breaking news
Nirmal District Latest News
-
ఐదు రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి
నిర్మల్టౌన్: ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన పీఎల్ఐ(పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీమ్ను ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చే శారు. నిర్మల్ రీజియన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రధాన డిమాండు పరిష్కరించాలని ఈనెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపా రు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమ్మెలో టి.శ్రీనివాస్, శ్రీధర్, లక్ష్మణ్, పోశెట్టి, వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు -
జపాన్ పిల్లలకు జాడి శ్రీనివాస్ పాఠాలు
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ పీఎంశ్రీ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు జాడి శ్రీని వాస్ అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నేతృత్వంలో 29 మంది ఉపాధ్యాయులు, ఎస్సీఈఆర్టీ సభ్యులు, వ్యక్తిత్వ వికాస నిపుణులతో కూడిన బృందం జపాన్లో విద్యా మా ర్పిడి, అధ్యయన పర్యటనలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ సుకుబా, చియోడా యూనివర్సిటీ, ఒట్సుకా ఉన్నత విద్యాసంస్థలు సహా ప్రముఖ పాఠశాలలు, సాంకేతిక సంస్థలను సందర్శించా రు. టోక్యో కోసెన్ రోబోటిక్ విద్యావిధానాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, శిక్షణ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సాంకేతిక సహాయంతో అందిస్తున్న సమగ్ర విద్యా విధానాలను కూడా పరిశీలించారు. పరిశోధనా పత్ర ప్రదర్శన..అంతర్జాతీయ సదస్సులో మస్కాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. తెలంగాణలో అమలవుతున్న వినూత్న గణిత బోధనా పద్ధతులు, విద్యార్థుల ప్రతిభాభివృద్ధి, నైపుణ్యాల పెంపుపై వివరాలు అందించారు. ఆయన ప్రదర్శనను అభినందిస్తూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆకావో, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కలిసి ప్రశంసాపత్రం అందజేశారు. పర్యటనలో భాగంగా జాడి శ్రీనివాస్ జపాన్లోని ఒక జూనియర్ హైస్కూల్లో 9వ తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. -
విచారణ హైరానా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర పరిశీలన(ఎస్ఐఆర్)లో అన్మ్యాపింగ్, అనామలీస్ ఓటర్ల పరిశీలనతో బీఎల్వోలు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఓటర్లకు నోటీసుల జారీ నుంచి విచారణ(హియరింగ్) చేపట్టడం వరకు ప్రయాసగా మారింది. ఓటర్లకు తగిన రుజువులు లేకపోతే మరోసారి రావడం, ఓటర్లు నిర్ణీత సమయంలో బీఎల్వోల ముందు హాజరు కావడం లేదు. ఆ తేదీలు రద్దు(ల్యాప్స్) అవుతున్నాయి. బీఎల్వోలు ప్రతీ ఓటరు ఫొటో తీసుకుని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో చాలా చోట్ల వేలాది మంది ఓటర్ల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఒక్కో రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సగటున కనీసం వెయ్యికిపైనే ఓటర్ల పరిశీలన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొందరు తగిన రుజువులు తీసుకురాకపోవడంతో మళ్లీ మళ్లీ హియరింగ్ ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలకు చాలామంది పదో తరగతి మా ర్కుల మెమో, బ్యాంకు పాస్బుక్, లేదా కుల ధ్రువీ కరణలు అడుగుతున్నారు. ఆధార్, పాన్, రేషన్ కార్డులు ఆమోదించక ఇబ్బందులు వస్తున్నాయి. గడువులోపు పూర్తయ్యేనా?ప్రస్తుతం ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. అదే సమయంలో ఓటర్ల తప్పులను సరి చేస్తున్నారు. వేలాది ఓటర్లకు నోటీసుల జారీ, హియరింగ్, తేదీలు, బీఎల్వోలు ధ్రువపత్రా ల పరిశీలన నుంచి ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది, జిల్లా ఎన్నికల అధికారుల వరకు పరిశీలన చేయా లి. దీంతో గడవులోపు సర్ ప్రక్రియ పూర్తవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నిక ల కమిషన్ తుది జాబితా ప్రచురణకు అక్టోబర్ 15నుంచి నవంబర్ 9వరకు గడువు పొడగించింది. నియోజకవర్గాల వారీగా నోటీసుల వివరాలు ని.వర్గం నోటీసులు జారీ చేసింది పెండింగ్ హియరింగ్ హియరింగ్ ల్యాప్స్ సిర్పూర్ 53,245 37,474 15,771 7,564 17,081 ఆసిఫాబాద్ 52,647 30,990 21,657 6,608 14,398 చెన్నూరు 57,380 43,445 13,935 1,586 39,674 బెల్లంపల్లి 45370 39,629 5,741 1,828 21,344 ఆదిలాబాద్ 85525 23,596 61,929 3,339 56,722 బోథ్ 64,900 54,386 10,514 10,671 32,762 ఖానాపూర్ 68,052 62,436 5,616 13,964 25,462 నిర్మల్ 83,370 65,818 17,552 14,377 57,800 ముథోల్ 70,581 65,348 5,233 20,019 28,582 మంచిర్యాల 68,218 43,481 24,737 10,019 16,407 -
అంగన్వాడీ ‘కొలువు’ పిలుపు
నిర్మల్చైన్గేట్: అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఎట్టకేల కు గ్రీన్ సిగ్నల్ లభించింది. మూడు, నాలుగేళ్లుగా జిల్లాలో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో టీచర్లు, ఆయాలు లేకుండానే కేంద్రాలు నడుస్తున్నాయి. పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఖాళీగా ఉన్న టీచర్, ఆయాల పోస్టుల ను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొదటి విడతగా జిల్లాలోని టీచర్ల పోస్టులకు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకటన విడుదలైంది. తొలివిడత టీచర్ పోస్టులే..జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 89 టీచర్, 459 ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం 89 టీచర్ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. ఏళ్లుగా సిబ్బంది లేక చిన్నారులకు ప్రీస్కూల్ విద్య, పోషకాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడింది. 30 వరకు దరఖాస్తుల స్వీకరణమొత్తం 89 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ విధానంలో ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్గా నిర్ణయించింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండాలి. అభ్యర్థి ఏ అంగన్వాడీ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంటున్నారో.. ఆ గ్రామం, హాబిటేషన్, వార్డు నివాసై ఉండా లి. ఎంపిక విధానంలో ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్, జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంట ర్వ్యూలకు రోస్టర్ నిబంధనలు పాటించి ఎంపిక చేయనున్నారు. దళారులను ఆశ్రయించొద్దు.. జిల్లాలో తొలివిడతగా 89 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. దళారులను నమ్మి మోసపోవద్దు. ఈ నెల 30 వరకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. –వినూత్న, డీడబ్ల్యూవో -
అమరుల కుటుంబాలకు వీర్ ఫ్యామిలీ కార్డులు
నిర్మల్టౌన్: పోలీస్ అమరవీరుల కుటుంబా లకు సంక్షేమ ప్రయోజనాలు సులభంగా అందేలా ప్రభుత్వం రూపొందించిన టీజీ వీర్ ఫ్యామిలీ కార్డులు ఎస్పీ జానకీషర్మిల శుక్రవారం పంపిణీ చేశారు. ఆర్థిక సహాయం, పింఛన్లు, కారుణ్య నియామకాలు, ఇంటి స్థలాలు తదితర ప్రయోజనాల వివరాలు ఈ కార్డు ద్వారా నమోదు చేసి, వాటి పురోగతిని సులభంగా తెలు సుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమన్నా రు. వారి కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివా స్, పాల్గొన్నారు. -
ఉత్తమ వైద్యులుగా ఎదగాలి
లోకేశ్వరం: ఎంబీబీఎస్ సీట్లు సాధించడం ఎంత ముఖ్యమో.. ఉత్తమ వైద్యులుగా ఎదగడం అంతకన్నా ముఖ్యమని, ఉత్తమ వైద్య సేవలందిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిర్మల్ ప్రముఖ ప్రభుత్వ వైద్యుడు డాక్టర దేవేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన లోకేశ్వరానికి చెందిన మెండె సాయిచైతన్య, తోకల ముత్తవ్వ, మేఘన, ధర్మోరకు చెందిన మనీష్, భాగాపూర్కు చెందిన హర్షనవ్యశ్రీను శుక్రవారం సన్మానించారు. అనంతరం దేవేందర్రెడ్డి మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు కేవలం 1100 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే 13 వేలు ఉన్నాయన్నారు. ఇప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పీజీతోపాటు స్పెషలైజేషన్ పై దృష్టిసారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. చిన్నతనంలో తల్లిదండ్రులు కోల్పోయినా పట్టుదలతో చదివి సీటు దక్కించుక్నున తోకల ముత్తవ్వకు ఐదు ఏళ్లు వైద్య విద్యకయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. మొదటి ఏడాది ఫీజు కింద రూ.25 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దర్వాడి కపిల్, మాజీ సర్పంచ్ మెండె శ్రీధర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భూజంగ్రావు, నాయకులు సురేశ్రావు, విజయరావ్, నరేందర్రెడ్డి, ముత్తన్న, రమణారావు పాల్గొన్నారు. -
భగీరథ ప్రయత్నం
లీకేజీ నీటిని కిందకు తీసుకురావడానికి ముఠాపూర్, న్యూ వెల్మల్, రాచాపూర్ గ్రామా ల రైతులు సొంత డబ్బులతో టిప్పర్ల ద్వారా మట్టిని తెప్పించి జేసీబీ సహాయంతో వాగులో గండి పడ్డ ప్రదేశంలో పోస్తున్నారు. ఈ విధంగానైనా నీరు కిందకు వస్తే పంటలను కాపాడుకుంటామని, లేకుంటే పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు కాలువలో అక్కడక్కడ ఉన్న నీటిని మోటార్ల వద్దకు తీసుకురావడానికి పారలతో కాలువలు తీసి నీరు ప్రవహించేలా చేస్తూ పంటలను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. -
అన్నదాత వరి గోస
లక్ష్మణచాంద: దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు వ్యవసాయంలో ఎన్ని నష్టాలు ఎదురైనా అధైర్యపడకుండా, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి పంటలు పండిస్తారు. భూమాతను నమ్ముకుని మళ్లీ పంటలు పండిస్తారు. ఈ ఏడాది ఎల్నినోకు ఎదురొడ్డుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. జూలైలో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో రైతులు వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను సాగు చేశారు. అయితే తర్వాత భారీ వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. తడారుతున్న వరి..జిల్లాలో సరైన వర్షాలు కురవడం లేదు. రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలకు నీరు అందక అవి ఎండిపోతున్నాయి. ముఖ్యంగా వరి వేసిన రైతులు పంట తడి కోసం కంటతడి పెడుతున్నారు. వారం రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరి పైర్లలో తడారుతోంది. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. సంక్షోభంలో 16 వేల ఎకరాలు..సరస్వతి కాలువ కింద 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధానంగా నిర్మల్ రూర ల్, సోన్, లక్ష్మణచాంద మండలాల రైతులు ఈ ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నా రు. బోరు బావులు ఉన్న రైతులు తమ పంటలకు నీరు అందిస్తూ కాపాడుకుంటున్నారు. అయితే కాలువపై ఆధారపడిన రైతులు నీరు రాకపోవడంతో మరో రెండు రోజులు ఎండలు కొనసాగితే వరి, మొక్కజొన్న, సోయా పంటలు సుమారు 4,000 ఎకరాల్లో ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. లీకేజీ నీరు వాగులోకి..వర్షాలు లేక ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో స రస్వతీ కాలువ లీకేజీ ద్వారా కొంత నీరు వస్తోంది. ముఠాపూర్–న్యూ వెల్మల్ సమీపంలో కాలువ కింద నుంచి ముఠాపూర్ వాగు ప్రవహిస్తుంది. కాలువ స్లాబ్కు గండ్లు పడటంతోపాటు చెత్త, ప్లాస్టిక్ బాటి ళ్లు అడ్డుగా ఉండటం లీకేజీ నీరు వాగులోకే వెళుతోంది. కిందకు చుక్క నీరు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. -
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కా ర్యాలయంలో వైద్యాధికారులు, వివిధ విభాగా ల అధిపతులతో శుక్రవారం సమీక్షించారు. రోజు వారీగా నమోదవుతున్న ఓపీ వివరాలతోపా టు వివిధ విభాగాల్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, రేడియాల జీ, ఈఎన్టీ తదితర విభాగాల్లో వైద్య సేవల మెరుగుదలకు అవసరమైన పరికరాలు, శస్త్రచికిత్సకు అవసరమైన యంత్రాల వివరాలు సేకరించారు. అవసరమైన పరికరాలను ప్రాధాన్యత క్రమంలో సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పార్కింగ్ స్థలాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సమావేశంలో ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్సింగ్, అధికారులు రమేశ్, సరోజ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అండగా నిలవని ‘సరస్వతి’
జిల్లాలోని నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో సరస్వతి కాలువ ప్రవహిస్తుంది. మొదట్లో ఎల్ని నో కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయని వ్యవసాయాధికారులు సూచించడంతో కాలువ ఆయకట్టు కింద పంటలు సాగు చేయవద్దని రైతులు భావించారు. అయితే జూలైలో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో ప్రాజెక్టు నిండి కాలువకు నీరు విడుదలవుతుందని ఆశతో పంటలు సాగు చేశారు. కానీ ఆగస్టులో వర్షాలు లేక ప్రాజెక్టు నిండకపోవడంతో సరస్వతి ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, సోయా, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. -
గణేశ్ మండపాలకు అనుమతి తప్పనిసరి
భైంసా: గణేశ్ ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందస్తుగానే అవసరమైన దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మండపాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, అగ్నిమాపక భద్రత, ఊరేగింపు, నిమజ్జనం వంటి అంశాల్లో నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఈ మేరకు కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ఉత్సవ సమితుల సభ్యులతో సమీక్ష నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. మండల స్థాయిలోనూ అధికారులు గణేశ్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి ముందస్తు చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్ ముందుగానేమండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా కోసం సంబంధిత విద్యుత్ శాఖకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా వైరింగ్ ఏర్పాటు చేయాలి. అనధికారిక కనెక్షన్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ చర్యలు తప్పనిసరిఅగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచడంతో పాటు విద్యుత్ తీగలు, అలంకరణ సామగ్రిని సురక్షితంగా ఏర్పాటు చేయాలి. అత్యవసర సమయంలో బయటకు వెళ్లేందుకు మార్గం ఉండేలా చూడాలి. ఊరేగింపు వివరాలు తెలియజేయాలి..గణేశ్ నిమజ్జన ఊరేగింపు మార్గం, సమయం తది తర వివరాలను పోలీసులకు ముందుగానే తెలియజేయాలి. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు శాంతిభద్రతలకు విఘా తం కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలి. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా మండపాల నిర్వాహకులు అన్ని ప్రక్రియలను ముందుగా నే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. మండల స్థాయిలో సమావేశాలుజిల్లా స్థాయిలో ఇప్పటికే గణేశ్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో మండలస్థాయి అధికారులు కూడా స్థానిక ఉత్సవ సమితులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ పోర్టల్లో నమోదు, విద్యుత్ సరఫరా, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలపై నిర్వాహకులకు అవగాహన కల్పించనున్నారు.పోలీస్ పోర్టల్లో నమోదుమండపాల నిర్వాహకులు తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్ htt p//policeportal.tspolice.gov.in/ index.htm ద్వారా ఆన్లైన్లో వివరాలు న మోదు చేయాలి. పోర్టల్లో మండపం ఏర్పా టు చేసే ప్రాంతం, నిర్వాహకుల వివరాలు, విగ్రహ ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జనం తదితర సమాచారాన్ని నమోదు చేయాలి. -
పుష్కరాల పనులు సమన్వయంతో చేపట్టాలి
బాసర: గోదావరి పుష్కరాల పనులు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకీషర్మిలతో కలిసి బాసర ఈవో కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పుష్కర స్నానాల కోసం బాసరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పనులన్నీ నాణ్యతతో ఉండాలని సూచించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. హెలీ ప్యాడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ, పుష్కరాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పిస్తామన్నారు. సంబంధిత శాఖల అధికా రుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, కేంద్రీకృత విధానం ద్వారా నిఘా ఉంచుతామన్నారు. సీసీ కెమెరాల సహాయంతో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ఈఈలు సుభా ష్, సందీప్, శంకరయ్య, అనిల్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీపవన్ చంద్ర పాల్గొన్నారు. -
బిల్లుల కోసం ధర్నా
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ డిమాండ్ చేశారు. ఈమేరకు డీఈవో కార్యాలయం ఎదుట గురువా రం ధర్నా నిర్వహించారు. నెలల తరబడి వేతనా లు, బిల్లులు పెండింగ్లో ఉండడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ పేరుతో బిల్లులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా వేతనాన్ని నెలకు రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు పెంచాలని, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న అల్పాహారం బిల్లులను చెల్లించడంతోపా టు రాగిజావాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నా రు. ధర్నాలో యూనియన్ నాయకులు కె.రాధ, లక్ష్మి, సునీత, భాను పాల్గొన్నారు. -
యూనివర్సిటీదే బాధ్యత..
అకారణంగా మాల్ప్రాక్టీస్ అంటూ ఫలితాన్ని ప్రకటించి విద్యార్థుల విలువైన జీవితాన్ని దెబ్బతీయడం సరికాదు. గంగాభవాని విద్యాసంవత్సరం కోల్పోవడానికి యూనివర్సిటీ బాధ్యత వహించాలి. – సింగరి వెంకటేశ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అడిగినా వివరాలు ఇవ్వలేదు.. నా బిడ్డ బాగా చదివి పరీక్షలన్నీ మంచిగా రాసింది. అయినా ఫలితాల్లో మాల్ప్రాక్టీస్ అని ఇచ్చారు. ఎందుకిలా ఇచ్చారని వరంగల్ దాకా రెండుమూడుసార్లు వెళ్లి యూనివర్సిటీ సార్లను అడిగినం. కానీ.. వారు సరైన సమాచారం ఇవ్వకుండా.. మళ్లీ పరీక్షలు రాయాల్సిందే.. అంటూ తిప్పిపంపించారు. –బర్కుంట గంగారాం, గంగాభవాని తండ్రి -
చాకలి ఐలమ్మ వర్ధంతి
నిర్మల్చైన్గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను వివరించారు. నాటి కాలంలోనే దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని లిఖించిందని తెలిపారు. చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, సీపీవో గంగారెడ్డి పాల్గొన్నారు. -
పోషణకు అభయం
లోకేశ్వరం: చిన్నారులు, మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 8 వరకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.జంక్ ఫుడ్ వినియోగం తగ్గించడం, చక్కెర, ఉప్పు, నూనె వాడకాన్ని పరిమితం చేయడంపై ప్రచారం నిర్వహించనున్నారు. నెల రోజులపాటు ప్రతిరోజూ ఒక కార్యక్రమం నిర్వహించేందుకు క్యాలెండర్ రూపొందించారు. నెలరోజులు కార్యక్రమాలు ఈ నెల 9 నుంచి అక్టోబర్ 8 వరకు ప్రతిరోజూ ఒక కార్యక్రమం రూపొందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పాలిచ్చే తల్లులు, శిశువులు, చిన్నపిల్లల పోషణపై సలహా సమావేశాలు, పౌష్టికాహారం తయారీపై వంటకాల పోటీలు నిర్వహిస్తారు. కిశోర బాలికలు, పెద్దవారికి బీఎంఐ పరీక్షలు, పిల్లల ఎత్తు–బరువు కొలతలు తీస్తారు. ఆహారంలో చక్కెర, నూనె వినియోగం తగ్గించే విషయంపై అవగాహన కల్పిస్తారు. నిర్వహణ ఏర్పాట్లు.. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. నిర్దేశిత క్యాలండర్ ప్రకారం నిత్యం ఓ కార్యక్రమం నెలరోజులపాటు నిర్వహిస్తాం. చిన్నారులు, మహిళలకు ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తాం. – వినూత్న, డీడబ్ల్యూవో ప్రతీ ఇంటికీ పోషణ సందేశం చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పోషణ మాసంలో ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆశ కార్యకర్తల ద్వారా లేఖలు పంపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రారంభమైన పోషణ మాసోత్సవం జిల్లాలో ఇలా.. జిల్లాలో ఖానాపూర్, భైంసా, నిర్మల్, ముధోల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 931 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో 0–3 ఏళ్ల చిన్నారులు 27,853 మంది, 3–6 ఏళ్ల చిన్నారులు 22,383 మంది నమోదయ్యారు. గర్భిణులు 5,415, బాలింతలు 3,399 మంది ఉన్నారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలు 277 మంది, తక్కువ పోషకాహార లోపం ఉన్న పిల్లలు 1,345 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చిన్నారులను పోషకాహార లోపం నుంచి దూరం చేసేందుకు ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టారు. -
బ్రేక్ఫాస్ట్.. ఎప్పుడో!
