breaking news
Nirmal District Latest News
-
కాంగ్రెస్తోనే బీజేపీకి పోటీ
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే బీజేపీకి పోటీ ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టణాలతోపాటు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలతోపాటు పట్టణాలకు నిధుల కేటాయింపు శూన్యమన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాటీల్లో బీజేపీ కై వసం చేసుకుంటుందన్నారు. ఈ సందర్భం బీఆర్ఎస్ పార్టీ 12వ వార్డు ఇన్చార్జి బండిపెల్లి ప్రకాశ్గౌడ్ సుమారు 50 మంది కార్యకర్తలతో బీజేపీలో చేరారు. రితీశ్ రాథోడ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, మంత్రరాజం సురేశ్, నల్ల రవీందర్రెడ్డి, కీర్తి మనోజ్, ఎనగందుల నారాయణ, పుప్పాల ఉపేందర్, మట్టెరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
భైంసా.. మినీ భారత్..!
భైంసాటౌన్: మున్సిపల్తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న భైంసా పట్టణం భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, భాషలకు నిలయం. వివిధ మతాలు, సంస్కృతులు, భాషలు మాట్లాడే ప్రజలు కలిసి నివసించే వైవిధ్యమైన, చారిత్రక ప్రాధాన్యత ఉన్న పట్టణం. అందుకే మినీ భారత్గా పేర్కొంటారు. ఇక్కడ ఎక్కువగా తెలుగు, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. పత్తి పరిశ్రమలకు పెట్టింది పేరు కాగా, నియోజకవర్గానికి వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. గతంలో నగర పంచాయతీగా ఉన్న భైంసా పట్టణం తొలుత నిజాం రాజ్యంలో కొనసాగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో భాగంగా ఉండేది. 1953లో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనతో భైంసా పట్టణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసింది. ఆపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. 1956లోనే తొలుత నాలుగు రెవెన్యూ వార్డులతో గ్రేడ్–3 మున్సిపల్గా ఏర్పడగా, 1995లో 17, 2005లో 20, 2014లో 23 వార్డులకు పెరగగా, 2019లో 26 వార్డులకు చేరింది. ప్రస్తుతం పట్టణంలో 51,118 మంది ఓటర్లు ఉన్నారు. త్రిభాషా సంగమం...భైంసా పట్టణంలో ప్రధానంగా హిందూ సామాజికవర్గంతోపాటు ముస్లింలు అధిక సంఖ్యలో ఉంటారు. మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో ఇక్కడ మరాఠీ భాష మాట్లాడేవారు కూడా అధికంగానే ఉంటారు. తెలుగు, మరాఠీ, ఉర్దూ భాషల సంగమం ఇక్కడ కనిపిస్తుంది. కర్ణాటకకు చెందిన బసవేశ్వర ఆరాధకులు సైతం ఇక్కడ కనిపిస్తారు. ఇక, వ్యాపారాల నిమిత్తం గుజరాత్, రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడినవారూ ఉన్నారు. భైంసా పట్టణం పత్తి పరిశ్రమల కేంద్రంగా ఉండగా, క్రమేణా పత్తి ఫ్యాక్టరీలు మూతపడి ప్రస్తుతం పదుల సంఖ్యకు పరిమితమయ్యాయి. ఇక్కడి ప్రజలు అధికసంఖ్యలో వ్యవసాయంపై ఆధారపడినవారున్నారు. సున్నిత ప్రాంతంగా..గతంలో జరిగిన మతపరమైన అల్లర్లతో భైంసా ప ట్టణం రాష్ట్రంలోనే సున్నితప్రాంతంగా అపఖ్యాతిని పొందింది. 1984 నుంచి పలుమార్లు అల్లర్ల ఘటనలు చోట చేసుకోగా, అప్పటి నుంచి అత్యంత సున్ని తప్రాంతంగా మారింది. 2008, 2020, 2021లో నూ ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో అభివృద్ధిపరంగా కాస్త వెనుకబడిన ప్రాంతంగా మారింది. భైంసా పట్టణం మున్సిపల్ కేంద్రంగా ఉండడంతోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. ఇక్కడ సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి, ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి అందుబాటులో ఉన్నారు. మహిష నుంచి భైంసాగా...దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడంతో మహిషాగా పిలవబడిందని చరిత్ర చెబు తోంది. దీనికి నిదర్శనంగా గట్టు మైసమ్మ ఆ లయం సమీపంలో ఫిల్టర్బెడ్ ప్రాంతంలో మహిషాసుర రాతి పాదాలు కనిపిస్తాయి. కా లక్రమంలో మహిష మైసగా, ప్రస్తుతం భైంసాగా మారింది. ఈ పట్టణంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి గోపాలకృష్ణ మందిర్ వంటి పురాతన నిర్మాణాలు ఉన్నాయని చరిత్ర. -
నామినేషన్లకు నేడే ఆఖరు..
నిర్మల్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. తొలిరోజు నిర్మల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండోరోజు గురువారం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 128 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం చాలామందికి కలిసి వస్తుండటంతో మూడు మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే నామినేషన్ల జాతర ఉండనుంది. రెండురోజులుగా మున్సిపల్ ఖజానాకూ పన్నుల రూపంలో రాబడి పెరుగుతోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు వారిని బలపరుస్తున్నవారూ మున్సిపల్ పన్నులను చెల్లించాలనే నిబంధన ఉండటమే ఇందుకు కారణం. భైంసాలో 68 నామినేషన్లు..భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భైంసాలో రెండోరోజు నామినేషన్ల జోరు కనిపించింది. తొలిరోజు కేవలం రెండు నామినేషన్లు దాఖలు కాగా, గురువారం ఒక్కరోజే 68 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం పార్టీ నుంచి 18 మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ ఎండీ.జాబీర్అహ్మద్ కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 70 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అజ్మీర సంకేత్కుమార్ తెలిపారు. ఖానాపూర్లో 23..ఖానాపూర్: ఖానాపూర్లో గురువారం 23 నామినేషన్లు దాఖాలయ్యాయని కమిషనర్ సుందర్సింగ్ తెలిపారు. బుధవారం 3 నామినేషన్లు రాగ, రెండు రోజుల్లో 26 నామినేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. -
గద్దెకు చేరిన సమ్మక్క
7 సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజలు నిర్వహిస్తున్న భక్తులు ముధోల్: ముధోల్ మండలం ఎడ్బిడ్ తండాలో సమ్మక్క– సారలమ్మల జాతర గురువారం రెండో రోజు కొనసాగింది. సమ్మక్కను గిరిజన పూజారులు గద్దైపెకి తీసుకువచ్చారు. అమ్మవారు వనం నుంచి గద్దైపెకి చేరుకోవడంతో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. పూజలు చేశారు. సమ్మక్క – సారలమ్మ మొక్కులు తీర్చుకుని నిలువెత్తు బంగారం(బెల్లం) ఒడి బియ్యం సమర్పించారు. మేకలు, కోళ్లతో మొక్కులను తీర్చుకున్నారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త జాదవ్ సతీశ్కుమార్ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. -
‘మధ్యాహ్నం’ మెరుగుపడాలి
లక్ష్మణచాంద: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. మౌలిక వసతులు, ప్రయోగశాల పరికరాలకు నిధులు కేటాయించారు. వంటగదుల నిర్మాణానికి కలెక్టర్లు ఇటీవల నిధులు మంజూరు చేయించారు. ఇది పాఠశాల వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. మధ్యాహ్న భోజనం పారదర్శకతకు..మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకతను మరింత పెంచేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు తీరుపై సర్వే చేపట్టింది. ఇందులో జిల్లా 16వ స్థానం సాధించింది. జిల్లాలో 74.6% విద్యార్థులు రోజూ భోజనం చేస్తున్నట్లు తేలింది. నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించి ర్యాంక్ మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. క్షేత్ర స్థాయి సవాళ్లు..సర్వేలో 12 అంశాలపై పరిశీలన జరిగింది. ఆహార కమిటీలు నాణ్యత తనిఖీ చేయకపోవడం, స్టీరింగ్ కమిటీల పరిశీలన లోపాలు, కట్టెల పొయ్యిపై వంటలు చేయడం వంటి సమస్యలు బయటపడ్డాయి. ఇవి అమలులో లోపాలను సూచిస్తున్నాయి. మధ్యాహ్న భోజనం నిత్యం ముందుగా ఆహార కమిటీ భోజన నాణ్యతను పరిశీలించిన తర్వాతనే విద్యార్థులకు అందించాలి. కానీ ఇది క్షేత్రస్థాయిలో చాలా చోట్ల ఆచరణలో లేదన్నట్టుగా తెలుస్తుంది. ప్రతీ మండలంలో స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఉన్నా పరిశీలన సరిగా చేయడం లేదని సమాచారం. జిల్లాలోని పలు పాఠశాలల్లో ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదనే మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. తనిఖీలు, మానిటరింగ్..ఎంఈవోలు ప్రతిరోజూ పాఠశాలలు సందర్శించి భోజన నాణ్యతను పరిశీలిస్తున్నారు. పరిశీలనలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇది పథకం సమర్థతను పెంచుతుంది. మెరుగైన అమలుతో విద్యార్థుల హాజరు, పోషకాహారం మెరుగుపడతాయి. నాణ్యత పెంచాలి.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలి. ప్రతీ పాఠశాలలో తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని విధిగా ఆహార కమిటీ వారు రుచిచూసిన తర్వాతనే విద్యార్థులకు అందించాలి. ప్రతీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీనిని బాధ్యతగా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం సరిగా అమలు అయ్యేలాగా చూడాలి. – భోజన్న, డీఈవో -
అమ్మవారిని దర్శించుకున్న అబ్జర్వర్
బాసర: మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్గా నియమితులైన వీరారెడ్డి గురువారం బాస ర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. నామినేషన్ కేంద్రం పరిశీలనఖానాపూర్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు వీరారెడ్డి గురువా రం సందర్శించారు. కేంద్రంలో ఏర్పాట్లు, సిబ్బంది విధులు తెలుసుకున్నారు. -
పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు
నిర్మల్: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సమీకృత కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పూర్తి చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని, హెల్ప్డెస్క్లనూ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. కంట్రోల్రూమ్లో అప్రమత్తంగా ఉండాలిమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పా టు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాషఅభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కంట్రోల్రూమ్ను తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. హెల్ప్లైన్..9100577132ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలి పారు. ఎవరైనా 9100577132 నంబర్కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ప్రతి ఫోన్కాల్ను సిబ్బంది స్వీకరించాలని, ఫిర్యాదుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా సెంటర్ ప్రారంభం..ఎన్నికలకు సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో వచ్చే రాజకీయ వార్తలపై నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని పౌరసంబంధాలశాఖ కార్యాలయంలో మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ (మీడియా సెంటర్)ని ప్రారంభించారు. రోజువారీగా వార్తపత్రికలు, చానళ్లలో వచ్చే వార్తలను నిశితంగా గమనించాలన్నారు. పెయిడ్న్యూస్ వివరాలు నమోదు చేయాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై నిఘా ఉంచాలని తెలిపారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఈడీఎం నదీమ్ పాల్గొన్నారు. -
సీట్ల కోసం సిగపట్లు
నిర్మల్అరైవ్–అలైవ్.. ప్రమాదాలకు చెక్! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు చెక్పెట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది.5న ‘చలో పార్లమెంట్’ భైంసాటౌన్: సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలన్న డిమాండ్తో ఫిబ్రవరి 5న తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్ డిమాండ్ చేశా రు. ఈ మేరకు పట్టణంలోని సంఘ కార్యాలయంలో గురువారం మాట్లాడారు. సీపీఎస్ రద్దు, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు, నూతన విద్యావిధానంపై తక్షణ సమీక్ష డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహాధర్నా చేయనున్న ట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణ్, కార్యదర్శి బాజారెడ్డి, ఆర్థిక కమిటీ సభ్యులు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్, భైంసా, కుభీర్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. నిర్మల్: మున్సిపల్ ఎన్నికలు పార్టీల్లో నేతల మధ్య పంచాయితీ పెడుతున్నాయి. ఇప్పటికే వర్గాలుగా ఉన్న నాయకులు వార్డుల్లో తమవాళ్లకు టికెట్లు ఇ ప్పించుకునే విషయంలో నువ్వెంత.. అంటే నువ్వెంత అనుకునేదాకా చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారం సాయంత్రం ముగియనుంది. అయినా.. గురువారం సాయంత్రం వరకూ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్లో మాత్రం కొంతమందికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి, నామినేషన్లను వేసుకోమని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అలా గ్రీన్సిగ్నల్ అందినవాళ్లు ఆగమేఘాల మీద మొదటిసెట్ నామినేషన్లు గురువారం వేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రెండోరోజు 123నామినేషన్లు దాఖలయ్యాయి. బీఫామ్ ఇచ్చేదాకా డౌటే...‘తమ్ముడూ.. కంగ్రాట్స్. ఇంకేం నీకే ఇచ్చిండ్రట పార్టీ టికెట్. సార్ కూడా నామినేషన్ వేసుకోమని చెప్పిండట కదా..’ అని చెబితే.. ‘అన్నా.. ఇక్కడ పరిస్థితి వేరే ఉందన్న. ఎవరికి టికెట్ ఇస్తరో, ఎవరి ని దూరం పెడతరో తెలుస్తలేదు. నామినేషన్ నాకే కాదు, మావార్డులో మరొకరికీ వేసుకోమని చెప్పా రు. చివరకు ఎవరికి బీఫామ్ ఇస్తరో తెలియదన్న..’ అని సదరు పార్టీ ఆశావహుడు వాపోయాడు. నిర్మల్ మున్సిపాలిటీలో ఓ ప్రధాన పార్టీలో ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నామినేషన్లకు ఈ ఒక్కరోజే గడువున్నా.. తమ అభ్యర్థుల పేర్లను, బీఫామ్ ఎవరికి ఇవ్వనున్నామనే విషయాలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు వెల్లడించకపోవడం గమనార్హం. జిల్లా అధ్యక్షులూ.. ఎక్కడ..!?మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నుంచి ఎవరు పోటీచేయాలనేది పీసీసీ అధ్యక్షుడు ప్రకటిస్తారని సీఎం పేర్కొన్నారు. తమ పార్టీ అధ్యక్షుడే ఎ వరెవరు పోటీలో ఉంటారనేది ఫైనల్ చేస్తారని బీజేపీ సీనియర్లు చెప్పారు. కానీ.. జిల్లాకు వచ్చేసరి కి పరిస్థితి ఉల్టా ఉంది. మున్సిపల్ ఎన్నికల లొల్లి ప్రారంభమై మూడోరోజుకు చేరుకున్నా.. రెండు ప్ర ధాన పార్టీల జిల్లా అధ్యక్షులు అభ్యర్థిత్వా ల ఖరారు ప్రక్రియలో కనిపించడం లేదు. బీజేపీలో నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు చెప్పిన జాబితానే ఫైన ల్ అన్నట్లు నడుస్తోంది. కాంగ్రెస్లో స్థానిక సీనియర్ నేతలు చెప్పిన పేర్లే దాదాపు ఖరారు అని చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ ఇద్దరూ దాదాపు ఖానాపూర్ మున్సిపల్ వరకే పరిమితమైనట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ వేసేందుకు వస్తున్న బీఆర్ఎస్ నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి యోగిత పార్టీల్లో ఫైట్..‘ఇన్నేళ్లు పార్టీకోసం పనిచేసిన నా మనిషికి టికెట్ ఇవ్వరా.. ఏమనుకుంటున్నరు..’అని ఒక సీనియర్ నేత అంటే.. ‘నా వార్డులో నీ మనిషికి టికెట్ ఎట్ల ఇస్తరో చూస్త..’అని మరో సీనియర్ నేత వాగ్వాదానికి దిగారు. మరోచోట.. ‘మేం చెప్పినవాళ్లకు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినవారికి టికెట్ ఇస్తామంటే కుదరదు..’ అంటూ యువరక్తం గల్లాలు పట్టి అడిగేదాకా పరిస్థితి చేరింది. ఇంకోపార్టీలో ‘ఇంత సీనియారిటీ ఉన్నా.. కనీసం మా పేర్లు కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంటే ఇన్నేళ్లు పార్టీకి మేం చేసిన సేవలు కనిపించడం లేదా..! మీ ఎన్నికలప్పుడే మేం కనిపిస్తామా..! దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న మమ్మల్ని కాదని, నిన్నమొన్న వచ్చినోళ్లకు టికెట్లు ఇస్తరా..!?’ అంటూ ఓ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. జిల్లాకేంద్రంలో ఓ పార్టీకి చెందిన నాయకులు, క్యాడర్ వర్గాలుగా విడిపోయి, వార్డుల్లో పోటీపడుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు.. ఇప్పుడు జిల్లాలో ప్రధాన పార్టీల్లో ఇదే పరిస్థితి. ఓ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు తమను నమ్ముకున్నవాళ్లకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ముఖం చాటేస్తున్నారు. -
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత
నిర్మల్: బీజేపీ సీనియర్నేత, హ్యాట్రిక్ కౌన్సిలర్గా గుర్తింపు పొందిన అయ్యన్నగారి రాజేందర్ బీఆర్ఎస్లో చేరారు. ఈమేరకు ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా వేసుకున్నారు. కొంతకాలంగా బీజేపీ నుంచి రాజేందర్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించారు. సొంత పార్టీలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఆయన బీఆర్ఎస్లో చేరినట్లు తెలుస్తోంది. బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ సమక్షంలో అయ్యన్నగారి రాజేందర్ బీఆర్ఎస్లో చేరారు. -
‘హక్కులను హరిస్తున్న కేంద్రం’
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మికులకు హక్కులు, రక్షణ లేకుండా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా, వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూనే దేశవ్యాప్తంగా రైతాంగంపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వీబీజీ రామ్జీ చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసం పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు. జల్–జంగల్–జమీన్ విధానాన్ని అనుసరించకపోవడంతో పాటు మతపరమైన దాడులను కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్లో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాయకులు రాజన్న, శంకర్, మోహన్, లక్ష్మణ్, జైతు తదితరులున్నారు. -
మూడు బల్దియాల్లో ఐదు నామినేషన్లు
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభమైంది. పట్టణంలోని 12వార్డులకు గాను ఆరు కౌంటర్ల ద్వారా కమిషనర్ సుందర్సింగ్, తహసీల్దార్ సుజాత పర్యవేక్షణలో నామినేషన్లు స్వీకరించారు. తొలిరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్కు చెందిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్య, బీజేపీ నాయకురాలు అంకం మౌనిక మహేందర్, బీఆర్ఎస్కు చెందిన మాజీ కో ఆప్షన్ సభ్యుడు బండారి కిశోర్ నామినేషన్ వేసినవారిలో ఉన్నారు. మరో 50 మంది అభ్యర్థులు హెల్ప్ డెస్క్ నుంచి నామినేషన్ పత్రాలు తీసుకువెళ్లారు. భైంసాలో రెండు.. భైంసాటౌన్: భైంసా మున్సిపాలిటీలో 26వార్డులుండగా, నామినేషన్ల స్వీకరణకు వార్డులవారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటిరోజు రెండు నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అజ్మీరా సంకేత్కుమార్ తెలిపారు. ఏఎస్పీ రాజేశ్మీనా నేతృత్వంలో పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బల్దియాకు పన్నుల రూపంలో రూ.7.40 లక్షల ఆదాయం సమకూరింది. -
ఎన్నికలు సజావుగా నిర్వహిస్తాం
భైంసాటౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కౌంటర్లు పరిశీలించారు. ఎన్నికల నియమావళి పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎస్పీ జానకీ షర్మి ల మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంతోపాటు పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ నామినేషన్ కేంద్రం వద్ద 24 గంటలు గార్డులు విధుల్లో ఉంటారని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ఏఎస్పీ రాజేశ్మీనా, మున్సిపల్ అధికారులున్నారు. ప్రక్రియ సజావుగా నిర్వహించాలి నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని హెల్ప్డెస్క్ సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. సమస్యలుంటే తెలుపాలి ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలున్నా హెల్ప్లైన్కు లేదా తమ దృష్టికి తేవాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. అభ్యర్థులు, ఓటర్లకు ఇబ్బందుల్లేకుండా అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
నిర్మల్
జాతరెళ్తున్నారా.. జాగ్రత్తా.. సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఎఫ్ఎల్ఎస్ పరీక్షకు సన్నద్ధం చేయాలి నిర్మల్ రూరల్: ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎస్ పరీక్షకు మూడో తరగతి విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈవో భోజన్న సూ చించారు. బుధవారం మండలంలోని రత్నాపూర్ కాండ్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్జీటీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులకు తొలిమెట్టు అత్యంత కీలకమని, వారిని సంసిద్ధులను చేయాలని సూచించారు. అంతకుముందు ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదోతరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గురించి ఆరా తీశారు. ఎస్వో నర్సయ్య, ఎంఈవో వెంకటేశ్వర్లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు విజయస్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్: ‘అరె.. ఏమన్నా ఇదేం టెన్షనే..!? నామినేషన్లకు ఒకరోజు గడిచిపోయే. మన పేర్లు ఇంకెప్పుడు ఫైనల్ చేస్తరు..!? మనకు ఏదో ఒకటి చెబితే.. మనం ఈడ ఉండుడా లేక వేరే పార్టీలకు పోవుడా తెలుస్తది కదా..!?’ ఇది నిర్మల్ మున్సిపల్లో ప్రధాన పార్టీ నుంచి బీఫామ్ కోసం పోటీపడుతున్న ఓ ఆశావహుడి ఆందోళన. ఈ ఒక్క నాయకుడిదే కాదు.. జిల్లాలోని మూ డు మున్సిపాలిటీల్లో ఇదే కథ. మూడు ప్ర ధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అలాగే ఎంఐఎం బుధవారం రాత్రి వరకూ తమ అభ్యర్థులెవరో ప్రకటించలేదు. నామి నేషన్ల పర్వం ప్రారంభమై ఒకరోజు గడిచిపోయి, మరో రెండురోజులే గడువున్నా.. ఇలా వివిధ రాజ కీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అటు ఆశావహులు, ఇటు గల్లీల్లో క్యాడర్ అ యోమయంలో ఉన్నారు. ఒక్కోవార్డులో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ టికెట్ల కోసం ముగ్గురు, నలు గురు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరు గెలుపుగుర్రాలనేది ఆరా తీసి బుధవారం వరకు పార్టీలు ఇద్దరు చొప్పున పేర్లు తీసుకున్నాయి. ఇక అందులో బరిలో ఎవరు నిలుస్తారు, బీఫామ్ ఎవరికిస్తామనేది గురువారం తేలుస్తామని చెబుతున్నాయి. అన్ని పార్టీలూ అంతే.. జిల్లాలో ఈసారి మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో నిర్మల్, ఖానా పూర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, భైంసాలో ఎంఐఎం, బీజేపీ మధ్య పోటాపోటీ నడిచింది. ఈసారి ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పరిస్థితి ఉంది. బీజేపీ బా గా పుంజుకోవడం, బీఆర్ఎస్ కాస్త వెనుకంజలో ఉండటం, కాంగ్రెస్ అధికార పార్టీగా మారడం, ఎంఐఎం తన ఓటుబ్యాంక్ పదిలం చేసుకోవడంతో పు రపోరు ఎలా ఉండబోతోందనే విషయాన్ని పక్కాగా తేల్చలేకపోతున్నారు. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీల సీట్ల కోసం పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇక పార్టీలు ఎదుటివాళ్లు టికెట్లు ఇచ్చిన తర్వాత పరిస్థితిని, అభ్యర్థులను బట్టి తమ జాబితాను ప్రకటిద్దామనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. నామినేషన్ల గడువులో ఒకరోజు గడిచినా.. జాబితా ప్రకటించలేదని చెబుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ దాదాపు గురువారం మధ్యాహ్నంలోపు తమ అభ్యర్థుల ఫైనల్ జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆశావహుల్లో ఆందోళన దాదాపు రెండునెలలుగా గల్లీలో పనులు చేస్తూ, ప్ర జలతో మమేకమవుతూ వస్తున్న లీడర్లంతా ఇప్పు డు పార్టీ టికెట్ కోసం అపసోపాలు పడుతున్నారు. నిర్మల్లో బీజేపీ, కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో వార్డులో నలుగురైదుగురూ పో టీపడుతున్నారు. ఇందులో ఎవరికివ్వాలనేది తేల్చ డం పార్టీ నాయకులకూ అంతుపట్టడం లేదు. చైర్మ న్ స్థానం ఆశిస్తున్న నేతల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొంతకాలంగా నిర్మల్లో బీజేపీ నుంచి చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న సీనియర్నేత, హ్యాట్రిక్ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ సొంతపార్టీలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో బుధవారం రాత్రి బీఆర్ఎస్లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సమక్షంలో హైదరాబాద్లో గులాబీ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారు కూడా ఇక్కడ రాకపోతే బీఆర్ఎస్ నుంచైనా బరిలో నిలువాలన్న యోచనలో ఉన్నారు. నిర్మల్లో నిల్నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు స్పందన నామమాత్రంగానే ఉంది. మూడు మున్సిపాలిటీల్లో కలిపి బుధవారం ఐదు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. ఖానాపూర్లో 7, 9, 11 వార్డులకు ఒక్కటి చొప్పున, భైంసాలో 9, 14వార్డులకు ఒక్కో నామినేషన్ చొప్పున వేశారు. జిలాకేంద్రమైన నిర్మల్లో 42 వార్డులుండగా తొలిరోజు ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజునే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించడం, మరోవైపు పార్టీలు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో ఎవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదు. చాలామంది బుధవారం మున్సిపాలిటీల్లో పన్నులు చెల్లించారు. రెవెన్యూ నుంచి ధ్రువపత్రాలు తీసుకోవడంలోనే బిజీగా కనిపించారు. మున్సిపాలిటీకి కూడా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పన్నులు ఇలా ఎన్నికల పుణ్యాన కొంతమేరకై నా క్లియర్ అవుతున్నాయి. ఇక గురువారం ఉదయమే అభ్యర్థిత్వాలు ఖరారైతేనే నామినేషన్లు వేయడానికి రెండురోజుల గడువు ఉంటుంది. మరోరోజు ఆలస్యం చేసినా చివరిరోజే ఆగమేఘాల మీద నామినేషన్ వేయాల్సి వస్తుందని ఆశావహులు వాపోతున్నారు. -
ఖానాపూర్లో రెండో సమరం!
ఖానాపూర్: పాత తాలుకాగా ఉండే నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ 2018 ఫిబ్రవరికి ముందు వరకు మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగింది. 1958లోనే ఖానాపూర్ నగరపంచాయతీగా ఏర్పాటైంది. అప్పట్లోనే స్వర్గీయ అబ్దుల్ హమీద్ ఏకగ్రీవంగా తొలి చైర్మన్గా ఎన్నికై 1958 నుంచి 1961 వరకు కొనసాగారు. ఆ తర్వాత ఖానాపూర్ను పంచాయతీగా మార్చారు. 1961లో స్వర్గీయ గంగాధర్రావు దేశ్పాండే తొలిసర్పంచ్గా ఎన్నికయ్యారు. తదనంతరం 1963లో జరిగిన ఎన్నికల్లో జబ్బర్ఖాన్ సర్పంచ్గా ఎన్నికై 1981 వరకు 18 ఏళ్లపాటు కొనసాగారు. 1981నుంచి 1987 వరకు నర్సింహరావు జోషి, 1987 నుంచి 1994 వరకు బక్కశెట్టి రాములు సర్పంచ్గా ఉన్నారు. 1994 నుంచి 1997 వరకు విలాస్రావు దేశ్పాండే సర్పంచ్గా పనిచేసి మృతి చెందారు. తదనంతరం శికారి లక్ష్మీనారాయణ సర్పంచ్గా కొనసాగారు. అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లో విలాస్రావు సతీమణి శోభారాణి సర్పంచ్గా గెలిచి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మధ్యలోనే వెళ్లిపోయారు. ఆమె స్థానంలో బక్కశెట్టి లక్ష్మణ్ సర్పంచ్గా కొనసాగారు. 2001నుంచి జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల రత్నకుమారి, మైలారపు గంగాధర్, ఆకుల శ్రీనివాస్, నేరెళ్ల సత్యనారాయణ వరుసగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. 2019–2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు చెందిన అంకం రాజేందర్ తొలి చైర్మన్గా ఎన్నిక కాగా, నాలుగేళ్ల తర్వాత అతడిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గగా కాంగ్రెస్కు చెందిన చిన్నం సత్యం రెండో చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నోటిఫికేషన్ రావడంతో ఖానాపూర్లో రెండోసారి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఖానాపూర్ పేరెలా వచ్చిందంటే.. దశాబ్దాల క్రితం జిల్లాలో కరువు ఏర్పడింది. దీంతో చాలామంది దూర ప్రాంతాల నుంచి ఖానాపూర్ ప్రాంతానికి వలస వచ్చారు. ఈ క్రమంలో ఎస్సారె స్పీ కంటే ముందే ఖానాపూర్ మండలంలోని మే డంపల్లి గ్రామం వద్ద అప్పటి గోండు రాజులు గో దావరి నదికి అడ్డంగా మాటు కట్టారు. ఆ మాటునే నేటికి సదర్మాట్ అని కూడా అంటారు. మాట్ నుంచి దిగువనున్న భూములకు ప్రధాన కాలువ నిర్మించి గోదావరి నుంచి మళ్లించిన సాగునీటితో ఏటా రెండు పంటలు పండించే వారు. ఆ సమయంలో ఆది ఎంతోమంది వలస కూలీలకు ఉపాధి కల్పించింది. ఆహార పంటలు అందించింది. దీంతో పని కల్పించి అన్నం పెట్టే ఊరు కావడంతో ఖానా దేనేవాలా గావ్ ‘ఖానా’పూర్గా రూపాంతరం చెందిందని ఈ ప్రాంతవాసులు చెబుతుంటారు. కొత్తగా పెరిగిన ఓటర్లు పట్టణంలో 15,604 ఓటర్లుండగా 8,020 మంది మహిళలు, 7,584 మంది పురుషులున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా కొత్తగా 2,089 ఓట్లు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం 8,524 మంది పురుషులు, 9,169 మంది మహిళలున్నారు. మొత్తం 17,693 మంది ఓటర్లతో 12వార్డుల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. -
‘ఖానాపూర్లో కుంటుపడిన అభివృద్ధి’
ఖానాపూర్: పదేళ్ల బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఖానాపూర్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ ఆరోపించారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఖానాపూర్ మున్సిపల్గా ఏర్పడ్డా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఖానాపూర్ మున్సిపల్ పీఠమే లక్ష్యంగా అన్ని వార్డుల్లో కాషాయజెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కరిపె రంజిత్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన పలువురికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, నల్ల రవీందర్రెడ్డి, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, ఎనగందుల నారాయణ, తిరుమల్, రాజ్కుమార్, పవన్, మురళి తదితరులు పాల్గొన్నారు. -
1956లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా భైంసా..
