల్ కనెక్షన్లు 1,39,430 దీపం కనెక్షన్లు 47,215 ఉజ్వల కనెక్షన్లు 37,249 సీఎస్ఆర్ కనెక్షన్లు 26,828భైంసాలోని ఓ ఏజెన్సీకి రోజుకు రెండు లోడ్లు (684 సిలిండర్లు) వస్తుండగా, ప్రస్తుతం రెండురోజులకో లోడ్ వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో గ్యాస్ కొరత ఉందన్న ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు కొరత లేదని అధికారులు చెబుతున్నారు. అధికారులు గ్యాస్ నిల్వల సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తూ, బ్లాక్ మార్కెట్కు తరలకుండా ఏజెన్సీలను అప్రమత్తం చేయాల్సిన అవసరముంది. కాగా, ఇదివరకు వినియోగదారులు ఐవీఆర్ఎస్ నంబర్కు ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేసుకుంటే డెలివరీ చేసేవారు. ప్రస్తుతం ఒకేసారి అధికసంఖ్యలో వినియోగదారులు బుక్ చేస్తుండడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగి సకాలంలో బుకింగ్ కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఏజెన్సీల నిర్వాహకులే వారి వద్దకు వచ్చి ఫోన్లో వెంటనే గ్యాస్ బుక్ చేసి డీఏసీ ఆధారంగా అక్కడే డెలివరీ చేసేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్ల వాహనాలు వెళ్లడం లేదు. దీంతో వారు గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. -
‘కేంద్రం నిధులతోనే గ్రామాలాభివృద్ధి’
నిర్మల్ రూరల్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే ఏలేటి మ హేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో ని రత్నాపూర్ కాలనీ, అక్కపూర్, చిట్యాల, ముసిగి, కౌట్లకే, గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.10లక్షలతో ఎస్హెచ్జీ భవన నిర్మాణం, రూ.10 లక్షలతో వర్కింగ్ షెడ్ నిర్మాణం, రూ.12లక్షలతో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికా రులతో మాట్లాడి వాటిని సత్వరమే పరిష్కరించాల ని సూచించారు. రూ.30లక్షలతో చిట్యాల గ్రామంలో వరి ధాన్యం గోదాంలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు హరీశ్రెడ్డి, రాజేశ్వర్, సుప్రియ, శ్రీనివాస్, రాజు, నాయకులు జమాల్, రావుల రామనాథ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శుంకుస్థాపన లక్ష్మణచాంద: సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.20లక్షలతో రెండు ఎస్హెచ్జీ భవనాల నిర్మాణానికి, రూ.20లక్షలతో రెండు వర్క్ షెడ్ల నిర్మాణాలకు, రూ.12లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బర్ల రాజారెడ్డి, నాయకులు గంగారెడ్డి, హరీశ్రెడ్డి, గంగన్న, మధుకర్, నర్సారెడ్డి, రాజేశ్వర్, గోరేమియా, సవీన్, నరేశ్, సంతోష్, గంగాధర్, పోశెట్టి, నర్సయ్య, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
అవసరం మేరకు అందుబాటులో సిలిండర్లు
నిర్మల్చైన్గేట్: ప్రజలకు అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎ లాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సి న అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితి, రైతులకు సాగునీరు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల లభ్యతపై వ్యాప్తి చెందుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి పాల్గొన్నారు. సమావేశం అనంతరం అధికారులతో మాట్లాడిన ఆమె జిల్లాలో ఎక్కడా గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. జిల్లా ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలి పారు. సరఫరా వ్యవస్థను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల గృహావసరాల కోసం అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న అసత్య వా ర్తలను నమ్మవద్దని, ప్రజలు అనవసరంగా ఆందోళ న చెందకూడదని పేర్కొన్నారు. జిల్లాలో రైతుల పంటలకు అవసరమైన సాగునీరు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, సీపీవో జీవరత్నం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుఽ దాకర్, వ్యవసాయాధికారి అంజిప్రసాద్, డీఈవో భోజన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ పథకాన్ని వినియోగించుకోవాలి
దస్తురాబాద్: రైతులు పీఎం కుసుమ్ పపథకాన్ని వి నియోగించుకుని లబ్ధి పొందాలని విద్యుత్శాఖ ఎస్ ఈ సుభాష్ సూచించారు. మండలంలోని బుట్టా పూర్ గ్రామంలో ఈ పథకం ద్వారా రెండు మెగావా ట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కాగా, శుక్రవారం టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ రెడ్కో అధికా రులు శాఖాపరమైన అనుమతులు, సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. సమీపంలోని 33/11 కేవీ వి ద్యుత్ సబ్స్టేషన్కు అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. పీఎం కుసుమ్ ప థకానికి రాష్ట్రంలో 1,150 మంది రైతులు నమోదు చేసుకోగా, తెలంగాణ డిస్కంలకు 25 ఏళ్ల సోలార్ విద్యుదుత్పత్తికి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరిగా యని తెలిపారు. సోలార్ విద్యుదుత్పత్తి చేసిన ప్రతీ యూనిట్కు రూ.3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈలు నాగరాజు, తిలక్, టీజీ రెడ్కో మేనేజర్ శ్రీనివాస్, జోట ర్ రెన్యువబుల్ ప్రతినిధులు నరేశ్, అన్వేశ్, ప్రాజెక్ట్ డెవలపర్ వెన్నమనేని శ్రీధర్రావ్, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
నిర్మల్ రూరల్ గత నెల 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. గురువా రం ఫస్టియర్, శుక్రవారం సెకండియర్ పరీక్షలు ముగియగా విద్యార్థులు ఇంటిబాట పట్టా రు. చివరిరోజు నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 5,960 మందికి 5,518 మంది విద్యార్థులు హాజరు కాగా, 172 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో జాదవ్ పరశురాం జి ల్లా కేంద్రంలోని అల్ఫోర్స్, ఎస్ఎస్ఆర్ కళాశాలలు, దిలావర్పూర్ జూనియర్ కళాశాల, కుంటాల మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీ క్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పరీక్షాకేంద్రం తనిఖీ కుంటాల: ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు డీఐఈవో పరశురాం తెలి పారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని ఇంటర్ పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. తహసీల్దార్ కమల్సింగ్, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, డీవో వెంకటేశ్వర్ ఉన్నారు. -
ఘనంగా మొల్లమాంబ జయంతి
నిర్మల్ఖిల్లా: కవయిత్రి మొల్లమాంబ జయంతిని జిల్లా కేంద్రంలో తెలంగాణ కుమ్మర సంఘం, కుమ్మర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మొల్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొల్ల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. సంఘం జిల్లా ప్రతినిధులు కొత్తపల్లి బుచ్చన్న, కొత్తపల్లి గంగాధర్, పోతుగంటి సాయన్న, తోడిశెట్టి పరమేశ్వర్, మారుపాక శ్రీనివాస్, తోడిశెట్టి రవికాంత్, చంద్రయ్య, శంకర్, మల్లేశ్, రమేశ్, సాయికుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ విద్యార్థులతో కలెక్టర్ జూమ్ కాల్
నిర్మల్చైన్గేట్: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు రాయనున్న పలువు రు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో శుక్రవారం రాత్రి కలెక్టర్ అభిలాష అభినవ్ జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. వారిలో మనోధైర్యం నింపారు. పరీక్షల గురించి ఎలాంటి భయం అవసరం లేదని పేర్కొన్నారు. ఆత్మస్థైర్యంతో ప్ర శాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించా రు. పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి తాను భోజనం చేస్తానని హామీ ఇచ్చారు. -
ఆయిల్పాం సాగుపై అవగాహన
సారంగపూర్: ఆయిల్పాం సాగుతో లాభాలు ఆర్జించవచ్చని ఉద్యానవనశాఖ శాస్త్రవేత్త డాక్ట ర్ విద్య తెలిపారు. మండలంలోని అడెల్లి గ్రా మంలో శుక్రవారం క్షేత్రస్థాయిలో రైతులకు అ వగాహన కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు సాగు, తె గుళ్ల నివారణ చర్యలు, సాగునీటి యాజమాన్య పద్ధతులు, అంతరపంటల సాగు తదితర అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో స ర్పంచులు భూమన్న, సాయన్న, కైలాస్, డివి జనల్ ఉద్యానవన అధికారి మౌనిక, ఉద్యానవ న విస్తరణ అధికారి దేవన్న, ఆయిల్పాం ఏరి యా మేనేజర్ ప్రణీత, రైతులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ ఓఎస్డీకి ఏబీవీపీ వినతి
బాసర: బాసర ట్రిపుల్ఐటీలో అడ్మిషన్ దందాపై విచారణ జరిపించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓఎస్డీ మురళీదర్శకు గురువారం వినతిపత్రం అందజేశారు. 2018 నుంచి 2024 వరకు ఉన్న అధికారులు వందల కోట్ల రూపాయలు విత్డ్రా చేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. దీనిపై ఏసీబీతో విచారణ జరిపించాలని కోరారు. గ్లోబల్ సీట్ల పేరుతో ఆర్జీయూకేటీలో అడ్మిషన్ల దందా కొనసాగుతోందని తెలిపారు. నిర్ణయించిన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నా రు. వినతిపత్రం ఇచ్చినవారిలో జాతీయ కా ర్యవర్గ సభ్యుడు కుంట హర్షవర్ధన్ స్టేట్ హాస్ట ల్స్ కోకన్వీనర్ గంగప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, విగ్నేష్, అక్షయ్, మోహన్ మణి, నాగరాజు ఉన్నారు. -
మళ్లీ..‘క్లాస్’ తీసుకోవాల్సిందే!
నిర్మల్: జిల్లాలో కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ దారితప్పుతున్నారు. గతేడాది ఘటనలను మర్చిపోయారు. ఈ విద్యాసంవత్సరం మొదట్లో జిల్లా ఉన్నతాధికారులు, న్యాయనిపుణులు తీసుకున్న ప్రత్యేక ‘క్లాస్’లనూ విసర్మించారు. మళ్లీ కీచక చేష్టలతో, నిధుల దుర్వినియోగంతో, విధులకు ఎగనామంతో విద్యాశాఖను భ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ‘క్లాస్’లు చెప్పినా..పోక్సోవంటి కేసుల్లో ఉపాధ్యాయులు అరెస్టులు కావడం, ఆర్థిక నేరాల వంటి ఘటనల్లో పాల్గొనడంతో విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ‘ప్రత్యేక తరగతులు’ నిర్వహించారు. జిల్లా జడ్జీలు, ఉన్నతాధికారులు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. వారు నిర్వహించాల్సిన గురుతర బాధ్యతలను మరోసారి గుర్తుచేశారు. కానీ.. ఇందులో కొంతమంది వాటన్నింటినీ మర్చిపోయారు. దుర్వినియోగం.. దుష్టచేష్టలు..పాఠశాలల్లో టాయిలెట్లు, ఇతర మరమ్మతులకు ప్రభుత్వాలు నిధులను ఇస్తున్నాయి. వీటిని బడుల్లో ఖర్చు చేయకుండా కొంతమంది పెద్దసార్లు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. నిర్మల్రూరల్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి అవినీతిపై సదరు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ను సస్పెన్షన్ చేశారు. అలాగే పిల్లలపై ఉపాధ్యాయుడి దుష్టచేష్టలపైనా ఫిర్యాదులు వచ్చాయి. పలు మండలాల్లోనూ ఇలాగే నిధుల దుర్వినియోగం, ఉపాధ్యాయుల తీరుపైన ఆరోపణలు ఉన్నాయి. లైవ్లొకేషన్, ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం ఉన్నా.. సమయానికి, అలాగే మొత్తానికే బడికి రాని టీచర్లూ ఉన్నారు. ఇక కొంతమంది టీచర్లు ఉపాధ్యాయ సంఘాల పేరు చెప్పి, తమ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలకు ఉన్న గైడ్లైన్స్ దాటి ప్రవర్తిస్తున్న తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదులు ఉన్నాయి. పాత చేష్టలు..గత రెండు విద్యాసంవత్సరాలు జిల్లా విద్యాశాఖకు ఎన్నడూ లేనంత చెడ్డపేరును మూటగట్టాయి. యూబిట్ పేరిట చేసిన ‘కాయిన్దందా’ ఎంతోమంది ఉపాధ్యాయులను ఆ ఊబిలో దింపింది. తరగతులు చెప్పకుండా కాసులు కురిపిస్తున్నాయంటూ ఈదందాలోనే చాలామంది ఉపాధ్యాయులు బిజీగా మారారు. చివరకు కొంతమంది టీచర్లు ఏకంగా జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఇక అమ్మానాన్నల తర్వాత ఆ స్థానంలో ఉండి చిన్నారులకు విద్యాబుద్ధులను నేర్పాల్సింది గురువులే. కొంతమంది మాత్రం కీచకచేష్టలతో భ్రష్టుపట్టించారు. ఈ ఘటనలు సదరు ఉపాధ్యాయుల అరెస్టులు, సస్పెన్షన్ల వరకూ వెళ్లింది. ఇవన్నీ మర్చిపోకముందే.. మళ్లీ జిల్లాలో పాతచేష్టలు పునరావృతం అవుతుండటం కలవరపెడుతోంది. -
ఒంటి పూట బడికి వేళాయె
లక్ష్మణచాంద: రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ఉదయం 10 గంటలకే భానుడు భగభగ మండుతున్నాడు. ఎండ తీవ్రతకు బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో ఇలా...జిల్లాలో 577 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉ న్నాయి. ఇందులో 23,398 మంది విద్యార్థులు, 89 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,373 మంది విద్యార్థులు, 164 ఉన్నత పాఠశాలల్లో 37,019 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉదయం 8 నుంచి..తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్ర పాఠశాల డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒంటిపూట బడులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు. ‘పది’ పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలల్లో..ఈ నెల 14 నుంది పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. మ ధ్యాహ్నం 1 గంటకు విద్యార్థులు రాగానే భోజనం పెట్టి అనంతరం తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు ఈ నెల 16 నుంచి జిల్లాలో ఒంటి పూట బడులు ప్రా రంభించాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు తరగతులు నిర్వహించాలి. పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. – భోజన్న, డీఈవో -
నీడలేని ఉపాధి
లోకేశ్వరం: గ్రామాల్లో వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బీవీజీ రామ్జీ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) అమలు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో విస్తృతంగా పనులు కల్పిస్తున్నప్పటికీ, కూలీలకు తగిన వసతులు కల్పించడం లేదు. పని స్థలాల్లో నిలువ నీడ ఉండడం లేదు. తాగునీటి వసతి అంతంత మాత్రమే, పదేళ్లనాటి పనిముట్లే..పదేళ్ల క్రితం ఉపాధి కూలీలకు పనిముట్లు, టెంట్లు పంపిణీ చేశారు. గ్రూపులో నలుగురు సభ్యులకు కలిపి నాలుగు గుంతలు తవ్వేందుకు గడ్డపారలు అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పనిముట్లు ఇవ్వలేదు. దీంతో పదేళ్ల నాటి పనిముట్లనే వాడుతున్నారు. కొందరు కూలీలు సొంత ఖర్చుతో కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. కానరాని మెడికల్ కిట్లు..పనిస్థలాల్లో ప్రమాదాల సమయంలో ప్రాథమిక చికిత్సకు మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి. అయితే జిల్లాలో ఎక్కడా ఇవి అందుబాటులో లేవు. గాయపడిన కూలీలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రైవేటు ఆసుపత్రులకు పరిగెత్తాల్సి వస్తోంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం లేదు. చెట్ల కింద సేద..పెరుగుతున్న ఎండ వేడితో ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి రావడం కష్టమవుతోంది. రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు నాలుగు గంటల పని చేస్తున్నారు. పనులు ముగిసిన తర్వాత ఆన్లైన్లో హాజరు పూర్తిచేస్తారు. చెట్లు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే సేద తీరుస్తున్నారు. ఇక వేసవిలో ఎక్కువ నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ కూలీలు ఇంటి నుంచి బాటిల్స్లో నీళ్లు తీసుకెళ్తున్నారు. ఎండలకు అవి వేడెక్కుతున్నాయి. హాజరు పెరిగినా..జిల్లాలో 1.74 లక్షల జాబ్ కార్డులు, 3.20 లక్షల కూలీలు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 35 వేల మందికిపైగా హాజరవుతున్నారు. అర్హులకు పనులు కల్పిస్తున్నారు కానీ, వసతులు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు.అదనపు భత్యం బంద్..ఉపాధి కూలీలు వేసవిలో భూమి గట్టిగా ఉండడం, పొద్దస్తామనం పని చేయలేని పరిస్థితి ఉండంలో అదనపు భత్యం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మార్చిలో 20 శాతం, ఏప్రిల్లో 25 శాతం, మేలో 30 శాతం అదనపు భత్యం చెల్లించేవారు. నాలుగేళ్లుగా ఈ అదనపు కూలి చెల్లించడం లేదు. గతంలో రాగాస్ సాప్ట్వేర్ ద్వారా నమోదు చేసే సందర్భాల్లో అదనపు చెల్లింపులు నమోదుకు అవకాశం ఉండే. ప్రస్తుతం ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) సాప్ట్వేర్ వాడుతుండడం, కేంద్రం నేరుగా ఈ సాప్ట్వేర్ రూపొందించి వినియోగిస్తుండడంతో అదనపు కూలి చెల్లింపు నమోదుకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం జిల్లాలో డైవెర్షన్ డ్రైన్, రాళ్లకట్టలు, ఫీడర్ చానేల్, ఎంఐ ట్యాంకు, పశువుల పాకలు, కోళ్ల ఫారాల నిర్మాణం, చెక్డ్యాం, ఫామ్పాండ్, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, పార్మేషన్ రోడ్డు పనులు కొసాగుతున్నాయి. -
ఉపాధ్యాయులకు ముగిసిన ఏఐ శిక్షణ
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని విన్నర్స్ హైస్కూల్లో ఉపాధ్యాయులకు రెండు రోజు లు నిర్వహించిన ఏఐ శిక్షణ గురువారం ముగి సింది. ఎంఈవో సిద్ధ పద్మ మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలో ఏఐ టూల్స్ అమలు చేయడం ద్వారా విద్యార్థుల నమోదు మరింత పెంచవచ్చన్నారు. సెల్ఫ్ రీడింగ్ చేయవచ్చని తెలిపారు. నేర్చుకున్న అంశాలను తమ పాఠశాలలో అమలు చేయాలని సూచించా రు. ఇందులో కోర్సు కోఆర్డినేటర్ నరసయ్య, రిసోర్స్ పర్సన్లు దాసరి శంకర్, శివశంకర్, గజానంద్ కులకర్ణి, పాఠశాల కరస్పాండెంట్ రాజు పాల్గొన్నారు. -
అవగాహనతో అభివృద్ధి
నిర్మల్చైన్గేట్: ప్రజాప్రతినిధులు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై అవగాహన పెంచుకుని అందులో భాగస్వాములవుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని తిరుమల గార్డెన్స్లో ఇటీవల ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం శాఖల వారీగా సర్పంచులు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. చట్టాలపై అవగాహన ఉండాలి..అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులందరికీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రారంభించిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల అనారోగ్య సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉండాలిప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సూచించారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పరిష్కరించే విధంగా అధికారులతో కలిసి కృషి చేయాలన్నారు. అధికారులు పెండింగ్లో ఉన్న ఫైల్స్ 99 రోజుల ప్రణాళికలో భాగంగా పుష్కరించాలన్నారు. సమన్వయంతో పనిచేయాలిప్రజాసంక్షేమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం యువత ఉన్నారని, వీరంతా ఉత్సాహంగా ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేయాలన్నారు. సర్పంచులదే ముఖ్యపాత్రగ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తనులుగా వ్యవహరించాలన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో పరిపాలన జ్ఞానం పెరుగుతుందన్నారు. పలువురికి సన్మానం..అనంతరం పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ను అభివృద్ధి పథంలో నడిపిన ప్రజాప్రతినిధులను సన్మానించారు. సీఎం కప్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందించి, సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్మన్ అప్పాల కావ్య, అప్పాల గణేశ్చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ దత్తాత్రి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, డీఎల్ఎస్ఏ సెక్రెటరీ రాధిక, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆస్పిరేషన్బ్లాక్ అవార్డు పొందిన పెంబి మండల ప్రజాప్రతిధులతో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యేలుహాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు -
నీటిని పరిశీలించిన అధికారులు
లోకేశ్వరం: మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్, డీజిల్ లీక్ అవుతోందని, దీంతో తమ బోరు నీళ్లు వాసన వస్తున్నాయని బంక్ సమీపంలోని గడ్డం నరసింహరెడ్డి, గుడిసెల రాజేశ్వర్గౌడ్, రమేశ్గౌడ్ గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గురువా రం ముగ్గురు ఇళ్లకు వచ్చి బోరు వాటర్ను పరిశీలించారు. నమూనాలు సేకరించి జిల్లా జలవనరుల శాఖ జ్వలిస్టు నవనీత్కు పంపించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా జలవనరుల శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
ఆర్జీయూకేటీలో మాక్ డ్రిల్
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో పదో బెటాలి యన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించాలో విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. కమాండర్ మన్మోహన్ యాదవ్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. తన బృందంతో కలిసి వివిధ రకాల ప్రకృతి వైపరీత్యాలు (భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు) ఎదురైనప్పుడు అనుసరించాల్సిన రక్షణ పద్ధతులను ప్రత్యక్షంగా చేసి చూపారు. ఆపద సమయంలో తక్షణమే స్పందించే తీరు. ప్రథమ చికిత్స అందించే విధానం. అందుబాటులో ఉన్న వనరులతో ప్రాణాలను కాపాడుకోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం చేసిన ప్రదర్శనను ప్రశంసించారు. విద్యార్థులు చదువుతోపాటు విపత్తు నిర్వహణ నైపుణ్యాలను కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు డాక్టర్ ఎస్.విఠల్, శీలం శేఖర్, డాక్టర్ బి.శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. -
చెరువు లెక్క.. తేల్చాలి పక్కా..
16న వీసీతో విద్యార్థుల సమస్యలపై చర్చలు బాసర: బాసర ఆర్జీయూకేటీ టీసాస్ విద్యార్థుల బృందంతో సమస్యలపై ఈనెల 16న ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్తో చర్చలు ఉంటాయని టీసాస్ అధికార ప్రతినిధి బృందం తెలిపింది. విద్యార్థులు పలు సమస్యలను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ● కబ్జాల తీరుపై ప్రజల్లో నిరసననిర్మల్ఎస్పీని కలిసిన మున్సిపల్ చైర్మన్ భైంసాటౌన్: ఎస్పీ జానకీషర్మిలను భైంసా మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, రంజాన్ పండుగ ఏర్పాట్లపై చర్చించారు. పట్టణంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఆయన వెంట మీర్జా ఇద్రిస్ బేగ్ ఉన్నారు. జిల్లాకేంద్రంలోని కంచెరోని చెరువులో ఇటీవల చేపట్టిన ఆక్రమణల తొలగింపు నిర్మల్: ఇప్పటికీ సరైన లెక్కలు లేకపోవడం, ఉన్నవాటికి పక్కాగా హద్దులు, అడ్డుకట్టలు వేయకపోవడంతోనే జిల్లాలో చెరువులు ఇష్టారీతిన ఆక్రమణలకు గురవుతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలు ఉన్నా.. జిల్లాలో అవి ఎక్కడా అమలు కావడం లేదు. మళ్లీ ఎప్పుడైనా, ఎవరైనా ఫిర్యాదులు చేయడం, కోర్టుల్లో పిల్ వేసినప్పుడే తూతూమంత్రంగా జిల్లా లేక్ కమిటీ చర్యలు ఉంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలో పలు చెరువుల్లో ఆక్రమణల తొలగింపుతోపాటు వర్షాకాలం ముంపునకు గురికాకుండా చర్యలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటికై నా చెరువుల లెక్కను తేల్చాలని, పక్కాగా రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. అప్పట్లో కూల్చేశారు... చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వం హైడ్రా పేరుతో రక్షణ చర్యలు చేపడుతోంది. జిల్లాల్లోనూ లేక్ కమిటీలు వేసుకున్నారు. కానీ.. ఇక్కడ పక్కాగా చెరువుల రక్షణ చర్యలను చేపట్టడం లేదు. నాలుగేళ్లక్రితం ఇలా గే చెరువుల ఆక్రమణలపై దాఖలైన పిల్పై హైకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. అప్పటి కలెక్టర్ను కొన్నిగంటలపాటు కోర్టులో నిల్చోబెట్టింది. తప్పుడు సమాచారం ఇవ్వడంపై మరింత సీరియస్ అయ్యింది. చివరకు హైకోర్టు ఆదేశాలతో సదరు కలెక్టర్ చెరువుల్లో నిర్మించిన పలు కులసంఘాల భవనాలు, నిర్మాణాలను కూల్చివేయించడం, పోసిన మొరంమట్టిని పూర్తిగా తొలగింపజేయడం ఇప్పటికీ జిల్లావాసులకు గుర్తుంది. కానీ.. కొంతమంది కబ్జారాయుళ్లు పాతకథను మర్చిపోయి, మళ్లీ కొత్తగా వచ్చిన అధికారుల దగ్గర ఫైళ్లను కదిలించి, పనులు చేయించుకుందామనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. నీటికటకట తెలియదిచ్చట..పక్కాగా చర్యలు చేపట్టాలని.. చెరువుల్లో ఆక్రమణలు తొలగించడమే కాకుండా అసలు చెరువుల విస్తీర్ణమెంత.. బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంది.. ఎఫ్టీఎల్ ఎక్కడి దాకా ఉండాలి.. అనే లెక్కలతోపాటు చెరువుల చుట్టూ కందకం, ఫెన్సింగ్ ఏర్పాటు, హద్దులుగా కోన్ ఆకారపు కూన్లను ఏర్పాటు చేయాలని అప్పట్లోనే హైకోర్టు పక్కాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కొంతవరకే అమలు చేసి, మిగితావి లైట్గా తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం పక్కాగా చెరువుల రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. దాదాపు నాలుగు శతాబ్దాలుగా నిర్మల్ ప్రాంతంలో నీటిసమస్య లేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు నాటి పాలకులు ఎంతో ముందుచూపుతో తవ్వించిన గొలుసుకట్టు చెరువులే కారణం. ఓవైపు గోదావరి ఉన్నా.. జిల్లావ్యాప్తంగా చెరువులు తవ్వించారు. చుట్టూ ఉన్న అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల్లోనూ తాగునీటి కటకట ఉన్నా.. నిర్మల్లో మాత్రం ఇప్పటికీ ఆ సమస్య తలెత్తడం లేదు. ఎండాకాలం సైతం నిండుగా ఉండే గొలుసుకట్టు చెరువులతో నిర్మల్లో పుష్కలంగా భూగర్భజలాలు ఉంటాయి. -
పెండింగ్ పారితోషికాలు చెల్లించాలి
నిర్మల్ రూరల్: ఉపాధ్యాయుల పెండింగ్ పారితోషికాలు చెల్లించాలని తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డీఈవో భోజన్నకు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ మాట్లాడుతూ గతేడాది ఎస్సెస్సీ మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇప్పటివరకు పారితోషికం చెల్లించలేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఉపాధ్యాయ బృందానికి ఇప్పటివరకు రెమ్యూనేషన్ ఇవ్వలేదని తెలిపారు. సకాలంలో పెండింగ్ బకాయిలను చెల్లించేలా చూడాలని డీఈవోను కోరారు. ఇందులో సంఘ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
● ఏఎస్సీ సాయికిరణ్ మామడ: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం గుర్తుతెలియని వ్యక్తులకు ఇవ్వరాదని ఏఎస్సీ సాయికిరణ్ సూచించారు. మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గ్రామాల్లో సీసీటీవీలను అమర్చుకోవాలన్నారు. దీంతో నేరాలు నియంత్రించవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతను, ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దని పేర్కొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్రవాహనాలకు జరిమానా విధించారు. కార్యక్రమంలో సీఐ గోవర్ధన్రెడ్డి, ఎస్సైలు అశోక్, గోపి, శ్రావణి పాల్గొన్నారు. -
ఐక్యరాజ్యసమితి లక్ష్యాలపై అవగాహన
బాసర: బాసర ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్ లోని ఎస్డీజీ సెల్ విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (ఎస్ టీఈఎం) విద్య, ఐక్యరాజ్యసమితి లక్ష్యాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి పెంచడం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై అవగాహ న కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. అవగాహన పెంచడం, చర్చలో పాల్గొనడం, సమస్యలపై నిర్ణయాత్మక చర్య తీసుకోవడం వంటి మూడు ముఖ్య సూత్రాలను ప్రాధాన్యంతో వివరించారు. ప్రపంచ స్థాయిలో పేదరికం, విద్య లో పం, జల సంక్షోభం వంటి సమస్యలను ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు ఎలా పరిష్కరిస్తాయో వివరించారు. కార్యక్రమాన్ని సాయికిరణ్, హృషికేష్, శ్రావణ్, మనీష్ జావేద్ నిర్వహించారు. తర్వాత విద్యార్థులను పోటీ ప్రపంచానికి సిద్ధంచేసే ప్రయత్నంగా ఎస్టీఈఎం, ఎస్డీజీ లక్ష్యాలపై ఆధారపడిన క్విజ్ పోటీ నిర్వహించారు. ఎస్డీజీ సెల్ బృందాన్ని ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ప్రొఫెసర్ మురళీదర్శన్ ప్రత్యేకంగా అభినందించారు. -
మార్చిలోనే మాడు పగిలేలా..