నిర్మల్మట్టి గణపతులను పూజిద్దాం నిర్మల్చైన్గేట్: మట్టి గణపతులు పూజించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్లో గురువారం అధికారులకు, సిబ్బందికి అదనపు కలెక్టర్ మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, కృత్రిమ రంగులతో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన విగ్రహాలనే పూజించాలన్నారు. లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అనేక మంది విద్యార్థులు ఉదయం ఇంట్లో సకాలంలో ఆహారం దొరకక, ఖాళీ కడుపుతోనే పా ఠశాలకు చేరుతున్నారు. మధ్యాహ్నం వరకు ఆకలి తో ఉండడంతో పాఠాలపై దృష్టి సారించలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఈ సమస్యను గమనించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించాలని నిర్ణయించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన ఒక రకం అల్పాహారం అందిస్తామని తెలిపారు. ముందుగా హైదరాబాద్ చుట్టుపక్కల పాఠశాలల్లో ప్రారంభించి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. జిల్లాలో 40,365 మంది.. జిల్లాలో 498 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 82 ప్రాథమికోన్నత పాఠశాలలు, 118 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 698 పాఠశాలల్లో 40,365 మంది విద్యార్థులు చదువుతున్నారు. బ్రేక్ఫాస్ట్ పథకం అమలైతే ఈ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరుతుంది. హరేకృష్ణ సంస్థకు బాధ్యత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం హరేకృష్ణ సంస్థకు అప్పగించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జూన్ 15న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇటీవల ఇతర జిల్లాల్లో కూడా ప్రారంభిస్తున్నారు. జిల్లా పాఠశాలల్లో ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో చదువుతున్న విద్యార్థులు, దీని ప్రభావం చదువుపై పడుతోందని వాపోతున్నారు. స్థల పరిశీలన పూర్తి.. జిల్లాలో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కోసం హరేకృష్ణ సంస్థ ప్రతినిధులు గత నెల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదామును పరిశీలించారని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. స్థల పరిశీలన పూర్తయిందని వారు చెప్పారు. హరేకృష్ణ సంస్థ బృందం ‘సాక్షి’తో మాట్లాడుతూ, రెండు, మూడు రోజుల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని తెలిపింది. పనులు పూర్తి చేసి రెండు నుంచి రెండున్నర నెలల్లోగా విద్యార్థులకు అల్పాహారం అందించే ప్రక్రియ మొదలుపెడతామని పేర్కొన్నారు. ఉద్యాన పంటలపై అవగాహన తానూరు: మండలంలోని కోలూరు, ఎల్వత్ గ్రామాల్లో రైతులు సాగు చేసిన ఉద్యాన పంటలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి బీవీ.రమణ పరిశీలించారు. కూరగాయల సాగు లాభదాయకమన్నారు. తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కూరగాయలు సాగుచేసే రైతులు ముందుగా ఉద్యానవన అధికారులకు దరఖాస్తులు చేసుకుంటే వారికి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఆయన వెంట ఉద్యానవన విస్తరణ అధికారి జావీద్పాషా, మోయిన్ మియా, కోలూరు సర్పంచ్ మాధవ్రావు రైతులు ఉన్నారు. జిల్లా సమాచారం.... ప్రాథమిక పాఠశాలలు 498ప్రాథమికోన్నత పాఠశాలలు 82ఉన్నత పాఠశాలలు 118లబ్ధి చేకూరే విద్యార్థులు 40,365 -
రుచికరమైన భోజనం అందించాలి
లక్ష్మణచాంద: విద్యార్థినులకు రుచికరమైన భోజ నం అందించాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్ సభ్యులు సరిత, ప్రేమలత అగర్వాల్ ఆదేశించారు. బుధవారం లక్ష్మణచాంద కేజీబీవీని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. వంట గదిలో ని సరుకులు, కూరగాయలు పరిశీలించారు. వంట లు రుచి చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం విద్యార్థినుల జూడో, కరాటే ప్రతిభను గుర్తించి అభినందించారు. విద్యార్థినులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థినులకు మాక్ అసెంబ్లీని నిర్వహించాలని, జీకే, వివిధ సమకాలిన అంశాలపై బోధించాలని సూచించారు. కంప్యూటర్ ల్యాబ్లో పరీక్ష రాస్తున్న విద్యార్థినులతో మాట్లాడా రు. వసతుల గురించి ఎస్వో నవితను అడిగి తెలు సుకున్నారు. వారి వెంట డీఈవో భోజన్న, ఐసీడీఎ స్ సీడీపీవో సరిత, సూపర్వైజర్ ప్రసూన కుమారి, ఎంఈవో రాజునాయక్ తదితరులున్నారు. సోన్ మండ లం లెఫ్ట్ పోచంపాడ్లో.. సోన్ మండలం లెఫ్ట్పోచంపాడ్ బాలికల గురుకుల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర బాలల హ క్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సరిత, ప్రేమలత తనిఖీ చేశారు. వంటశాల పరిశీలించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. -
మాదకద్రవ్యాల నివారణపై అవగాహన
ఖానాపూర్: జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు మాదకద్రవ్యాల ని వారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించా రు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, నశా ముక్త్ భారత్ అభియాన్ మార్గదర్శకాలకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్పై ప్రదర్శన ద్వారా విద్యార్థులకు డ్రగ్స్తో కలిగే అనర్ధాలను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల జిల్లా నార్కోటిక్ విభాగం ఇన్చార్జి రాజశేఖర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు. మెదడు పనితీరు, ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి క్షీణించి విద్యార్థుల భవిష్య త్ నాశనమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. డ్రగ్స్కు బానిసైతే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల కొనుగోలు, విక్రయం, రవాణా, నిల్వ, విని యోగం చట్టరీత్యా తీవ్రమైన నేరాలని తెలిపారు. డ్రగ్స్కు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా యాంటీ డ్రగ్ టోల్ఫ్రీ నంబర్ 1908కు సమాచారం ఇవ్వాలని కోరారు. హెచ్ఎం నరేందర్, ఉపాధ్యాయులు అంజయ్య, షేక్ ఇమ్రాన్ తదితరులున్నారు. -
పర్యాటకరంగ అభివృద్ధికి పటిష్ట చర్యలు
నిర్మల్చైన్గేట్: జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పర్యాటక ప్రాధాన్యత క లిగిన ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం జిల్లాకు నోడ ల్ పర్యాటక అధికారిని నియమించాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, రవాణా, మరుగుదొ డ్లు, పార్కింగ్, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు, భద్రత తదితర మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు. సినిమాల చిత్రీకరణకు అనువైన ప్రకృతి, చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను గుర్తించి అవసరమైన సదుపాయాలతో అభివృద్ధి చేయాలని పే ర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, విద్యార్థులకు పర్యాటక రంగంపై వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీపీవో శ్రీనివాస్, డీఐఈవో పరశురామ్, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిష్టర్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక వ్యవస్థ పనితీరును తనిఖీ చేశారు. గోదాం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న భద్రత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు గండ్రత్ రమేశ్, సిరికొండ రమేశ్, మజార్, ముజాహిద్, కోరిపెల్లి శ్రావణ్రెడ్డి, అజార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భరోసా కేంద్రం తనిఖీ
నిర్మల్టౌన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి పోరిక రవీందర్ బుధవారం జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. సేవలు, సౌకర్యాలు పరిశీలించి సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు సకాలంలో సహాయం అందించి వారి వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించారు. అనంతరం బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి బాలల సంరక్షణ, భద్రత, హక్కు ల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.భవిష్య, భరోసా కేంద్రం ఎస్సై సుమాంజలి, సిబ్బంది పాల్గొన్నారు. -
సోయా పంట పరిశీలన
కుంటాల: మండలంలోని ఓల శివారులోని రైతు కృష్ణారావు సాగు చేస్తున్న సోయా పంటను బుధవారం పలువురు పరిశీలించారు. హైదరాబాద్ ప్రొఫెసర్ అజయ్శంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయ విత్తన కేంద్రం పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ బలరాం, డాక్టర్ రాజేందర్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నిర్మల్ శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ రైతులకు పలు సూచనలు చేశారు. సస్యరక్షణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడి సాధ్యమని తెలి పారు. సోయాలో పండాకు, ఆకుమచ్చ తెగుళ్ల ను గుర్తించి నివారణ చర్యలు సూచించారు. ఏ ఈవోలు శ్రీనివాస్, హర్షిత తదితరులున్నారు. -
గ్యాస్ గోస!
నిర్మల్కాళోజీకి ఘన నివాళి నిర్మల్చైన్గేట్: ప్రజాకవి కాళోజీ నారాయణరా వు జయంతిని బుధవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు క లెక్టర్ వెంకటేశ్వర్లు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ యాసలో తాను రాసిన కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని కొనియాడారు. ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేశ్, బీసీ, ఎస్సీ సంక్షేమాధికారులు శ్రీనివాస్, దయానంద్, హార్టిక ల్చర్ అధికారి రమణ, ఎల్డీఎం రామ్గోపాల్, అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: ఎల్పీజీ దిగుమతుల్లో నెలకొన్న అనిశ్చితి జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్యాస్ కొరత, రీఫిల్ బుకింగ్ గడువు పెంపు ప్రభావం కొత్త కనెక్షన్ల డిమాండ్ను ఒక్కసారిగా పెంచేసింది. మార్చి నుంచి చమురు సంస్థలు కొత్త కనెక్షన్ల జారీని నిలిపివేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో బుకింగ్ కోసం 45రోజుల గడువు విధించగా ఇటీవల 25రోజులకు కుదించారు. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గినా ఆ ప్రభావం ఇంకా గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పడుతోంది. గతంలో ఒక్క రోజులోనే కొత్త కనెక్షన్తో పాటు డబుల్ సిలిండర్ కూడా మంజూరయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా నూతన గ్యాస్ కనెక్షన్లు, రెండో సిలిండర్ల మంజూరు నిలిపివేశారు. ఈ నిబంధనలతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లకు భారీ డిమాండ్ ఉంది. యుద్ధం ముగిసినా నిరీక్షణే.. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకో సిలిండర్ తప్పనిసరి అవుతోంది. అయితే, ప్రస్తుతం అమలవుతున్న గడువుతో వినియోగదారులకు నిరీక్షణ తప్పడం లేదు. బుకింగ్ చేసినా ఫలితం ఉండటం లేదు. కొత్త కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నవారు సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందా? అని ఆశగా నిరీక్షిస్తున్నారు. యుద్ధం ముగిసినప్పటి కీ మరికొన్ని రోజులు వేచి చూడాలని అధికారులు చెబుతున్నారు. కనెక్షన్లు లేని వారు గ్యాస్ వాడకం తక్కువగా ఉన్నవారి వద్ద ఓటీపీ తీసుకుని ఎంతో కొంత ముట్టజెప్పి సిలిండర్లు తీసుకుంటున్నారు. పని చేయని వెబ్సైట్ నూతన కనెక్షన్ ఇవ్వాలని, ఒక సిలిండర్ ఉన్నవారు మరొకటి కావాలని గృహావసరాల వినియోగదారులు ఏజెన్సీలకు దరఖాస్తులు అందిస్తున్నా.. నాలుగు నెలలుగా వెబ్సైట్ పని చేయకపోవడంతో డీలర్లూ ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. నూతనంగా వివాహం చేసుకున్న జంటలకు గ్యాస్ కనెక్షన్ తలనొప్పిగా మారింది. పెళ్లయిన వారు, ఇతర కారణాలతో వేరే కాపురం పెడుతున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లపై ఆధారపడాల్సి వస్తోంది. కొత్త కనెక్షన్ ఇవ్వాలి సింగిల్ సిలిండర్తో ఇబ్బందవుతోంది. బుకింగ్కు సమయం ఎక్కువగా పడుతోంది. సింగిల్ కనెక్షన్దారులకు రెండో సిలిండర్ ఇవ్వాలి. గ్యాస్ ఏజెన్సీలు కొత్త కనెక్షన్లు ఇచ్చేలా అధికారులు చొరవచూపాలి. – దాసరి సాయికృష్ణ, నిర్మల్ మా పరిధిలో లేదు గ్యాస్ కొత్త కనెక్షన్లు మంజూరు చమురు సంస్థలు నిర్ణయించాల్సి ఉంది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత కొద్దిరోజులుండే. కానీ, ఇప్పుడు సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కనెక్షన్లు ఇవ్వాలా? వద్దా? అనేది మా నిర్ణయం కాదు. – రాజేందర్, డీసీఎస్వో -
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
నిర్మల్టౌన్: నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, పోలీ స్స్టేషన్ల పనితీరుపై సమీక్షించారు. అనంతరం మా ట్లాడుతూ.. కేసుల నమోదు, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రాత్రి గస్తీ పటిష్టం చేయాలని, అవసరమైన చోట సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలను వినియోగించాలని ఆదేశించారు. సైబర్ మోసాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రజ లకు అవగాహన కల్పించాలని సూచించారు. గణేశ్ మండపాల సమాచారాన్ని తెలంగాణ పోలీస్ అధి కారిక పోర్టల్లో ముందుగానే నమోదు చేసుకోవా లని సూచించారు. తద్వారా బందోబస్తు, ట్రా ఫిక్ నియంత్రణ, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని కోరారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఏవో యూనస్ అలీ, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్రెడ్డి, ప్రవీ ణ్కుమార్, కృష్ణ, రవీందర్నాయక్, సమ్మయ్య, సాయికుమార్, దీపక్, ఆర్ఐలు రామ్నిరంజన్, శేఖర్, ఎస్హెచ్వోలు, సిబ్బంది పాల్గొన్నారు. వినతులు విని.. పరిష్కారానికి ఆదేశించి.. భైంసాటౌన్: పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ జానకీ షర్మిల వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత ఎస్హెచ్వోలను ఆదేశించారు. కుటుంబ సమస్యల పరిష్కారానికి షీటీం బృందం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గత గ్రీవెన్స్ డేల్లో అందిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని సమీక్షించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు. -
స్వచ్ఛ బడులకు ప్రోత్సాహం
లక్ష్మణచాంద: ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో పరిసరాలను మరింత ఆహ్లాదంగా మార్చేందుకు ప చ్చదనం, పరిసరాల పరిశుభ్రతను పెంచేందు కు కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందుకు స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ విధానాన్ని అ మల్లోకి తెచ్చింది. నీటి వసతి, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనంతో పాఠశాల ఆవరణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలతోపాటు ప్రైవేట్ బడులుండగా రెండేళ్ల క్రితం జిల్లా నుంచి ఎనిమిది రాష్ట్రస్థాయికి వెళ్లాయి. ఇందులో సెయింట్ థా మస్ పాఠశాల జాతీయస్థాయికి ఎంపికై రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందుకుంది. గతేడాది ఎ నిమిది బడులు రాష్ట్రస్థాయికి వెళ్లాయి. ఈ ఏడా ది ఎలాగైనా జాతీయస్థాయికి వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. నమోదు ఎలా చేసుకోవాలంటే.. ప్రధానోపాధ్యాయులు ఎస్హెచ్వీఆర్ పోర్టల్ లేదా స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. యూడైస్ ప్లస్ కోడ్ పాస్వర్డ్తో లాగినై స్వీయ మూల్యాంకన ఫారంలో వివరాలు నమోదు చే యాలి. పాఠశాలలోని మౌలిక వసతులు, వ్యర్థా ల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపు, సౌర శక్తి వినియోగం తదితర అంశాల చిత్రాలను సంబంధిత ఫోర్టల్లో అప్లోడ్ చే యాలి. అప్లోడ్ చేసిన అంశాలను పరిశీలించి వాటి ఆధారంగా గ్రేడ్ కేటాయిస్తారు. 5 స్టార్ రేటింగ్ సాధించిన ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి జాతీయ స్థా యికి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహకం ఇస్తారు. సద్వినియోగం చేసుకోవాలి ఈ నెల 11లోపు స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని పాఠశాలలు వెంటనే చేసుకోవాలి. ఇందులో ఉత్తమ రేటింగ్ వచ్చిన పాఠశాలలను రాష్ట్ర స్థాయికి పంపుతాం. అక్కడ మంచి రేటింగ్ వచ్చి జాతీయ స్థాయికి ఎంపికై తే కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని పాఠశాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. – భోజన్న, జిల్లా విద్యాధికారిజిల్లాలోని మొత్తం స్కూళ్లు 1,062 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవి 755 వివరాలు అప్లోడ్ చేసినవి 488 రిజిస్ట్రేషన్ ప్రారంభించనవి 307 -
వేతనాలు పెంచాలని రోడ్డెక్కిన ఆశ వర్కర్లు
నిర్మల్చైన్గేట్: తమకు రూ.18వేల గౌరవ వేతనం ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం ఆశ వర్కర్లు రాస్తారోకో చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇ న్సూరెన్స్ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జి ల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడారు. గ్రామీ ణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కు ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రభుత్వ వైద్య రంగా నికి ఆశ వర్కర్లు వెన్నెముకగా నిలుస్తున్నా వారి శ్ర మకు తగిన వేతనం అందడంలేదని తెలిపారు. వా రు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పే ర్కొన్నారు. డిమాండ్లు నెరవేర్చకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ‘చలో అసెంబ్లీ’కి బయలుదేరిన ఆశ వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే వారిని విడుదల చే యాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్స్ యూనియ న్ డివిజన్ అధ్యక్షురాలు సుగుణ, కార్యదర్శి లక్ష్మి, నాయకులు రామలక్ష్మి, భాగ్య, సంగీత ఉన్నారు. -
ఎస్ఐఆర్ను పకడ్బందీగా పూర్తి చేయాలి
నిర్మల్చైన్గేట్: ఎస్ఐఆర్ను గడువులోపు పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. బుధవారం పట్ట ణంలోని అంబేడ్కర్ భవన్లో ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి పరిశీలించారు. బీఎ ల్వోలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అ ర్హుల పేర్లు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొ లగించేలా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాల ని సూచించారు. 18 ఏళ్లు నిండినవారంతా ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అ దనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీ వో దేవిదాస్, తహసీల్దార్ రాజు తదితరులున్నారు. -
అరకొరే!
వైద్యం వసతులు.. ఎడ్లబండిలో చెత్తను సేకరిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్ భైంసా ఆస్పత్రిలో బీపీ చెక్ చేసుకోవడానికి వేచిఉన్న రోగులుఓపీ ఓ చోట.. బీపీ మరోచోట..! భైంసాటౌన్: భైంసా ఏరియాస్పత్రిలో రోగులకు సరైన వైద్యసేవలందక ఇబ్బంది పడుతున్నారు. భైంసా పట్టణంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాల నుంచి, సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి సైతం రోగులు వస్తుంటారు. అయితే, ఓపీ గదుల్లో వైద్యులు రోగి నాడి పట్టి చూసిన పాపన పోవడం లేదు. తూతూమంత్రంగా రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మందులు రాసిస్తున్నారు. అయితే, వైద్యులు బీపీ చెక్ చేయకుండా ఔట్సోర్సింగ్ సిబ్బందితో చేయిస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో రోగులు బీపీ చెక్ చేసుకునేందుకు క్యూలో ఉంటున్నారు. వృద్ధులు, బీపీ పేషెంట్లు క్యూలో నిల్చోలేక అవస్థలు పడుతున్నారు. రోగులకు మందులు ఇచ్చే గది సైతం ఇరుకుగా ఉండడంతో ఇబ్బంది ఎదురవుతోంది. నర్సింగ్ సిబ్బంది సరిపడా లేక ఎమర్జెన్సీ విభాగంతోపాటు సాధారణ వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. మందులు సరిపడా ఉన్నా.. సేవల్లో జాప్యం జరుగుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో అత్యవసరంగా అందించాల్సిన కార్డియో, న్యూరో, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ వంటి విభాగాల సేవలు నామ మాత్రమయ్యాయి. ఈ విభాగాల్లో నిపుణు కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయి రహదారులు ఉన్న జిల్లాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. తలకు గాయాలై వస్తున్న క్షతగాత్రులకు ఇక్కడ సరైన వైద్యం లభించడం లేదు. న్యూరో సర్జన్ వైద్యులు అందుబాటులో లేరు. ఎంఆర్ఐ వంటి సదుపాయాలు లేవు. దీంతో క్షతగాత్రులను నిజాబాబాద్, హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారు. సకాలంలో చికిత్స అందక ఎందరో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక గుండెపోటుతో ఈ దవాఖానకు రోజుకు నాలుగైదు కేసులు వస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీస్థాయి వైద్యం అందుబాటులో లేక వారికి సేవలు అందడం లేదు. రూ.లక్షలు వెచ్చించి 2డీ ఎకో వంటి పరికరాలు ఏర్పాటు చేసినా వాటిని వినియోగించి సేవలు అందించే వైద్య నిపుణుల లేరు. క్రిటికల్ కేర్ భవనం ఏర్పాటు చేసినా అందులో వైద్యులు, సిబ్బంది లేక సేవలు ప్రారంభం కాలేదు. సిరంజీలు లేవు.. పేదలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన జిల్లా జనరల్ ఆస్పత్రి, జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో సిరంజీల కొరత రోగులకు ఇబ్బందిగా మారింది. 2 ఎంఎల్, 5 ఎం ఎల్, 10 ఎంఎల్ సిరంజీలు అందుబాటులో లేక రక్త నమూనాల సేకరణ, ఇంజక్షన్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగుల కుటుంబ సభ్యులే బయట మెడికల్ దుకాణాల్లో సిరంజీలు కొనుగోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ రెండు ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ సేవలతోపాటు రక్త నమూనాల సేకరణ, వివిధ ఇంజక్షన్ల కోసం రోజూ సుమారు వెయ్యి నుంచి 1,500 వరకు సిరంజీలు అవసరమవుతాయి. రోగులే వీటిని బయట కొనుగోలు చేస్తున్నారు. -
ఖానాపూర్లో కీలక పోస్టులు ఖాళీ
ఖానాపూర్ : నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్, ఫిజీషియన్, ఆర్థోపెడిక్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రమాద బాధితులు, క్లిష్టమైన కేసులను నిర్మల్కు రిఫర్ చేయాల్సి వస్తోంది. 50 పడకల ఆస్పత్రిని 100 పడకలకు పెంచుతామన్న హామీ అమలు కాలేదు. ఖాళీ పోస్టులు భర్తీ చేసి, ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రయత్నిస్తున్నారు. -
కరెంటు కోతలపై కర్షకుల కన్నెర్ర!
● కుభీర్, లక్ష్మణచాంద, సోన్ మండలాల్లో రైతుల ఆందోళనభైంసా/లక్ష్మణచాంద: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవడం లేదు. ఆగస్టు నాటికి 20 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదైంది. అయితే జూలై చివరన కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని ప్రధాన జలాశయాలు నిండాయి. దీంతో భూగర్భ జలాలు ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయి. ఈ క్రమంలో బోర్లు, బావుల కింద పంటలు వేసిన రైతులు ఖరీఫ్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. కానీ, అప్రకటిత విద్యుత్ కోతలు వారి ఆశలకు గండికొడుతున్నాయి. అంతరాయాలతో కూడిన విద్యుత్ సరఫరాతో మోటార్లు నడవక పొలాలకు తడి అందడం లేదు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మామడలోనూ.. మామడ మండల పరిధిలో వ్యవసాయానికి రోజుకు 8 నుంచి 10 గంటల మేర మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోందని రైతులు చెబుతున్నారు. అది కూడా ఒకేసారి కాకుండా మధ్యలో పలుమార్లు అంతరాయం ఏర్పడుతోందని అంటున్నారు. సాయంత్రం వేళల్లోనూ కరెంటు పోతుండటంతో మోటార్లు నడపలేకపోతున్నామని వాపోతున్నారు. కనీసం 15 గంటలపాటు విద్యుత్ ఇస్తేనే పంటలను కాపాడుకోగలమని చెబుతున్నారు. భైంసా, ముధోల్, బాసర మండలాల్లో.. బైంసా మండలంలోని పలు గ్రామాల్లోనూ వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. కరెంటు వచ్చిన కొద్దిసేపటికే పోవడంతో మోటార్లు సరిగా పనిచేయడం లేదని, పొలాలకు తడి పెట్టడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ముధోల్ మండలంలో రోజులో పలుమార్లు వి ద్యుత్ సరఫరా నిలిచిపోతోందని రైతులు చెబుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని పేర్కొంటున్నారు. బాసర మండలంలోని పలు గ్రామాల్లోనూ బోర్లు, బావుల ఆధారంగా సాగు చేస్తున్న రైతులు విద్యుత్ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కరెంటు వచ్చిన సమయంలో మోటార్లు నడిపి నీరు పెట్టుకునేలోపే మళ్లీ సరఫరా నిలిచిపోతుందని రైతులు చెబుతున్నారు. తానూర్లో అప్రకటిత కోతలు... తానూర్ మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకటించి న వేళల్లోనూ సరఫరా నిలిచిపోతుండటంతో పంట లకు నీరు పెట్టుకోవడం కష్టంగా మారిందని చెబు తున్నారు. వర్షాలు లేక భూమిలో తేమ తగ్గుతున్న సమయంలో కరెంటు కోతలు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో సోయా, వరి పంటలు.. సోయాకు తడి అవసరమైన సమయంలో నీరు అందక కొన్ని ప్రాంతాల్లో మొక్కలు వాడిపోతున్నాయి. బోర్ల కింద వరి నాట్లు వేసిన పొలాలు కూడా పొడిబారుతున్నాయి. కరెంటు కోసం రైతులు రాత్రిళ్లు పొలాల వద్ద ఎదురుచూస్తున్నారు. పగలు కరెంటు లేకపోతే రాత్రి వస్తుందేమోనని రైతులు పొలాల వద్దకు వెళ్లి ఎదురు చూడాల్సి వస్తోంది. కరెంటు వచ్చిన వెంటనే మోటారు ఆన్ చేసి పొలానికి నీరు పెట్టే ప్రయత్నం చేస్తున్నా.. మధ్యలో సరఫరా నిలిచిపోవడంతో చేను తడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతర విద్యుత్ ఇవ్వాలి వర్షాలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో బోర్లు, బావుల నీటితో పంటలను కాపాడుకునే పరిస్థితి ఉంది. కనీసం 15–16 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తేనే పంటలను కాపాడుకోగలం. రోజులో చాలా సార్లు కరెంటు సరఫరా నిలిచిపోతుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి. – ముత్తన్న, రైతు పంటను కాపాడుకోవాలి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేశాం. ఇప్పుడు పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. పంట చేతికొచ్చే సమయంలో నీటి తడి అందకపోతే పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. నిరంతరాయంగా కరెంటు ఇస్తే పంటను కాపాడుకుంటాం. – గంగాధర్, రైతువిద్యుత్ కోతలతో పంటలకు నీరందకపోవడంతో కుభీర్ మండలంలో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. కరెంటు సరఫరా సక్రమంగా చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. వర్షాలు లేక ఇప్పటికే పంటలు ఇబ్బందుల్లో ఉండగా.. బోర్ల ద్వారా నీరు పెట్టుకుందామంటే విద్యుత్ సరిగా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్, న్యూవెల్మల్, బొప్పారం సబ్స్టేషన్ల వద్ద నిరసనవిద్యుత్ కోతలను నిరసిస్తూ లక్ష్మణచాంద మండలంలోని మల్లాపూర్ రైతులు సబ్ స్టేషన్ను రైతులు మంగళవారం ముట్టడించారు. విద్యుత్ కోతలు ఎత్తివేయాలని, పంటలను కాపాడాలని కోరారు. సోన్ మండలం న్యూ వెల్మల్, బొప్పా రం గ్రామాలకు చెందిన రైతులు సబ్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యుత్ కోతలు ఇలాగే కొనసాగితే పంటలను ఎలా కాపాడుకోవాలని ప్రశ్నించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మణచాంద ఏఈ మహేశ్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా అక్కాపూర్ సబ్ స్టేషన్లో 50 వేల కేపీహెచ్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంని వెల్లడించారు. కుభీర్లో రోడ్డెక్కిన రైతులు... లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు -
సమస్యలు పరిష్కరించాలి
● టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ నిర్మల్చైన్గేట్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి మరో రెండేళ్లు ఆగాల ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం సరికా దని, ఇప్పటికే రెండున్నరేళ్లు వేచి చూశామని.. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. ఈ నెల 10న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ విజయవంతం చేయాలని నిర్మల్లోని ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సంఘ భవనంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) సన్నాహక సమావేశం మంగళవా రం నిర్వహించారు. పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగ విరమణతో కోట్ల రూపాయల బెనిఫిట్స్ పొందుతున్నారనే ప్రచారాన్ని ఖండించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం చేపడుతున్న ‘చలో హైదరాబాద్’కు నిర్మల్ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఓపెన్ డిగ్రీకి నేడే లాస్ట్ నిర్మల్టౌన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సుధాకర్, అంబేడ్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ యు.గంగాధర్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు అర్హత ఉన్న విద్యార్థులు బుధవారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చదువు మధ్యలో ఆపేసిన వారు, ఉద్యోగం చేస్తూ.. ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
రుణ లక్ష్యాలు సాధించాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను వంద శాతం సాధించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా బ్యాంకర్లను ఆదేశించారు. అర్హులైన రైతులు, విద్యార్థులు, యువత, మహిళా స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారులకు రుణాలు సకాలంలో అందేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో 2026–27 వార్షిక రుణ ప్రణాళిక, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరు, ప్రాధాన్యత రంగాలకు ఆర్థిక సహాయం, సా మాజిక భద్రతా పథకాల అమలుపై కలెక్టర్ సమీ క్షించారు. జిల్లాలోని బ్యాంకులకు రూ.7,952.87 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు రూ.2,331.18 కోట్లు (29.31 శాతం) సాధించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన రూ.6,661.73 కోట్ల లక్ష్యానికి రూ.1,847.71 కోట్లు (27.74 శాతం) సాధించారన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. విద్యా రుణాల మంజూరు తక్కువగా ఉందని, అర్హులైన విద్యార్థులకు అధిక సంఖ్యలో రుణాలు అందించాలన్నారు. విద్యార్థులే లక్ష్యంగా పెట్టుకున్న 3,500 ఖాతాల్లో ఇప్పటికే 1,022 కొత్త ఖాతాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజీ తదితర పథకాల అమలును కలెక్టర్ సమీక్షించారు. రుణ లక్ష్యాల సాధనకు జిల్లా పరిశ్రమల శాఖ బ్యాంకర్లతో నిరంతరం సమన్వయం చేసుకోవాల ని ఆదేశించారు. ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజీ, పీఎం స్వనిధి రుణాల్లో ఎన్పీఏలను తగ్గించేందుకు మున్సిపల్ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించా లని ఎల్డీఎంను సూచించారు. విజయ డెయిరీ సమన్వయంతో రైతులకు పాడి పశువుల కొనుగో లుకు రుణాలు అందించాలన్నారు. రైస్ మిల్లుల ఫైనాన్స్కు అవసరమైన ఎన్వోసీలు, బ్యాంకు గ్యారెంటీల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం బి.రామ్గోపాల్, ఆర్బీఐ ఏజీఎం, ఎల్బీవో ఎస్. రాములు, పీడీ డీఆర్డీవో విజయలక్ష్మి, ఆర్ఎం నవీన్, సీఎం క్రెడిట్ ఆర్బీవో ఆదిలాబాద్ పీయూష్, వివిధ బ్యాంకుల అధికారులు, నాబార్డ్, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమయానికి రాని డాక్టర్..
నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని సీహెచ్సీ లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. డాక్టర్ శైలజ, డాక్టర్ స్వప్న, డాక్టర్ ముఖేష్ ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రికి వచ్చారు. రోగులకు రక్త పరీక్షల్లో సీబీపీ టెస్ట్ ఫలితాలు రావడం లేదని ల్యాబ్ టెక్నీషియన్ మధు తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో 3 సిజేరియన్లు జరిగినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. భైంసా మండలం... భైంసా మండలం మహగాం పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లకు ఒకరే ఉన్నారు. నలుగురు స్టాఫ్ నర్స్లకు ఒకరు డిప్యూటీషన్లో ఉన్నారు. వార్డ్ బాయ్స్ పోస్టులు లేవు, -
ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్
నిర్మల్చైన్గేట్: స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్య ల ను నిరసిస్తూ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ ఆదేశాల మేరకు మంగళవారం నిర్మల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీశ్కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అర్జుమన్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ జూనెద్, నాయకులు పాల్గొన్నారు. నిర్మల్టౌన్: అసెంబ్లీకి వస్తున్న మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, వారిపై పోలీసులు చేయిచేసుకోవడం అప్రజాస్వామికమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలను నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, అనంతరం రాస్తారో కో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ప్రజా స్వామ్య పద్ధతిలో నిరసనలు, పోరాటాలు కొనసాగిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్రెడ్డి, నాయకులు రామాదేవి, లోలం శ్యాంసుందర్, డాక్టర్ కిరణ్, గండ్రత్ రమేశ్, అయ్యన్నగారి రాజేందర్, శ్రీకాంత్ యాదవ్, జీవన్రెడ్డి, జీవన్రావు, మహేశ్రెడ్డి, భూషణ్రెడ్డి, దేవి శంకర్, నజీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యకు మరింత ఊతం
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు మెరుగై న విద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ ప బ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ఏర్పాటుకు ప్రాధాన్యమి స్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎని మిది పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ మేరకు నిఽ దులు కేటాయిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూ.83.19 కోట్లు కేటాయించారు. ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసన ఫలి తాలను మెరుగుపరిచేలా నాణ్యమైన, సమగ్ర విద్యా వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి చేస్తా రు. ప్రస్తుతం ఉన్న జెడ్పీహెచ్ఎస్లు, మోడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు. ప్రభుత్వ విద్యకు కొత్త రూపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల ను మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచడం ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశం. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, సురక్షితమైన పాఠశాల వాతావరణం అందించడంపై దృష్టి సారించనున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంపాఠ్యపుస్తకాల బోధనకే పరి మితం కాకుండా విద్యార్థుల మేధో, శారీరక, మానసిక, సా మాజిక, సాంస్కృతిక వికాసానికి వేదికగా నిలువనున్నా యి. క్రీడలు, కళలు, సైన్స్, సాంకేతికత, తదితర రంగా ల్లో విద్యార్థుల ప్రతిభ ను వెలి కితీసేలా అవకాశాలు కల్పించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు ప్ర త్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. నాణ్యమై న విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు ప్రభు త్వ పాఠశాలల్లోనే అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులపై విద్యా ఖర్చుల భారం తగ్గనుంది.జిల్లా పాఠశాల నిధులు (రూ.కోట్లలో) కుమురంభీం ఆసిఫాబాద్ జెడ్పీహెచ్ఎస్ 8.40 కాగజ్నగర్ జెడ్పీహెచ్ఎస్ 10.09 మందమర్రి మోడల్ స్కూల్ 10.70 మంచిర్యాల కాసిపేట మోడల్ స్కూల్ 10.30 సీతారాంపల్లి జెడ్పీహెచ్ఎస్ 12 నిర్మల్ కుంటాల మోడల్ స్కూల్ 9 నర్సాపూర్(జీ) జెడ్పీహెచ్ఎస్ 12.50 ఆదిలాబాద్ యాపల్గూడ జెడ్పీహెచ్ఎస్ 10.20 ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు, కేటాయించిన నిధులు -
సర్ నోటీసుల్లో వేగం పెంచాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్మల్చైన్గేట్: ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నోటీసుల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఈవో సుదర్శన్రెడ్డి సోమవారం కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా పూర్తి చేసిన నోటీసుల జారీ, ఇంకా పెండింగ్ ఉన్న నోటీసులు, హియరింగ్ నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియ మొత్తం గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ భవేశ్మిశ్రా పాల్గొన్నారు. జిల్లాలో సర్ నోటీసులు, హియరింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులకు వివరించారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్ పాల్గొన్నారు. -
బాలికల ఆరోగ్యానికి భద్రత
లక్ష్మణచాంద: చదువుకునే బాలికలకు నెలసరిపైన సరైన అవగాహన లేకపోవడంతో వ్యక్తిగత పరిశుభత్ర పాటించక అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో నెలసరి సమయంలో బాలికలు తీసుకునే జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలకు మహిళా ఉపాధ్యాయులతో లేదా, గైనకాలజిస్టుతో అవగాహన కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన వారే. అవగాహన లేక వీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పీఎంశ్రీ పాఠశాలలో... జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లోని బాలికల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. బాలికలకు నెలసరి సమయంలో ప్రభుత్వం ద్వారా న్యాప్కిన్లను పంపిణీ చేస్తుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. నాణ్యమైన బోధనతోపాటు, నృత్యం, కంప్యూటర్, చిత్రలేఖనం, సంగీతం నేర్పించేందుకు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్టర్లను కూడా నియమించింది. ఏటా ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ టూర్కు విద్యార్థులను తీసుకెళ్లుతున్నారు. పేద పిల్లలు... ప్రభుత్వ పాఠఽశాలలో చదివేవారిలో ఎక్కువ మంది బాలికలు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పల్లె ప్రాంతాల్లో కుటుంబ ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యత, సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది బాలికలు నెలసరి సమయంలో న్యాప్కిన్లను వినియోగించడం లేదు. ఈ కారణంగా అనారోగ్య సమస్యలబారిన పడుతున్నారు. బాలికలు ఆరోగ్యంగా ఉంటేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలికల కుటుంబాలకు ఆర్థిక భారం తప్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం బాలికలకు న్యాప్కిన్లను అందచేస్తుంది. జిల్లాకు రూ.10,63,300 నిధులు... జిల్లాలో మొత్తం 19 పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా ఇందులో 16 పాఠశాలల్లోని బాలికలకు అవసరమైన న్యాప్కిన్లు అందచేసేందుకు ప్రభుత్వం రూ.10,63,300 మంజూరు చేసింది. న్యాప్కిన్లు సరఫరా చేసేందుకు ఇటీవలనే టెండర్లు పిలిచామని త్వరలోనే సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. త్వరలో అందించేలా చర్యలు జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల బాలికలకు న్యాప్కిన్లను అందచేసేందుకు టెండర్లు పిలిచాం. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి న్యాప్కిన్లు త్వరగా బాలికలకు అందచేసేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా చూస్తాం. – భోజన్న, డీఈవో జిల్లా సమాచారం... జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలు 19బాలికలు ఉన్న పాఠశాలలు 16వచ్చిన మొత్తం నిధులు రూ.10,63,300 -
సమన్వయంతో పులుల సంరక్షణ
నిర్మల్టౌన్: పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమని ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, బాసర సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత భవనంలో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ‘ఫారెస్ట్ ప్రొటెక్షనన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టైగర్ ల్యాండ్స్కేప్’ అంశంపై అంతర్ జిల్లా సమన్వయ వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబ్డే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ప్రస్తుతం తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ల నుంచి పులులు ఈ ప్రాంతంలోకి వస్తున్నాయన్నారు. పులుల సంరక్షణతో పాటు వాటి ఆవాస ప్రాంతాలను కాపాడడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓలు ప్రశాంత్ పాటిల్ (నిజామాబాద్), రాహుల్ జాదవ్ (మంచిర్యాల), నీరజ్ టెబ్రివాల్ (కామారెడ్డి), రవిప్రసాద్ (జగిత్యాల), డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల కోసం ఢిల్లీలో గర్జించిన గిరిజనులు
ఆదిలాబాద్టౌన్: ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో వేలాది మంది గిరిజనులు గళమెత్తారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని సాయి పార్క్లో సోమవారం ధర్నా, ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు, ఆరో షెడ్యూళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం, పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ చట్టం–2023తో ఆదివాసీ గ్రామసభల హక్కులకు భంగం కలిగే పరి స్థితి ఏర్పడిందన్నారు. మైనింగ్ పేరుతో ఆదివాసీ లను భూముల నుంచి తరలించడం నిలిపివేయాలని, అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించరాదని డిమాండ్ చేశారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీ య మంచ్ జాతీయ చైర్మన్ జితిన్ చౌదరి, జాతీయ కన్వీనర్, మాజీ ఎంపీ ఫు లీన్ బిహారి బస్కే, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకర్, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, టీజేజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, ఉపాధ్యక్షులు సక్కు, పెందూర్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు. -
కాసిపేట–2 గనిలో పేలుడు
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిలో సోమవారం రెండో షిప్ట్లో మిస్ఫై ర్ జరిగి నలుగురు కా ర్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... గనిలోని నార్త్ డిస్ట్రిక్ 22 లెవల్ 18 ఎక్స్ డీప్లో విధులు నిర్వహిస్తుండగా మ్యాన్హోల్ చేసే క్రమంలో డిటోనేటర్ పేలి సపోర్ట్మెన్ కార్మికులు క్రాంతికుమార్, పుప్పాల శ్రీనివాస్, కోల్ కట్టర్ కార్మికులు రమేశ్, రాజ్కుమార్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా మందమర్రి డిస్పెన్సరీకి అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో అమర్చిన డిటోనేటర్ 1 పేలకుండా ఉండటంతో కార్మికులు దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో పేలినట్లు తెలిసింది.చికిత్స పొందుతున్న క్రాంతికుమార్చికిత్స పొందుతున్న రమేశ్ -
సమస్యల ఏకరువు
నిర్మల్చైన్గేట్: సమీకృత కలెక్టరేట్లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చి.. ఉన్నతాధికారులతో తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ప్రజావాణిలో పరిష్కారం చూపెడతారనే ఆశతో వ్యయ, ప్రయాసాలకోర్చి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో సైతం ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్నప్పటికీ అనేక ఫిర్యాదులు టేబుళ్లకే పరిమితమవుతున్నా యి. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ హెచ్చరిస్తున్నా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 130 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ భవిశ్మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. డీఆర్వో రమేశ్రాథోడ్ పాల్గొన్నారు. -
గంజాయి కేసులో యువకుడి అరెస్టు
బెల్లంపల్లి: గంజాయి కేసులో యువకుడిని అరెస్టు చేసినట్లు వన్టౌన్ ఎస్హెచ్వో కె.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై రామకృష్ణ ఆదివారం జాతీయ రహదా రి పక్కన వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సల్గుపల్లికి చెందిన గోమాస ప్రకాష్ వద్ద 200 గ్రాముల గంజాయి లభించింది. మహా రాష్ట్రలోని బల్లార్షాలో తక్కువ ధరకు కొనుగో లు చేసి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి బైక్, గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
కుప్టి పాత బ్రిడ్జికి బుంగ..
ఇచ్చోడ: నేషనల్ హైవే అఽథారిటీ అధికారుల తప్పిదం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. 44వ జాతీయ రహదారి కుప్టి పాత బ్రిడ్జికి బుంగ పడటంతో వాహనాల రాకపోకాలను పూర్తిగా నిలిపివేశారు. పాత బ్రిడ్జికి రెండు వందల మీటర్ల దూరంలో డ్రైవర్షన్ ఏర్పాటు చేసి వాహనాలను నూతన బ్రిడ్జి వైపు మళ్లిస్తుండడంతో ఒక్కో వాహనం అక్కడి నుంచి పాస్ కావడానికి కనీసం గంట సమయం పడుతోంది. పూర్తిగా డౌన్ ఉన్న చోట డైవర్షన్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే వాహనాలు డైవర్షన్ నుంచి వన్వేలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై మూడు, నాలుగు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. ప్రారంభంకాని మరమ్మతులు..నెల రోజుల క్రితం కుప్టి పాత బ్రిడ్జి మధ్యలో బుంగ ఏర్పడింది. అధికారులు గుర్తించినప్పటికీ ఇప్పటి వరకూ మరమ్మతులు చేయకపోవడంతో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేకాకుండా బ్రిడ్జిపై 320 మీటర్ల పొడవున 12 జాయింట్ల వద్ద మరమ్మతులు చేపట్టాల్సి ఉందని స్థానిక ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో రెండు వైపులా రక్షణగా రెయిలింగ్ నిర్మించారు. అది అక్కడక్కడ కూలిపోవడంతో దాని స్థానంలో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో కూడా బ్రిడ్జిపై భారం పడినట్లు, రక్షణ గోడ నిర్మించే సమయంలో బ్రిడ్జిపై నెల రోజుల నుంచి వన్వే చేయడంతో ఒకే వైపు నుంచి వాహనాలు రాకపోకలు సాగించడం కూడా బ్రిడ్జిపై బుంగ పడేందుకు కారణం కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితమే నిపుణుల నివేదిక..బ్రిడ్జి నాణ్యత ప్రమాణాలపై మూడేళ్ల క్రితమే నిపుణులు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు నివేదిక అందజేశారు. పాత బ్రిడ్జి పక్కన నూతనంగా బ్రిడ్జి నిర్మించాలని నివేదికలో పేర్కొనట్లు సమాచారం. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు మాత్రం నివేదికను బుట్టదాఖలు చేసి నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోక పోవడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కుప్టి బ్రిడ్జి విషయమై నేషనల్ హైవే అథారిటీ పీడీ వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
పత్తి పంటను ఆశిస్తున్న పిండినల్లి
చెన్నూర్రూరల్: పత్తి పంటను ఆశించి రసం పీల్చే వాటిలో పిండినల్లి పురుగులు ప్రధానమైనవి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ పురుగులు పత్తి పంటను ఆశిస్తాయి. ఇవి చిన్నవిగా, మెత్తగా, లేత గులాబీరంగులో ఉంటాయి. కొమ్మలు, కాండం, మొగ్గలు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా మొక్కల్లో సాధారణంగా జరిగే ఆవశ్యక మూలకాలు, పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడి గిడసబారి పోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా చిన్నదిగా కనిపిస్తుంది. దీని నివారణకు చర్యలు చేపట్టాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ సూచించారు. నివారణచర్యలుపురుగు ఆశించిన మొక్కలను పీకి కాల్చి వేయాలి. ఇలా చేయడం ద్వారా దాని విస్తరణను అదుపులో ఉంచవచ్చు. పొలం గట్లపైన ఉండే కలుపు మొక్కలు మఖ్యంగా వయ్యారిభామ, తుత్తురబెండ, గడ్డిచామంతి, వంటి కలుపు మొక్కలను పీకి కాల్చి వేయాలి. జైగోగ్రామ బైకోలరేట్ మిత్ర పురుగులను హెక్టారుకు 500 నుంచి 1000 వరకు విడుదల చేయాలి. తద్వారా వయ్యారిభామ, కలుపు మొక్కలను నివారించవచ్చు. దీని ద్వారా పిండినల్లి ఉధృతి తగ్గించవచ్చు. పత్తి ఏరిన తర్వాత ఎండు కర్రలను పీకి కాల్చి వేయాలి. వేసవి దుక్కుల ద్వారా నేలలో దాగి ఉండే పిల్ల పురుగులను నియంత్రించవచ్చు. అంతర పంటగా అలసంద, బబ్బెర, సోయాబీన్, మినుము వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగుల సంఖ్యను వృద్ధి చేయవచ్చు. కంచె పంటగా లేదా రక్షక పంటగా రెండు వరుసల సజ్జ లేదా కందులను దట్టంగా పెంచాలి. దీని ద్వారా ప్రధాన పంట అయిన పత్తిలో పిండినల్లి ఉధృతి తగ్గించుకోవచ్చు. మొక్కలను పురుగు ఆశిస్తే లీటరు నీటిలో 10 మిల్లీలీటర్ల వేపనూనెతో పాటు ఒక గ్రాము సబ్బు పొడిని కలిపి 10 నుంచి 12 రోజుల తేడాతో మొక్కలపై పిచికారీ చేయాలి. దీంతో చీడ, పీడలు తగ్గుతాయి, తద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు. ఏవిధంగా ఆశిస్తుందిపిండినల్లి పురుగులు ముఖ్యంగా పొలంగట్లపై, పనికి రాని భూముల్లో పెరిగే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తాయి. బెండ, టమాటా, వంగ, క్యాబేజీ, బొప్పాయి, నిమ్మ, జామ, మందార, గోగు, చామంతి, గడ్డి చామంతి, రామబాణం, వయ్యారిభామ, తుత్తర బెండ, సీతాఫలం, సుబాబుల్, గ్లైరిసిడియా వంటివి పిండినల్లికి అతిథి మొక్కలు. పురుగుపై తెల్లని మైనపు పొర ఉండటం చేత, అది పురుగు మందుల ప్రభావం నుంచి ఇతర సహజ మరణం నుంచి రక్షణ పొందుతుంది. ఈ పురుగు సాధారణంగా సంవత్సర కాలంలో 15 తరాలకు అభివృద్ధి చెందగలదు. అలాగే ఆడ పురుగు పెట్టే ఒక గుడ్ల సంచిలో దాదాపు 600 వరకు గుడ్లు ఉంటాయి. పంట పొలంలో సహజంగా పెరిగే మిత్ర పురుగులు అంతరించి పోవడం వలన పురుగు విసర్జించే తేనె వంటి ద్రవం కొరకు వచ్చే చీమల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు పిండినల్లి వ్యాపిస్తుంది. అంతే కాకుండా పురుగు సహజంగా పంట ఉత్పత్తుల ద్వారా, పత్తి కర్రల ద్వారా గాలి, నీటి కాలువలు, వర్షం, పక్షులు, పశువుల ద్వారా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగులు ఆశించిన ప్రాంతం నుంచి ఆశించని ప్రాంతానికి తిరగడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. -
వినాయక నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి
నిర్మల్చైన్గేట్: రానున్న వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సమావేశ మందిరంలో ఎస్పీ జానకీషర్మిలతో కలిసి ఉత్సవాల నిర్వహణపై సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మతాల పండుగలు సోదర భావంతో, కలిసి మెలసి జరుపుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గణేశ్ ఉత్సవాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వైర్లు సరి చేస్తామని చెప్పారు. ఉత్సవ నిర్వాహకులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాంతియుతంగా జరుపుకునేలా చర్యలు ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ జిల్లాలో గణేశ్ ఉత్సవాలు మొత్తం ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖ తరఫున తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకలకు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినాయక ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించేలా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీవో దేవీదాస్, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నోటీసులకు నో రెస్పాన్స్!