భైంసాటౌన్: భైంసా పట్టణం 1956లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 11,750 నివాస గృహాలు, 50,134 మంది జనాభా ఉండేది. ప్రస్తుతం 14,730 గృహాలు, 53,374 మంది జనాభా ఉన్నారు. భైంసా పట్టణం 35.11 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా, భైంసా నుంచి నిర్మల్, నిజామాబాద్, మహారాష్ట్రలోని భోకర్, ఇతర ప్రాంతాలకు ప్రధాన మార్గాలున్నాయి. పట్టణానికి పశ్చిమాన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా, దక్షిణాన నిజామాబాద్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. పట్టణంలో మొత్తం 26వార్డులుండగా, 51,118 మంది ఓటర్లున్నారు. వీరిలో 25,486 మంది పురుషులు, 25,623 మంది మహిళలు, తొమ్మిదిమంది ఇతరులున్నారు. పట్టణానికి ఆనుకుని రెండు కిలోమీటర్ల దూరంలో మిర్జాపూర్ మార్గంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఉండగా, పట్టణానికి ఇదే తాగునీటి ఆధారంగా ఉంది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కలిగి ఉంది. పత్తి పరిశ్రమలూ ఇక్కడ అధిక సంఖ్యలోనే ఉన్నాయి. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, అయ్యప్ప ఆలయం, మహదేవ్ మందిర్, గట్టు మైసమ్మ ఆలయాలున్నాయి. -
సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవా రం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని ము న్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ప రిశీలించి పోలీసులు అధికారులు, సిబ్బందికి పలు సూ చనలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ, మెటల్ డిటెక్టర్లు, బారికే డ్లు, ట్రాఫిక్ నియంత్రణ లాంటి భద్రతా చర్యలను సమర్ధవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి సమస్య ఎదుర్కొ న్నా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. అధికారులు సుజాత, సుందర్సింగ్, రమాకాంత్, అజయ్, సమ్మయ్య, శ్రీపాల్. రాహుల్ గైక్వాడ్, సిబ్బంది ఉన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్మల్ టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామి నేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా వెంటనే తమకు సమాచా రం ఇవ్వాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఇన్స్పెక్టర్లు నైలు, కృష్ణ, సమ్మయ్య, పోలీస్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. -
సరిహద్దులో కూరగాయల పంట
తానూరు: నిర్మల్ వ్యవసాయ ఆధారిత జిల్లా. 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో సోయా, వరి, పత్తి ప్రధాన పంటలు అయితే సంప్రదాయ పంటలకు భిన్నంగా తానూర్ మండలం జౌలా(కె), వడ్గాం, కోలూరు, కళ్యాణి, జౌలా(బి), ఖర్బాలా, హిప్నెల్లి, ఎల్వి, దాగాం, నంద్గాం, మొగ్లి, బోరిగాం గ్రామాల రైతులు కూరగాయల సాగుతో ఆర్థికంగా స్థిరపడుతున్నారు. సీజన్లతో సంబంధం లేకుండా ఏడాదికి నాలుగు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు వేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. పంట ఉత్పత్తులను స్థానికంగా, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ మార్కెట్లకు పంపి మంచి ఆదాయం పొందుతున్నారు. మార్కెట్ డిమాండ్ మేరకు సాగు.. గతంలో ఈ రైతులు పత్తి, సోయాపై ఆధారపడేవారు. మార్కెట్ అవసరాలను గుర్తించి కూరగాయ ల సాగువైపు మళ్లారు యాసంగిలో మొక్కజొన్న, గోధుమలతోపాటు ఎకరం లేదా రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిశాయి. బావులు, బోర్లలో నీరు ఉంది. రెండు నెలల శ్రమతో పంటలు చేతికొస్తున్నాయని, ఇతర పంటల ఖర్చులను కవర్ చేస్తూ లాభాలు ఇస్తున్నాయని రైతులు చెబుతున్నారు. 250 ఎకరాల్లో పంటలు.. అధికారుల అంచనాల ప్రకారం యాసంగి మండలంలో 250 ఎకరాల్లో వివిధ కూరగాయలు పండిస్తున్నారు. వంకాయలు, టమాటాలు, క్యాబేజీ, మి ర్చి, బెండకాయలు, కాయకూరలు, కొత్తమీర, మెంతికూర, పాలకూర, కరివేపాకు వంటివి ప్రధానం. తక్కువ నీటితో పంటలు వచ్చేందుకు చుట్టుపక్క గ్రామాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. ‘మహా’ రైతుల స్ఫూర్తి.. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. పక్క రాష్ట్రంలో రైతుల లాభాలు చూసి స్ఫూర్తి పొందారు. బోరు బావులు ఉన్న స్థానికులు ఈ పంటలకు మొగ్గు చూపారు. పదేళ్లుగా జౌలా, వడ్గాం, కళ్యాణి, ఖర్బాలా, కోలూరు, మొగ్లి గ్రామాల్లో రైతులంగా కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. పంటలను నిజామాబాద్, భైంసా, ముధోల్, ధర్మాబాద్, ఉమ్రి పట్టణాలకు ప్రత్యేక వాహనాల్లో పంపుతున్నారు. రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, బస్సు సౌకర్యం లేని గ్రామాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
‘మానవులు–వన్యప్రాణుల సంఘర్షణ’ పై అవగాహన
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం మానవులు–వన్యప్రాణుల సంఘర్షణ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాసర సర్కిల్లోని నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాలకు చెందిన పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అడవిని అనుకుని ఉన్న గ్రామాలు వన్యప్రాణులతో మానవులకు ఏర్పడే సంఘర్షణలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చించారు. ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ జిల్లా అటవీ శాఖ అధికారులు సుశాంత్ సుఖదేవ్ బోబడే, ప్రశాంత్ పాటిల్, రవి ప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మి, నాలుగు జిల్లాల ట్రైబల్ వెల్ఫేర్, హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఎలక్ట్రిసిటీ అధికారులు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు, అరణ్య ఎన్జీవో సభ్యులు, సర్పంచులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి
లోకేశ్వరం: జీరామ్జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి డిమాండ్ చేశారు. మండలంలోని పుస్పూర్ గ్రామంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు పని కల్పిస్తున్న ఉపాధి చట్టం రద్దు చేసి జీరామ్జీ చట్టాన్ని తేవడం ప్రజల ఉపాధి హక్కుని దెబ్బతిస్తుందన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా బిల్లు రూపొందించిందని విమర్శించారు. కూలీలకు రోజుకు రూ.800 చెల్లించి ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్కుమార్, నాయకులు కృష్ణదాస్, తిమ్మాపురం ముత్తన్న, గ్రామ అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. -
గెలుపు గుర్రాలకే టికెట్
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ తెలిపారు. పట్టణంలో పార్టీ ఎన్నిల ఇన్చార్జి పుల్లారావు యాదవ్తో కలిసి మంగళవారం పర్యటించారు. వార్డుల వారీగా సమీక్ష నిర్వహించారు. పోటీ చేస్తామనే ఆశావాహులంతా పార్టీ నియమాలు, నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. బీజేపీ తరఫున పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో నల్లా రవీందర్రెడ్డి, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, మదిరె శ్రీనివాస్, నాయిని సంతోష్, అనిల్రావు, తోకల బుచ్చన్నయాదవ్, పడాల రాజశేఖర్, ఎనగందుల నారాయణ, ఆసం సాయికృష్ణ, సందుపట్ల శ్రావణ్, బొప్పారపు సత్యవతి, రాపెల్లి రవీందర్, మంత్రరాజం సురేశ్, మట్టేరి రాజశేఖర్, కాశవేణి ప్రణయ్, ఎనగందులకుమార్, నరవేని సాయి, దానిపెల్లి సుధాకర్ పాల్గొన్నారు. -
ఎవరికీ పట్టని వేదికలు
నిర్మల్చైన్గేట్/భైంసారూరల్: రైతులకు లాభదాయక సాగు పద్ధతులు, చీడపీడల నియంత్రణ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సాధించే మార్గాలు సూచించేందుకు గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించింది. ఈ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయితో పంటల పరిశీలన చేస్తారు. నాలుగేళ్ల క్రితం జిల్లాలో 18 మండలాల్లో 79 క్లస్టర్లకు వ్యవసాయ ఇంజినీరింగ్ అధికారులు వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు, ఉపాధి హామీ పథకం నుంచి రూ.10 లక్షలతో నిర్మించారు. అధికారుల సొంత ఖర్చు నిధులు రాకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు సొంత డబ్బులతో వేదికలను నడుపుతున్నారు. ఉదయం–సాయంత్రం అందుబాటులో ఉంటూ రైతులకు సాగు సలహాలు, శిక్షణ ఇస్తున్నారు. ఈ సౌకర్యాలు లేకపోతే రైతులకు క్షేత్రస్థాయి మార్గదర్శకత్వం లోపిస్తుంది. అయితే అధికారులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేస్తే, రైతుల అభివృద్ధికి ఇది బలమైన సాధనంగా మారుతుంది.నిర్వహణ ఖర్చులు.. ప్రతీ రైతు వేదికకు నెలకు రూ.9 వేల నిధులు మంజూరు చేసి, తాగునీరు (రూ.500), శుభ్రత (రూ.3,000), సరఫరా సామగ్రి (రూ.1,000), విద్యుత్ చార్జీలు (రూ.1,000), మరమ్మత్తులు (రూ.1,000), నెలలో 8 సమావేశాలకు టీ–స్నాక్స్(రూ.2,500) వంటి ఖర్చులు చేపట్టాలి. జిల్లా మొత్తంగా 79 వేదికలకు నెలకు రూ.3.60 లక్షలు అవసరం. 2022, ఆగస్టు వరకు నిధులు క్రమబద్ధంగా వచ్చాయి. అనంతరం 40 నెలలుగా మంజూరు ఆగిపోయింది. ఫలితంగా రూ.2.84 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. -
మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి మంగళవారం మాట్లాడారు. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానా పూర్ మున్సిపాలిటీల్లో 244 పోలింగ్ కేంద్రాల్లో, 80 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆర్వోలు, ఏఆర్వోలు, ఇతర అధికారుల విధులకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రేపు ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 30వ తేదీ, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని పేర్కొన్నారు. బుధవారం నుంచే వార్డుల వారీ గా ఎలక్టరోల్స్ ప్రదర్శిస్తామన్నారు. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన పూర్తి చేయడంతో పాటు, చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా ను ప్రదర్శిస్తామన్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి, 13న ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలన్నారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు.. అనంతరం ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నా రు. నామినేషన్ల స్వీకరణ మొదలుకుని, పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు బందోబస్తు కల్పిస్తామన్నారు. మద్యం, నగదు రవాణాపై నిఘా ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, భైంసా ఏఎస్పీ రాజేవ్మీనా, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, డీపీఆర్వో విష్ణువర్ధన్, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్సింగ్ పాల్గొన్నారు. -
సమయం లేదు మిత్రమా..!
సమ్మక్క జాతర పోయొద్దామా..నిర్మల్7కాగజ్నగర్ మండలం నందిగూడ సమీపంలో గద్దెలుఆరోగ్య లక్ష్యాలు చేరుకోవాలి నిర్మల్చైన్గేట్: ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ ఆరోగ్య లక్ష్యాలు చేరుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని మహిళా ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య పర్యవేక్షకులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్వో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సాధించిన ప్రగతి గురించి సమీక్షించారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించడానికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహణ అధికారులు డాక్టర్ నైనారెడ్డి, డాక్టర్ సౌమ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ అధికారి డాక్టర్ ఆకాశ్, ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. నిర్మల్: పురపోరుకు మంగళవారం నగారా మోగింది. పట్టణాల్లో హీట్ పెంచింది. పార్టీలను టెన్షన్ పెడుతోంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సమయం ఇవ్వకుండా బిజీ షెడ్యూల్ ఇచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేవలం పక్షంరోజుల్లోనే కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. బల్దియాల్లో బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. బరిలో ఎవరు ఉండాలనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోవడం, అభ్యర్థులను ఫైనల్ చేయకపోవడం, ఇంతలోనే షెడ్యూల్ రావడంతో ఒక్కసారిగా పార్టీల్లో హడావుడి పెరిగింది. ఆశావహులు మంగళవారం సాయంత్రం నుంచే ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుల ఇళ్లవద్ద బారులుతీరారు. నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభమై మూడు రోజుల్లోనే ముగస్తుండటంతో ఇన్నిరోజులు పార్టీ టికెట్పై ఆశలు పెట్టుకున్న ఆశావహులూ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు బుధవారం ఉదయం 10.30 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈమేరకు నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులే ఫైనల్ కాలేదు.. ఓదిక్కు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఇంకా మున్సిపల్ బరిలో నిలిచే తమ అభ్యర్థులను ఏ పార్టీ ప్రకటించలేదు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ప్రతిష్టాత్మకంగా బరిలో దిగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ సీట్ల కోసం పోటాపోటీ వాతావరణం ఉంది. నిర్మల్లో 42 వార్డులు, భైంసాలో 26, ఖానాపూర్లో 12 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్ల లెక్కతేలినా అభ్యర్థుల జాబితాను మాత్రం పార్టీలు తేల్చలేదు. నోటిఫికేషన్ రావడంతోనే వెంటనే షెడ్యూల్ ప్రకటించడం, అందులో బుధవారం నుంచే మూడురోజుల్లోనే నామినేషన్ల గడువు ముగుస్తుండడం ఆశావహులను కలవరపెడుతోంది. ఎవరో ఒకరిపేరు ప్రకటిస్తే.. మిగతావాళ్లు ఏం చేయాలో తేల్చుకుంటామన్న భావనను ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఇళ్లచుట్టూ ఆశావహులు తిరగడం కనిపించింది. నామినేషన్లతోపాటు ప్రచారానికీ సమయం ఎక్కువగా లేకపోవడంతో వారంతా కంగారు పడుతున్నారు. దాదాపు బుధవారం తమ అభ్యర్థులను ఫైనల్ చేయవచ్చని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక ముధోల్: మండల కేంద్రంలో తెలంగాణ ఉత్త ర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, సభ్యుడు రాజాగౌడ్ పాల్గొన్నారు. పలువురు విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేయగా చాలావరకు అక్కడే పరిష్కరించారు. మరికొన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఏఈ శ్రీకాంత్ తెలిపారు. జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలిఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం వన దేవతల జాతర ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. నిర్వాహకులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. భక్తుల కోసం సౌకర్యాలు కల్పించారు. నేటి నుంచే నామినేషన్లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 30వరకు మాత్రమే గడువు ఇచ్చారు. అంటే కేవలం మూడురోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మూడురోజులపాటు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈనెల 31న ఉదయం 11 నుంచి నామినేషన్ పత్రాల స్క్రూటినీ చేపట్టనున్నారు. ఆ వెంటనే సరైన నామినేషన్లు ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలలోపు అప్పీల్కు వెళ్లొచ్చు. వచ్చేనెల 2న అప్పీళ్లను పరిష్కరించనున్నారు. వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వచ్చేనెల 3న సాయంత్రం 3 గంటల వరకు గడువు ఇచ్చారు. 3 గంటల తర్వాత అభ్యర్థుల ఫైనల్ జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఫలితాల ప్రకటన ఉండనున్నాయి. నామినేషన్ కేంద్రాలు ఇవేఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్ సుజాతమున్సిపాలిటీల వారీగా ఓటర్లు మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం నిర్మల్ 47,362 50,824 18 98,204 భైంసా 25,486 25,623 9 51,118 ఖానాపూర్ 8,524 9,169 0 17,693నిర్మల్ మున్సిపాలిటీలో ఈసారి మూడుచోట్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. మున్సిపాలిటీ రెవెన్యూ సెక్షన్లో 1నుంచి 10వ వార్డు వరకు, పైఅంతస్తులోని కౌన్సిల్హాల్లో 11వ వార్డు నుంచి 28వ వార్డు వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 29వ వార్డు నుంచి 42వ వార్డు వరకు జెడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. భైంసాలో మున్సిపల్ కార్యాలయంలో, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. -
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
నిర్మల్టౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేలా చూస్తామని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కఠినంగా కోడ్ అమలు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ తెలిపారు. డబ్బు, మద్యం, ఓటర్ల ప్రలోభాలతో ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తగిన సిబ్బంది అందుబాటులో ఉంటారని, అవసరమైతే అదనపు బలగాలను మొహరించి ఓటర్లకు భద్రత కల్పిస్తామని వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. లైసెన్స్ ఆయుధాలు ఉన్నవారు సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఆదేశించారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీలు, ధర్నాలు నిషేధం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించొద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, విద్వేషపూరిత లేదా రెచ్చగొట్టే పోస్టులు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే శాంతియుత ఎన్నికలు విజయవంతమవుతాయని, అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని కోరారు. -
అభ్యర్థుల ఎంపికే ముఖ్యం
ఖానాపూర్: త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికే కీలకమని పార్టీ మున్సిపల్ ఎన్నికల ఖానాపూర్ ఇన్చార్జి అబ్దుల్ ముజీబ్ అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో మంగళవారం మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తలను నియమించిన నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జిగా హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ ముజీబ్ను నియమించారు. ఆయన మంగళవారం పట్టణానికి రావడంతో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. -
అన్నదాతకు అండగా..
నిర్మల్చైన్గేట్: రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా ఈ పథకానికి 4,454 యూనిట్లు మంజూరు కాగా, ప్రభుత్వం రూ.3.35 కోట్లు కేటాయించింది. సబ్సిడీ వివరాలు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయ సబ్సిడీలు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు పరికర ధరలో 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తుంది. రైతు ఎంపిక చేసుకున్న కంపెనీ ధరలో సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రైతు డీడీ రూపంలో దరఖాస్తతో కలిపి సమర్పించాలి. పెరిగిన సాగు ఖర్చులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు యాంత్రీకరణవైపు మళ్లినప్పటికీ, గత ప్రభుత్వ కాలంలో పథకం ఆగిపోయింది. దీంతో రైతులు సొంత ఖర్చుతో పనిముట్లు కొనుగోలు చేసుకుంటున్నారు. పరికరాల ధరలు ఎక్కువగా పెరగడంతో ఇది భారంగా మారింది. వరి సాగులో ఆధునిక పరికరాలు వచ్చినా, వాటి ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి. ఎన్నికల కోడ్తో ఆలస్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం యాంత్రీకరణ పథకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో రూపొందిన ఈ పథకానికి రూ.3.35 కోట్లు విడుదలయ్యాయి. తొమ్మిది నెలల క్రితం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హుల ఎంపిక పూర్తి చేశారు. సెప్టెంబర్ 17లోగా పరికరాలు అందించాల్సి ఉన్నా, పంచాయతీ ఎన్నికల కోడ్ వల్ల ప్రక్రియ ఆగిపోయింది. త్వరలోనే పూర్తి అమలు జరుగనుంది. చిన్న రైతులకు ప్రయోజనం.. గతంలో పెద్ద ట్రాక్టర్లు పంపిణీ చేసినప్పుడు అవి పెద్ద రైతులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇప్పుడు చిన్న, సన్నకారు రైతులకు సరిపడేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. హార్వెస్టర్లు, పవర్ టిల్లర్లు, ఎంబీ నాగాలు, తైవాన్ స్ప్రేయర్లు, గడ్డి బేలర్ యంత్రాలు, రొటేవేటర్లు వంటి చిన్న పరికరాలు అందిస్తారు. జిల్లాకు 4,454 యూనిట్లు మంజూరయ్యాయి. మంజూరైన పరికరాలు.. పరికరం యూనిట్లు నిధులు రూ.లక్షల్లో బ్యాటరీ ఆపరేటర్మ్యానువల్ 3,228 32.28 పవర్ స్ప్రేయర్ 525 5.25 రోటవేటర్ 239 11.9 పవర్ వీడర్ 50 1.75 సీడ్ అండ్ ఫర్టిలైజర్ 50 1.50 కల్టివేటర్, అదర్స్ 290 58 గట్లు వేసే మిషన్(పీవోటీ కానివి) 6 0.90 బ్రష్ కట్టర్ 41 14 పవర్ టిల్లర్ 25 25 -
వేడెక్కిన ‘పుర’ రాజకీయం
నిర్మల్/నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే, పార్టీలు అభ్యర్థులను ప్రకటించక ముందే పట్టణాల్లో రాజకీయాలు వేడెకుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ఓవైపు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలు సైతం మెజారిటీ స్థానాలు కై వసం చేసుకోవడం కోసం ఎత్తులు వేస్తున్నాయి. జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఆశావహుల సందడి నెలకొంది. ముందస్తు ప్రచారం.. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండడంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. షెడ్యూల్ వెలువడకముందే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కనిపించని వారు ఇంటింటికీ తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలకరిస్తూ.. పనులు చేస్తూ.. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోఎన్నికల బరిలో నిలవడానికి ఆసక్తితో ఉన్నవారంతా జనం బాట పట్టారు. ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన చెట్లు, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తున్నారు. కొందరు డ్రెయినేజీలు శుభ్రం చేయించగా, మరికొందరు విద్యుత్ దీపాలు, పైపులైన్ల మరమ్మతులు చేయించడంపై దృష్టి సారించారు. ప్లాన్–బి సిద్ధం... రిజర్వేషన్ కలిసి వచ్చినప్పటికీ టికెట్ రాకుంటే ఏం చేయాలా అన్న దానికి ప్లాన్–బీతో రెడీగా ఉన్నారు. వార్డులో ఇతర ఆశావహునికి తాము కోరుకున్న పార్టీ టికెట్ వస్తే ఇండిపెండెంట్గానైనా, కండువా మార్చుకుని అయినా బరిలో దిగాలన్న ఆలోచనతో ముందుస్తుగానే ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా రంగంలోకి దిగేందుకు అవసరమైన అంగబలం, అర్ధబలం సిద్ధం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకునేందుకు ఫొటోలు, వీడియోలతో సిద్ధంగా ఉన్నారు. -
రాజ్యాంగ రథయాత్ర
నిర్మల్టౌన్: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో రాజ్యాంగ రథయాత్ర నిర్వహించారు. స్థానిక మంచిర్యాల చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు భారత రాజ్యాంగ విలువలు తెలుసుకుని, పూలే, అంబేడ్కర్, కాన్షీరాం మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, జిల్లా అధ్యక్షుడు సాయన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ పోశెట్టి, గౌరవ అధ్యక్షుడు బర్మ చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి రాజులదేవి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆవరణంలో గణతంత్ర వేడుకలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణంలో 77వ గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి శ్రీవాణి జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల త్యాగాలను గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, న్యాయవాదులు రాజశేఖర్, రమణ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయంలో.. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మున్సిపల్ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జెండాను ఆవిష్కరించి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, ఆర్వో రాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
నిబద్ధతతో విధులు నిర్వహించాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధులను గౌరవిస్తూ.. ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు విధులు నిర్వహించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 77వ గణ తంత్ర దినోత్సవాన్ని సోమవారం నిర్వహించా రు. ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయ సేవలు అందించడమే పోలీస్ వ్యవస్థ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, సాయికిరణ్, ఎస్సైలు ఆర్ఎస్సైలు, పోలీస్, డీపీవో పాల్గొన్నారు. 10న బాసర హుండీ లెక్కింపు బాసర: బాసర అమ్మవారి ఆలయ హుండీలను ఫిబ్రవరి 10న లెక్కించనున్నట్లు ఈవో అంజనాదేవి తెలిపారు. మొదట ఈనెల 28 లెక్కించాలని నిర్ణయించారు. అనివార్య కారణాలతో 10వ తేదీకి వాయిదా వేశారు. -
ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం అలసత్వం
ఖానాపూర్: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ విమర్శించారు. ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారందరికీ తనవంతు సాయంగా రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం చెల్లిస్తానని హామీ ఇచ్చి డ్రైవర్ల వివరాలు సేకరించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆటో డ్రైవర్లకు బీమా ప్రీమియం చెల్లిస్తానని ప్రకటించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతోందని విమర్శించారు. రూ.5 లక్షల బీమా రద్దు చేసి ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అసంఘటితరంగ కార్మికులకు రైతుబీమా తరహాలో రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ నుంచి బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.1,000 చొప్పున (సంవత్సరానికి రూ.12,000) సహాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ రెండేళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదన్నారు. ప్రతీ ఆటో డ్రైవర్కు ప్రభుత్వం రూ.24 వేల బాకీ ఉందని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన సంక్షేమ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3 వేల మందికిపైగా ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారికి ప్రభుత్వం బీమా కట్టకపోవడంతో వ్యక్తిగతంగా తానే బీమా ప్రీమియం చెల్లిస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, రాజగంగన్న, శ్రీనివాస్, ప్రదీప్, కేహెచ్.ఖాన్, షోయబ్, సుమిత్, రాకేశ్, చంద్రహాస్, వాల్సింగ్, వాహబ్, రాజు, డ్రైవర్లు పాల్గొన్నారు. -
గణతంత్ర స్ఫూర్తితో ప్రజాపాలన
నిర్మల్మాట్లాడుతున్న కలెక్టర్ అభిలాష అభినవ్ శివంగి దళానికి సెల్యూట్ చేస్తున్న కలెక్టర్, ఎస్పీ నిర్మల్: ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు జిల్లాలో అమలు చే స్తూ, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి తో ప్రజాపాలన అందిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నా రు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్అహ్మద్, కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ సంకేత్కుమార్, నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి, ఏఎస్పీలు రాజేశ్మీనా, సాయికిరణ్, ఉపేంద్రారెడ్డి, ఐఎఫ్ఎస్ సుశాంత్సుఖ్దేవ్ బోబడే పాల్గొన్నారు. కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన సందేశాన్ని వినిపించారు. పేదలకు ఇళ్లు.. రైతులకు భరోసా.. ప్రజాపాలనలో భాగంగా పేదలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ అభిలాషఅభినవ్ పేర్కొన్నారు. పేదల సొంతింటి కల ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో.. జిల్లాలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనలో పలుఅభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతామన్నారు. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పురప్రముఖులు పాల్గొన్నారు.జాతీయ జెండాతో చిన్నారి -
వృక్షశాస్త్రంలో..
వృక్షశాస్త్రంలో 30 మార్కులు సాధించా లంటే విద్యార్థులు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా చదవాలని మామడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వృక్షశాస్త్రం అధ్యాపకుడు పురుషోత్తం అంటున్నారు. ప్రధానంగా ఇందులో 5 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న వృక్ష వర్గీకరణ శాస్త్రంకు సంబంధించి 3 కుటుంబాలపై అడుగుతారు. ఇందులో మొక్క శాఖీయ లక్షణాలతోపాటు, పుష్ఫ లక్షణాలు రాయాలి. దీనికి 6 మార్కులు కేటాయించారు. రెండో ప్రశ్న కాండం అడ్డుకోతపై ఉంటుంది. దీనికి 6 మార్కులు ఇచ్చినది సెక్షన్ తీసి దాని గుర్తింపు లక్షణాలు రాయాలి. మూడోది వృక్ష శరీరధర్మ శాస్త్రంరం ప్రయోగాల నుంచి వస్తుంది. దీనికి 6 మార్కులు ప్రయోగం ఉద్దేశం, సూత్రం, పరిశీలన, అనుమితి రాయాలి. స్లైడ్స్, స్ఫెసిమెన్స్లకు 5 మార్కులు, ఇక మిగిలిన 7 మార్కులలో 2 మార్కులు హెర్బేరియం, 5 మార్కులు రికార్డుకు ఉంటాయి. మన దైనిందిన జీవితంలో ఉండే మొక్కలు సేకరించాలి. పటాలు వేయడం, పుష్ప సంకేతంపై దృష్టి సారిస్తే 30 మార్కులు పొందడం సులభం. -
ప్ర
నిర్మల్ణాళికతో యోగంలో వ్యాసరచనలో సోన్ విద్యార్థిని ప్రతిభ లక్ష్మణచాంద: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సోన్ జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న ఆరేపల్లి రాజశ్రీ ప్రతిభ కనబర్చింది. కలెక్టర్ అభిలాష అభినవ్ రాజశ్రీని అభినందించి ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థినిని హెచ్ఎం ఆరాధన, ఉపాధ్యాయులు అభినందించారు. లక్ష్మణచాంద: ఇంటర్ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రయోగ పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చని అధ్యాపకులు సూచిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు వార్షిక పరీక్షలకు చదివినట్లుగానే ప్రయోగాలకు సన్నద్ధంగా ఉండా లంటున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు మరో వారం మాత్రమే గడువు ఉందని, సీసీ కెమెరాల నిఘాతో జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు పూర్తి సిద్ధత కావాలని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ టైంటేబుల్లో ప్రత్యేక స్లాట్లు కేటాయించి, పాత ప్రయోగాలు పునరావృత్తం చేయిస్తున్నట్లు తెలిపారు. -
ఉత్సవాలతో కదలిక
నిర్మల్: ‘ఏంటి నాన్నా.. మన నిర్మల్కు ఇంత హి స్టరీ ఉందా..!?’ ‘ఏంటమ్మా.. మన ఏరియా కూడా హిస్టారికల్ ప్లేసా..!?’ అని పిల్లలు అడుగుతుంటే చాలామంది తల్లిదండ్రులు అవునని తలూపుతూ నే.. లోలోపల తమకూ ఇప్పుడిప్పుడే మన చరిత్ర తెలుస్తోందని ఫీల్ అవుతున్నారు. ‘మరి మన నిర్మ ల్ గురించి, రాంజీగోండు చేసిన ఫైట్ గురించి మా సోషల్బుక్స్లో ఎందుకు లేదు..?’ అనే ప్రశ్నకు చాలామంది సమాధానమివ్వడం లేదు. తమకుతాము ఇప్పుడిప్పుడే ‘అవును.. మా ఏరియా హిస్టరీ ఎందుకు బయటకు రావడం లేదు..’ అని ప్రశ్నించుకుంటున్నారు. వారసత్వ వేడుకలుగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘నిర్మల్ ఉత్సవాలు’ నేటితరంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా తమదైన చరిత్రను తెలుసుకుంటున్న నేటితరం గర్వంగా ఫీలవుతున్నారు. ఇక్కడి చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు చరిత్రను ముందుతరాలకు అందేలా చేయాలంటూ పాలకులు, అధికారులను కోరుతున్నారు. చాలామంది నేరుగా కలెక్టర్ అభిలాషఅభినవ్ దృష్టికీ తీసుకెళ్లారు. ఈక్రమంలో కలెక్టర్ జిల్లాలో మ్యూజియం ఏర్పాటుతోపాటు ఒకట్రెండు గఢ్లనూ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మ్యూజియం ఏర్పాటు.. జిల్లాలో ఒక మ్యూజియం ఏర్పాటు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి ముందడుగు పడనుంది. గతంలో కలెక్టర్గా పనిచేసిన వరుణ్రెడ్డి హయాంలోనూ నిర్మల్లో హిస్టారికల్ మ్యూజియం ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. సమీకృత కలెక్టరేట్ నిర్మా ణం తర్వాత ఆఫీసులన్నీ అక్కడికి తరలిపోవడంతో, ఖాళీ అయిన పాత ఆర్అండ్బీ కార్యాలయాన్ని మ్యూజియంగా మార్చాలన్న యోచన చేశారు. ఎదురుగా ఉన్న సర్డ్మహల్(శీతలమందిరం) అభివృద్ధికీ ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అంతలోనే 2023 అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆయన బదిలీ కావడంతో ఆ పనులు, ప్రతిపాదనలు అలాగే నిలి చిపోయాయి. తాజాగా జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుండటం, అలాగే చరిత్రను కాపాడాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ మ్యూజియం ఏర్పాటు దిశగా యోచిస్తున్నారు. గఢ్ల అభివృద్ధి.. అడుగడుగునా ఉన్న రాతికట్టడపు గఢ్లు నిర్మల్ చరిత్రను ఇప్పటికీ కళ్లకు కట్టిస్తున్నాయి. ఈ ప్రాంత రాచరికపు ఠీవిని ప్రదర్శిస్తున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మల్–నిజామాబాద్ మార్గంలోని శ్యాంగఢ్, నిర్మల్–ఎల్లపల్లి దారిలో గల బత్తీస్గఢ్ల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. కానీ.. అవి కేవలం బయట గోడలకు పూతలు పూయడానికి మాత్రమే సరిపోయాయి. లోపల నామమాత్రంగా కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదు. కలెక్టర్ ప్రశాంతి శ్యాంగఢ్ లోపల అక్కడక్కడ కూర్చోవడానికి సిమెంట్ కుర్చీలు వేయించారు. బయట అభివృద్ధి చేసేలోపు ఆమె బదిలీ అయ్యారు. ముషరఫ్అలీ కలెక్టర్గా ఉన్న సమయంలో నిర్మల్ సుందరీకరణలో భాగంగా శ్యాంగఢ్ చుట్టూ లైటింగ్ పెట్టించారు. ఇప్పుడు కలెక్టర్ అభిలాషఅభినవ్ స్థానిక సమీకృత కలెక్టరేట్కు దగ్గరలో ఉన్న బత్తీస్గఢ్ను అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామని చెబుతున్నారు.ప్రతిపాదనలు చేస్తున్నాం.. జిల్లాకేంద్రంలో రెండేళ్లుగా నిర్వహిస్తున్న ‘నిర్మల్ ఉత్సవాలు’ విజయవంతం కావడం హర్షనీయం. జిల్లా చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఓ మ్యూజియం ఏర్పాటుతోపాటు గఢ్ల అభివృద్ధికీ ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికీ తీసుకెళ్తాం. – అభిలాషఅభినవ్, కలెక్టర్ -
ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి
నిర్మల్చైన్గేట్: తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సాధనకు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీమ శ్రీనివాస్, విశిష్ట అతిథిగా మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమబోర్డు, ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి రూ.25 వేల పెన్షన్, గుర్తింపు కార్డులను ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతూనే ఉందన్నారు. ఉద్యమకారుల ఐక్యతతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల డిమాండ్ల సహేతుకమైనవని , ఆ రోజుల్లో తెలంగాణ అంశం లేవనెత్తినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశానన్నారు. ఉద్యమకారుల డిమాండ్లు ముఖ్యమంత్రి వద్దకు ప్రస్తావించి డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు . టీయూఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ చైర్మన్ కొట్టే శేఖర్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముష్కం రామకృష్ణగౌడ్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, సీనియర్ ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. -
ప్రతీ పౌరుడు ఓటుహక్కు వినియోగించుకోవాలి
నిర్మల్చైన్గేట్: ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సమాజంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి సూచిక అని, భారతదేశంలో ఓటు హక్కు అమలైన తీరును వివరించారు. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, పిల్లలందరికీ చిన్ననాటి నుంచే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలపాలన్నారు. అంతకుముందు సమావేశానికి హాజరైన వారితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాలలో పాలుపంచుకున్న విద్యార్థులు, అధికారులకు, క్రమం తప్పకుండా పలు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లను, కలెక్టర్ సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం సైకిల్ ర్యాలీని కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. ఉత్తమ ఎలక్టోరల్ అవార్డు లక్ష్మణచాంద: ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గంలో ఉత్తమ ఎలక్టోరల్ అవార్డును లక్ష్మణచాంద తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మహేందర్ ఎంపికయ్యారు. కలెక్టర్ అభిలాష అభినవ్ అవార్డు అందించారు. ఇందులో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి ఉన్నారు. -
మున్సిపల్ కార్యాలయం తరలించొద్దు
ఖానాపూర్: పట్టణంలోని సాయినగర్ కాలనీలో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని తరలించొద్దని హన్మాన్మందిర్ కాలనీవాసులు కోరారు. కాలనీలోని పాఠశాలలోఆదివారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కాలనీలో అభివృద్ధిలో వెనుకబడిందని, భూములు, ప్లాట్ల ధరలు పడిపోయాయన్నారు. ఉన్న కార్యాలయాన్ని తరలిస్తే కాలనీ అభివృద్ధిలో మరింత వెనుకబడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని రోడ్డుపై లీకేజీలను నిర్మూలించలేని నాయకులు కాలనీని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. సమావేశంలో ఆయిందాల జనార్దన్, నాయిని శంకర్, నాయిని రాజేశ్వర్, బిల్ల రాజేశ్వర్, కరిపె రాజశేఖర్, నాగరాజు, నిమ్మల సాయి, ఎలిశెట్టి మహేశ్, గోపాల్, ప్రణీత్, ప్రవీణ్, మహేశ్, భూమరాజు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన వన్యప్రాణుల గణన
నిర్మల్టౌన్: ఈనెల 20 నుంచి నిర్వహించిన వ న్యప్రాణుల గణన ఆదివారంతో ముగిసింది. ఆరు రోజులుగా శాఖాహార, మాంసాహార జంతువులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి ప్ర త్యక్ష, పరోక్ష ఆధారాలను మొబైల్ యాప్లో న మోదు చేశారు. జిల్లాలో 102 బీట్లో వన్యప్రాణుల గణన చేశారు. దీనిలో బీట్ అధికారులు, సెక్షన్ డిప్యూటీ రేంజ్ అధికారులు పాల్గొన్నా రు. వీరితోపాటు ఎన్జీవో సభ్యులు, 60 మంది వలంటీర్లు పాల్గొన్నారు. వన్యప్రాణుల గణనలో పాల్గొన్న వలంటీర్లకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో నిర్మల్ ఎఫ్డీవో నాగిని భాను ప్రశంసాపత్రాలు అందజేశారు. ఖానాపూర్ డివిజన్లో.. ఖానాపూర్: ఖానాపూర్ డివిజన్ పరిధిలో జంతు, వృక్ష గణన విజయవంతంగా ముగిసిందని ఖానాపూర్ ఎఫ్డీవో శివకుమార్ తెలి పారు. పట్టణంలోని ఎఫ్డీవో కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సర్వే వివరాలన్నీ ఆన్లైన్ ద్వారా యాప్లో అప్లోడ్ చేశామన్నారు. త్వరలో సర్వే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం గణనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారికి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎఫ్ఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని చుక్కల దుప్పి మృతి
భీమారం: మండలంలోని మాంతమ్మ సమీపంలో రోడ్డు దాటుతున్న చుక్కలదుప్పిని ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మంచిర్యాల అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ జి.రత్నాకర్ రావు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఘటన స్థలాన్ని మంచిర్యాల ఎఫ్డీవో సర్వేశ్వర్ పరిశీలించారు. యువకుడిని కాపాడిన ఆటోడ్రైవర్బాసర: బాసర గోదావరి బ్రిడ్జిపై దూకేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని ఆదివారం ఆటోడ్రైవర్ కాపాడాడు. నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ షకీర్, రిపోర్టర్ లతీఫ్ గమనించారు. యువకుడు మద్యం మత్తులో గోదావరిలో దూకేందుకు యత్నించగా కాపాడి ఆటోలో బాసరకు తరలించారు. -
కలప పట్టివేత
ఇచ్చోడ: గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ అటవీ డివిజనల్ అధికారి చిన్న విశ్వనాథభూస్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పక్కా సమాచారంతో శనివారం రాత్రి అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కొందరు ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకుని ఇచ్చోడ ప్రభుత్వ టింబర్ డిపోకు తరలించారు. నిందితులు రాంటెంకి శ్రీకాంత్, దుర్గం నవీన్, రాంటెంకి వికాస్, జాడే రంజిత్, గొల్లపల్లి కిరణ్, కడారి మల్లేశ్, బోర్లకుంట సునీల్, పిప్పాల విజయ్, దుర్గం భగవాండ్లపై కేసులు నమోదు చేశారు. మొత్తం 122 కలప సైజులు ఉండగా, వీటి విలువ రూ.1,60,876 ఉన్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కలప అవసరమైన వారికి ఇచ్చోడ ప్రభుత్వ కలప డిపోలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చోడ, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, బోథ్ ఎఫ్ఆర్వోలు టి.పుండలిక్, గులాబ్సింగ్, సంతోష్, ప్రణయ్, బజార్హత్నూర్, ఇచ్చోడ డిప్యూటీ ఏఆర్ఓలు ప్రవీణ్ మహాజన్, ఇబ్రహీం షరీఫ్, గుడిహత్నూర్ ఎఫ్ఎస్ఓ ఇమ్రాన్, దామన్గూడ ఎఫ్బీఓ బి.ప్రశాంత్ పాల్గొన్నారు. -
పెండింగ్ డీఏలు ప్రకటించాలి
మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయుల పెండింగ్ ఐదు డీఏలు ప్రకటించి పీఆర్సీని అమలు చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ అన్నారు. మంచిర్యాలలో ఆదివారం నిర్వహించిన తపస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, జీవో 317తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహఅధ్యక్షుడు బండి రమేశ్, వెబ్సైట్ వింగ్ కన్వీనర్ విద్యాసాగర్, మహిళా కోకన్వీనర్ రమాదేవి పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం..తపస్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బగ్గని రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా భారతీ ఆశోక్, ఉపాధ్యక్షులుగా సమ్మయ్య, నీలేష్కుమార్, శ్రీనివాస్, శ్రీధర్, రాజ్యలక్ష్మి, సత్తిరెడ్డి, నాగరాజ్, కార్యదర్శులుగా పి.శ్రీనివాస్, నాగేందర్, తిరుపతి రెడ్డి, రజిత, శ్రీకాంత్, శ్రీరాములు, ఎగ్జిక్యూటివ్ మె ంబర్లు, సోషల్ మీడియా, స్పోర్ట్స్, కల్చరల్, సేవా వింగ్తోపాటు పలువురిని ఎన్నుకున్నారు. -
సాగు పనులను అడ్డుకున్న ఎఫ్బీవోపై దాడి
రెబ్బెన: రెబ్బెన రేంజ్ పరిధి తక్కళ్లపల్లి బీట్లో అటవీశాఖ భూమిలో సాగు పనులను అడ్డుకున్న ఎఫ్బీవో ఎండీ అయాజ్పై ముగ్గురు దాడికి పాల్పడ్డారు. రెబ్బెన ఫారెస్ట్ రేంజ్ అధికారి భానేష్ వివరాల ప్రకారం.. టైగర్ ఎస్టిమేషన్ ప్రక్రియలో భాగంగా వన్యప్రాణుల గణన పూర్తిచేసుకుని అయాజ్ వస్తున్నాడు. ఆదివారం తక్కళ్లపల్లి బీట్లోని 336 కంపార్టుమెంట్లో సప్ప రాజశేఖర్ అటవీశాఖ భూమిలో పంట సాగు పనులు చేస్తూ కనిపించాడు. ఎఫ్బీవో అడ్డుకోగా రాజశేఖర్ దురుసుగా ప్రవర్తించాడు. తన వద్ద పట్టా ఉందని తెలపగా రెవెన్యూ, అటవీశాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి వివాదంలో ఉన్న భూమి సమస్య పరిష్కరించుకోవాలని ఎఫ్బీవో సూచించి అడ్డుకోబోయాడు. రాజశేఖర్, తల్లి సప్ప లక్ష్మి, మామ పుప్పాల రమేశ్ కర్రతో అతనిపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. -
ఆ రైళ్లు ఆగేదెప్పుడో..!