నిర్మల్చైన్గేట్: శీతాకాలం ముగిసింది. వేసవి ప్రారంభంలోనే భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా నమోదైంది. ఒకవైపు వేడి.. ఇంకోవైపు ఉక్కపోత ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రతల కారణంగా దినసరి కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ పనుల్లో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గరిష్టంగా 39 డిగ్రీలు... జిల్లాలో మార్చి 1వ తేదీ నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు దాటింది. గతేడాదితో పోలిస్తే ఈసారి తీవ్రమైన ఉక్కపోత ఉందని పట్టణవాసులు పేర్కొంటున్నారు. వేడి గాలలు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. అరుబయట వివిధ రంగాల్లో పని చేసే వారికి చెమట రూపంలో శరీరంలోని నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతున్నాయి. దీంతో విపరీతమైన దాహం, నోరు తడి ఆరిపోవడం, కళ్లు తిరిగి సొమ్మసిల్లడం తదితర సమస్యల బారిన పడే ఆవకాశాలు ఉన్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఎండలకు ఉక్కపోతతోపాటు వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుందని, శరీరానికి నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరమని సూచిస్తున్నారు. వడదెబ్బకు చెక్ పెట్టేందుకు ఓఆర్ఎస్ ద్రావణం ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం నిర్మానుష్యంగా ప్రధాన రహదారి నిర్మానుష్యంగా రోడ్లు.. ఎండకు జిల్లా కేంద్రంలోని పలు చౌరస్తాలు, రోడ్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులపై బయటికి వెళ్తున్న వారు మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు, పండ్ల రసాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు -
పొట్టపల్లిలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’
లక్ష్మణచాంద: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని పొట్టపల్లి(కె) గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ చీపురు పట్టి స్థానికులతో కలిసి పరిసరాలు శుభ్రం చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ప్రత్యేక కార్యక్రమాల్లో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని తెలిపారు. అర్హత ఉన్న మహిళలందరూ మహిళా సంఘాల్లో చేరాలన్నారు. కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్తులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న మహిళా సంఘాల సభ్యులకు వివిధ వస్తువుల తయారీలో శిక్షణ ను ఇప్పించి మార్కెటింగ్ చేసుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. బాల్య వివాహాలు చేయొద్దని సూచించారు. తర్వాత, నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. రిజిస్టర్ పరిశీలించారు. మండల ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.విద్యార్థులతో మాట్లాడి రోజూ పాఠశాలకు రావాలని సూచించారు. బోర్డుపై రాసిన అక్షరాలను వారితో చదివిపించారు. పాఠశాల మరమ్మతు గురించి ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధ, సర్పంచ్ ముఖేష్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
పని చేసిన వారికే పదవులు
నిర్మల్చైన్గేట్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం బొజ్జు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మండల, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పార్టీ కోసం శ్ర మించి పని చేసే వారికి కమిటీలో అవకాశం అవకా శం ఇచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలి పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి చంద్రశేఖర్గౌడ్, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, అవేజ్, ఎంబడి రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా
సారంగపూర్/నిర్మల్ రూరల్: నిర్మల్ నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. సారంగాపూర్, నిర్మల్ రూరల్ మండలంలోని ధని, బోరిగాం, కంకెట, వైకుంఠాపూర్, వంజర్, ప్యారమూర్, మలక్చించోలి, తల్వెద, లంగ్డాపూర్, వెంగ్వాపేట్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భవ్యిత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు తీసుకువస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా సాధిస్తానన్నారు. వెంగ్వాపేట్లో ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు నరేశ్, బీజేపీ జిల్లా కార్యదర్శి విలాస్, నాయకులు తిరుమలచారి, సర్పంచులు గంగారెడ్డి, సాహెబ్రావు, రవళివిలాస్, జంగం ఆనంద్, ఈర్ల చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
ఆర్జీయూకేటీలో సోలార్ శిక్షణ బాసర ఆర్జీయూకేటీలో సోలార్ పీవీ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. నాలుగు వారాలు శిక్షణ కొనసాగుతుంది. IIలోu గురువులను గౌరవించాలి నిర్మల్ టౌన్: విద్యార్థులు గురువులను గౌరవించాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దివ్యాంగా శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నా రు. గురువుల సూచనలు పాటించి.. మంచి ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతోపాటు, క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యమిస్తున్నార ని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, డీఈవో భోజన్న, ప్రధానోపాధ్యాయులు వాణి, ఎన్జీవో చైర్మన్ మహేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో చూడగానే వావ్.. అనిపించేలా నైట్ లైటింగ్ వ్యూతో, పచ్చని వాకింగ్ ట్రాక్, కూర్చుని సేదదీరడానికి బెంచీలు, అక్కడక్కడ ఆకట్టుకునే ఫౌంటేన్లతో ఉన్న ఈ చెరువు హైదరాబాద్లోని చారిత్రక బమ్రుఖనుద్దౌలా చెరువు. మొన్నమొన్నటి దాకా చుట్టూ ఆక్రమణలతో, డ్రైనేజీ నీటితో దుర్గంధంతో ఉండేది. హైడ్రా దీనిపై దృష్టిపెట్టింది. స్వల్పకాలంలోనే ఆక్రమణలను తొలగించి, చారిత్రక చెరువుకు పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా.. ఓ టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసింది.నిర్మల్: ‘హైదరాబాద్లో చారిత్రక చెరువులన్నింటినీ మళ్లీ వెలికితీస్తూ, ఆక్రమణలను తొలగిస్తూ, మురికినీటిని వేరుచేస్తూ.. పూర్వవైభవం తీసుకువస్తున్నారు. అదే చారిత్రక నేపథ్యమున్న నిర్మల్ గొలుసుకట్టు చెరువులను మాత్రం పట్టించుకునే నాథుడు లేడు. అభివృద్ధి, వైభవం ముచ్చట దేవుడెరుగు.. కనీసం మురికినీరు కలువకుండా, ఆక్రమణలకు గురికాకుండా కాపాడేవారు లేరు..’ అని నిర్మల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు జిల్లాకేంద్రం, కలెక్టర్ మొదలు తహసీల్దార్ వరకు, ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ నుంచి జూనియర్ ఇంజినీర్ వరకూ ఇక్కడే ఉంటారు. కానీ.. కళ్లెదుటే చెరువులు కబ్జా అవుతున్నా.. చెత్తచెదారం, మురికినీటితో తన ఆనవాళ్లనే కోల్పోతున్నా.. పట్టింపులేటనుల వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రైనేజీలన్నీ చెరువుల్లోకే.. జిల్లాకేంద్రంలో ఇప్పటికీ ఓ డ్రైనేజీ సిస్టం అంటూ లేదు. అన్ని వీధుల మురికినీళ్లన్నీ సమీపంలోని ఏదో ఒక చెరువులోకి వెళ్లాల్సిందే. నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులు ఇప్పుడు మురికికుంటలుగా, డ్రైనేజీ ట్యాంకులుగానే ఉపయోగపడుతున్నాయి. వాటిల్లో మురికినీరు చేరడంతో గుర్రపుడెక్క, దోమలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మంచినీటితో గొలుసుకట్టు చెరువులను కలిపిన జౌళినాళా ఇప్పుడు పాతబస్తీలో ప్రధాన మురికికాలువలా మారింది. వేడుకలకు వేదికలుగా.. హైదరాబాద్లో ఒకప్పుడు కబ్జాలతో మురికికూపాలుగా ఉన్న చెరువులు ఇప్పుడు రాష్ట్రస్థాయి వేడుకలకు వేదికలుగా మారుతున్నాయి. వాటి చెంతనే బతుకమ్మ ఉత్సవాలు, కై ట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. నిర్మల్లోనూ కనీసం కొన్ని చెరువులనైనా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎలాగూ పార్కుల పెట్టేంతా స్థలాలు వదిలిపెట ్టలేదు. ఇలా చెరువుల వద్దనైనా పచ్చదనం, ఆహ్లాదాన్ని పెంచాలంటున్నారు. మురుగునీటిని చేరకుండా చేయడమే కాకుండా పూడికతోపాటు, చెరువుల్లో ఆక్రమణలనూ తొలగించాలని, మన చెరువులకూ అభివృద్ధి ‘భాగ్యాన్ని’ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగని ఆక్రమణలు..ఈ ఫొటో జిల్లాకేంద్రంలోని మంజులాపూర్–ప్రియదర్శినీనగర్ మధ్యలో గల చిన్నరాంసాగర్ చెరువుది. చుట్టూ ఉన్న కాలనీల డ్రైనేజీలన్నీ ఇదే చెరువులో కలుస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు చుట్టూ ఆక్రమణలు. ఓవైపు మురికినీటి దుర్గంధం, మరోవైపు బడాబాబుల కబంధహస్తాలతో విశాలమైన చెరువు కుచించుకుపోతోంది. చుట్టూ కాలనీలకు దుర్గంధాన్ని పంచుతూ, దోమలు, పాములను పెంచుతోంది. ఇదొక్క చెరువే కాదు.. జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువులన్నింటిదీ ఇదే దుస్థితి. హైదరాబాద్లో హైడ్రాలా ఇక్కడా పనిచేస్తామంటూ జిల్లా అధికారులతో కూడిన లేక్ కమిటీ చెబు తున్నా.. చెరువుల్లో ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. అప్పుడప్పుడు, ఒకట్రెండు చెరువుల్లో ఆక్రమణల తొలగింపు పేరిట మట్టిని తీయడం, హద్దురాళ్లను కూల్చ డం చేసి చేతులు దులుపుకుంటున్నారు. చెరువుల రక్షణ కోసం కోర్టులు ఇచ్చిన ఒక్క ఆదేశాన్నీ అధికారులు అమలు చేయడం లేదు. -
విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి
లక్ష్మణచాంద: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్సింగ్ యాదవ్ పేర్కొన్నారు. సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు, గ్రామస్తులకు విపత్తులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తూ అవగాహన కల్పించారు. భారీ వర్షాలతో వరదలు ఏర్పడినప్పుడు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు ప్రజలు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువవుతున్న దృష్ట్యా వేడి గాలులు వీచినప్పుడు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు వరదలు సంభవించి నప్పుడు తమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. తహసీల్దార్ మల్లేశ్, ప్రధానో పాధ్యాయురాలు ఆరాధన, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
లక్ష్మణచాంద: మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాధికారి భోజన్న తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ సంద్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. సాక్షి: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయా? డీఈవో: మరో మూడురోజుల్లో ప్రారంభం కా నున్న పదోతరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. సాక్షి: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? డీఈవో: విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తాగు నీటి వసతితోపాటు, విద్యార్థులకు సరిపడా బెంచీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించాం. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం. సాక్షి: వేసవి దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? డీఈవో: వేసవి దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల కు మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచుతాం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. సాక్షి: పరీక్ష కేంద్రాల్లోకి ఎప్పుడు అనుమతి ఇస్తారు? డీఈవో: పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రంకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభం అయిన తరువాత 5 నిమిషాల వరకు అనుమతిస్తాం. నిమిషం నిబంధన లేదు. సాక్షి: జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించలేదని హాల్ టికెటు ఇవ్వడం లేదు. అటువంటి వారిపై ఏం చర్యలు తీసుకుంటారు? డీఈవో: ఇప్పటి వరకు తమకు విద్యార్థులు ఎవరూ హాల్ టికెట్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయలేదు. ఆన్లైన్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించాం. హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయుల సంతకం లేకున్నా పరీక్షకు అనుమతిస్తారు. సాక్షి: జిల్లాలో ఎంత మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు? డీఈవో: జిల్లాలో మొత్తం 9,750 మంది విద్యార్థులు పది వార్షిక పరీక్షకు హాజరు కానున్నారు. ఇందులో 4,786 బాలురు, 4,964 బాలికలు ఉన్నారు. సాక్షి: ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు? డీఈవో: జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. 535 ఇన్విజిలేటర్లు, 47 మంది సీఎస్లు, 47 మంది డీవోలు, 13 మంది అడిషనల్ డీవోలను నియమించాం. ఏడుగురు సెంటర్ కస్టోడియన్స్, సిట్టింగ్ స్క్వాడ్లు 47, ఫ్లయింగ్ టీంలు 3 ఏర్పాటు చేశాం. సాక్షి: సందేహాలు ఎలా నివృత్తి చేసుకోవాలి? డీఈవో: విద్యార్థుల సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఉంటే 9059987730 నంబర్కు ఫోన్ చేసి పరిష్కరించుకోవాలి. సందేహాలు నివృత్తి చేసుకోవాలి. -
దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
భైంసా: ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి.విఠల్రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని ఆలయాలకు సంబంధించిన అంశాలపై వినతిపత్రం అందజేశారు. లోకేశ్వరం మండలం వటోలి గ్రామంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం ఫైలు సీజీఎఫ్లో పెండింగ్లో ఉందని తెలిపారు. నియోజకవర్గంలో నిర్మాణానికి ప్రతిపాదించిన 12 దేవాలయాల టెండర్ ప్రక్రియకు ఆమోదం తెలపాలని కోరారు. ఇంకా 10 ఆలయాలకు సంబంధించిన సీజీఎఫ్ మంజూరు ప్రక్రియను పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేశా రు. గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని ఆల య అభివృద్ధి, యాత్రీకుల సౌకర్యాల కోసం భారీగా నిధులు మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటా మని మంత్రి హామీ ఇచ్చినట్లు విఠల్రెడ్డి తెలిపారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్మల్టౌన్: ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో మంగళవారం పర్యటించారు. కాలనీలలో తడి, పొడి చెత్త ను వేర్వేరుగా సేకరించడం వల్ల కలిగే ప్ర యోజనాలను ప్రజలకు వివరించారు. పట్ట ణంలో పరిశుభ్రత కోసం తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, డీఈ హరిభూశణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
వేం నరేందర్రెడ్డిని కలిసిన శ్రీహరిరావు
నిర్మల్చైన్గేట్: తెలంగాణ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడికి శుభాకాంక్షలు.. భైంసారూరల్: నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న వేం నరేందర్రెడ్డిని హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో విఠల్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. వేం నరేందర్రెడ్డిని అభినందిస్తున్న విఠల్రెడ్డి, శ్రీహరిరావు -
అనర్హుల రేషన్ కట్!
జిల్లాలో ఇలా... సన్న బియ్యం అర్హులకు మాత్రమే అందాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అనుమానిత రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. అనుమానిత కార్డుల జాబితా అందినా.. ఇంకా ఎలాంటి తొలగింపు ప్రక్రియ ప్రారంభించలేదు. జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో 582 రేషన్ దుకాణాల ద్వారా 4381 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. 2,47,671 రేషన్ కార్డులు ఉండగా.. 7,69,049 మందికి లబ్ధి చేకూరుతోంది. అయితే, వీరిలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినవారు, 4 ఎకరాలకుపైబడి వ్యవసాయ భూమి ఉన్నవారు, అధిక వార్షికాదాయం ఉన్న వారు, రెండు రేషన్కార్డుల్లో పేర్లు ఉన్న వారిని గుర్తించి 3,430 అనుమానిత కార్డుల జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగించనున్నారు. భైంసాటౌన్: తెల్ల రేషన్కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అనర్హుల రేషన్కార్డులు తొలగించనుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా అనుమానిత కార్డుల జాబితాను రూపొందించింది. 3,430 అనుమానిత రేషన్కార్డులు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులకు జాబితా పంపింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, అనర్హులుగా తేలితే వాటిని తొలగించాల్సి ఉంది. అయితే, అనుమానిత రేషన్కార్డుల తొలగింపునకు సంబంధించి మార్గదర్శకాలు రాలేదని సివిల్ సప్లయ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వారు, నాలుగెకరాలకుపైబడి వ్యవసాయ భూమి ఉన్నవారు, అత్యధిక వార్షిక ఆదాయం, రెండు రేషన్కార్డుల్లో పేర్లు ఉన్నవారిని అనర్హులుగా గుర్తించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పక్కదారికి కట్టడి.. పేదలకు చౌకధరలకే బియ్యం అందించేందుకు ప్రభుత్వాలు తెల్ల రేషన్కార్డులు మంజూరు చేస్తుంది. అయితే, పలు ప్రభుత్వ పథకాలకు తెల్లరేషన్కార్డు ప్రామాణికం కావడంతో, పేదలే కాకుండా ధనికవర్గాలు సైతం తెల్ల రేషన్కార్డులు పొందారు. దీంతో ఇలాంటివారు రేషన్షాపుల్లో బియ్యం తీసుకుని బ్లాక్లో అమ్ముకుంటున్నారు. గతంలో దొడ్డుబియ్యం ఉండడంతో విక్రయించుకునేవారు. ప్రస్తుతం సన్నబియ్యం అందిస్తుండడంతో బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం అనర్హుల కార్డుల తొలగింపు చేపట్టింది. అంతేగాక, గతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉండి రేషన్కార్డు పొందినవారిలో తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందడం, ఆదాయం పెరిగినా రేషన్కార్డు కలిగి ఉన్నవారున్నారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు రేషన్కార్డులో ఉండటంతో వారి పేరుతో ప్రభుత్వం నుంచి బియ్యం అలాట్ అవుతోంది. దీంతో కేటాయించిన బియ్యం పక్కదారి పడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అనర్హుల తొలగింపు ప్రక్రియతో బియ్యం బ్లాక్ మార్కెట్ తగ్గనుంది. జాబితా అందింది... రాష్ట్ర ప్రభుత్వం అనుమానిత రేషన్కార్డుల జాబితాను పంపింది. జిల్లాలో మొత్తం 3,430 కార్డులు ఉన్నట్టు జాబితా వచ్చింది. తొలగింపునకు సంబంధించి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, డీసీఎస్వో, నిర్మల్ -
పిప్రి లిఫ్ట్కు మహర్దశ
భైంసా: ముధోల్ నియోజకవర్గంలోని పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. దీంతో లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందే మార్గం సుగమం కానుంది. ఈ నిర్ణయంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ముధోల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, చెరువుల మరమ్మతులు చేపట్టాలని ఆయన పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. హైదరాబాద్కు వెళ్లిన ప్రతీసారి సంబంధిత మంత్రులను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ముఖ్యంగా పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కోసం ఎమ్మెల్యే ప్రత్యేకంగా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని పలుమార్లు కలిసి ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రికి రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే నిరంతర కృషికి స్పందించిన ప్రభుత్వం తాజాగా రూ.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయితే లోకేశ్వరం మండలంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రస్తుతం వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. పంటల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పిప్రి లిఫ్ట్కు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందేలా కృషి కొనసాగిస్తామని తెలిపారు. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి, ఇన్చార్జి మంత్రికి ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. -
‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కొనసాగించాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజల వద్దకు మరింత మెరుగ్గా చేరవేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూమ్ కాల్ ద్వారా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు విజయవంతంగా పూర్తి చేయాలని, అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు. ఈ నెల 12న, సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామంలోని ఆదిత్య గార్డెన్స్లో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతో పెంబి ప్రగతి
నిర్మల్చైన్గేట్: ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమష్టి కృషితో పెంబి ప్రగతి సాధ్యమైందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా, సోమవారం జరిగిన నీతి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్లో కలెక్టర్ పాల్గొన్నారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాకు కార్యక్రమం కింద పెంబి మండలంలో చేపట్టిన విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చేసిన కృషి, తద్వారా సాధించిన ప్రగతి వివరాలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పెంబి అభివృద్ధిలో ఎదురైన సవాళ్లు, చేపట్టి చర్యలు వెల్లడించారు. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, మహిళలు, గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాల నివారణ, రోగాల నిర్ధారణ, నివారణ, భూసార పరీక్షల నిర్వహణ, అక్షరాస్యత, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, మౌలిక సదుపాయాల మెరుగు తదితర అంశాల్లో అద్భుత ప్రగతి సాధించినట్లు వివరించారు. పెంబి బ్లాకు విజయ ఖ్యాతి మరోసారి చాటిచెప్పేందుకు ఈ నీతి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ వేదికయ్యిందన్నారు. -
నిర్మల్లో పోలీస్ ఔట్పోస్ట్
నిర్మల్ టౌన్: నిర్మల్లో కొత్త పోలీస్ ఔట్పోస్ట్ ప్రారంభించాలని ఎస్పీ జానకీషర్మిల నిర్ణయించారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణం వేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుతోంది. దీంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యం పట్టణ విస్తరణకు తగినట్లుగా ఎస్పీ భద్రతా చర్యలను బలోపేతం చేశారు. పోలీస్ ఔట్పోస్ట్ ద్వారా ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించనున్నారు. పాత భరోసా కేంద్రంలో.. జిల్లా పోలీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న పా త భరోసా కేంద్రంలో టౌన్ ఔట్పోస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. పట్టణ కాలనీల్లో ట్రాఫిక్, చిన్న వివాదాలు, చట్ట సంబంధిత అంశాలను త్వరగా పరిష్కరిస్తారు. స్థానికులకు సేవలు సులభంగా చేరుకునేలా రూపొందించారు. ఔట్పోస్ట్ కవరేజీ ప్రాంతాలు నిర్మల్ పట్టణంలోని 23 ప్రాంతాలు ఈ ఔట్పోస్ట్ పరిధిలోకి వస్తాయి. గాజుల్పేట్, బర్కత్పూర్, లక్ష్మీనగర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, ప్రియదర్శిని నగర్, ఎన్టీఆర్ మార్గ్, జోహ్రానగర్, ఈద్గాం, ఆదర్శనగర్, సిద్ధాపూర్, రామ్నగర్, విద్యానగర్, సోఫీనగర్, భాగ్యనగర్, రూరల్ స్టేషన్ ప్రాంతాలు, కోర్టు ఏరియా, మున్సిపల్, ఆర్డీఓ కార్యాలయాలు, పంజేష్గల్లీ, గోల్డెన్ ఫంక్షన్ హాల్, తిరుమల థియేటర్, సాగర్ కాలనీ, నటరాజ్నగర్. ఔట్పోస్టుకు టౌన్ సీఐ ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. ముగ్గురు ఎస్సై, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి.. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్, బుధవార్పేట్, కచ్చి కాలనీ, కబూతర్కమాన్, గాంధీచౌక్, నాయుడువాడ, కాల్వగడ్డ, బేస్తవార్పేట్, దోబీగల్లి, బంగ్లాపేట్, ధ్యాగావా డ, బ్రహ్మపురి, వెంకటాద్రిపేట్, సోమవార్పే ట్, పింజారిగుట్ట, అత్తర్ గల్లి, ఓల్డ్ బస్టాండ్, షే క్స్ పేట్, బైల్ బజార్, సోనార్ గల్లీ (చింతకుంట వాడ), ఇస్లంపుర, కురాన్నపేట్, కోలి బండ, బాగులవాడ, ఇంద్రనగర్, బోయివాడ, గొల్ల పేట్, శాసీ్త్రనగర్, దత్తాత్రేయ నగర్, ఏఎన్ రెడ్డి కాలనీ, దివ్య నగర్, శాంతినగర్, వెంకటాపూర్, చైన్గేట్, పాన్గల్లీ టౌన్వన్లోకి వస్తాయి. వేగవంతమైన సేవల కోసం.. ప్రజలకు మరింత వేగవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు నిర్మల్ టౌన్ ఔట్పోస్టు ఏర్పాటు చేశాం. దీంతో ప్రజలకు సౌకర్యవంతమైన పోలీసు సేవలు, కేసులు, ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించవచ్చు. ఈ మార్పును ప్రజలు గమనించి, తమకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదులను ఏ స్టేషన్ పరిధిలోకి వస్తాయో.. చూసుకుని సంప్రదించాలి. – జానకీషర్మిల, ఎస్పీ -
హక్కుల కోసం సంఘటితం కావాలి
భైంసారూరల్: శ్రామిక మహిళల ఉపాధిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, సమాజంలో ఉన్న పురుషాధిపత్య ధోరణులకు ఎదు రు నిలవాలంటే మహిళలు సంఘటితంగా ఉ ద్యమించాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి హరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా పోరా ట దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మండలంలోని హంపోలి గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న అన్యాయాలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. శ్రామిక మహిళలకు సముచిత ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వారి హక్కులను పరిరక్షించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు లక్ష్మి, రుక్మ, గంగమణి, సునీత తదితరులు పాల్గొన్నారు. -
కౌలుకు ఇస్తే కబ్జా చేశాడు..