నిర్మల్చైన్గేట్: జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో ఇటు ఓటర్లకు, అటు బీఎల్వోలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నా యి. కుటుంబ సభ్యుల మధ్య వయసు తేడాలు, పేర్లలో మార్పులు, కుటుంబ సంబంధాల నమోదులో తేడాలు, పుట్టిన తేదీల్లో వ్యత్యాసాలు ప్రజలకు కొత్త చిక్కులు తెస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వయసు తేడా తొమ్మిది నెలల కంటే తక్కువగా ఉంటే అదనపు పరిశీలన చేయాల్సిన కేసుగా పరిగణిస్తున్నారు. తల్లిదండ్రులు–పిల్లల మధ్య వయస్సు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా లేదా 50 ఏళ్లకుపైగా ఉన్నా సంబంధిత ఆధారాలు సమర్పించాలని సూచిస్తున్నారు. ఒకే రకమైన పేరును తండ్రి పేరు పేర్కొంటే వాటిని సరిచేసుకోవాల్సిందేనని నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలాంటి కారణాలతో నోటీసులు ఇవ్వడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తార్కిక వ్యత్యాసాలు ఉంటే అదనపు ధ్రువపత్రాలు సమర్పించి సరిచేసుకోవాల్సిన బాధ్యత ఓటర్లదేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. కొనసా..గుతున్న నోటీసుల జారీ జిల్లాలో సర్ నోటీసుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 2,22,003 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,64,050 మందికి ఇచ్చారు. ఇంకా 57,953 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 16,308 మంది మాత్రమే హియరింగ్కు హాజరై తమ ఆధారాలను చూపించారు. అయితే నోటీసుల డౌన్లోడ్, ప్రింటింగ్ ఆలస్యం కావడం, పంపిణీకి ఎక్కువ సమయం తీసుకోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. చిన్నచిన్న తప్పులకే నోటీసులు వస్తుండడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. అక్షర దోషాలు ఉన్నా అనామలీస్ జాబితాలో చేరాయి. నోటీసులు అందుకున్నవారు తమకు కేటాయించిన రోజున ఏదైనా పని ఉంటే ఆ రోజు వెళ్లలేకపోతున్నారు. హియరింగ్కు రాకపోతే.. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ క్రమంలో బీఎ ల్వోల ద్వారా నోటీసుల జారీలో జాప్యంతోపాటు హియరింగ్కు ఓటర్లు హాజరుకాకపోవడంతో మరోసారి రీషెడ్యూల్ చేయాల్సి వస్తోంది. సోమవారం నాటికి 147 మందికి రీషెడ్యూల్ చేశారు. పూర్తి భారం బీఎల్వోలపైనే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సమయంలో బీఎల్వోలతో పాటు ప్రభుత్వంలోని ఇతర అధికారులు, సిబ్బందిని వినియోగించారు. కానీ నోటీసుల జారీ ప్రక్రియను మాత్రం బీఎల్వోలకే వదిలేయడంతో ఆలస్యం అవుతోంది. యాప్లో నోటీసుతో పాటు ఓటరు సమర్పించే పత్రాలు, హియరింగ్కు హాజరైన ఓటరు ఫొటోలను మూడు విడతలుగా బీఎల్వోలే అప్లోడ్ చేయాల్సి వస్తోంది. పదేపదే నిబంధనలు మారుతుండటం, నోటీసులు వచ్చిన ఓటర్లు ఎన్ని ధ్రువపత్రాలు సమర్పించాలన్న విషయంలో ఓటర్లతో పాటు బీఎల్వోల్లోనూ గందరగోళం నెలకొంది. హియరింగ్కు పిలుస్తున్న బీఎల్వోలు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక.. ఎస్ఐఆర్ సంబంధించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిన జిల్లా అధికారులు నోటీసులు జారీ తర్వాత అంతగా పట్టించుకోవడం లేదు. చాలామందికి అక్షర దోషాలు, వయసు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాల్లో పొరపాట్లు వంటి చిన్న చిన్న కారణాలతో నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. వాటిని ఎలా సరిచేయాలి, ఏయే పత్రాలు సమర్పించాలన్నదానిపై ఓటర్లకు స్పష్టత లేదు. అధికారులు సైతం అవగాహన కల్పించడం లేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రధానంగా నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, ఓటర్లు ఏం చేయాలి, ఏయే పత్రాలు సమర్పించాలి, విచారణకు ఎక్కడికి హాజ రు కావాలనే విషయం కూడా చాలామందికి తెలి యని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది ఓటర్లు మరింత అభద్రతా భావంతో ఉన్నారు. వీరందరికీ అవగాహన కల్పించడంతోపాటు నోటీసులను సకాలంలో అందించి, సరైన ఆధారాలు సమర్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లాలో సోమవారం నాటికి జారీ చేసిన నోటీసులు.. జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 930మొత్తం జారీ చేయాల్సిన నోటీసులు 2,22,054 జనరేట్ చేసిన నోటీసులు 2,22,003 పంపిణీ చేసిన నోటీసులు 1,64,050 పంపిణీ చేయాల్సిన నోటీసులు 57,953 హియరింగ్ ప్రక్రియ పూర్తయిన వారు 16,308 హియరింగ్ గడువు ముగిసిన వారు 88,504 -
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉ న్న రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకా యిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీ సీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాల యం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు కళాశాలల్లో చదువులు కొనసాగించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఫీజు చెల్లింపులతో నిమిత్తం లేకుండా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు వెంటనే అందజేసేలా ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న, ఉపాధ్యక్షుడు గొడుగు గంగాధర్, ప్రధాన కార్యదర్శి బోడ గంగాధర్యాదవ్, కార్యదర్శి కల్లూరు సుధాకర్, అధికార ప్రతినిధి ముద్రపోయిన వినేష్, బర్మ శ్రీకాంత్, శ్రీనివాస్, నిగుర్లకు లింగన్న, కుందూరు వినోద్, మేకల సింహం, అశోక్, రాము, నరసయ్య పాల్గొన్నారు. -
లోక్అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి
నిర్మల్టౌన్: ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పోరిక రవీందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్తో సోమవారం సమావేశం నిర్వహించారు. లోక్అదాలత్లో కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించి, పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను గుర్తించి ఇరుపక్షాల సమన్వయంతో పరిష్కారం జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఇందులో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఏ.రాజలింగం పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూంలో అనర్హులను తొలగించాలి
ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీమ్ చౌరస్తా సమీపంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచా రణ చేపట్టి అనర్హులను తొలగించాలని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్ భవేశ్మిశ్రాకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి పసుపుల వెంకన్న మాట్లాడుతూ.. గత ప్రభు త్వ హయాంలో భూమి, ఇల్లు లేని పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేశారని ఆరో పించారు. పొరపాట్లు సరిదిద్ది అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన ప్రస్తుత ఆన్లైన్ ప్రక్రియను రద్దు చేసి, అనర్హులను తొలగించిన అనంతరం అర్హుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య సురేందర్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, డబుల్ బెడ్రూం సాధన కమిటీ కన్వీనర్ తోట రాధ, కోకన్వీనర్ షేక్గౌస్, మజ్జిత్, కల్పన, లక్ష్మి, గంగోత్రి, సునీత, షరీన్ పాల్గొన్నారు. -
బౌన్సర్లు కేరాఫ్ జైపూర్
జైపూర్: బౌన్సర్ అంటే కేవలం కండలు తిరిగిన శరీ రం కాదు.. క్రమశిక్షణ, అప్రమత్తత, బాధ్యతకు ప్రతిరూపం. షాపింగ్ మాల్స్ నుంచి ఫంక్షన్ హాళ్ల వరకు.. ప్రముఖుల కార్యక్రమాల నుంచి భారీ ఈవెంట్ల వరకు ఎక్కడ జన సందోహం ఉంటే అక్కడ వీరి విధులు కనిపిస్తాయి. అలాంటి బౌన్సర్లను తీర్చిదిద్దుతూ గ్రామీణ యువతకు ఉపాధి బాట చూపుతోంది జైపూర్ మండలం రసూల్పల్లిలోని ఒలంపియా జిమ్. వ్యాయామంతో శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు..అదే ఫిటెనెస్ను ఉపాధిగా మలుచుకుంటున్న యువతకు ఈజిమ్ అడ్డాగా మారుతోంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది యువకులు నేడు పట్టణ ప్రాంతాల్లో బౌన్సర్లుగా విధులు నిర్వహిస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగం చేస్తూనే..ఒలంపియా జిమ్లో శిక్షణ పొందుతున్న వారంతా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూనే బౌన్సర్గా విధులు నిర్వహిస్తున్నారు. తమకు లభించే ఖాళీ సమయాన్ని జిమ్లో వ్యాయామానికి కేటాయిస్తూ ఫిట్నెస్ను కొనసాగిస్తున్నారు. యువతలో శారీరకధారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. వ్యసనాలకు దూరంగా.. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలన్నదే లక్ష్యం. జిమ్ ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభ, శారీరక సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం లేక అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. నిరుపేద యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తాం. – ప్రవీణ్, ఒలంపియా జిమ్ నిర్వాహకుడు 15 ఏళ్ల క్రితం మొదలై..రసూల్పల్లికి చెందిన కుమ్మరి ప్రవీణ్ 15 ఏళ్ల క్రితం ఒలంపియా జిమ్ను ఏర్పాటు చేశాడు. మొదట చిన్నస్థాయిలో ప్రారంభమైన ఆయన ప్రయత్నం క్రమంగా విస్తరించి ప్రస్తుతం మంచిర్యాల పట్టణంలో రెండు, చెన్నూర్లో రెండు, రసూల్పల్లిలో ఒకటి మొత్తంగా ఐదు బ్రాంచ్ల వరకు చేరింది. జిమ్లో వ్యాయామంతో పాటు శారీరకధారుఢ్యం, క్రమశిక్షణ, ఫిట్నెస్పై యువతకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం సుమారు 40 మంది యువకులు, 10 మంది యువతులు ఇక్కడ శిక్షణ పొందుతూ హైదరాబాద్, సూర్యాపేట, సిద్దపేట, వరంగల్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, బెంగళూర్ వంటి పట్టణాల్లో సేవలందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే కార్యక్రమాల్లో రద్దీని నియంత్రించడం, ప్రవేశ మార్గాలను క్రమబద్ధీకరించడం, ప్రముఖులు, నిర్వాహకులకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలు చేపడుతున్నారు. షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ ఈవెంట్లలో అవసరాన్ని బట్టి భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. -
గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
● ఆరు దశల కార్యాచరణతో ప్రణాళిక.. ● డీజీపీ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్టౌన్: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ.ఆనంద్ పోలీసు అధికా రులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాల బందో బస్తు ఏర్పాట్లపై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు చేశారు. ఎస్పీ జానకీ షర్మిల, డీఎస్పీ శ్రీనివాస్ వీసీలో పాల్గొన్నారు. గణేశ్విగ్రహాల ప్రతిష్టాపన, ఊరేగింపులు, నిమజ్జన రూట్లు, సున్నిత ప్రాంతాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ మ్యాపింగ్, ముందస్తు సమాచార సేకరణ తదితర అంశాలపై డీజీపీ దిశానిర్దేశం చేశారు. ఆరు దశల కార్యాచరణను అమలు చేయాలని సూచించా రు. నిమజ్జన రూట్లు, ప్రాంతాలు, ట్రాఫిక్ మళ్లింపులు, బందోబస్తు ఏర్పాట్లపై ముందుగానే ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. మూడో రోజు నుంచి పదో రోజు వరకు జరిగే నిమజ్జనాలకు దశలవారీగా భద్రత కల్పించా లని ఆదేశించారు. సెప్టెంబర్ 25న తుది నిమజ్జనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని సూచించారు. జిల్లాలో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఎస్పీ జానకీషర్మిల -
నిషేధిత గడ్డి మందు స్వాధీనం
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్2లో అక్రమంగా తరలిస్తు న్న నిషేధిత గడ్డిమందును సోమవారం పట్టుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ శ్రీరామ్మీనా తెలిపా రు. తమకు అందిన సమాచారం మేరకు బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న రామగిరి ఎక్స్ప్రెస్ రైలులో సోదాలు నిర్వహించగా 81 గడ్డి మందు ప్యాకెట్లు, 5 లీటర్ల 5 క్యాన్లు, 5 లీటర్ క్యాన్లు పట్టుకున్నట్లు పే ర్కొన్నారు. గడ్డి మందును కాగజ్నగర్ మండల వ్యవసాయాధికారి రామకృష్ణకు అప్పగించినట్లు తెలిపారు. తనిఖీల్లో ఆర్పీఎఫ్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై ఆర్.దాసు, సిబ్బంది కమలేశ్కుమార్ సింగ్, ప్రేమానంద్ పాల్గొన్నారు. -
పుష్కరాల నాటికి బాసర ముస్తాబు
భైంసా/బాసర: తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతి క వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏడాది ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలో శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి రూ.354 కోట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు రూ.20 కోట్లతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. బాసరను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు మెరుగైన వసతులు పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూంలు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన పుష్కర ప్రాంతాల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లతో పనులు గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. బాసరతోపాటు గోదావరి నదీ తీర జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రజాభవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యత, పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర పుష్కర ఘాట్ల అభివృద్ధి, ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మ్యాపులు, ప్రతిపాదనలు, పనుల పురోగతిని మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
దళిత కుటుంబానికి న్యాయం చేయాలి
● పెంబి ఘటనపై ఖానాపూర్లో దళిత సంఘాల ఆదోళన ఖానాపూర్: పెంబి మండల కేంద్రంలో దళిత మహిళ ఇంటిని కూల్చిన బాధ్యులపై చర్య తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం తలపెట్టిన చలో ఖానాపూర్లో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహించారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడారు. దళితుల హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. పెంబిలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బ్లూ ఆర్మీ, బహుజన సేన రాష్ట్ర నాయకుడు, వక్త రాజేశ్రక్షక్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్, బ్లూ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జరి ప్రకాశ్, భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్, ఇండిపెండెన్స్ ఫోరం జాతీయ అధ్యక్షుడు రేవు చిన్న ధనరాజ్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శైలేందర్, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షుడు నంది రామయ్య, భారత నాస్తిక సమాజం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిన రాజ్కుమార్, అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన రాకేశ్ నాయకులు పాల్గొన్నారు. -
నిర్మల్
నృత్య ప్రదర్శనలో ప్రతిభ నిర్మల్ఖిల్లా: సాంస్కృతిక నృత్య ప్రదర్శనలో జిల్లా బాలనృత్యకారిణి ప్రతిభకనబర్చింది. స్వర్ణ బాలాజీ పురస్కారాన్ని అందుకుంది. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన పసులోటి ప్రియాంక–శ్రీకాంత్ దంపతుల కుమార్తె వంశిక యాదాద్రిభువనగిరి జిల్లాలోని స్వర్ణగిరిలో ఆదివారం నిర్వహించిన నృత్య ప్రదర్శనలో స్వరూపిణి కళాక్షేత్రం బృందంతో కలిసి పాల్గొంది.వంశిక భక్తి భావాన్ని పెంపొందించే విధంగా చేసిన నృత్య ప్రదర్శన అక్కడి ఆకట్టుకుంది. ప్రదర్శన అనంతరం ఆలయ నిర్వాహకులు వంశికకు స్వర్ణ బాలాజీ పురస్కారంతోపాటు, ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. -
అక్రమ నిర్మాణాల జోరు
ఖానాపూర్: పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. నిబంధనల ప్రకారం మున్సిపల్ అనుమతులు పొందిన తర్వాతే ఇళ్లు, వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపట్టాలి. కానీ కొందరు నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్లు, నాలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునేవారు లేరు. అనుమతులు లేని నిర్మాణాలతో బల్దియా ఆదాయానికి గండి పడుతోంది. అనుమతులు లేకుండానే.. ఖానాపూర్ పట్టణంలోని 12 వార్డుల పరిధిలో నిర్మాణాలకు టీఎస్–బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది టీఎస్–బీపాస్ సక్రమంగా పనిచేయకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణంలో సుమారు 100 నిర్మాణాలు చేపడితే, వాటిలో 30కి పైగా నిర్మాణాలకు అనుమతులు లేవు. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు మున్సిపల్ అధికారులు వెళ్లి నోటీసులు జారీ చేసి పనులను నిలిపివేస్తున్నారు. కొందరు పనులు నిలిపిన తర్వాతే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక అధికారుల నిర్లక్ష్యం మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతోంది. నిబంధనలు లేకుండా.. ఖానాపూర్ ప్రధాన రహదారితోపాటు అంతర్గత గల్లీల్లోనూ ఇటీవల వాణిజ్య, గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. రహదారి మధ్య నుంచి నిబంధనల ప్రకారం నిర్దేశిత స్థలం(సెట్బ్యాక్) వదిలి నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నా, కొందరు ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రధాన రహదారికి, అంతర్గత రహదారులకు అవసరమైన స్థలం వదలకుండా నిర్మాణాలు చేపట్టడంతో ప్రధాన రోడ్లు, గల్లీలు క్రమంగా ఇరుకుగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలాలపై స్లాబులు, ర్యాంపులు ఖానాపూర్ పట్టణంలోని నాలాలపై స్లాబులు, మెట్లు నిర్మించి ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ప్రాంతాల్లోనూ నిర్మాణాలు చేపట్టి స్థలాలను వినియోగించుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగును తొలగించేందుకు అవకాశం లేకుండా పోతోంది. వర్షాకాలంలో మురుగు రోడ్డుపైకి చేరుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబందనలు పాటించకుంటే చర్యలు.. ఖానాపూర్ పట్టణంలో మున్సిపల్ నిబంధనలు, భవన నిర్మాణ అనుమతులు, ఇతర నిబంధనలపై ప్రజలు, భవన నిర్మాణదారులకు అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన పలువురికి నోటీసులు జారీచేశాం. మార్పు రాకపోతే చర్యలు తీసుకుంటాం. అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలి. – మనీష్, మున్సిపల్ భవన నిర్మాణ ఇన్స్పెక్టర్, ఖానాపూర్ -
జామిడిలో మద్యనిషేధం
తాంసి: మండలంలోని జామిడి గ్రామంలో గ్రామస్తులు శనివారం మద్యనిషేధం కోసం నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అశోక్ అధ్యక్షతన గ్రామస్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయని, యువ త చెడుదారి పట్టకుండా మద్యనిషేధం సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మద్య నిషేధం తీర్మానం చేస్తున్న గ్రామస్తులు -
ఇన్స్టాంట్ ప్రచారం!
సాక్షి, మంచిర్యాలడెస్క్: జెన్జీ.. జెన్ ఆల్ఫా ఎవరైనా కావొచ్చు.. అందరి చేతుల్లోనూ సెల్ఫోన్ ఆరో వేలుగా మారింది. యువత సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తమ అభిప్రాయాలు, సలహాలనూ పంచుకుంటోంది. ఇటీవల కాలంలో ఇన్స్ట్రాగాం వినియోగం విపరీతంగా పెరిగింది. అందుకే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా నియోజకవర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇన్స్ట్రాగాంను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా క్షణాల్లో తమ ఖాతాల్లో పోస్టు చేయిస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిఇన్స్ట్రాగాంతోపాటు ఇతర సామాజిక మాధ్యమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తదితర పార్టీల నాయకులూ భారీసంఖ్యలోనే ఉ న్నారు. అందరూ సోషల్మీడియా ఖాతాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిలో చాలామంది సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవారితో ఖా తాలు నిర్వహిస్తున్నారు. పర్యటనల్లో రాజకీయ కా ర్యక్రమాలు చిత్రీకరణకు ఫొటో, వీడియోగ్రాఫర్లు వెంటే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయా కార్యక్రమాలు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. వ్యాపారంలోనూ..వ్యాపారం ఏదైనా సరే విభిన్నమైన ప్రచారం చేస్తే ఆకట్టుకోవచ్చు. అందుకే చాలామంది వ్యాపారులు తమ వస్తువులకు సంబంధించిన వివరాలతో వీడియోలు చేస్తూ ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తూ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.పేరు ఫాలోవర్లు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ 86,000 ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ 56,500 ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, నిర్మల్ 46,500 మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి 39,600 ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బోథ్ 32,900 పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ 25,400 మాజీ మంత్రి జోగు రామన్న 22,400 ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు, మంచిర్యాల 21,400 ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ 19,400 ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఖానాపూర్ 11,700ఇన్స్ట్రాగాంలో ఫాలోవర్లతో టాప్ 10లో ఉన్నవారు పదివేలలోపు..ఇన్స్ట్రాగాంలో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులను ప్రజలు భారీ సంఖ్యలోనే అనుసరిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావును 10వేలలోపు మంది ఫాలో అవుతున్నారు. ఇది జెన్జీ యుగం. సాంకేతిక పరిజ్ఞానా న్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కాలం చెల్లినవారవుతారు(అవుట్డేట్). ఇప్పుడు యువత ఇన్స్ట్రాగాంలో హల్చల్ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్స్ట్రాగాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి. – ఇదీ ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం -
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
నెన్నెల: కట్టుకున్న భార్యను హత్యచేసిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం బెల్లంపల్లిలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ కేసు వివరాలు వెల్లడించారు. నెన్నెలలోని కాపువాడకు చెందిన తోట సబిత, తోట మల్లేశ్ భార్యాభర్తలు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో ఈనెల 2న సబితను హత్య చేసి పరారయ్యాడు. గతంలో రెండుసార్లు హత్యకు యత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ఘటన అనంతరం దుస్తులు మార్చుకుని పరారైన మల్లేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం తాళ్లగురిజాల వై జంక్షన్ వద్ద అదుపులో తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమా ండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. నెన్నెల ఎస్సై జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. తల్లి కాటికి.. తండి జైలుకు..తల్లి కాటికి.. తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు ఒంటరి వారయ్యారు. తాతయ్య, అమ్మమ్మ సంరక్షణ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పెద్ద మనుషులకే ఒకరు సాయం చేసే స్థితిలో ఉండగా ఈ పిల్లల భారం వారిపై పడింది. అమ్మప్రేమకు దూర మై నాన్న జైలు పాలు కావడంతో తమను ఎవరు చూసుకుంటారో తెలియని అయోమయంలో పిల్ల ల బాల్యం మిగిలిపోయింది. వారి చదువుపై తల్లికి ఎంతో శ్రద్ధ ఉండేదని అమ్మమ్మ, తాతయ్య తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లలను బాగా చదివించాలనేది ఆమె కోరిక నెరవేరకుండానే కన్నుమూసిందని పేర్కొన్నారు. -
నీటి గుంతలో మునిగి ఒకరి మృతి
కుభీర్: నీటి గుంతలో స్నానానికి దిగి ఈతరాక ఒకరు మునిగి మృతిచెందినట్లు ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు. ఎస్సై, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పార్డి(బి) గ్రామానికి చెందిన గుడాల సాయినాథ్ (48), గ్రామస్తులు శ్రావణ శనివారం రాజరాజేశ్వరం మందిరంలో విగ్రహాలను పల్లకీలో ఉంచి బ్రహ్మేశ్వర్లో బ్రహ్మేశ్వర్ మందిర్కు తీసుకెళ్లారు. అక్కడి నీటి గుంతలో స్నానాలు, పూజల అనంతరం గ్రామస్తులు బయల్దేరారు. అక్కడే ఉన్న సాయినాథ్ నీటిగుంతలో స్నానానికి దిగి ఈత రాక మునిగాడు. ఆయన రాలేదని కొందరు అక్కడికి వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. భార్య విజయ ఫిర్యాదుతో కేసు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
చోరీలకు పాల్పడిన నిందితుడి అరెస్టు