ఆదాయం ఉన్నా రైళ్లేవి?ఆదాయం ఉన్నా మంచిర్యాల రైల్వేస్టేషన్లో ఆ రైళ్ల నిలుపుదల సంఖ్య తక్కువే. ఇక్కడ స్టాఫ్ ఉన్నా తక్కువ రైళ్లతోనే ప్రయాణికుల నుంచి ఆదాయం అధికంగా వస్తున్నట్లు తెలు స్తోంది. 2024–25లో రైల్వే వార్షిక ఆదాయపరంగా చూస్తే దాదాపు మంచిర్యాల రైల్వేస్టేషన్ రూ.21 కోట్లతో ఎన్ఎస్జీ–3 కేటగిరిలో చోటు లభించింది. రామగుండానికి రూ.15 కోట్లు, పెద్దపల్లి జంక్షన్కు రూ.11 కోట్లు, సిర్పూర్కు రూ.11 కోట్లతో ఎన్ఎస్జీ–4వ కేటగిరి లో చోటు దక్కింది. తక్కువ ఆదా యం ఉన్నా బెల్లంపల్లికి 5వ కేటగిరి పరిగణిస్తున్నారు. ఎన్ఎస్జీ–4వ గ్రేడ్ రైల్వేస్టేషన్ సిర్పూర్కాగజ్నగర్లో 124 రైళ్ల హాల్ట్ ఉన్నప్పటికి దాదాపు రూ.11 కోట్లు కాగా, మంచిర్యాలలో 83 రైళ్ల హాల్ట్తో రూ.20 కోట్లపై ఆ దాయం ఉన్న అనుకున్నమేర హాల్టింగ్ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పనులతో రద్దు..జాతరకు ప్రత్యేక రైళ్లు!మంచిర్యాలఅర్బన్: మేడారం జాతర వేళ రైల్వేశా ఖ నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల నుంచి మే డారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈనెల 28, 30 ఫిబ్రవరి 1 తేదీ ల్లో మంచిర్యాల నుంచి మధ్యాహ్నం 3.30 గంట లకు బయల్దేరి రాత్రి 10.10 గంటలకు సి కింద్రాబాద్కు చేరుకుంటుంది. 28, 30, ఫిబ్రవరి 1 తేదీ ల్లో ఉదయం 5.45 గంటలకు అక్కడి నుంచి బ యల్దేరి మధ్యాహ్నం 1.30గంటలకు మంచి ర్యాలకు చేరుకోనుంది. జనసాధారణ్ పేరుతో రైలు లో రిజర్వేషన్ బోగీలు ఉండవని ప్రకటించింది. 29, 31 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ కు ఉదయం 5.45 గంటలకు బయల్దేరి కాగజ్నగర్కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు. తిరిగి కాగజ్నగర్ నుంచి మధ్యాహ్నం 2.20 బయల్దేరి సికింద్రాబాద్ కు రాత్రి 10.10 గంటలకు చేరుకుంటుందన్నారు. ఇంటర్ లాకింగ్ పనులతో రైళ్లు రద్దుమందమర్రి నుంచి బెల్లంపల్లి మధ్య 10 కి.మీ మూడవ రైల్వే మార్గం అందుబాటులోకి తీసుకురావడానికి నాన్, ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని పాక్షికంగా, ఇంకొన్ని దారిమళ్లించి ప్రయాణికులు ప్రత్నామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ద.మ. రైల్వే జోన్ అఽధికారులు సూచించారు. ఈనెల 24 నుంచి 17003 కాజీపేట్ నుంచి సిర్పూర్ టౌన్, 17004 బల్లార్షా నుంచి కాజీపేట్ రామగిరి మెము ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 14వ తేదీ వరకు రద్దు చేశారు. ఈనెల 23 నుంచి ఫిబ్రవరి 13 వర కు 17035 కాజీపేట్ నుంచి బల్లార్షా ఎక్స్ప్రెస్, ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 17036 బల్లార్షా నుంచి కాజీపేట్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 17033 భ ద్రాచలం రోడ్డు నుంచి బల్లార్షా, 17034 సిర్పూ ర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు నడిచే సింగరేణి మెము ఎక్స్ప్రెస్ వరంగల్ నుంచి బల్లార్షా, సిర్పూర్ టౌన్ నుంచి వరంగల్ మధ్య పాక్షికంగా రద్దయింది. వరంగల్ నుంచి భద్రాచలం వరకు యధాతథంగా నడస్తుందని అఽధికా రులు తె లిపారు. బోధన్–కరీంనగర్–సిర్పూర్టౌన్ ప్యా సింజర్ రైలు ఫిబ్రవరి 14 వరకు రద్దు చేశారు. -
ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మృతి
నెన్నెల: గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం..మండలంలోని కోణంపేటకు చెందిన దుర్గం సౌమ్య(28)కు 2022లో గుండ్లసోమారం గ్రామానికి చెందిన రాజ్కుమార్తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కొన్నిరోజుల నుంచి సౌమ్య కడుపునొప్పితో బాధపడుతోంది. తరచూ మాత్రలు వేసుకునేది. ఈనెల 21న మధ్యాహ్నం కడుపునొప్పి తీవ్రం కావడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు ఆమెను ఆటోలో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. ఆదివారం మృతదేహానికి పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
జూడో చాంపియన్షిప్ పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి ఎల్.లక్ష్మణ్ జూనియర్ నేషనల్ జూడో చాంపియన్షిప్ పోటీల్లో సత్తాచాటాడు. పశ్చిమబెంగాల్ కోల్కతాలో జరుగుతున్న ఈ పోటీల్లో రజత పతకంతో మెరిశాడు. – 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. రాష్ట్రానికి జాతీయ స్థాయి జూనియర్ పోటీల్లో జూడోలో వచ్చిన మొట్టమొదటి రజత పతకం అందుకోవడం విశేషం. సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్, డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, డీటీఎస్ఓ పార్థసారథి, కోచ్ రాజు అతన్ని అభినందించారు. -
భారత్ పర్వ్–2026కు ఎంపిక
కోటపల్లి: గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఈనెల 26 నుంచి 31 వరకు నిర్వహించే భారత్ పర్వ్–2026కు మండలంలోని కొల్లూర్కు చెందిన నిమ్మల విజయ్కుమార్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, కళలు, వారసత్వాన్ని చాటిచేప్పే భారీ ప్రదర్శనలో రాష్ట్రం తరపున జానపద నృత్యాలు ప్రదర్శించనున్నారు. గ్రామస్తులు, నాయకులు విజయ్కుమార్ను అభినందించారు. పొచ్చెర జలపాతం వద్ద వింటర్ క్యాంప్ బోథ్: ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి ఔత్సాహికులు పొచ్చెర జలపాతం వద్ద వింటర్ క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ పులుల గణనలో భాగంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వలంటీర్లు, నేచర్ సొసైటీ సభ్యులు ప్రత్యేకంగా నైట్ క్యాంపు ఏర్పాటు చేశారు. రాత్రంతా అక్కడే బస చేశారు. ఉదయం అటవీ అందాలు, జలపాతాలను చూసి వలంటీర్లు అబ్బురపడ్డారు. పొచ్చెర జలపాతం వద్ద సహజ సిద్ధమైన ప్రకృతిని చూసి వారు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
నాగోబాకు మొక్కులు
ఇంద్రవెల్లి:ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కా వడంతో ఆలయం జనసంద్రమైంది. దర్శనం కో సం బారులు తీరారు. అనంతరం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమి షన్ చై ర్మన్ బక్కి వెంకటయ్య ప్రత్యేక పూజలు అ నంతరం దర్శించుకున్నారు. మెస్రం వంశీయులు ఆయన్ను శాలువాతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని బహూకరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, రాంబాబు నాయక్, శంకర్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, అధికారులు సునీత, అంబాజీ, నర్సింగ్, నారాయణరెడ్డి, సర్పంచ్ తుకారాం, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావు ఉన్నారు. -
నిర్మల్
నా దేశం నా ఓటు ప్రజాస్వామ్యంలో ఓటు తిరుగులేని ఆయుధం. పాలించేవారిని ఎన్నుకోవడానికి వాడే గొప్ప వజ్రాయుధం. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కథనం..వంద శాతం ఫలితాలు సాధించాలి లక్ష్మణచాంద: విద్యార్ధులు వంద శాతం ఫలితాలు సాధించేలాగా చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాధ్ జిల్లా ఎంజేపీ ఆర్సీవో శ్రీధర్ అన్నారు. మండలంలోని రాచాపూర్ మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. కిచెన్లోకి వెళ్లి వంట సరుకులను, తయారు చేసిన వంటను పరిశీలించారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రణాళికతో చదవాలని సూచించారు. పరీక్షలంటే భయం వీడాన్నారు. అనంతరం ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. ప్రయోగ పరీక్షలకు సన్నద్ధతపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.నిర్మల్చైన్గేట్: పేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్ష చొప్పున మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. మొదటి విడతలో జిల్లాలోని 18 మండలాల్లో 9,172 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముగ్గుపోసి ఇళ్ల నిర్మాణ పనులు అధికారులు ప్రారంభించారు. నిర్మాణ దశల ఆధారంగా బిల్లులు మంజూరు చేస్తున్నారు. అయితే ఇళ్లు మంజూరు చేసి ఏడాదైనా జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 28 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. లబ్ధిదారుల్లో చాలా మంది నిర్మాణం మొదలు పెట్టలేదు. దీంతో సుమారు 1,431 మంది ఇళ్లను రద్దు చేశారు. నిబంధనలతో అనాసక్తి.. ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారులు నిర్మాణాలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో పురోగతి కనిపించడంలేదు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా అధికారులు విభజించారు. ఒక్కో ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. నాలుగు విడతల్లో లబ్ధిదారులకు రూ.5 లక్షలు చెల్లించనున్నది. ఈ నిబంధనలతో చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. మొదట మండలానికి ఒక పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ గ్రామాల్లోనూ నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. తర్వాత మంజూరైన ఇళ్ల నిర్మాణంలోనూ జాప్యం జరుగుతోంది. కూలీలకు ఫుల్ డిమాండ్.. గతంలో కూలీల్లో పురుషులకు రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతం రూ.1200 నుంచి రూ.1500 అడుగుతున్నారు. మహిళలకు రూ. 500 ఉండగా రూ. వెయ్యి డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూలీలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలోని ఓ గ్రామంలో పునాది దశలోనే ఉన్న ఇందిరమ్మ ఇల్లు మండుతున్న ధరలు.. ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. మొత్తం మంజూరు 9,172 ప్రొసీడింగ్ పొందినవారు 7,741 మార్కౌట్ అయినవి 6,355 బేస్మెంట్ అయినవి 4,631 గోడలు పూర్తయినవి 2,485 స్లాబు పూర్తయినవి 1,536 ఇంటి నిర్మాణం పూర్తి 28 ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 525 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. పథకం ప్రారంభ దశలో బస్తా ధర రూ.280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్ను బట్టి బస్తా రూ.50 నుంచి 80 వరకు అదనంతో విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ.1,47,000కు సిమెంట్ వచ్చేది. ప్రస్తుత రేటుతో సుమారు రూ.1.80 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారు సిమెంటు కోసమే అదనంగా రూ.33 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సిఉంది. కానీ ఇసుక రవాణాదారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుక రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. వెయ్యి ఇటుకలకు ధర గతంలో రూ.6 వేలు ఉండగా ప్రస్తుతం రూ.9,500 పలుకుతోంది. అలాగే స్టీల్ ధర సైతం అమాంతం పెరిగింది. బేస్మెంట్ నిర్మాణంతోపాటు పిల్లర్లు స్లాబ్కు అవసరమయ్యే 20 ఎంఎం. కంకర ధర ట్రాక్టరుకు రూ.4,500 ఉండగా ప్రస్తుతం రూ.5,100 పలుకుతోంది. -
చరిత్రలో నిర్మల్ గమనం
నిర్మల్ఖిల్లా: గ్రామీణ భారతదేశంలోని అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర సాంస్కృక శాఖ నేషనల్ మిషన్ ఫర్ కల్చరల్ మ్యాపింగ్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ‘నా ఊరు – నా వారసత్వం(మేరా గావ్.. మేరీ ధరోహర్)’ పథకం గ్రామాల్లో సరికొత్త చరిత్ర అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. గ్రామాల చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానం, కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను లిఖితపూర్వకంగా నమోదు చేయనున్నారు. జిల్లా చారిత్రక ఖజానా జిల్లాలోని 400 రెవెన్యూ గ్రామాలు, మూడు పట్టణాలు దస్తూరాబాద్ నుంచి బాసర సరస్వతీ నిలయం వరకు విస్తరించిన ప్రాంతంలో గోదావరి తీర నాగరికత, రాజుల పరాక్రమం, కోటలు, బురుజులు, జానపద కళలు, పండుగలు అపారం. మౌఖిక కథలు, యుద్ధగాధలు, గ్రామ దేవతలు, వ్యవసాయ ఆచారాలు సర్వేలో నమోదవుతాయి. చరిత్రకారులు, పరిశోధకులు ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు. చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి... ‘నిర్మల్ గడ్డపై ప్రతీ రాయి ఒక కథ చెబుతుంది. ఈ మ్యాపింగ్ ద్వారా మన జిల్లా వైభవం ప్రపంచానికి తెలియడమే కాకుండా, అంతరించిపోతున్న కళలు, చా రిత్రక అంశాలకు పునర్జీవం లభిస్తుంది. మరుగునపడిన చరిత్రను తెలసుకుంటే ఔరా అని పించకమానదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణ యం ఆహ్వానించదగినదే.. – కటకం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హిస్టరీ, నిర్మల్ సమష్టి భాగస్వామ్యం అవసరం... ప్రభుత్వం చేపట్టే ఈ మహత్తర కార్యక్రామంలో చరిత్రకారులు, మేధావులు భాగస్వాములై మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నిర్మల్ జిల్లాలోని అద్భుతమైన చరిత్రను ప్రపంచపటంపై ఉంచేందుకు ఈ ‘నా ఊరు – నా వారసత్వం’ ఒక సువర్ణావకాశం. – ధోండి శ్రీనివాస్, చరిత్రకారుడు, నిర్మల్ ఈ సర్వేలో ప్రధానంగా ఏడు అంశాలపై దష్టి సారించనున్నారు: చారిత్రక నిదర్శనాలు కళావృత్తులు ఆధ్యాత్మిక కేంద్రాలు వీరత్వ గాధలు ఈ మ్యాపింగ్ గ్రామ చరిత్రను డిజిటల్గా భద్రపరచి, గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. యువతలో మూలాల అవగాహన పెరుగుతుంది. నిర్మల్ ’కోటల నగరం’గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతుంది. ఎంపీడీవోలు, గ్రామకార్యదర్శుల శిక్షణ తర్వాత సర్వే ప్రారంభిస్తారు. మ్యాపింగ్లో కీలకాంశాలు: -
వన్యప్రాణుల గణన పకడ్బందీగా నిర్వహించాలి
మామడ: వన్య ప్రాణులు, వృక్ష సంపద గణన పకడ్బందీగా చేపట్టాలని బాసర సర్కిల్ సీసీఎ ఫ్ అధికారి శరవణన్ అన్నారు. మండలంలోని నల్దుర్తి అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న గణన ను శనివారం పరిశీలించారు. మాంసాహార, శా కాహార, వృక్ష సంపద వివరాలను అటవీ సి బ్బంది నమోదు చేస్తున్నారు. చిరుతపులి, ఎలు గుబంటి, అడవి కుక్కలు, నక్కలు వంటి జంతువుల పాదముద్రల ఆధారంగా లెక్కిస్తున్నా రు. అటవీ జంతువుల వేట, చెట్ల నరికివేతను నిరోధించాలని, అటవీ ప్రాంతంలో అగ్ని ప్ర మాదాలు జరగకుండా చూడాలని సూచించా రు. సీపీఎఫ్ వెంట ఎఫ్డీవో నాగినిభాను, ఎఫ్ ఆర్వో శ్రీనివాస్రావు, ఎస్ఎస్వో శ్రీనివాస్, ఎఫ్బీవో అంజయ్య, రాజు ఉన్నారు. -
ముగిసిన నిర్మల్ ఉత్సవాలు
జానపద నృత్య ప్రదర్శనలో యువతులునిర్మల్చైన్గేట్: నిర్మల్ జిల్లా చరిత్ర, వారసత్వం, కళావైభవానిన చాటిచెబుతూ ఆరు రోజులు నిర్వహించిన ’నిర్మల్ ఉత్సవాలు’ శనివారం ముగిశాయి. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 19 నుంచి వేడుకలు నిర్వహించారు. జిల్లా చరిత్రలు తెలిపే ప్రదర్శనలు, నాటకాలు, సాసం్కృతిక కార్యక్రమాలు, జానపద కళలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్, హస్తకళల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రత్నకళ్యాని, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అధికారులు, సిబ్బంది, నిర్వాహకులు, ప్రజల సహకారంతో వేడులు విజయవంతమయ్యాయని తెలిపారు. చిన్నారుల నృత్య ప్రదర్శన.. -
దళితులను వేధించొద్దు
లక్ష్మణచాంద: దళితులను వేధించొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో శనివారం పర్యటించారు. గ్రామంలోని దళితులకు చెందిన భూములను వారి ఇష్టానికి విరుద్ధంగా, బలవంతంగా తీసుకుంటున్నారన్న ఫిర్యాదు మేరకు గ్రామాన్ని సందర్శించారు. భూయజమానులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూయజమానుల సమ్మతి లేకుండా వారి భూములను స్వాధీనం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించే అధికారం ఎవరికీ లేదన్నారు. దళితుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. దళిత రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిని మాత్రమే తీసుకోవాలని సూచించారు. బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో చట్టాన్ని చేతిలోకి తీసుకుని అనధికారికంగా దళితులను వేధించొద్దని సూచించారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీపౌరుడిపై ఉందన్నారు. గ్రామంలో సివిల్ రైట్స్ కార్యక్రమం నిర్వహించి, గ్రామస్తులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ సాయికిరణ్, ఆర్డీవో రత్నకళ్యాణి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, తహసీల్దార్ మల్లేశ్, దళిత సంఘాల నాయకులు ఉన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్
నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపల్ అధికారులు పన్ను ల వసూలుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా పట్టణంలోని అద్దె భవనంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఓ ప్రైవేట్ పాఠశాలను శని వారం సీజ్ చేశారు. పాఠశాల యాజమాన్యం రూ.2 లక్షలకుపైగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రూ.87,297 పన్ను బకాయి ఉన్నట్లు తెలిపారు. 15 రోజుల క్రితం రెడ్ నోటీసులు జారీ చేశారు. అయినా అలసత్వం వహించడంతో పాఠశాలను, సబ్ రిజిస్ట్రార్ కార్యాయాన్ని సీజ్ చేశామని అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ అధికారి రాజు, బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
నిర్మల్చైన్గేట్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్చార్జి సుదర్శన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటే ల్ అధ్యక్షతన శనివారం నిర్మల్లో నిర్వహించారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సర్వేల ఆధారంగా అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి బోస్లే నారాయణరావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎంబడి రాజేశ్వర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, జిల్లా, నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టార్గెట్ 100%
లక్ష్మణచాంద: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి సిలబస్ పూర్తయింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల కారణంగా కొంత ఆలస్యం అయినా, ప్రత్యేక తరగతులతో లక్ష్యాన్ని సాధించామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పుడు విద్యార్థుల సంసిద్ధతపై దృష్టి పెట్టారు. వంద శాతం ఉత్తీర్ణతకు..గత సంవత్సరంకన్నా మెరుగైన ఫలితాల కోసం జిల్లా విద్యాశాఖ ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9,932 మంది విద్యార్థులు (కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, ఎంజేపీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ సహా) 100% గెలుపు సాధించేలా సన్నద్ధమవుతున్నారు. ప్రత్యేక చర్యలు ఇలా..మెరుగైన ఫలితాల సాధనకు.. గతేడాది పదో తరగతి ఫలితాలలో నిర్మల్ జిల్లా 15వ స్థానంలో నిలిచింది. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించి ఉత్తమ ర్యాంకు సాధించేలాగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలన్నీ 100 శాతం ఫలితాలు సాధించేలాగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. – భోజన్న, డీఈవో -
ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య
నిర్మల్ రూరల్: ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఇంటర్మీడియెట్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్– టీచర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్య బలోపేతానికి విడుదల చేసిన నిధుల గురించి వివరించారు. నెల రోజుల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలవుతాయని అప్పటివరకు విద్యార్థులను తప్పనిసరిగా కళాశాలకు పంపాలని సూచించారు. డీఐఈవో పరశురాం మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమన్నారు. అనంతరం కళాశాలలో చదివి ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. కళాశాల పనితీరుకు సంబంధించి తయారుచేసిన వీడియోను ప్రదర్శించారు. విద్యార్థులు ప్రీఫైనల్ పరీక్షల్లో సాధించిన ఫలితాలను తల్లిదండ్రులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు విజయలక్ష్మి, నవీన్కుమార్, సత్యపాల్రెడ్డి, ఓంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
అంబరాన్నంటేలా సంబురాలు
● కొనసాగుతున్న నిర్మల్ ఉత్సవాలు ● మరోరోజు పొడగించిన కలెక్టర్ నిర్మల్ చైన్గేట్: చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ వేడుకలుగా నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఐదు రోజులుగా స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. మొదట ఐదు రోజుల ఉత్సవాలుగా మాత్రమే ప్రకటించడంతో శుక్రవారం భారీ సంఖ్యలో జిల్లావాసులు తరలివచ్చారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మరో రోజు ఉత్సవాలను పొడిగిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో చరిత్రను తెలుసుకోవడంతోపాటు, సాంస్కతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరిస్తున్నారు. -
శిశుమందిరాలు విలువలతో కూడిన విద్యాలయాలు
నిర్మల్చైన్గేట్: భావిభారత పౌరులకు చదువులతల్లి ఒడిలోనే విద్యతోపాటు.. సమగ్రవికాసాన్ని బోధించే పాఠశాలలు శ్రీసరస్వతీ శిశుమందిరాలని కమలానంద భారతి స్వామీజీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాగులవాడ శ్రీసరస్వతీ శిశు మందిరంలో శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు మందిరాలలో కేవలం చదువుకే పరిమి తం కాకుండా.. ఒక వ్యక్తిగా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి, ప్రముఖ వైద్యులు డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ నాగరంజని, డాక్టర్ రామకృష్ణ, నార్లపురం రవీందర్, రావుల సూర్యనారాయణ, కడార్ల రవీంద్ర, పాఠశాల పూర్వ విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల పేరు మార్చాలె..!
నిర్మల్Iసరస్వతీ నమస్తుభ్యం‘ఆదర్శ’ విద్యార్థులను అభినందించిన మంత్రి కుంటాల: హైదరాబాద్ గడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన సౌత్ ఇండియా స్థాయి సైన్స్ఫెయిర్లో కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు దివ్య, నాగజ్యోతి మ్యాథమెటిక్స్ పై సంఖ్యలు, పరిమాణాలు, ఆధారాలు, వాటి మధ్య సంబంధాలపై ప్రాజెక్టును ప్రదర్శించారు. విద్యార్థులను గైడ్ టీచర్ రమాదేవి, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, విద్యాశాఖ కార్యదర్శి నికోలాస్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి అభినందించారు. నిర్మల్: జిల్లా కేంద్రంలో ఈనెల 16న నిర్వహించిన బహిరంగసభలో సదర్మాట్ బ్యారేజీకి పి.నర్సారెడ్డి, ఆదిలాబాద్లోని చనాక–కొరాటా బ్యారేజీకి సి.రాంచంద్రారెడ్డిపేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై అప్పటికప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమైనప్పటికీ.. స్థానికంగా వ్యతిరేకత మొదలైంది. తాము ఆశించిన విధంగా ఈపేర్లు పెట్టలేదన్న వాదన పెరుగుతోంది. స్థానిక నేతలు, వీడీసీలు వెంటనే ప్రాజెక్టుల పేర్లు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ‘స్వర్ణ’కు నర్సారెడ్డి పేరు.. సీనియర్ కాంగ్రెస్ నేత పి.నర్సారెడ్డి (నర్సన్నబాపు ) స్వగ్రామం సారంగపూర్ మండలం మలక్చించో లి. గోదావరి ఉపనది స్వర్ణపై ప్రాజెక్టు నిర్మించా రు. ఆయన మంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా జిల్లా అభివృద్ధికి కీలకంగా నిలిచారు. స్థానికులు చాలా కాలంగా స్వర్ణ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని కోరుకుంటున్నారు. సదర్మాట్ ప్రకటనతో మామడ, సారంగపూర్ మండలాల వాసులు నిరాశ చెందుతున్నారు. సదర్మాట్కు పలు పేర్లు.. పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మాట్ బ్యా రేజీ యాసంగి పంటలకు నీరు అందిస్తోంది. ఈ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు సరిపోదని, ప్రాజెక్టు స్థ లంలోని నాగమ్మ ఆలయం పేరును ఎంచుకోవా లని కోరుతున్నారు. ఖానాపూర్ మాజీ ఎంపీపీ డాక్టర్ జగన్నాథరావు కాలువ మరమ్మతుల్లో పాత్ర పోషించారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు కూడా ప్రతిపాదించారు. మార్పు చేస్తామని.. స్థానిక డిమాండ్ల మేరకు ప్రాజెక్టు పేర్లు నిర్ణయిస్తామని అధికార పార్టీ స్పష్టం చేసింది. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జుపటేల్ స్వర్ణ ప్రాజెక్టుకు నర్సారెడ్డి పేరు పెడతామని, సదర్మాట్కు ప్రత్యామ్నాయం పరిశీలిస్తామని ప్రకటించారు. మండల నాయకులు పార్టీ బాసులకు ఇప్పటికే విషయం తెలిపారు. పొన్కల్ గోదావరి నది వద్ద బ్యారేజీ సూచిక బోర్డు జేఏసీ ఏర్పాట్లు..మామడ: గోదావరిపై నిర్మించిన సదర్మట్ బ్యారేజీ పేరు మార్చాలని పొన్కల్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణంలో పొన్కల్, ఆదర్శనగర్, కమల్కోట్ గ్రామాల రైతులకు చెందిన 805 ఎకరాల వ్యవసాయ భూమి ముంపుకు గురైంది. భూములతోపాటు ఈ గ్రామాలకు చెందిన ఆరాధ్య నాగదేవత ఆలయం ముంపునకు గురైంది. బ్యారేజీ కింద ఖానాపూర్, కడెం మండలాలకు చెందిన పంట భూములకు సాగునీరు అందించేందుకు తమ భూములను త్యాగం చేశామని బ్యారేజీకి పొన్కల్ నాగదేవత బ్యారేజీగా నామకరణం చేయాలని కలెక్టర్కు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు వినత్రిపత్రాలు అందించారు. పేరు మార్చేవరకూ పోటారం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. -
ఉ(ఎ)త్తి పోతలేనా?