రిహాబిలిటేషన్ కింద పాత లోలంలో నా భూమికి బదులు ప్రభుత్వం కొత్త లోలంలో ఐదు ఎకరాల భూమి, ఇంటి స్థలం మంజూరు చేసింది. ఐదు సంవత్సరాలు కొత్త లోలంలో ఉన్న తర్వాత నేను నా ఐదు ఎకరాల భూమిని ఒక వ్యక్తికి కౌలుకు ఇచ్చి అంగీకార పత్రం రాయించుకుని పాక్ పట్ల గ్రామంలో స్థిరపడ్డాను. ప్రస్తుతం ఆ వ్యక్తి కౌలు భూమి తనదేనని కోర్టుకు వెళ్లాడు. నా భూమిని నాకు ఇప్పించాలి. – సిరిగిరి ముత్తవ్వ, పాక్ పట్ల ఆన్లైన్లో ప్రభుత్వ భూమి అని చూపిస్తుంది నాకు పెంచి గ్రామంలోని సర్వే నంబర్ 375/5/1 లో 1.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాత, ముత్తాతల నుండి వారసత్వముగా సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు అది గవర్నమెంట్ భూమి అని ఆన్లైన్లో చూపిస్తుంది. అధికారులు రికార్డులు పరిశీలించి ఆన్లైన్లో సరిచేయగలరు. – శంకర్, పెంబి -
సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు
లక్ష్మణచాంద: సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని లక్ష్మణచాంద మండల వ్యవసాయాధికారి వసంత్రావు తెలిపారు. ఇందులో డ్రోన్స్ పీఏసీఎస్, ఎస్హెచ్జీలు, ఎఫ్పీవోలకు మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ధరలు, సబ్సిడీ వివరాలను వెల్లడించారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్తో ఏఈవోలను సంప్రదించాని తెలిపారు. పసుపు బాయిలర్ 4 డ్రమ్స్ పూర్తి ధర రూ.5,42,800సబ్సిడీ రూ.1,00,000చెల్లించాల్సిన మొత్తం రూ.4,42,800పసుపు పోలిష్ డ్రమ్ 6 ఫీట్ పూర్తి ధర రూ.1,35,700సబ్సిడీ రూ.60,000చెల్లించాల్సిన మొత్తం రూ.75,700పసుపు పోలిష్ డ్రమ్ 8 ఫీట్ పూర్తి ధర రూ.1,87,620సబ్సిడీ రూ.60,000చెల్లించాల్సిన మొత్తం రూ.1,27,620ముల్చర్ పూర్తి ధర రూ.2,02,650 సబ్సిడీ రూ.72,500చెల్లించాల్సిన మొత్తం 1,30,150 డ్రోన్స్ పూర్తి ధర రూ.9,49,200 సబ్సిడీ రూ.3,79,680చెల్లించాల్సిన మొత్తం రూ.5,69,520 -
జిల్లాకు పదవీయోగం లేదా..!?
నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. జిల్లాల పునర్విభజన చేపట్టింది. నిర్మల్ జిల్లాగా ఏర్పడింది. అయితే కొత్త జిల్లాపై గత పాలకులు వివక్ష చూపారు. పరిశ్రమలు మంజూరు చేయలేదు. కనీసం జిల్లా నేతలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ఈసారి కూడా నామినేటెడ్ పోస్టులు దక్కడం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీది కూడా అదేతీరు. పార్టీ ఏదైనా.. జిల్లా నేతలకు మాత్రం పదవులు దక్కడం లేదు. చుట్టూ ఉన్న జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలోనే ఇద్దరు ముగ్గురు నేతలకు రాష్ట్రస్థాయి పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెడుతున్నారు. జిల్లాలో సీనియర్లు ఉన్నా.. పార్టీ కోసం శ్రమిస్తున్న నేతలు పదవులను ఆశిస్తున్నా.. అధిష్టానాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ నడుస్తుంది. దీంతో మరోసారి జిల్లానేతలు అధిష్టానం వైపు చూస్తున్నారు. ఈసారైన జిల్లా నేతలకు పదవులు ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు. చుట్టూ పదవులే.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతోమంది సీనియ ర్లు పనిచేస్తున్నారు. ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెడ్మబొజ్జు పటేల్కు డీసీసీతోనే సరి పెట్టారు. డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్నేత శ్రీహరిరావును నియోజకవర్గ ఇన్చార్జికే పరిమి తం చేశారు. మాజీమంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డి, నారాయణరావు పటే ల్, గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ తదిత ర సీనియర్ నేతలెవరికీ రాష్ట్రస్థాయి పదవులు ఇవ్వ డం లేదు. వరుస ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించారు. పంచాయతీలతో పాటు, మున్సిపాలిటీల్లోనూ ఎక్కువ స్థానాలు కాంగ్రెస్సే దక్కించుకునేలా చేశారు. సీనియర్లంతా సమష్టిగా కృషిచేసి నిర్మల్ మున్సిపల్నూ కై వసం చేసుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ఇలాంటి సీనియర్లకు ఇప్పటికై నా గుర్తింపునివ్వాలని, జిల్లాకు నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులే డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈసారైనా జిల్లాకు పదవీయోగం ఉంటుందా.. లేదా.. అనేది వేచిచూడాల్సిందే. ఒక్కటీ ఇవ్వలె.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ అన్నిజిల్లాలకూ ప్రాధాన్యం ఇనిస్తున్నా జిల్లాపై మాత్రం చిన్నచూపు చూస్తోంది. నిధుల మాట అటుంచి, కనీసం జిల్లాకు పదవులను ఇచ్చయినా సంతోషపెట్టడం లేదు. కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర పోస్టుల కేటాయింపులో జిల్లాను పట్టించుకోవడం లేదన్న వాదన పెరుగుతోంది. నాలుగైదు నెలల క్రితం ఇచ్చిన పదవుల్లోనూ జిల్లాకు మొండిచేయే చూపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావుకు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా ఆయన తీసుకోకపోవడం గమనార్హం. -
నిర్మల్
ఆత్మవిశ్వాసమే ఆయుధం పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చు. సమస్యలు పరిష్కరించాలి లక్ష్మణచాంద: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కేజీబీవీలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో 29 రోజులు సమ్మె చేశామన్నారు. అలాగే మినిమం టైం స్కేల్ చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలనానరు. ఇందులో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, కేజీబీవీ ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు ప్రభుత్వం ఊపిరి పోసింది. నిధుల లేమితో పదేళ్లుగా నిస్తేజంగా ఉన్న ఆత్మకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు కేటాయించింది. దీంతో తిరిగి రైతు శిక్షణ కార్యక్రమాలు, కిసాన్ మేళాలు, విజ్ఞాన యాత్రలు, క్షేత్ర పర్యటనలు కొనసాగించే అవకాశం ఏర్పడింది. కమిటీల ఏర్పాటు.. ఆత్మ పథకంలో భాగంగా ఏర్పాటు చేసే గవర్నింగ్ బోర్డు మూడు నెలలకోసారి సమావేశమై ప్రగతి నివేదికలను సమీక్షిస్తుంది. అవసరమైన బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. బ్లాక్ స్థాయిలో ఆత్మ కింద ఫార్మర్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వయిజరీ సెంటర్ ఏర్పాటు చేస్తారు. జిల్లాలోని వ్యవసాయ డివిజన్లలో వ్యవసాయ సహాయ సంచాలకులు కన్వీనర్గా ఉంటారు. ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఎఫ్ఏసీ (ఫార్మర్ అడ్వయిజరీ కమిటీ)ల్లో 11 నుంచి 15 మంది మహిళలు, రైతు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. నెలకోసారి సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. రైతులకు ప్రయోజనం.. ఈ సంస్థ ద్వారా బ్లాక్, జిల్లా స్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతులను వ్యవసాయ విజ్ఞాన యాత్రలకు పంపించి పంట క్షేత్రాలను పరిశీలింపజేస్తారు. కిసాన్ గోష్టి నిర్వహిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు తెలుపుతారు. ప్రస్తుతం వ్యవసాయం ఆధునిక పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో విజ్ఞాన యాత్రలు రైతులకు మేలు చేయనున్నాయి. ఏ ప్రాంతంలో వ్యవసాయంలో ఎలాంటి పరికరాలు వాడుతున్నారు, అవి తమ ప్రాంతాల్లో వాడొచ్చా అనే విషయాన్ని రైతులు తెలుసుకుంటారు. వ్యవసాయ అధికారే ఇన్చార్జి..నిర్వహించే కార్యక్రమాలు.. జిల్లాల విభజన తర్వాత ఆత్మ పథకానికి నిధులు నిలిచిపోవడంతో వాటి ద్వారా నిర్వహించే కార్యక్రమాలు కూడా నిలిచి పోయాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులనే ఇన్చార్జిగా నియమించింది. ఆత్మ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కేటాయించగా.. జిల్లాకు సుమారు రూ.16.30 లక్షలు కేటాయించారు. నిధులు వచ్చాయి.. ఆత్మ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.16.30 లక్షలు మంజూరయ్యాయి. కలెక్టర్ అనుమతి తర్వాత కార్యక్రమాలు చేపడతాం. ఇక నుంచి రైతులకు విస్తృత సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే ఆత్మ సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి. – అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించాలి
నిర్మల్చైన్గేట్: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తం అయ్యేలా, విపత్తులను ఎదుర్కొనేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం, వరదల సమయంలో, ప్రకతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో అవగాహన కల్పించాలన్నారు. ఈమేరకు కార్యక్రమాల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. నిర్మల్ పట్టణంతోపాటు, వరద ప్రభావిత మండలాల్లో ముందస్తు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా సామాజిక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా, వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ముందస్తు అవగాహన కల్పిస్తే ప్రాణ, ఆస్తి నష్టాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్యాదవ్, లైజనింగ్ ఆఫీసర్ జగదీష్, జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్, పరిశ్రమల శాఖ డీఎం నరసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణి అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సూచించారు. త్వరలోనే పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్లి, విద్యార్థులతో మాట్లాడి వారికి సూచనలు చేయాలన్నారు. -
ఆర్జీయూకేటీలో అంతఃప్రజ్ఞ–2026
బాసర: బాసర ఆర్జీయూకేటీలో సాంకేతికత, సృజనాత్మకత, విద్యార్థుల ఉత్సాహం కలిసిన జాతీయస్థాయి అంతఃప్రజ్ఞ–2026 కార్యక్రమం ఈనెల 13 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్కు సంబంధించిన భారీ బ్యానర్ ఆవిష్కరణ, డ్రోన్ ప్రదర్శన, ఫ్లాష్మాబ్ ఆదివారం నిర్వహించారు. భారీ బ్యానర్పై అంతఃప్రజ్ఞ 2026 లోగోతోపాటు కార్యక్రమ వివరాలు ప్రదర్శించారు. డ్రోన్ ప్రదర్శనలో ఆకాశంలోకి ఎగసిన డ్రోన్ మహోత్సవాన్ని ప్రతిబింబించే చిన్న బ్యానర్ను విడుదల చేసింది. విద్యార్థుల ఫ్లాష్మాబ్ ఇక విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్మాబ్ ఆకట్టుకుంది. ఇది కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఫ్యాకల్టీ కన్వీనర్ జె.స్వప్నిల్, సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.రాములు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడు రోజుల మహోత్సవానికి దేశవ్యాప్తంగా 25 వేల మందికిపైగా విద్యార్థులు, సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రతిభలకు జాతీయ వేదికగా నిలుస్తుంది. విద్యార్థి సమన్వయకర్తలు కె.వివేక్, జి.వంశీ, ఎం.వెంకటకృష్ణ పాల్గొన్నారు. -
పుష్కరఘాట్ మంజూరు చేయాలి
ఖానాపూర్: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామంలోని గోదావరి వద్ద నూతన పుష్కరఘాట్ మంజూరు చేయాలని సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, ఉపసర్పంచ్ మాదస్తు నవీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు విన్నవించారు. ఉట్నూర్లోని క్యాంపు కార్యాలయంలో గ్రామ వార్డు సభ్యులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యేను ఆదివారం కలిశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు రాజశంకర్, భీంరాజ్, రాజేశ్వర్, ఎనగంటి హరి, రాజేందర్, ఎం.శంకర్ తదితరులు ఉన్నారు. -
పూరికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు
నిర్మల్ టౌన్: నిర్మల్ నుంచి ఆర్టీసీ బస్సు అన్నవరం, సింహాచలం, అరసవెల్లి, కోణార్క్ మీ దుగా పూరికి ఆదివారం బయల్దేరింది. డిపో మేనేజర్ పండరీ బస్సును ప్రారంభించారు. ఈ యాత్ర ఆరు రోజులు కొనసాగుతుందని తెలిపారు. ఏప్రిల్లో అయోధ్య, కాశీ, గోవాకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ దేవపాల, సిబ్బంది శకుంతల, విజీ.రెడ్డి, రమణ, భక్తులు పాల్గొన్నారు. లక్కీ స్కీం నిర్వాహకులపై చర్య తీసుకోవాలి ఖానాపూర్: లక్కీ స్కీం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్న నిర్వాహకులపై చర్య తీసుకోవాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్ డిమాండ్ చేశారు. పట్టణ పరిధిలోని వ్యాపార సముదాయాన్ని విక్రయించేందుకు లక్కీ డ్రా పేరుతో బంపర్ ఆఫర్ పెట్టి మోసం చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లక్కీ డ్రా పేరుతో నిర్వాహకులు మోసం చేశారని బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేవలం ఒకరిపై నామమాత్రపు కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రూ.వేయి చొప్పున వసూలు చేసిన వారందరికీ డబ్బులు తిరిగి ఇప్పించాలన్నారు. -
నకిలీ హాజరుకు చెక్
నిర్మల్7నీతి ఆయోగ్ ‘బెస్ట్ ప్రాక్టీసెస్’కు పెంబి నిర్మల్చైన్గేట్: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద నిర్వహించే ‘బెస్ట్ ప్రాక్టీసెస్’ సెమినార్కు జిల్లాలోని పెంబి ఆస్పిరేషనల్ బ్లాక్ ఎంపికై నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే ఉన్నతస్థాయి సెమినార్లో పెంబి బ్లాక్ సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలకరంగాల్లో పెంబి మండలం గణనీయమైన పురో గతి సాధించినందుకు ఈ అవకాశం దక్కిందని వివరించారు. రాష్ట్రం నుంచి నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు మాత్రమే ఈ సెమినార్కు ఎంపిక కాయ్యాయని తెలిపారు. పెంబి బ్లాక్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ వేదికపై ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. లక్ష్మణచాంద: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా నిధుల దుర్వినియోగం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో పథకంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు. ఇక నకిలీ హాజరు నమోదుకు చెక్ పెట్టేందుకు పనులకు హాజరయ్యే కూలీలకు ముఖగుర్తింపు హాజరు(ఎఫ్ఆర్ఎస్) చేస్తున్నారు. మార్చి 2 నుంచి కొత్త యాప్లో కూలీల హాజరు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. కూలీల హాజరు తీసుకునే సమయంలో కూలీ ఫొటో, ఈకేవైసీ ప్రక్రియలో పొందుపరిచిన ఫొటో ఒకేలా ఉంటేనే హాజరు నమోదవుతుంది. నూతన యాప్తోనే... గతేడాది ఆగస్టు నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్లో జిల్లాలోని కూలీల ఈ కేవైసీ ప్రక్రియ ఉపాధి హామీ సిబ్బంది పూర్తి చేశారు. తర్వాత ఎన్ఎంఎంఎస్ నూతన యాప్ను క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, మేట్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నూతన యాప్లో కూలీల హాజరును నమోదు చేస్తున్నారు. నమోదు ఇలా.. పని ప్రదేశానికి వెళ్లిన క్షేత్ర సహాయకులు ముందుగా యాప్లో పనులకు వచ్చిన వ్యక్తి పని ఐడీ నంబర్ ఎంచుకుని మస్టర్లో కనిపించే పేర్లపై కూలీ ఫోటో తీసి నమోదు చేస్తున్నారు. అప్పుడు ఈ కేవైసీ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం తీసిన ఫొటో ఒకరిదే అయితే కూలీ హాజరు నమోదు అవుతుంది. అలాగే పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కూలీ పనులకు వచ్చిన మొత్తం సభ్యుల గ్రూపు ఫొటో మరోసారి తీసి యాప్లో నమోదు చేస్తారు. ఇలా రెండుసార్లు ఫొటో తీసి ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియ ద్వారా నిత్యం కూలీ పనులకు వచ్చేవారి హాజరును నమోదు చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదుతో కూలీలకు డబ్బులు చెల్లింపు సమయంలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో అనేక సంఘటనలు.. జిల్లా వ్యాప్తంగా 1,74,318 జాబ్ కార్డులు ఉన్నాయి. 3,20,936 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 88,475 యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. గతంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఒకరికి బదులు మరొకరు పనులకు వెళ్లి హాజరు వేసుకున్నారు. అనంతరం చేపట్టిన సామాజిక తనిఖీల్లో పలుమార్లు ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధ్యుల నుంచి నిధులు రికవరీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో నకిలీ హాజరు నమోదకు ఆస్కారం ఉండదని అధికారులు అంటున్నారు.జిల్లా సమాచారం... జిల్లాలో మొత్తం జీపీలు 400 మొత్తం జాబ్ కార్డులు 1,74,318 మొత్తం కూలీల సంఖ్య 3,20,936 యాక్టివ్ జాబ్ కార్డులు 88,475 -
బాసరలో భక్తుల రద్దీ
బాసర : బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇన్చార్జి ఈవో విజయరామారావు. ఏఈవో గంగ శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో వివిధ పాఠశాలల విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. పరీక్ష ప్యాడ్లు, హాల్ టికెట్లు, పెన్నులు అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు చేయించారు. వెయ్యి రూపాయల ప్రత్యేక అక్షరాభ్యాసం 613, రూ.150 సాధారణ అక్షరాభ్యాసం 331, చండీహోమం, అభిషేక లడ్డూ, మహా ప్రసాదం, పులిహోర, మండప ప్రవేశం, అష్టోత్తర కుంకుమార్చన ద్వారా ఆలయానికి రూ.13,69,090 ఆదాయం సమకూరినట్లు ఇన్చార్జి ఈవో తెలిపారు. -
గోదావరి తీరంలో ఆది మానవుల ఆనవాళ్లు
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రాచీన మెగాలిథిక్, మైక్రోలిథిక్ టూల్స్ తయారీ అవశేషాలు కనుగొనబడ్డాయి. చరిత్రకారుడు, కవి డాక్టర్ తుమ్మల దేవరావు ఈ ఆవిష్కరణను ప్రకటించారు. ఈ ఆధారాలు జిల్లా ప్రాచీన జీవన శైలిని వెలుగుపరుస్తున్నాయి. జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరంలో ఈ అవశేషాలు గుర్తించారు. నదీ ప్రాంతాలు ఆహారం, నీరు అందించడంతో ఆదిమానవులు ఇక్కడ స్థిరపడి వేటకు యుధాలు తయారు చేసుకున్నారు. రాతి పరుపులపై గ్రూవ్స్(లోతైన గీతలు) ఈ కార్యక్రమానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తయారీ తంత్రం.. ఈ గీతల్లో రాతి గొడ్డళ్లను మెరుగుపరచి, ఆయుధాలకు, కత్తెరల్లా పరికరాలకు పదును పెట్టినట్లు తెలిపారు. మైక్రో బ్లేడ్లు, యారోపాయింట్లు(బాణ అంచులు), స్క్రాపర్లు(చర్మ తొలిచే పరికరం), కోర్ స్టోన్లు, జామెట్రిక్ మైక్రోలిథ్లు 0.4 నుంచి 1 సెం.మీ. పరిమాణంలో లభించాయి. గ్రూవ్స్ సమీపంలోనే ఈ పరికరాల సంగ్రహం ఎక్కువగా ఉండటం ఆసక్తికరం. క్రీ.పూ 10 వేల నుంచి 4 వేల సంవత్సరాల మధ్య.. క్రీస్తుపూర్వ 10 వేల సంవత్సరం నుంచి 4 వేల సంవత్సరాల వరకు ఈ ఆయుధ కళ ఊపందుకున్నట్లు అంచనా. వేట ఆధారిత మనుగడకు జంతు చర్మాలు, ఆయుధ అంచులు తయారీకి ఈ సాధనాలు ఉపయోగపడ్డాయి. పరిశోధనలో డాక్టర్ తుమ్మల దేవరావుతో అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, తుమ్మల సుజాత సహకరించారు. బహుళ కర్మాగారాలు ఉంటాయని..గోదావరి ప్రాంతంలోని వివిధ చోట్ల ఇలాంటి తయారీ కేంద్రాలు ఉండవచ్చని పరిశోధకులు ఊహిస్తున్నారు. ఈ ఆనవాళ్లు నిర్మల్ ప్రాచీన చరిత్రకు బలమైన సాక్ష్యాలు. గోదావరి ప్రాజెక్టు పరిధిలో ఇంతకుముందు కూడా సారవంతమైన కనుగొన్నవి ఉన్నాయి. పురావస్తు శాఖ, ప్రభుత్వం ఈ ఆధారాలను కాపాడాలని పరిశోధకులు కోరుతున్నారు. ఇవి ఆదిమానవ సంచారాలు, మనుగడ వ్యూహాలను, జిల్లా చరిత్రను, గతాన్ని పునరుద్ధరించడానికి కీలకం కానున్నాయి. -
బాలికలకు హెచ్పీవీ ఇప్పించాలి
నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్: 14 ఏళ్లు నిండిన 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య తల్లిదండ్రులకు సూచించారు. నిర్మల్, భైంసా ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాలను వేర్వేరుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన జీవన శైలి నేపథ్యంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారన్నారు. సర్వైకల్ క్యాన్సర్తోపాటు మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. డీఎంహెచ్వో రాజేందర్ మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ను మొదటి దశలో జీజీహెచ్, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలరోజులు ఇవ్వడం జరుగుతుందన్నారు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు నెలలు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమాల్లో నిర్మల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ సింగ్, ఆర్ఎంవో డాక్టర్ రమేశ్, చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వాణాధికారి డాక్టర్ నయనారెడ్డి, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్, డాక్టర్ ప్రీతంరాజ్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, డిప్యూటీ డీఎంహెచ్వో ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు. -
వంటింట్లో యుద్ధం మంట
భైంసాటౌన్: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మన వంటిట్లో మంట పెట్టింది. యుద్ధం కారణంగా చమురు సరఫరా మందగించింది. ఫలితంగా పెట్రోలియం ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో కేంద్రం వంటగ్యాస్ ధరలు పెంచింది. 14.2 కిలోల గృహ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.929 ఉండగా, రూ.60 పెరిగి, రూ.989కు చేరింది. పెరిగిన ధరలు అన్నిరకాల కనెక్షన్లకు వర్తించనున్నట్లు గ్యాస్ ఏజెన్సీలు తెలిపాయి. ఇక, వాణిజ్య సిలిండర్ ధర రూ.2,029 ఉండగా, రూ.2,144 కు పెరిగింది. వీటికితోడు రూ.20 నుంచి రూ.30 వరకు డెలీవరీ చార్జీలు ఉండనే ఉన్నాయి. ఫలితంగా వంటగ్యాస్ వినియోగదారులపై ఆర్థికంగా భారం పడనుంది. జిల్లాలో ఇలా.. జిల్లాలో హెచ్పీ, భారత్, ఐవోసీ కంపెనీలకు చెందిన 16 గ్యాస్ ఏజెన్నీలు ఉన్నాయి. వీటి కింద సాధారణ, ఉజ్వల, దీపం, సీఎస్ఆర్ వంటగ్యాస్ కనెక్షన్లు దాదాపు 2.50 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో సింగిల్ కనెక్షన్లు 1,81,626 ఉండగా, రెండు నెలలకు ఒక వంటగ్యాస్ సిలిండర్ చొప్పున రూ.16.87 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ.1.08 కోట్లకుపైగా అదనపు ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే సిలిండర్ అందిస్తామని తొలుత సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో జమచేసింది. కొద్దినెలలుగా ఈ సబ్సిడీ జమకావడం లేదు. కేవలం కేంద్రప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.43 మాత్రమే జమవుతోంది. దీంతో ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి కింద రూ.500లకు సిలిండర్ అందిస్తుందా లేదా స్పష్టత రావాల్సి ఉంది.జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా.. సాధారణ కనెక్షన్లు 1,39,430 దీపం కనెక్షన్లు 47,215 ఉజ్వల కనెక్షన్లు 37,249 సీఎస్ఆర్ కనెక్షన్లు 26,828 ఇతర కనెక్షన్లు 1063 మొత్తం కనెక్షన్లు 2,51,785 -
పండుగలా వుమెన్స్ డే..
మహిళా పోలీస్లతో ఎస్పీ జానకీషర్మిల నిర్మల్/నిర్మల్టౌన్/నిర్మల్చైన్గేట్: ‘మనకంటూ ఒకరోజు. ఇది మనదైన రోజు..’ అంటూ మహిళా దినోత్సవాన్ని జిల్లా మహిళలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని మహిళా పోలీసులు పాల్గొన్నారు. మహిళలందరికీ ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల రక్షణ, సాధికారతకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలో వివిధ సంఘాలు, మహిళ గ్రూపులు, కిట్టీపార్టీల ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా అతివల సంబురాలు కొనసాగాయి. రోజంతా కలిసి ఆడుతూ, పాడుతూ.. కలిసి భోజనాలను చేశారు. కలిసికట్టుగా సీ్త్రల హక్కులనూ సాధించుకుందామంటూ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని ఐన్ కంటిదవాఖానా వైద్యుడు ఇర్ఫాన్ఫరాజ్ 31 మంది మహిళలకు ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించారు. ప్రియదర్శినినగర్లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి ఆధ్వర్యంలో వుమెన్స్డే నిర్వహించారు. అంగన్వాడీలు, ఆయాలు, ఆశ కార్యకర్తలను సన్మానించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు వాసవి, ఉపాధ్యక్షురాలు గీత పాల్గొన్నారు. ట్రెండీగర్ల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా వుమెన్స్డే సంబురాలు నిర్వహించారు. సభ్యులంతా నల్లరంగు డ్రెస్కోడ్లో హాజరయ్యారు. ఒక్కొక్కరు తమలోని బలాన్ని పేపర్పై రాసిచూపుతూ ఆత్మవిశ్వాసాన్ని చాటారు. అనంతరం కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో మహిళ ఉద్యోగులంతా కలిసి వుమెన్స్ డే నిర్వహించారు. ఇటీవల గెలుపొందిన మహిళ కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం తమ హక్కుల సాధన కోసం కలిసి సాగుదామని పిలుపునిచ్చారు. సంఘ బాధ్యులు ఆలియాసుల్తానా, రహత్నాజ్నీన్, ఆలియా ఫాతిమా, రోమాన, ఆయేషా, డాక్టర్ అమీనా తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్చైన్గేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహారెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు పట్టణంలోని ఓ హోటల్లో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం వివరాలను లబ్ధిదారులకు తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి వ్యాపారంలో ఎదిగేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించేలా ఎదుగుతారన్నారు. ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించి అవసరమైన మెలుకువలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్డీఎం రామ్గోపాల్, ఇండియన్ పోస్ట్ మేనేజర్ వీరస్వామి, పోస్టల్ ఇన్స్పెక్టర్ రాజేంద్రయాదవ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మేనేజర్ దినేశ్కుమార్ పాల్గొన్నారు. -
నువ్వే జగమంతా..