నిర్మల్టౌన్: చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బాగులవాడకు చెందిన మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, నిర్మల్రూరల్ మండలం చిట్యాలకు చెందిన కల్గద్దవార్ శ్రీకాంత్, హైదరాబాద్లోని హల్దియాబాద్కు చెందిన సారా సాయికిరణ్ పరస్పరం పరిచయంతో ఒక్కటయ్యారు. స్నేహం కాస్తా చోరీలకు దారితీసింది. కలిసి ఇళ్లు, దుకాణాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. వరుస చోరీలపై టైగర్స్ టాస్క్ఫోర్స్ ప్రత్యేక దృష్టిపెట్టింది. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను గుర్తించింది. మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, కల్గద్దవార్ శ్రీకాంత్ను గతనెల 17న పట్టుకుంది. పరారీలో ఉన్న సాయికిరణ్ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, గన్నవరం పోలీస్స్టేషన్న్పరిధిలో చోరీలు చేసినట్లు అంగీకరించారు. జిల్లాలో నమోదైన 25 చోరీ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. 16 కేసులకు సంబంధించిన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. 12 కిలోల వెండి ఆభరణాలు, రూ.67 వేల నగదు, నిస్సాన్మాగ్నైట్ కారు, మెల్టింగ్ మెషిన్న్, గ్యాస్ పైప్ మెషిన్న్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, సమ్మయ్య, ఎస్సైలు లింబాద్రి, గణేశ్, శ్రీకాంత్, అశోక్, ఎస్.కె.గఫార్, హెడ్కానిస్టేబుల్ జగన్సింగ్, పీసీలు తిరుపతి, సతీశ్ తదితరులను ఎస్పీ అభినందించారు. ఆలయాలే టార్గెట్..పట్టణంలోని దివ్యనగర్, బంగల్పేట్, శాస్త్రినగర్, సారంగాపూర్ మండలం వంజర, ఆలూర్, నిర్మల్ రూరల్ మండలం కౌట్ల–కె, లోకేశ్వరం మండలం కిష్టాపూర్, మామడ మండలం, లక్ష్మణచాంద మండలం వడ్యాల్లోని ఆలయాల్లో జరిగిన చోరీలో నిందితుల ప్రమేయం ఉంది. వీటితోపాటు ఇందిరానగర్, ప్రియదర్శినినగర్, శాస్త్రినగర్, ఏఎన్న్రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ కేసుల్లోనూ వీరి పాత్ర ఉన్నట్లు తేలింది. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్లో చోరీకి పాల్పడిన రాజస్థాన్కు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో శనివారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్లోని పాలి జిల్లా కై తారానికి చెందిన కుమావత్ గుందారం, కుమావత్ ఘన్శ్యామ్, కుమావత్ మాణిక్చంద్, కుమావత్ లక్ష్మణ్, హైదరాబాద్లోని పటాన్చెరు బండ్లగూడకు చెందిన తేజ్పాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆదిలాబాద్లోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్ వద్ద రెక్కీ నిర్వహించారు. ఇటీవల రాత్రి సమయంలో గడ్డపారతో షాప్ తాళాలు పగులగొట్టి లోపల వివిధ రకాల సిగరెట్ బాక్సులతోపాటు కౌంటర్లోని నగదు చోరీ చేశారు. హైదరాబాద్లోని పఠాన్చెరులో వారికి పరిచయమైన వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నించారు. వీటి విలువ సుమారు రూ.5.35 లక్షలు ఉంటుంది. కొంత మొత్తానికి సిగరెట్ బాక్సులు విక్రయించి, వచ్చిన నగదును నలుగురు పంచుకున్నారు. మిగిలినవి విక్రయించేందుకు, ఆదిలాబాద్లో మరో చోరీకి పాల్పడే ఉద్దేశంతో తిరిగివచ్చారు. వాటిని విక్రయిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకుంటుండగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంబడించి అదుపులో తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 27 అమెరికన్ సిగరేట్ బాక్స్లు, 10 కింగ్ సైజ్, లైట్ 11, స్మాల్ గోల్డ్ 14, బ్రిస్టల్14, ఒకటి క్లాసిక్ రెడ్, ఓల్డ్ అడిషన్ 21, రెండు ఐస్ బస్ట్, కనెక్ట్ సిగరేట్ ఒక బాక్స్తో పాటు రూ.60వేల నగదు, చోరీకి వినియోగించిన మారుతీ కారుతోపాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
భవ్య క్షేత్రంగా బాసర
భైంసా: గోదావరి తీరాన కొలువైన జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. దేశంలోనే ప్రఖ్యాతగాంచిన బాసరను భవ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆలయానికి రూ. 354 కోట్లు, పుష్కరఘాట్లకు రూ.20 కోట్లు మొత్తం రూ.374 కోట్ల నిధులు కేటాయించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలికవసతుల కల్పన, సుందరీకరణ తదితర ప నులు చేపట్టనున్నారు. పుష్కరఘాట్ల అభివృద్ధి, పు నరుద్ధరణతో పాటు పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్ తదితర వంటివి మెరుగుపర్చనున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉద యం 10.50 గంటలకు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భక్తులకు మరింత సేవలుసరస్వతీ అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అక్షరాభ్యాసం కోసం చిన్నారులతో వచ్చే కుటుంబాలతో క్షేత్రం నిత్యం సందడిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులతో భక్తులకు మెరుగైన వసతులు అందుబా టులోకి రానున్నాయి. ఆలయ అభివృద్ధితోపాటు సుందరీకరణ జరిగితే ఇక్కడ భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది.స్థానికంగా వాణిజ్యం, రవాణా రంగాలకు కూడా పర్యాటకానికి ఊతం లభించనుంది. బాసర సరస్వతీ అమ్మవారు ఆలయ నమూనా చిత్రంమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆది వారం బాసర పర్యటన నేపథ్యంలో పకడ్బందీ గా ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం కలెక్టర్ పరిశీలించా రు. పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అధికారులు, తహసీల్దార్లు, ఆలయ ఈవో అంజనాదేవి ఉన్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
బాసర: కుటుంబ సమస్యలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను నిర్మల్ జిల్లా బాసర పోలీసులు కాపాడి కుటుంబ సభ్యుల కు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. సికింద్రాబాద్లోని అల్వాల్కు చెందిన షేన్ సవిత(30) కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహ త్య చేసుకోవాలని శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు బాసర గోదావరి నదిలో దూకింది. నీటిలో తు అక్కడ తక్కువ ఉండగా.. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గుర్తించి రక్షించారు. బాసర పోలీ సుస్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె సోదరుడు దాడెల్ల రాజేశ్కు అప్పగించినట్లు ఎస్హెచ్వో దీపక్ తెలిపారు. -
విద్యాప్రమాణాలు పెంచాలి
ఉట్నూర్రూరల్: ఉపాధ్యాయులు స్వీయప్రేరణతో విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో 133 ఆశ్రమ పాఠశాలలు, 900 పైచిలుకు ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఈఎంఆర్ఎస్లో తొలిసారిగా ఎఫ్ఎల్ఎన్ అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సులభపద్ధతిలో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. ఏపీవో భాస్కర్, డిప్యూటీ డీఈవో చందన్, గిరిజన క్రీడా అధికారి పార్థసారథి, డీటీడీవోలు, హెచ్ఎంలు విద్యార్థులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న గురువులు
కడెం: మండలంలోని ఎలగడప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూచనపెల్లి శ్రీనివాస్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవా ర్డు ఎంపికయ్యారు. కొడంగల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, టీచర్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నారు. ఆర్జీయూకేటీ అధ్యాపకుడికి ఉత్తమ అవార్డు బాసర: బాసర ఆర్జీయూకేటీలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో సేవలందిస్తున్న డాక్టర్ కే.మహేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నారు. కొడంగల్లో నిర్వహించిన కార్యక్రమంలో యోగితా రాణా, ఇన్చార్జి వీసీ గోవర్ధన్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఓఎస్డీ, ఏవో ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ అభినందించారు. అవార్డు అందుకుంటున్న శ్రీనివాస్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంటున్న మహేశ్ -
వైభవంగా మురళీకృషుడి శోభాయాత్ర
కుంటాల: మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం ముగిశాయి. కుంటాలలోని ప్రాచీన శ్రీకృష్ణ దేశాలయంలో రాఖీ పౌర్ణమి నుంచి వారం రోజులు వేడుకలు జరుగుతా యి. శనివారం వేకువ జామున హనుమాన్ ఆలయంలో కాకడహారతితో వేడుకలు ముగిశా యి. ఎస్పీ జానకీషర్మిల శ్రీకృష్ణ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. పాత బస్టాండ్ ప్రాంతంలో జుట్టు పరివారం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో దౌనెల్లి తండాకు చెందిన చవాన్ సంజీవ్ టీం సభ్యులు ఉట్టి పోటీలో తలపడగా, భైంసా ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్ రూ.11,111 నగదును అందజేశారు. ఉపాధ్యాయుడు మానాజీగారి సునీత–సిద్ధిరాం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల గజేందర్, భైంసా రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైనరేశ్, జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, పీఏసీఎస్ చైర్మన్ గజ్జారాం, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జుట్టు లక్ష్మణ్, ఉప సర్పంచ్ పరికిపండ్ల వెంకటరమణ, మాజీ ఎంపీపీ గజ్జారాం, మహేందర్, నాలం శ్రీనివాస్, రమణారావు పాల్గొన్నారు.ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి నిర్మల్చైన్గేట్: జిల్లాలోని ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి శనివారం వినతిపత్రం సమర్పించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇంద్రమల మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రతతోపాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం సేవలందిస్తున్న ఆశ వర్కర్లకు సరైన వేతనం లేకపోవడం బాధాకరమన్నారు. సమస్యల సాధనకు సెప్టెంబర్ 8న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాకు ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
10న ‘చలో హైదరాబాద్’
నిర్మల్చైన్గేట్: టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 10న తలపెట్టన ‘చలో హైదరాబాద్’ పోస్టర్ను శనివారం నాయకులు ఆవిష్కరించారు. టీజీఈజేఏసీ చైర్మన్ వెల్మల ప్రభాకర్, సెక్రెటరీ జనరల్ పీజీ.రెడ్డి మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్’కు అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావా లని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కుడాల రవికుమార్, టీజీవో జిల్లా కార్యదర్శి రమేశ్, క్లాస్–4 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.రవి, సెక్రెటరీ గణేశ్, నాయకులు వెంకటరమణ, సజన్, సంతోష్, మురళీకృష్ణ, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలి
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా అమలవుతున్న పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రతీ పథకం అర్హులకు చేరేలా అధికారులు చొరవ చూపాలన్నారు. పథకాల అమలులో ఇబ్బందులు కలిగితే వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, సీపీవో గంగారెడ్డి, డీఎంహెచ్వో రాజేందర్, వ్యవసాయ అధికారి సుజాత, హార్టికల్చర్ అధికారి రమణ, హౌసింగ్ పీడీ శ్రీనివాస్రెడ్డి, సంక్షేమ అధికారి వినూత్న తదితరులు పాల్గొన్నారు. -
వెయ్యి రోజుల సంబురం
ఖనాపూర్/నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పూర్తయిన సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖానాపూర్ నుంచి నిర్మల్ వరకు డీసీసీ చీఫ్ వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నా రు. కేసీఆర్ రాజీనామా చేయాలని నినాదాలు చేశా రు. వెయ్యి రోజుల్లో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదన్నారు. నిర్మల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కుచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మాట్లాడారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, పేదల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి నారాయణరావు పటేల్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్పై పల్లెల యుద్ధం
నిర్మల్: ప్లాస్టిక్ పర్యావరణానికి పెను ముప్పుగా మారుతోంది. భూతాపం పెరుగడానికి కాలుష్యమే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా.. క్షేత్రస్థాయిలో వాటి అమలులో లోపాలు ఉంటున్నాయి. మార్కెట్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, చిరువ్యాపార కేంద్రాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగం విపరీతంగా కొనసాగుతోంది. ప్లాస్టిక్ లేయర్ ఉన్న పేపర్ ప్లేట్లు, టీ గ్లాసులు, టిఫిన్ ప్లేట్లను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్తో మున్ముందు ఇంకెన్ని అనర్థాలు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన పల్లెల్లో పెరుగుతోంది. అదే గ్రామీణుల్లో చైతన్యాన్ని తీసుకొస్తోంది. ‘ప్లాస్టిక్పై ఇక పోరాడాల్సిందే..’ అన్న తరహాలో ఒక్కో గ్రామం ‘ప్లాస్టిక్ రహిత పల్లె’గా మారేదిశగా ప్రయత్నాలు ప్రారంభించి భేష్ అనిపించుకుంటున్నాయి. ఉద్యమంలా.. ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లతో కలిగే అనర్థాలపై పెరుగుతున్న అవగాహన పల్లెలను కదిలిస్తోంది. ఇప్పటికే చాలా గ్రామాలు ఉద్యమంలా ముందుకు వస్తున్నాయి. జిల్లాలో ఒక గ్రామాన్ని చూసి, మరో గ్రామం ప్లాస్టిక్ రహితం దిశగా అడుగులు వేస్తుండటం శుభపరిణామం. చేతిసంచులు పంచుతూ, స్టీల్బ్యాంకులు ఏర్పాటు చేసుకుంటూ, మాంసాహారాన్ని స్టీల్డబ్బాల్లోనే తీసుకెళ్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నాయి. కుంటాలలో... కుంటాల: పర్యావరణ పరిరక్షణ కోసం కుంటాల సర్పంచ్ జక్కుల గజేందర్, కార్యదర్శి రాజబాపు ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నారు. వారసంతలో వ్యాపారులు, వినియోగదారులు ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తూ ప్రతిజ్ఞ చేశా రు. చికెన్, మాంసం కోసం వచ్చేవినియోగదారులు డబ్బాలను వినియోగిస్తున్నారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా స్టీల్బ్యాంక్ కోసం దాతలు రూ.1.20 లక్షలు విరాళంగా ఇవ్వగా, 2,500 ప్లేట్లు, 100 గ్లాసులను కొనుగోలు చేశారు. -
రాజురాలో...
ఖానాపూర్: మండలంలోని రాజురాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామపంచాయతీ వినూత్న చర్యలు చేపట్టింది. సర్పంచ్ చేగంటి మల్లేశ్ ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్లను కొనుగోలు చేశారు. ప్రతీ శుభకార్యంలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను వినియోగిస్తున్నారు. మరిన్ని ప్లేట్లను తీసుకొస్తామని సర్పంచ్ తెలిపారు. సింగాపూర్లో మూడేళ్లుగా ప్లాస్టిక్పై పోరు కొనసాగిస్తున్నారు. స్టీల్బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు. సుర్జాపూర్లో ఎంపీడీవో రాధారాథోడ్ చొరవతో సర్పంచ్ వెంకటరాములు పంచాయతీ నిధులతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. -
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
నిర్మల్రూరల్: ఉపాధ్యాయులు సమ సమాజ నిర్మాతలని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశా రు. అనంతరం మాట్లాడుతూ తాను జిల్లాకు వచ్చి న కొత్తలో కొన్ని పాఠశాలలు తనిఖీ చేసి, విద్యార్థు ల నైపుణ్యాన్ని పరీక్షించానని.. కొన్ని పాఠశాలల విద్యార్థుల నైపుణ్యం పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సన్మార్గంలో నడిచేలా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ ఏడాది విద్యార్థుల నమోదు పెరగడం పరీక్ష ఫలితాల్లో మంచి పురోగతి సాధించడం అభినందనీయమన్నారు. జిల్లా ఉపా ధ్యాయులు రాష్ట్ర, జాతీయ అవార్డులకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. డీఈవో భోజన్న, డీఆర్వో రమేశ్రాథోడ్, డీఐఈవో పరుశురాం, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, దయానంద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ పాల్గొన్నారు. -
లోక్అదాలత్లో పెండింగ్ కేసులు పరిష్కరించాలి
నిర్మల్టౌన్: ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లో పెండింగ్లో ఉన్న కేసులు వీలైనన్ని ఎక్కువ పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా జడ్జి శ్రీవాణి సూచించారు. ఎస్పీ జానకీషర్మిలతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న అర్హత కలిగిన క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు అధిక సంఖ్యలో పరిష్కరించేలా పోలీస్, న్యాయశాఖ అధికారులు సమన్వయంలో పనిచేయాలని తెలిపారు. పెండింగ్ కేసులను గుర్తించడం, సంబంధిత కక్షిదారులతో సమన్వయం చేయడం, కేసుల పరిష్కారం వేగవంతం చేయడంపై చర్చించారు. ఆన్లైన్ పోర్టల్ను సమర్థవంతంగా వినియోగించి కేసుల వివరాలు సకాలంలో నమోదు, అప్డేట్ చేయడం ద్వారా కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ..ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు, ప్రాసిక్యూషన్, న్యాయస్థానాల సమన్వయం కీలకమన్నారు. అధికారులు నాణ్యమైన దర్యా ప్తు చేపట్టి, కోర్టు ఆదేశాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి పి.రవీందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవేందర్, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, సీడీవోలు, న్యాయస్థాన అధికారులు పాల్గొన్నారు. -
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. వాతావరణం చాలా వరకు పొడిగా ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది.
జామ్ గ్రామంలో.. సారంగాపూర్: మండలంలోని జామ్ గ్రామంలో వారసంతలో ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని తగులబెట్టారు. జూట్, బట్టసంచులు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మటన్, చికెన్ సెంటర్లలో టేకు ఆకులు వినియోగిస్తున్నారు. జామ్ గ్రామంలోని వేద పాఠశాల ఆధ్వర్యంలో రూ.5వేలు విలువచేసే జూట్బ్యాగులు తయారు చేసి పంపిణీ చేశారు. గ్రామంలో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ‘స్టీల్ బ్యాంకులు’ ఏర్పాటు చేశారు. శుభకార్యాలకు ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందిస్తున్నారు. -
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. ఒకటి రెండుచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆటపాటలతో బోధన.. లక్ష్మణచాంద: లక్ష్మణచాంద మండలం చింతల్చాంద ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలు అర్చన పిల్లలకు టీఎల్ఎం, ఆటపాటలు, అబాకస్ పద్ధతిలో విద్యను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఎఫ్ఎల్ఎన్ బోధనలో భాగంగా వివిధ కృత్యాలతో ప్రతీరోజు పిల్లలతో మమేకమై బోధన చేస్తారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీస్తూ జనవరి 2026 లో జరిగిన నిర్మల్ ఉత్సవాల్లో చింతల్చాంద ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొనేలా చేశారు. సర్పంచ్ వెంకటి, వీడీసీ సహకారం, పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థుల సంఖ్యను 52 నుంచి 97 కి పెంచారు. గణితం రిసోర్స్ పర్సన్గా కూడా మండల విద్యాధికారి మన్ననలు పొందుతున్నారు. -
జోనల్స్థాయి పోటీలకు ఎంపిక
ఖానాపూర్: ఎస్జీఎఫ్ అండర్–17 జిల్లాస్థా యి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన బాలబాలికలు జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల క్రీడా కన్వీనర్, హెచ్ఎం జాడి శ్రీనివాస్, పీడీ ఇమ్రాన్ తెలిపారు. బాలికల విభాగంలో జి.హిందూ హాసిత, జి.సాయి ప్రసన్న, పి.రచిత, జె.అనన్య(పెంబి జిల్లా పరిషత్ పాఠశాల), ఎం.అలియా, సీహెచ్.అర్చన, బి.లక్ష్మీప్రసన్న(జిల్లా పరిషత్ మస్కాపూర్ పాఠశాల) ఎంపికయ్యారు. బాలుర విభాగంలో కె.యశస్విరాజ్, మస్కాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన పి.కార్తీక్, డి.మనుతేజ్, డి.యోగేశ్వర్, బి.రాఘవ కృష్ణ(నిర్మల్ విన్నర్స్ పాఠశాల), జి.నవదీప్, కె.సాత్విక్(పెంబి జిల్లా పరిషత్ పాఠశాల) ఎంపికయ్యారని వివరించారు. క్రీడాకారులు జోనల్స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. -
మువ్వ గోపాలులు.. ముద్దు గోపమ్మలు!
రాధాకృష్ణులుగా చిన్నారులుజిల్లాలో శ్రీకష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్, భాగ్యనగర్లోని మురళీకృష్ణ ఆలయాలతోపాటు శాంతినగర్, మంజులాపూర్లోని యాదవ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి. గాంధీచౌక్ మురళీకృష్ణ ఆలయంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణులుగా, గోపికల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. – నిర్మల్టౌన్ -
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయలు వీరే
నిర్మల్ రూరల్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న అందించే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను డీఈవో భోజన్న శుక్రవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం 75 మంది ఉపాధ్యాయులకు అవార్డులు దక్కనున్నాయి. ఇందులో పీజీ హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, అసోసియేట్ ప్రొఫెసర్లు, జూనియర్ లెక్చరర్లు, సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తములకు అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు.. బి.రాజు(జెడ్పీహెచ్ఎస్, లక్ష్మణచాంద), అనూష(ఈద్గాం ఆశ్రమ ఉన్నత పాఠశాల), రాజు( ప్రిన్సిపాల్, కుంటాల ఆదర్శ పాఠశాల ) ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు.. సిద్ధిరాం(ఎంపీపీఎస్ అందకూర్), సుమలత ి(సాయి నగర్), లింగన్న (ఎంపీపీఎస్ పెంబి).. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ.. దుర్గం భూమయ్య (జెడ్పీహెచ్ఎస్ మునియాల్), భక్తి సుగుణ (ఎంపీ యూపీఎస్ సాంగ్వి), నాలం వామన్రావు (జెడ్పీహెచ్ఎస్ దిలావర్పూర్), శివకుమార్ (జెడ్పీహెచ్ఎస్ కడెం), వాణిశ్రీ(ఖానాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల), ప్రసన్ జీత్(జెడ్పీహెచ్ఎస్ బీర్నంది), రాజశేఖర్ (జెడ్పీహెచ్ఎస్ పల్సి), మహేందర్(ఎంపీయూపీఎస్ చాత )ధనుంజయరెడ్డి (జెడ్పీహెచ్ఎస్ లక్ష్మణచాంద), వివేకానందు(జెడ్పీహెచ్ఎస్ లోకేశ్వరం), సాయిరెడ్డి(జెడ్పీహెచ్ఎస్ ఆష్ట), విజయలక్ష్మి(జెడ్పీహెచ్ఎస్ ముధో ల్), ప్రేమ్సాగర్(జెడ్పీహెచ్ఎస్ నర్సాపూర్(జి))గౌసుద్దీన్(సోమవార్పేట్ బాలికల పాఠశాల), దేవదాసు(జెడ్పీహెచ్ఎస్ ముజిగి), చంద్రశేఖర్వర్మ(జెడ్పీహెచ్ఎస్ పెంబి), సాయన్న (జెడ్పీహెచ్ఎస్ స్వర్ణ), ద్రుపత్రెడ్డి(జెడ్పీహెచ్ఎస్ బోసి), సంజు రాథోడ్ (వ్యాయామ ఉపాధ్యాయురాలు బీరవెల్లి) ఎస్జీటీలు... రాజేశ్వరి(ఎంపీపీఎస్ బాసర), సునీత(ఎంపీపీఎస్, మాంజరి) వెంకటరమణ(ఎంపీపీఎస్, మల్లాపూర్), అనితరాణి(ఎంపీపీఎస్ లోలం), గంగారాం(ఎంపీపీఎస్ పేతారుపు, కడెం), ప్రవళిక(ఎంపీపీఎస్ ధర్మాయిపేట్), సంతోష్(ఎంపీయూపీఎస్ బావాపూర్), కె.రాజగంగ(ఎంపీ యూపీఎస్ బెల్గాం), పద్మలత(ఎంపీపీఎస్ కల్లూరు) గంగాధర్ (ఎంపీపీఎస్ లక్ష్మణచాంద), అర్చన(ఎంపీయూపీఎస్ చింతల్చాంద), నర్సింగ్రావు(ఎంపీపీఎస్ పిప్పిరి), అలివేలు మంగతాయారు(ఎంపీ యూపీఎస్ కమల్కోట్), ఉషకిరణ్మయి(గర్ల్స్ ముధోల్), సైఫుద్దీన్ హర్షద్ (ఎంపీపీఎస్ నైబాడీ), పావని(ఎంపీపీఎస్ బూరుగుపల్లి), తోట లావణ్య (ఎంపీపీఎస్, శాంతినగర్ నిర్మల్) మొహమ్మద్ ఖలీద్ అహ్మద్ (సాయినగర్ నిర్మల్), మాలతి(ఎంపీపీఎస్ రత్నాపూర్కాన్లీ), వాణి (ఎంపీపీఎస్ సాయినగర్), మొహమ్మద్ ముజాయుద్దీన్(ఎంపీపీఎస్ గోపాల్పేట్), గిరి జ్యోతి(ఎంపీపీఎస్ బేల్తారోడా) కేజీబీవీలో... సంధ్యారాణిి(కల్లూరు), అలియా నాహిద్(పీజీసీఆర్టీ మందపల్లి), సురేశ్(సీఆర్టీ, బాయ్స్ నిర్మల్ ), భూమన్న(రిసోర్స్ టీచర్ భవిత తానూర్) స్పెషల్ అప్రిషియేషన్.. రమాదేవి(టీజీటీ, కుంటాల మోడల్ స్కూల్), అబ్దుల్ కరీం(ఎస్ఏ, మస్కాపూర్), దత్తాద్రి(గైడ్ టీచర్ అల్ఫోర్స్ హైస్కూల్ భైంసా), కె.సుప్రియ(గైడ్ టీచర్ వికాస్ హైస్కూల్ భైంసా). వెల్ఫేర్ సంస్థలలో... జంగు(ఎస్జీటీ ఖానాపూర్ ఆశ్రమ బాలికల పాఠశాల), సత్యనారాయణ( సీఆర్టీ ఆశ్రమ పాఠశాల తానూర్), హరిలత(సీఆర్టీ, ఆశ్రమ పాఠశాల ఓవైసీ నగర్), అనూప్(సీఆర్టీ ఆశ్రమ పాఠశాల డోడర్నా), రాజు (ప్రిన్సిపాల్, రాచాపూర్ ఎంజేపీ), మాధురి(జూనియర్ లెక్చరర్ ఎంజేపీ సారంగాపూర్), గోపికృష్ణ(టీజీటీ ఎంజేపీ దిలావర్పూర్), అబ్దుల్ అహ్మద్ (ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్ టీజీ ఎంఆర్ఈఎస్ ఖానాపూర్), చిన్న రమణి అరుణ(టీఈటీ, ముధోల్), ఫరానా తరుణం(టీజీటీ ప్రియదర్శిని నగర్ నిర్మల్), తబస్సుం(ఎస్జీటీ, ఎయిడెడ్ ఇంగ్లిష్ మీడియం నిర్మల్), జ్యోత్స్న(నర్సింగ్ టీచర్ సోఫీనగర్ గురుకుల పాఠశాల) నాగేశ్వరి (టీజీటీ లెఫ్ట్ పోచంపాడు పాఠశాల), సంధ్యారాణి (టీజీటీ భైంసా వెల్ఫేర్ కళాశాల) ఇంటర్మీడియట్, డిగ్రీ ఎడ్యుకేషన్లో డాక్టర్ పవన్కుమార్ (అసోసియేట్ ప్రొఫెసర్ భైంసా డిగ్రీ కళాశాల), కే.రమేశ్(అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మల్ డిగ్రీ కళాశాల), సందీప్ కులకర్ణి(జూనియర్ లెక్చరర్ భైంసా జూనియర్ కళాశాల), శ్రీనివాస్(జూనియర్ లెక్చరర్ సారంగాపూర్ జూనియర్ కళాశాల), మోహన్ (జూనియర్ లెక్చరర్ ఖానాపూర్ ) -
ఉత్తముల ఎంపికలో అవకతవకలు
నిర్మల్ రూరల్ : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక నిబంధనలకు విరుద్ధంగా జరి గిందని వివిధ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎస్టీయూటీఎస్, యూటీఎఫ్, టీఆర్టీయూ, టీయూటీఎఫ్, డీటీఎఫ్ నా యకులు జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవన్లో శుక్రవారం మాట్లాడారు. పదేళ్లకన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వాల్సి ఉండగా, రెండు, మూడేళ్ల సర్వీస్ ఉన్నవారిని ఎంపిక చేశారని తెలిపారు. ఎంపికలో కొన్ని మండలాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. జాబితాను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు భూమన్న యాదవ్, లక్ష్మణ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దర్శనం దేవేందర్, గడ్డం భూమన్న తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు కుంటాల: శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలల్లో భాగంగా శనివారం కుంటాలలో నిర్వహించే శోభాయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను శుక్రవారం పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు. ఆయన వెంట భైంసా రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, సర్పంచ్ జక్కుల గజేందర్, ఉప సర్పంచ్ పరికిపండ్ల వెంకటరమణ, జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జుట్టు లక్ష్మణ్, మాధవరావు తదితరులు ఉన్నారు. గణితంలో.. ఘనాపాఠి -
రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: అఖిల భారత రైతు కూలీ సంఘం 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ఆర్.ఉపాలి కోరారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేక.. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కురుకుపోతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. సమస్యల పరి ష్కారానికి పోరాటాలే మార్గమన్నారు. సభకు అధిక సంఖ్యలో రైతు కూలీలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా సహాయ కార్యదర్శి గోగు శేఖర్, జిల్లా నాయకులు జె.రాజు, గూట్ల ప్రసాద్, నేతావత్ రవి, గంగాధర్ పాల్గొన్నారు. -
రూ.150 కోసం చదువు ఆపేసి..