సారంగపూర్: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది. మండలంలో ఆలూరు, బీరవెల్లి గ్రామాల లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి. నిర్వహణ లేక 8 ఏళ్లుగా వృథాగా ఉన్నలిఫ్ట్ మరమ్మతులకు ప్రభుత్వం నిదులు విడుదల చేసింది. దీంతో రైతుల్లో సంతోషం కనిపించింది. కానీ మరమ్మతులకు కాంట్రాక్టులు ముందుక రావడం లేదు. దీంతో అన్నదాత ఆశలు ఆవిర్యాయి. 750 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమైంది. సెప్టెంబర్లో నిధులు...గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం బీరవెల్లి పథకానికి రూ.69.10 లక్షలు, ఆలూరు పథకానికి రూ.32.50 లక్షలు కేటాయించింది. ఈ నిధుల విడుదలతో ఆయకట్టు రైతుల్లో యాసంగి పంగల సాగుపై ఆశలు చిగురించాయి. సీజన్ నాటికి మరమ్మతుల పూర్తవుతాయని భావించారు. అయితే మరమ్మతులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు స్పందించకపోవడంతో పనులు మొదలు కాలేదు. దీంతో ఈ యంసగి ఆశలు కూడా ఆవిరయ్యాయి. మరమ్మతులు చేస్తే ఆయకట్టు స్థిరీకరణ..స్వర్ణనదిపై గత ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మించింది. దీంతో నీటి నిల్వలు పెరిగాయి. ఈ సంవత్సరం అధిక వర్షాలతో రెండు పంటలకు సరిపడా నీరు అందుబాటులో ఉంది. లిఫ్ట్లకు మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తెస్తే 750 ఎకరాలకు స్థిరమైన సాగునీరు లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం టెండర్లు పూర్తిచేసి మరమ్మతులు చేపట్టేలా చూడాలని కోరుతున్నారు. పునరుద్ధరిస్తే మేలు కొన్నేళ్లుగా ఆలూరు ఎత్తిపోతల పథకం పనిచేయక చిన్న, సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. బోరుబావులున్న రైతులకు డబ్బులు చెల్లించి సాగునీరు వినియోగించుకుంటన్నారు. అధికారులు స్పందించి ఎత్తిపోతలు పునరుద్ధరిస్తే చాలామేలు కలుగుతుంది. – రవి, రైతు, ఆలూరుసాగునీటి సమస్య తీరుతుంది.. ఎత్తిపోతల ద్వారా దాదాపు 300 ఎకరాల వరకు భూమలకు సాగునీరందుతుంది. అయితే బీరవెల్లి ఎత్తిపోతల పథకం 8 ఏళ్ల నుండి అలంకారప్రాయమే అయ్యింది. పాలకులు దృష్టిసారించకపోవడంతో ఆయకట్టు రైతుల సాగునీటి సమస్య తీరుతుంది. – ఇస్మాయిల్, బీరవెల్లికాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు.. ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన నుంచి నేటికి మూడుసార్లు టెండర్లు పిలిచాం. అయినా కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదు. పనులు చేపట్టలేకపోతున్నాం. టెండర్లు పూర్తయితే పనులను చేపట్టి ఆయకట్టుకు సాగునీరందిస్తాం. రైతుల కష్టాలు తీరుస్తాం. –మధుపాల్, ఏఈ, స్వర్ణప్రాజెక్టు -
ఆర్జీయూకేటీలో జాతీయ ఓటరు దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అనే నినాదంతో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇన్చార్జి వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రజా స్వామ్య వ్యవస్థలో యువత పాత్ర కీలకమని, నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని అన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ విద్యార్థులు, అధ్యాపకులతో ‘నిష్పక్షపాతంగా ఓటు వేస్తాం‘ అని ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఓటరుగా నమోదు చేసకోవాలని సూచించారు. ఫారం–6పై అవగాహన కల్పించారు. -
మురుగు గోదావరి
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో శ్రీజ్ఞాన సరస్వతీ దర్శనానికి వచ్చే భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడం ఆనవాయితీ. భక్తులు గోదావరిని పరమ పవిత్రంగా భావిస్తారు. నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, రోగాలు రావని నమ్ముతారు. కానీ, బాసర వద్ద గోదావరిలో స్నానం చేస్తే పాపాల మాట దేవుడెరుగు కానీ, రోగాలు ఖాయం. డ్రెయినేజీ నీటికన్నా అధ్వానంగా నది నీరు దుర్వాసన వస్తోంది. వసంత పంచమి సందర్భంగా వచ్చిన వేలాది మంది భక్తులు ముక్కు మూసకుని స్నానం చేశారు. ఇక చెత్త, చెదారం, వ్యర్థాలు స్నానఘట్టాలపైనే ఉన్నాయి. ఈ నీటిలో స్నానం చేయడానికి కొందరు భయపడి నెత్తిన చల్లుకున్నారు. కొందరు పక్కనే ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
‘పది’ విద్యార్థులకు ‘సాక్షి’ మెటీరియల్
లక్ష్మణచాంద: గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సరైనా స్టడీ మెటీరియల్ లేక ఇబ్బంది పడుతుంటారు. పదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉత్తమ స్టడీ మెటీరియల్ అందించాలని ‘సాక్షి’ యాజమాన్యం సంకల్పించింది. ఈమేరకు సోన్ మండలం న్యూవెల్మల్–బొప్పారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 57 మంది విద్యార్థులకు గణితం, భౌతికశాస్త్రం స్టడీ మెటీరియల్ను గురువారం ఉచితంగా అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్ మెటీరియల్ బాగుందని పది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ విద్యార్థులకు అందించిన సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో వీడీసీ అధ్యక్షుడు వేణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కళాశాల తనిఖీ
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాలను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి వెంకటేశ్వర్రావు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. శుక్రవారం కళాశాలలో అధ్యాపకులు–పోషకుల మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం విజయవంతం చేయాలని తెలిపా రు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సి పాల్ సరిత, అధ్యాపకులు శ్రీదేవి, రాజేశ్వర్, హమీద్, సంతోష్రెడ్డి, మోహన్, నాగరాజు, శ్రీనివాస్, నాజ్నీన్, రమేశ్, నరహరి, సత్యనారాయణ, రఘువీర్, ఆసిఫ్, బాపు, జాకబ్, సుభాష్, మంజూర్ పాల్గొన్నారు. -
భూఆక్రమణదారులపై చర్య తీసుకోవాలి
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామం కరిసెల గుట్ట సమీపంలోని ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని సదరు వ్యక్తులపై అధికారులు చర్య తీసుకోవాలని గురువారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నిర్మల్– స్వర్ణ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలి పారు. గ్రామానికి చెందిన 418, 419, 420, 408, 426, 427 సర్వే నంబర్లను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలం, గుట్టకు వెళ్లే దారిని ఆక్రమించుకుని సాగుచేస్తున్నారని తెలిపారు. ఆ భూములపై సర్వే చేయించడానికి గ్రామస్తులంతా కలిసి సర్వేయర్ను రప్పించే ఏర్పాట్లు చేయగా కొలతలు చేయవద్దని కోర్టు నుంచి స్టేఆర్డర్ తెచ్చినట్లు తెలిపారు. దీంతో కొలతలు చేసేందుకు వచ్చిన సర్వేయర్ వెనుదిరగడంతో గ్రామస్తులు ఆగ్రహించి రోడ్డుపై బైఠాయించి నిరస న వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. వెంట నే అధికారులు స్పందించి సదరు ప్రభుత్వ భూమి కొలతలు నిర్వహించి వాటిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చేరుకున్న ఎస్సై శ్రీకాంత్ ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. విషయం ఉన్నతాధికారుల కు వివరించాలని, వారు స్పందించకపోతే చట్టప్రకా రం వెళ్లాలని తెలిపారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు. -
జంతు గణనను పరిశీలించిన డీఎఫ్వో
సారంగపూర్: మండలంలోని కౌట్ల(బి) సెక్షన్ పరిధి లో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంతు గ ణనను జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా అధికా రులు ఇప్పటి వరకు చేపట్టిన జంతుగణన వివరాల ను డీఆర్వో నజీర్ఖాన్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే అడవిలో ఉన్న జీవజాతుల వివరాలు ఆరాతీశారు. ఇప్పటి వరకు ఎన్నిరకాల జంతువులు తారసపడ్డాయోనని అడిగి తెలుసుకున్నారు. గణన పక్కాగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అలాగే అడవుల పరిరక్షణపై దృష్టి సారించాలని తెలిపారు. వన్యప్రాణులను వేటాడేవారిని విడిచిపెట్టవద్దని, వేటాడితే వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అటవీ సంరక్షణ చర్యలు, వణ్యప్రాణి సంరక్షణ చట్టాలను వివరించారు. డీఎఫ్వో వెంట ఎఫ్ఆర్వో రామకృష్ణారావు, ఎఫ్బీవో వెన్నెల, సిబ్బంది ఉన్నారు. -
గిరిజన సంస్కృతి గొప్పది
ఆదిలాబాద్టౌన్/ఇంద్రవెల్లి: గిరిజనుల సంస్కృతి గొప్పదని, గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా జాతరలో భాగంగా గురువారం గిరిజన దర్బార్ నిర్వహించగా మంత్రి హాజరయ్యారు. నాగోబా ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గిరిజన దర్బార్లో ప్రసంగించారు. గత ప్రభుత్వం నాగోబా ఆలయాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ జాతరల అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించి శాశ్వత నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు. నాగోబా ఆలయాభివృద్ధికి రూ.22 కోట్లు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అటవీ పరిధిలోని గిరిజను సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. చట్టాలను గౌరవించాలని, అటవీశాఖ అధికారులు చిన్నపాటి పొరపాటు చేసినా వారి ఉద్యోగాలకు ముప్పు వస్తుందని తెలిపారు. ఏడుగురు నాగోబా ఆలయ పూజారులకు ధూపదీప నైవేద్యం కింద వేతనాలు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందజేశారు. కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు కాజల్సింగ్, మౌనిక, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆయా శాఖల అధికారులు, గిరిజ న సంఘాల నాయకులు, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావు, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం వంశ పెద్దలు మెస్రం కోసేరావు, హన్మంత్రావు, దాదారావు, మెస్రం వంశ ఉద్యోగులు మెస్రం శేఖర్బాబు, మెస్రం దేవ్రావు, మనోహర్, సోనేరావు తదితరులు పాల్గొన్నారు. దర్బార్లో వినతుల వెల్లువగిరిజన దర్బార్లో తొమ్మిది తెగల గిరిజనులు ఆయా సమస్యలపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా అటవీశాఖ అధికారులపైనే ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రోడ్ల నిర్మాణాలకు అనుమతులి వ్వడం లేదని తెలిపారు. పాదయాత్రగా వచ్చిన గిరి జనులు దర్బార్ ఎదుట నిరసన తెలుపగా ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వారిని సముదాయించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్తో పాటు పలు ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే అంశంపై సుప్రీం కోర్టుకు నిరాధారమైన అఫిడవిట్ అందించారని ఆరోపించారు. గిరి జన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్ను ఆ ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని, జిల్లా కేంద్రంలో ఉంటున్నవారికి సర్వే నంబర్ 72లో ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలునాగోబా జాతరకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఎటుచూసినా జాతర ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గిరిజన దర్బార్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గుస్సాడీ నృత్యాలు, చిన్నారుల ఆటాపాటలు అలరించాయి. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులు కొమ్ము నృత్యం చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వైద్యశిబిరం ఏర్పాటు చేసి అవసరమైనవారికి చికిత్స, మందులు అందించారు. డిప్యూటీ సీఎం వస్తారని..గిరిజన దర్బార్కు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని ప్రచారం జరిగింది. బుధవారం రాత్రి కేస్లాపూర్కు చేరుకున్న ఉపముఖ్యమంత్రి నాగోబాను దర్శించుకున్నారు. గురువారం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దర్బార్కు హాజరవుతారని అందరూ భావించినా ఆయన ఆసిఫాబాద్ పర్యటనకు వెళ్లిపోయారు. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి కూడా వస్తారని అనుకున్నా ఒక్క అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాత్రమే హాజరయ్యారు. -
వారసత్వ ఉత్సవం
రాజుల కాలంలోనూ పుర సంబురాలునిర్మల్: నిర్మల్ జిల్లా తన చరిత్రలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వేదవ్యాసుడు చదువులమ్మకు పురుడు పోసిన బాసర, బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన భావరి నివసించిన బాదన్కుర్తి నుంచి ఈ ప్రాంతం విలసిల్లింది. ఓరుగల్లు, గోల్కొండలా అభేద్య కోటలు, ప్రథమ భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఖిల్లాలు ఇక్కడి సంపద. నాటి ఉత్సవాల సంప్రదాయాన్ని పునరుజ్జీవనం చేస్తూ కలెక్టర్ అభిలాష అభినవ్ గతేడాది ప్రారంభించిన ‘నిర్మల్ ఉత్సవాలు’ ఐదు రోజుల వేడుకగా సంబరాలు సృష్టిస్తున్నాయి. చరిత్ర పునరుద్ధరణ..కోటలు, కొయ్యబొమ్మలు మాత్రమే కాదు, రాంజీసహా నేతృత్వంలో వెయ్యి మంది అమరుల త్యాగాలు నిర్మల్ గుర్తింపు. పక్క జిల్లాల్లో కూడా ఈ చరిత్ర తక్కువ తెలిసినప్పటికీ, పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. ఓరుగల్లు, ఎలగందల్, భువనగిరి లాంటి గుర్తింపు జిల్లాకు రావాలని డిమాండ్. ఉత్సవాల్లో చరిత్రకారులు, అధ్యాపకులు రోజూ ఈ గాధలను వివరిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.ధుత్సవాలు మరో రెండు రోజులు పొడిగించాలని స్థానికులు కోరుతున్నారు. విజ్ఞానం – వినోదం..ఉత్సవాలు చరిత్రకు మాత్రమే పరిమితం కాదు. ప్రభుత్వ పాఠశాలల చిన్నారుల నృత్యాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు ఆదరణ పొందుతున్నాయి. వెంగ్వాపేట్ విద్యార్థులు తయారు చేసిన బ్రెస్ట్ఫీడింగ్ పిల్లోలు, సహజ సానిటరీ ప్యాడ్లు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సైన్స్ ప్రయోగాలు, జాయింట్ వీల్ ఆటలు, ప్లే జోన్లు చిన్నారులను సంతోషపరుస్తున్నాయి. నిర్మ ల్ వంటకాలు, ఇప్పపువ్వు లడ్డూలు అందరూ ఆస్వాదిస్తున్నారు. వీకెండ్ వరకు పొడిగించాలివారం మధ్య ప్రారంభమైన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ వరకు కొనసాగితే మరింతమంది వస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఉత్సవాలు జిల్లా చరిత్ర ను, సంస్కృతిని ప్రపంచానికి చాటుతూ, యువతకు వారసత్వాన్ని అందిస్తున్నాయి. వసంతోత్సవం.. నిమ్మల రాజ్యంలో హోలీ వేడుకలు నిర్వహించేవారు. స్థానిక బంగల్పేట్ బంగల్చెరువు(వినాయకసాగర్) మధ్యలో గల వేదికలాంటి నిర్మాణం నాటి నర్తనశాలనే. హోలీ పండుగకు ముందు ఆరు రోజులు పురప్రజలు వీక్షించేలా నర్తకీమణుల నృత్యాలు, కళాప్రదర్శనలు నిర్వహించేవారు. ఉత్సవాల్లో చివరిరోజు రంగులకేళీగా హోలీ నిర్వహించేవారు. -
బస్సు.. ఆటో.. కాలినడక
తానూరు మండలం ఉమ్రి(కె) గ్రామానికి చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు బోరిగాంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు కాలినడకనే వెళ్తుంటారు. దాదాపు 2 కి.మీ. దూరం కాలినడకన పాఠశాలకు చేరుకుంటారు. పాఠశాలకు ఆలస్యమవుతుందని ఒక్కోసారి ఏమీ తినకుండానే వెళ్తామని విద్యార్థులు తెలిపారు. లోకేశ్వరం మండలం బాగాపూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే ఉంది. రాజురాలో ఉన్నత పాఠశాల ఉండడంతో గ్రామం నుంచి దాదాపు 15–20 మంది విద్యార్థులు రాజురాలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. అయితే గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో డబ్బులు పెట్టుకుని ఆటోలో వెళ్తున్నారు. భైంసాటౌన్: బస్సులు లేవు.. ఉన్నా వేళకు రావు.. వచ్చినా సీట్లు ఖాళీగా ఉండవు.. మహాలక్ష్మి కారణంగా నిలబడే స్థలం కూడా ఉండడం లేదు. విధిలేక.. డబ్బులు ఉంటే ఆటోలో.. లేకుంటే కాలి నడకే. ఇదీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలక వెళ్లే విద్యార్థుల పరిస్థితి. ఒకప్పుడు సరైనా రోడ్లు లేక మారుమూల గ్రామాలకు బస్సులు నడిపేవారు కాదు. అప్పట్లో బస్సులూ తక్కువే. కానీ రోడ్లు మెరుగయ్యాయి. బస్సుల సంఖ్య పెరిగింది. కానీ ఇప్పటికీ జిల్లాలో చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటుగా ఆటోలను మాట్లాడి బడికి పంపిస్తున్నారు. కొన్నిసార్లు ఆటోల్లోనూ పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని వెళ్లూ ప్రమాదాల బారిన పడిన సందర్భాలూ ఉన్నాయి. ఇంత చేసినా.. సకాలంలో బడికి వెళ్తామన్న భరోసా లేదు. జిల్లాలో ఇలా...జిల్లాలో నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపోలు ఉండగా, దా దాపు అన్ని మండలకేంద్రాలకు బస్సులు నడుపుతున్నారు. అయితే, కొన్ని మారుమూల గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. రహదారులు సరిగ్గా లేవన్న కారణంతో ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఆ టోలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఆటోలూ లేక కాలి నడకనే వెళ్తున్నారు. ఇంకా కొన్ని రూట్లలో బస్సులు ఉన్నా.. పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగించే ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులన్నీ ప్రయాణికులతో ఫుల్గా ఉంటున్నాయి. దీంతో కొ న్నిసార్లు డ్రైవర్లు బస్సు నిలపకుండానే వెళ్తున్నారు. ఒక్కోసారి నిలిపినా కూర్చునేందుకు సీటు లేక ని ల్చునే ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు ప్రయాణికుల రద్దీ మధ్య ఇబ్బందికరంగా ప్రయాణిస్తున్నారు. బస్సులు సైతం సకాలంలో రాక, సాయంత్రం ఇళ్లకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. అన్ని రూట్లలో బస్సులు... దాదాపు అన్నిరూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం. విద్యార్థుల కోసం ఇంకా అదనంగా గ్రామాలకు సర్వీసులు నడిపిస్తున్నాం. కొన్ని గ్రామాలకు మాత్రం ముందు నుంచి బస్సులు నడపడం లేదు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పాఠశాల సమయాల్లో నడుపుతున్నాం. – హరిప్రసాద్, డీఎం, భైంసా -
గెలిచే నాయకులకే ప్రాధాన్యత
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న నాయకులకే అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో బుధవారం బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. పార్టీ ఎవరికి టికెట్లు ఖరారు చేయలేదని, టికెట్ రానివారు నిరాశ చెందకుండా పా ర్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం 70మంది ఆశావహులు పార్టీ ఎన్ని కల ఇన్చార్జి అడ్లూరి శ్రీనివాస్కు దరఖాస్తులు అందజేశారు. మరో రెండు రోజులపాటు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ చిన్నారెడ్డి, కో కన్వీనర్ రవి పాండే, నాయకులు నారాయణ్రెడ్డి, గంగాధర్, రాము తదితరులున్నారు. -
మార్మోగిన సాయినామం
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలోని వీరాంజనేయ శివసాయి సమాజ్ జంగల్ హన్మాన్ ఆలయ 29వ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి, నందిపేట్కు చెందిన కేదర నందస్వామి, రాములు మహరాజ్, పండితులు రామకృష్ణశర్మ, శశిధర్శర్మ, మల్లేశ్ తదితరులు సాయిబాబా మూలవిరాట్టుకు మహాకుంభాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతులు, లక్ష్మీనారాయణుల కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. మహా పూర్ణాహుతి, అన్నపూజ నిర్వహించారు. లక్షకు పైగా భక్తులు హాజరు కాగా, ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక కళా సమాఖ్య ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టుడు, పల్లకీసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఆవరణలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన దుకాణాలు భక్తులతో కిటికిటలాడాయి. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్రాథోడ్ వేర్వేరుగా హాజరై పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొక్కుల ప్రదీప్, గుగ్గిల్ల రాజేందర్గౌడ్ వీరిని సన్మానించారు. -
టైగర్స్ ట్రోఫీ విజేత ‘ఏఆర్ హెడ్ క్వార్టర్స్’
నిర్మల్చైన్గేట్: పని ఒత్తిడిని తగ్గించి, శారీరక, మా నసిక ఉత్సాహాన్ని పెంచాలనే లక్ష్యంతో నిర్వహించిన ‘నిర్మల్ పోలీస్ టైగర్స్ ట్రోఫీ’ క్రికెట్ టోర్నమెంట్ పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రెండురోజులపాటు ఆహ్లాదకరంగా సాగింది. బుధవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఫైనల్ మ్యాచ్లో భైంసా సబ్ డివిజన్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ జట్ల మధ్య జరిగిన పోరులో ఏఆర్ హెడ్క్వార్టర్స్జట్టు విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకోగా, ఎస్పీ జానకీ షర్మిల ట్రోఫీని ప్రదానం చేశారు. భైంసా, నిర్మల్ ఏఎస్పీ లు రాజేశ్మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, సీఐ లు ప్రవీణ్కుమార్, కృష్ణ, ఆర్ఐలు రామ్నిరంజన్రావ్, రామకృష్ణ, ఎస్సైలు, ఆర్ఎస్సైలు ఉన్నారు. -
సత్వర న్యాయం అందించాలి
భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం జరి గేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణికి హాజరై భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామా ల నుంచి వచ్చిన ఏడుగురి నుంచి అర్జీలు స్వీకరించారు. వారి ఎదుటే సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. అనంతరం కు టుంబ వివాదాల పరిష్కారంలో భరోసా కేంద్రం కృషిని పరిశీలించారు. గత గ్రీవెన్స్లో వ చ్చిన ఫిర్యాదుల పరిష్కారస్థితి, పెండింగ్ ఫి ర్యాదుల పురోగతిని అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఏఎస్పీ రాజేశ్మీనా ఉన్నారు. -
ఇంటికే మేడారం ప్రసాదం
నిర్మల్టౌన్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లలేని వారి కోసం ఆర్టీసీ వారు ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నారు. నిర్మల్ బస్టాండ్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి రూ.299కు ఇంటి వద్దకే మహాప్రసాదాన్ని కార్గో ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను బుధవారం నిర్మల్ డిపోలో మేనేజర్ పండరి ఆవిష్కరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నవీన్కుమార్, స్టేషన్ మేనేజర్ ఏఆర్ రెడ్డి, వీజీ రెడ్డి, కార్గో డీఎం కిశోర్కుమార్, కంట్రోలర్లు శేఖర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. -
సీట్ల పంచాయితీ..!
నిర్మల్: నేడో, రేపో పురపోరుకు నగారా మోగనుండటంతో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో సీట్ల పంచాయితీ ముదురుతోంది. ఒక్కో వార్డులో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరుముగ్గురు బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. సీనియర్ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరికివారు తగ్గేదే లేదన్నట్లుగా ఉన్నారు. ఇందులో ఎవరికి టికెట్ ఇవ్వాలి, మిగతా వారిని ఎలా బుజ్జగించాలనే విషయంలో ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. అందరి అభ్యర్థనలు వింటూనే గెలుపుగుర్రాలను ఎంపిక చేయడంలో సదరు నేతలు బిజీబిజీగా ఉంటున్నారు. కులాలు, వర్గాలు, బలాల ప్రకారం ఆరా తీస్తూ.. ఏ ప్రకారం ఎవరికి సీటిస్తే గెలుస్తామన్న లెక్కలు వేస్తున్నారు. మరోవైపు చాలామంది కాంగ్రెస్, బీజేపీ ఆశావహులు తమకు టికెట్ రాకపోతే రెబల్గానైనా బరిలో దిగాలన్న యోచనలో ఉన్నారు. బరిలో నిలిచేందుకు పోటాపోటీ ఐదేళ్లలో రాజకీయాలు మారిపోయాయి. బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ పుంజుకోవడం ఇవన్నీ.. జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఇప్పుడు హాట్కేకుల్లా మారాయి. ప్రధానంగా నిర్మల్లో ఈ రెండు పార్టీల సీట్ల కోసం ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు ఉండటం గమనార్హం. భైంసాలో బీజేపీ, ఎంఐఎం నుంచి పోటీ చేయడానికి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఖానాపూర్లో కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ నుంచీ పోటీ చేయడానికి చాలామంది ఆసక్తిచూపుతున్నారు. కాంగ్రెస్లో చాలాకష్టం! అధికార కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ టికెట్ తీసుకోవడం చాలాకష్టంగా మారింది. ఆ పార్టీలో సీనియర్ నేతలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. నిర్మల్ మున్సిపాలిటీలో నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ లాంటి సీనియర్ నేతలున్నారు. వారికంటూ కొన్ని స్థానాలు ఇవ్వాలన్న లెక్కలూ పెట్టుకుంటున్నారు. మరోవైపు ఎలాగైనా నిర్మల్ బల్దియాను కై వసం చేసుకోవాలని కొంతకాలంగా మాజీ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి పక్కా ప్లాన్తో పనిచేస్తున్నారు. ఇప్పటికే వార్డులవారీగా తనకంటూ ఓ ప్యానల్నూ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఎవరిది పైచేయి అవుతుంది.. ఎవరి వర్గానికి కౌన్సిలర్ టికెట్లు వస్తాయనేది తేలడం లేదు. భైంసా కాంగ్రెస్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావుపటేల్, విఠల్రెడ్డి వర్గీయులు పోటీపడుతున్నారు. ఖానాపూర్లో మాత్రం ఎమ్మెల్యే బొజ్జుపటేల్ నిర్ణయమే ఫైనల్గా కనిపిస్తోంది. బీజేపీలో భిన్నంగా.. కాంగ్రెస్తో పోలిస్తే ఈసారి బీజేపీలో కౌన్సిలర్ ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడంతో పాటు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటడంతో పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగింది. నిర్మల్, భైంసాలో ఒక్కోవార్డు నుంచి నలుగురైదుగురూ పోటీపడుతున్నారు. బీజేపీలో సీనియర్ నేతలున్నా.. టికెట్ల కేటాయింపుల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు చెప్పిందే వేదమన్నట్లు కనిపిస్తోంది. నిర్మల్లో మహేశ్వర్రెడ్డి, భైంసాలో రామారావుపటేల్ చెప్పినవారికే కౌన్సిలర్ టికెట్లు వస్తాయన్న ప్రచారముంది. పార్టీ అధిష్టానం పరిశీలకులను పంపినా చివరకు వారు ఎవరిపేరు చెబితే అదే అన్నట్లుగా ఉంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ ప్రభావం చూపుతున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్లో దస్తీ వేసి.. పదేళ్లు అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ఖానాపూర్లో కొంత ప్రభావం చూపుతున్నా.. నిర్మల్, భైంసాల్లో మాత్రం నామమాత్రంగానే కనిపిస్తోంది. తప్పనిసరి బరిలో నిలువాలనుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ ఆశావహులు అక్కడ టికెట్ రాకపోతే బీఆర్ఎస్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం తమపార్టీ ఆశావహులకే టికెట్లు ఇస్తామని చెబుతోంది. -
నిర్మల్
‘వసంత’ వేడుకలు ప్రారంభం బాసర శ్రీజ్ఞాన సరస్వతీ క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనానికి నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఆదివాసీలు కడెం: ఉట్నూర్ మండల పర్యటనకు బుధవా రం వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను రాజ్గోండ్ సేవా సమితి నాయకులు కలిశారు. మండలంలోని మారుమూల మి ద్దెచింత గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, రోడ్డు, అంగన్వాడీ భవనం నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. రాజ్గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, నాయకులు భీంరావు, ఆత్రం మానిక్రావు పటేల్, చిన్నుపటేల్, అశోక్, నాగోరావు, తిరుపతి, గోవిందరావు తదితరులున్నారు. నిర్మల్చైన్గేట్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికను మహిళలే పోషించనున్నారు. ఇటీవల ప్రకటించిన మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో పురుషులకంటే 4,244 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ మ హిళలకు సంక్షేమ పథకాల పేరిట పెద్దపీట వేస్తూ ప్రచారానికి సిద్ధమవుతుండగా, బీఆర్ఎస్, బీజేపీలు మహిళలను ఆకట్టుకుని ఓట్లు సంపాదించుకోవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో సగం సీట్లూ వారికే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు 50శాతం సీట్లు కేటాయించారు. ఇవే కాకుండా మిగతా 50శాతం సీట్లలో జనరల్ స్థానాల్లో మ హిళలు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపోటముల ను ప్రభావితం చేస్తున్నారు. దీంతో వివిధ పార్టీల నాయకులు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తమ ప్రచార కార్యాచరణ చేపడుతున్నారు. పతుల స్థానంలో సతులు.. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని భావించి పలువురు భంగపడిన విషయం తెలిసిందే. అలాంటి చోట తమ స్థానంలో భార్య లేదా కుటుంబంలోని మహిళను బరిలో ఉంచాలని భావిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ఎజెండామూడుచోట్ల వారిదే పైచేయి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 1,67,015 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 81,372 మంది కాగా, మహిళా ఓటర్లు 85,616 మంది ఉన్నట్లు తేలింది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 4,244 మంది అధికంగా ఉన్నారు. దీంతో కౌన్సిలర్లు, చైర్మన్ బరిలో నిలువాలనుకునే వివిధ పార్టీల నాయకులు వారిని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ మహిళల కోసం ఇప్పటికే వివిధ పథకాలను అమలు చేస్తుండగా.. ఇది తమకు కలిసొస్తుందనే ఆశలో ఆ పార్టీ నాయకులున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున నిర్వహించే ప్రతీ సమావేశానికి మహిళా సంఘాల సభ్యులను ఆహ్వానిస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న మెప్మా గ్రూపు సభ్యులకు ప్రభుత్వం కూడా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తోంది. ప్రతీ మున్సిపాలిటీల్లో సుమారు 5వేల నుంచి 10వేలమంది మహిళా గ్రూపుల సభ్యులుంటారని అంచనా. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంమున్సిపాలిటీల వారీగా ఓటర్లు మున్సిపాలిటీ పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం నిర్మల్ 47,362 50,824 18 98,204 భైంసా 25,486 25,623 9 51,118 ఖానాపూర్ 8,524 9,169 0 17,693 -
క్యాన్సర్పై టీకాస్త్రం!