అమ్మ తలుపు తెరిస్తేనే పొద్దు తెల్లారుతుంది. ఆలి అన్నీ సిద్ధం చేసిస్తేనే రోజు మొదలవుతుంది. బిడ్డ నవ్వుతూ ఎదురొస్తేనే ఆ రోజు బాగా గడుస్తుంది. అక్క ‘ఆల్ ది బెస్ట్’ చెబితేనే విజయం దక్కుతుంది. చెల్లితో గిల్లికజ్జాల జ్ఞాపకం జీవితాంతం గుర్తుంటుంది. ఆమే లేకుంటే.. ఏదీ లేదు. సృష్టికి మూలం, ప్రేమకు రూపం, ధైర్యానికి నిదర్శనం ఆమె. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రమజీవులుగా, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ కండక్టర్లతో ‘సాక్షి’ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. జిల్లా కేంద్రంలో ఇంకా చీకట్లు తొలగకముందే చీపుర్లు పట్టుకుని పట్టణాన్ని పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో శనివారం వేకువజామున ముచ్చటించింది. తెల్లవారుజామున ఉరుకులు, పరుగులతో ‘ప్రగతిచక్రాల’లను పరుగులు పెట్టించేందుకు మహిళా కండక్టర్లను పలకరించింది. – నిర్మల్ -
ఇళ్లు మంజూరు చేయండి
భైంసాటౌన్/భైంసారూరల్: ముధోల్ నియోజకవర్గానికి అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే జి.విఠల్రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మంత్రిని కలిసి విన్నవించారు. లబ్ధిదారుల ఎంపిక సమయంలో కొందరు ఇల్లు లేనివారిని కూడా సాంకేతిక కారణాలతో ఎల్–3 లిస్టు, ఎల్–2 లిస్టులో చేర్చినట్లు తెలిపారు. అర్హులకు న్యాయం జరిగేలా ఆ జాబితాలను సరిచేసి ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విఠల్రెడ్డి తెలిపారు.మంత్రికి వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి -
ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక బృందాలు
నిర్మల్చైన్గేట్: ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై శని వారం సమీక్ష చేశారు. పంచాయతీరాజ్, రహదారులు–భవనాల (ఆర్అండ్బీ) శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, కల్వర్టులు, వంతెనల పనుల్లో జాప్యం చేయొద్దని సూచించారు. అటవీ శాఖ అనుమతులతో ముడిపడి ఉన్న పనుల కోసం వెంటనే ‘పరివేశ్’ పోర్టల్లో దరఖాస్తు చేయాలన్నారు. ఖానాపూర్ పట్టణ పరిధిలో విలువైన ప్రభుత్వ భూ ముల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమగ్రంగా సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్కారు భూములను కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అటవీ క్లియరెన్స్ విషయంలో అధికారులు వేగంగా స్పందించాలని, అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తాను చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
వీసీ కోసం విద్యార్థుల నిరీక్షణ
ఆర్జీయూకేటీలో విద్యార్థులు, యాజమాన్యం మధ్య లొల్లి ముదురుతోంది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న పరిపాలనా సమస్యలపై చర్చించేందుకు టీఎస్ఏఎస్ సభ్యులు శనివారం ఇన్చార్జి వీసీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సుమారు 50 మందికిపైగా విద్యార్థులు వీసీని కలిసేందుకు రెండు గంటలకుపైగా కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. టీఎస్ఏఎస్ అధ్యక్షుడు నవనీత్ మాట్లాడుతూ.. వీసీ కార్యాలయానికి వెళ్తే డీన్ దగ్గరకు, డీన్ కార్యాలయానికి వెళ్తే మళ్లీ వీసీ దగ్గరకు వెళ్లమని చెప్పుతూ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సమస్యలను చెప్పేందుకు వచ్చిన విద్యార్థులను గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం, లోపలికి రాకుండా గేట్లు మూసివేయడం వంటి చర్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు వారాలుగా యూనివర్సిటీలో పలు పరిపాలనా సమస్యలు కొనసాగుతున్నాయని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని విద్యార్థులు తెలిపారు. వీసీ లేదా సంబంధిత అధికారులు ఒక తేదీ, సమయం కేటాయించి విద్యార్థుల సమస్యలను వినాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
నిర్మల్
(0%)1325%స్నేహితుల సూచనసమాజం69లేదు 83మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఒక సీ్త్ర స్వతంత్రంగా ముందుకు వెళ్లాలంటే ఎవరి సహకారం ఎక్కువ అవసరంనా సొంత నిర్ణయం 282మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును కావాలనే ఎంచుకున్నారా?మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంతమేర మద్దతు లభిస్తోంది...50%మా తల్లిదండ్రుల నిర్ణయంకుటుంబం 291స్నేహితులు110100%235158పూర్తిగా 205కొద్దిమేర 182 -
అన్నిరంగాల్లో రాణించాలి
నిర్మల్: ‘మహిళల నిష్పత్తి ఎక్కువగా ఉన్న నిర్మల్ జిల్లాలో తొలిసారి కలెక్టర్గా పనిచేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రక్తహీనత, ఇతరత్రా ఇబ్బందులతో బాలింతలు చనిపోవడాన్ని అరికట్టడానికి ‘అమ్మరక్షిత’ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం, మాతృమరణాల తగ్గింపులో దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపురావడం చాలా సంతృప్తినిస్తోంది. మహిళలు తలచుకుంటే, తమలోని శక్తిని గుర్తిస్తే, దేనినైనా సాధించగలరు..’ అంటూ కలెక్టర్ అభిలాషఅభినవ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’తో మాట్లాడారు. -
ఆర్జీయూకేటీలో ఘనంగా మహిళా దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారికతపై జరిగిన ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియాలో నియోం లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ డిపార్?ట్టమెంట్ డైరెక్టర్గా పని చేసిన ఎల్జా జెజేరేనియా ఆన్లైన్ద్వారా మాట్లాడారు. ఆధునిక సమాజంలో మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారని, గ్లోబల్ స్థాయిలోవారికి లభిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ, మహిళలు తమలోని శక్తిని గుర్తించి ప్రతీరంగంలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మహిళా దినోత్సవ సందర్భంగా విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థినుల కోసం తాము వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తాము స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాలలో సరికొత్త దిశలో అవకాశాలను కల్పించామని, ఇది ప్రతీ సంవత్సరం పెరుగుతున్న బాలికా విద్యార్థుల(గర్ల్స్ స్టూడెంట్స్) చేరికల సంఖ్య ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ కే రాములు, సభ్యులు రమాదేవి, లకుమాదేవి, నాగలక్ష్మి, సారిక, ప్రవళిక, శ్రీవిద్య, శ్వేత, శిరీష, బద్రి నారాయణ్, అసోసియేట్ డీన్లు శేఖర్ శీలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సును ఢీకొన్న బైక్
లక్ష్మణచాంద: స్కూల్ బస్సును బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సోన్ ఎస్సై గోపి కథనం ప్రకారం.. సోన్ మండలం వెల్మల్ నుంచి శనివారం ఉదయం నిర్మల్ శ్రీ చైతన్య పాఠశాల బస్సు విద్యార్థులతో నిర్మల్ వైపు వెళ్తోంది. సంఘంపేట్కు చెందిన గజ్జల గంగన్న, భీమన్న బైక్పై వేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి మూటాపూర్ నుంచి వెల్మల్ వైపు ఎదురుగా వస్తున్నారు. న్యూవెల్మల్ శివారు గల సరస్వతి కెనాల్ బ్రిడ్జి వద్ద స్కూల్ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పాఠశాల డ్రైవర్ శంకర్ అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో మద్యం మత్తులో వేగంగా బైక్ నడిపిన గంగన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉత్తమ మహిళా ఫారెస్ట్ అధికారిగా అలేఖ్య
నర్సాపూర్(జి): ఎఫ్ఎస్వో సుంకరి అలేఖ్య ఉత్తమ మహిళా ఫారెస్ట్ అధికారిగా పురస్కారం అందుకున్నారు. సారంగాపూర్ మండలం ఆలూరుకు చెందిన ఈమె నర్సాపూర్ (జి) మండలంలో ఎఫ్ఎస్వోగా విధులు నిర్వహిస్తున్నారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల స్థిరమైన నిర్వహణకుగాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2026 సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీసీఎఫ్, రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంక వర్గేస్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. శనివారం బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, ఎఫ్డీఓ నాగిని భాను, అటవీ అధికారులు ఆమెను అభినందించారు. -
ప్రతీ మహిళా శక్తిని చాటాలి..
నిర్మల్: ‘మహిళఖిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసులు సత్తా చాటుతున్నారు. పోలీసుశాఖలో మహిళా పోలీసు సిబ్బంది ద్వారా పోలీసక్క, నారీశక్తి, శివంగి టీమ్.. ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం సంతోషాన్నిస్తోంది. ఇక్కడ సిబ్బంది కూడా అంకితభావంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. ప్రతీ సమస్యను ఎదుర్కొనేలా సీ్త్రలు సిద్ధంగా ఉండాలి. అప్పుడే జీవితంలో రాణించగలుగుతాం..’ అని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. -
బాలికలకు టీకా రక్ష
తల్లిదండ్రుల అనుమతితోనే.. తల్లిదండ్రుల అనుమతితోనే హెచ్పీవీ టీకా వేస్తాం. జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సిన్ను ఈనెల 8 (నేటి) నుంచి పంపిణీ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాాం. మొదట జీజీహెచ్ సీహెచ్ సీలో ప్రారంభించి తర్వాత పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధి లోని 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు చేస్తాం. వైద్యుల పర్యవేక్షణలోనే టీకాల పంపిణీ కొనసాగుతుంది. – డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వో నిర్మల్చైన్గేట్: మహిళల ఆరోగ్యాన్ని కబళిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్)ను నియంత్రించేందుకు కేంద్రం హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ టీకాను 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఇస్తే లక్ష్యం నెరవేరేలా పని చేస్తుందని వైద్య నిపుణులు నిర్ధారించారు. ప్రధాని మోదీ జాతీయస్థాయిలో రాజస్థాన్లో టీకా పంపిణీని ఫిబ్రవరి 28న ప్రారంభించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో ప్రారంభించారు. ఉమెన్స్ డే సందర్భంగా జిల్లాలో ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. 90 రోజుల కార్యక్రమం.. వ్యాక్సిన్ స్టాక్ రావడంతో ఆదివారం నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇది 90 రోజుల కార్యక్రమం. ఇప్పటికే ఆరోగ్యశాఖ 14–15 ఏళ్లలోపు బాలికలు జిల్లాలో 7,684 మంది ఉన్నట్లు గుర్తించింది. మొదట నెల రోజులు జిల్లా జనరల్ ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా ఉన్న 18 పీహెచ్సీలలో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పీహెచ్సీల వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు హెచ్పీవి వ్యాక్సిన్ ఇచ్చే విధానంపై శిక్షణ ఇచ్చారు. వ్యాక్సిన్తో ఉపయోగాలు.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తోపాటు నోరు, గొంతు, రొమ్ము క్యాన్సర్లను ఈ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఆడపిల్లల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకముందే టీకా తీసుకోవడంతో సంబంధిత క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధక శక్తి ఉత్పన్నమవుతుంది. సుమారు రూ.5 వేల ఖరీదు ఉండే ఈ టీకాను భారత ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా పంపిణీ చేస్తోంది. -
అసత్య ప్రచారం సరికాదు
బాసర: సామాజిక మాధ్యమాల్లో బాసర ఆర్జీయూకేటీపై జరుగుతున్న అసత్య ప్రచారంపై యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి హాజరుకావడానికి ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ వెళ్లారని తెలిపింది. ఈ విషయాన్ని వక్రీకరించి అధికా రులు అందుబాటులో లేరని కొంతమంది విద్యార్థులు వీడియోలు విడుదల చేయడాన్ని ఖండించింది. ప్రస్తుతం యూనివర్సిటీలో విద్యాబోధన, పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపింది. అసత్య ప్రచారం నమ్మొద్దని కోరింది. -
పాఠశాల ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీస్
భైంసాటౌన్: పట్టణంలోని నారాయణ పాఠశాలలో రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఫీజుల వసూలుపై ‘ఇదేం.. ఫీజులుం..!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎంఈవో సుభాష్ పాఠశాలకు శుక్రవారం చేరుకుని ప్రిన్సిపాల్కు నోటీసు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులను బలవంతం చేయడంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ముందస్తుగా ఫీజులు ఏ అధికారం కింద వసూలు చేస్తున్నారని, అలాంటి సేకరణ కోసం సమర్థ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందారా.. నిర్దేశించిన నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు సంస్థపై ఎందుకు చర్య తీసుకోకూడదని ప్రశ్నించారు. నిర్ణీత సమయంలోపు సంబంధిత సహాయక పత్రాలతోపాటు రాతపూర్వక వివరణ సమర్పించాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ఎంఈవో తెలిపారు. గడువులోపు సమాధానం రాకపోతే, తదుపరి నోటీసు లేకుండా నిబంధనల ప్రకారం సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు గంగాప్రసాద్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ముందస్తు ఫీజుల వసూలుపై పాఠశాల నిర్వహకులు, ఎంఈవోను ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పీపుల్స్ నెస్ట్ టాలెంట్ టెస్ట్
లక్ష్మణచాంద: పీపుల్స్ నెస్ట్ టాలెంట్ టెస్ట్కు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ సౌజన్యంతో అన్ని జిల్లాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5, 6వ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు ఇందులో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. 6, 7 తరగతుల కోసం నిర్వహించే ఈ పరీక్షలో ఎంపికై న విద్యార్థులకు వసతితోపాటు భోజనం, విద్య ఉచితంగా అందించడం జరుగుతుందని వివరించారు. మండలంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 8 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 15న నిర్మల్లో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఇందులో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజునాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కై లాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా హాజరుకాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించి వాటి వివరాలను శాఖలు, పనిచేయిస్తున్న ఏజెన్సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు గాను లబ్ధిదారుల ఎంపిక, అమలు కోసం సాంకేతికత వినియోగించుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10–15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం 25 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు మంజూరు చేశారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా నోడల్ అధికారి అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. రంజాన్ కానుకలొచ్చాయ్నిర్మల్చైన్గేట్: రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు అందజేసేందుకు ప్రభుత్వం కానుకలు సిద్ధం చేసింది. పండుగ సమీపిస్తుండడంతో రంజాన్ తోఫాలు జిల్లాలకు పంపుతోంది. జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి తోఫా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 3 వేల కుటుంబాలకు తోఫా రంజాన్ కానుకలు జిల్లాలో 3 వేల కుటుంబాల కు అందించాలని అధికారులు గుర్తించారు. నిర్మల్ నియోజకవర్గంలో 1000, ముధోల్లో 1,250, ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో 750 కుటుంబాలకు ఈ కానుకలు అందించనున్నారు. రంజాన్ తోఫా కింద కుటుంబంలోని భార్యాభర్తతోపాటు వారి పిల్లలకు నూతన దుస్తులు అందించనున్నారు. ఇందులో పాయింట్, షర్ట్, చుడీదార్, చీర, జాకెట్ ఉంటాయి. ఇఫ్తార్ విందుకు నిధులు.. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం జిల్లాకు రూ.12 లక్షలు మంజూరు చేసింది. నిర్మల్ నియోజకవర్గానికి రూ.4 లక్షలు, ముధోల్కు రూ.5 లక్షలు, ఖానాపూర్కు రూ.3 లక్షల చొప్పున మంజూరు చేసింది. నిర్మల్లో 4, ముధోల్లో 5, ఖానాపూర్లో 3 ప్రాంతాల్లో 500 మంది చొప్పున ఇఫ్తార్ విందు ఇస్తారు. లబ్ధిదారులు, నిధుల వివరాలు నియోజకవర్గం లబ్ధిదారులు ఇఫ్తార్ నిధులు నిర్మల్ 1,000 రూ.4 లక్షలు ముధోల్ 1,250 రూ.5 లక్షలు ఖానాపూర్ 750 రూ.3 లక్షలు -
పకడ్బందీగా అమలు చేయాలి...
నిర్మల్చైన్గేట్: వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. జిల్లాల్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వివిధ శాఖలకు కేటాయించిన పనులన్నీ ప్రణా ళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సంయుక్త భాగస్వామ్యంతో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్రెడ్డి, షిండే ఆనంద్రావు పటేల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన కౌన్సిలర్లు
ఖానాపూర్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖనాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ నుంచి గెలిచిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును శుక్రవారం కలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కార్యక్రమంలో అంకం మౌనిక, మహేందర్, బండిపెల్లి సింధూజ, ప్రకాశ్, గుమ్ముల అశోక్, బొప్పారపు సత్యవతి ఉన్నారు. -
ఫైజాన్ అహ్మద్కు వీడ్కోలు
నిర్మల్చైన్గేట్: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఫైజాన్ అహ్మద్ వీడ్కోలు కార్యక్రమం గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ఏ ఉద్యోగికి అయినా బదిలీలు సర్వసాధారణమన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి, పల్లె, పట్టణ ప్రగతి, ఎన్నికల నిర్వహణ, పలు విభాగాలకు నోడల్ అధికారిగా, నిర్మల్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా, ప్రభుత్వ పథకాల అమలుకు విశేష కృషి చేశారన్నారు. బదిలీపై వెళ్లిన జిల్లాలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. సంతృప్తినిచ్చింది.. ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో పని చేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, జిల్లా అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. విధుల నిర్వహణలో తనకు సహకారం అందించిన కలెక్టర్ అభిలాష అభినవ్, అధికా రులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంత రం కలెక్టర్, పలువురు అధికారులు ఫైజాన్ అహ్మద్ దంపతులను సన్మానించి, జ్ఞాపికలు అందించారు. -
నిర్మల్
బందీఖానాగా మార్చాల్సిందే.. ఇది ఇల్లా.. లేక జైలా..! ఇలా చుట్టూ ఇనుప కట్టడి చేశారు అన్న అనుమానం వస్తుంది కదా! ఇది కూడా కోతులను అడ్డుకోవడానికే. పచ్చని మొక్కలను నాశనం చేయడమే కాదు, ఇంట్లోకి చొరబడి నానాహంగామా చేస్తుండటంతో జిల్లాకేంద్రంలో ఇలా ఇంటిని బందీఖానాలా మార్చుకోవాల్సి వస్తోంది. వల వేసుకోవాల్సిందే... జిల్లాకేంద్రంలోని ప్రియదర్శినినగర్కు చెందిన సంతోష్ రోజూ కిరాణాషాప్ తీయగానే ముందుగా చుట్టూ వల వేస్తుంటారు. ఎందుకంటే.. ఏ వైపు నుంచి ఏ కోతి దుకాణంలోకి చొరబడుతుందో తెలియదు. డబ్బాలను, ప్యాకెట్లను ఎప్పుడు ఎత్తుకెళ్తుందో చెప్పలేం. అందుకే ఇలా జాలిలు, వలలతో దుకాణాన్ని కాపాడుకుంటున్నాడు. నిర్మల్లో గల్లీల్లోని ఏ దుకాణం చూసినాఇలాంటి రక్షణ చర్యలే కనిపిస్తాయి. కొండెంగ ఫొటో పెట్టాల్సిందే.. ఏంటిదీ..!? కొండెంగ ఫొటోను ఇలా ఇంటి గేట్కు పెట్టుకున్నారు..!? అని ఆశ్చర్యపోకండి. నిర్మల్లో ప్రస్తుతం చాలామంది తమ ఇళ్ల ముందు ఇలా కొండెంగల ఫొటోలు పెట్టుకుంటున్నారు. కోతులు చేసే చేష్టలను, అవి చేసే నష్టాలను కట్టడి చేసేందుకు. కొండెంగలు ఉన్న చోటుకు కోతులు రావన్న ఉద్దేశంతో ఇదిగో ఇలా ‘కొండెంగ ప్రయత్నం’ చేస్తున్నారు. ప్రతిజ్ఞ చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు -
కోటి కష్టాలు
కోతుల కట్టడికి నిర్మల్: ‘అరె.. ఇవేం కోతులు పొద్దున లేసిన్నుంచి పరేషాన్ చేస్తున్నయ్. బయటకు అడుగు పెట్టనిస్తలేవు. పిల్లలను బడికి పంపుదామంటే మందకు మంద వాకిట్లనే కూసున్నయ్. ఏమన్నందామంటే మీదికస్తున్నయ్. వీటిని ఏంచేసుడిగ..’ జిల్లాలో ఇదీ పరిస్థితి. ఇది ఒక్క జిల్లాకేంద్రమో.. ఇంకో ఊరిదో కాదు. జిల్లావ్యాప్తంగా అన్ని ఊళ్లల్లో ఇప్పుడు కోతులతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. చెప్పుకోవడానికి చిన్న ముచ్చటనే కానీ.. వీటితో ప్రధానంగా పల్లెల్లో రైతులు పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. వీటి బాధ భరించలేక పంటచేళ్లల్లో చుట్టూ ఉన్న చెట్లను నరుక్కున్నారు. అంతేకాదు.. వాటిని తరిమికొట్టేందుకు కొండెంగ, ఎలుగుబంటి, చింపా జీ వేషధారణలో వాటివెంట పరుగులు తీయాల్సిన దుస్థితి ఉంది. ఇన్ని చేస్తున్నా.. వానరాల కట్టడి సాధ్యం కావడం లేదని పలువురు వాపోతున్నారు. పెరుగుతూనే ఉన్న సంతతి.. వానరాల జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. దాదాపు 25–30 ఏళ్లు జీవించే ఆడకోతి కేవలం మూడేళ్ల వయసు నుంచే గర్భం దాలుస్తుంది. తన జీవితకాలంలో దాదాపు 20–22 పిల్లలు కంటుంది. ఇలా వాటి సంతతి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లోనే పరిమితమైన కోతులు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ గుంపులుగా ఉంటున్నాయి. ఆహారం కోసం జనావాసాలు, పంటచేళ్లపై ఆధారపడుతున్నాయి. తిండి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరు అడ్డుకున్నా, తమను కొట్టేందుకు వచ్చినా విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నాయి. ప్రయోగానికి స్పందనేదీ..? రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నిర్మల్ జిల్లాకేంద్రం సమీపంలోని గండిరామన్న హరితవవనంలో 2020 డిసెంబర్లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ ఏర్పాటు చేశారు. ఇందులో వానరాలకు ట్యూబెక్టమీ, వేసెక్టమీ చేసి, వాటి సంతతి క్రమంగా తగ్గించే ప్రక్రియను ప్రారంభించారు. కానీ.. ఇక్కడికి కోతులను తీసుకురావడమే అసలు సమస్య. కొన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు మాత్రమే కోతులను పట్టి తీసుకొస్తున్నాయి. ఈ ప్రయోగం కొంతమేర ఫలితమిచ్చేలా ఉన్నా.. ప్రస్తుత సర్కారు మాత్రం దీనిపై దృష్టిపెట్టడం లేదు. ఇటీవల కొలువుదీరిన నిర్మల్ పుర పాలకవర్గం త్వరలోనే కోతుల కట్టడికి చర్యలు తీసుకుంటామని చెప్పింది. గతంలో మాదిరి వాటిని పట్టుకుని దూరంగా అడవుల్లో వదిలి పెడతామని పేర్కొన్నారు. వేషం వేయాల్సిందే.. ఈ చిత్రంలో ఇద్దరు ఎలుగుబంటి, చింపాజీలను పోలినట్లున్న వేషం వేసుకున్నారు. వీరు కూడా కోతులను తరమడానికే ఇలా తిప్పలు పడుతున్నారు. నిర్మల్రూరల్ మండలం న్యూపోచంపాడ్లో సర్పంచ్ పద్మశ్రీనివాస్ కోతుల నివారణకు ఇలా గ్రామస్తులతో వేషం వేయించి కట్టడికి ప్రయత్నం చేశారు. -
ప్రగతి కోసం.. ప్రణాళిక
నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ జిల్లాలో గురువారమే ప్రారంభమైంది. కలెక్టర్ అభిలాషఅభినవ్ విజయవంతంగా ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచి దాదాపు పది ప్రధాన అంశాల్లో ప్రణాళికబద్ధంగా ప్రగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 99రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈనెల 3న హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి ఈకార్యక్రమంపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి శుక్రవారం ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలో ఈమేరకు కార్యక్రమాలను చేపట్టేందుకు కలెక్టర్ అభిలాషఅభినవ్ ఆధ్వర్యంలో అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నిర్మల్ మున్సిపాలిటీలో తనిఖీలు చేశారు. ప్రజలతో మాట్లాడారు. 99 రోజుల పాటు..రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని 99 రోజులు పకడ్బందీగా అమలు చేయనుంది. పల్లెస్థాయి నుంచి రూపురేఖలు మార్చే దిశగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య మెరుగుదల తదితర లక్ష్యాలను పెట్టుకున్నారు. గ్రామాల్లో ఈనెల 6 నుంచి మే 31 వరకు ఏ రోజు ఏ పని పూర్తిచేయాలో స్పష్టమైన గడువు విధిస్తూ పంచాయతీరాజ్శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు సేవలు అందేలా..ప్రజాసమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వ సేవల ను ప్రజలకు సమర్థవంతంగా అందించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లాస్థాయి వర కు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడం, ప్రజారోగ్యం, రోడ్డు భవన నిర్మాణాలు, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళల అభ్యున్నతి, పర్యావరణం, మాదకద్రవ్యాల నిర్మూలన తదితరలు అంశాలు ఇందులో ఉన్నాయి. సంబంధిత శాఖలు ఎప్పుడెప్పుడు ఏయే కార్యక్రమాలను చేపట్టాలనే దానిపై ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోనూ సంబంధిత అధికారులు ఈమేరకు కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. విజయవంతం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని జిల్లాలోనూ 99 రోజులు విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చాం. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిల్లావాసులూ సహకరించాలి. – అభిలాషఅభినవ్, కలెక్టర్ఐదు దశల్లో..ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2న ప్రతీ గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న మండలస్థాయి సమావేశాలు ఉంటాయి. మే 2న నియోజకవర్గస్థాయి కార్యక్రమాలు చేపడతారు. మే 22న జిల్లాస్థాయి సమావేశాలు, కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉండనున్నాయి. జూన్ 12న ఈ కార్యక్రమం ముగియనుంది. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని అమలు చేయటంతోపాటు పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను కూడా సిద్ధం చేసింది. నిర్మల్ పట్టణంలో సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ -
నిర్మల్
9ఇంటర్ పరీక్షలకు 220 మంది గైర్హాజరునిర్మల్ రూరల్: జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 220 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మ్యాథ్స్ బి/జువాలజీ/హిస్టరీ పరీక్షను నిర్వహించారు. మొత్తం 6,358 మంది విద్యార్థులకు 6,138 మంది హాజరయ్యారు. డీఐఈవో జాదవ్ పరశురాం మామడ జూనియర్ కళాశాల, జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. -
ఉపాధిహామీలో ఎఫ్ఆర్ఎస్
నిర్మల్ రూరల్: ఉపాధి హామీ పథకంలో ఎఫ్ ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభమైంది. డీఆర్డీవో విజయలక్ష్మి సోన్ మండలం గంజాల్లో ఈ ప్రక్రియను గురువారం పరిశీలించారు. ఉద యం 6 గంటలకు వచ్చిన ఉపాధి హామీ కూ లీలను ఎఫ్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ కేవైసీ చేస్తారు. అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు కూడా తప్పకుండా మరోసారి ఎఫ్ఆర్ఎస్ ఈకేవైసీ ద్వారా ఫొటో దిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికా రులు తెలిపారు. తప్పనిసరిగా రెండుసార్లు ఈ ప్రక్రియ చేస్తేనే కూలీలకు డబ్బుల ను చెల్లిస్తారు. ఒకసారి చేయకపోయినా సగం కూలి మాత్రమే చెల్లిస్తారు. ఈ ప్రక్రియతో నాణ్యత పెరిగి నకిలీలను అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. డీఆర్డీవో వెంట ఏపీవో రామకృష్ణ, డీఆర్పీ గంగ ఉన్నారు. -