ఆచూకీలేని ఆధ్యాత్మిక కారిడార్ బాసర.. ప్రకృతి అందాల సహస్రకుండ్.. రేణుకామాత, దత్తాత్రేయ క్షేత్రాలతో ప్రసిద్ధి చెందిన మాహోర్.. ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక– పర్యాటక కారిడార్ పత్తా లేదు. మాతృ దేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవం.. తల్లిదండ్రుల తర్వాత గురువుకు మన సంస్కృతి గొప్ప స్థానం ఉంది. గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.. అంటూ దైవస్థానం ఉంది. గురువు దారి చూపే మార్గదర్శి.. మనలోని అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించి సన్మార్గంలో నడిపించేది గురువే. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, ఆత్మసాక్షాత్కారాన్ని, దివ్యత్వాన్ని పరిచయం చేసేది గురువే. నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బడిలో భావి భారతాన్ని తీర్చిదిద్దుతున్న జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.ఖానాపూర్: గణితం కష్టమైన సబ్జెక్ట్ అనే భావనను తొలగిస్తూ, సాంకేతికతను జోడించి విద్యార్థుల్లో ఆసక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మస్కాపూర్లో స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్న సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీమ్. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన వినూత్న పద్ధతుల్లో బోధిస్తున్నారు. గణితాన్ని కేవలం పాఠ్యపుస్తకాల్లోని సూత్రాలు, లెక్కలకే పరిమితం చేయకుండా దైనందిన జీవితానికి అనుసంధానం చేస్తూ ఆచరణాత్మకంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. సాంకేతికతతో సులభమైన గణితం జియోజిబ్రా, డిజిటల్ వనరులు, పైథాన్, ఆర్డునో వంటి సాంకేతిక సాధనాలను బోధనలో వినియోగిస్తూ క్లిష్టమైన గణిత అంశాలను విద్యార్థులకు సులభంగా వివరిస్తున్నారు. విద్యార్థులు కేవలం సమాధానాన్ని గుర్తుపెట్టుకోవడం కాకుండా, సమస్యను ఎలా పరిష్కరించాలి, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాలను అర్థం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ‘ఏమి నేర్చుకోవాలి?’ అనే ప్రశ్నతో పాటు ‘ఎందుకు నేర్చుకోవాలి?’ అనే ఆలోచన విద్యార్థుల్లో కలగాలన్నదే ఆయన బోధనా విధానం. ప్రశ్నించడం, పరిశీలించడం, స్వయంగా పరిష్కారాలను అన్వేషించడం ద్వారా విద్యార్థుల్లో స్వతంత్ర అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నారు. వినూత్న బోధనకు అవార్డు తన ప్రత్యేకమైన బోధనా విధానానికి గుర్తింపుగా సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీమ్ ‘బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ టీచింగ్ అవార్డు’ అందుకున్నారు. బోధనా రంగంలో ఆయన ప్రతిభకు మరో గుర్తింపుగా ‘స్టేట్ రిసోర్స్ పర్సన్ ఫర్ డిజిటల్ లెర్నింగ్’గా సేవలందిస్తున్నారు. డిజిటల్ అభ్యసనానికి సంబంధించిన వనరులు, బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంచడంతోపాటు స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఫరాజ్ అబ్దుల్ కరీమ్ చెబుతున్నారు ఖానాపూర్: ఒకప్పుడు రూ.150 పరీక్ష ఫీజు చెల్లించలేక ఇంటర్ చదువు ఆపేసి భవన నిర్మాణ కార్మి కుడిగా పనిచేశారు. అయినా చదువుపై మక్కువ వదలకుండా తిరిగి ఉన్నత విద్య పూర్తి చేసి నేడు ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు కడెం మండలం లింగాపూర్కు చెందిన కుర్ర లింగవ్వ–బుచ్చన్న దంపతుల కుమారుడు కుర్ర శేఖర్. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ ఆపిన శేఖర్ ముంబైలో కూలీగా పనిచేసి తిరిగి చదువు పూర్తి చేశారు. స్కాలర్షిప్లతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (హిస్టరీ), ఐఏఎస్ఈలో ఎంఈడీ సాధించారు. 2009లో కౌటాల జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడిగా ప్రారంభించి, వివిధ పాఠశాలల్లో పనిచేసి 2023 అక్టోబర్ నుంచి మస్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్గా సేవలందిస్తున్నారు. ప్రత్యక్ష అనుభవంతో బోధన సాంఘికశాస్త్రాన్ని ప్రాజెక్టులు, నమూనా ఎన్నికలు, మోడల్ కోర్టు, మోడల్ బ్యాంక్, నేలపై పటా లు గీయడం ద్వారా ఆచరణాత్మకంగా బోధిస్తున్నారు. ఐఎఫ్పీ ప్యానెల్స్తో సాంకేతికత వినియోగించి, ఏటా సోషల్ స్టడీస్ ప్రాజెక్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. స్లిప్, గ్రాండ్ టెస్టులు, ప్రత్యేక తరగతులు, వాట్సాప్ పర్యవేక్షణ, ఇళ్ల సందర్శనలతో పదో తరగతి విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. సాంఘిక శాస్త్రంలో ప్రతి ఏడాది 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. విద్యార్థుల విజయాలు, అవార్డులు ఆయన మార్గదర్శకత్వంలో అనేకమంది విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. 2018, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, 2020లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నుంచి విద్యాసేవా రత్న బిరుదు అందుకున్నారు. సాంఘిక శాస్త్రం కేవలం మార్కుల కోసం కాదుం సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఆయుధమని శేఖర్ నమ్మకం. ఎనిమిదో తరగతి నుంచే నైతిక విలువలు, ప్రజాస్వామ్యం, పర్యావరణం, ఆర్థిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఖానాపూర్: మారుమూల గిరిజన గ్రామం కొలాంగూడం 152 కుటుంబాలు, అందరూ కొలాం గిరిజనులే. తెలుగు భాషపై అవగాహన తక్కువ, బడికి రావాలన్న ఆసక్తి కూడా అంతంత మాత్రం ఉన్న ఈ ప్రాంతంలో కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు తిరుమలేష్, అఖిల్ వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నారు. వారి మాతృభాష కొలామిలో తెలుగు లిపి ద్వారా కథల పుస్తకాలు రూపొందించి, స్వయంగా టీఎల్ఎం తయారు చేసి, డిజిటల్ పాఠాలు, గోడ చిత్రాల ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇంటింటికీ వెళ్లి విద్యపై అవగాహన బడికి సక్రమంగా రాని విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో పనులకు వెళ్తున్న పిల్లలను, బాల కార్మికులుగా మారే అవకాశం ఉన్న వారిని గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు తిరుమలేష్ సొంత ఖర్చులతో జనన ధ్రువీకరణ పత్రాలు అందించి, ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో 2024లో 29 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 39కి చేరింది. గతంలో సగటు హాజరు 15–18 మంది మాత్రమే ఉండగా, ఇప్పుడు 25–32 మంది వరకు హాజరవుతున్నారు. గతంలో పాఠశాలంటే భయంతో ఉండే పిల్లల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. మూడో, నాలుగో తరగతి వరకు పెన్ను, బలపం సరిగ్గా పట్టుకోలేని కొందరు విద్యార్థులు ప్రస్తుతం వర్క్బుక్స్ రాసే స్థాయికి చేరుకున్నారు. కళలు, విద్యా కార్యక్రమాల ద్వారా సృజనాత్మకతను వెలికితీస్తూ విలువల విద్య, జీవన నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సొంత ఖర్చులతో కిచెన్ షెడ్డు, ప్రహరీ నిర్మాణం వంటగది లేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో కిచెన్ షెడ్డు నిర్మించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో కిచెన్ గది నిర్మాణం జరుగుతోంది. పాఠశాలకు ప్రహరీ నిర్మాణం కూడా పూర్తయింది. విద్యార్థులు, తల్లిదండ్రులతో అనుబంధం పెంచుకునేందుకు ఉపాధ్యాయులు గుస్సాడీ, భీమన్న తదితర గిరిజన పండుగల్లో భాగస్వాములు అవుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తుల మధ్య అనుబంధం మరింత బలపడుతోంది. ‘ప్రత్యేక బోధనా విధానాల వల్ల ప్రవేశాలు, హాజరు పెరిగాయి. పిల్లల్లో బడి పట్ల ఆసక్తి, క్రమశిక్షణ పెరిగింది. విద్యతో పాటు సంస్కారం, విలువలు, జీవన నైపుణ్యాలను అలవర్చేందుకు కృషి చేస్తున్నాం’ అని ప్రధానోపాధ్యాయుడు తిరుమలేష్ తెలిపారు. గిరిజన గ్రామంలో విద్యా విప్లవం.. -
బడి బలోపేతం..
లక్ష్మణచాంద: లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తునర్న ఎస్జీటీ పోతుగంటి గంగాధర్ 2024 జూలై 1న బదిలీపై ఇక్కడికి వచ్చారు. రెండేళ్లలో పాఠశాలపై తనముద్ర వేసుకున్నారు. గతేడాది వేసవిలో సెలవుల సమయంలో బడిబాటతో సంబంధం లేకుండా తల్లిదండ్రులను కలిసి ఉపాధ్యాయులందరి సహకారంతో ఇంటింటికీ తిరిగి 97 మంది విద్యార్థుల సంఖ్యను 135కి పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. గ్రామస్తులతో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనంలో తాత్కాలికంగా రేకులతో గదులు ఏర్పాటు చేయించారు. పరిసరాలలో లభించే లోకాస్టు నోకాస్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగిస్తూ పిల్ల లకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడంతో ఆయన దిట్ట. ప్రత్యేక శ్రద్ధతో విద్యాబోధన చేస్తూ చదువులో ముందుకు వెళ్లేగా కృషి చేస్తున్నాడు. పాఠశాలకు సరిగా హాజరు కాని పిల్ల ల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్ల లను తన సొంత బండిపై పాఠశాలకు తీసుకువస్తూ గ్రామస్తుల మన్ననలు పొందారు. -
రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నిర్మల్చైన్గేట్: హైదరబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా నాయకులు పేర్కొన్నారు. వారి అరెస్టును నిరసిస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిర్మల్లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిశెమ్మ రాజు, సాదం అరవింద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు గంజి రాజు, కూన శశాంక్, సాత్విక్, ఈశ్వర్, వెంకటేష్, ఉదయ్, సాయిరెడ్డి, విజయ్, రాజు భరత్, హరీశ్ ఉన్నారు. ‘దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’ కడెం: బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డి ఇంటిపై దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని బీజేపీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్యాదవ్ ప్రకటనలో పేర్కొన్నారు. వర్షిత్రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, మహేశ్వర్రెడ్డిలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బాధితులకు సత్వరన్యాయం అందాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్ టౌన్: నేరాలపై నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవా లని ఎస్పీ జానకీషర్మిల పోలీస్ అధికారులకు సూచించారు. డీజీపీ నిర్వహించిన రెండు రోజుల సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు, సూచనలను క్షేత్రస్థాయి వరకు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 90, 60 రోజుల కాలపరిమితి గల బీఎన్ఎస్ కేసులతోపాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, కేసుల డిటెక్షన్, నిందితుల అరెస్టు, రికవరీ, పెట్రోలింగ్ను మరింత పటిష్టం చేయాలన్నారు. డయల్–112 కాల్స్కు వెంటనే స్పందించాలని ఆదేశించారు. దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్లు దాఖలు చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీని వాస్, సీఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్వోలు, స్టేషన్ రైటర్లు, సీసీటీఎన్ఎస్ రైటర్లు, టెక్ టీమ్, బ్లూ కోల్ట్స్్, పెట్రోకార్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ జిల్లా వ్యాప్తంగా ఈనెల ఒకటి నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ – 30 అమలులో ఉంటుందని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీ లు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా చర్యలకు పాల్పడినా, అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారం, వదంతులు, మత విద్వేషాలు లేదా సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు, సందేశాలు, వీడియోలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘ఉద్యాన’ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి
ముధోల్: ఉద్యానశాఖ రాయితీపై అందించే ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి బి.వి.రమణ పేర్కొన్నారు. మండలంలోని విట్టోలి, తరోడా గ్రామాల్లో పసుపు పంట, ఆయిల్పాం తోటలు, బిందు సేద్యం పరికరాలు పరిశీలించారు. ఆధునిక సాగు పద్ధతులు, బిందు సేద్యం ద్వారా నీటిని వినియోగించుకునే తీరును రైతులకు వివరించారు. డివిజన్ ఉద్యాన అధికారి జావిద్ పాషా, ఉద్యాన విస్తరణ అధికారి మోహిని మియా, ఆయిల్పామ్ ఏరియా మేనేజర్ ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు ప్రణాళికతో సన్నద్ధమవ్వాలి
తానూరు: పాఠాలను బట్టి పట్టకుండా.. అర్థం చేసుకుంటూ చదువుతూ ఇప్పటినుంచే ప్రణాళికతో వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా పదో తరగతి విద్యార్థులకు సూచించారు. మంగళవారం తానూరు కేజీబీవీని తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపాల్ అలేఖ్యను అడిగి తెలుసుకున్నారు. పొలాల నుంచి పాఠశాల ఆవరణలోకి వరద వస్తుందని చెప్పగా మొరం వేయించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. పాఠ్యాంశాల ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. హాజరు వందశాతం నమోదయ్యేలా చూసి.. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. మెనూ ప్రకారం నా ణ్య మైన అల్పాహారం, భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డీఈవో భోజన్న, ఎంఈవో నరేందర్, ఎంపీడీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
బీరప్ప ఆలయ నిర్మాణానికి భూమిపూజ
నర్సాపూర్(జి): ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గొల్లమాడ గ్రామంలో బీరప్ప ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. గ్రామస్తుల విరాళం రూ.ఐదు లక్షలు, సీజీఎఫ్ నిధులు రూ.20 లక్షలతో ఆలయం నిర్మించనున్నారు. ఈసందర్భంగా కు రుమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు గొంగడి, గొర్రె పిల్ల బహూకరించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్న వసంత లస్మయ్య, ఎంపీడీవో పుష్పలత, చెన్న మహేశ్, బాషెట్టి విజయ్ కుమార్, కాంట్రాక్టర్లు కొరివిపాటి కాశీం, వినోద్రెడ్డి, కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
తప్పనిసరిగా శుభ్రత పాటించాలి
లోకేశ్వరం: వ్యాధుల బారిన పడకుండా విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని ముధోల్ ఆర్బీఎస్కే వైద్యులు శివకుమార్, అయేషా అన్నారు. మంగళవారం మండలంలోని గడ్చాంద గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని 140 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. నలుగురిని డయాలసిస్ పరీక్షల నిమి త్తం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అనంతరం విద్యార్థుల ఎత్తు, బరువు వివరాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు కాశీరాం(ఉన్నతపాఠశాల), సాయాగౌడ్(ప్రాథమిక పాఠశాల), ఉపాధ్యాయులు మెండె వెంకటరమణ, ముత్తన్న, రవీందర్ ఉన్నారు. -
బీజేపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం
నిర్మల్చైన్గేట్:కాంగ్రెస్ మూకలు బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే స్పందించని పోలీసులు, బాధితులను పరమార్శించడానికి వెళ్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి దౌర్జన్యం చేసినా పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం, వాటిని ఖండించిన నాయకుల ఇళ్లపై పడి దౌర్జన్యానికి దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ అల్లరి మూకలను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అరాచకాలకు బీజేపీ భయపడదు నిర్మల్చైన్గేట్: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 326 సీట్లతో ఘన విజయం సాధించి, నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధానమంత్రి అవుతారని ఇండియా టుడే–సీ ఓటర్ సర్వే వెల్లడించిందని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో 9 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైందని పేర్కొన్నారు. బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. అందుకే బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందన్నారు. నల్గొండలో బీజేపీ కార్యాలయం, నాయకుల ఇళ్లపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్యకర్తలను భయపెట్టడం సాధ్యం కాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. 22ఏ భూముల అక్రమాలు, భూ కబ్జాలు, అటవీ భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జమాల్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, కౌన్సిలర్ గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, జింక సురేందర్, హరీష్ పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
తానూరు: పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ భూ బాధిత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. మొగ్లి గ్రామంలో భూబాధితులతో మంగళవారం సమావేశం ఏర్పా టు చేసి మాట్లాడారు. రైతులు తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో రైతులు పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి ఒక ఎకరం భూమి అమ్మినా మిగులు భూమిని లాక్ పడడంతో తమ పంట భూమి అమ్ముకోలేకపోతున్నామని తెలిపారు. 15 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. బాధిత రైతుల నుంచి పూర్తి వివరాలను సేకరించి, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, జీపీవోల ద్వారా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని కలెక్టర్ చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కోలూరు నుంచి మొగ్లి వరకు ఉన్న బిటీ రోడ్డు చెడిపోవడంతో గ్రామస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావ్ పటేల్, సర్పంచ్ ఉష, మాజీ జెడ్పీటీసీ ఉత్తం బాలేరావ్, ఎంపీడీవో శ్రీధర్ పాల్గొన్నారు. -
సర్కారు బడికి పూర్వవిద్యార్థి చేయూత
ఖానాపూర్: మండలంలోని సుర్జాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వవిద్యార్థి అయిన ఎన్ఆర్ఐ చేయూతని చ్చాడు. సుర్జాపూర్ గ్రామానికే చెందిన రేండ్ల కిషన్ కుమారుడు రేండ్ల రాజేందర్ ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను చదివిన పాఠశాలకు సుమారు రూ.50 వేల విలువైన రెండు బీరువాలు, ఏడు స్టడీ చైర్లు, ఇతర విద్యాసామగ్రిని సమకూర్చాడు. మంగళవారం ఫర్నీచర్ను పాఠశాల యాజమాన్యానికి రాజేందర్ తండ్రి కిషన్ అందజేశారు. సర్పంచ్ బక్కశెట్టి వెంకట్రాములు, హెచ్ఎం వడ్నూరి మునీందర్, ఉపసర్పంచ్ కడమంచి లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి విక్రం రాజ్, దేవస్థాన కమిటీ అధ్యక్షుడు తునికి మహేందర్, హరీశ్, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
భూముల రీసర్వేకు సహకరించాలి
ఖానాపూర్: ప్రారంభమయ్యే భూముల రీసర్వేకు గ్రామస్తులు సహకరించాలని తహసీల్దార్ సుజాత తెలిపారు. మండలంలోని ఇక్బాల్పూర్, గంగాయిపేట్, కొత్తపేట్ గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహించనున్నారు. మంగళవారం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించగా తహసీల్దార్ హాజరై రీసర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. సర్పంచులు, ఉప సర్పంచులు దొనికేని లక్ష్మి, దయానంద్, రెడ్డి లక్ష్మి, నరేందర్, సిద్ధ పల్లవి నరేశ్, దొనికేని వెంకటేశ్, నాయకులు శ్రావణ్, భైరవేణి రాజు, మధు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కడెం: భూసమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తహసీల్దార్ ఖాజామొయినుద్దీన్ అన్నారు. రీసర్వే పైలట్ గ్రామంగా ఎంపికై న మండలంలోని సారంగాపూర్లో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కోల తేజస్వినిశ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
రైతులు నీటికుంటలు తవ్వుకోవాలి
ముధోల్: రైతులు భూగర్భజలాలు పెంచుకునేందుకు పంటల వద్ద నీటికుంటలు(ఫారంపాండ్లు) తవ్వుకునేందుకు ముందుకు రావాలని డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారంమండలంలోని ముధోల్ గ్రామపంచాయతీ పరిధిలో వీ–బీజీ–రామ్ జీ పథకం ద్వారా నీటి కుంటల ని ర్మాణ పనులను డీఆర్డీవో పరిశీలించారు. ఈసందర్భంగా పనుల పురోగతి, నాణ్యత పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లవకుమార్, ఏపీవో శిరీష, ఏపీఎం గురుచరణ్, టెక్నికల్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
గుంతల రోడ్డే దిక్కు..
మా గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గుంతల రోడ్డే దిక్కు. రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో మాకు తెలుసు. పాత జీపుల్లో ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా తప్పడం లేదు. బస్సులు సరిగా నడవవు.. ఆటోలు కూడా ఎప్పుడూ దొరకవు. పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే ఏ వాహనం దొరికితే అందులోనే వెళ్లాల్సిన పరిస్థితి. – రాథోడ్ బిక్కు, సిరిపెల్లి ప్రయాణం చేయక తప్పదు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసు. అయినా ప్రయాణం చేయక తప్పదు. ఆస్పత్రికి వెళ్లాలన్నా.. మార్కెట్కు వెళ్లాలన్నా.. ఇతర పనుల కోసం వెళ్లాలన్నా సరైన రవాణా సౌకర్యం లేదు. రోడ్లు బాగు చేసి బస్సులు నడిపితే పాత జీపుల్లో ప్రయాణం తప్పుతుంది. – జాదవ్ శివరామ్, రంజని -
సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
నిర్మల్చైన్గేట్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక (టీజీఈజేఏసీ) జిల్లా అధ్యక్షుడు వెల్మల ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. రెండో పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తిచేసి జీవో 25ను సవరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, పి.గంగారెడ్డి, పి.అశోక్, కూడాల రవికుమార్, డి.రమేశ్, కృష్ణారావు, లక్ష్మణ్, జనార్దన్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు. -
ఖర్చులోనూ వెనుకబాటు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే అన్నింటా వెనుకబడినట్లే నిధులు వినియోగంలోనూ వెనుకబడింది. లోక్సభ సభ్యులకు ఎంపీ ల్యాడ్స్(లోకల్ ఏరియా డెవలప్మెంటు స్కీం) కింద ఏడాదికి రూ.5కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇందులోనూ ప్రతీ ఆరు నెలలకోసారి రెండు వాయిదాల్లో రూ.2.5 కోట్ల చొప్పున మంజూరు చేస్తారు. వీటిని తమ నియోజకవర్గాల్లో ఎంపీలు మౌలిక వసతులు విద్య, వైద్యారోగ్యం, రోడ్డు, రవాణా, ఆస్తుల కల్పన తదితర అభివృద్ధి పనులకు ప్రతిపాదించవచ్చు. ఈ నిధులను నేరుగా ఎంపీలకే ఇవ్వకుండా జిల్లా అధికారులు, అందులోనూ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పూర్తి చేసే బాధ్యత సంబంధిత శాఖలకు అప్పగిస్తుంది. ఎంపీలు ప్రతిపాదించిన చోట్ల కనీసం రూ.25లక్షల పనులకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ జనాభా ఉన్న చోట్ల కనీసం 15శాతం, ఎస్టీలు ఉన్న చోట్ల 7.5శాతం చొప్పున మొత్తం నిధుల్లో ఖర్చు చేయాలి. గత రెండేళ్లలో విడుదలైన ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో రెండు లోక్సభ స్థానాలు ఆదిలాబాద్, పెద్దపల్లి పరిధిలో తక్కువ శాతం ఖర్చు చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ 11శాతమే ఖర్చు చేయగా, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ 24.3శాతం ఖర్చు చేశారు. ఇద్దరు ప్రజాప్రతినిధులూ నిధుల ఖర్చులో వెనుకబడిపోయారు. ప్రతిపాదిత పనులు సకాలంలో పూర్తి కాక ఖర్చు పూర్తి స్థాయిలో జరగలేదు. పెండింగ్లోనే పనులుఎంపీలు తమ లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనులు ప్రతిపాదించినప్పటికీ సకాలంలో పూర్తి కావడం లేదు. అధికంగా పెండింగ్లోనే ఉంటున్నాయి. పనుల పురోగతిని బట్టి నిధుల చెల్లింపులు జరుగుతాయి. క్షేత్రస్థాయిలో ఆశించిన మేర పనులు జరగకపోవడంతో చెల్లింపులు జరగడం లేదు. కొన్నిసార్లు సంబంధిత కాంట్రాక్టర్లు పనుల పూర్తిలో జాప్యం చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ పరిధిలో ఇప్పటి వరకు తొమ్మిది పనులే పూర్తి కాగా, మరో 62పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో మొత్తం 277పనులు ప్రతిపాదనలో ఉండగా, వీటిలో 197వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 80పనులే పూర్తయ్యాయి. ఎంపీ నిధుల ఖర్చులో అధికంగా కుల, సామాజిక భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీరు(బోర్ వెల్స్), రోడ్లు, తదితర పనులకు కేటాయిస్తున్నారు. అంశం పెద్దపల్లి ఆదిలాబాద్ లోకసభ పరిధి లోక్సభ పరిధి కేటాయింపు రూ.14.8కోట్లు రూ.14.7కోట్లు మొత్తం పనులు 71 277 పనులు పూర్తయినవి 9 80 ఖర్చు చేసింది రూ.1.6కోట్లు రూ.3.57కోట్లు ఖర్చు చేయాల్సింది రూ.13.2కోట్లు రూ.11.12కోట్లు పురోగతిలో ఉన్నవి 62 197 నిధుల ఖర్చు 11శాతం 24.3శాతంపెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణఆదిలాబాద్ ఎంపీ నగేష్ -
కొండలు కరిగిస్తున్నారు..