నిర్మల్చైన్గేట్: మహిళల్లో ఎక్కువగా వస్తున్న గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను కట్టడి చేసేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. ఇందుకోసం జిల్లాలోని 14ఏళ్లు నిండిన కిశోర బాలికలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పీహెచ్సీల వారీగా వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. బాలికల భవి ష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఖరీదైన ఈ వ్యాక్సిన్ను జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఇవ్వనుంది. జిల్లాలో కిశోర బాలికల సర్వే సర్వైకల్ క్యాన్సర్ను నియంత్రించే హెచ్పీవీ టీకా ను కిశోర బాలికలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా దీనిపై ఇప్పటికే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. వైద్య సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపున్న 7,684 మంది కిశోర బాలికలను గుర్తించారు. వారికి ఒక డోసు హెచ్పీవీ టీకా వేస్తే భవిష్యత్లో వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ము ప్పు తలెత్తకుండా ఉంటుందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. నివారణ చర్యలపై దృష్టి కిశోర బాలికల విషయంలో హార్మోన్ల మార్పులు జరిగే సమయంలో ఇన్ఫెక్షన్ సోకి క్యాన్సర్కు దారితీస్తుంది. చాలామంది ఈ వైరస్ను గుర్తించడంలో నిర్లక్ష్యం చేస్తారు. అండాశయం పొట్టలో ఉండటంతో లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. అందుకే ఈ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్గా పేర్కొంటారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవచ్చు. పొత్తి కడుపు ఉబ్బి నొప్పిగా ఉండటం, అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలుంటే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదిస్తే కట్టడి చేయవచ్చు. మహిళలను బాధిస్తున్న రోగాల్లో క్యాన్సర్ ఒకటి. చిన్నారుల భవిష్యత్ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకా ఇవ్వనున్నారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం జిల్లావ్యాప్తంగా బాలికలకు టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. మొదటి విడతలో 14–15 ఏళ్ల బాలికలకు వేస్తాం. అన్ని పీహెచ్సీల్లో టీకా ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే టీకా వేయడం ప్రారంభిస్తాం. ఈ టీకాతో ఎలాంటి సమస్యలు రావు. – రాజేందర్, డీఎంహెచ్వో మార్గదర్శకాల ప్రకారమే.. జిల్లాలో 14 ఏళ్లు నడిచే బాలికల గుర్తింపు సర్వే ముగిసింది. హెచ్పీవీ టీకాలు త్వరలో జిల్లాకు చేరే అవకాశముంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్పీవీ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర టీకాల మాదిరిగానే అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో టీకాలు వేసే కార్యక్రమం చేపడతాం. – నయనారెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రెండేళ్లలో ఆరోగ్య మహిళా క్లినిక్ల ద్వారా అందించిన సేవలు మొత్తం రిజిస్ట్రేషన్లు 22,800 రిఫర్ చేసినవి 943 క్యాన్సర్ స్క్రీనింగ్ ఓరల్ 4,714 బ్రెస్ట్ 4,674 సర్వైకల్ 801 క్యాన్సర్ నిర్ధారణ సర్వైకల్ క్యాన్సర్ 11 ఓరల్ క్యాన్సర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ 2 -
డిఫెన్సివ్ డ్రైవింగ్తో ప్రమాదాల నివారణ
నిర్మల్చైన్గేట్: రోడ్డు ప్రమాదాల నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ ఏకై క మార్గమని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డీజీపీ శివధర్రెడ్డి ప్రతిపాదించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరై ‘అరైవ్ అలైవ్’ నినాదాలు రాసిన గాలిపటాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించడంతో పాటు, రోడ్డుపై ప్రయాణించే ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు సాంకేతికతతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ ఉత్సవాలు భేష్.. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలు బాగున్నాయని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, వినూత్నంగా ఏర్పాటు చేసిన సమాచారాత్మక స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో పాల్గొన్న అధికారులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. పగలు వేడిగానే ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత చలి ప్రభావం మొదలవుతుంది. తెల్లవారుజామున అధికంగా ఉంటుంది.గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి నిర్మల్చైన్గేట్: గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభిన వ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ స మావేశ మందిరంలో వివిధ శాఖల అధికా రులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను వివరించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రముఖులను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించాలని పా ర్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. వేడుకల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యేవారికి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు పాల్గొన్నారు. రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్మల్చైన్గేట్: రంజాన్ మాసంలో ముస్లింల ప్రార్థనల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు, ము స్లిం మత పెద్దలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రంజాన్ నెలలో మసీదుల వద్ద నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నా రు. ప్రార్థన వేళల్లో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మసీదుల పరిసర ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని వివరించారు. మసీదుల పరిసర ప్రాంతాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటి వివరాలు తెలిపేందుకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామన్నారు. రంజాన్ పండుగ రోజు ఈద్గాలలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, షామియానాలు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, మైనారిటీ అధికారి మోహన్సింగ్, మత పెద్దలు పాల్గొన్నారు. -
ప్రొబేషనరీ ఐఎఫ్ఎస్ల పర్యటన
కడెం: కవ్వాల్ టైగర్జోన్ కోర్ ఏరియా నుంచి తరలించిన పాత మైసంపేట్ను, మండలంలోని ధర్మాజీపేట్ సమీపంలోని పునరావాస గ్రామన్ని నలుగురు ప్రొబేషనరీ ఐఎఫ్ఎస్లు మంగళవారం సందర్శించారు. శిక్షణలో భాగంగా రాంపూర్, మైసంపేట్ గ్రామాల తరలింపు, పునరావాసంలో భాగంగా గిరిజనులకు అందించిన ప్యాకేజీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పునరావాసంలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త గ్రామంలో ఇళ్లు, కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. వీరి వెంట కడెం, ఉడుంపూర్ ఎఫ్ఆర్వోలు గీతారాణి, ప్రకాశ్, ఆటవీశాఖ సిబ్బంది ఉన్నారు.వివరాలు తెలుసుకుంటున్న ప్రొబేషనరీ ఐఎఫ్ఎస్లు -
అభ్యసన సామర్థ్యాల సాధన
ఆట పాటలతో బోధన..నిర్మల్ఖిల్లా: గ్రామీణ విద్యార్థుల అభ్యసనను సరళతరం చేస్తూ ఆటపాటలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో సాగుతున్న బోధనకు ప్రశంసలు దక్కా యి. హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణలో జిల్లా జిల్లాఉపాధ్యాయుడు తన ప్రతిభతో అ క్కడివారిని ఆకట్టుకున్నారు. సర్కారుబడుల్లో చదువుతున్న విద్యార్థులు కృత్యాధార భోదనతో ఆశించి న అభ్యసన సామర్థ్యాలను సాధించే దిశగా పాఠశా ల విద్యాశాఖ ఇటువంటి కార్యక్రమాలను ఎస్సీఈ ఆర్టీ ఆధ్వర్యంలో చేపడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ వేదికగా ఈ నె ల 19, 20 తేదీల్లో ’బొమ్మల ఆధారిత బోధన’ (టా య్ బేస్డ్ పెడగాజీ)పై రెండు రోజుల శిక్షణ పూర్తయింది. గణితం, సైన్స్, భాషల సబ్జెక్టులను ఆసక్తికరంగా బోధించే పద్ధతులు శిక్షకులకు నేర్పారు. ఎల్లన్న పపెట్రీ ప్రదర్శన.. భైంసా మండలం వానల్పాడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మాదరి ఎల్లన్న రాష్ట్రస్థాయి శిక్షణ లో పాల్గొని, స్వయంగా తయారు చేసిన పపెట్రీ (తోలుబొమ్మలాట) నమూనా ప్రదర్శించారు. సంక్లిష్ట భావనలను ఆకర్షణీయంగా వివరించిన తీరు అధికారులు, నిపుణులు ప్రశంసించారు. 33 జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుల మధ్య ఆయన ప్రదర్శన ఆకట్టుకుంది. ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ తహసీన్ సుల్తానా, శ్రీనివాస్లతోపాటు అందరూ అభినందించారు. బొమ్మల బోధన ప్రయోజనాలు జిల్లా స్థాయిలో కొనసాగే కార్యక్రమాలు నిర్మల్ జిల్లా నుంచి శిక్షణ పొందిన ఎల్లన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈనెల 23 నుంచి ఆదిలాబాద్ డైట్ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను విస్తరించి, విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తాయి. -
‘పోలీస్ టైగర్స్ ట్రోఫీ’ ప్రారంభం
నిర్మల్టౌన్: పోలీస్ సిబ్బందిలోని పని ఒత్తిడిని తగ్గించి శరీరాకంగా మానసికంగా ఉత్సాహం పెంచేందుకు ‘నిర్మల్ పోలీస్ టైగర్స్ ట్రోఫీ‘ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎస్పీ జానకీషర్మిల మంగళవారం పోటీలను ప్రారంభించారు. నిర్మల్ సబ్ డివిజన్, భైంసా సబ్ డివిజన్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు చెందిన మూడు పోలీస్ జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతోపాటు, పరస్పర సమన్వయం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. విధి నిర్వహణతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ టోర్నమెంట్ రెండు రోజులు కొనసాగుతుందన్నారు. ఫైనల్ మ్యాచ్ బుధవారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ రాజేశ్ మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, మూడు జట్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
మృత్యుంజయులు.. పూజలు చేసి.. పులకించి.. మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతరకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. మంగళవారం వేలసంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలుచేసి మొక్కులు చెల్లించుకున్నారు. బాసరకు ‘వసంత’ శోభ బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆల యం వసంత పంచమి వేడుకలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 23వరకు అంగరంగ వై భవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. IIలోu వసంత పంచమి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ బాసర: బాసరలో బుధవారం నుంచి మూడు రోజులపాటు వసంత పంచమి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ జానకీషర్మిల, భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా, ఆలయ ఈవో అంజనాదేవితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూలైన్లు, గోదావరినది వద్ద పోలీసు భద్రత, సీసీ కెమెరాలు పరిశీలించారు, భక్తులకు ఇబ్బందులు, కలుగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కా కుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించా రు. ఆలయంలో వృద్ధులకు, అక్షరాభ్యాసం కో సం, సర్వదర్శనాని ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు. వీరివెంట సీఐ కిరణ్కుమార్ ఎస్సై నవనీత్రెడ్డి, ఆలయ సిబ్బంది ఉన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం కుప్టి గ్రామస్తులంతా ఒకే కుటుంబంలా వ్యవహరిస్తారు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా.. శుభకార్యమైనా గ్రామ పెద్దలు ముందుండి మంచీ చెడు చూసుకుంటారు. ఆ క్రమంలోనే గ్రామంలోని బాలుడు అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. గ్రామపెద్దలు, ఇటీవల ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి కారులో వెళ్లారు. బాలుడిని పరామర్శించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తిరిగి వస్తుండగా.. భైంసా పట్టణ శివారులోని సాత్పూల్ వంతెన వద్ద లారీలోని ఐరన్డోమ్ రూపంలో మృత్యువు దారికాచింది. చీకట్లో ఎదురుగా వస్తున్న లారీని దాటేసే క్రమంలో ఐరన్డోమ్ను ఢీకొట్టింది. కారు పైభాగం నుజ్జునుజ్జయింది. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎడమవైపు ఉన్న ఎయిర్బ్యాగ్ తెరుచుకోవడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన భైంసా పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. – భైంసాటౌన్/కుభీర్కుభీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన బాలుడు సిద్ధార్థ్ అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని పరామర్శించేందుకు కుప్టి సర్పంచ్ పోతుగంటి గంగారాం, ఉపసర్పంచ్ గుండోల్ల శ్రీనివాస్(చిన్ను), భోస్లే భోజరాం పటేల్, కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న, సిందే ఆనంద్రావు, కుభీర్కు చెందిన బొ ప్ప వికాస్ కారులో సోమవారం ఉదయం హైదరా బాద్ వెళ్లారు. బాలుడిని పరామర్శించి అతడి తల్లి దండ్రులకు ధైర్యంచెప్పారు. సాయంత్రం స్వగ్రామానికి బయల్దేరారు. అర్ధరాత్రి తర్వాత భైంసా– నిర్మల్ రహదారి మీదుగా భైంసా పట్టణ శివారులోని సాత్పూల్ వంతెన వద్దకు చేరుకున్నారు. 20 నిమిషాలయితే ఇంటికి.. మరో 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే గ్రామానికి చేరుకునేవారు. కానీ ఇరుకుగా ఉన్న సాత్పూల్ వంతెనపై ఎదురుగా లారీ ఓ పెద్ద ఐరన్ డోమ్తో నిర్మల్ వైపు నుంచి భైంసా వైపు వెళ్తోంది. చీకట్లో ఐరన్ డోమ్ కనిపించకపోవడంతో వీరి కారు వేగంగా వెళ్లింది. డోమ్ కారుకు తాకి.. కుడివైపు భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో డ్రైవర్ బొప్ప వికాస్(25)తోపాటు వెనుక సీట్లో ఉన్న భోస్లే భోజరాం పటేల్(40), కొడిమెల రాజన్న(58), బోయిడి బాబన్న(70) అక్కడికక్కడే మృతిచెందారు. ఐరన్ డోమ్కు ఎలాంటి సూచిక ఏర్పాటు చేయకుండా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వంతెనపై వీధి దీపాలు కూడా వెలగకపోండం మరో కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. హుటాహుటిన సహాయక చర్యలు.. ప్రమాదం జరిగిన వెంటనే భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ సాయికుమార్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా నుజ్జునుజ్జయిన కారు నుంచి మృతదేహాలను వెలికి తీయించారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు. స్థానికులు సైతం సహాయకచర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలను భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. సర్పంచ్ గంగారాంకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు.. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, కుప్టి గ్రామస్తులు హుటాహుటిన భైంసా ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో వారి రోదనలు మిన్నంటాయి. ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ జానకీషర్మిల మంగళవారం ఉదయం భైంసాకు చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసు, ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ముగ్గురూ ఊరి పెద్దలు.. కుప్టి గ్రామానికి చెందిన భోజరాం పటేల్తోపాటు కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న, సిందే ఆనంద్రావు గ్రామంలో పెద్ద మనుషులుగా వ్యవహరిస్తుంటారు. అనుకోని ప్రమాదం ముగ్గురినీ కబళించింది. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. భోజరాంపటేల్ గ్రామంలోనే ఉంటూ భైంసా పట్టణంలో వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఘోర రోడ్డు ప్రమాదం తమ ఇంటి పెద్దలలను బలిగొనడంతో ఆ కుటుంబాల రోదన వర్ణనాతీతం. ఇక తాజాగా సర్పంచ్గా ఎన్నికై న గంగారాం పేద కుటుంబానికి చెందినవారు. ఇటీవల గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో గ్రామపెద్దలు ముందుండి అతన్ని గెలిపించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు. పెళ్లి కావాల్సిన ఇంట.. కుభీర్కు చెందిన బొప్ప చంద్రబాయి–నాగలింగం దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు వినోద్ ఆర్మీలో పనిచేస్తుండగా, మూడో కుమారుడు వివేక్ డిగ్రీ చదువుతున్నాడు. రెండో కుమారుడైన వికాస్మిషన్ భగీరథలో వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఖాళీ సమయంలో తన సొంతకారును అద్దెకు నడుపుతున్నాడు. సోమవారం కుప్టి గ్రామస్తులతో హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి వస్తుండగా రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో చావు మేళం మోగింది. పచ్చని పందిరితో కళకళలాడాల్సిన చోట విషాదం అలుముకుంది. ఘటన స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలుఇంత పెద్ద ప్రమాదం జరిగినా కారులో ప్రయాణిస్తున్న సిందే ఆనంద్రావు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ముందు సీట్లో కూర్చున్న ఆనంద్రావు ఎయిర్బ్యాగ్ ఓపెన్ కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. వెనుక సీటులో ఎడమవైపు కూర్చున్న శ్రీనివాస్కు కూడా ఎలాంటి గాయాలు కాలేదు. -
జిల్లాకు మరో స్టేడియం..!
భైంసాటౌన్: జిల్లా క్రీడాకారులకు సీఎం రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. అన్ని వసతులతో కూడిన స్టేడియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎంను కోరారు. ఈ మేరకు స్పందించిన సీఎం జిల్లాకు మరో స్టేడియం మంజూరు చేస్తామని చెప్పారు. దీంతో ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్తోపాటు అన్ని వసతులు, హంగులతో కూడిన కొత్త స్టేడియం ఏర్పాటు కానుంది. ఇందుకు అవసరమైన స్థలాన్ని అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే చించోలి(బి) వద్ద ఐదెకరాల స్థలం అందుబాటులో ఉండగా, 10 నుంచి 15 ఎకరాల స్థలం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు స్థలం పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. రెగ్యులర్ అధికారి లేక.. జిల్లాలో క్రీడల శాఖకు రెగ్యులర్ అధికారి కరువయ్యారు. బాక్సింగ్ కోచ్కు బాధ్యతలు అప్పగించడంతో ఆయనే జిల్లా యువజన సంక్షేమ, క్రీడల శాఖ అధికారిగా కొనసాగుతున్నారు. కాగా, జిల్లాలో క్రీడల నిర్వహణతోపాటు, క్రీడా మైదానాలపై సరైన పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా స్టేడియాల్లో కోచ్ల నియామయకం లేక జిల్లాలో క్రీడాకారులు నష్టపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెగ్యులర్ అధికారిని నియమించి క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కోచ్లను నియమిస్తాం.. భైంసా, ఖానాపూర్ మినీ స్టేడియాల్లో కోచ్లు లేక క్రీడాకారులకు అందుబాటులోకి రాలేదు. త్వరలోనే స్టేడియంలలో కోచ్లను నియమిస్తాం. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులకు శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటాం. చించోలి(బి) వద్ద మరో స్టేడియం మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన స్థలం పరిశీలిస్తున్నాం. – శ్రీకాంత్రెడ్డి, డీవైఎస్వో, నిర్మల్ఉన్నవి నిరుపయోగం... ఇదిలా ఉండగా, ఇప్పటికే మండలానికి ఒక స్టేడియం కింద గత ప్రభుత్వం ముధోల్ నియోజకవర్గంలోని భైంసా, ఖానాపూర్లో, నిర్మల్ నియోజకవర్గంలో చించోలి(బి) వద్ద మినీ స్టేడియం మంజూరు చేసింది. వీటిలో భైంసా, ఖానాపూర్లలో స్టేడియం నిర్మాణాలు పూర్తి చేసుకోగా, ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫలితంగా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికీ ఈ స్టేడియాలు క్రీడాకారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. -
పుర పీఠాలపై గురి!
నిర్మల్లో బీసీ మహిళ.. జిల్లా కేంద్రమైన నిర్మల్ మున్సిపాలిటీలో ఈసారి జనరల్ మహిళ చైర్పర్సన్ కానుంది. గత రెండు పర్యాయాలు బీసీ జనరల్ రాగా, ఈసారి జనరల్ మహిళను రిజర్వేషన్ వరించింది. గతంలో అయ్యన్నగారి భూలక్ష్మి, అప్పాల అనురాధ మహిళ చైర్పర్సన్లుగా పనిచేశారు. నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ఎంఐఎం పూర్వవైభవం సాధిస్తామంటోంది. ఇక్కడ బీఆర్ఎస్ నామమాత్రంగా ఉంది. కాంగ్రెస్లో గతంలో చైర్మన్గా చేసిన అప్పాల గణేశ్చక్రవర్తి వర్గానికే అవకాశం ఇస్తారన్న ప్రచారం ఉంది. నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి మద్దతు ఆయనకు ఉండటంతో గణేశ్చక్రవర్తి వర్గానికే చైర్పర్సన్ అవకాశం వస్తుందంటున్నారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు చైర్పర్సన్ స్థానంపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. ఎవరు పోటీ పడుతున్నారనే క్లారిటీ కూడా నేతల్లోనే కనిపించడం లేదు. పలువురు సీనియర్ కౌన్సి లర్లు ఆశిస్తున్నా.. ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఏదీ తేల్చడం లేదన్న వాదన వినిపిస్తోంది. నిర్మల్: మున్సిపల్ ఎన్నికలకు వేగంగా పావులు కదులుతున్నాయి. ఓటరు జాబితా ఫైనల్ కావడమే ఆలస్యం వార్డులు, చైర్మన్ స్థానాల రిజర్వేషన్లూ ఖరారు చేసేశారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదలైంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల రిజర్వేషన్లు జిల్లా కలెక్టరేట్లో ప్రకటించారు. చైర్మన్ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్రస్థాయిలో వెల్లడించారు. దీంతో కౌన్సిలర్ పోటీ చేయాలనుకునే ఆశావహులు రిజర్వేషన్లు కలిసి రావడంతో హర్షం వ్యక్తంచేస్తుండగా, కలిసిరాని వారు ఉసూరుమంటున్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ బరిలో నిలిచేదెవరన్నదే చర్చనీయాంశంగా మారింది. మూడు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల పరిస్థితి విభిన్నంగా ఉంది. భైంసా అన్ రిజర్వుడ్.. పదేళ్లపాటు బీసీ మహిళ రిజర్వేషన్ ఉన్న భైంసా చైర్మన్ స్థానం ఈసారి అన్రిజర్వుడ్ అయ్యింది. గత రెండు పర్యాయాలు ఎంఐఎంకు చెందిన సబియాబేగం చైర్పర్సన్గా కొనసాగారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత భైంసాలోనే వరుసగా ఎంఐఎం బల్దియాను దక్కించుకుంటోంది. ఈసారి జనరల్ కావడంతో పోటీ బలంగా ఉండనుంది. ఎంఐఎం నుంచి సీనియర్నేత జాబీర్అహ్మద్ బరిలో నిలువనున్నారు. గతంలో తొమ్మిది స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈసారి చైర్మన్ స్థానంపై కన్నేసింది. ఈ పార్టీ నుంచి గతంలో ఓసారి చైర్మన్గా చేసిన గంగాధర్తోపాటు యువనేత తూమోల్ల దత్తు పోటీ పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. గత పాలకవర్గంలో ఖాతా కూడా తెరవని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈసారి కొన్ని స్థానాలైనా గెలుస్తామంటున్నాయి. -
కోడ్ కూయక ముందే మొదలయ్యేనా?
భైంసాటౌన్: మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకం కింద నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు నిర్మల్, భైంసా, ఖానాపూర్కు రూ.15 కోట్ల చొప్పున రూ.45 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఇదివరకే పనులు గుర్తించి, ప్రతిపాదనలు పంపారు. పరిపాలన అనుమతులు జారీ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. పనులతో ప్రయోజనం.. పట్టణాల్లో చాలావరకు కాలనీల్లో సీసీ రోడ్లు అధ్వానంగా మారాయి. మిషన్ భగీరథ పైప్లైన్ పనులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలపై కల్వర్టులు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల నాసిరకం పనులు చేపట్టడంతో కంకర తేలి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇరుకు రోడ్లు ఇబ్బందిగా మారాయి. గుంతల రోడ్లకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.. ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో గతంలో ప్రతిపాదించిన పనులతోపాటు కొత్తగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కోడ్ గండం..! పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. ఆన్లైన్లో టెండర్లు స్వీకరించనున్నారు. అయితే రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుందన్న ప్రచారం నేపథ్యంలో అభివృద్ధి పనులు మొదలవుతాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. దీంతో పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. అంతేగాక, ఎన్నికల అనంతరం కొలువుదీరే కొత్త పాలకవర్గం ఈ పనులను చేపడుతుందా.. మళ్లీ కొత్తగా ప్రతిపాదిస్తుందా అన్న సందేహాలూ ఉన్నాయి. -
నిర్మల్
తేలనున్న వన్యప్రాణుల లెక్క రూ.2.7 కోట్ల చెక్కు అందజేత నిర్మల్టౌన్: మహిళా శక్తి సంబురాల్లో భాగంగా పట్టణానికి చెందిన మహిళా స్వయం సహాయ సంఘాలకు రూ.2.72 కోట్ల చెక్కును నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఎమెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సోమవారం అందజేశారు. మహిళలు వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. నిర్మల్టౌన్: జిల్లా వన్యప్రాణుల గణన ఈనెల 20(మంగళవారం) నుంచి 25వ తేదీ వరకు జరుగనుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్–2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వన్యప్రాణులను లెక్కించున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆదేశాల ప్రకారం నాలుగేళ్లకు ఒకసారి ఈ గణన చేపడుతున్నారు. ఈసారి గణన కచ్చితంగా నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. శాకాహార, మాంసాహార జంతువుల గుర్తింపు.. సర్వేలో శాకాహార, మాంసాహార జంతువులను ప్రత్యక్షంగా లెక్కిస్తారు. చిరుతలు, పులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు, నక్కలు, కొండ గొర్రెలు, దుప్పులు, చుక్కల దుప్పులు, కృష్ణ జింకలు, కుందేళ్లు, నెమళ్లు, అడవికోళ్లు వంటి జంతువులు లెక్కించనున్నారు. శాకాహార జంతువుల లెక్కింపు కోసం ప్రతీ బీట్లో 2 కి. మీ ట్రాన్సెక్ట్ లైన్లు ఏర్పాటు చేస్తారు. మూడు రోజులు రోజుకు 2 కి. మీ చొప్పున పాటిస్తారు. మాంసాహార జంతువల గణన కోసం ట్రయల్ మెథడ్లో 15 కిమీ పరిధిలో మూడు 5 కి.మీ పాత్లు ఉపయోగిస్తారు. అడవిలోని పాదముద్రలు, వాగుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అదనంగా, ప్రతి 400 మీ. వద్ద వృక్షజాతులు, గుల్మలు, పొదలు, కలుపు మొక్కలు, గడ్డి జాతులు, ఎండుగడ్డి, ఖాళీ ప్రదేశాల శాతాన్ని నమోదు చేస్తారు. 60 మంది వలంటీర్లతో గణన.. వన్యప్రాణుల గణన సాహసోపేత కార్యం. జంతువుల నివాస ప్రదేశాల్లో కదలికలు, అవశేషాలు, పాదముద్రలు, మల మూత్రాలు, వెంట్రుకలు సేకరణ అవసరం. శిక్షణ పొందిన నిపుణులు దీన్ని చేయగలరు. ఈ సర్వేలో స్థానిక ప్రజలు, జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులకు అవకాశం కల్పించారు. గత నవంబరు వరకు ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించి, అర్హులైన 60 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. జిల్లా అటవీ విస్తీర్ణం.. జిల్లా అటవీ విస్తీర్ణం 1211.18 చ.కి.మీ. (32.43 శాతం). నిర్మల్, ఖానాపూర్ డివిజన్లు ఉన్నాయి. నిర్మల్ డివిజన్లో నిర్మల్, మామడ, దిమ్మదుర్తి, భైంసా రేంజ్లు, ఖానాపూర్ డివిజన్లో ఖానాపూర్, పెంబి, కడెం, ఉడుంపూర్, తాండ్ర రేంజ్లు ఉన్నాయి. మొత్తం 9 రేంజ్లు, 121 బీట్లు ఉన్నాయి. ప్రతీ బీట్లో ఇద్దరు లేదా ముగ్గురు బృందాలు. ఒకరు రేంజ్ ఆఫీసర్ లేదా సెక్షన్ ఆఫీసర్తో ఇద్దరు విద్యార్థులు ఉంటారు. ట్రాప్ కెమెరాలు కూడా పనిచేస్తాయి. విరుద్ధ దిశలో ఏర్పాటు చేసి జంతు కదలికలు రికార్డు చేస్తాయి. మొబైల్ యాప్లో డేటా..ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్లో డేటాను ఫొటోలతో అప్లోడ్ చేస్తారు. ఎదుర్కొన్న జంతువులు, అవశేషాలు, పాదముద్రలు, మల విసర్జనలు, చెట్లపై కాలిగోర్లు, వెంట్రుకలు సేకరించి నమోదు చేస్తారు. యాప్లో ఆహార శైలి, ఆరోగ్య పరిస్థితి వంటి వివరాలు జాతీయ వన్యప్రాణి సంస్థ ఆధారంగా లెక్కలు వేసి అధికారిక ప్రకటన చేస్తారు.అడవిలో ఇన్స్పెక్షన్ చేస్తున్న అటవీ అధికారులువన్యప్రాణుల వృద్ధికి కీలకం జిల్లాలో ప్రస్తుత జంతువుల వివరాలు, ఆహార శైలి, ఆరోగ్య పరిస్థితిలను అంచనా వేసేందుకు సర్వే అత్యంత కీలకం. దీని ఆధారంగా వన్యప్రాణుల రక్షణ అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఏ జంతువుల సంఖ్య పెరుగుతుందో అంచనా వేయొచ్చు. ఈసారి సర్వేలో వలంటీర్లుగా స్టూడెంట్స్, పర్యావరణ, జంతు ప్రేమికులు పాల్గొంటారు. – సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఎఫ్వో -
వసంత పంచమికి ఏర్పాట్లు చేయండి
బాసర : బాసరలో ఈ నెల 23న నిర్వహించే వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్తో కలిసి ఆలయ ఈవో కార్యాలయంలో అర్చకులు, అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించి, భక్తుల సంఖ్యను అంచనా వేస్తూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాన్ని పూలు, లైటింగ్తో అలంకరించాలన్నారు. రద్దీని నియంత్రిస్తూ దర్శనాలకు ఏర్పాటు చేయాలి. క్యూలైన్లలో చిన్నారులకు పాలు, పండ్లు అందించాలన్నారు. తాగునీరు, బయోటాయిలెట్లు, చెత్తబుట్టలు, ప్రసాదం, బేబీ ఫీడింగ్ గదులు, సీసీ కెమెరాలు సిద్ధం చేయాలని తెలిపారు. అంబులెన్స్లు, అగ్నిమాపక యంత్రాలు, వైద్య శిబిరాలు, హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి ఘాట్లు శుభ్రంగా ఉంచాలి.. దేవాలయం, గోదావరి పుష్కర ఘాట్లు నిరంతర పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. సీ్త్ర–పురుషులకు వేర్వేరుగా దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలన్నారు. ఘాట్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద ఆలయాకి వెళ్లే దారి సూచన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక బస్సులు నడపాలని తెలిపారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు.. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ సరస్వతి దేవి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అక్షరాభ్యాస కార్యక్రమాలకు పురోహితులను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు కలెక్టర్కు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమావేశంలో భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, దేవాలయ ఏఈవో సుదర్శన్గౌడ్, సర్పంచ్ వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన నిర్మల్ ఉత్సవాలు
చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలో సందడి మొదలైంది. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్మల్ ఉత్సవాలను జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈనెల 23వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాల్లో 45 స్టాల్స్ ఏర్పాటు చేశారు. చిన్నారుల నృత్య ప్రదర్శన.. ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు నిర్మల్ చరిత్రను తెలిసేలా నృత్యాలు ప్రదర్శించారు. పలు పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. నోరూరిస్తున్న రుచులు.. ఇందిర మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డూ, మక్క వడలు పట్టణ ప్రజలు నోరూరిస్తున్నాయి. స్థానిక వ్యాపారులు కూడా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు తినుబండారాలు రుచి చూశారు. -
నిర్మల్ ఉత్సవాలకు స్వాగతం
నిర్మల్: నేటితరానికి తన చరిత్రను చెబుతూ, తనదైన సంస్కృతిని చాటుతూ.. వినోదదం పంచేందుకు ‘నిర్మల్’ సిద్ధమైంది. వారసత్వ ఉత్సవానికి పట్టణం ముస్తాబైంది. వరుసగా రెండో ఏడాది నిర్మల్ ఉత్సవాలు సోమవారం నుంచి ఐదు రోజులపాటు వేడుకలు జరుగనున్నాయి. కలెక్టర్ అభిలాషఅభినవ్ గతేడాది ప్రారంభించిన ‘నిర్మల్ ఉత్సవాల’ వారసత్వ పరంపరను ఈసారీ కొనసాగిస్తున్నారు. స్థానిక ఎన్టీఆర్ మినీస్టేడియంలో వేడులకు ఏర్పాట్లు చేశారు. చారిత్రక వారసత్వ వేడుకగా.. నిర్మల్కు వందలఏళ్ల చరిత్ర ఉంది. శత్రువుకు వెన్నుచూపకుండా పోరాడిన పోరాటపటిమ ఉంది. ఇక్కడి గాలిలో ఇప్పటికీ రాంజీసహా వెయ్యిమంది అమరవీరుల ఉచ్వాస, నిశ్వాసలున్నాయి. ఈ మట్టిలో అణువణువునా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు దాగిఉన్నాయి. ఇక్కడి కొయ్యబొమ్మలు, కోటబురుజులు వందలఏళ్ల చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ వారసత్వాన్ని కళ్లకు కడుతూనే ఉన్నాయి. తెలంగాణ గడ్డపై ఒక ఓరుగల్లు, ఒక గోల్కొండలు ఎలా చారిత్రక కట్టడాలుగా నిలిచాయో.. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మల్గడ్డపై ఇప్పటికీ అరుదైన, అద్భుత నిర్మాణాలూ ఉన్నాయి. గతేడాది నుంచి మన ఘనతను ముందుతరాలకు చాటే ప్రయత్నం ప్రారంభమైంది. ఈసారి ఐదురోజుల వేడుకగా.. నిర్మల్ ఉత్సవాలు ఈసారి ఐదురోజులు కొనసాగనున్నాయి. గతేడాది జనవరిలోనే 5, 6, 7 తేదీల్లో చేపట్టగా, ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో మరో రోజు పొడిగించారు. ఈనేపథ్యంలో ఈసారి ఐదురోజులు నిర్వహించాలని నిర్ణయించారు. తొలిరోజు సోమవారం సాయంత్రం ఉత్సవాలను ప్రారంభించనున్నారు. మిగిలిన నాలుగురోజులు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇందులో సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకూ చరిత్ర పరిచయంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. వీటితో స్థానిక మహిళా సంఘాలు చేసిన ఆహార పదార్థాలు, ఫుడ్స్టాల్స్, పిల్లలకు ఆటలు, వివిధ ప్రదర్శనలు ఉంటాయి. విజయవంతం చేద్దాం.. నిర్మల్చైన్గేట్: జిల్లా వాసులందరం నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని, జిల్లాపేరును రాష్ట్రస్థాయిలో నిలపాలని కలెక్టర్ అభిలాషఅభినవ్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనల వేదిక, స్టాల్స్, మరుగుదొడ్లు, సెల్ఫీ పాయింట్స్, పార్కింగ్, చిన్నపిల్లల ఆటవిడుపు ప్రదేశం, ఎల్ఈడీ తెరలు పర్యవేక్షించారు. సందర్శకులకు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఏవో అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వం దృష్టికి వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలు
● ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి నిర్మల్ రూరల్: వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి తెలిపారు. తన నివాసంలో టీఎస్ పెటా నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వ్యాయామ విద్యను అందించి క్రీడానైపుణ్యాలు పెంచాలని సూచించారు. ఇందులో సంఘ జిల్లా అధ్యక్షుడు అంబాజీ, సెక్రెటరీ డేవిడ్ బెన్హర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారావు, వైస్ ప్రెసిడెంట్ రాంజీ, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నియమాలతో ప్రాణాలు సురక్షితం
నిర్మల్టౌన్: రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రాణాలు సురక్షితమని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘‘అరైవ్ అలైవ్’’ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు ప్రమాదకర ప్రాంతాల అవగాహన దినం (బ్లాక్ స్పాట్స్) గా నిర్వహించారు. బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రోడ్డు మలుపులు, గుంతలు, సిగ్నల్ లేని ప్రాంతాలపై సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లాలోని గుర్తించబడిన ప్రమాదకర రహదారి ప్రాంతాల్లో బాధిత కుటుంబాలు, ప్రయాణికులు, స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి, ప్రమాదాలకు కారణాలు, జాగ్రత్తలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, సీట్బెల్ట్ వాడకం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్ర మాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యార్థులకు కార్పొరేట్ లుక్
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే లక్షల మంది విద్యార్థులకు రా నున్న 2026–27 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 22 రకాల వస్తువులతో కూడిన స్కూల్, హాస్టల్ కిట్లు అందజేయనుంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ బడుల విద్యార్థులూ సమగ్రంగా సన్నద్ధంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం దక్కనుంది. ప్రాథమిక కసరత్తు పూర్తి.. ఈ కిట్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తయింది. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల స్కూల్, హాస్టల్ కిట్లలో చేర్చే వస్తువులు, వాటి కొ నుగోలు విధానాలు (ప్రొక్యూర్మెంట్)పై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడం, చదువుపై ఆసక్తిని మరింతగా పెంపొందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కార్పొరేట్ లుక్తో విద్యార్థులు.. ఇకపై ప్రభుత్వ బడి పిల్లలంటే కేవలం పుస్తకాల సంచి మాత్రమే కాదు.. మెడలో టై, ఐడీ కార్డు, కాళ్లకు మెరిసే బూట్లతో ప్రైవేట్ స్కూ ల్ పిల్లలకు దీటుగా కనిపించనున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వా సం పెంచి, పాఠశాలల హాజరు శాతా న్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులూ కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల మాదిరిగా స్కూల్ బ్యాగ్, బూట్లు, టై, ఐడీ కార్డు వంటి అన్ని సౌకర్యాలతో బడికి వెళ్లాలన్న ఆలోచనతో ఈ కిట్ల రూపకల్పన జరిగింది. బడులను ఆధునికంగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, డ్రాప్అవుట్లను తగ్గించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది. స్కూల్ కిట్లో ఉండేవి ఇవే.. స్కూల్ కిట్ (పాఠశాల విద్యార్థులకు): పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, మూడు జతల ఏకరూప దుస్తులు(యూనిఫాం), నాణ్యమైన స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డు మరియు పెన్సిళ్ల సెట్ ఉంటాయి. హాస్టల్ కిట్ (గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులకు): పైన పేర్కొన్న వస్తువులతోపాటు అదనంగా దుప్పటి, స్పోర్ట్స్ డ్రెస్, పీటీ డ్రెస్, బ్లేజర్ వంటి 22 రకాల వస్తువులను ప్రభుత్వం అందజేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలు, విద్యార్థుల వివరాలు.. జిల్లా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య ఆదిలాబాద్ 1,279 65,874 కుమురంభీం 1,148 42,478 మంచిర్యాల 847 36,937 నిర్మల్ 842 52,667ఈ నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ప్రత్యక్ష లాభం చేకూరనుంది. ఇప్పటికే మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు ఉపాధ్యాయ నియామకాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల అవసరాలపై దృష్టి పెట్టడం ప్రభుత్వ బడులకు కొత్త ఊపునిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు మెరుగుపడే దిశగా ఈ నిర్ణయం మైలురాయిగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.చలితీవ్రత నేపథ్యంలో ప్రత్యేక వస్త్రం... నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ వంటి నూతన జిల్లాలతో కూడిన ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో శీతాకాలంలో చలి తీవ్రంగా ఉంటుంది. విషయాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. చలిని తట్టుకునేలా శాలువా తరహాలో ఉండే ప్రత్యేక వస్త్రాన్ని కిట్లలో అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
కొత్త కోడళ్ల భేటింగ్
భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం నాగోబా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటు రానివ్వబోమని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తెలిపారు. ఆదివారం నాగోబా ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. మెస్రం వంశీయులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. జాతర నిర్వహణ స్థలం, మెస్రం వంశీయులు బస చేసిన గోవడ్ స్థలాన్ని సందర్శించారు. భక్తులు తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ మెస్రం తుకారాం, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్, దేవాదాయశాఖ ఈవో ముక్త రవి, ఇతర అధికారులున్నారు. కొత్తపుట్టల తయారీకి ఆవుపేడ, పవిత్ర కోనేరు జలంతో ఆలయంలోకి వస్తున్న మెస్రం వంశ మహిళలుఇంద్రవెల్లి: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుంచి మెస్రం వంశీ యులు ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ పూ జలు నిర్వహించారు. ముందుగా కేస్లాపూర్లో ని నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రితో బయలుదేరారు. డోలు, తుడుం, కాలీకోమ్, పెప్రే వాయిస్తూ పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించి లోనికి ప్రవేశించారు. నాగోబా దర్శన అనంతరం సంప్రదాయ పూజలు నిర్వహించారు. కోనేరులో పవిత్రజలం సేకరించి.. సంప్రదాయ పూజల్లో భాగంగా మెస్రం వంశీయులు సిరికొండ కొత్త కుండలకు పూజలు చేశారు. అనంతరం 22కితల వారీగా మహిళలు, ఆడబిడ్డలు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకుని కుండలు స్వీకరించారు. వంశ అల్లుళ్లు, ఆడబిడ్డలు కొత్త కుండలతో మర్రిచెట్టు వద్ద ఉన్న కోనేరుకు చేరుకున్నారు. కోనేరులో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకువచ్చారు. సంప్రదాయ పూజ సమయంలో పర్ధాన్ కితకు చెందిన మెస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలు వాయించగా ఆలయం పక్కనగల పాత మట్టి పుట్టలను వంశ అల్లుళ్లు తొలగించారు. ఆ మట్టితో ఆడబిడ్డలు తిరిగి కొత్త పుట్టలు తయారు చేశారు. పుట్ట మట్టిని ఉండలుగా సేకరించి నాగోబా ఆలయం పక్కనే గల సతి ఆలయం ఎదుట ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు నిర్వహించిన పూజలను ఐటీడీఏ పీవో యువరాజ్మర్మాట్ ఆసక్తిగా తిలకించా రు. పూజలు సాయంత్రం వరకు కొనసాగాయి. వైభవంగా మహాపూజ సంప్రదాయ పూజల అనంతరం రాత్రి 9నుంచి 10.30 గంటల వరకు పాదయాత్ర ద్వారా తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహించారు. (ఈ సమయంలో మెస్రం వంశీయులు మినహా ఇతరులను అనుమతించలేదు) మహాపూ జ అనంతరం హాజరైన జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మహాపూజ హారతి స్వీకరించి నాగోబా జాతర ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. నాగోబా మహాపూజకు ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు, భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. దీంతో నాగోబా ఆలయ పరిసర ప్రాంతం జనసంద్రంగా మారింది. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు నాగోబా మహాపూజలో ఎంపీ గోడం నగేశ్, ఖానా పూర్, బోథ్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీలు కాజల్సింగ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున 3గంటల వరకు భేటింగ్ (పరిచయం) నిర్వహించారు. ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని సుమారు వందమందికి పైగా మెస్రం వంశ కొత్త కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి భేటింగ్కు హాజరయ్యారు. ముందుగా వంశ మహిళల సహకారంతో సతి దేవత, నాగోబా ఆలయంలో కొత్త కోడళ్లతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కొత్త కోడళ్లు ఆలయం ఎదుట వరుసగా కూర్చున్న వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. భేటింగ్ ద్వారా కొత్తకోడళ్లు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లు భావించారు. కాగా, భేటింగ్ పూర్తి కావడంతో తమ జన్మ ధన్యమైందని కొత్తకోడళ్లు నాగోబాకు మొక్కుకున్నారు. -
అయ్యో అశ్విన్..!