ఆమె ఆరోగ్యానికి భరోసా
నిర్మల్చైన్గేట్: ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ధ్యేయంగా, మహిళ ఆరోగ్యానికి భరోసా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘హెల్త్ మిషన్–100’ పేరుతో వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేయటానికి వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. మహిళా సంఘాల్లోని సభ్యులకు 30 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ పీహెచ్సీలలో ఈ మేరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ హెల్త్ కార్డులు..మహిళల కోసం సమగ్రమైన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ’విజన్–2047’లో భాగంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఈ 100 రోజుల ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు నాలుగు దశల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 30 రకాల వైద్య పరీక్షలుజిల్లాలోని సుమారు 15,653 మహిళా సంఘాల్లో ఉన్న 1,74,917 మంది సభ్యులకు 30 రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వారి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తారు. అందుకనుగుణంగా వారికి హెల్త్ కార్డులు అందిస్తారు. నాలుగు దశల్లో కార్యక్రమాలు...మొదటి దశ (మార్చి 6 నుంచి 31వరకు)..మొదటి దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, కంటి, ఎముకలు, దంతవైద్య, నిపుణులు ప్రత్యేక సేవలు అందిస్తారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో వద్ధాప్య చికిత్స శిబిరాలు, స్కీన్రింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కంటి పరీక్షలు, పోషకాహారంపై అవగాహన, వ్యాధి నిరోధక టీకాల తనిఖీలు చేపడతారు. రెండో దశ (ఏప్రిల్ 1–15వరకు)..ఇందులో క్యాన్సర్ నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించి, కేర్ పాలసీని విడుదల చేస్తారు. రిజిస్ట్రీ ఏర్పాటు, ఆరోగ్య మహిళా పథకం కింద స్క్రనింగ్ క్యాంపులు, జిల్లా డే–కేర్ క్యాన్సర్ కేంద్రాల్లో కీమోథెరపీ సేవల మ్యాపింగ్ చేస్తారు. మూడో దశ (ఏప్రిల్ 16– మే 15వరకు).. మూడో దశలో వేసవిలో వడదెబ్బ, అతిసారం వంటి సమస్యలపై దృష్టి సారిస్తారు. టీబీ(క్షయ) కేసుల గుర్తింపు, పోషకాహారం అందించడం, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడతారు. నాలుగో దశ(మే 16– జూన్ 12వరకు)..చివరి దశలో పట్టణ, గిరిజన ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. అర్బన్ పీహెచ్సీను పాలీక్లినిక్స్గా అప్ గ్రేడ్ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమి యా, తలసేమియా, హీమోఫీలియా బాధితులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందిస్తారు. అన్ని ఏర్పాట్లు చేశాం.. హెల్త్ మిషన్–100 కోసం సిబ్బందికి అవగాహన కల్పించాం. ఎప్పుడు ఏ వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారనే విషయాన్ని గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ, మహిళా సంఘాల సభ్యులకు తెలియజేస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వోవివరాలు: -
ప్రారంభమైన సోషల్ ఆడిట్
ఖానాపూర్: ఖానాపూర్ మండలంలో 2024–25లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలోని 25 గ్రామపంచాయతీల్లో ఈజీఎస్ ద్వారా రూ.10,32,26,847, పంచాయతీరాజ్ ద్వారా రూ.5,67,33,920, అటవీ శాఖ ద్వారా రూ.46,29,410 పనులు జరిగాయిరయి. ఈ పనులపై సామాజిక తనిఖీని ప్రారంభిస్తామని సోషల్ ఆడిట్ ఎస్ఆర్పీ మహేశ్ తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఈ నెల 7వ తేదీ నుంచి 14 టీంలు 14 మంది డీఆర్పీల ద్వారా పనులు జరిగిన ప్రాంతాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడం జరుగుతందన్నారు. నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలే సేకరించనున్నట్లు వెల్లడించారు. అనంతరం తనిఖీ వివరాలను ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభలతోపాటు ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ప్రజావేదికలో వెల్లడిస్తామని వివరించారు. సంబంధిత అధికారుల నుంచి రికార్డులు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. -
సుదర్శన్రెడ్డిని కలిసిన నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్
నిర్మల్ టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్దే లక్ష్యంగా మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గణేశ్చక్రవర్తి హైదరాబాద్ పర్యటన కొనసాగుతుంది. నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి వేణుగోపాలచారితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిని గురువారం కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను సమన్వ యం చేసి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ అ భివృద్ధికి సహకారం అందించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. నిర్మల్ అభివృద్ధికి తీసుకోవాల్సి న చర్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని సుదర్శన్రెడ్డి భరోసా ఇచ్చినట్లు చైర్ పర్సన్ తెలిపారు. -
ఎస్వో, ముగ్గురు సీఆర్టీల సస్పెన్షన్
నిర్మల్ రూరల్: పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఎస్వో, ముగ్గురు సీఆర్టీలను కలెక్టర్ అభిలాష అభినవ్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఉదయం 8:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీబీవీని డీఈవో భోజన్నతో కలిసి తనిఖీ చేశారు. మొదట పాఠశాలలోని వంటగది, స్టోర్ రూం, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. స్టోర్రూంలో ఉంచిన బియ్యం, వంటనూనె, పప్పులు, కూరగాయలను పరిశీలించారు. మెస్ను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే అల్పాహారం నాణ్యతను పరిశీలించారు. రిజిస్టర్లు, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంత రం విద్యార్థులతో కలిసి అసెంబ్లీలో పాల్గొన్నారు. అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చిన ఎస్వో సుజాత, పీజీ సీఆర్టీలు కవిత, సంతోషిమాత, సీఆర్టీ శైలజపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురిని సస్పెండ్ చేయాల ని డీఈవోను ఆదేశించారు. ఉపాధ్యాయులు విధి ని ర్వహణలో అలసత్వం, సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హె చ్చరించారు. అనంతరం విద్యార్థులతో ముఖాము ఖి నిర్వహించి పాఠశాలలో అందుతున్న వసతులు, విద్యాబోధన, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. ఇందులో తహసీల్దార్ రాజు, ఎస్వో లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. రూరల్ కేజీబీవీని తనిఖీ చేసిన డీఈవో.. జిల్లా కేంద్రంలోని రూరల్ కేజీబీవీని డీఈవో భోజ న్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సరుకులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. -
పునరావాస సమస్యలు పరిష్కరిస్తాం
కడెం: రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామస్తుల సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని డీఎఫ్వో సుశాంత్సుఖ్దేవ్ బొబడే అన్నారు. సాగుభూమి కోసం ఇటీవల గొడవలు జరిగిన నేపథ్యంలో పునరావాస గ్రామాన్ని గురువారం సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు. సాగునీరు, విద్యుత్ తదితర సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గిరిజనులు అందోళన విరమించాలని సూచించారు. సీఐ అజయ్, ఎస్సై సాయికిరణ్ అధ్వర్యంలో గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఇందులో ఎఫ్డీవో శివకుమార్, డీటీ లచ్చిరాం, ఆర్ఐ శారద, అటవీ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పీఎఫ్ ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్ ఎదు ట నిరసన తెలిపారు. అనంతరం ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ దరఖాస్తు కోసం ఆన్లైన్ విధానం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించి నెలకు రూ.4,016 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన కార్మికులందరికీ పెన్షన్, బకాయిలు చెల్లించా లన్నారు. జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పా టు చేయాలన్నారు. నరేంద్రమోదీ తీసుకొచ్చి న 4 లేబర్ కోడ్స్ చట్టాలు వెంటనే రద్దు చే యాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్, (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి గంగాధర్, అ ధ్యక్షురాలు శ్రీజ, కార్యదర్శులు స్వరూప, స మీనా బేగం, కే.లక్ష్మి, బి.జ్యోతి పాల్గొన్నారు. -
బిద్రెల్లి వద్ద చెక్పోస్టు
బాసర: ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం తరలింపును అడ్డుకునేందుకు ఏఎస్పీ పర్యవేక్షణలో బాసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బిద్రెల్లి వద్ద చెక్పోస్టు గురువారం ఏర్పాటు చేశారు. ఏఎస్పీ రాజేశ్మీనా మాట్లాడుతూ ఈ చెక్ పోస్ట్ 24 గంటలు పోలీసులు డ్యూటీ చేస్తూ నిజామాబాద్ ధర్మబాద్ వైపు నుంచి వస్తున్న వాహనాలు తనిఖీ చేస్తారన్నారు. అక్రమంగా ఇసుక, రేషన్ బియ్యం తరలిస్తే సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ రవీందర్నాయక్, బాసర ఎస్హెచ్వో సీఐ కిరణ్, ఎస్సై నవనీత్రెడ్డి ఉన్నారు. -
పది హాల్టికెట్లపై క్యూ ఆర్ కోడ్
లక్ష్మణచాంద: పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర విద్యాశాఖ సమూల మార్పులు చేస్తోంది. పరీ క్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వార్షిక పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్టికెట్లు పాఠశాలకు చేరుకున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి పోస్టల్ శాఖ ద్వారా ముందస్తుగానే విద్యార్థుల హాల్ టికెట్లు వివిధ పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ పంపించినట్లుగా ప్రధానోపాధ్యాయులు తెలిపారు. జిల్లాలో ఇలా...జిల్లాలో 168 ప్రభుత్వ పాఠశాల నుంచి 3,013 బాలురు, 3,592 మంది బాలికలు, 73 ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 1773 మంది బాలురు, 1,372 మంది బాలికలు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమై వచ్చేనెల13 వరకు జరుగుతాయి. హాల్టికెట్పై క్యూఆర్ కోడ్..పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్లపై క్యూఆర్ కో డ్ను విద్యాశాఖ అధికారులు ముద్రించారు. ఈ క్యూఆర్ కోడ్ను విద్యార్థులు ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే విద్యార్థి పరీక్ష వివరాలతోపాటు పరీక్ష కేంద్రం లైవ్ లొకేషన్ కూడా సూచిస్తుంది. అలాగే విద్యార్థు ల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్(పెన్) కూడా హా ల్ టికెట్పై ముద్రించినట్లు అధికారులు తెలిపారు. పోషకుల ఫోన్లకు.. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకుకోవచ్చు. దీనికోసం ముందుగా 8096958096 నంబర్కు హాయ్ అని వాట్సాప్ చేయాలి. వెంటనే ‘వెల్కమ్ టు మీ సేవ’ అనే రిప్లై మెసేజ్ వస్తుంది. ఆ తరువాత ‘ఎస్సెస్సీ హాల్టికెట్ మార్చి–2026’ అని మెసేజ్ పంపితే ఒక లింక్ అందుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి జిల్లా, మండలం, పాఠశాల పేరును ఎంపిక చేసి, పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంటినుంచే హాల్ టికెట్లను పొందే సౌకర్యం కల్పించింది.విద్యాశాఖ సూచనల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, పాఠశాల విద్యాశాఖ సూచనలకు అనుగుణంగా పదోతరగతి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర విద్యాశాఖ ఇదివరకే అన్ని పాఠశాలలకు పోస్టుద్వారా హాల్ టికెట్లు పంపించింది. పోషకుల వాట్సాప్కు కూడా విద్యార్థుల హాల్ టికెట్లు పంపడం జరిగింది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలి. – భోజన్న, డీఈవో,నిర్మల్ -
పొదుపు చేస్తేనే ‘గృహజ్యోతి’
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం 200 యూని ట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికే గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేస్తోంది. జిల్లాలో చా లామంది వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చలికాలంలో చాలా గృహాల్లో ఏ సీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడకపోవడంతో విద్యు త్ వినియోగం బాగా తగ్గింది. వేసవికాలంలో ఇ వన్నీ అధికంగా వాడితే కరెంట్ వినియోగం 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి పథకం వ ర్తించదు. అందుకే విద్యుత్ ఆదా చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 2,45,496 గృహ కనెక్షన్లు జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 2,45,496 ఉన్నాయి. గత నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకుని 1,25,257 మంది లబ్ధిదారులు రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. వీరందరికీ రూ.3.59 కోట్ల రాయితీ లభించింది. విద్యుత్ను పొదుపుగా వినియోగించుకుంటే విద్యుదుత్పత్తి భారం తగ్గుతుందని, వేసవిలో విద్యుత్ ఆదా చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు వినియోగదారులకూ అవగాహన కల్పిస్తున్నారు. గృహజ్యోతి లబ్ధిదారులు, సబ్సిడీ వివరాలు నెల లబ్ధిదారుల సబ్సిడీ మొత్తం సంఖ్య (రూ.లక్షల్లో) జూన్ 1,15,682 రూ.493.44 జూలై 1,22,082 రూ.477.75 ఆగస్టు 1,22,926 రూ.487.40 సెప్టెంబర్ 1,29,365 రూ.498.11 అక్టోబర్ 1,29,762 రూ.501.87 నవంబర్ 1,30,235 రూ.482.11 డిసెంబర్ 1,29,315 రూ.339.98 జనవరి 1,26,881 రూ.315.13 ఫిబ్రవరి 1,25,257 రూ.359.80 పొదుపు చేయడం ఇలా.. సెల్ఫోన్ చార్జింగ్ పూర్తయ్యాక చార్జర్ను ప్లగ్ నుంచి తొలగించాలి. -
నిర్మల్
చేతిలోనే.. ‘మీ టికెట్’ ఇకపై బస్సు టికెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్ ద్వారానే ‘మీ టికెట్’ యాప్లో బుక్ చేసుకునే విధానాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. అభివృద్ధికి సహకరించండి నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణాభివృద్ధికి సహకరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వును మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వై స్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి కోరారు. బుధవారం హైదరాబాద్లో కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి వే ణుగోపాలాచారితో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. నిర్మల్ పట్టణంలోని చారిత్రక శ్యామఘడ్, బత్తి స్ఘడ్ను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చే యాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. నిర్మల్చైన్గేట్: లాభసాటి వ్యవసాయం, చీడపీడల నివారణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. కొన్ని నెలలుగా ని ధులు మంజూరు నిలిచి వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వం ఆగస్టు–2022 వరకు నిర్వహణ నిధులు మంజూరు చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి నిలిచిపోయాయి. జిల్లాలో 79 రైతువేదికలు గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్కు ఓ రైతు వేదిక నిర్మించింది. ప్రతీ 5వేల మంది కర్షకులకు రెండు నుంచి నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి వ్యవసాయశాఖ ద్వారా రూ.12లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10లక్షలు వెచ్చించారు. జిల్లాలో 79 రైతువేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3వేల చొప్పున మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులు చాలవని వ్యవసాయశాఖ నివేదించడంతో రూ.9వేల చొప్పున విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్లో ఐదు నెలలకు సంబంధించి ఒక్కో వేదికకు రూ.45వేల చొప్పున విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి అంటే చెల్లింపులు నిలిచిపోయాయి. 40 నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఒక్కో రైతు వేదికకు ఇప్పటి వరకు రూ.3.60లక్షల నిధులు రావాల్సి ఉంది. అంటే జిల్లాలోని 79 రైతువేదికలకు నిర్వహణ నిధుల కింద రూ.2కోట్ల 84లక్షల 40వేలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ రైతువేదికల నిర్వహణ తప్పనిసరి కావడంతో ఏఈవోలు సొంతంగా వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారు. క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు.. జిల్లాలోని 18మండలాల్లో 79 క్లస్టర్లలో రైతువేదికలు నిర్మించి 79మంది ఏఈవోలకు విధులు అప్పగించారు. వీటి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో రైతువేదికకు రూ.9వేలు మంజూరు చేసి నిర్వహణ కొనసాగించింది. ఈ నిధులతో రైతువేదికల్లో తాగునీటి కోసం రూ.500, పారిశుధ్య నిర్వహణకు రూ.3వేలు, స్టేషనరీ కోసం రూ.వెయ్యి, కరెంట్ బిల్లు కోసం రూ.వెయ్యి, మరమ్మతుల కోసం రూ.వెయ్యి, నెలలో ఎనిమిదిసార్లు రైతులతో సమావేశాలు నిర్వహించనుండగా టీ, స్నాక్స్ కోసం రూ.2,500 ఖర్చు చేయాల్సి ఉంది. జిల్లాలోని రైతువేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈవోలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు కంప్యూటర్లున్నా విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈవోలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు వారే చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాలని సూచించినా ఎక్కడా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా చాలాచోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగమయ్యాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా రైతువేదికల పెండింగ్ నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఇప్పటినుంచి నెలానెలా నిధులు విడుదల చేయాలని ఏఈవోలు, రైతులు కోరుతున్నారు. కనీస వసతులు కరువు మంజూరు కాగానే చెల్లిస్తాం కొన్ని నెలలుగా రైతువేదికలకు నిర్వహణ నిధులు ఆగిపోయాయి. నిర్వహణ లోపం లేకుండా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులతో రైతువేదికలను శుభ్రం చేయిస్తున్నాం. రైతులకు సేవలు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా చూస్తాం. నిధులు మంజూరు కాగానే రైతువేదికల పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేస్తాం. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలోని రైతువేదికల వివరాలు మండలాల సంఖ్య 18 రైతువేదికలు 79 ఒక్కోదానికి బకాయి రూ.3.60లక్షలు మొత్తం బకాయిలు రూ.2.84కోట్లు -
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
ఖానాపూర్: ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని డిమాండ్ చేశారు. బుధవా రం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. న ల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను కా పాడే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని, ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లు వచ్చిన వారంతా నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు ముసు గు గంగవ్వ, కార్యదర్శి నారపాక పరిమళ, బ్లా క్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ తస్లీమా, ఖానాపూర్, కడెం, మామడ మండలాల అధ్యక్షులు కలమడుగు శారద, సురేఖ, లక్ష్మి, కౌన్సి లర్ తిరుమల, నాయకురాలు రేఖ ఉన్నారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
లోకేశ్వరం: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాంనాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేశ్వరం పరీక్షాకేంద్రంలో ద్వితీయ సంవత్సరం పరీక్షకు 120 మంది హాజరు కావాల్సి ఉండగా 117 మంది హాజరైనట్లు తెలిపారు. ఆయన వెంట సీఎస్ విఠల్ ఉన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు నిర్మల్ రూరల్: ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగుతున్నాయి. బుధవారం సెకండియర్ విద్యార్థులకు బాటనీ/గణితం/పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 6,227 మంది విద్యార్థులకు గాను 6053 మంది హాజరు కాగా, 174 మంది గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జాదవ్ పరశురాం లోకేశ్వరం, ముధోల్, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పరీక్షాకేంద్రాలను తనిఖీ చేశారు. -
మరింత పకడ్బందీగా ఎఫ్ఆర్ఎస్
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు మరింత పారదర్శకంగా ఉండేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఉపాధ్యాయుడు రోజూ ఉదయం 9గంటల లోపు పాఠశాలకు చేరుకుని ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 9గంటల తర్వాత నమోదు చేస్తే స్కూల్కు ఆలస్యంగా వచ్చినట్లు అధికారులు గుర్తిస్తారు. ఉదయం 9.15 గంటల వరకు పాఠశాల అసెంబ్లీ పూర్తి చేసి తరగతి గదులు నిర్వహిస్తారు. గతంలో 10 నిమిషాల వరకు ఆలస్యమైనా వెసులుబాటు కల్పించేవారు. ప్రస్తుతం ప్రతీ నెలలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కువసార్లు ఆలస్యమైతే గైర్హాజరైనట్లు పరిగణిస్తారని పేర్కొంటున్నారు. రోజుకు రెండుసార్ల చొప్పున.. ఉపాధ్యాయులు ప్రతిరోజూ రెండుసార్లు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేసుకోవాలి. ఉదయం 9గంటలకు మళ్లీ సాయంత్రం వెళ్లేటప్పుడు చెక్ అవుట్ హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు ఒక పూట సెలవు పెట్టి మరో పూట పాఠశాలకు హాజరైనప్పుడు ఎఫ్ఆర్ఎస్ నమోదుకు ప్రత్యేక నిబంధనలు పెట్టారు. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం పాఠశాలకు హాజరయ్యేవారు ఒంటి గంటలోపు రావాల్సి ఉంటుంది. ఉదయం పాఠశాలకు హాజరై మధ్యాహ్నం సెలవు పెట్టే ఉపాధ్యాయులు 12.30 గంటలకన్నా ముందుగా అవుట్ టైం నమోదు చేస్తే నిర్ణీత సమయానికి ముందుగా వెళ్లినట్లు పరిగణిస్తారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 713 ఉన్నాయి. ఇందులో 3,267 మంది ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేసుకుంటున్నారు. బుధవారం 2,535 మంది ఉపాధ్యాయులు హాజరు కాగా, 309 మంది సెలవులో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో బుధవారం 77.59 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు. -
టెర్రరిస్ట్ దాడులను ఖండించాలి
ఖానాపూర్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ టె ర్రరిస్ట్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఐ (ఎం–ఎల్) న్యూడెమోక్రసీ నిర్మల్–ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి జే రాజు కోరారు. ఇరాన్ అధ్యక్షుడిని హత్య చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఖానాపూర్ పార్క్ చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికన్ సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల ను ఆపాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఖానా పూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, నిర్మల్ డివిజన్ కార్యదర్శి హరిత, నాయకులు దుర్గం లింగన్న, ఎల్ఆర్ ఉపాలి, కూడుదుల రాజేశ్, గోనె స్వామి, గూట్ల ప్రసాద్, శ్రీనివాస్, మల్లక్క గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస భూముల లొల్లి
కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గిరిజనులకు పరిహారం కింద మండలంలోని పెత్తర్పు సమీపంలో సాగు భూములు కేటాయించారు. సదరు సాగు భూముల వద్ద ఈ నెల 3న పునరావాస గిరిజనులు, స్థానిక గొండుగూడ వాసుల మధ్య గొడవలు జరిగాయి. బుధవారం పునరావాస కాలనీని ఆర్డీవో రత్నకఽళ్యాణి, ఎఫ్డీవో శివకుమార్ సందర్శించి గిరిజనులతో సమావేశం నిర్వహించారు. అధికారుల తీరుకు నిరసనగా గిరిజనులు సమావేశ ఆనంతరం పాత మైసంపేట్కు తరలి అక్కడే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సాగు భూముల గొడవలు లేకుండా చేసి, భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని, లేకుంటే పాత గ్రామంలోనే ఉంటామని స్పష్టం చేశారు. కాగా, గురువారం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వీరితో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. డీటీ లచ్చిరాం, ఎఫ్ఆర్వో గీతారాణి, సీఐ అజయ్, హైటీకాస్ ఎన్జీవో ఉమ్మడి జిల్లా ప్రతినిధి వెంకట్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం అందేలా ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ జీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత ఎస్హెచ్వోలను ఆదేశించారు. బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయం అందించాలని సూచించారు. అనంతరం కుటుంబ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలు తిరిగి కలుసుకోవడంలో షీటీం పాత్రను ప్రశంసించారు. వేగం పెంచాలి ఈ సందర్భంగా గతంలో గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, పెండింగ్ ఫిర్యాదుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని వారికి సూచించారు. భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా ఉన్నారు. -
ఏడాదైనా బోనస్ ఏది?
భైంసా: సన్నవడ్ల బోనస్ కోసం జిల్లా రైతులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో సన్నవడ్లు విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించిన ప్రభుత్వం గత యాసంగిలో విక్రయించినవారికి మాత్రం నేటికీ చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 4,483 మంది రైతులు సన్నవడ్లు విక్రయించగా, వీరికి రూ.12.81 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. సన్నాల సాగులో ఐదువేల మందే.. జిల్లాలో 70వేల ఎకరాల్లో రైతులు రెండు సీజన్లలో వరి పండిస్తారు. దొడ్డురకం ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే సన్నరకం పండిస్తే 16 నుంచి 23 క్వింటాళ్లే వస్తుంది. పైగా సన్నాల సాగులో చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చులు కూడా ఎక్కువే. దొడ్డురకం పంట 110 రోజుల్లో వస్తుండగా, సన్నరకం పంట 130 నుంచి 150రోజుల సమయం పడుతుంది. దీంతో సన్నవడ్లు పండించే రైతులు జిల్లాలో 5వేల మంది మాత్రమే ఉన్నారు. సాగు చేయాలా.. వద్దా? ఈ ఖరీఫ్లో సన్నవడ్లకు బోనస్ చెల్లించిన ప్రభుత్వం గత యాసంగికి సంబంధించి పెండింగ్లో పె ట్టింది. దీంతో ఈ యాసంగిలో సన్నాలు సాగు చేసి న రైతుల్లో అయోమయం నెలకొంది. గతేడాదిలాగే బోనస్ నిలిపివేస్తారా? చెల్లిస్తారా? అనే విషయం తెలియక ఆందోళనకు గరవుతున్నారు. కాగా, జిల్లాలో వానాకాలంలో 63వేల ఎకరాల్లో సాగు చేసిన సోయా భారీ వర్షాలతో దెబ్బతింది. మార్క్ఫెడ్ ఆ ధ్వర్యంలో జిల్లాలో 2,38,450 క్వింటాళ్లను నాఫెడ్ కొనుగోలు చేశారు. సోయా రైతులకు రూ.51కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటికీ చెల్లింపులు లేవు. ఇప్పటివరకు జమకాలేదు గత యాసంగిలో జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సన్నవడ్లు సేకరించాం. ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. కానీ, బోనస్ డబ్బులు ఇప్పటివరకై తే జమకాలేదు. – సుధాకర్, పౌరసరఫరాలశాఖ డీఎం -
పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఎప్పుడో..!