మొరం తవ్వకాలు కుభీర్: మండలంలోని పలు గ్రామాల్లో అనుమతుల్లేకుండానే కొండలను తోడేస్తూ యథేచ్ఛగా మొరం(మట్టి)ని తరలిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకనే పర్యావరణ పరిరక్షణకు దోహదపడే పచ్చని కొండలు కనుమరుగవుతున్నాయి. అటవీశాఖ, ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఉన్న ఈ కొండల నుంచి మొరం తరలిస్తూ కొందరు అక్రమార్కులు లాభాలు గడిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకుల అండదండలు ఉండటంతోనే మొరం తవ్వకాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై కథనం.. కుభీర్ మండలంలో 42 గ్రామపంచాయతీ లు న్నాయి. మండలంలోని సిర్పెల్లి, పల్సి, జామ్గా ం, దొడర్నా, రాంనాయక్తండా, ఫకీర్నాయక్తండా, దౌజీనాయక్తండా, బెల్గాం,వీర్గాం, బ్రహ్మేశ్వ ర్, శివుని, రంజని గ్రామపంచాయతీల పరిధిలో కొండలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. అధి కారుల దృష్టికి వచ్చినప్పుడు మందలించి వదిలేస్తున్నారు. దీంతో కొంత సమయం తవ్వకాలు నిలిపివేసి.. మళ్లీ త్రవ్వకాలు ప్రారంభిస్తున్నారు. కొన్ని సార్లు అభివృద్ధి పనుల పేరు చెప్పి పలువురు రా జ కీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికైనా స్పందించాలి..పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా కొండలను ఇష్టానుసారం తవ్వడం, మొరం తరలించడం వంటి చర్యలు అడ్డుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పర్యావరణం కాపాడాలి కొండలను తవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తే పర్యావరణ సమతుల్యం దెబ్బతిని భూగర్భజలాలు అడుగంటుతాయి. – గంగాశేఖర్, కుభీర్ మా దృష్టికి వస్తే చర్యలు అక్రమంగా మొర్రం తవ్వకాలు జరుపుతున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ఆర్ఐలతో చెప్పి పొక్లెయిన్ యజమానులతో సమావేశం నిర్వహించి.. మొరం తవ్వకాలు చేపట్టొద్దని ఆదేశిస్తాం. – శ్రీదేవి, తహసీల్దార్, కుభీర్ నిబంధనలు ఇవీ.. ప్రభుత్వ భూముల్లో మొరం తవ్వాలంటే రెవెన్యూశాఖ, భూగర్భజల వనరులశాఖ అనుమతి తప్పనిసరి. ఇందుకు కొంత రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు అనుమతి పత్రాలు పరిశీలించి పర్యావరణ పరిరక్షణకు నష్టం వాటిల్లకుండా నిర్ణీత మీటర్లలో తవ్వకాలు చేపట్టాలని సూచిస్తూ అనుమతులు మంజూరు చేస్తారు. -
సీపీఎస్ రద్దు చేయాలని నిరసన
భైంసాటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీఈ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు భైంసా చైర్మన్ ఎన్.శ్రీహరి ఆధ్వర్యంలో పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నాగనాథ్, కార్యదర్శి భాస్కర్, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు భాస్కర్, కార్యవర్గ సభ్యులు సుజిత్రెడ్డి, పల్లవి తదితరులున్నారు. ఖానాపూర్: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు మంగళవారం ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈనెల 10న హైదరాబాద్లో భారీ మహాధర్నా, చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులు జుట్టు గజేందర్ యాదవ్, వెంకటరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, టీఎన్జీవో, సంఘాల నాయకులు, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. కుంటాల: మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. -
వేలం గడువు పొడిగింపు
నిర్మల్చైన్గేట్: నిర్మల్లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఎస్సీ కార్పొరేషన్ షా పింగ్ కాంప్లెక్స్లోని 04, 05, 10 నంబర్ దు కాణాలు అద్దెకు ఇచ్చేందుకు నిర్వహించే వే లం గడువు తేదీని పొడిగించినట్లు ఎస్సీ కా ర్పొరేషన్ జిల్లా అధికారి శంకర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11:30 వరకు వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ అ భ్యర్థులు కుల, ఆదాయ, రేషన్ కార్డ్, ఆధార్ పత్రాలతోపాటు రూ.1,000 డీడీ, రూ.50 వేల ఈఎండీ జతచేసి దరఖాస్తులు ఈనెల 7వ తేదీ వరకు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందించాలని సూచించారు. నేడు పోలీస్ ప్రజావాణిభైంసారూరల్: భైంసాలోని ఎస్పీ క్యాంప్ కా ర్యాలయంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్పీ జానకీ షర్మిల అందుబాటులో ఉండనున్నా రు. భైంసా సబ్ డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలు విన్నవించవచ్చన్నారు. అవసరమై న పత్రాలతో వచ్చి ఈ అవకాశం సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవోగా భూమన్రావ్కుభీర్: కుభీర్ ఎంపీడీవో గా ఓలెం భూమన్రా వు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇ క్కడ ఎంపీడీవోగా పని చేసే ఎ.శ్రీనివాస్ బది లీపై జగిత్యాల వెళ్లగా.. సూపరింటెండెంట్ భూ మన్రావుకు బాధ్యతలు అప్పగించారు. యువకుడి అదృశ్యంముధోల్: ముధోల్లోని కోలీగల్లీకి చెందిన సప్పటోళ్ల విజయ్ (27) అనే యువకుడు సో మవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రా లేదు. కుటుంబసభ్యులు.. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. మంగళవారం విజ య్ తండ్రి సాయిలు పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. యువకుడి సమాచారం తెలిస్తే 87126 59539 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. తాతమ్మ ఆలయంలో చోరీ ఖానాపూర్: పట్టణంలోని గోదావరి తీరంలో ఉన్న తాతమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ, ఇతర వస్తువులను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై శాలివాహన సంఘ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓట్లు గల్లంతు కానీయొద్దు సారంగపూర్: ‘సర్’లో భాగంగా అర్హుల ఓట్లు గల్లంతవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు అన్నారు. మండలంలోని బీరవెల్లి, వంజర్, ప్యారమూర్, తదితర గ్రామాల్లో జరిగిన ‘సర్’గ్రామసభలకు ఆయన హాజరై మాట్లాడారు. పంచాయతీల్లో ప్రదర్శించిన ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు, వివరాలు తప్పుగా నమోదైనా, ఇతర సమస్యలున్నా ఆధారాలతో అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని ప్రజలకు సూ చించారు. బీఎల్వోలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సర్పంచులు, ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ, కార్యకర్తలు, నాయకులు తదితరులు ఉన్నారు. తాళ సప్తాహం ప్రారంభంతానూరు: మండలకేంద్రంలోని విఠలేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం తాళసప్తాహం ప్రారంభించారు. అర్చకులు పింటు మహరాజ్ పూజలు చేశారు. ఆలయ ఆవరణలో వారంరోజుల పాటు తాళసప్తాహం సాగుతుందని.. రోజు రాత్రి భజనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. లింగాకర్షక బుట్టలతో పురుగు నివారణ లక్ష్మణచాంద: పంట చేనులో పురుగు ఉధృతిని నివారించేందుకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ సూచించారు. మంగళవారం సోన్ మండలంలోని సోన్, గంజాల్ గ్రామాల్లో పంటలను ఆయన పరిశీలించారు. ఈ బుట్టల ఏర్పాటుతో చీడపీడల ఉనికిని ముందుగానే గుర్తించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో వినోద్కుమార్, రైతులు ముత్యం, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
కన్నీరు పెట్టిన పార్డి(బి) మహారాష్ట్రలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన పార్డి(బి) గ్రామానికి చెందిన నలుగురి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. బాధ్యతలు స్వీకరణ నిర్మల్టౌన్: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శిగా నూతనంగా నియమితులైన పి.రవీందర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి శ్రీవాణి ఆయనను సన్మానించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే న్యాయ సేవలు, ఉచిత న్యాయ సహాయం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నూతన కార్యదర్శికి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అభినందనలు తెలిపారు. భైంసా: ఒకవైపు మోకాళ్ల లోతు గుంతలు, మరోవైపు కాలం చెల్లిన వాహనాలు. గత్యంతరం లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న సరిహద్దు గ్రామాల ప్రజలు. రోడ్డు బాగాలేదని తెలుసు, వాహనం ఫిట్నెస్ లేదని తెలుసు. అయినా ప్రయాణించక తప్పని పరిస్థితి. మహారాష్ట్రను ఆనుకుని ఉన్న ఉమ్మడి జిల్లా గ్రామాల్లో ఇదే దుస్థితి. సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం అత్యవసరం కాగా, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏళ్లుగా గుంతలు పూడ్చకపోవడంతో రహదారులపై జర్నీ డేంజర్గా మారింది. సుంక్లి ఘటన కూడా.. గతంలో భైంసా మండలం సుంక్లి గ్రామానికి చెంది న అయ్యప్ప మాలధారులు మహారాష్ట్రలోని మహోర్కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇదే తరహా రహదా రిపై ప్రమాదానికి గురయ్యారు. ఆ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఘటన జరిగిన తర్వాత కొంతకాలం అధికారులు స్పందించి గుంతలు పూడుస్తామని, వాహన తనిఖీలు చేస్తామని చెబుతారు. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. ఫలితంగా ప్రమాదాలు ఆగడం లేదు. ఎందుకింత నిర్లక్ష్యం? మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో రవాణా మౌలిక వసతులు కీలకం. సరిహద్దు గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం, రహదారులను అభివృద్ధి చేయడం, ప్రజా రవాణాను పెంచడం అత్యవసరం. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి కారిడార్ నిధులు అందుబాటులోకి తీసుకువచ్చి ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు. సరిహద్దుకు ఇరువైపులా సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో రహదారులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. బస్సులు నడిపితే.. సరిహద్దు గ్రామాలకు సరిపడా ఆర్టీసీ బస్సులు నడిపితే పాత జీపులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. టార్గెట్ రావడం లేదన్న కారణంతో గ్రామీణ, సరి హద్దు రూట్లలో బస్సులు నడపడం లేదు. సరిహద్దుకు సమీపంలోని మండల కేంద్రాల్లో బస్సులు అందుబాటులో ఉంచి, అక్కడి నుంచి సమీప గ్రామాలకు రెగ్యులర్ సర్వీసులు నడిపితే ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రేపు జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో గురువారం అండర్–17 బాలబాలికల టేబుల్ టెన్నిస్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడా కన్వీనర్, హెచ్ఎం జాడి శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు షేక్ ఇమ్రాన్ తెలిపారు. డీఈవో భోజన్న, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి రాఠోడ్ లక్ష్మణ్ ఆదేశాల మేరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్, జనన ధ్రువపత్రం, గతేడాది ప్రోగ్రెస్ కార్డు, ఆధార్ జిరాక్స్ ప్రతులతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ప్రతీ పాఠశాల నుంచి బాలబాలికలు ముగ్గురు చొప్పున పాల్గొనాలని తెలిపారు. వివరాలకు 9963168632 నంబరులో సంప్రదించాలని సూచించారు. ప్రైవేటు వాహనాలే దిక్కు అడుగుకో గుంత, మరో అడుగులో కుదుపు అన్నట్టుగా రహదారులపై ఆటోలు నడపడం కష్టంగా మారింది. ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లకపోతే అదుపు తప్పే ప్రమాదం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు సైతం గ్రామాలకు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం మరో పెద్ద సమస్య. బస్సులు లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికీ జీపుల వినియోగం కొనసాగుతోంది. ఫిట్నెస్ పరిస్థితి ఎలా ఉన్నా సీట్లకు మించి ప్రయాణికులను ఎక్కించుకుని దూర ప్రయాణాలకు తీసుకెళ్తున్నారు. అధ్వాన రోడ్లపై పాత వాహనాల జర్నీ డెత్ బెల్స్ మోగిస్తోంది. అయినా రవాణా అధికారులు ఫిట్నెస్ లేని వాహనాలపై సక్రమ చర్యలు తీసుకోవడం లేదు. ముగిసిన గణిత విజ్ఞాన మేళాచదవడం, రాయడం నేర్పించాలి తానూరు: విద్యార్థులకు చదడం రాయడం నేర్పించాలని డీఈవో భోజన్న సూచించారు. మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు గణితంలో ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. రికార్డులను పరిశీలించి విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ తీసుకోవాలన్నారు. మోను ప్రకారం భోజనం అందించాలన్నారు. ఆయన వెంట ఎంఈవో నరేందర్, ఉపాధ్యాయులు ఉన్నారు. -
తక్షణం జాయిన్ కావాల్సిందే..
ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా నుంచి పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైల బది లీలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ఎకై ్సజ్ శాఖ కమి షనర్, వరంగల్ డిప్యూటీ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రా న్స్ఫరైన వారు తక్షణం వారికి కేటాయించిన పోస్టింగ్లో జాయిన్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ బదిలీలు జరిగాయి. – జనార్దన్రెడ్డి, డిప్యూటీ కమిషనర్, ఆదిలాబాద్ డివిజన్ -
పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలు
నిర్మల్టౌన్: జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా దండేకర్సాయి(కానిస్టేబుల్), ఉపాధ్యక్షులుగా కృష్ణ (ఇన్స్పెక్టర్), సాయికృష్ణ (ఆర్ఎస్సై), కార్యదర్శిగా శ్రీకాంత్ (ఎస్సై), ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రామ్నిరంజన్(ఆర్ఐ), జాయింట్ సెక్రెటరీగా సంతోష్(కానిస్టేబుల్), కోశాధికారిగా మాధవ్(కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మహేందర్రెడ్డి, సాయికిరణ్ జాదవ్, శంభు, గంగాధర్, పెర్సిస్, టీవీ.రమణను ఎన్నుకున్నారు. ఎస్పీ జానకీషర్మిల నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని నూతన కార్యవర్గానికి సూచించారు. కార్యక్రమంలో ఏవో యూనస్ అలీ, సీఐలు కృష్ణ, ప్రవీణ్, సాయికుమార్, గోవర్ధన్రెడ్డి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పాల్గొన్నారు. -
ప్రక్షాళన.. పరిపూర్ణం!
సాక్షి, ఆదిలాబాద్: ఎకై ్సజ్ శాఖలో సమూల ప్రక్షాళన చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రక్రియ, సాధారణ బదిలీలు అని ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేయలేదని, ఆప్షన్లు కూడా తీసుకోలేదని శాఖలో ప్రచారం సాగుతోంది. ఆ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ నుంచి బుధవా రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో దాదాపు అన్ని ఎకై ్సజ్ స్టేషన్లు, ఇతర విభాగాల నుంచి ఇన్స్పెక్టర్లు, ఎస్సైలకు ట్రాన్స్ఫర్లు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఆది లాబాద్ డివిజన్ నుంచి కరీంనగర్, నిజామాబాద్ డివిజన్లకు బదిలీలు చోటుచేసుకోగా, అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాకు పలువురు వ చ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువు రు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. గతేడాదే పలువురికి ప్రమోషన్ వచ్చినా పోస్టింగ్లు కేటాయించలేదు. తాజాగా పోస్టింగ్లు కేటాయించడంతో పాటు బదిలీలు చేపట్టారు. దీంట్లో ఏకంగా ఎకై ్సజ్ డివిజన్ నుంచే బదిలీ చేసి ఇతర డివిజన్లకు పంపించారు. ముందుగా ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేయకుండా, ఆప్షన్ ఇవ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారని శాఖలో ప్రచారం జరుగుతున్నా.. జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్న కొందరు అధికారులకు ఇతర డివిజన్లలో పలుకుబడి ఉన్నచోట పోస్టింగ్ ల భించిందనే చర్చ సాగుతోంది. ఒకరోజు ముందు రాత్రి కొంతమంది పైరవీలతో అనువైన చోటకు బదిలీపై వెళ్లారని చెప్పుకొంటున్నారు. నేరాలను అరికట్టేనా..?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున మూడు దిక్కులా మహారాష్ట్ర ఉంది. ఇక్కడికి అక్కడి నుంచి దేశీదారు రవాణా విస్తృతంగా సాగుతోంది. జిల్లా నుంచే పలువురు స్మగ్లర్లు దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దీంతో చీప్ లిక్కర్ అమ్మకాల విషయంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గుతోంది. అంతే కాకుండా గంజాయి సాగు ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అడపాదడపా పోలీసులు దాడులు చేసి అరికట్టేందుకు కృషి చేస్తున్నా ఎకై ్సజ్ శాఖ నామమాత్రంగానే దాడులు నిర్వహిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. గుడుంబా కేసులు కూడా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రైమ్ను అరికట్టేందుకు సమూల ప్రక్షాళన ద్వారా శాఖలో ప్రయత్నాలు చేపట్టారనే ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా..ఎకై ్సజ్ ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. వీటి పరిధిలో 11 ఎకై ్సజ్ స్టేషన్లున్నాయి. ఆదిలాబాద్ జి ల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, నిర్మ ల్ జిల్లాలో నిర్మల్, భైంసా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట స్టేషన్లున్నాయి. వీటితోపాటు ఉమ్మడి జిల్లాలో డివిజన్ పరిధిలో పనిచేసే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతోపాటు నాలుగు జిల్లాల్లో డీటీఎఫ్ విభాగాలున్నాయి. వీటి పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. కరీంనగర్, నిజామాబా ద్ డివిజన్లకు బదిలీ చేశారు. అక్కడి నుంచి ఈ జిల్లాలకు అధికారులు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా బదిలీ వివరాలుపోస్టు పేరు బదిలీ అయిన వచ్చేవారి ఇన్స్పెక్టర్లు 16 18 ఎస్సైలు 15 18 -
అంగన్వాడీ కేంద్రాలు ఆహ్లాదకరంగా ఉండాలి
నిర్మల్ రూరల్: అంగన్వాడీ కేంద్రాలు ఆహ్లాదంగా ఉండాలని, చిన్నారులు కేంద్రాలకు వచ్చేలా మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ మండలం రత్నాపూర్కాండ్లీ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. గ్రామాల్లోని చిన్నారులందరి నీ కేంద్రాల్లో చేర్పించేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్రాలకు పిల్లలను ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలు, పెయింటింగ్స్, వర్ణమాల, విద్యా చార్టులు వే యించాలన్నారు. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడేలా ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటలు, రైమ్స్ నేర్పించాలని తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఎత్తు, బరువు త దితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమో దు చేయాలని ఆదేశించారు. సామ్, మామ్ కేటగిరీ కి చెందిన పిల్లల వివరాలు పకడ్బందీగా నమోదు చేసి, పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు అదన పు పౌష్టికాహారం అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.రైమ్స్ చెప్పించి, సంఖ్యలు చదివించి చాక్లెట్లు అందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, వైద్యారోగ్య శాఖ అధికారులు పవన్కుమార్, సౌమ్య, నయనారెడ్డి, రమేశ్, అలీ, సర్పంచ్ హరీశ్, ఉప సర్పంచ్ భూమేష్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీటీడీవో..నిర్మల్చైన్గేట్: నిర్మల్లోని రాంనగర్ స్థానిక గిరిజ న బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా గిరిజ న సంక్షేమ అధికారి చౌహాన్ నిహారిక గురువారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు వచ్చిన ఆమె, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజన నాణ్యతను, రుచిని పరిశీలించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహాన్ని పరిశీలించి, మెనూ ప్రకారమే విద్యార్థులకు రోజూ భోజనం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీ పడకూడదని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాలలోని పలు రికార్డులను, విద్యార్థుల హాజరు రిజిస్ట ర్ పరిశీలించారు. విద్యార్థుల చదువు, వసతి గృహ నిర్వహణపై ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు చేశారు. -
టేబుల్ టెన్నిస్ పోటీలు
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–17 బాలబాలికల జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ దొనికేని లక్ష్మీదయానంద్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీ కరించే క్రీడా స్ఫూర్తిని అలవర్చుకో వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు పట్టుదలతో సాధన చేస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించవచ్చన్నా రు. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 65 మంది క్రీడాకా రులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం జాడి శ్రీనివాస్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ ఆర్.లక్ష్మణ్, టీజీ పెటా అధ్యక్షుడు ఎన్.సత్తయ్య, కార్యదర్శి వి.భూమన్న, వ్యా యామ ఉపాధ్యాయులు షేక్ ఇమ్రాన్, రమణారావు, నవీన్, రామారావు, వెంకటరమణ, రాముగౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
భైంసా: ‘చదువుల తల్లి కొలువైన సరస్వతీ అ మ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం రూ.270 కోట్లు మంజూరు చేసింది. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ముధోల్ ఎమ్మెల్యేగా నా హయాంలో అమ్మవారి గుడి నిర్మాణం జరుగ డం నా పూర్వజన్మ పుణ్యంగా భావిస్తున్నా’ అని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటే ల్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 1000 రోజులు పూర్తయిన సందర్భంలో ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: ముధోల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చిన హామిలేంటి?ఎమ్మెల్యే: నియోజకవర్గం సరిహద్దులో ఉంది. ఇక్కడ నిరుపేదలే ఎక్కువ. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చాను. ఎన్నిక ల సమయంలోనే సిరాల ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని, నిరుపేదలకు ఇళ్లు, రైతులకు కరెంటు ఇబ్బందులు తీరుస్తామని చెప్పాం. సాక్షి: ఇంకా నెరవేర్చాల్సినవి ఏమున్నాయి?ఎమ్మెల్యే: నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూ ల్ పనులు ప్రారంభం కానున్నాయి. రూ.200 కోట్ల తో నిర్మాణం జరుగనుంది. బాసరలో కేంద్రియ విద్యాలయానికి సంబంధించిన ప్రతిపాదనలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రారంభం అవుతుంది. సాక్షి: నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంది?ఎమ్మెల్యే: ముధోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పూర్తిస్థాయిలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. అసెంబ్లీలో ఇక్కడి సమస్యలు ప్రస్తావిస్తూ మంత్రులను కలిసి నా నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయిస్తున్నాను. అన్నివర్గాల అభివృద్ధి జరుగుతోంది. రైతుల కోసం మూడు సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తయ్యింది. మరిన్ని సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రతీ గ్రామంలో పంచాయతీ భవనాలు, వీవో భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. సాక్షి: నియోజవకర్గ ప్రజలకు మీరిచ్చే భరోసా ఏమిటి ?ఎమ్మెల్యే: ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటా. కాళేశ్వరం నీళ్లు ముధోల్ నియోజకవర్గ సాగు భూములకు అందించాలన్నదే నా సంకల్పం. ఎలాంటి వివక్షలేకుండా ముధోల్ నియోజకవర్గ ప్రజలందరికీ సేవలు చేస్తా. ప్రజాసేవకే కట్టుబడి ఉంటా. ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజల బాగు కోసమే కృషి చేస్తున్నా. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తా. కేంద్రంతో మాట్లాడి బాసర – మహోర్ హైవే నిర్మాణం చేయిస్తా. ఎమ్మెల్యే: భైంసా ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభించాం. బాసరలో పీహెచ్సీ పనులు ప్రారంభమయ్యా యి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాం. రూ.270 కోట్ల తో బాసర ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఎంతో మంది నిరుపేదలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందితే సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం అందేలా చూశాం. పిప్రి ఎత్తిపోతల పథకం ప్రారంభించాం. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయి. త్వరలోనే రూ.15 కోట్లతో భైంసా పట్టణ అభివృద్ధి చేపడతాం. వందల కోట్లు వెచ్చించి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం చేపట్టాం. -