నిర్మల్రూరల్: మూడేళ్ల వయసున్న కొడుకు.. ఏడాదిన్నర కూతురు ఉన్న ఆ కుటుంబం.. ఐదు నెలల క్రితం ఉపాధి కోసం నిర్మల్కు వలస వచ్చింది. పట్టణంలోని భాగ్యనగర్లో నివాసం ఉంటోంది. ఈనెల 10న ఇంటిముందు ఆడుకుంటున్న కొడుకు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఇంట్లో ఉన్న తల్లి ఆడుకుంటున్నాడనే అనుకుంది. కానీ, చీకటి పడినా లోపలికి రాకపోవడంతో బయటకు వచ్చి చూడగా కొడుకు కనిపించలేదు. చుట్టుపక్కల గాలించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడ ఉన్నా తిరిగి వస్తాడనుకున్న ఆ తల్లిదండ్రులకు శనివారం గుండెలు పగిలే వార్త అందింది. ఇంటి సమీపంలోని కందకంలోనే బాలుడు విగత జీవిగా కనిపించాడు. దీంతో నీకేమైంది బిడ్డా అంటూ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షోట్టిపేటకు చెందిన అనిల్–చంద్రిక దంపతులకు అశ్విన్(3), ఏడాదిన్నర వయసున్న కూతురు ఉన్నారు. ఐదు నెలల క్రితం అనిల్ కుటుంబంలో కలిసి ఉపాధి కోసం నిర్మల్కు వచ్చాడు. పట్టణంలోని భాగ్యనగర్లో అద్దెకు ఉంటున్నాడు. అనిల్ స్థానిక కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈనెల 10న అనిల్ పనికి వెళ్లాడు. చంద్రిక ఇంట్లో ఉండగా, సాయంత్రం అశ్విన్ బయట ఆడుకుంటున్నాడు. చీకటి పడినా ఇంటికి రాలేదు. దీంతో తల్లి వెళ్లి చూడగా ఆచూకీ కనిపించలేదు. చుట్టుపక్కల గాలించారు. అయినా ఫలితం లేదు. దీంతో అనిల్కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి గాలించాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కందకంలో విగత జీవిగా.. కొడుకు క్షేమంగా వస్తాడని చూస్తున్న తల్లిదండ్రులకు ఇంటి సమీపంలోనే శవమై ఉన్నాడని శనివారం సమాచారం అందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఘటన స్థలానికి వెళ్లి అయ్యో అశ్విన్ ఎంత పని చేస్తివి బిడ్డా అంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఎస్పీ జానకీ శర్మిల, టౌన్ సీఐ నైలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, పొరుగువారి నుంచి సమాచారం సేకరించారు. తల్లిదండ్రులు తమకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. అయినా ఎస్పీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడి వస్తువులను ఫొరెన్సిక్ల్యాబ్కు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కందకంలో పడిపోయాడా... లేక ఎవరైనా పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
21 నుంచి వసంత పంచమి
బాసర: బాసర్ శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో ఈనెల 21 నుంచి మూడు రోజులు వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తామని ఈవో అంజనాదేవి తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేడుకలకు సీఎం రేవంత్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించామని తెలిపారు. పటిష్టమైన ఏర్పాట్లు.. వేడుకలకు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు వస్తారని ఈవో తెలిపారు. ఈమేరకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, తాగునీరు, వైద్య సేవలు, చిన్నారులకు పాలు–బిస్కెట్లు అందిస్తామన్నారు. వలంటీర్లు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుల సహకారం తీసుకుంటామని తెలిపారు. పోలీస్ భారీ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్నాన ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. నిత్య అన్నదానం కొనసాగుతుందని చెప్పారు. 21న గరికపాటి రాక.. వసంత పంచమి వేడుకలు ఈనెల 21న వేకువజా మున సుప్రభాత సేవలతో ప్రారంభమవుతాయని ఈవో తెలిపారు. రెండున్నర గంటలకు మహాభిషేకం, అలంకార, పూజలు నిర్వహిస్తామన్నారు. అక్షరాభ్యాసం, కుంకుమార్చనలు. సాయంత్రం 7 గంటలు పల్లకి సేవ ఉంటాయిన తెలిపారు. గతంతో పోలిస్తే రెట్టింపు అక్షరాభ్యాస మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 21న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరవుతారని చెప్పారు. అమ్మవారి పూజల అనంతరం ప్రవచనాలు చేస్తారని పేర్కొన్నారు. సమావేశంలో ఏఈఓ సుదర్శన్గౌడ్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి పాల్గొన్నారు. -
ఖానాపూర్లో వీబీజీ రామ్జీ అమలు చేయాలి
● కేంద్ర మంత్రికి బీజేపీ నేతల వినతి ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోలో వీబీజీ రామ్జీ పథకం అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రీతీశ్ రాథోడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి శనివారం వినతిపత్రం అందించారు. ఖానాపూర్ పట్టణ ప్రజల విన్నపం మేరకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామరావ్ పటేల్తో కలిసి రితేష్ రాథోడ్, ఖానాపూర్ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రిని హైదరాబాద్లో కలిశారు. ఐదేళ్ల క్రితం ఖానాపూర్ మున్సిపాలిటీగా ప్రకటించడంతో ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేశారని తెలిపారు. గతంలో సుమారు 7 వేల జాబ్కార్డులు ఉండేవన్నారు. పథకం నిలిపివేయడంతో కూలీలకు ఉపాధి కరువైందని వెల్ల డించారు. చుట్టుపక్కల గ్రామాలు ఉన్నందున వీబీజీ రామ్జీ పథకం తిరిగి ప్రారంభించాలని విన్నవించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా రవీందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కీర్తి మనోజ్, మండల అధ్యక్షుడు పుప్పాల ఉపేందర్ ఉన్నారు. -
అతివలకు ఆరు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురపాలక సంఘ ఎన్నికల రిజర్వేషన్లలో మహిళలకే పెద్దపీట దక్కింది. చైర్పర్సన్ స్థానాల్లో అధికంగా అతివలకే అవకాశం లభించింది. రాష్ట్రం యూనిట్గా చైర్పర్సన్, మేయర్ రిజర్వేషన్లలో సగానికి పైగా మహిళలకే దక్కాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్తో సహా 11 మున్సిపాల్టీలు ఉండగా.. వీటిలో సగం స్థానాలు మహిళలకే రిజర్వు అయ్యాయి. ఇక వార్డులు, డివిజన్లలోనూ మహిళలకు 50శాతం ప్రాతినిధ్యం ఉంది. జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో మున్సిపాల్టీ పాలకవర్గాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. రాజకీయ నాయకులు తమకు రిజర్వేషన్ కలిసి రాని చోట్ల తమ సతీమణులను పోటీలో నిలిపి పదవులు దక్కించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. ఇక కొందరు భార్యలతో కుదరకపోతే తమ కుటుంబ సభ్యుల నుంచి మహిళలను పోటీలో దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే టికెట్ల ఎంపిక కోసం ఆశావహులు దరఖాస్తులు, సర్వేలు, ప్రజల్లో బలంతో ఆర్థిక స్థితిగతులపై అంచనాలు వేశారు. ఈ మేరకు వార్డులు, డివిజన్లలో ప్రాథమికంగా ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున జాబితా సిద్ధం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా పట్టణ ఎన్నికలు పట్టణాల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని పీఠాలు దక్కించుకునేలా వ్యూహాలు మొదలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకునేలా ప్రణాళికలు వేశారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి పట్టణాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో పట్టు పెంచుకో వాలని సిద్ధమయ్యారు. 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. నాటి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఐఎం మినహా అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ మున్సిపాల్టీలను కై వసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరుకు గండి పడి పది నియోజకవర్గాల్లో రెండు ఎమ్మెల్యేల స్థానాలకు పరిమితం కాగా.. నాలుగు బీజేపీ, నాలుగు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్ని కల్లోనూ ఆదిలాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్ గె లుచుకోగా.. రాజకీయంగా మార్పులు వచ్చాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు సర్పంచులను గెలిపించుకుని ప్రభావం చూపించా రు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మంచిర్యాల తొలి మేయర్ బీసీలకే.. ఉమ్మడి జిల్లాలో ఏకై క మున్సిపల్ కార్పొరేషన్ మంచిర్యాల. పట్టణం నుంచి అప్గ్రేడ్ అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో కీలకమైన మేయర్ పీఠం రిజర్వేషన్లలో బీసీలనే వరించింది. బీసీ జనరల్ కేటగిరీ కావడంతో ఆ వర్గ నాయకుల్లో ఆసక్తిని పెంచింది. పోటీలో నిలిచే బీసీ నాయకులు మేయర్ పీఠంపై కన్నేశారు. నగరంలో మొత్తం 1.81లక్షల ఓటర్లు ఉన్నారు. 60డివిజన్లతో ఓ అసెంబ్లీ నియోజకవర్గ పరిధితో సమంగా, పరిపాలనలోనూ ప్రత్యేక కనబర్చనుంది. దీంతో నగర ప్రథమ పౌరుడిగా రాజకీయంగా, ప్రొటోకాల్, అధికారిక హోదా విస్తృతంగా ఉండనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మేయర్ పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి.మున్సిపాలిటీ చైర్పర్సన్ రిజర్వేషన్ ఆదిలాబాద్ జనరల్ మహిళ నిర్మల్ జనరల్ మహిళ బెల్లంపల్లి జనరల్ మహిళ క్యాతన్పల్లి జనరల్ మహిళ కాగజ్నగర్ బీసీ మహిళ చెన్నూరు బీసీ మహిళ ఆసిఫాబాద్ బీసీ జనరల్ భైంసా జనరల్ ఖానాపూర్ జనరల్ లక్షెట్టిపేట ఎస్సీ జనరల్ మంచిర్యాల నగరం బీసీ జనరల్(మేయర్) -
మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రూ.25 వేల పరికరాలు విరాళం
నిర్మల్ రూరల్: మండలంలోని సిర్గాపూర్కు చెందిన శాంతా ఫౌండేషన్ సభ్యులు నిర్మల్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి రూ.25 వేల విలుౖ వెన వైద్య పరికరాలను శనివారం విరాళంగా అందజేశారు. ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు మాధవీలత, విజయ్కుమార్ రెండు ఫీటల్ డాఫ్టర్లు, ఒక మల్టీ పారామీటర్ మానిటర్ ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ సరోజ, సీఎస్ఎంఆర్వో డాక్టర్ రమేశ్కు అందించారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు ఈ పరికరాల ద్వారా అందిస్తామని వైద్యులు తెలిపారు. ఇందులో వైద్యులు గోపాల్సింగ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వనాథ్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి పాల్గొన్నారు. -
అడవిలో అగ్గి రాజుకోకుండా..
మామడ: చలికాలం ముగిసే సమయంలో చెట్లు ఆకురాలిపోతాయి. పశువుల కాపరులు మేత కోసం అడవులకు వెళ్లి పొగ తాగడం, బాటసారులు, వ్యవసాయ భూములు చదును చేస్తూ నిప్పు వేయడంతో అడవుల్లో నిప్పు రాజుకుంటుంది. తునికి, ఇప్పపువ్వు సేకరణ కోసం కూడా అడవుల్లో మంటలు వేస్తున్నారు. ఇవి వేగంగా వ్యాపించి అడవులను దహించి వేస్తున్నాయి. పర్యావరణ నష్టం.. జిల్లాలో 1,21,660 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. 9 అటవీ రేంజ్లు ఉన్నాయి. నిర్మల్ డివిజన్లో బైంసా, నిర్మల్, దిమ్మదుర్తి, మామడ, ఖానాపూర్ డివిజన్లో ఖానాపూర్, కడెం, తాండ్ర, ఉడుంపూర్, పెంబి. ఈ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువ. అగ్ని ప్రమాదాలు చెట్లను మోడుగా మారుస్తున్నాయి. విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది. వన్యప్రాణులు ఆవాసాలు కోల్పోయి చనిపోతున్నాయి. ఆకులు కాలిపోవడంతో నేల తేమ తగ్గి భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. శాకాహార జంతువులకు గ్రాసం కరువవుతోంది. ముందస్తు చర్యలు.. అడవుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు అడవి సమీప గ్రామాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంటల నష్టాలను వివరిస్తూ నిప్పు వేయడాన్ని నిరోధిస్తున్నారు. ఫైర్లైన్స్ ఏర్పాటు, బ్లోయర్ యంత్రాలు వాడి మంటలను అదుపులోకి తెచ్చుకుంటున్నారు. ఈ చర్యలు పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. అవగాహన సమావేశాలు.. ఆకురాలే సమయంలో అటవీ ప్రాంతంలో నిప్పు అంటుకునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండి నిప్పును ఆరంభ దశలోనే బ్లోయర్ యంత్రాల ద్వారా ఆర్పేలా చర్యలు తీసుకుంటున్నాం. అడవీలో మంటల కారణంగా జరిగే నష్టాలను గ్రామస్తులకు వివరిస్తున్నాం. ముందస్తుగానే ఫైర్లైన్స్ను ఏర్పాటు చేయిస్తున్నాం. – శ్రీనివాస్రావు, ఎఫ్ఆర్వో, దిమ్మదుర్తి -
పుర రిజర్వేషన్లు ఖరారు!
నిర్మల్19 నుంచి నిర్మల్ ఉత్సవాలు నిర్మల్చైన్గేట్: నిర్మల్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఎన్టీఆర్ స్టేడియం సుందరీకరణ పనులు, ఇతర ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజులపాటు నిర్మల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. గతేడాది నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందామన్నారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని నిర్మల్ ఉత్సవాల వేదిక ద్వారా ఆవిష్కరించామని, ఈ సంవత్సరం కూడా రెట్టించిన ఉత్సాహంతో అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. మరుగుదొడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని, హెల్మెట్ ధరించి, నిర్మల్ ఉత్సవాలకు హాజరయ్యే ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్ రుసుము పూర్తిగా మినహాయించాలని తెలిపారు. ఉత్సవాలకు ప్రొటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు అందించాలన్నారు. ఉత్సవాల విజయవంతానికి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డీవైస్వో శ్రీకాంత్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఓటరు తుది జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటన తర్వాత రిజర్వేషన్లపై అధికారులు కసరత్తు చేశారు. సీపెక్ సర్వే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల వార్డుల మహిళా రిజర్వేషన్లను కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఖరారు చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వార్డులవారీగా కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు తెలుపుతూ, లాటరీ పద్ధతి ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ వారీగా మహిళలకు కేటాయించే వార్డులను ఎంపిక చేశారు. ప్రక్రియ మొత్తం వీడియోగ్రాఫ్ పర్యవేక్షణలో నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్ పీఠం జనరల్ మహిళకు.. నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్/ఖానాపూర్: మున్సిపాలిటీల వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 80 వార్డులు ఉన్నాయి. రొటేషన్ పద్దతిలో ఈ రిజర్వేషన్లు ఫై నల్ అయ్యాయి. నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ పీ టం ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. ని ర్మల్లో 42 వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఇ క భైంసా, ఖానాపూర్ పుర పీఠాలు జనరల్కు రిజ ర్వు చేశారు. భైంసాలో 26 వార్డులకు రిజర్వేషన్లు పూర్తి చేశారు. ఖానాపూర్ బల్దియాలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. నిర్మల్, ఖానాపూర్లో ఎస్టీ జనరల్కు ఒక్కోటి కేటాయించారు. ఆయనకు మార్గం సుగమం.. గతంలో రెండు పర్యాయాలు భైంసా మున్సిపల్ పీటం బీసీ మహిళకు కేటాయించారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఎంఐఎం నుంచి సబియాబేగం చైర్పర్సన్గా పదవిలో కొనసాగారు. పార్టీకి అన్నీ తానైన మహ్మద్ జాబీర్ అహ్మద్ వైస్ చైర్మన్గా కొనసాగారు. ఈయన రెండుసార్లు మున్సిపల్ చైర్మన్గా, రెండుమార్లు వైస్ చైర్మన్గా కొనసాగారు. గడిచిన రెండు పర్యాయాలు రిజర్వేషన్ కారణంగా వైస్ చైర్మన్ పదవికే పరిమితమయ్యారు. ఈసారి చైర్మన్ పీఠం జనరల్కు రావడంతో ఆయనకు మార్గం సుగమమైంది. ఇక, బీజేపీ నుంచి సైతం మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్ చైర్మన్ బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. అధికార కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్ సైతం ఈసారి మున్సిపల్ బరిలో తమ అభ్యర్థులను నిలుపనుంది. ఖానాపూర్ పీఠం జనరల్కే.. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్(అన్ రిజర్వ్డ్) వర్గానికి కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు గత ఎన్నికల్లో బీసీ జనరల్కు కేటాయించారు. రొటేషన్లో భాగంగా ఈసారి జనరల్కు దక్కింద. ఈ క్రమంలో పోటీ హోరాహోరీగా సాగనుంది. మున్సిపల్ రిజర్వేషన్లు.. మున్సిపాలిటీ జనరల్ జనరల్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ మహిళ జనరల్ మహిళ జనరల్ జనరల్ మహిళ నిర్మల్ 09 12 02 01 01 09 08 భైంసా 05 08 02 01 –– 05 04 ఖానాపూర్ 02 04 01 01 01 02 01 -
నిర్మల్
ఓవర్ టు మర్రిచెట్టు నాగోబా మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలంతో తిరుగు పయనమైన మెస్రం వంశీయులు ఆదివారంమర్రి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు కొనసాగించన్నారు. నిర్మల్ సభా వేదికపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, బొజ్జు, కలెక్టర్ అభిలాష అభినవ్ నా జిల్లాతో సమానంగా అభివృద్ధిసీఆర్ఆర్, నర్సన్నబాపుల పేర్లు.. సీనియర్ నేతలుగా, తమప్రాంతాలను అభివృద్ధి చేసినవారిగా ప్రజల్లో నిలిచిన మాజీమంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి(నర్సన్నబాపు), ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే సి.రాంచంద్రారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. చనాక–కొరాట పంప్హౌస్కు రాంచంద్రారెడ్డి పేరు, సదర్మాట్ బ్యారేజీకి పి.నర్సారెడ్డి పేర్లు పెడుతున్నట్లు నిర్మల్ సభావేదిక మీదుగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్లో అతిపెద్ద పారిశ్రామికవాడ ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు సీఆర్ఆర్, నర్సన్నబాపులకు గుర్తింపు నిర్మల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిఆదిలాబాద్లో అతిపెద్ద పారిశ్రామికవాడ ఎర్రబస్సు కూడా రాని గూడేలు ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ బస్సు తీసుకువస్తున్నామని, త్వరలోనే ఎయిర్పోర్టును పూర్తిచేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎయిర్పోర్టు, యూనివర్సిటీలు ఉంటే సరిపోదని, ఈప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, వేలాదిమందికి ఉపాధి లభించాలన్నా పరిశ్రమలు అవసరమని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాలతో అతిపెద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలోని ప్రతీ పరిశ్రమ ఇక్కడ ఉంటుందన్నారు. ఆదిలాబాద్లో త్వరలోనే ప్రధాని మోదీతో ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయిస్తామని తెలిపారు. ఎయిర్పోర్టు, పరిశ్రమలతోపాటు ఆదిలాబాద్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు పక్కాప్రణాళికతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. -
సదర్మాట్తో 18 వేల ఎకరాలకు సాగునీరు
నిర్మల్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన రేవంత్రెడ్డి.. తొలి పర్యటనలోనే వరాలతో జిల్లా ప్రజల మనసు గెలుచుకున్నారు. ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. పీసీసీ అధ్యక్షుడిగా తొలి కార్యక్రమం 2021లో నిర్మల్లో చేపట్టినం. దళిత, గిరిజన దండోరా పేరిట మొదటి భారీసభ ఇంద్రవెల్లిలో నిర్వహించగా రెండూ భారీస్థాయిలో విజయవంతం చేశారు. ఇక్కడి ప్రజలు ఇచ్చిన భరోసానే సీఎంగా నిలిపింది. పోరాటం, పౌరుషానికి ప్రతీకై న ఈగడ్డ పై పుట్టిన రాంజీగోండు, కుమురంభీం స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు స్వరాష్ట్రంలో పదేళ్లు అన్యా యం జరిగింది. నా సొంతజిల్లా పాలమూరుతో సమానంగా ఈప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు భరోసా ఇచ్చారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు పలువరాలు ప్రకటించారు. ఉమ్మడిజిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించారు. సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో పాల్గొన్నారు. బాసరలోనే యూనివర్సిటీ.. బాసర ట్రిపుల్ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం మిగితా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, ప్రజలకు తమ ప్రాంతానికి యూనివర్సిటీ రాలేదన్న బాధ కలిగించి ఉండవచ్చు కానీ, వాయిదాలు పెట్టుకుంటూ పోతే అభివృద్ధి కాదని స్పష్టం చేశారు. నిర్మల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి కోరిక మేరకు జిల్లాకేంద్రంలో స్టేడియం ఏర్పాటు, మున్సిపల్ అభివృద్ధి, మాస్టర్ప్లాన్లో మార్పులు, కొత్త కలెక్టరేట్ మార్పులపైనా దృష్టిపెడతామని హామీ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం.. తుమ్మిడిహెట్టి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కట్టితీరుతామని ముఖ్యమంత్రి స్పష్టంచేశా రు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహితపై ప్రాజెక్టును కట్టాలని నిర్ణయించామని చెప్పారు. ప్రాజెక్టును కట్టి రెండు లక్షల ఎకరాలకు నీరందించేలా సర్వేలు, నివేదికలు రెడీ అవుతున్నాయని చెప్పారు. మామడ: మండలంలోని పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి పంటలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.676 కోట్లతో నిర్మించిన సదర్మాట్ బ్యారేజీతో 18 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. నిర్మల్ కడెం, ఖానాపూర్ మండలాల్లో 13 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్లో 5 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని పేర్కొన్నారు. బ్యారేజీతో కడెం, ఖానాపూర్, కోరుట్ల మండలాల్లో 34 గ్రామాల వ్యవసాయ భూములకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమ లక్ష్యం.. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. రైతుభరోసా, రైతు రుణమాఫీ, పంట కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, నిర్మల్ ఖానాపూర్ ముధోల్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, వెడమ బొజ్జు పటేల్, రామారావు పటేల్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, స్థానిక సర్పంచ్ చిట్యాల లక్ష్మి, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలచారి, స్థానిక నాయకులు హరీశ్కుమార్, గంగారెడ్డి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
టెట్పై చట్ట సవరణ చేయాలి
ఖానాపూర్: విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వచ్చే నెల జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టెట్పై చట్ట సవరణ చేయాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని టీఎన్జీవో భవన్లో శుక్రవారం జరిగిన సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ఫిబ్రవరి 5న ఆల్ ఇండియా జాక్టో అధ్వర్యంలో తలపెట్టిన చలో పార్లమెంట్ను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నిర్లక్ష్యంతో ఇలాంటి తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. తీర్పు వచ్చి నాలుగు నెలలు అయినా, దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఉద్యోగులకు 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు జారీ చేసి, సక్రమంగా అమలు చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం డీఏ ఏరియర్స్ 30 వాయిదాలలో చెల్లించే విధానం సరికాదన్నారు. ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ రూపొందించి, అన్ని రకాల పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు రూ.1,500 కోట్లు కేటాయించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భూమన్న యాదవ్, జె.లక్ష్మణ్, నాయకులు గోవింద్ నాయక్, వెంకటేశ్వరరావు, వాల్గోట్ శ్రీనివాస్, బాలాజీ, గంగాధర్, శ్యామ్, రాజన్న, పరమేశ్వర్, బక్కన్న పాల్గొన్నారు. -
అలరించిన సంక్రాంతి కవి సమ్మేళనం
నిర్మల్ఖిల్లా: తెలుగువారి సంస్కృతిలో సంక్రాంతి పండగ విశిష్టమైనదని, ఇలాంటి పండగలు హైందవ సంస్కృతికి ప్రతిరూపాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మకర సంక్రాంతి పురస్కరించుకుని నిర్మల భారతి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయూ సంఘ భవనంలో సంక్రాంతి వైభవం పేరిట గురువారం జిల్లాస్థాయి సంక్రాంతి కవిసమ్మేళనం నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు కవులు, కళాకారులు పాల్గొని తమ కవితలు, పాటలద్వారా పండగ యొక్క ఔన్నత్యాన్ని, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, పండగకు ప్రకృతికి మధ్య సంబంధాన్ని వివరించారు. అనంతరం కవులను, గాయకులను నిర్మల భారతిపక్షాన సన్మానించారు. నిర్మలభారతి అధ్యక్ష్య ప్రధాన కార్యదర్శులు తొడిశెట్టి పరమేశ్వర్, పద్యకవి బి.వెంకట్, సంయుక్త కార్యదర్శులు అంబటి నారాయణ, యార సాయినాథ్రెడ్డి, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు, వైద్యులు దామెర రాములు, మురళీధర్, కృష్ణంరాజు, వేణుగోపాలకృష్ణ, కవులు చట్ల గజ్జారాం, పోలీస్ భీమేశ్, పాటే మా ప్రాణం సంగీత అకాడమీ డైరెక్టర్ చెనిగారం నాగరాజు, వెన్నెల డాన్స్ అకాడమీ డైరెక్టర్ ధనరాజ్, గాయకురాలు సాయిప్రియ, కవియాత్ర చైర్మన్ కారం నివేదిత, కలం స్నేహం జిల్లా అధ్యక్షురాలు దేవిప్రియ, కారం ప్రణతి, భిక్షపతి నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సభ జనసమీకరణలో బల్దియా అధికారులు?