ముధోల్: పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన సుమారు రెండేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించింది. పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. ఇక సీఎం రేవంత్రెడ్డి కూడా పంచాయతీలకు స్పెషల్ ఫండ్ ప్రకటించారు. అయితే రెండు నెలలైనా నిధులు విడుదల చేయలేదు. సీఎం వరాలు కొత్త సంవత్సర కానుకగా సీఎం రేవంత్రెడ్డి చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున సీఎం కోటా నుంచి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. జిల్లాలో 400 పంచాయతీలకు మొత్తం రూ.32 కోట్ల వరకు వస్తాయని లెక్కలు వేశారు కొత్త సర్పంచులు. కానీ రెండు నెలలైనా ఒక్క పంచాయతీకి కూడా నిధులు రాలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీలు.. ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం విడుదల చేసిన నిధులు అరకొరగా ఉన్నాయి. పంచాయతీ నిర్వహణకు, చెల్లించాల్సిన బిల్లులకు పేరుకుపోయాయి. రాష్ట్రం నుంచి రావాల్సిన గ్రామపంచాయతీల అభివృద్ధి నిధులు ఆలస్యం కారణంగా సర్పంచులు బిల్లులు చెల్లిస్తున్నారు. నిధులు లేకపోవడంతో చిన్న చిన్న పనులు కూడా చేయించలేని పరిస్థితి ఉందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి హామీ అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి.. పంచాయతీల పాలన ఇంకా గాడిన పడలేదు. నిధులు లేక బిల్లులు పెండింగ్లో ఉండటంతో ప్రభత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తున్నాం. ఆర్థిక సంఘం నిధులతో ముడి పెట్టకుండా సీఎం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాటకు కట్టుబడి ఉండాలి. – కృష్ణయ్య, బోరిగాం సర్పంచ్ జీపీలను చులకనగా చూడొద్దు పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడొద్దు. ఎవరూ అడగకుండానే సీఎం రేవంత్రెడ్డి తన కోటా నిధులు చేస్తానని హామీ ఇచ్చారు. రెండు నెలలైనా ఆ నిధులు విడుదల చేయలేదు. నిధులు విడుదలైతే పంచాయతీలకు ఊరట లభిస్తుంది. – మల్లేశ్, రువ్వి సర్పంచ్ -
భూమి కోసం.. గిరిజనుల లొల్లి
కడెం: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ సమీ ప మైసంపేట్ పునరావాస గిరిజనులకు కేటాయించిన వ్యవసాయ భూములవద్ద నచ్చన్ఎల్లాపూ ర్, గోండుగూడ గ్రామస్తుల మధ్య మంగళవా రం గొడవ జరిగింది. హోలీ సందర్భంగా భూ ముల వద్ద పూజలు చేయడానికి వెళ్లారు. అప్పటికే అక్కడ పూజలు చేసిన నచ్చన్ఎల్లాపూర్ వా సులను గోండుగూడ గ్రామస్తులు ఈ భూములు తమవని, మీరు ఎందుకు పూజలు చేశారని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, అటవీశాఖ అధికారుల ఎంట్రీతో గొడవ సద్దుమణిగింది. ఘటన స్థలా న్ని ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్ పరిశీ లించారు. బందోబస్తును పర్యవేక్షించారు. తమ కు భూములు కేటాయించకపోతే తిరిగి మైసంపేట్కు వెళ్తామని తెలిపారు. ఏళ్లుగా ఆ భూములు తాము సాగుచేసుకుంటున్నామని తమకే ఇవ్వాలని గొండుగూడ వాసులు డిమాండ్ చేశారు. -
బాసర ఆలయంలో భర్తీకాని ఖాళీలు
బాసర: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఒకటి. ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నప్పటికీ అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. బాసర దేవస్థానానికి రీజినల్ జాయింట్ కమిషనర్స్థాయి అధికారి ఈవోగా ఉండాలి. కానీ కొన్ని రోజులుగా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నియమిస్తూ వస్తున్నారు. అది కూడా పూర్తిస్థాయిలో కాకుండా ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు కలిగి ఉన్న అధికారిని నియమిస్తున్నారు. ఫలితంగా అసలే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఇది మరింత శాపంగా మారింది. ఆలయ ప్రాముఖ్యత కశ్మీర్ శారదా పీఠం తర్వాత భారతదేశంలో రెండో ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రం బాసర. గోదావరి తీరంలో చాళుక్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయం అక్షరా భ్యాస పూజలకు ప్రసిద్ధి చెందింది. భక్తుల రద్దీ పె రుగుతున్నా సౌకర్యాలు లోపిస్తున్నాయి. రెండు ఈ వో పోస్టులు ఖాళీగా ఉండటంతో రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి అంజనాదేవి అదనపు బాధ్యతలతో ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె కూడా సెలవుపై వెళ్లారు. ఇక ఏవో, సూపరింటెండెంట్, పర్యవేక్షకులు, సీనియర్–జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. పూజా సిబ్బంది కొరత అర్చక–పరిచారకులు 10 పోస్టులు ఖాళీగా ఉండటంతో నిత్య పూజలు, అక్షర శ్రీకారాలు అరకొర సిబ్బందితో నడుస్తున్నాయి. 15 మంది రెగ్యులర్ వైదిక సిబ్బంది మాత్రమే ఉండటంతో రోజంతా పనిఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పదవీ విరమణలు జరిగినా కొత్త నియామకాలు చేయడం లేదు. తాత్కాలిక ఏర్పాట్లు వాగ్దేవి సొసైటీ ఆధ్వర్యంలో 90 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. శానిటేషన్, టికెట్ పంపిణీ, పూజా సహాయం వంటి విధుల్లో రాజకీయ పక్షపాతాలు ఉన్నాభ అనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల సౌకర్యాలు, ఆలయ పర్యవేక్షణ బాగా లోపించాయి. ప్రభుత్వం దృష్టికి.. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అసెంబ్లీలో ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ అభివృద్ధి పనులు, సిబ్బంది భర్తీలకు త్వరి త చర్యలు అవసరమని భక్తులు, స్థానికులు డిమాండ్ చేశారు. అయినా దేవాదాయ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు. బాసర ఆలయం.. పోస్టులు ఖాళీల సంఖ్య ఈవో 2 పర్యవేక్షకులు 2 సీనియర్ అసిస్టెంట్లు 2 జూనియర్ అసిస్టెంట్లు 3 -
‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’కు శ్రీకారం
నిర్మల్చైన్గేట్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులు అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్ సదస్సుల్లో పాల్గొన్నారు. మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డు భద్రత (అరైవ్–అలైవ్), సంక్షేమం, పిల్లల భద్రత – డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం, విద్య, క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి 10 ప్రత్యేక అంశాలపై శాఖల వారీగా ప్రత్యేక దృష్టి సారిస్తారు. కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ప్రభుత్వం వినియోగించనుంది. క్షేత్రస్థాయిలో పనులు పారదర్శకంగా, వేగంగా జరిగేలా చూడటమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. -
జిల్లాకు సబ్సిడీ డ్రోన్లు
లక్ష్మణచాంద: జిల్లాలో గడ్డెన్న, కడెం, సదర్మాట్, స్వర్ణ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. దీంతో పంటల సాగుకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ జిల్లాగా నిర్మల్ ప్రసిద్ధి చెందింది. రెండు పంటలకు సరిపడా సాగునీరు ఉండడంతో ఏటా రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. రోజురోజుకూ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. వ్యవసాయ పనులకు అవసరమైన కూలీలు దొరకడం లేదు. దీంతో కూలీల కొరతను తీర్చి రైతులను ఆదుకుకోవడానికి సబ్సిడీపై డ్రోన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఎంఏఎం పథకం కింద... సబ్ మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్(ఎస్ఎంఏఎం) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాకు పది డ్రోన్లు మంజూరు చేసింది. ధరలో 40 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. వీరికి కేటాయింపు జిల్లాకు కేటాయించిన పది డ్రోన్లలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్పీవో), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు, స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీలు)కు కేటాయించనున్నట్లు డీఏవో అంజిప్రసాద్ తెలిపారు. 10 లీటర్ల సామర్ధ్యం ఉన్న డ్రోన్ ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని ఎఫ్పీఓలకు, పీఏసీఎస్లకు, ఎస్హెచ్జీల కు సబ్సిడీపై ఇచ్చే డ్రోన్ల సమాచారం మండల వ్యవసాయధికారుల ద్వారా ఇచ్చినట్లు డీఏవో తెలిపారు. ఆసక్తి ఉన్న వారి వివరాలు త్వరగా పంపాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సబ్సిడీపై డ్రోన్లు అందచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కూలీల కొరత తీరుతుంది రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందచేస్తున్న డ్రోన్లతో వ్యవసాయ రంగంలో కూలీల కొరత కొంత వరకు తీరుతుంది. వీటిని ఎఫ్పీవో, పీఏసీఎస్, ఎస్హెచ్జీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ సూచనల మేరకు అందిస్తాం. – అంజిప్రసాద్, డీఏవో, నిర్మల్జిల్లా సమాచారం... జిల్లాకు మంజూరైన డ్రోన్లు 10 కనీస ధర (10 లీటర్ల సామార్ధ్యం) రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు అందించే సబ్సిడీ రూ.4 లక్షలు(గరిష్టంగా) డ్రోన్లు ఇచ్చే సంఘాలు ఎఫ్పీవోలు, పీఏసీఎస్లు, ఎస్హెచ్జీలు -
నిర్మల్కు రైలొచ్చింది!
నిర్మల్ఖిల్లా: పట్టాలే వేయలేదు.. నిర్మల్కు రైలు ఎప్పుడొచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే. జిల్లాలో పట్టాలపై రైలు పరుగులు తీయాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజలకు సోమవారం రాత్రి ఓ దృశ్యం కనిపించింది. దీంతో కాసేపు ‘‘నిర్మల్కు రైలు వచ్చిందోచ్!’’ అని ఆసక్తిగా తిలకించారు. భైంసా నుంచి హైదరాబాద్కు ఓ భారీ లారీలో రైలు ఇంజిన్ను తరలిస్తున్నారు. ఆ లారీ రాత్రి నిర్మల్ మీదుగా వెళ్తుండగా పట్టణవాసులు చూసి ఆశ్చర్యపోయారు. చిన్నారులు ఉత్సాహంగా నిర్మల్కు రైలు వచ్చేసింది అంటూ కేరింలు కొట్టారు. -
చరిత్ర తీర్చేనా..
ఆహ్లాదం చింతనిర్మల్: జిల్లా ఏర్పడి పదేళ్లవుతోంది. కానీ.. ఇప్పటికీ జిల్లాలో ఒక్క టూరిజం స్పాట్ను అభివృద్ధి చేయలేదు. చూసేందుకు ఎన్నో ఆకట్టుకునే ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్నా కనీస సదుపాయాలు, వసతులు లేకపోవడంతో జిల్లావాసులు, పర్యాటకులు అటువైపు వెళ్లడం లేదు. జిల్లా కేంద్రంలో ఒక్క పార్కు కూడా లేదు. శివారులో ఉన్న గండిరామన్న హరితవనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈనేపథ్యంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమకు మౌలిక వసతులతోపాటు కాసింత ఆహ్లాదాన్నీ అందించే పార్కులు ఏర్పాటు చేయాలని అభ్యర్థులను కోరారు. ఈమేరకు కొత్త మున్సిపల్ పాలకవర్గం జిల్లాకేంద్రంలో చారిత్రక ప్రదేశాల చెంతనే పార్కులు అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కాంక్రీట్ జంగల్లో అవసరం.. పట్టణాలు రోజురోజుకూ విస్తరణతో కాంక్రీట్ అడవుల్లా తయారవుతున్నాయి. రోడ్లు, షాపింగ్ మా ల్స్, అపార్ట్మెంట్లు, పెద్దపెద్ద భవనాలు పెరుగుతు న్నా.. ప్రజలకు ప్రశాంతతనిచ్చే పచ్చని ప్రదేశాలు మాత్రం కరువవుతున్నాయి. కనీసం ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి లేకుండా పో తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్కులు నగర జీవనానికి ఊపిరిలా మారాయి. పచ్చదనం మధ్య గడి పే కాసింత సమయం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితమవుతున్న పిల్లలకు పార్కులు ఆడుకునే స్వేచ్ఛను ఇస్తాయి. త్వరలోనే ఏర్పాటు చేసేలా.. జిల్లా కేంద్రమైన తర్వాత ఇక్కడ జనాభా పెరగడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం కనుమరుగైంది. ప్రజల నుంచి పార్కుల ఏర్పాటు డిమాండ్ పెరుగుతోంది. ఈమేరకు చారిత్రక కట్టడాల వద్ద పార్కులు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేస్తున్నాం. త్వరలోనే పురావస్తుశాఖ అధికారులతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలుస్తాం. ‘చరిత్ర’ను కాపాడేలా.. పట్టణవాసుల నుంచి పెరుగుతున్న డిమాండ్ మేరకు నిర్మల్ పురపాలకవర్గం వినూత్న ప్రతిపాదన తీసుకువచ్చింది. నిర్మల్ చారిత్రక ప్రాంతం కావడంతో ఇప్పటికీ ఇక్కడ పదుల సంఖ్యలో బురుజులు, గఢ్లు, కట్టడాలు ఉన్నాయి. పార్కుల నిర్మాణం కోసం స్థలం లేనందున ఇలాంటి చారిత్రక ప్రాంతాల వద్దనే పచ్చదనం పెంచి, పార్కులను అభివృద్ధి చేయాలన్న యోచిస్తోంది. వీటివల్ల సదరు చారిత్రక ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా ఉండటంతోపాటు ముందుతరాలకు నిర్మల్ చరిత్ర తెలుసుకోవడానికీ అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. హిస్టారికల్ పార్కుల కోసం నిజామాబాద్ రోడ్డులో గల శ్యాంగఢ్, కలెక్టరేట్ రోడ్డులో గల బత్తీస్గఢ్, పట్టణ పోలీస్స్టేషన్ ఎదుటగల ఖిల్లాగుట్ట తదితర ప్రాంతాలను త్వరలోనే పరిశీలిస్తామంటున్నారు. అలాగే జిల్లాకేంద్రంలో పురాతన వస్తుసంపద, చారిత్రక అంశాలతో ఓ మ్యూజియంనూ ఏర్పాటు చేయనున్నారు. -
గల్ఫ్లో క్షేమంగా జిల్లావాసులు
ఖానాపూర్: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినవారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన వారంతా క్షేమంగానే ఉన్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కుటుంబీకులకు ఫోన్ చేసి క్షేమ సమాచారం ఇస్తున్నారు. ఖానాపూర్ మండలానికి చెందిన రాజేశ్, తిరుమలేశ్, శ్రీకాంత్, తదదితరులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో ఉన్నామని తెలిపారు. తాము పనిచేసే జుఫర్ బెహరన్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. -
నిర్మల్
వసూళ్లకు ఫుల్స్టాప్ నిర్మల్ పట్టణంలో చిరువ్యాపారులపై కొత్త మున్సిపల్ పాలకవర్గం భారం తగ్గించింది. ఫిబ్రవరి 27న జరిగిన తొలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. సమస్యలపై సమరం భైంసా : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ లొల్లి మొదలైంది. వారాలుగా విద్యార్థుల్లో అసంతృప్తి పెరుగుతోంది. క్యాంపస్ నిధుల వాడకం, పరీక్ష విధానాల పై నిత్యం నిరసన తెలుపుతన్నారు. అధికారులను ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యంపై ఆరోపణలు పెరుగుతున్నాయి. క్యాంపస్ బడ్జెట్ వివరాలను బహిర్గతం చేయాలని, శ్వేతపత్రం డిమాండ్ విద్యార్థులు చేస్తున్నారు. యాజమాన్యం ఆరోపణలను తిరస్కరించినా, ఆదివారం రాత్రి గోదావరి హాస్టల్ ముందు వందల మంది సమావేశమై నిరసన వ్యక్తం చేశా రు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశమైంది. మనీశ్రెడ్డి ఘటనతో.. పరీక్ష పత్రాల రీ వెరిఫికేషన్ విషయంపై ప్రశ్నించిన విద్యార్థి నాయకుడు మనీశ్రెడ్డి ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనను తనిఖీ చేశారని, తనతో అధికారులు, సిబ్బంది బలవంతంగా లేఖలు రాయించారని రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని సంప్రదించాడు. ఇది క్యాంపస్ పరిపాలనపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో అధికారులు, విద్యార్థుల మధ్య వైరానికి కారణమైంది. ప్రశ్నిస్తే బెదిరింపులు? అధికారుల అక్రమాలు, ఏకపక్ష నిర్ణయాలను ప్రశ్ని స్తే పరిపాలనా ఒత్తిడి పెరుగుతోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఫోన్లు తనిఖీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు. టీఏ ఎస్ఎస్ నేతృత్వంలో ఆదివారం రాత్రి గోదావరి బాలుర హాస్టల్ ఎదుట భారీ సమావేశం జరిగింది. వందల మంది విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి వరకు సమావేశం కొనసాగింది. ‘సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాడతా మని నినాదాలు చేశారు. మంత్రులు హామీలు ఇచ్చి... గతంలో బాసర క్యాంపస్కు వచ్చిన రాష్ట్ర మంత్రులు పలు హామీలు ఇచ్చారు. విద్యార్థులను కలిసి వారి సమస్యలపై క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించడం లేదని విద్యార్థులు అంటున్నారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని విద్యార్థి నాయకులు పేర్కొంటున్నారు. మానవ హక్కుల సంఘాల దృష్టి... క్యాంపస్ పరిస్థితులపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు ఇక్కడి విద్యార్థులు వెళ్లి ఫిర్యాదులు చేశారు. క్యాంపస్ ఘటనలపై త్వరలోనే విచారణలు జరుగుతాయనే చర్చ ఉంది. భవిష్యత్తుపై భయంతో కొంతమంది విద్యార్థులు బహిరంగంగా ముందుకు వచ్చేందుకు సంకోచిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వారం రోజుల పరిణామాలు బాసర ట్రిపుల్ ఐటీని మరోసారి వార్తల్లో నిలిపాయి. ఆదివారం రాత్రి గోదావరి హాస్టల్ వద్ద సమావేశమైన విద్యార్థులు భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అసంతృప్తి ఉధృతమవుతోంది. క్యాంపస్లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారంలో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం రాత్రి విద్యార్థులు భారీగా సమావేశమయ్యారు. టీఎస్ఏఎస్ (తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ) ఆధ్వర్యంలో గోదావరి బాలుర హాస్టల్ ముందు నిర్వహించిన సమావేశం అర్థరాత్రి వరకూ కొనసాగింది. క్యాంపస్కు విడుదలవుతున్న నిధులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇక్కడి సమస్యలపై కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లకు విద్యార్థులు ఆశ్రయిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి సదుపాయాల లోపాలు, భోజన నాణ్యతపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత మూల్యాంకన విధానాలపై తీవ్ర అసంతృప్తి తెలిపారు. పరిపాలనలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలను విద్యార్థులు సభలో ప్రస్తావించారు. సమస్యలపై వినతులు స్వీకరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని తెలిపారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. టీఎస్ఏఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు యాజమాన్యాన్ని కలిసినట్లు తెలిపారు. అయినా స్పందన లేకపోవడంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘‘ఇది హెచ్చరిక మాత్రమే. అవసరమైతే దశలవారీగా ఆందోళనలను విస్తరిస్తాం’’ అని పేర్కొన్నారు. రాత్రి వేళ కూడా నినాదాలతో క్యాంపస్ మార్మోగింది. -
చట్టవిరుద్ధ నియామకం ఆపాలి..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అండ్ జూనియర్ కాలే జీ సోఫీనగరలో పీజీ టీగా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి భర్తను కాంట్రాక్ట్ పద్ధతిన కంప్యూటర్ ఆపరేటర్గా నియమించినట్లు తెలిసింది. ఈ నియామకం పారదర్శకతను పాటించకుండా జరిగిందని, ఈ విషయమై ప్రిన్సిపాల్ను అడిగితే రిక్రూట్మెంట్ ఏజెన్సీని అడగాలని తెలిపారు. ఉపాధ్యాయురాలి భర్త అని తెలిసి విధుల్లోకి తీసుకున్న ప్రిన్సిపాల్పై చర్య తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పనిషత్ నాయకుడు కొట్టూరి ప్రవీణ్కుమార్ కలెక్టర్ను కోరారు. -
ఉక్కు పరిశ్రమ కేంద్రంగా తెలంగాణ
బాసర: బాసర ఆర్జీయూకేటీలో సోమవారం ‘తెలంగాణలో ఇనుము(ఉక్కు) పరిశ్రమ.. లోహశాస్త్రంలో విస్మరించబడిన అధ్యాయం’ అంశంపై గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు. డా. జైకిషన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాచీన, మధ్యయుగాల్లో తెలంగాణ ప్రాంతం ఇనుము, ఉక్కు తయారీకి ప్రపంచ కేంద్రంగా నిలిచిందని వెల్లడించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తరించిన ఈ పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధ ‘డమాస్కస్’ ఖడ్గాల తయారీకి మూలమని చెప్పారు. 2,800 గ్రామాల్లో చేసిన సర్వేలో 2,600 గ్రామాలు ఇనుము కరిగించే కేంద్రాలుగా ఉన్నట్టు గుర్తించారన్నారు. వీటిలో 600 గ్రామాల్లో మట్టి మూసలతో అత్యున్నత నాణ్యమైన ఉక్కును తయారు చేసేవారని ఆధారాలతో వివరించారు. నిజామాబాద్ జిల్లా కోనసముద్రం గ్రామం మధ్యయుగంలో ‘వుట్జు’(ఉక్కు గడ్డలు) పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఇక్కడి ఉత్పత్తులు ఐరోపా, పశ్చిమ దేశాలకు ఎగుమతి అయ్యేవని తెలిపారు. తెలుగు పదాలు ‘కొలిమి’, ‘కమ్మరి’, ‘చిత్యం’ ఆనాటి లోహశాస్త్ర సమాజంతో గాఢ సంబంధాన్ని సూచిస్తాయని ఆయన పేర్కొన్నారు. 1857 స్వాతంత్య్ర పోరాటం తర్వాత బ్రిటిష్ కఠిన చట్టాలు, ఐరోపా పారిశ్రామిక విప్లవ ప్రభావంతో స్వదేశీ సాంకేతికత కనుమరుగైందని తెలిపారు. మెటలర్జీ విభాగాధిపతి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ పురాతన సాంకేతికతను ఆధునిక ఇంజనీర్లు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఓఎస్డీ, పరిపాలన అధికారి ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు డాక్టర్ వి.అజయ్, డాక్టర్ ఆర్.అజయ్, డాక్టర్ భాస్కర్, జి.సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇబ్బంది పెట్టారు
పరీక్ష పత్రం రీ వ్యాల్యువేషన్ను చాలెంజ్ చేస్తే నన్ను వేధించారు. యూనివర్సిటీ సిబ్బంది నా ఫోన్ లాక్కున్నారు. నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. సెక్యూరిటీ సిబ్బందిని ఇచ్చి ఇంటి వరకు పంపించారు. బలవంతంగా వారికి నచ్చినట్లు నాతో లేఖలు రాయించుకున్నారు. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి శిక్ష పడే వరకు నేను పోరాటం చేస్తాను. – మనీశ్రెడ్డి, విద్యార్థి అందరినీ వేధిస్తున్నారు బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్లో సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించిన అందరినీ అధికారులు వేధిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాం. సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశాం. వర్సిటీ అధికారులు సమస్యలు చెబితే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. – ఆకాశ్యాదవ్, విద్యార్థి సంఘం నాయకుడు -
‘ప్రజా’ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల ఫిర్యాదులు స్వయంగా స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూసమస్యపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. నీటి సమస్య తలెత్తకుండా చూడాలి.. ప్రజావాణి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య ఉండే ప్రాంతాలు గుర్తించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు తనిఖీ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు యూరియా యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా, ఇప్పటి వరకు రైతులు 1.60 లక్షల యూరియా బస్తాలు బుక్ చేసుకున్నారని, 1.40 లక్షల బస్తాలు తీసుకున్నారని వివరించారు. సీఎం కప్ పోటీలలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 4 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు రావడం గర్వకారణమన్నారు. ఇందుకుగాను, అధికారులకు, కోచ్ లకు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అంతకుముందు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డీసీవో నర్సయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కలెక్టర్, అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్ నిర్మల్ టౌన్: వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతకు కీలకమని, వాటి సంరక్షణ అందరి బాధ్యత అని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ అన్నారు. వన్యప్రాణి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 33 యూనిట్ల శాంపిళ్లను వైద్య సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాముఖ్యతను సామాజిక బాధ్యతగా గుర్తించి, తమ వంతుగా సామాజిక సేవ చేయాలని అటవీ సిబ్బందికి సూచించారు. అటవీ సంపదను కాపాడటం అందరి బాధ్యత అన్నారు. ప్రకృతి ఉంటేనే జీవం ఉంటుందని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బొబడే, ఎఫ్డీవోలు నాగిని భాను, శివకుమార్, రామకృష్ణారావు, అటవీ క్షేత్ర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నివారణకు సహకరించాలి
నిర్మల్చైన్గేట్: బాల్య వివాహాల నివారణకు ప్రజలు బాధ్యతగా సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచారరథాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు. బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ‘‘బాల్య వివాహ రహిత భారత్’’ కార్యక్రమంలో భాగంగా ప్రచార రథాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలోని అన్నిగ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాలని, 18 సంవత్సరాలలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. కార్యక్రమంలో విజన్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ శరత్కుమార్, రాజు, బాలల పరిరక్షణ అధికారి మురళి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వహీద్, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ గంగాధర్, మిషన్ శక్తి సిబ్బంది, విజన్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
కరాటేలో గురుకుల విద్యార్థుల ప్రతిభ
సారంగపూర్: ఇటీవల వరంగల్, హనుమకొండలో నిర్వహించిన జాతీయస్థాయి ఫైటర్ షోటోఖాన్ కరాటే పోటీల్లో మండలంలోని జామ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. ఈపోటీల్లో పాఠశాలకు చెందిన చిన్మయి, బి.అంకిత, చందన బంగారు పతకాలు సాధించగా, బి.ప్రణతి, జి.అశ్విత వెండి పతకాలు, సీహెచ్.స్నేహిత, మనోజ్ఞ కాంస్య పతకాలు సాధించారు. అలాగే పీఎంశ్రీ ఆటల పోటీల్లో వందమీటర్ల పరుగు పందెంలో పాఠశాలకు చెందిన జగశ్రీ వెండి పతకం, లాంగ్ జంప్లో కాంస్య పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఆయా పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ సంగీత, పీఈటీ సుష్మిత, పీడీ సుప్రియ తదితరులు అభినందించారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావర ణం పొడిగా ఉంటుంది. చలి తగ్గుతుంది. శివాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలిభైంసారూరల్: యువత ఛత్రపతి శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడుచుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావు పటేల్ సూచించారు. ఆదివారం మండలంలోని పాంగ్రి గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ సామ్రాజ్య స్థాపనకు శివాజీ చేసిన పో రాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, దౌర్జన్యాలకు ఎదురు నిలిచి, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహోన్నత నాయకుడు అని కొనియాడారు. పాంగ్రి గ్రామంలో రాజ కోట నమూనాతో విగ్రహాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయమని పేర్కొన్నారు. సర్పంచ్ ఆకాశ్, భైంసా మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి, ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, ప్రజాట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పటేల్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
● జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీలు ● నియామకాలు చేపట్టని సర్కారు ● పనుల నిర్వహణలో ఇబ్బందులు
నిర్మల్చైన్గేట్: వలసలను నివారించేందుకు గ్రామీ ణ నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉపాధిహా మీ పథకం నిర్వహణపై పర్యవేక్షణ కొరవడింది. జి ల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సాధారణంగా ఉపాధిహామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే వీరి సంఖ్య తక్కువగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పనుల ప ర్యవేక్షణ, డేటా సేకరణలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడం, మస్టర్ల కేటాయింపులు, పనుల పర్యవేక్షణ, జాబ్కార్డుల మంజూరు, ఆధార్ కార్డుల అనుసంధానం, వనమహోత్సవం, డేటా సేకరణ తది తర పనులను ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తుంటారు. ప్రతీ వేసవిలో ఉపాధి పనులకు కూలీలు అధికసంఖ్యలో హాజరవుతుంటారు. వివిధ కారణాలతో జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీలేర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలతోపాటు పలు పాత పంచాయతీల్లోనూ సరిపడా సిబ్బంది లేక పథకం అమలులో తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2018 నుంచి విడతల వారీగా జిల్లాలో 400 గ్రామ పంచాయతీలేర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో పాటు వివిధ కారణాలతో ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీలున్నాయి. 400 మంది క్షేత్ర సహాయకులకు ప్రస్తుతం జిల్లాలో 205 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 195 మంది క్షేత్రసహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టనందున పక్కవారికి ఇన్చార్జి బాధ్యతలు ఇస్తున్నారు. లేదా.. అనుభవమున్న సీనియర్ కూలీని మేట్గా గుర్తించి పనులు చేయిస్తున్నారు. కార్యదర్శులకు బాధ్యతలు కొత్త గ్రామపంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించని కారణంగా పంచాయతీ కార్యదర్శులే ఉపాధిహామీ పనులు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. కార్యదర్శులకు గ్రామపంచాయతీ పనులు ఉండటంతో ఉపాధి పనులపై సరిగా దృష్టి సారించలేకపోతున్నారు. పనుల్లో ఏ పొరపాటు జరిగినా పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాల్సిన పరిస్థితులేర్పడుతున్నాయి. కార్యదర్శులకు పూర్తిస్థాయి బాధ్యతలు లేకపోవడంతో ఉపాధి పనుల అమలులో పురోగతి లేకుండా పోతోంది. కొత్తపనులు కేటాయించడం, గ్రామసభలు, నర్సరీల నిర్వహణ, కూలీల వేతనాలు మంజూరు తదితర విషయాల్లో పర్యవేక్షణ లేక ఇబ్బందులెదురవుతున్నాయి. కూలీలు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నా ఫీల్డ్ అసిస్టెంట్ల కొరతతో పథకం అమలులో ఇబ్బందులెదురవుతున్నాయి.జిల్లా సమాచారం మండలాల సంఖ్య 18 గ్రామపంచాయతీలు 400 ప్రస్తుత ఫీల్డ్ అసిస్టెంట్లు 205 ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీలు 195 జాబ్కార్డులు 1.28లక్షలు ఉపాధి కూలీలు 2.19లక్షలు 100రోజుల పని పూర్తి చేసినవారు 574 -
ఉడుంపూర్లో పర్యటించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు
కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హు స్సేన్నాయక్ ఆదివారం పర్యటించారు. బీజేపీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్యాదవ్ హుస్సేన్ నాయక్కు గొంగడి కప్పి, గొర్రెపిల్లను అందించి స్వాగతం పలికారు. లక్ష్మీపూర్ ఎత్తి పోతల పథకాన్ని ఉడుంపూర్ వరకు పొడిగించాలని, మిద్దెచింత గ్రామానికి విద్యుత్, గండిగోపాల్పూర్కు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం క ల్పించాలని కోరారు. ఐటీడీఏ డీడీ అంబాజీ, శం కరయ్య, శేఖర్, పరంధాములు, శారద, బ క్కయ్య, విజేశ్, విజయ్, శ్రీను ఉన్నారు. -
అ‘పూర్వ’ం.. అద్వితీయం
కడెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995–96 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదివిన వారంతా ఆదివారం మండల కేంద్రంలోని బృందావన్ రిసార్ట్స్లో కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉత్సాహంగా గడిపారు. అప్పటి గురువులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఖానాపూర్: పట్టణంలోని బాలికల జెడ్పీహెచ్ఎస్లో 2001–2002 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివినవారంతా స్థానిక జీవీఆర్ ఫంక్షన్హాల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం పేరిట కలుసుకున్నారు. ఒకరికొకరు పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. పాఠశాలలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సందడి చేశారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. -
అనుక్షణం.. భయం భయం!