ఖానాపూర్: సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవంతోపాటు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సీఎం బహిరంగ సభకు అధికారులే దగ్గరుండి జనసమీకరణ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఖానాపూర్ స్థాని క మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే పలువురు అధికారులు, సిబ్బంది దగ్గరుండి సభకు వెళ్లే వాహనాలకు సిద్ధం చయించారని, డీజిల్కు టోకెన్లు సైతం పంపిణీ చేశారని బీజేపీ పట్టణ అధ్యక్షులు కీర్తి మనోజ్ ఆరోపించారు. మహిళ సంఘాల సభ్యులను తప్పకుండా రావాలని, పలువురు అధికారులు, సిబ్బంది భయపెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వం జనసమీకరణ కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించా రు. ఈ విషయమై మున్సిపల్ సిబ్బందిని పలువురు మీడియా ప్రతినిదులు ప్రశ్నించగా, సీఎం సభకు వాహనాలకు డీజిల్ పోయిస్తున్నామని, అవి ప్రభుత్వం నుంచి వచ్చిన టోకెన్లే అని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్ను వివరణ కోరగా, అధికారిక కార్యక్రమం అయినందున మెప్మా సిబ్బందితోపాటు స్వయం సహాయక సంఘాల సభ్యులను తరలించడానికి టోకెన్లు పంపిణీ చేశామని తెలిపారు. -
వ్యవసాయానికి పెద్దపీట వేయాలి..
సాగుపై ఆధారపడిన నిర్మల్ జిల్లాలో వ్యవసాయానికి పెద్దపీట వేయాలని బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి కోరారు. చెరువుల జిల్లాగా పేరొందిన నిర్మల్లో చెరువులను కాపాడాలన్నారు. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు, స్పిల్వే, కాలువలు, సరస్వతీ కాలువ దెబ్బతిన్నాయన్నారు. కాళేశ్వరం ప్యాకేజీల పనులు పూర్తిచేయాలని కోరారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న కలెక్టరేట్ను జిల్లాకేంద్రానికి మార్చాలని, మాస్టర్ప్లాన్ రద్దుచేయాలని, మున్సిపాలిటీలకు నిధులివ్వాలని, చెరువుల ఆక్రమణలను ఆపాలని, యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వాలని కోరారు. ఇథనాల్ కేసుల కొట్టివేత, హరిత రిస్టార్ నిర్మాణం, టూరిజం అభివృద్ధి చేయాలని కోరగా, వీటన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందించారు. -
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు
● పెన్గంగ నీటిని మెయిన్ కెనాల్లోకి విడుదలసాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన చడీచప్పుడు లేకుండా సాగింది. ఇలా వచ్చారు.. అలా వెళ్లారన్నట్టుగా కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆయన హెలిక్యాప్టర్ ద్వారా నేరుగా భోరజ్ మండలం హత్తిఘాట్కు చేరుకున్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ఉన్నారు. సీఎంకు ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు శంకర్, అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్వాగతం పలికారు. అరగంట మాత్రమే ఆయన జిల్లాలో గడిపారు. కొరటా–చనాఖా పంప్హౌస్ వద్ద మీట నొక్కి పెన్గంగ జలాలను ప్రధాన కాలువలోకి వదిలారు. ఆ తర్వాత అందులో పారుతున్న గంగాజలాలకు పూజలు చేశారు. పూలు, చీరసారెలు అందులోకి వదిలారు. అనంతరం హత్తిఘాట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు తిరిగి చేరుకొని అక్కడి నుంచి నిర్మల్ బయల్దేరి వెళ్లారు. పెన్గంగ జలాలను ప్రధాన కాలువలోకి విడుదల చేసిన సందర్భంగా సీఎం మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు.. ఫొటో స్టాల్ సందర్శన.. హత్తిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో నేరుగా హెలిక్యాప్టర్ నుంచి దిగిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి ప్రత్యేకంగా నిర్మించిన రోడ్డు మార్గం ద్వారా పంప్హౌస్ వద్దకు చేరుకున్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో స్టాల్ను సందర్శించారు. నీటి విడుదలకు సంబంధించిన వివరాలను కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులకు తెలియజేశారు. -
అక్షరం ‘సాక్షి’గా ‘వర్సిటీ’
నిర్మల్: జిల్లావాసుల దశాబ్దాల ‘విశ్వవిద్యాలయ’కలను పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘చేద్దాం విద్యావిప్లవం–సాధిద్దాం విశ్వవిద్యాలయం’ అంటూ ‘సాక్షి’ మీడియా చేసిన అక్షర కృషి ఫలించింది. చదువులమ్మ కొలువైన బాసరలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సభావేదిక మీదుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో జిల్లావాసులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. ఏలేటి అభ్యర్థన.. ఎనుముల ప్రకటన.. నిర్మల్ ప్రాంతవాసులు దశాబ్దాలుగా కోరుతున్న బాసర జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయాన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని శుక్రవారం నిర్మల్లో నిర్వహించిన సభలో ‘సాక్షి’ కథనాలను ఉటంకిస్తూ స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి కోరారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించి, బాసరలోనే ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించిన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే బడ్జెట్లోగా ప్రతిపాదనలు, నివేదికలన్నీ పూర్తిచేసి ఇవ్వాలని ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డికి సూచించారు. ప్రస్తుతానికి బాసరలోని ట్రిపుల్ఐటీ ప్రాంగణంలోనే ప్రారంభించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ‘సాక్షి’ అక్షర కృషి.. జిల్లాలో గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎలాగైతే ‘సాక్షి’ అక్షర కృషిచేసిందో, అదే తరహాలో విశ్వవిద్యాలయ సాధనకు తోడ్పాటును అందించింది. జిల్లాకు కాకతీయ యూనివర్సిటీ చేస్తున్న నష్టాన్ని మొదలుకుని, జిల్లాలో విశ్వవిద్యాలయం అవశ్యకత వరకు వరుస కథనాలను ప్రచురించింది. అంతటితో ఆగకుండా జిల్లాలోని విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్నివర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలతో ఆగస్టులో ‘చేద్దాం విద్యావిప్లవం–సాధిద్దాం విశ్వవిద్యాలయం’ అంటూ రౌండ్టేబుల్ సమావేశాన్నీ నిర్వహించింది. ‘సాక్షి’ తీసుకువచ్చిన కదలిక అన్నివర్గాల్లో చర్చనీయాంశంగామారి, అధికారులు, పాలకుల్లోనూ కదిలించింది. చివరకు సీఎం నోటితో వర్సిటీని ప్రకటించడంలో ఓ భాగమైంది. -
నేడు సం‘క్రాంతి’
నిర్మల్: రంగుల ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలతో వీధులన్నీ స్వాగతం పలుకంగా, నోములతో పూజలు చేయంగా, చిన్నాపెద్ద పతంగులతో సందడి చేస్తుండగా.. సంక్రాంతి పండుగొచ్చింది. వస్తూవస్తూ కొత్త కాంతినీ తీసుకువచ్చింది. ప్రకృతితో ముడిపడిన మన పండుగల్లో మకర సంక్రాంతికీ ప్రత్యేకత ఉంది. హేమంత రుతువులో మార్గశిర మాసపు శీతలగాలులు, మంచు కురిసే ఈ వేళలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రభాకరుడు ఇప్పటి నుంచి తన వెలుగు, వేడినీ పెంచుతూ పోతాడు. జిల్లావ్యాప్తంగా బుధవారం భోగి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. సంక్రాంతి పర్వదినాన్ని గురువారం జిల్లా ఘనంగా జరుపుకోబోతోంది. మకర సంక్రమణం సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడు కనుక. ఈ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో పంటలు చేతికొస్తాయి. అందుకే ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. జిల్లాలోనూ పండుగ సందడి రెండురోజుల ముందునుంచే మొదలైంది. చాలా గ్రామాల్లో యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇక పతంగుల సందడి వారం నుంచే కొనసాగుతోంది. ఏ డాబాపై చూసినా చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ కనిపిస్తున్నారు. ఆంధ్ర సంబురాలకు మనోళ్లు తెలంగాణలో దసరా పండుగకు ఉన్నంత సందడి సంక్రాంతికి ఉండదన్న ఫీలింగ్ ఎప్పటినుంచో ఉంది. ఇక పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబురాలు జోరుగా సాగుతాయి. అక్కడివాళ్లకు ఇదే పెద్ద పండుగ. నెల ముందునుంచే పండుగ సందడి మొదలవుతుంది. పల్లెటూర్లు మొత్తం పండుగ కళతో కనిపిస్తాయి. సంక్రాంతి అంటేనే అక్కడ కోడిపందేలు ఆడటం. వీటిని తిలకిస్తూ అక్కడి వంటకాలను ఆస్వాదించేందుకు జిల్లా నుంచి ఏటా చాలామంది జిల్లా యువకులు ఆంధ్రకు వెళ్తున్నారు. ఈసారి కూడా చాలామంది వెళ్లారు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి ఎంజాయ్ చేయడంతో పాటు చుట్టూ ఉండే ప్రముఖ క్షేత్రాలు, ప్రాంతాలనూ చూసివచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. -
సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16న నిర్వహించనున్న సీ ఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు పకడ్బందీ ఏ ర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కష్ణారావు అధికారులను ఆదేశించారు. సీఎం జి ల్లా పర్యటన నేపథ్యంలో బుధవారం ఎన్టీఆర్ మి నీ స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి పరిశీలించారు. ముందుగా మంత్రి, ప్ర భుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డికి కలెక్టర్ అటవీశాఖ అతిథి గృహంలో పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మంత్రి, ప్రభుత్వ సలహాదారుకు గౌ రవ వందనం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎస్పీ జానకీ షర్మిల, అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కడ్తాల్లో మకర జ్యోతి దర్శనం
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర ఆలయం బుధవారం అయ్యప్ప నామస్మరణ, సంకీర్తనలు, శరణు ఘోషతో మార్మోగింది. ఆలయంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ అనంతరం విశేషపూజలు చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహం, ఆభరణాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్ల కిలో గ్రామ పురవీధులగుండా భాజాభజంత్రీల మధ్య ఊరేగించారు. అనంతరం ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. ఉమ్మడి జిల్లాలోనే మొదటి అయ్యప్ప ఆలయం కావడంతో భక్తులు అధికసంఖ్యలో హాజరై మణికంఠుడిని దర్శించుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రివేళ మకర జ్యోతి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీధర్మశాస్త్ర ట్రస్టు సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
కొత్త సర్పంచులకు శిక్షణ
నిర్మల్చైన్గేట్: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాభివృద్ధిలో పల్లె సారథులే కీలకం. రెండేళ్లుగా గ్రామాలకు పాలకవర్గాలు లేక అభివృద్ధిలో వెనుకబడ్డాయి. ఎట్టకేలకు పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. సర్పంచులు, వార్డు సభ్యులకు గ్రామాభివృద్ధి కోసం 24 అంశాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మాస్టర్ ట్రైనర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. ఈ నెల 19నుంచి సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. 50మందికో బ్యాచ్ చొప్పున.. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో నూతనంగా ఎన్నికై న సర్పంచులే ఉన్నారు. పాలనాపరమైన అనుభవం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సర్పంచులకు విధులు, బాధ్యతలు, నిధులు సమకూర్చుకోవడంలాంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. గత నెల 22న పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. జిల్లాలో 399 సర్పంచులు, 3,366 మంది వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బ్యాచ్లుగా విభజించి బ్యాచ్కు 50 మంది సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఒక్కో బ్యాచ్కు ఐదురోజులు శిక్షణ ఇస్తారు. ముధోల్లోని ట్రిపుల్ ఐటీలో ఆరు మండలాలకు, నిర్మల్లోని మహిళా ప్రాంగణంలో 12మండలాలకు శిక్షణ ఇవ్వనున్నారు. 24 అంశాలపై అవగాహన గ్రామ పాలనలో వ్యవస్థలు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారాలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుద్ధ్యం, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వనమహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజారోగ్యం జనన, మరణాల నమోదు, ఈ అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక.. ఇలా 24 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అన్ని అంశాలపై పట్టు సాధించి గ్రామాభివృద్ధికి కృషి చేసేలా ప్రోత్సహించనున్నారు. అలాగే, పంచాయతీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా పల్లె అభివృద్ధికి కృషి చేసేలా వివరించనున్నారు. సర్పంచులకు శిక్షణ సమయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. ఆధార్ లింక్ ద్వారా బయోమెట్రిక్ అంటెండెన్స్ను శిక్షణ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. ఈ శిక్షణకు ప్రతీ సర్పంచ్ తప్పక హాజరు కావాల్సి ఉంటుంది. శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నాం జిల్లాలోని సర్పంచులు, వార్డు సభ్యులకు ఈ నెల 19నుంచి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తయింది. జిల్లాలోని ముధోల్ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలకు చెందినవారికి బాసర ట్రిపుల్ ఐటీలో, మిగతా 12మండలాలకు చెందిన వారికి నిర్మల్ రూరల్ మండలంలోని చించోలి (బీ) సమీప మహిళా ప్రాంగణంలో శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి -
మంత్రిని కలిసిన సదర్మాట్ రైతాంగం
కడెం: సదర్మాట్ ప్రత్యేక కాలువ సాధన సమితి అధ్యక్షుడు హపవత్ రాజేందర్ ఆధ్వర్యంలో సదర్మాట్ ఆయకట్టు రైతులు బుధవారం మామడ మండలంలోని పొన్కల్ సదర్మాట్ బ్యారేజీ వద్ద ఉమ్మడిజిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ను కలిశారు. సదర్మాట్ ప్రత్యేక కాలువ ఏర్పాటు గురించి విన్నవించి సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సదర్మాట్ ఆయకట్టుకు యాసంగికి సాగునీటిని వారబందీ పద్ధతిన కాకుండా నిరంతరాయంగా విడుదల చేయాలని వేడుకున్నారు. రైతులు ముక్కెర శ్రీనివాస్, సత్తెన్న, సదానందం, సతీశ్, శంకర్, దేవన్న తదితరులున్నారు. -
‘కేంద్రానివి ప్రజావ్యతిరేక విధానాలు’
భైంసారూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతి రేక విధానాలను అవలంభిస్తోందని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజు ఆరోపించారు. బు ధవారం మండలంలోని హంపోలి గ్రామంలో ఏఐకేఎంఎస్, ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇటీవల కేంద్రం ఎన్జీఎన్ఆర్ ఈజీఎస్ చట్టాన్ని ర ద్దు చేస్తూ దాని స్థానంలో జీరామ్జీ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని పేర్కొన్నారు. కొత్త చట్టంతో రై తులు, వ్యవసాయ కూలీలు, పేదలు తీవ్రంగా నష్టపోనున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రజావ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జీరామ్జీ చట్టం ప్రతులు దహనం చేశారు. నాయకులు దీనాజీ, సాయినాథ్, బాబు, ప్రసాద్, గంగారాం, సురేశ్, ముత్తన్న, రాంసింగ్ తదితరులున్నారు. లోకేశ్వరం: జీరామ్ జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. మండలంలోని పుస్పూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు, విత్తన చట్టం ముసాయిదా బిల్లు, నూతన ఉపాధిహామీ జీ రామ్జీ పథకం, రైతు వ్యతిరేక నల్ల చట్టాల ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు విస్తృతంగా లాభాలు ఆర్జించి పెట్టే చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ముత్తన్న దీనజీ, సాయినాథ్, బాబు ,ప్రసాద్, గంగారాం, సురేశ్, రాంసింగ్ తదితరులున్నారు. -
ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో బుధవారం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డితో కలిసి సదర్మాట్ బ్యారేజీ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణం, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బ్యారేజీ గేట్ల పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సదర్మాట్ బ్యారేజీతో ఈ ప్రాంత రైతుల కల సాకారం కాబోతుందని తెలిపారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో, అత్యంత అట్టహాసంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ రంగానికి ఈ బ్యారేజీ వెన్నెముకగా నిలుస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను త్వరగా పూర్తి చేసిందని పేర్కొన్నారు. మంత్రి వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులున్నారు. -
ఇక సదర్మాట్ పరవళ్లు
● కలెక్టర్, ఎస్పీతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ‘జూపల్లి’మామడ: సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 16న జిల్లాలో పర్యటించనున్నారు. మండలంలోని పొనకల్ గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీని ద్వారా నిర్మల్, జగిత్యాల జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని గోదావరి తీర గ్రామాలకు సాగునీరు అందనుంది. రూ.520.16 కోట్లతో చేపట్టిన ఈ బ్యారేజీ పనులు 2016లో ప్రారంభమైనా, అధికారికంగా మాత్రం 2017లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇందుకు నిర్మల్ జిల్లాలో 805 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 371 ఎకరాలు సేకరించారు. 1.58 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ బ్యారేజీ ద్వారా 13,120 ఎకరాల సదర్మాట్ ఆయకట్టుకు, 4,896 ఎకరాల జగిత్యాల జిల్లాలోని గంగనాల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. ప్రాజెక్ట్లోని బ్యాక్ వాటర్ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించే అవకాశముంది. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి బ్యారేజీ 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని దిగువన ఏడు కిలోమీటర్ల దూరంలో సదర్మాట్ ప్రాజెక్ట్ ఉంది. 34 గ్రామాలకు సాగునీరు జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని 14 గ్రామాలకు, కడెం మండలంలోని 10 గ్రామాలకు, జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని నాలుగు గ్రామాలకు, మల్లాపూర్ మండలంలోని ఆరు గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందనుంది. బ్యారేజీ కింద 10కిలోమీటర్ల వరకు నీరు నిల్వ ఉండనుంది. బ్యారేజీ ఎత్తు 19 మీటర్లు కాగా, ఆనకట్ట పొడవు 987 మీటర్లుగా ఉంది. పొన్కల్ వైపు మట్టి కట్ట పొడవు 740 మీటర్లు కాగా, జగిత్యాల జిల్లాలోని వేములకుర్తి వైపు మీటర్లుగా ఉంది. బ్యారేజీని 7.5 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. దీని పైనుంచి వాహనాలు వెళ్లే అవకాశం ఉండడంతో పొన్కల్ నుంచి వివిధ గ్రామాలు, జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. బ్యారేజీ నిర్మాణంతో చేపలు పట్టేవారికి మెరుగైన ఉపాధి లభించనుంది. కడెం, ఖానాపూర్ రైతుల సాగునీటి సమస్య తీరుతుంది. కాగా, ప్రాజెక్ట్ కోసం భూములు త్యాగం చేసిన పొన్కల్ రైతుల మిగతా భూముల సాగు కోసం లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించాలని, బ్యారేజీకి పొన్కల్ ‘నాగదేవత బ్యారే జీ’ అని పేరు పెట్టాలని కోరుతున్నారు. బ్యారేజీ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోని సదర్మాట్ వరకు కెనాల్ నిర్మించి సాగునీటిని అందించాలని అక్కడి ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రారంభానికి సిద్ధమైన సదర్మాట్ బ్యారేజీ -
భైంసా బల్దియా పోలింగ్ కేంద్రాలివే..
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు చర్యలు వేగవంతమయ్యాయి. ఎన్నికల కమిషన్ షెడ్యూ ల్ ప్రకారం ఓటరు ముసాయిదా జాబితా, తుదిజా బితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. వార్డులవారీగా పోలింగ్ కేంద్రాలు గుర్తించిన అధికారులు ముసాయిదా జాబితా కూడా విడుదల చేశారు. అభ్యంతరాలుంటే గురువారం సా యంత్రం వరకు మున్సిపల్ కార్యాలయంలోని ఎ న్నికల విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. 16న తుది జాబాతా విడుదల చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో 51,118 మంది ఓటర్లుండగా, 74 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ప్రతీ వార్డుకు కి.మీ పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఒక్కో కేంద్రంలో సరాసరి 690 ఓటర్లను సర్దుబాటు చేశారు. 1, 6, 19 వార్డుల్లో గరిష్టంగా నాలుగు చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉండగా, మిగతా వార్డుల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా రెండు నుంచి మూడు కేంద్రాలను గుర్తించారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్ రూరల్: ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంతోపాటు, మండలంలోని రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో గ్రామస్తులకు మంగళవారం అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, ఫస్ట్ ఎయిడ్ వినియోగం, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు గౌరవించి తమ భద్రతతోపాటు ఇతరుల భద్రతకూ సహకరించాలన్నారు. ఇందులో ఏఎస్పీ సాయికిరణ్, సీఐలు నైలు, కృష్ణ, సర్పంచ్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
మామడ: మామడ మండలం పొన్కల్ సమీపంలోని గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవానికి ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బ్యారేజీని సందర్శించి అధికారులతో సమీక్ష చేశారు. బ్యారేజీ ప్రాంగణం, హెలీప్యాడ్ను పరిశీలించి సరైన రోడ్డు సౌకర్యం ఉండాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. బ్యారేజీ పరిసర ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఈఈ అనిల్, ఎకై ్సజ్ అధికారి రజాక్, అగ్నిమాపకశాఖ అధికారి ప్రభాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్రెడ్డి అధికారులు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు చేపట్టాల్సిన ఏర్పాట్లను కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి పరిశీలించారు. సభా వేదిక, టెంట్, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సభకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
జామ్లో కోతులు పట్టివేత
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలో కోతుల బెడద కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సర్పంచ్ కరిపె రవళి మంగళవారం కోతులను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా కోతులను పట్టేవారిని తమిళనాడు నుంచి రప్పించి మూడు బృందాలుగా వారిని విభజించి కోతులను పట్టించారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు దాదాపు 80కి పైగా కోతులను పట్టుకున్నామని కోతులను పట్టుకునేందుకు వచ్చినవారు తెలిపారు. మరో వారంరోజుల్లో గ్రామంలో ఉన్న కోతులన్నింటినీ బంధించి కోతుల పునరవాసకేంద్రానికి తరలిస్తామని సర్పంచ్ తెలిపారు. -
నేడు మకరజ్యోతి దర్శనం
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం కర్పూర మకరజ్యోతి దర్శనానికి ముస్తాబైంది. జిల్లాలో సుప్రసిద్ధ శబరిమలై ఆలయం తరహాలోనే పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుస్వామి నర్సారెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం సంక్రాంతి సంబరాలుంటాయని, ఉదయం స్వామివారి సుప్రభాత సేవ అనంతరం విశేషాలంకరణ చేయనున్నట్లు వివరించారు. స్వామివారి ఆభరణాలు, ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్ఠించి గ్రామ వీధుల్లో ఊరేగిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం, ఇక్కడ కర్పూర మకర జ్యోతి దర్శనం ఉంటాయని వివరించారు. రాత్రి మహా పడిపూజ నిర్వహిస్తామని తెలిపారు. -
బ్యాలెట్తోనే మున్సి‘పోల్స్’!
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. తుది ఓటరు జాబితా విడుదల కావడంతో రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతోంది. ఇక మరోవైపు ఎన్నికలు బ్యాలెట్ పేపర్తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే 3 మున్సిపాలిటీల పరిధిలో బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు, మున్సిపల్ ఆఫీసర్లు బ్యాలెట్ పేపర్ కోసం పేపర్ కంపెనీలకు ముందస్తు ఆర్డర్లు పంపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు.. ముద్రించి అందించేలా పేపర్ను రెడీ చేసి పెట్టుకోవాలని ఆదేశించారు. 2014లో మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించింది. తర్వాత 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగాయి. ఈసారి ఈవీఎంలతో నిర్వహించే వెసులుబాటు ఉన్నా ప్రభుత్వం బ్యాలెట్ వైపే మొగ్గు చూపింది. 490 బ్యాలెట్ బాక్సులు.. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో సుమారు 490 బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మూడు మున్సిపాలిటీల్లో 80 వార్డులలో 217 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ స్టేషన్కు రెండు బ్యాలెట్ బాక్సుల చొప్పున 434 అవసరం కాగా అదనంగా 50 బాక్సులను అందుబాటులో ఉంచనున్నారు. అధికార యంత్రాంగం బాలెట్ బాక్సులను పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వాడుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. చిక్కులు తప్పవు.. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో చెల్లని ఓట్ల ప్రస్తావన ఉండదు. కానీ బ్యాలెట్ పేపర్లో ఓటు ముద్ర సరిగా పడకపోవడం కొంత చిక్కులకు దారి తీస్తుంది. అదే రీతిలో బ్యాలెట్ పేపర్ను మడతపెట్టే క్రమంలో రెండు వైపులా పడటం మరో సమస్యగా మారనుంది. నిరక్షరాస్యులు ఓటు వేయడంలో గందరగోళానికి గురై బ్యాలెట్పై ఏదో ఓ చోట ఓటు ముద్ర వేయడం అభ్యర్థుల తలరాత మారుతోంది. గతంలో కౌంటింగ్ సందర్భంగా చెల్లని ఓట్ల విషయంలో వివాదాలు తలెత్తాయి. మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ బ్యాలెట్ స్టేషన్లు బాక్సులు నిర్మల్ 42 127 280 భైంసా 26 66 150 ఖానాపూర్ 12 24 60 -
కల్యాణం.. కమనీయం
భోగి పర్వదినం, ధనుర్మాసవ్రతంలో భాగంగా పట్టణంలోని దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం గోదా రంగనాథుల కల్యాణ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు మహిళల కోలాటాల మధ్య ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కల్యాణం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు కల్యాణం తిలకించి పులకించారు. కార్యక్రమంలో దేవరకోట దేవస్థానం అధ్యక్షుడు ఆవిడ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. – నిర్మల్చైన్గేట్ -
ముగ్గుల్లో ‘విజయ’లక్ష్మి
భైంసాటౌన్: ఆమె పేరు విజయలక్ష్మి.. పేరుకు తగ్గట్టే విజయం ఆమెను వరిస్తోంది.. ముగ్గుల పోటీ ఎక్కడ నిర్వహించినా.. ఆమె ముగ్గు వేసిందంటే ప్రథమ బహుమతి ఖాయం. అవును.. కర్ణాటకలోని బీదర్కు చెందిన విజయలక్ష్మికి భైంసాకు చెందిన శ్రీనివాస్తో వివాహం అయింది. భైంసా పట్టణానికి చెందిన విజయలక్ష్మి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె డిగ్రీ చదివే సమయంలో ఓ ముగ్గుల పోటీలో పాల్గొనగా, కన్సొలేషన్ బహుమతి అందుకున్నారు. అప్ప టి నుంచి ముగ్గులంటే ఆసక్తి పెంచుకుని, సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు. భైంసాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గతేడాది నిర్వహించిన ముగ్గుల పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి 5 గ్రాముల వెండి నాణెం గెలుచుకోగా, ఈసారి కూడా మొదటి బహుమతిగా 3 గ్రాముల వెండినాణెం గెలుచున్నారు. నిర్మల్లో రెండేళ్ల క్రితం నిర్వహించిన ముగ్గుల పోటీలోనూ ప్రథమ బహుమతిగా రూ.6 వేలు గెలుచుకున్నారు. ముగ్గుల్లో పండుగ సంస్కృతి ప్రతిబింబించేలా వేయడమే తన విజయ రహస్యమని విజయలక్ష్మి తెలిపారు. -
కొత్త ల్యాబ్ టెక్నీషియన్లొస్తున్నారు..
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) 2024 నవంబర్ 10న రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్లకు రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారి సర్టిఫికెట్ల పరిశీలన చేసి, గతేడాది నవంబర్ 17న తుది జాబితా వెలువరించింది. జిల్లా నుంచి ఎంపికై న 35 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అభ్యర్థులకు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉస్మానియా మెడికల్ కళాశాల మైదానంలో నియామక పత్రాలు అందజేశారు. పోస్టుల భర్తీ ఇలా.. జిల్లాలో ఖాళీగా ఉన్న 35 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషి యన్ పోస్టులను భర్తీ చేశారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ , వైద్య వి ధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద వీరిని నియమించింది. నిర్మల్ ప్రభు త్వ మెడికల్ కళాశాలకు అనుబంధ జనరల్ ఆస్పత్రికి 23, వైద్య విధాన పరిషత్కు 5, వైద్యారోగ్యశాఖ పీహెచ్సీలకు ఏడుగురిని కేటాయించారు. ప్రజారోగ్య సేవలకు మరింత బలం... జిల్లాకు కొత్తగా 35 మంది ల్యాబ్ టెక్నీషియన్లు రానుండడంతో వైద్య సేవలు పెరగనున్నాయి. నూతన నియామకాలతో ప్రతీ పీహెచ్సీకి ఒక ల్యాబ్ టెక్నీషియన్ను కేటాయించనున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారికి రక్త పరీక్షలు, రిపోర్టుల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి. -
రాజన్న స్వప్నం.. సాకారం
ఖానాపూర్: ఖానాపూర్, కడెం మండలాల రైతుల దశాబ్దాల కల సదర్మాట్ బ్యారేజీ. జలయజ్ఞ ప్రదా త, అపర భగీరథుడిగా తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. వెస్సార్ కల ఎట్టకేలకు సాకా రం అయింది. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న సదర్మాట్ ఆనకట్టను 125 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ ఇంజినీర్ జేజే.ఒటాలే మేడంపల్లి శివారులో గోదావరి నదిపై నిర్మించారు. దీని కాలువ ద్వారా 28 గ్రామాల్లో 25 వేల ఎకరాలకు నీరందుతోంది. నిల్వ సామర్థ్యం లేక వర్షాకాలంలో నీరు వృథాగా పోయేది. ఖరీఫ్కు మాత్రమే సాగునీరు అందేది. బ్యారేజీ నిర్మాణంతో రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఏర్పడింది. అయితే బ్యారేజీ కోసం దశాబ్దాలుగా రైతులు, ఆందోళన చేశారు. హామీ నిలబెట్టుకున్న వైఎస్సార్.. 2008–09 పల్లెబాటలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఖానాపూర్ను సందర్శించారు. రైతుల విన్నపాలు స్వీకరించారు. రైతులు సదర్మాట్ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వైఎస్సార్ ఆరోజు మాజీ ఏపీపీఎస్సీ సభ్యుడు రవీందర్రావు నివాసంలో బస చేశారు. మరుసటిరోజు సదర్మాట్ ఆనకట్టను సందర్శించారు. బ్యారేజీ నిర్మిస్తే రెండు పంటలకు నీరందుతుందని రైతులు తెలిపారు. దీంతో బ్యారేజీ నిర్మాణానికి వైఎస్సార్ సర్వే చేసి ప్రతిపాదనలు పంపాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు బ్యారేజీ నిర్మాణానికి రూ.305 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ మేరకు 2009 జనవరి 27న ఖానాపూర్కు వచ్చిన వైఎస్సార్ రూ.305 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన అకాల మరణంతో ఆర్థికశాఖ క్లియరెన్స్ లేక టెండర్లు నిర్వహించలేదు. వైఎస్సార్ పేరు పెట్టాలి... సదర్మాట్ బ్యారేజీ నిర్మాణానికి మూలకారకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వైఎస్సార్ చొరవతోనే నాడు బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. బ్యారేజీకి వైఎస్సార్ పేరు పెట్టాలి. – సాగి లక్ష్మణ్రావు, మార్కెట్ కమిటీ మాజి చైర్మన్, ఖానాపూర్సదర్మాట్ ఆనకట్టను పరిశీలిస్తున్న వైఎస్సార్(ఫైల్)పొన్కల్ వద్ద నిర్మాణం... తర్వాత సదర్మాట్ బ్యారేజీ పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలు మార్చి పనులు చేపట్టారు. అయితే బ్యారేజీని మేడంపల్లిలో కాకుండా ఎగువన 7 కిలోమీటర్ల దూరంలోని మామడ మండలం పొన్కల్ సమీపంలో నిర్మించారు. గతంలో సదర్మాట్ ద్వారా ఖానాపూర్, కడెం మండలాలకు కాలువ ద్వారా నీరందేది. బ్యారేజీ నిర్మాణంతో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గంగనాల ప్రాజెక్టు ద్వారా ఆయా గ్రామాల్లోని మరో 5 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. మామడ మండలంలోని గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. భూగర్భజలాలూ పెరగనున్నాయి. కడెం ప్రాజెక్టు ఫీడింగ్ సైతం పెరగడంతో జన్నారం మీదుగా లక్సెట్టిపేట వరకు సాగు నీరందే అవకాశముందని అధికారులు తెలిపారు. రాజశేఖరరెడ్డి పేరుపెట్టాలని రైతుల డిమాండ్సదర్మాట్ బ్యారేజీ -
గోడు చెప్పి.. గోస తీర్చమని..
నిర్మల్చైన్గేట్: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజవాణికి భారీగా అర్జీలు వచ్చాయి. కలెక్టర్ అభిాష అభినవ్ స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. బాధితుల గోడు విన్నారు. దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, స్పందించాలన్నారు. ముఖ్యంగా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సంబంధిత శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజావాణికి విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి. పరిహారం అందించాలి ఐదు నెలల క్రితం ఎంపీపీఎస్ అంతర్నీ పాఠశాలలో చదువుతున్న నా కుమారుడిపై ప్రమాదవశాత్తు స్కూల్ గోడ కూలి గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అప్పట్లో అధికారులు పరిహారం కింద రూ.25 వేలు ఇస్తానని మాట ఇచ్చారు. నేటికీ ఆ పరిహారం అందలేదు. –రాజేశ్వర్, కుభీర్ సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి.. సీఎం రేవంత్రెడ్డి ఈనెల 16న జిల్లాకు రానున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం, నివేదికలతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి పూర్తి చేయించాలన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అటల్ పెన్షన్ యోజన’ అమలులో జిల్లా 107 శాతం నమోదు సాధించినందుకు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్గోపాల్ను కలెక్టర్ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మోములో చిరునవ్వు
బాల కార్మికులలక్ష్మణచాంద: బాలకార్మికులకు విముక్తి కల్పించేందుకు.. చిన్నారుల మోముల చిరునవ్వు చిందించేలా ప్రభుత్వం ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తోంది. వివిధ కారణాల వల్ల చదువులకు దూరమై బాల కార్మికులుగా మారిన పిల్లలను గుర్తించి, వారిని పని నుండి విముక్తి చేసి, తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించి, సమీప పాఠశాలల్లో చేర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. 20 మంది గుర్తింపు.. జనవరి 1 న ప్రారంభమైన కార్యక్రమంలో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో లేబర్ ఆఫీసర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, పోలీస్ అధికారి, ఎన్జీవో ప్రతినిధి సహా ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఒక బృందం భైంసా డివిజన్లో, మరొకటి నిర్మల్ డివిజన్లో తనిఖీలు చేపట్టింది. జనవరి 10వ తేదీనాటికి 20 మంది బాల కార్మికులను గుర్తించారు. వీరిలో నిర్మల్ డివిజన్లో రెండు కేసులు, బైంసా డివిజన్లో ఒక కేసు నమోదయ్యాయి. అందరినీ పాఠశాలల్లో చేర్చారు. ఈనెల 31 వరకు... ఆపరేషన్ స్మైల్ 12వ కార్యక్రమం ఈనెల 31 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ గ్రామాలను సందర్శిస్తూ బాల కార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్టయితే వారిని గుర్తించి పని నుంచి విముక్తులు చేసి బడిబాట పట్టేలా చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 20 మంది బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాం. – దేవి మురళి, డీసీపీవో పకడ్బందీగా నిర్వహణ.. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 12వ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 31 వరకు విస్తృతంగా సర్వే చేపట్టి బాల కార్మికులు పనిచేస్తే గుర్తించి వారిని సమీపంలోని పాఠశాలలో చేర్పిస్తున్నాం. – ఫైజాన్ అహ్మద్, అడిషనల్ కలెక్టర్ ఆరేళ్లలో గుర్తించిన బాలకార్మికుల వివరాలు... సంవత్సరం బాలికలు బాలురు మొత్తం 2020 62 72 134 2021 81 162 243 2022 55 83 138 2023 22 45 67 2024 9 71 80 2025 2 64 66 -
క్యాలెండర్ ఆవిష్కరణ
నిర్మల్టౌన్: నిర్మల్ జిల్లా కోర్టు ఆవరణంలో న్యాయవాద పరిషత్ రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండర్ను న్యాయవాదులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేర్ నరేందర్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి న్యాయవాద పరిషత్ పనిచేస్తుందన్నారు. అలాగే నిరుపేదలకు న్యాయ సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోవర్ధన్, అశోక్, శ్యాం సుందర్రెడ్డి, వీవీ.రమణారావు, కోమ్మోజి రమణ, మధుకర్, వంశీకృష్ణ, రాజేశ్వరరత్నం తదితరులు పాల్గొన్నారు. -
సదర్మాట్ సిద్ధం!
నిర్మల్సీఎం పర్యటన విజయవంతం చేయాలి నిర్మల్చైన్గేట్/మామడ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 16న చేపట్టే నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటనను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి తాహెర్ బిన్ హమ్దాని అన్నారు. మామడ మండలం పొన్కల్ సదర్మాట్ బ్యారేజీని, జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సీఎం సభ కోసం స్థలాన్ని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావుతో కలిసి సోమవారం పరిశీలించారు. మొదట సదర్మాట్ బ్యారేజ్ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఇందులో జిల్లా ఇన్చార్జిలు చంద్రశేఖర్గౌడ్, రామ్భూపాల్, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్: జిల్లాను మరింత సస్యశ్యామలం చేసే దిశగా మరో అడుగు పడుతోంది. దాదాపు పదేళ్లపాటు గోదావరినదిపై మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మాణం కొనసాగిన సదర్మాట్ బ్యారేజీ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈనెల 16న బ్యారేజీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లాకు రానున్నారు. అనంతరం నిర్మల్లో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రేవంత్రెడ్డి జిల్లాకు రానున్నారు. బ్యారేజీ ప్రారంభం, పబ్లిక్ మీటింగ్ రెండు కార్యక్రమాలూ ఉండడంతో జిల్లా ఉన్నతాధికారులతోపాటు కాంగ్రెస్ నాయకులూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్ ప్రతిపాదన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్.రాజశేఖరరెడ్డి వేసిన తొలిఅడుగు ఇప్పుడు తు దిదశకు చేరుకుంది. గోదావరిపై బ్యారేజీ నిర్మాణా నికి వైఎస్సార్ తన హయాంలో ప్రతిపాదనలు పూ ర్తిచేశారు. నీటినిల్వ కోసం చేపట్టిన ఈ బ్యారేజీ ప నులు 2016లోనే ప్రారంభమయ్యాయి. అధికారికంగా 2017లో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు పనులు ప్రారంభించారు. దాదాపు రూ.520 కోట్ల వ్యయంతో పదేళ్లపాటు నిర్మాణ పనులు కొనసాగాయి. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 1,200 ఎకరాల ముంపు భూములు ఉండగా, 18 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. పర్యటన ప్రతిష్టాత్మకంగా... ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి జిల్లాకు తొలిసారి రానుండటంతో అటు జిల్లా అధికారులు, ఇటు కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. బ్యారేజీ వద్ద పనులు పూర్తిచేయడం, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఇరిగేషన్ అధికారులు సీరియస్గా దృష్టిపెట్టారు. ఇప్పటికే ఓసారి జిల్లా ఉన్నతాధికారులు పొన్కల్ వద్ద బ్యారేజీని పరిశీలించి వచ్చారు. మరోవైపు జిల్లాకేంద్రంలో బహిరంగసభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు శ్రమిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు బొజ్జుపటేల్, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ, మున్సిపల్ మాజీచైర్మన్ గణేశ్చక్రవర్తి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ తదితరులు బహిరంగ సభ స్థల పరిశీలన, ఏర్పాట్లపై సోమవారం పర్యవేక్షించారు. పొన్కల్ వద్ద ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సదర్మాట్ బ్యారేజీ సీఎం ముందుకు డిమాండ్లు.. సదర్మాట్ బ్యారేజీకి సంబంధించి పలు డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుకు తీసుకువచ్చేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ ఇలా.. ఈనెల 16న హైదరాబాద్ నుంచి సీఎం నేరుగా ఆది లాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ చనాఖ–కొ రాట పంప్హౌస్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు పొన్కల్ చేరుకోనున్నా రు. సదర్మాట్ బ్యారేజీ ప్రారంభిస్తారు. 2 గంటలకు నిర్మల్ చేరుకుంటారు. మధ్యాహ్నం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. -
యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
నిర్మల్చైన్గేట్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణం త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ది వ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్కుమార్, సీఎస్ రామకష్ణారావుతో కలిసి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలవారీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీలో ముందు వరుసలో ఉంచేలా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతుందన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ నిర్మాణాలపై సమీక్షిస్తూ ఉండాలన్నారు. ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో నిర్మాణ ప్రదేశాలకు వెళ్లి పర్యవేక్షించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి.. వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఫొటో ఎలక్టరోల్స్ జాబితా, డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలు, తదితర అంశాల వివరాలను సీఎస్కు జిల్లాల వారీగా కలెక్టర్లు వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. తగినంత మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారో లేరో పరిశీలన చేసుకోవాలన్నారు. సామగ్రి సమకూర్చుకోవాలన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్సింగ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘పుర’ ఓటర్లు 1,69,285
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వార్డుల వారీగా 2025 అక్టోబర్ 1వ తేదీ నాటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను అనుసరించి రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఈ నెల 1న విడుదల చేశారు. 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 10న ఓటర్ల తుది జాబితాలను విడుదల చేయాల్సి ఉండగా, సవరణకు మరో రెండు రోజులు గడువు విధించారు. ఆ మేరకు అభ్యంతరాలు సవరించి సోమవారం ఓటరు తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు రోజంతా తలమునకలయ్యారు. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితాలు సాయంత్రానికే విడుదల చేయగా, భైంసాలో ఆలస్యంగా విడుదల చేశారు. తుది జాబితాలను మున్సిపల్ కార్యాలయాలతోపాటు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అలాగే పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ సైతం పూర్తి చేసి, 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా, 16న ఓటరు ఫొటోలతో కూడిన జాబితా వెలువరించనున్నారు. వార్డులవారీగా సవరణ... ఓటరు ముసాయిదా జాబితాలో ఎక్కువగా ఒక వార్డులోని ఓటర్లు మరోవార్డులో, ఒకే ఇంటి ఓటర్లు వేర్వేరు వార్డుల్లో.. ఇలా నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు కుప్పలుగా వచ్చాయి. దీంతో మున్సిపల్ అధికారులు వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షేత్రస్థాయిలో విచారించి సవరించారు. నిర్మల్ మున్సిపల్లో 501, భైంసాలో 114, ఖానాపూర్లో 580 అభ్యంతరాలు రాగా, వాటన్నింటినీ వార్డుల వారీగా పరిశీలించి ఓటర్లను సర్దుబాటు చేశారు. ఈ మేరకు తుది జాబితా రూపొందించి విడుదల చేశారు. మున్సిపాలిటీలవారీగా ఓటర్ల వివరాలిలా... పట్టణం వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం నిర్మల్ 42 50,824 47,362 18 98,204 భైంసా 26 25,623 25,486 09 53,118 ఖానాపూర్ 12 9,169 8,524 00 17,693 -
ఘనంగా వివేకానంద జయంతి
భైంసారూరల్: స్వామి వివేకానంద ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ అన్నారు. మండలంలోని కామోల్, ఇలేగాం, మహాగాం, వానల్పాడ్, సుంక్లితోపాటు పలు గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. వివేకానందుని విగ్రహానికి, చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు, విద్యార్థులు స్వామి వివేకానంద చూపిన బాటలో పయనించాలన్నారు. సమాజ సేవపై యువతరం దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చింత చిన్న య్య, డా.దామోదర్రెడ్డి, రామకృష్ణాగౌడ్, నగేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఉపాధి కల్పించాలి
నాకు ఇద్దరు కూమారులు. నా భర్త జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పపత్రిలో అటెండర్ గా పనిచేసేవాడు. అక్టోబర్ 29న విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా అక్కపూర్ గ్రామ రొడ్డు పైన గల ’సోయబీన్ కుప్పను ఢీకొని మరణించాడు. మా కుటుంబము దీన పరిస్థితిలోకి వెళ్లిది. గ్రామంలో ఆశ వర్కర్ పోస్టు ఖాళీగా ఉంది. నాకు ఇప్పించి ఆదుకోగలరు. – ద్యావతి హారిక, న్యూ వెల్మల్ విద్యుత్ స్తంభాలు తొలగించాలి నాకు సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామంలో సర్వే నంబర్ 563/7/5 లో వ్యవసాయ భూమి ఉంది. నా వ్యవసాయ భూమిలో రెండు విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. వీటి కారణంగా నేను వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాను. అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలు తొలగించాలి. – బొడ్డు నరేశ్, చించోలి(బి) -
కల్యాణం.. కమనీయం
నిర్మల్టౌన్/ఖానాపూర్: జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో, ఖానాపూర్ వేంకటేశ్వరాలయంలో గోదాదేవి రంగనాథ కల్యాణం సోమవారం కనుల పండువగా నిర్వహించారు. వేద పండితులు ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపించారు. స్వామికి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి, నిత్య పూజలు అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. ఇందులో ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల నిర్మల్టౌన్: అర్జీదారుని సమస్యను పోలీసులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని, ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. -
పిల్లల్లో దేశభక్తిని పెంచాలి
భైంసాటౌన్: తల్లిదండ్రులు పిల్లల్లో దేశభక్తిని పెంచాలని విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి లింగం సుధాకర్రెడ్డి సూచించారు. పట్టణంలోని కి సాన్గల్లి శ్రీసరస్వతి శిశుమందిర్లో ఆదివారం పూర్వవిద్యార్థుల మహా సమ్మేళనం నిర్వహించారు. 1696–2020 బ్యాచ్ల విద్యార్థులు పాల్గొన్నారు. కా ర్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. సరస్వతి శిశుమందిరాల్లో విద్యార్థులకు చదువుతోపాటు క్ర మశిక్షణ, సదాచారం, దేశభక్తి భావం పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. శిశు మందిరాలు లాభాపేక్ష లేకుండా పని చేస్తున్నాయని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సరస్వతి విద్యాపీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, పూర్వ విద్యార్థి, దక్షిణమధ్య క్షేత్ర ప్రశిక్షణ్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, ఐఆర్ఎస్ అధి కారి వడ్నప్ నిఖిల్, పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులు, పూర్వ ఆచార్యులు పాల్గొన్నారు. -
ముప్పై ఏళ్లకు కలిసిన మిత్రులు
నిర్మల్: ‘అరెరె.. ఎన్నేండ్లయితందిరా నిన్నుజూసి, ఎట్లుండేటోనివి ఎట్లయిపోయినవ్రా..!? అసలేంజేస్తున్నవ్, ఎట్లున్నవ్రా..’ అంటూ గట్టిగ ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ పలకరించుకున్నారు. ‘ఓయ్.. ఏంటే నువ్వు ఇలా మారిపోయావ్, అస్సలు నిన్ను గుర్తుపట్టలేదు తెలుసా..! బడి తర్వాత మళ్లీ అసలు నీ ముఖమే కనిపించలేదే..’ అంటూ ఆశ్చర్యం, ఆనందంతో ఆత్మీయతను పంచుకున్నారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కరుగా వస్తుంటే.. ఆ వేడుక ఆనందాల పండుగలా మారింది. కొంతమంది కళ్లల్లో నీళ్లసుడులనూ తీసుకొచ్చింది. జిల్లాకేంద్రంలోని బాగులవాడ సరస్వతీ శిశుమందిర్లో ఎప్పుడో 1994–95లో పదోతరగతి పూర్తిచేసుకున్న పూర్వవిద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. స్థానిక రెడ్డిగార్డెన్స్లో ముప్పయేళ్ల తర్వాత తొలిసారి పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. విదేశాల నుంచీ వచ్చారు ఆస్ట్రేలియాలో ఉంటున్న రాంగోపాల్, ఉగాండాలో ఉన్న ప్రణీత్, యశోదా ఆస్పత్రిలో అంకాలజిస్ట్గా చేస్తున్న దయాకర్ లాంటి వాళ్లూ సమ్మేళనానికి హాజరయ్యారు. 1994–95లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ బ్యాచ్ నుంచి మూడు స్టేట్ర్యాంక్లు రా వడం గమనార్హం. ఈ సందర్భంగా అంతా కలిసి భోజనాలు చేశారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు రావుల సూర్యనారాయణ, ఆచార్యులందరినీ ఘ నంగా సన్మానించారు. తమను కలిపిన శిశుమందిర్ పునర్నిర్మాణానికీ తమవంతుగా చేయూతనిచ్చేందుకు ముందుకువచ్చారు. -
నిర్మల్
ఆదివాసీల ఆత్మబంధువు.. ఆదివాసీల ఆత్మబంధువు హైమాన్డార్ఫ్ అని ఎంపీ గోడం నగేశ్ కొనియాడారు. జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో డార్ఫ్ దంపతుల వర్ధంతిని నిర్వహించారు. గజ్జలమ్మదేవికి పూజలు కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు శ్రీకాంత్ రామానుజదా స్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకీసేవ నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. తానూరు: జిల్లాలో పలువురు రైతులు ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దిగుబడి, రాబడి లాభసాటిగా ఉండడం, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుండడంతో క్రమంగా జిల్లాలో సాగువిస్తీర్ణం పెరుగుతోంది. ఏటా రైతులు వివిధ పంటలు సాగు చేసి ఏదో రకంగా నష్టపోతూ ఉన్నారు. దిగుబడులు రాక అప్పులపాలవుతున్నారు. దీంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఉద్యానవనశాఖ ముందుకువచ్చింది. ఉద్యానవనశాఖ అధికారులు మల్చింగ్ ద్వారా పంటలు సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మల్చింగ్ పద్ధతి ద్వారా పంటలు సాగు చేసిన రైతులకు ఉద్యానవనశాఖ 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. మల్చింగ్ విధానంలో పంటలు సాగుచేస్తే పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గి దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. మల్చింగ్ సాగు ప్రయోజనాలివే.. రైతులు మల్చింగ్ పద్ధతిలో పంటలు సాగు చేస్తే అ నేక ప్రయోజనాలున్నాయి. పంటలో కలుపు మొక్కలు పెరగవు. భూమిలోని తేమను మొక్కలకు అంది స్తుంది. మొక్కలు బలంగా నాటుకోవడానికి మ ల్చింగ్ షీట్లు ఎంతో ఉపకరిస్తాయి. మల్చింగ్ షీట్లను రైతులు వినియోగించుకోవడానికి ఆసక్తి చూ పుతుండడంతో ఈ షీట్లకు డిమండ్ బాగానే ఉంది. ఉద్యానవన శాఖ అధికారులు కూడా మల్చింగ్ షీట్లను విరివిగా అందించడానికి కృషిచేస్తున్నారు. ఈ ఏడాది కూడా మల్చింగ్ విధానంలో సాగు చేసే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ జిల్లాలో గతేడాది 180మంది రైతులు మల్చింగ్ విధానంలో పండ్లతోటలు, కూరగాయలు, పుచ్చ సాగుచేస్తున్నారు. ఈ పద్ధతిలో సాగుచేసిన పంటలకు నీటి అవసరం చాలా తక్కువ. దీంతో పాటు కూలీల ఖర్చు కూడా మిగతా పంటలకంటే తక్కు వే. పంటలు సాగుచేసిన రైతులకు పెట్టుబడి తగ్గి దిగుబడి అధికంగా వస్తోంది. ఎకరాకు రూ.25వేలు ఖర్చుచేస్తే ఖర్చులు పోను రూ.70 వేలు మిగులుతున్నట్లు రైతులు చెబుతున్నారు. మల్చింగ్ పద్ధతి ద్వారా పండించిన కూరగాయలు, పుచ్చకాయలు ఇతర రాష్ట్రాలకూ సరఫరా చేస్తున్నారు. జిల్లాలో భైంసా డివిజన్లో ఎక్కువమంది రైతులు మల్చింగ్ విధానంలో పంటలు సాగుచేస్తున్నారు. -
రిజర్వేషన్.. టెన్షన్!
నిర్మల్: సంక్రాంతి పండుగ కాగానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుందన్న ప్రచారం జోరందుకుంటోంది. ఓటర్ల జాబితా సోమవారం ఫైనల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్, చైర్మన్ బరిలో నిలువాలనుకునే ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్ కనిపిస్తోంది. నిన్నమొన్నటి దాకా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల లొల్లిలో పడ్డ వారిలో ఇప్పుడు అసలు కలవరం మొదలైంది. తమ వార్డుల్లో రిజర్వేషన్ కలిసొస్తుందా.. లేదా.. అన్న పరేషాన్లో ఉన్నారు. ఇప్పటిదాకా పడ్డ కష్టమంతా వృథా కావొద్దంటే రిజర్వేషన్ కలిసి రావాలని కోరుకుంటున్నారు. కలిసి వస్తుందన్న నమ్మకంతో.. గతంలో వచ్చిన రిజర్వేషన్ల ఆధారంగా ఈసారి ఎలా వస్తాయోనన్న అంచనాలు వేసుకుంటున్నారు. ఒకట్రెండు వార్డులు మినహా దాదాపు అన్ని వార్డుల్లో అంచనా వేయొచ్చన్న నమ్మకంతో ఉన్నారు. కానీ.. మారిన ఓటరు జాబితా లెక్క.. రిజర్వేషన్లలోనూ ఏమైనా మార్పులు జరిగితే ఎలా? అన్నదే ఆశావహుల సందేహం. అలాగే.. తాము బరిలో దిగాలనుకున్న చోట మహిళల రిజర్వేషన్ వస్తే ఎలా..? భార్యనో.. అమ్మనో.. బరిలో దింపాల్సిందేనా? అన్న లెక్కలు వేసుకుంటున్నారు. జనరలో, మహిళనో మొ త్తం మీద తమకు కలిసి వస్తుందన్న నమ్మకంతోనే ఆశావహులంతా గల్లీల్లో తిరుగుతున్నారు. చైర్మన్ స్థానం ఏమొస్తుందో..! వార్డుల్లో పోటీచేసే ఆశావహుల టెన్షన్ ఒకెత్తయితే, చైర్మన్గా బరిలో దిగాలనుకుంటున్న వారి పరేషాన్ మరింత ఎక్కువగా ఉంటోంది. చాలా ఏళ్లుగా చైర్మన్ సీటుపై గురిపెట్టుకున్నా.. రిజర్వేషన్ కలిసిరాకపోతే మరో ఐదేళ్లదాకా వేచిచూడాల్సిందే. చైర్మన్గా గెలిస్తే.. ఐదేళ్లు పురపాలన అనుభవం సాధించడమే కాకుండా ఆ తర్వాత రాజకీయాల్లో మరోమెట్టు ఎదగడానికి అవకాశంగానూ భావిస్తుంటారు. అందుకే.. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లోనూ ప్రధాన పార్టీల నుంచి చైర్మన్ స్థానాలకు ఎవరు పోటీలో ఉన్నారన్న అంశంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఖరారైన తర్వాతనే.. ‘అన్నా.. మనం గెలువాలంటే గల్లీలో కొంతైనా ఖర్చు చేయాల్నే..’ అని అనుచరులు ఎంత ఒత్తిడి తీసుకువస్తున్నా.. చాలామంది ఆశావహులు జేబులో నుంచి రూపాయి కూడా తీయడం లేదు. రిజర్వేషన్లు ఖరారయ్యేదాకా పైసా ఖర్చు చేసేది లేదని చెబుతున్నారు. పక్కాగా తమకు అనుకూలంగా రిజర్వేషన్ వస్తుందన్న లెక్కలున్నచోట మాత్రం సంబంధిత ఆశావహులు కాలనీ అభివృద్ధి కోసమంటూ కాసులు ఖర్చు పెడుతున్నారు. సొంత డబ్బులతో గల్లీల్లో డ్రైనేజీలు కట్టించడం, రోడ్లకు మరమ్మతులు చేయించడం లాంటి పనులు చేస్తున్నారు. -
పాతవి పెంచలే.. కొత్తవి ఇయ్యలే
నిర్మల్చైన్గేట్: ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయూత పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచుతామన్న హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరిచేపోయింది. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు 58 ఏళ్లు నిండిన అర్హులు ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చి నెలలు గడుస్తున్నా కొత్త పింఛన్ల ఊసేలేదు. పాతవి పెంచుతారని, కొత్తవి మంజూరు చేస్తారని.. ఎంతో ఆశగా ఎదురుచూసిన అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపింది. నిరాశలో పింఛన్దారులు చేయూత పింఛన్ లబ్ధిదారులు రాష్ట్ర సర్కారు నిర్ణయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పింఛన్ మొత్తాన్ని పెంచకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. గద్దెనెక్కి రెండేళ్లు గడిచిపోయాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పింఛన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, బోధకాల బాధితులు, డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.2,016 పింఛన్ను ప్రతినెలా అందించింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మొత్తాన్ని రూ.నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. దివ్యాంగులకు రూ.ఆరువేలు చేస్తామని ప్రకటించింది. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పింఛన్ల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం 1,47,103 మంది పింఛన్ పొందుతున్నారు. వీరిలో 35,150 మంది వృద్ధులు, 36,326 మంది వితంతువులు, 10,055 మంది దివ్యాంగులు, 2,110 మంది ఒంటరి మహిళలున్నారు. వీరంతా పింఛన్ మొత్తాన్ని ఎప్పుడు పెంచుతారో? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. పెండింగ్లో 3,320 దరఖాస్తులు జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీ ల పరిధిలో 3,320 మందికి పైగా వివిధ కేటగిరీల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం పెన్షన్ ఎప్పుడు మంజూరు చేస్తుందో తెలి యని పరిస్థితి. దరఖాస్తులపై అధికారులు విచారణ చేపట్టి అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇవే కాకుండా పరిశీలన పూర్తి కాని పెండింగ్ దరఖాస్తులు జిల్లా, మండల స్థాయిలో కోకొల్లలున్నాయి. కాగా, ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నవారికి ఎప్పుడు పింఛన్లు వస్తాయనే సమాచారం లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. పెంపు ఇప్పట్లో ఉండేనా? పింఛన్ల పెంపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు, ప్రతిపాదనలు చేయలేదు. పింఛన్ల పెంపుపై మార్గదర్శకాలు కూడా విడుదల కాకపోవడంతో పెంపు ఇప్పట్లో ఉంటుందా..లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. పింఛన్ల పెంపుపై అంతగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని ప్రతిపక్షాలతోపాటు లబ్ధిదారులు, అర్హులు డిమాండ్ చేస్తున్నారు.జిల్లాలో పింఛన్ల వివరాలు మొత్తం పింఛన్లు 1,47,103 వద్ధాప్య.. 35,150 వితంతు 36,326 వికలాంగుల. 10,055 గీత కార్మికుల 274 పైలేరియా 223 డయాలసిస్ 122 ఒంటరి మహిళ 2,110 బీడీ కార్మికుల 62,062 -
పంట ఆశాజనకంగా ఉంది
ఉద్యానవనశాఖ ప్రోత్సాహంతో ఎకరంలో జామ సాగు చేసిన. 50శాతం సబ్సిడీ ఇచ్చి సహకరిస్తోంది. పంట దిగుబడి కూడా బాగుంది. దీంతో పెట్టుబడి పోను ప్రతీ పంటపై లాభం వస్తోంది. రైతులకు ఉద్యానవనశాఖ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది. – బద్రె సాయినాథ్, రైతు, తానూరు రైతులను ప్రోత్సహిస్తున్నాం ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు ఎంతో ప్రోత్సాహం అందుతోంది. మల్చింగ్ షీట్ల ద్వారా ఉద్యానవన పంటలకు మేలు జరుగుతోంది. పండ్ల మొక్కలు పెంచడంతో రైతులు ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యానవనశాఖ స్కీంలను రైతులకు వివరిస్తున్నాం. ఈ ఏడాది రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. – జావిద్ పాషా, ఉద్యానవనశాఖ డివిజన్ అధికారి -
కేంద్ర పథకాలు ఇంటింటికీ చేరాలి
నిర్మల్చైన్గేట్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరేలా చూడాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన బూత్ నిర్మాణ అభియాన్, రాష్ట్ర కార్యశాలలో మాట్లాడారు. పార్టీ భవిష్యత్ విజయాలకు బూత్స్థాయి పటిష్టతే పునాది అన్నారు. ప్రతీ బూత్ను చైతన్యవంతమైన కార్యాచరణ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేస్తూ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు యాతాళం చిన్నారెడ్డి, నల్లా రవీందర్రెడ్డి, కరిపే విలాస్, జిల్లా కన్వీనర్ నల్లా రమేశ్, కోకన్వీనర్ మాదిరే శ్రీనివాస్, మమత, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. -
నానమ్మ నేర్పింది..
నేను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. సంక్రాంతికి సొంతూరికి వచ్చాను. ఇంటికి రావడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈసారి మా నాన్నమ్మ ప్రత్యేకంగా సకినాలు ఎలా చేయాలో దగ్గరుండి నేర్పింది.. సంప్రదాయ పిండి వంటల్లోని రుచులకు మరేది సాటిరాదు. – బీఎస్.ప్రసన్న, ఎంబీబీఎస్, థర్డ్ ఇయర్, చించోలి(బి), సారంగాపూర్ మా శ్రీవారికి ప్రత్యేకంగా.. వృత్తిరీత్యా మావారు కువైట్ దేశంలో ఉంటున్నారు. ఏటా పండగకు ఇండియాకు వచ్చేవారు. ఈసారి కుదరకపోవడంతో ఇక్కడి పిండి వంటల్ని తనకోసం పంపిస్తున్నాను. తెలుగు వారికి సంక్రాంతి పండగ ప్రత్యేకం. ఇంటిల్లిపాది కలిసి పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. – గోనె శిరీష, గృహిణి, నిర్మల్ -
గాంధీ పేరు తుడిచేయాలనే కుట్ర
నిర్మల్: పేదప్రజల గుండెల్లో నుంచి మహాత్మాగాంధీ పేరు తుడిచివేయాలనే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధిహామీ పథకం పేరు మార్చిందని, ఆ పథకాన్ని నీరుగార్చేందుకే కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావుతో కలిసి శనివారం ప్రెస్మీట్ నిర్వహించారు. తాను, తన కుటుంబం కూడా మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలుగా పనిచేశామన్నారు. ఆ పథకం ఎంతోమంది పేదల కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. పనిదినాలు పెంచడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, పథకాన్ని దెబ్బతీసి, పేదల పొట్ట కొట్టేందుకు కేంద్రం కొత్త చట్టంలో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న కుట్రలపై గ్రామస్థాయి నుంచి ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు. ఈమేరకు జిల్లాలో ఈనెల 20 నుంచి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు జిల్లాకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షినటరాజన్ వస్తారని చెప్పారు. బీజేపీని తిప్పికొట్టాలి.. ఉపాధి పథకం కోసం 40 శాతం నిధులు చెల్లించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, దీనిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని బొజ్జు పటేల్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి మోదీని గద్దె దింపడానికి పోరాడుతున్నారని పేర్కొన్నారు. మత విద్వేషాలతో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనుకుంటున్న బీజేపీని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఈనెల 16న సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించేందుకు సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు వస్తారని బొజ్జు పటేల్ తెలిపారు. సమావేశంలో గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు భీంరెడ్డి, హాదీ, ఆనంద్రావు, మున్సిపల్ మాజీచైర్మన్ గణేశ్చక్రవర్తి, పీసీసీ ప్రధానకార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, సీనియర్ నేతలు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, కృష్ణవేణి, నాందేడపు చిన్ను, సమరసింహారెడ్డి, జునైద్ తదితరులు పాల్గొన్నారు. -
మృత్యు మాంజా!
నిర్మల్టౌన్: సంక్రాంతి పండుగ అనగానే రంగవల్లులు.. ఇళ్లలో పిండి వంటల ఘుమఘుమలు.. ఆ కాశంలో పతంగులు.. గుర్తొస్తాయి. ముగ్గులతో ఆడ పిల్లలు తమ కళానైపుణ్యం ప్రదర్శిస్తారు. ఇక పిండి వంటల తయారీలో మహిళలు బిజీగా గడుపుతారు. పిల్లలు, యువత పంగులు ఎగురవేస్తూ సందడి చేస్తారు. పోటీల్లో తమ గాలిపటం ఎత్తుకు ఎగరాలని, ప్రత్యర్థి పతంగిని పడగొట్టాలని చూస్తారు. ఈ క్రమంలోనే నిషేధిత చైనా మాంజా కొంటున్నారు. ఇది పక్షులు, జంతువులతోపాటు మనుషులకు కూడా ప్రాణాంతకంగా మారింది. పండగ సమయంలో గాలిపటాలకు కట్టి ఎగురవేయడంతో తర్వాత అవి చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి. రసాయనాలతో కూడిన దారం.. గాజుపొడి, ప్రమాదకర రసాయనాలతో తయారైన చైనా మాంజా తక్కువ ధరకు, రంగురంగుల్లో, అధిక బలంతో మార్కెట్లో ఆకర్షిస్తుంది. సాధారణ తాళ్ల దారాలతో పోల్చితే ధర తక్కువ కావడం వల్ల ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటారు. కానీ ఇది పర్యావరణానికి, జీవాల పాలిట మృత్యు దారం. పోలీసులు కొనుగోలు, విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటున్నా విక్రయాలు ఆగడం లేదు. 2017లో నిషేధం.. 2017 రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించింది. 1998 పర్యావరణ చట్టం ప్రకారం అమ్మకం, కొనుగోలు చేస్తే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండేళ్ల క్రితం మళ్లీ నిషేధం మరోమారు పునరుద్ధరించారు. అయినా మార్కెట్లలో గుట్టుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి జిల్లాకు సరఫరా జరుగుతోంది. లభాపేక్షతో.. వ్యాపారులకు ఒక మాంజాపై రూ.20 లాభం వస్తుంది. అక్రమ దిగుమతులతో పెద్ద లాభాలు సంపాదించే మధ్యవర్తులు ఉన్నారు. దీంతో వ్యాపారులు కూడా చైనా మాంజా విక్రయానికే మొగ్గు చూపుతున్నారు. డిమాండ్ ఉందని ప్రాణాపాయాలను పట్టించుకోకుండా అమ్మకాలు చేస్తున్నారు. పక్షులు, జంతువులు, మనుషులపై ప్రభావం.. చైనా మాంజా పతంగులు ఎగురవేస్తున్న సమయంలో ఎగురవేసే వారి చేతులకు, పక్షులకు తీవ్ర గాయాలు అవుతాయి. దారం చెట్లు, విద్యుత్ స్తంభాలకు చిక్కుకుని వేలాడుతూ ఎగిరే పక్షులను చంపతున్నాయి. ఇళ్లలలో తిరిగే కోతుల మెడకు చుట్టుకుని ఉసురు తీస్తున్నాయి. వాహనదారులు రోడ్లపై వెళ్తున్న సమయంలో గొంతులను కోస్తున్నాయి. ఖానాపూర్: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఇమ్రాన్ కలెక్షన్స్ పేరుతో ఉన్న బట్టల షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 32 నిషేధిత చైనా మాంజాలను పట్టుకున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. దుకాణం యజమాని ఎండీ.అస్లాంపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
మంత్రి అజారుద్దీన్ను కలిసిన మైనార్టీ నాయకులు
బాసర: రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ను బాసర గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు ఎండీ.మొయినుద్దీ న్ఖాజీ ఆధ్వర్యంలో శనివారం కలిశారు. శుభాకంక్షలు తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మైనార్టీలు విద్యలో ముందుండాలని సూచించారు. సమస్యలపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో అజ్గర్, లాల్ మియ్యా, ఖలీల్ తదితరులు ఉన్నారు.