నిర్మల్వినూత్నం గిరిజన హోలీ ఆదివాసీ గిరిజనులు ‘దురాడి’ పేరుతో హోలీ ని విభిన్నంగా జరుపుకొంటారు. సంప్రదా యాలకు అనుగుణంగా పండుగ చేసుకోవ డం వీరికి ఆనవాయితీగా వస్తోంది. ‘ఉపాధి’పై పర్యవేక్షణ ఏది?మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు భైంసాటౌన్: తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఏఎస్పీ రాజేశ్మీనా సూచించారు. పట్టణ పరిధిలో మైనర్ డ్రైవింగ్పై ఆదివారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా 12 మంది బాలురు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. దీంతో పట్టణ పోలీస్స్టేషన్కు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ సాయికుమార్ తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఎస్సైలు ఉన్నారు.నిర్మల్ఖిల్లా: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన వలస కార్మికులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇ క్కడి వారి కుటుంబాల్లోనూ ఏం జరుగుతుందోన న్న ఆందోళన నెలకొంది. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో ఆయా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరుగుతున్నాయనే సమాచారం రావడంతో సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయని అక్కడి వలస కార్మికులు తమ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తాము క్షేమంగానే ఉన్నామని చె బుతూనే తమలో భయాందోళన నెలకొందని వెల్ల డిస్తున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలతో అక్కడి ప్రజల్లో భీతి నెలకొంది. ఈ ప్ర భావంతో ఆయా దేశాలకు వెళ్లే విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్రమత్తం చేసిన రాయబార కార్యాలయాలు యూఏఈ, సౌదీఅరేబియా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఇప్పటికే భారతీయులకు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అవసరమైతే సమీప రాయబార కార్యాలయాలను సంప్రదించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవా లని విజ్ఞప్తి చేస్తున్నాయి. జిల్లాలోని వలస కార్మికుల కుటుంబ సభ్యులు తమ బంధువుల క్షేమ సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితులు సద్దుమణగాలని, తమ వారు సురక్షితంగా స్వదేశానికి చేరాలని కోరుకుంటున్నారు. బాంబుల మోతతో భయభ్రాంతులు ఇరాన్తో పాటు ఇజ్రాయెల్, దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీఅరేబియా తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చే స్తుండగా మరోవైపు అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయిల్ దేశం ఇరాన్పై పరస్పరదాడులకు దిగుతుండడంతో ఆయా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మా రుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వెళ్లి ఆయా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల పరిస్థితిపై వా రి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై తే ఆయా దేశాలు భద్రత చర్యలు చేపడు తుండగా సురక్షితంగానే ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఎక్కడి నుంచి క్షిపణి దాడులు ముంచుకొస్తున్నాయో.. తెలియకపోవడంతో బాంబులు పడిన శబ్దాలతో తాము భయభ్రాంతులకు గురవుతున్నట్లు వారు చెబుతున్నారు. విధులు లేక గదికే పరిమితం గజ్జలమ్మదేవికి పూజలు కుంటాల: మండలకేంద్రంలోని గజ్జలమ్మ, ము త్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలకు ఆదివారం జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఆలయంలో పూజలు చే శారు. బోనాలను నైవేద్యంగా సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదం పంపిణీ చేశారు. ‘ఆడ ఎట్లున్నది బిడ్డా.. అంతా మంచిదేనా.. బాంబులు వడుతున్నయని టీవీలల్ల చెప్తున్నరు.. ఉన్నొక్కడివి బతుకుదెరువు కోసం పెండ్లంపిల్లగాళ్లను ఇడిసి దేశం పోతివి.. ఈ వార్తలు సూసి భయమనిపియ్యవట్టే బిడ్డా..’ ఇది ముధోల్ మండలంలోని చించాల గ్రామానికి చెందిన ఓ తల్లి కువైట్లో ఉంటున్న తన కొడుకుకు ఫోన్ చేసి యోగక్షేమాలు ఆరా తీసిన తీరు. ‘ఏమండి బావున్నారా.. పిల్లలు గుర్తుచేస్తున్నరు.. టీవీల్లో, ఫోన్లలో చూసి మన పిల్లలు అడుగుతున్నరు.. దేశాల మధ్య బాంబు దాడులు జరుగుతున్నయట నిజమేనా..? ఎట్లున్నది పరిస్థితి..? అంత మంచిదేనా..? ఇది నిర్మల్ జిల్లాకు చెందిన ఓ గృహిణి కువైట్ దేశంలో ఉన్న తన భర్తకు ఫోన్ జేసి వాకబు చేసిన తీరు.బహ్రెయిన్ దేశంలోని అస్కర్ ప్రాంతంలో ఉంటున్న కడెం మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ఎం.రాజేందర్ ఇప్పటికై తే సురక్షితంగానే ఉన్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ విధులు లేక రూమ్లోనే ఉంటున్నట్లు చెప్పారు. ఇక్కడి ప్రభుత్వాలు ప్రమాద హెచ్చరిక జారీ చేశాయని, అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని నిబంధనలు కట్టుదిట్టం చేసినట్లు చెబుతున్నారు. తనతోపాటు అదే మండ ల ంలోని సారంగపూర్ గ్రామానికి చెందిన మిగతా ముగ్గురు మిత్రులు కూడా నివాస గదికే పరిమితమైనట్లు ఆయన తెలిపారు. -
యూరియా కష్టాలు తీరేదెలా?
భైంసా: జిల్లా రైతులు యూరియా కోసం నానా పా ట్లు పడుతున్నారు. యూరియాను యాప్లో బుక్ చేసుకోవాల్సి ఉండగా రైతులకు సరిపడా అందని పరిస్థితి ఉంది. సారంగపూర్ మండల కేంద్రంలోని ఒక దుకాణానికి ఇటీవల 450 యూరియా బస్తాలు రాగా, 50 సెకన్లలోనే యాప్లో నో స్టాక్ సూచిస్తున్నట్లు రైతులు వాపోయారు. అప్పటివరకు దుకా ణం వద్దే ఉన్న రైతులు యూరియా దొరకక నిరాశతో వెనుదిరిగారు. ఖానాపూర్లోని గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపులో యూరియా బుక్ చేసిన రైతులు రెండ్రోజులు నిరీక్షించినా ఇవ్వనట్లు తెలిసింది. మామ డ మండలంలోని పలువురు రైతులు ఈ కేంద్రానికి వచ్చి యూరియా దొరకక వెనుదిరిగి వెళ్లారు. ఐదు నిమిషాల్లో స్టాక్ ఖాళీ జిల్లాలోని మరికొన్ని మండలాల్లోనూ యాప్లో స్టాక్ అందుబాటులో ఉందని చూపించిన కొద్దిసేపట్లోనే ‘స్టాక్ లేదు’ అని మెసేజ్ వస్తోందని రైతులు వాపోతున్నారు. నిజంగా ఎంత స్టాక్ వచ్చింది, ఎవరు బుక్ చేసుకున్నారో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. యూరియా స్టాక్ ఎప్పుడు వచ్చిందో.. ఎంత వచ్చిందో ముందుగా సమాచా రం ఇవ్వడంలేదని పేర్కొంటున్నారు. దీంతో డీలర్ వద్దకు చేరుకునేసరికే స్టాక్ అయిపోతున్న పరిస్థితి ఎదురవుతోంది. ఇక, స్మార్ట్ ఫోన్ వినియోగం తెలియని వృద్ధ రైతులు యాప్లో బుక్ చేసుకోవ డం తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు యూరియా స్టాక్ రాగానే ముందుగా తెలిసిన వ్యక్తు లే యాప్లో బుక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. యూరియాతో పాటు ఇతర మందులు కొనుగోలు చేసేవారికే దుకాణాదారులు ప్రాధాన్యత ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి పారదర్శక విధానం అమలు చేయాలని కోరుతున్నారు. వ్యవసాయాధికారులు స్పందించి యాప్ లోపాలపై సాంకేతిక సమీక్ష చేయాలని, స్టాక్ వివరాలను రియల్ టైమ్లో స్పష్టంగా ప్రదర్శించాలని, ముందస్తు సమాచారం అందించే విధా నం అమలు చేయాలని, కౌలు రైతులకు ప్రత్యేక సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘అడెల్లి’కి భక్తుల తాకిడి
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆది వారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. నైవేద్యాలు, ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కాగా, అమ్మవారిని మాజీ ఎంపీ సోయం బాపూరావు, నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ఈవో భూమయ్య, చైర్మన్ భోజాగౌడ్ ఘనస్వాగతం పలికి దర్శనానంతరం సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. రేపు ఆలయం మూసివేత అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఈనెల 3న ఉద యం 7నుంచి 4వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో భూమయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6గంటలకు అభిషేకం, అలంకరణ, హారతి నివేదన అనంతరం 7గంటల నుంచి ఆలయం మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. 4వ తేదీన ఉదయం 6గంటలకు ఆలయంలో గణపతి, గౌరీపూజ, పుణ్యాహావాచనం, అమ్మవారి ఆలయ ప్రాంగణం సంప్రోక్షణ, పంచామృతాభిషేకం, అలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు. -
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి
ఖానాపూర్: ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య డిమాండ్ చేశా రు. ఆదివారం పట్టణంలోని తాపీమేసీ్త్రల సంఘ భవనంలో సంఘం అధ్యక్షుడు కడకుంట్ల నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్ర భుత్వం కార్మికులను విస్మరిస్తోందని ఆరోపించారు. మ్యారేజ్, మెటర్నరీ పథకాలకు రూ.లక్ష వరకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన కార్మికుడికి రూ.6వేల పెన్ష న్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డును కాపాడాలని డి మాండ్ చేశారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు సు నారికారి రాజేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు, మండల కార్యదర్శి చిలుకూరి ఇస్తారి, నాయకులు సురపాక రాజన్న, బోదాసు చిన్న నర్సయ్య, పోశెట్టి కోమటిపల్లి, భీమయ్య, దుర్గం లింగన్న, ఆడేపు గణేశ్, ఎల్ఆర్ ఉపాలి తదితరులున్నారు. -
ఈజీగా గణిత బోధన
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్(పీఎంశ్రీ) గణిత ఉపాధ్యాయుడు సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీం విద్యార్థుల్లో డిజిటల్ విద్యపై ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించిన డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అ మలు చేసి విద్యార్థులకు అభ్యాసక్రమాల్లో మార్పులు తీసుకువచ్చారు. శిక్షణ సెషన్లకు హాజరై, పైథాన్ ప్రోగ్రామింగ్ను పాఠశాల విభాగంలో ప్రవేశపెట్టి సాంకేతిక నైపుణ్యాలను పెంచారు. పాఠశాల విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి 2025 జిల్లా సైన్స్ ఫెయిర్లో పైథాన్ ఆధారిత ప్రాజెక్టులతో వి జయం సాధించేలా మార్గదర్శకత్వం వహించారు. 35 మంది విద్యార్థులకు మద్రాస్ ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు.. కరీం ప్రత్యేక కృషితో పాఠశాలలో 35 మంది విద్యార్థులు మద్రాస్ ఐఐటీ నిర్వహించిన ఫౌండేషన్ కోర్సుల్లో చేరి 8 వారాల్లో పూర్తి చేశారు. రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంత మంది సర్టిఫికెట్లు పొందడం విశేషం. కలెక్టర్ అభిలాష అభినవ్ పాఠశాల సందర్శించి విద్యార్థులను, వర్చువల్ ల్యాబ్ సౌకర్యాలను అభినందించారు. వినూత్న బోధనా పద్ధతులు గణిత బోధనలో జియోజిబ్రా, రోబోకాంపాస్ వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించి సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థం చేసుకునేలా చేస్తున్నారు. 2025 మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2026 ఫిబ్రవరి 19న ఎస్సీఈఆర్టీ రాష్ట్రస్థాయి గణిత సెమినార్లో ’గణితంలో పైథాన్ వాడకం’ అంశంపై ప్రదర్శనకు ప్రశంసలు అందుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.. మారుతున్న కాలనీకి అనుగుణంగా (ఎన్ఈపీ–2020) కి అనుగుణంగా విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్ బోధనలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. విద్యాశాఖ ఆదేశాలతోపాటు డీఈవో, హెచ్ఎం, తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నూతన బోధనల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. భవిష్యత్తుల్లో పాఠశాల విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేందుకు కృషిచేస్తా. – సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీం, గణిత ఉపాధ్యాయుడు -
సృజనాత్మక బోధన..
భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ ప్రభుత్వ పాఠశాలలో 18 ఏళ్లుగా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మాదిరి ఎల్లన్న. పదేళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరంవిద్యార్థుల అవగాహనపై దృష్టి పెడుతున్నారు. తోటి ఉపాధ్యాయులకు మార్గదర్శిగా నిలుస్తూ పాఠాలను సరళంగా అందించే పద్ధతుల్లో నిపుణుడు. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రశంసలు.. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోదావరి ఆడిటోరియంలో జరిగిన రాష్ట్రస్థాయి సెమినార్లో నిర్మల్ జిల్లా ప్రతినిధిగా పాల్గొని ప్రదర్శన ఆకట్టుకున్నది. రాజస్థాన్ ఉదయ్పూర్లో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ కార్యక్రమంలో డైరెక్టర్ రుషి కుమార్ వశిష్ట చేత ప్రశస్క పొందారు. గత సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. విద్యార్థుల విజయాలు ఎల్లన్న పనిచేసిన పాఠశాలల్లో గ్రామస్తుల సహకా రంతో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచా రు. ఆయన విద్యార్థులు గురుకుల సీట్లుసాధించి ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. వినూత్న విధానాలతో గ్రామీణ విద్యారంగంలో మార్పు తీసుకురావడం ఎల్లన్న ప్రత్యేకత. ఆనందంగా ఉంది ప్రాథమికస్థాయి విద్యార్థుల కోసం పప్పెట్రీ విధానంలో పిల్లలకు బోధించడం ఆనందంగా ఉంది. పదేళ్లుగా ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పాఠశాలకు వెళ్తున్నాను. అక్కడి పాఠశాలకు సమీపంలో ఉండే విద్యార్థులను బడికి రప్పించేందుకు కృషిచేస్తాను. ఇప్పటికే నాకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జాతీయ స్థాయిలో ప్రశంసాపత్రం ఇచ్చారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రశంసించారు. ప్రాథమిక పాఠశాలల్లో సులభమైన పద్ధతిలో విద్యా బోధన చేసేందుకు జిల్లాలో సీఆర్టీగా ఎంపిక చేశారు. – మాదిరి ఎల్లన్న, ఉపాధ్యాయుడు తోలుబొమ్మలాటతో.. పప్పెట్రీ, స్టిక్ పప్పెట్, గ్లోవ్స్ పప్పెట్, స్ట్రింగ్ ప ప్పెట్ వంటి వాటితో పాఠ్యాంశాలను ఆకర్షణీయ ంగా చెబుతున్నారు. కౌమార దశలో ఉన్న పిల్లల కు భాషా నైపుణ్యాలు, సంభాషణా సామర్థ్యం, సృజనశీలతను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తోలుబొమ్మల ప్రదర్శనల ద్వా రా లింగ సమానత్వం, సమాన అవకాశాల అవగా హనను సందేశాత్మకంగా బోధిస్తూ సమాజంలో వివక్షతను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. -
వైద్యుల నిరసన
నిర్మల్ఖిల్లా: ఇటీవల హైదరాబాద్లో పిల్లల డాక్టర్ అభిషేక్పై జరిగిన భౌతిక దాడి చేశారు. దీనిని నిరసిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు నిర్మల్ వైద్యులు శనివారం డాక్టర్ లేన్లో నిరసన కా ర్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండించారు. బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకో వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యవృత్తిపై ఉన్న గౌరవాన్ని కాపాడాలని, ఆస్పత్రుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని కో రారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్ట ర్ మురళీధర్, డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ రమేశ్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ పోలిశెట్టి సంతోష్, డాక్టర్ రమణగౌడ్, డాక్టర్ సుచిన్ పాల్గొన్నారు. -
శెనగ కొనుగోళ్లు ఎప్పుడో?
భైంసా: జిల్లాలో శెనగ పంట కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు నష్టపోయారు. గత వర్షాకాలంలో సోయా కోతల సమయంలో భారీ వర్షాలు పంటను నాశనం చేశాయి. ఆ సమయంలో పరిహారం రాలేదు. ప్రభుత్వం రంగు మారిన సోయాను కొనుగోలు చేస్తామని ప్రకటించినా, జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు జరగలేదు. గోదాముల నుంచి లారీలు త్వరగా తెప్పిస్తామని రైతులను మోసం చేశారు. 38 వేల ఎకరాల్లో సాగు.. సోయా నష్టాల నుంచి తేరుకుని యాసంగిలో జిల్లాలో 38 వేల ఎకరాల్లో శెనగ పంట సాగు చేశారు. కోతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసన అకాల వర్షాలకు చేతికి వచ్చిన శెనగలు తడిశాయి. దీంతో నాణ్యత దెబ్బతింటుందని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నా.. కొనుగోళ్లు లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకే.. వారం రోజులుగా భైంసా డివిజన్లో శెనగ కోతలు ఊపందుకున్నాయి. రైతులు భైంసా, ముధోల్, తా నూరు, కుభీర్ మార్కెట్లలో ప్రైవేటు వ్యాపారులకు పంట అమ్ముతున్నారు. క్వింటాలుకు రూ.4,800 నుంచి 5,300 వరకు ధర పలుకుతోంది. తేమ పేరి ట కోతలు, నగదు చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ కేంద్రాలు ఏర్పడితే ధరలు పెరిగే అవకాశం. కొనుగోళ్లు ప్రారంభించాలని ఎ మ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, బోస్లే నారాయణరావు పటేల్కు రైతులు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా స్పష్టత లేదు. పెరిగిన ఖర్చులు... అకాల వర్షాలతో శెనగ రైతులకు పంట ఖర్చులు పెరిగిపోయాయి. ఎకరం పంట కోతకు రూ.4 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇక పంట నూర్పిడి చేసేందుకు 50 కేజీల బస్తాకు రూ. 140 నుంచి రూ.160 వరకు చెల్లిస్తున్నారు. ట్రాక్టర్లో పంట పొలం నుంచి ఇంటికి సంచులు తెచ్చేందుకు ట్రిప్పుకు రూ.1000 చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన ఖర్చులతో చేతిలో చిల్లి గవ్వ లేని రైతులు చేసేదేమి లేక ఇంటికి చేరిన పంటను ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. -
వేతన వెతలు..
నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లు వేతనాలు రాక సతమతం అవుతున్నారు. అదనపు పనిభారం, చాలీచాలని వేతనం సకాలంలో అందక, ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. దశాబ్ద కాలంగా విధులు నిర్వర్తిస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు డీపీవో శ్రీనివాస్ను శనివారం కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 37 మంది ఆపరేటర్లు.. ఈ–సేవలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని గత ప్రభుత్వం గ్రామ పంచాయతీస్థాయిలో ఈ–పాలన విధానం కింద కంప్యూటీకరణను చేపట్టింది. ఇంటర్నెట్ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామ పంచాయతీ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే ఉద్దేశంతో ఈ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2014–15లో క్లస్టర్ వారీగా గ్రామ పంచాయతీ స్థాయిలో 37 ఆపరేటర్లను నియమించింది. కార్వీ సంస్థ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియమకాలు చేపట్టింది. సంస్థ కాలపరిమితి ఏడాది మాత్రమే ఉండడం, నియామకం గడువు ముగియడంతో 2016లో మళ్లీ విధుల్లోకి తీసుకుంది. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆన్లైన్ చేస్తున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి, వ్యాపార లైసెన్స్లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఎన్నికల పనులు, పంచాయతీల ఆదాయ, వ్యయాలతోపాటు ఇతరత్రా పనులు కంప్యూటీకరిస్తున్నారు. ఐదు నెలలుగా వేతనాల్లేవ్.. ఆపరేటర్లకు ఐదు నెలలుగా వేతనాలు రావడంలేదు. గతంలో 15వ ఆర్థిక సంఘం ద్వారా పరిపాలన వ్యయం నుంచి 10 శాతం నిధులతో వేతనం చెల్లించేవారు. ఒక్కో ఆపరేటర్ కు రూ.22,750 వేతనం వచ్చేది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కేంద్రం గ్రాంట్లు నిలిపివేసింది. ఐదు నెలల క్రితం వరకు మల్టీపర్పస్ వర్కర్లకు కేటాయించిన నిధుల్లోని మిగులు బడ్జెట్ నుంచి చెల్లించారు. ప్రస్తుతం ఐదు నెలలుగా ఇవ్వడమే లేదు. ఆపరేటర్ల డిమాండ్లివే.. ఉద్యోగ భద్రత కల్పించాలి. జానియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి. ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి. ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలి. వేతనాల కోసం ప్రత్యేక గ్రాంట్లు కేటాయించాలి. ఆర్థికంగా ఇబ్బందులు.. ప్రతి నెలా వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. గుర్తింపుతోపాటు భద్రత కరువైంది. వేతనాలు సక్రమంగా అందించాలి. పెండింగ్ వేతనాలు అందించకుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం. – సునీల్, ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. విధులతోపాటు ఆరోగ్యం ముఖ్యంనిర్మల్టౌన్: పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణ ఎంత ముఖ్యమో.. ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ జానకీషర్మిల అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వా ర్టర్స్లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ శనివారం నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్డ్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్తో సిబ్బందికి ఫిజి కల్ ఫిట్నెస్తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. స మయం దొరికినప్పుడు సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని సూ చించారు. ఫిట్నెస్ను నిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు క్రమశిక్షణతో డ్యూటీలు నిర్వర్తించాలని, జిల్లాకు తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ పరేడ్లో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, సీఐలు నైలు, కృష్ణ, సమ్మయ్య, రామ్ నిరంజన్, రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
30 నిమిషాల్లో ఎఫ్ఐఆర్
● బాధితుడి ఇంటికి వెళ్లిన పోలీసులు భైంసారూరల్: ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ప్రజలకు అతి సులభమైన మార్గంలో భరోసా కల్పిస్తూ, స్టేషన్కురాలేని బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా పోలీసులు ముందడుగు వేస్తున్నారు. 30 నిమిషాల్లోనే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రజల వద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు. భైంసారూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్జూర్ గ్రామానికి చెందిన కళ్యాణ్ బయ్యాజి(70) వృద్ధాప్యం కారణంగా స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై సుప్రియ తన సిబ్బందితో కలిసి బిజ్జూర్ గ్రామానికి చేరుకున్నారు. బాధితుడి ఇంటి వద్దనే ఫిర్యాదు స్వీకరించారు. శుక్రవారం రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో కట్టేసి ఉంచిన ఆవును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు కళ్యాణ్ బయ్యాజి తెలిపారు. శనివారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 30 నిమిషాల్లో ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్కు రాలేని బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు 30 నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని భరోసా కల్పించారు. -
గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలి
ఉట్నూర్రూరల్: ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని నిబంధనల పేరుతో అడ్డుకోకుండా మానవత దృక్పథంతో వ్యవహరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఆయన శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మట్, ఆదిలాబాద్ ఏఎస్పీ మౌనిక, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సమావేశంలో గిరిజనులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇండ్ల నిర్మాణాలతో పాటు ఇతర అభివృద్ధి పనులను కోర్ ఏరియా పేరిట అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. తాగునీరు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలతో పాటు పీఎం జన్మన్ ద్వారా గిరిజనులకు అందుతున్న లబ్ధి వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, అధికారులు, నాయకులు ఉన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే అభివృద్ధికి దూరం’ఇంద్రవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు పాల న సాగించిన బీఆర్ఎస్, ప్రస్తుతం పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గ్రామీణ ప్రాంత గ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. శుక్రవారం హర్కపూర్అంద్గూడ, మచ్చపూర్ గ్రామాల్లో పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మచ్చపూర్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు, దేవదాయ శాఖ అధికారులు శాలువాలతో ఆయనను సన్మానించి నాగోబా ప్రతి మ అందించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, డీటీడీఓ అంబాజీ, నిర్మల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితేష్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, సర్పంచ్లు మెస్రం తుకారం, రాథోడ్ రోహిదాస్, మార్కడ్ అనసూయ ఉన్నారు. -
ఆర్జీయూకేటీ సరికొత్త రికార్డు
బాసర: బాసర రాజీవ్గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం అంతర్జాతీయస్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న నైట్ స్టడీ అవర్స్ ప్రోగ్రాం ఏకంగా మూడు రికార్డు బుక్కుల్లో చోటు సంపాదించింది. పీయూసీ1, పీయూసీ2 తరగతులకు చెందిన 3,238 మంది విద్యార్థులు ఒకే సమయంలో క్రమశిక్షణతో స్టడీ అవర్స్లో పాల్గొనడం ఈ రికార్డుకు దారితీసింది. ఈ అద్భుతమైన ఫీట్ను గుర్తిస్తూ.. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు ధ్రువీకరణ పత్రాలు అందజేశాయి. కార్యక్రమం ఇలా.. ప్రతీరోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అకాడమిక్ బ్లాక్–1లోని 46 క్లాస్ రూమ్లలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చదువుకోవడంతోపాటు సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ సమయాన్ని కేటాయించారు. రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిరాటంకంగా, విజయవంతంగా కొనసాగుతోంది. అధికారుల హర్షం.. ఈ విజయానికి కృషి చేసిన స్టడీ అవర్స్ ఇన్చార్జి డాక్టర్ గుజ్జరి శంకర్ను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్ ప్రత్యేకంగా అభినందించారు. శంకర్ పర్యవేక్షణలో విద్యార్థులు తరగతులకు హాజరవుతూ, సందేహాలను నివృత్తి చేసుకుంటూ అకడమిక్ పరంగా రాణిస్తున్నారన్నారు. డాక్టర్ శంకర్ నాయకత్వంలో అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో ఈ రికార్డు సాధ్యమైందని వారు కొనియాడారు. కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన డీన్ అకాడమిక్స్ శీలం శేఖర్, డీన్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ డాక్టర్ విఠల్, డాక్టర్ జి.నాగరాజు వివిధ విభాగాల అధిపతులు, బోధన బోధనేతర సిబ్బందికి శంకర్ ధన్యవాదాలు తెలిపారు. -
ఫోన్ పోతే ఆందోళన వద్దు
నిర్మల్టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన చెందొద్దని, పోలీస్ స్టేషన్లో లేదా మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించా రు.https://www.ceir.gov.in/ వెబ్పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం సులభమన్నారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న రూ.9.44 లక్షల విలువైన 82 మొబైల్ ఫోన్లు సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కార్యాలయంలో వాటిని శుక్రవారం బాధితులకు అందజేశారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఐఎంఈ ఐ నంబర్ నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు పోయిన 2,006 ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయాలినేరస్తులకు శిక్ష పడేలా కేసుల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కలిసి డిస్ట్రిక్ ప్రాసిక్యూటర్ రివ్యూ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. గ్రేవ్ కేసుల్లో కోర్టులలో వచ్చిన తీర్పులపై సమీక్ష చేశారు. కేసులు విముక్తి కావడానికి కారణాలు, దర్యాప్తు లోపాలు సాక్ష్యాధారాల సమర్పణలో ఉన్న సమస్యలు, సాక్షుల హాజరు, ప్రాసిక్యూషన్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. సంబంధిత కేసుల్లో అప్పీల్కు వెళ్లే అవకాశాలపై న్యాయపరమైన అంశాలను పరి శీలించి, అవసరమైనచోట చర్యలు తీసుకోవాల ని నిర్ణయించారు. కోర్టు విచారణలో సాంకేతిక ఆధారాలు వినియోగించడంపై అధికారులు దృష్టిసరించాలని స్పష్టం చేశారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సత్కరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సుదర్శన్రెడ్డి, సతీశ్, అరుణ, దేవేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య పాల్గొన్నారు. -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
ఆదిలాబాద్రూరల్: మద్యం తాగొద్దని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విష్ణువర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన కొప్పులవార్ దేవనంద్ (24) ఈనెల 25న మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. ఈక్రమంలో మద్యం తాగొద్దని భార్య మందలించింది. దీంతో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి బాపురావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి రెబ్బెన: కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి శుక్రవారం మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం దుర్గాపూర్ గొండుగూడకు చెందిన మడావి అజయ్ (18) బెల్లంపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతుండగా స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో గత నెల 27వ తేదీన వైద్యం చేయించుకునేందుకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. గ్రామ శివారులో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రికి, మంచిర్యాలకు, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
బహ్రెయిన్లో పార్పెల్లి వాసి మృతి
లక్ష్మణచాంద: ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లిన పార్పెల్లి వాసి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన కందుకూరి చిన్న రాజేశ్వర్(54) గత మూడు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లాడు. శుక్రవారం ఎప్పటిలాగే కంపెనీలో పనిచేసే క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తనతో పాటు కుమారుడు రంజిత్ కూడా అక్కడే పని చేస్తుండటంతో ఆయన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కుటుంబ పెద్ద దేశం కాని దేశంలో ప్రాణాలు విడవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
గల్ఫ్ మృతుల కుటుంబాల దీనస్థితిపై అధ్యయనం
లక్ష్మణచాంద: గల్ఫ్ దేశాలలో ఉపాధి కోసం వెళ్లి ఆకస్మికంగా మరణిస్తున్న కార్మికుల కుటుంబాల పరిస్థితులను, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను జాతీయస్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ శుక్రవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో పర్యటించారు. గత ఐదు నెలల క్రితం దుబాయ్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన బీమా రమేశ్ కుటుంబాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రమేశ్ భార్య, తల్లిదండ్రులతో మాట్లాడారు. రమేశ్ మరణానికి గల కారణాలు, మృతదేహం స్వదేశానికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిందా.. వంటి వివరాలను ఆమె ఆరా తీశారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు మరణించినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను అధ్యయనం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో ఎన్నారై అడ్వైజర్ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, నిర్మల్ మార్కెట్ వైస్చైర్మన్ ఈటెల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఒస రాజేశ్వర్, జిల్లా కిసాన్సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్ల పోతారెడ్డి, బిక్నూర్ రాజు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: సెల్ఫోన్లు దోపిడీ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్, రిమ్స్లో ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 26న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు సగుడారపు కనిష్క్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈనెల 15న రైల్వే స్టేషన్లో పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డుపై నలుగురు వ్యక్తులు అడ్డగించి కనిష్క్ వద్ద డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించారని తెలిపారు. డబ్బులు లేకపోవడంతో మొబైల్ ఫోన్ లాక్కున్నారన్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నారని తెలిపారు. నిందితుల్లో పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన సయ్యద్ నవీద్, వడ్డెరకాలనీకి చెందిన మీర్జా ముషారప్ బేగ్, షేక్ బిలాల్, ఖానాపూర్కు చెందిన షేక్ అర్షద్, నెహ్రునగర్కు చెందిన బాన్సోడే కిషన్, భుక్తాపూర్కు చెందిన మైనర్ బాలుడు ఉన్నట్లుగా తెలిపారు. గతంలో వీరిపై పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా తెలిపారు. వీరు బస్టాండ్, రైల్వేస్టేషన్, రిమ్స్ పరిసర ప్రాంతాల్లో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. -
నివేదికపై నిరసన గళం..!
నిర్మల్ఆక్షేపణీయం...‘యంగ్ సైంటిస్ట్’లకు ఇస్రో ఆహ్వానం పాఠశాలల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వారిని భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఇస్రో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ నిర్మల్చైన్గేట్: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియమితులై న బి.వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. కరీంనగర్ డీఆర్వోగా విధులు నిర్వహించిన ఆయన నిర్మల్కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలెక్టర్ అభిలాష అభినవ్ను ఆమె ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. సమర్థవంతంగా సేవలు అందించాలి బ్యాంకర్లు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2025– 26 సంవత్సరపు త్రైమాసిక సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు అన్ని బ్యాంకుల ద్వారా రూ.8,409.62 కోట్ల రుణాలు మంజూ రు చేయగా 64.56 శాతం లక్ష్యాన్ని సాధించిన ట్లు తెలిపారు. బ్యాంకులు ప్రజల ఉన్నతికి మ రింత తోడ్పాటును అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాలు, సబ్సిడీ పథకాలు అర్హులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రామ్గోపాల్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, బ్యాంకర్లు పాల్గొన్నారు. నిర్మల్ఖిల్లా/నిర్మల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తన సిఫారసులతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అందించింది. ఆకునూరి మురళి చైర్మన్గా ఉన్న ఈ కమిషన్ నివేదికపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, సీపీఎస్ నాయకులు మండిపడ్డారు. ఉద్యోగులకు జీతభత్యాలు అధికంగా ఉన్నాయని పేర్కొనడం, ఉపాధ్యాయ శిక్షణ కోర్సు డీఎడ్ రద్దు చేయమని ప్రతిపాదించడం ఆక్షేపనీయమన్నారు. విద్యా ప్రమాణాలను మరింత పెంచే సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కమిషన్ సిఫారసులు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజి నీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల సీట్లు భర్తీ చేయాలని పేర్కొనడం, వేతనాలు అధికంగా ఉన్నాయని పే ర్కొనడం తదితర అంశాలను తీవ్రంగా ఖండించా రు. అసంబద్ధ సిఫారసులు చేసిందని, ప్రభుత్వ వి ద్యావ్యవస్థ నిర్వీర్యం చేసే కుట్రగా అభివర్ణించారు. వ్యతిరేకిస్తున్నాం...విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి రాష్ట్రంలోని ఉపాధ్యాయుల జీతభత్యాలపై చేసిన సిఫార్సులను తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యావ్యవస్థ బలోపేతానికి సూచనలు చేయాలని ఏర్పాటు చేసిన కమిషన్ ఉపాధ్యాయుల జీతభత్యాలపై వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయం. డీఎడ్ కోర్సు రద్దు చేయమనడం ఆయన అవగాహన లేమికి నిదర్శనం. కమిషన్ సిఫారసులలో 90% తప్పుగా ఉన్నాయి. పనితీరు పరంగా పదోన్నతులకు కొలమానం ఎలా నిర్ణయిస్తారు. – కృష్ణారావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడుపూర్వ పాఠశాల విద్యను ప్రాథమిక పాఠశాల విద్యతో కలపడం, బడ్జెట్లో కనీసం 18 శాతం విద్యకి కేటాయించడం లాంటి సానుకూల అంశాలు ఉన్నాయి. నర్సరీ నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధనపై సూచనలు చేయలేదు. ఉపాధ్యాయులకు సీనియార్టీ ప్రకారం పదోన్నతులు నిరాకరించడం సరికాదు. పోరాటాల ఫలితంగా రద్దయిన ప్రొబేషనరీ పీరియడ్ను మళ్లీ ప్రతిపాదించడం బాధాకరం. – దాసరి శంకర్, పెంట అశోక్, టీఎస్యూటీఎఫ్, నిర్మల్ -
పూర్వ ప్రాథమిక విద్యకు నిధులు
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు (ప్రీ కేజీ తరగతులు) ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో నిర్మల్ జిల్లాలో 10, ఆదిలాబాద్ జిల్లాలో 6, కుమురంభీం జిల్లాలో 13, మంచిర్యాల జిల్లాలో 26 ఉన్నాయి. వసతుల కల్పన..పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రతీ పాఠశాలకు ఒక ఆయాను నియమించారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద నడుస్తున్న వాటిలో నవంబర్ నుంచి ఇన్స్ట్రక్టర్, ఆయాలను తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.8000, ఆయాలకు నెలకు రూ.6000 వేతనం చెల్లించనున్నారు. వీరికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 6 నెలలకు వేతనాలు విడుదలైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఉమ్మడి జిల్లా సమాచారం..జిల్లా పూర్వ ప్రాథమిక కేటాయించిన పాఠశాలలు నిధులు నిర్మల్ 10 రూ.8.40 లక్షలు ఆదిలాబాద్ 6 రూ.5.88 లక్షలు కుమురంభీం 13 రూ.12.74 లక్షలు మంచిర్యాల 26 రూ. 25.48 లక్షలు మొత్తం 55 రూ.52.50 లక్షలు -
వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు మృతి
ఆదిలాబాద్టౌన్: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన శుక్రవారం ఆదిలాబాద్ ప ట్టణంలోని బస్టాండ్ ఎదుట గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వి వరాల ప్రకారం.. భోరజ్ మండలం పెండల్వాడకు చెందిన ఓ గర్భిణీ వారం క్రితం ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. కాగా ఈనెల 23న మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉ న్నట్లు వైద్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం శిశువు పాలు తాగకపోవడంతో వైద్యులకు విష యం తెలిపారు. మధ్యాహ్నం పిడియాట్రీక్ వైద్యు డు వైద్యం కోసం మరో ఆసుపత్రికి ఆటోలో తమకు తెలియకుండానే శిశువును తరలించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తాము కూడా వెంట వెళ్లగా కాసేపటికే బిడ్డ మృతి చెందినట్లు అక్కడి వైద్యుడు చెప్పాడన్నారు. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. -
చోరీ కేసు నిందితుల రిమాండ్
ఖానాపూర్: గత కొన్ని నెలలుగా ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలి పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా నిర్మల్ డివిజన్లోని ఖానా పూర్, లక్ష్మణ్చాంద, నిర్మల్ టౌన్, మామడ తదితర మండలాల్లోని ఆలయాలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ను పట్టుకున్నట్లు తెలిపారు. ఖానాపూర్ మండలం సేవ్యానాయక్ తండాలోని జగదాంబ ఆలయంలో దొంగతనానికి పాల్పడిన నలు గురు వ్యక్తులను శుక్రవారం సత్తనపెల్లి గ్రామశివారులో, గురువారం మరో ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల వ్యవధిలో పట్టుబడిన నిందితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడే వారన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడిన గాదె రమేశ్, దొసండ్ల శ్రీనివాస్, గురిజాల నడ్చి నర్సయ్య, బూట శంకర్, చీమల శ్రీకాంత్, బుర్క లక్ష్మణ్ అనే ఆరుగురు వ్యక్తులు కలిసి ఖానాపూర్ మండలంలోని తర్లపాద్ గ్రామంలో గల ఓంకారేశ్వర ఆలయం, అగ్గిమల్లన్న ఆలయం, మస్కాపూర్లోని శివాలయం, మధురనగర్లోని ఉగ్రనరసింహ స్వామి ఆలయం, ఖానాపూర్లోని సాయిబాబా ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో దేవునిపై ఉండే ఆభరణాలతో పాటు హుండీలో నగదును చోరీ చేశారన్నారు. ఖానాపూర్ సీఐ అజయ్, నిర్మల్ పట్టణ సీఐ నైలు, ఖానాపూర్ ఎస్సై రాహూల్ గైక్వాడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ఎన్ఎంఎంఎస్లో మెరిశారు
లక్ష్మణచాంద: ప్రతిభ ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చదువులో ఉముందున్న పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తప్పించేందుకు ఏటా జాతీయస్థాయిలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన 5 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి. జిల్లా నుంచి 70 మంది అర్హత.. గత నవంబర్లో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో 70 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు ప్రతీ సంవత్సరం రూ.12 వేల చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందనుంది. మస్కాపూర్ పాఠశాల నుంచి 30 మంది... ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధికంగా 30 విద్యార్థులు అర్హత సాధించారు. తర్వాత మామడ మండలం పొన్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 5 మంది అర్హత సాధించి రెండోస్థానంలో నిలిచారు. కొరిటికల్ ప్రభుత్వ పాఠశాల నుంచి 4 విద్యార్థులు, నర్సాపూర్(జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి 4 విద్యార్థులు ఎంపికయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతం కన్నా పెరిగిన సంఖ్య.... ఎన్ఎంఎంఎస్ పరీక్షలో గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గతేడాది 68 మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఈసారి 70 మంది ఎంపికయ్యారని అధికారులు తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సమాచారం... ఉన్నత పాఠశాల అర్హతసాధించిన విద్యార్థులు మస్కాపూర్ 30 పొన్కల్(మామడ) 05 కొరిటికల్(మామడ) 04 నర్సాపూర్(జి) 04 మామడ 03 కడెం 03 బీరవెల్లి(సారంగాపూర్) 03 రాజూరా(ఖానాపూర్) 02 లక్ష్మణచాంద 02 మంజులాపూర్(నిర్మల్ అర్బన్) 02 సోమవార్పేట్(నిర్మల్ అర్బన్) 02 న్యూరేవోజిపేట్ ఎంపీయూపీఎస్(దస్తురాబాద్) 01 మున్యాల్(దస్తూరాబాద్) 01 లింగాపూర్(ఖానాపూర్) 01 కుభీర్ 01 టీఎస్ఎంఎస్ కుంటాల 01 వడ్యాల్ 01 ఎడ్బిడ్(ముధోల్) 01 పెంబి ఉన్నత పాఠశాల 01 జాఫ్రాపూర్(సోన్) 01 తానూర్(బోసి) 01 -
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యవంతమైన సమాజం
నిర్మల్చైన్గేట్: ప్రకతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ రైతువేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద ఎంపిక చేసిన ఐకేపీ మహిళలకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయనాలతో కూడిన సాగు కంటే, శాశ్వత ప్రాతిపదికన సేంద్రియ పద్ధతులు పాటించడం ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు. ఆర్గానిక్ పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయని తెలపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని వస్తృతం చేసేందుకు 15 క్లస్టర్లను ఎంపిక చేశామని, ప్రతీ క్లస్టర్ నుంచి ఇద్దరు ఐకేపీ మహిళలను ‘కృషి సఖి’లుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు గ్రామాల్లోని రైతులకు సేంద్రియ సాగు విధానాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రైతులు ప్రకతి వ్యవసాయం వైపు మళ్లేలా వారిని ప్రోత్సహించాలని జిల్లా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక షాపును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శిక్షణను పూర్తి చేసుకున్న ‘కృషి సఖి’ మహిళలకు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చై ర్మన్ సోమ భీమ్రెడ్డి, అరణ్య సంస్థ ప్రతినిధులు ప ద్మ, నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, అధికారులు, సిబ్బంది, ఐకేపీ మహిళలు పాల్గొన్నారు. పంటనష్టం నివేదిక రూపొందించాలినిర్మల్చైన్గేట్: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని శాసీ్త్రయంగా అంచనా వేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరిగిన ప్రాథమిక అంచనాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారని తెలిపారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో, ప్రతీ పంట పొలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. -
నాణ్యమైన భోజనం పెట్టాలి
కడెం: గిరిజన ఆశ్రమ విద్యార్థులకు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. వంట గది, సరుకుల కు పరిశీలించారు. వసతిగృహం ఆవరణలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ను కూల్చివేయాలని, డార్మెటరీ రూమ్స్లో టైల్స్, కిటికీలకు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలన్నారు. అనంతరం మండలంలోని పాండ్వపూర్ సర్పంచ్ ఆడ విజయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసి తండా, గూడేల్లో సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఇందులో డీడీ అంబాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్, మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్యాదవ్, వార్డెన్ రాంజీ, హెచ్ఎం వసంతరావు, ఎస్సై సాయికిరణ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, బంజార సంఘ నాయకులు మోహన్నాయక్, వేణుగోపాల్ పాల్గొన్నారు. -
పరీక్షల సీజన్.. నేత్రాలు పదిలం!
నిర్మల్ఖిల్లా: ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతుండగా, మరో రెండు వారాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు రోజంతా పుస్తకాలు చదవడం, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం, రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండడంవల్ల నయనాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల సమయంలో కంటి సంరక్షణను విస్మరించకూడదని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కంటి నొప్పి, డ్రైనెస్ భావన, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్యనిపుణులు డాక్టర్ యు.కృష్ణంరాజు విద్యార్థులకు పలు కీలక సలహాలు ఇచ్చారు. పాటించాల్సిన జాగ్రత్తలు.. -
హామీల అమలుకే తొలి ప్రాధాన్యం
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అజెండగా ముందుకు వెళ్తామని నిర్మల్ మున్సిపల్ చైర్ర్సన్ అప్పాల కావ్య , వైస్ చైర్మన్ గణేశ్చక్రవర్తి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎన్నికై న కౌన్సిలర్లతో సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రతీ వార్డులో ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రారంభిస్తామన్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తామని తెలిపారు. నిర్మల్ పట్టణ వాసులు ఎదుర్కొంటున్న కోతులు, కుక్కల సమస్యను వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. రంజాన్ పండుగ దృష్ట్యా ప్రార్థనామందిరాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే పేద వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని తై బజార్ వసూలును రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలందరికీ శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లీకేజీలు అరికట్టేలా శాశ్వత మరమ్మతులు చేయిస్తామన్నారు. గతంలో పట్టణ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి మంజూరు చేసిన రూ.15 కోట్ల నిధులతో గుర్తించిన పనులు కౌన్సిల్ సభ్యుల తీర్మానంతో రద్దు చేసి, వాటి స్థానంలో స్థానిక వార్డు సభ్యులు గుర్తించిన అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. డీఈ హరిభువన్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొనారు. ఇంటర్ పరీక్షకు 244 మంది గైర్హాజరు నిర్మల్ రూరల్: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 6,876 మంది విద్యార్థులకు, 6,627 మంది (96.37%) హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల, ఖానాపూర్ జూనియర్ కళాశాల, ఖానాపూర్ ఆశ్రమ కళాశాల పరీక్ష కేంద్రాలను డీఐఈవో జాదవ్ పరుశురాం తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.సమావేశానికి హాజరైన సభ్యులు -
ప్రభుత్వాస్పత్రిలో వసతులు బాగున్నాయా?
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రిలో మౌలిక వసతులపై అడ్మినిస్ట్రేటివ్ డీఎంఈ శివరామ ప్రసాద్ ఆరా తీశారు. శుక్రవారం రెండు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఏయే సదుపాయాలు ఉన్నాయి, ప్రతీరోజు ఎన్ని ఓపీలు నిర్వహిస్తున్నారు, మెరుగైన వసతులు ఉన్నాయా, డయాలసిస్, ఐసీయూలో విధులు ఎలా ఉన్నాయి, రోగులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రసూతి ఆస్పత్రిలో మెరుగైన ఓపీ సేవలు, రేడియాలజీ సేవలతోపాటు చిన్నారుల కోసం ఎస్ఎన్సీయూ సేవలు బాగున్నాయన్నారు. నీటి సమస్య తీర్చేందుకు సంపు ఏర్పాటు చేస్తామన్నారు. జీజీహెచ్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తామని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మందుల కొరత లేకుండా చూస్తామన్నారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. ఆయన వెంట డాక్టర్ సాయినాథ్రెడ్డి, డాక్టర్ సింధు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సీవీ.శారద, జీజీహెచ్ సూపరింటెండెంట్ గోపాల్సింగ్, ప్రసూతి ఆస్పత్రి హెచ్వోడీ డాక్టర్ సరోజ, ఆర్ఎంవో సమత, ఆఫీస్ సూపరింటెండెంట్ నవీన్కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేట్–2 విజయలక్ష్మి, వివిధ విభాగాల హెచ్వోడీలు ఉన్నారు. -
యంగ్ సైంటిస్ట్లకు ఇస్రో ఆహ్వానం
లక్ష్మణచాంద: పాఠశాలల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వారిని భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఇస్రో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడ మే లక్ష్యంగా యంగ్ సైంటిస్ట్ పేరుతో యువ విజ్ఞా న్ కార్యక్రమాన్ని (యువికా) భారత అంతరిక్ష పరి శోధనా సంస్థ నిర్వహిస్తోంది. 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 9వ తరగతి అభ్యసిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నిర్మల్ జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఎంపిక ఇలా...నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 10,556 మంది విద్యార్థులు 9వ తరగతి అభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులందరు తమ తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎంపికై న విద్యార్థులకు...ఇందులో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు ఎప్పటికై నా అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం వంటి కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎంపికై న విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చా వేదికలు, ప్రయోగశాల సందర్శన, అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించనున్నారు.సమాచారం..దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 27 చివరి తేదీ: మార్చి 31 అర్హులు: 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వెబ్సైట్: www.isro.gov.in ఇస్రో వద్ద రిపోర్టు చేయవలసిన చివరితేదీ: మే 10 యువికా కార్యక్రమం: మే 11 నుంచి 22 మధ్య -
ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బదిలీ
కై లాస్నగర్: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజె క్ట్ అధికారి ఖుష్బూ గుప్తా బదిలీ అ య్యారు. ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్న ఆమెను మహబూబ్నగర్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె తొలుత ఆదిలాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2024 ఫిబ్రవరిలో ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా బదిలీ అ యిన ఆమె అదే ఏడాది నవంబర్ 4 నుంచి ప్రసూతి సెలవుపై వెళ్లారు. ఈ ఏడాది మే 3వరకు ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసినా తా జాగా జిల్లా నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో పీవోగా కొత్త అధికారులెవరిని ఇంకా నియమించలేదు. ప్రస్తుతం ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఇన్చార్జి పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఖుష్బూగుప్తా