వెయ్యి రోజుల్లో రూ.1000 కోట్లు
ఖానాపూర్: ఎమ్మెల్యేగా ఎన్నికై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.. తాను వెయ్యి రోజుల్లో నియోజకవర్గానికి రూ.1000 కోట్లకుపైగా నిధులు తెచ్చానని తెలిపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వివిధ శాఖల ద్వారా నిధులు తెచ్చినట్లు ‘సాక్షి’కి వెల్లడించారు. సాక్షి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమిటి?ఎమ్మెల్యే: విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు, ఉపాధి అవకాశాలు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చాం. ఆదివాసీ, గిరిజనుల హక్కులను పరిరక్షించి వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పాం. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించడం, విద్యార్థులకు మెరుగైన విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం, రైతులకు అవసరమైన సహకారం అందించడం మా లక్ష్యం. సాక్షి: ఇంకా నెరవేర్చాల్సినవి ఏమిటి?ఎమ్మెల్యే: అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ఇప్పటికే మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. సాగునీటి రంగంలో 22 పనులకు రూ.22.81 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ సబ్ప్లాన్ కింద రూ.17.14 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. పీఎం జన్మన్, ఇతర ప్రాజెక్టుల కింద పీవీటీజీ ప్రాంతాల్లో 20 పనులకు రూ.2.04 కోట్లు మంజూరయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేస్తాం. సాక్షి: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది?ఎమ్మెల్యే: మహిళలు, రైతులు, పేదలు, విద్యార్థులు, గిరిజనులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. గృహజ్యోతి ద్వారా రూ.1.70 కోట్లు, మహాలక్ష్మి ద్వారా రూ.2.50 కోట్ల మేర ప్రయోజనం నియోజకవర్గ ప్రజలకు లభించింది. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా కూడా 4,500 పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పిస్తున్నాం. సాక్షి: ప్రజలకు మీరిచ్చే భరోసా ఏమిటి?ఎమ్మెల్యే: రాబోయే రోజుల్లో మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయడంతోపాటు కొత్త పనులకు మరిన్ని నిధులు తీసుకువస్తాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, పోడు భూముల సమస్య పరిష్కారం, గిరిజనులకు అటవీశాఖ నుంచి ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను. -
టీహబ్.. ఓవర్ లోడ్
లక్ష్మణచాంద మండలం ధర్మారం గ్రామానికి చెందిన రఫీ తన భార్యను ప్రసవం కోసం నిర్మల్ జిల్లా ప్రసూతి ఆసుపత్రికి గురువారం తీసుకొచ్చారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలోని ల్యాబ్కు వెళ్లగా, అక్కడ టీ–హబ్ యంత్రాలు పనిచేయడం లేదని, ల్యాబ్ సిబ్బంది పరీక్షలు నిర్వహించడానికి నిరాకరించారు. ఇక్కడ కుదరదని, జిల్లా జనరల్ ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. చేసేదేమీ లేక రఫీ తన భార్యను తీసుకెళ్లి జిల్లా జనరల్ ఆస్పపత్రిలోని ల్యాబ్ను సంప్రదించారు. అయితే అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. టీ–హబ్ మిషన్లు మొరాయించాయని, ప్రస్తుతం పరీక్షలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. దీంతో రఫీ భార్యను తీసుకుని ప్రైవేటు ల్యాబ్కు వెళ్లాడు. నిర్మల్చైన్గేట్: నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్(టీహబ్) తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. యంత్రాలు తరచూ మొరాయించడంతో పరీక్షలకు అంతరాయం కలుగుతోంది. పేదలకు ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం డయాగ్నొస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. కొంతకాలం సక్రమంగా పనిచేసినా, ఇటీవల తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రసాయనాల కొరతతో టెస్టులు నిలిచిపోతుండగా, ఇప్పుడు యంత్రాల మొరాయింపుతో ఇబ్బందులు మరింత పెరిగాయి. 134 పరీక్షలు.. గతంలో టీ–హబ్లో క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 134కు పెంచారు. వీటిలో బయోకెమిస్ట్రీకి చెందిన 64 టెస్టులు, పాథాలజీకి చెందిన 28, మైక్రోబయాలజీ పరీక్షలు 42 ఉన్నాయి. అయితే యంత్రాలు మొరాయిస్తుండడంతో ఈ పరీక్షలకు అంతరాయం ఏర్పడుతోంది. పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. రోగుల ఇబ్బంది..ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను వైద్యులు చూసి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలని చె బు తున్నారు. అయితే యంత్రాలు పనిచేయడం లే దని, పరీక్షలు చేయలేమని సిబ్బంది చెబుతున్నారు. మందులు తీసుకోవాలని ఉచిత సలహా మాత్రమే ఇస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీ–హబ్లో యంత్రాలు పనిచేయక మూడు రోజు లుగా రక్త పరీక్షలు చేయడం లేదు. రోగులకు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. దీంతో చాలా మంది రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రత్యేక ల్యాబ్ అవసరంజీజీహెచ్లో ప్రస్తుతం 1,100 మంది వరకు ఓపీ సే వలు పొందుతున్నారు. వీరిలో కచ్చితంగా 50 శా తానికి పైగా రోగులకు రక్త పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 80 మందికి పైగా రోగులు వి విధ అనారోగ్య కారణాలతో అడ్మిట్ అవుతున్నారు. జీజీహెచ్లో రోగుల తాకిడి అధికంగా ఉండడంతో రక్త పరీక్షల సంఖ్య కూడా పెరుగుతోంది. రక్త పరీక్షలు చేసే యంత్రంపై అధిక లోడ్ పడుతుండడంతో తరచూ మొరాయిస్తోంది. జీజీహెచ్లో ల్యాబ్ లేకగతంలో జీజీహెచ్కు ప్రత్యేక ల్యాబ్ ఉండేది. అప్పుడు వెంటవెంటనే రక్త పరీక్షల రిపోర్టులు వచ్చేవి. టీ–హబ్ ఏర్పాటుతో జీజీహెచ్ పూర్తిగా టీ–హబ్పైనే ఆధారపడి ఉంది. రక్త పరీక్షల రిపోర్టు రాకుండా జీజీహెచ్కు వచ్చే రోగులకు వైద్యులు మందులు ఎలా రాస్తారో, అడ్మిట్ అయిన రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించినా దారుణంగా ఉంటుంది. పేదలు వచ్చే జీజీహెచ్కు ప్రత్యేక ల్యాబ్ ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
అంకితభావానికి అవార్డు
కడెం: మండలంలోని ఎలగడప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు డు కూచనపెల్లి శ్రీని వాస్ రాష్ట్రస్థాయి ఉత్త మ ఉపాధ్యాయుడి అ వార్డుకు ఎంపికయ్యా రు. రెండేళ్ల క్రితం మండలంలోని లింగాపూర్ పాఠశాల నుంచి బదిలీపై ఎలగడపకు వచ్చిన శ్రీనివాస్ విద్యార్థుల ప్రవేశాలు పెంపొందించి, మూతబడే పాఠశాలను బతికించారు. పాఠశాల గదులకు కిటికీలకు తలుపులు లేక కోతులు తరగతి గదిలోకి వస్తుండడంతో వడ్రంగి కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్ కులవృత్తిలో తనకున్న అనుభవనంతోఆరు కిటికీలకు తలుపులు తయారు చేశాడు. లింగాపూర్ పాఠశాలలో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించారు. పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్థులను తానే బైక్పై ఇంటికి వెళ్లి తీసుకెళ్లేవారు. ఉపాధ్యాయుడిగానే కా కుండా కళాకారుడిగా పలు పౌరాణిక నాటకా లు ప్రదర్శిస్తూ రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి ఆవార్డుకు ఎంపికవడం సంతోషంగా ఉందని శ్రీనివాస్ తెలి పారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాలు అవార్డు రావడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. -
నిర్మల్
కార్మికుల బండికి గోల్డెన్ జూబ్లీ 1976 సెప్టెంబర్ 2న ప్రారంభమైన సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ప్రై వేట్ రవాణాతో పోలిస్తే తక్కువ ఖర్చుతో దశాబ్దా లుగా ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఖానాపూర్ బల్దియాలో సమీక్ష ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇ టీవల మున్సిపాలిటీలో పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య విభేదాలు నెలకొన్నట్లు వ చ్చిన ఆరోపణల గురించి పాత్రికేయులు ప్ర శ్నించగా, ఆ విషయం తన దృష్టికి రాలేదని అ దనపు కలెక్టర్ పేర్కొన్నారు. పాత్రికేయుల ద్వా రా విషయం తనకు తెలిసిందని, దీనిపై వివరా లు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, వైస్ చైర్మన్ షోయబ్, కౌన్సిలర్లు చి న్నం సత్యం, గుమ్ముల అశోక్, పోలంపల్లి రమే శ్, బొప్పారపు సత్యవతి, తోడసం ఇందిరా, కమిషనర్ సుందర్సింగ్ తదితరులున్నారు. నిర్మల్: ‘‘జూన్, జూలైలో పడకుంటే ఏంది.. ఆగస్టు ఉంది కదా. భారీ వర్షాలన్నీ ఇదే నెలలో కురుస్తాయి కదా..!’’ అంటూ ఎదురుచూసిన జిల్లావాసుల ఆశలను ఆగస్టు ఆవిరి చేసింది. ఈసారి గణనీయమైన లోటు వర్షపాతాన్ని నమోదుచేసింది. మొత్తం మీద ఈ ఏడాది వానాకాలం సరిపడా జలసిరులను ఇవ్వకుండానే సర్దుకుంది. ఎల్నినో ప్రభావం కారణంగా ఇకముందు వర్షాలు కురుస్తాయన్న గ్యారంటీ లేదని వాతావరణశాఖ నివేదికలు చెబుతున్నాయి. జూన్లో కొంత అధికం 2025జూన్లో జిల్లాలో సగటున 141.38 మి.మీ. వర్షపాతం నమోదవగా.. 2026 జూన్లో 147.51 మి.మీ. కురిసింది. అంటే.. గతేడాదితో పోలిస్తే 4.34 శా తం అధికం. అయితే, మండలాల వారీగా పరిస్థితి భిన్నంగా ఉండటం గమనార్హం. పెంబి, కుభీర్, భైంసా, కుంటాల, ఖానాపూర్, కడెం తదితర ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదవగా.. నిర్మల్రూరల్, కుభీర్, నిర్మల్ అర్బన్ తదితర ప్రాంతాల్లో లోటు కనిపించింది. ఈసారి నిరాశపరిచిన ఆగస్టు జూన్, జూలైలో కురిసిన వర్షాలతో సరిపడా జలసిరులు రాకపోవడంతో జిల్లావాసులు ఆగస్టుపై ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ప్రతీసీజన్లో ఈ నెలలోనే ఎక్కువ భారీవర్షాలు కురిశాయి. కానీ, ఈ సీజన్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతేడాది ఆగస్టులో జిల్లా సగటు వర్షపాతం 221.07 మి.మీ. ఉండగా.. ఈసారి 114.93 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే.. గతేడాదితో పోలిస్తే 48.01 శాతం లోటు ఏర్పడింది. కుభీర్, తానూరు, భైంసా, కుంటాల, నర్సాపూర్ (జి), దస్తూరాబాద్ తదితర మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నిర్మల్అర్బన్లో కూడా గతేడాది 223.3 మి.మీ.తో పోలిస్తే ఈ ఏడాది 182.7 మి.మీ. మాత్రమే వర్షం కురిసింది. నిరసన తెలుపుతున్న నాయకులు, కార్యకర్తలు ఎల్నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది మొదటి నుంచీ వాతావరణశాఖ అధికారులు ఎల్నినో ప్రభావం ఉంటుందని వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉండవని చెబుతూ వచ్చారు. జూలైలో భారీగా వర్షాలు కురవడం, వాతావరణం ఎప్పుడూ మబ్బు పట్టినట్లు ఉండటంతో ఎల్నినో ప్రభావం జిల్లాలో ఉండదని రైతులు, జిల్లా ప్రజలు భావించారు. మున్ముందు భారీవర్షాలు కురుస్తాయని ఆశించారు. కానీ.. ఆగస్టులో లోటువర్షపాతం నమోదు కావడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. ఇకముందు ఎల్నినో ఎఫెక్ట్ మరింత ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. జూలైలో మాత్రం జోరుగా.. జూలై మాత్రం ఈ ఏడాది జిల్లాకు భారీ వర్షాలను అందించి తన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 2025 జూలైలో జిల్లా సగటు వర్షపాతం 234.67 మి.మీ. కాగా.. ఈ సంవత్సరం ఏకంగా 368.03 మి.మీ. కురిసింది. దీంతో 56.83 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కడెం, సోన్, పెంబి, నిర్మల్ అర్బన్, ఖానాపూర్, దస్తూ రాబాద్ మండలాల్లో భారీగా వర్షాలు కురిశాయి. జూలైలో కురిసిన వర్షాలు పంటలకు భారీ ఊరటనిచ్చాయి. మొత్తంగా చూస్తే ఎక్కువే కానీ.. మూడు నెలల వర్షపాతాన్ని కలిపి చూస్తే.. 2025లో జిల్లాలో మొత్తం 11,345.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈఏడాది ఇదే కాలానికి 11,978.8 మి.మీ. నమోదైంది. అంటే.. గతేడాదితో పోలిస్తే 633.5 మి.మీ. అధికంగా, మొత్తంగా సుమారు 5.58 శాతం ఎక్కువ వర్షం కురిసింది. కానీ, మండలాల వారీగా పరిశీలించినప్పుడు చాలాచోట్ల తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో భారీ హె చ్చుతగ్గులుజిల్లా వర్షపాతంలో ఈ ఏడాది భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. 2025తో పోలిస్తే 2026 జూన్, జూలైలో అధిక వర్షపాతం నమోదైనా.. ఆగస్టులో మాత్రం వానలు ముఖం చాటేశాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొత్తం వర్షపాతం 633.5 మి.మీ. అధికంగా ఉన్నా.. ఆ వర్షాలన్నీ ఒకేవిధంగా కురవకపోవడం గమనార్హం. -
ఖైదీల సమస్యలపై ఆరా
నిర్మల్టౌన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పోరిక రవీందర్ బుధవారం నిర్మల్ సబ్జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నా రు. వారికి అందుతున్న న్యాయ సహాయం, ఇతర సౌకర్యాల గురించి వివరాలు సేకరించా రు. ఉచిత న్యాయ సహాయం, వారి హక్కులపై అవగాహన కల్పించారు. చీఫ్ ఎల్ఏడీసీఎస్ ఎ.రాజలింగం, నిర్మల్ సబ్జైలు సూపరింటెండెంట్ సూర్యప్రకాశ్రెడ్డి తదితరులున్నారు. కోర్టు పోలీసులతో సమావేశం ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నందున జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో కోర్టు పోలీసులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పోరిక రవీందర్ సమావే శం నిర్వహించారు. లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కోర్టు పోలీస్ అధికారి రమేశ్, పోలీసులు పాల్గొన్నారు. -
దశాబ్దాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం
భైంసా: సుమారు రెండు దశాబ్దాలుగా రైతులను పట్టిపీడిస్తున్న భూముల ప్రొహిబిషన్ సమస్యకు పరిష్కారం లభించే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. పెరల్స్ అగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ భూముల కొనుగోలు, తదనంతర న్యాయపరమైన పరిణామాల కారణంగా తానూరు మండలంతో పాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వేల ఎకరాల భూములు ప్రొహిబిషన్ జాబితాలో చిక్కుకున్నాయి. దీంతో భూములు విక్రయించని రైతులూ ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టేందుకు ఆయన ముందుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే జి.విఠల్రెడ్డి ఆధ్వర్యంలో తానూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఇటీవల కలెక్టర్ను కలిసి సమస్యలు వివరించారు. ఒక సర్వే నంబర్లో కొంత భూమిని మాత్రమే పెరల్స్ అగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసినప్పటికీ, అదే సర్వే నంబర్లోని మొత్తం భూములను ప్రొహిబిషన్లో పెట్ట డంతో భూములు అమ్మని రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పట్టాదారులు మరణించిన సందర్భాల్లో వారసుల పేరిట పట్టా మార్పిడి జరగడంలేదని, భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయని, బ్యాంక్ రుణాలు పొందలేకపోతున్నామని, ప్రభుత్వ రాయితీలు, రైతు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని రైతులు కలెక్టర్ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. నేరుగా రైతులతో ముఖాముఖి సమస్య తీవ్రతను గుర్తించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా రైతులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు బుధవారం తానూరు మండలంలోని మొగిలి గ్రామాన్ని సందర్శించారు. సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీవోతో పాటు ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. మొగిలితో పాటు కోలూరు, జరీ (బి), హిప్పెల్లి తండా, బెంబర్బోసి, మహాలింగి, కోలూరు తండా, తానూరు తదితర గ్రామాల రైతులు పాల్గొని తమ భూముల పరిస్థితిని వివరించారు. గ్రామసభల ద్వారా నివేదికలు ప్రభుత్వ రికార్డులను పరిశీలించడంతో పాటు బాధిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్య ఉన్న ప్రతీ గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల నుంచి పూర్తి వివరాలు సేకరించి సమగ్ర నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ నివేదికను సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎదురుచూపులు మొగిలిలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం జిల్లాలోని ఇతర బాధిత రైతుల్లోనూ ఆశలు రేకెత్తించింది. ఒక్క సర్వే నంబర్లోని కొంత భూమి విక్రయం కారణంగా మొత్తం భూమి లాక్ కావడంతో తానూరు మండలంతోపాటు జిల్లాలోని పలు గ్రామాల్లో సుమారు 2,000–2,500 ఎకరాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా రికార్డుల్లో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించి.. తమకు పట్టా హక్కులు, రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని కోరుతున్నారు. కలెక్టర్ చొరవతో ఈ రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో బాధిత రైతులు ఎదురుచూస్తున్నారు. -
ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం
భైంసా: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ఉద్దేశమని ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవారం భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భైంసా సబ్డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫి ర్యాదుదారుల సమస్యలను ఎస్పీ ఓర్పుగా విని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. అలాగే, గ్రీవెన్స్ డేకు వచ్చి న కుటుంబ వివాదాలపై షీ టీం సిబ్బంది ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పరస్పర అవగాహన కల్పిస్తూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం గత గ్రీవె న్స్ డేల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫిర్యాదుల వివరాలు అధికారుల ద్వారా తెలుసుకుని, వాటిని వేగంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. -
ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్కు స్థల పరిశీలన
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కోసం డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్ బుధవారం స్థానిక సర్పంచ్ కరిపె రవళితో కలిసి స్థల పరిశీలన చేశా రు. జామ్ కరిసెల గుట్ట ప్రాంతంలోని సెగ్రిగేషన్ షెడ్డుకు సమీపంలోనే స్థలం అనువుగా ఉన్నట్లు నిర్ధారించి ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ.. గ్రామంలో 100శాతం ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు చెత్తతో సేంద్రియ ఎరువుల త యారీలో గ్రామపంచాయతీ సిబ్బంది మొదటి స్థా నంలో ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు. అందుకే జామ్ గ్రామంలో రూ.40లక్షల వ్యయంతో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో గ్రామసభ నిర్వహించి ప్రజలు, పంచాయతీ పాలకవర్గం ఆమోదంతో పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని సర్పంచ్ రవళి, పంచాయతీ కార్యదర్శి నరేశ్కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, అజీజ్ఖాన్, వివిధ గ్రామాల సర్పంచులు గంగారెడ్డి, మల్లయ్య, బీజేపీ నాయకులు విలాస్, నర్సయ్య, తిరుమలాచారి, ప్రశాంత్, వార్డు సభ్యులు నరేశ్, రాము తదితరులున్నారు. -
పేదల పక్షపాతి వైఎస్సార్
ఖానాపూర్: పేదల పక్షపాతి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ కొనియాడారు. బుధవా రం ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, 108 అత్యవసర సేవలు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. రైతు పక్షపాతిగా, పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నా రు. కార్యక్రమంలో నాయకులు చిన్నం సత్యం, తోట సత్యం, గొర్రె గంగాధర్, జంగిల్ శంకర్, దయానంద్, అంకం రాజేందర్, పోలంపల్లి ర మేశ్, షబ్బీర్ పాషా, శ్యామ్, అమానుల్లా ఖాన్, కిశోర్, గంగన్న, జమాల్, సత్యనారాయణ, రాజేశ్వర్, రాజు నాయక్, నిమ్యా నాయక్, శేషాద్రి, పెదులు, సజ్జు, శంకర్, రాజన్న, మహేశ్, రమే శ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది. -
గుప్తనిధుల తవ్వకాల గుట్టు రట్టు
ఉట్నూర్రూరల్: గుప్త నిధుల పేరుతో తవ్వకాలు చేపడుతున్న నలుగురు సభ్యులున్న ముఠాను అరె స్టు చేసినట్లు ఎస్సై గుంపుల విజయ్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ మండలం కొత్తగూడ చెక్పోస్ట్ వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా జన్నారం వైపు నుంచి వస్తున్న కారులో నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారి సెల్ఫోన్లను పరిశీలించగా భూమిని తవ్వుతున్న వీడియోలు బయటపడ్డాయి. విచారణలో ఉట్నూర్ కోటలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి, తవ్వకాల వీడియోలు చూపిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఆయుర్వేద మందుల పేరుతోనూ అమాయకులను మోసం చేసేందుకు యత్నించినట్లు తేలింది. కారు, సెల్ఫోన్, ఆయుర్వేద సామగ్రి స్వాధీనం చేసుకుని నిందితులు కమెర కిషన్, దుర్గం లింగయ్య, దుర్గం ప్రవీణ్, దాసరి యసుబాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
రామకృష్ణాపూర్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు భగత్సింగ్నగర్ ఏరియాకు చెందిన పిన్నింటి మహేందర్ (39) పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మెట్పల్లిలో మరొకరు.. భీమిని: కన్నెపల్లి మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన మంచర్ల భీమయ్య (56) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కన్నెపల్లి ఎస్సై విక్రమ్ తెలిపారు. -
కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తి రిమాండ్
ఉట్నూర్రూరల్: కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గుంపుల విజయ్ తెలిపారు. ఉట్నూర్ మండలం గంగన్నపేటకు చెందిన సూర్యవంశీ గణేశ్ మే 11న రాత్రి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. కొత్తగూడెం చెక్పోస్ట్ వైపు అధిక శబ్దంతో డీజే వినిపిస్తుండటంతో బ్లూకోల్ట్ నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఉట్నూర్ పోలీసులు సౌండ్ తగ్గించాలని సూచించారు. ఈ క్రమంలో డెకరేషన్ పని చేస్తున్న గణేశ్ మద్యం మత్తులో కానిస్టేబుల్ మడావి ప్రసాద్పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టు అనుమతితో నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: ఇన్స్ట్రాగామ్లో మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో బుధవారం వివరాలు వెల్లడించారు. ఇచ్చోడకు చెందిన మొబైల్ షాపు యజమాని సయ్యద్ సమీర్ జూలై 25న చార్జర్లు, డిస్ప్లే, ఇతర యాక్సెసరీస్ కోసం ఇన్స్ట్రాగామ్లో వెతుకుతుండగా ‘రాజ్ ఎల్ఈడీ ముంబై’ పేరుతో ఉన్న ఖాతా అతని దృష్టికి వచ్చింది. అందులో ఉన్న నంబర్కు ఫోన్ చేయగా తక్కువ ధరకు స్పేర్ పార్ట్స్ అందిస్తామని, ముందుగా ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా సరుకులు పంపిస్తామని చెప్పడంతో జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు పలు విడతల్లో నిందితుడు పంపించిన క్యూఆర్ కోడ్కు రూ.2.18 లక్షలు చెల్లించాడు. వాట్సాప్ ద్వారా కొరియర్ రశీదు పంపించి, ‘మజీసా ఎయిర్ ఎక్స్ప్రెస్’ ద్వారా సరుకులు వస్తాయని తెలిపాడు. రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అవుతోందంటూ బాధితుడిని మరింత నమ్మించాడు. ఆగస్టు 22న ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ‘మజీసా ఎయిర్ ఎక్స్ప్రెస్’ కార్యాలయం కోసం బాధితుడు వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించి 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి రాజస్థాన్కు చెందిన ప్రకాశ్ కుమార్ను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుడు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో సుమారు 140 మంది వద్ద రూ.5.30 కోట్ల మేర మోసం చేసినట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష నగదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ నరేష్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
జోనల్ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
నిర్మల్టౌన్: పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆ ధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సహస్ర బాక్సింగ్ అ కాడమీలో బుధవారం జోనల్ స్థాయి బాక్సింగ్ పో టీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అండర్–14 బాలురు, అండర్–17 బాల, బాలికల విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు జిల్లా నుంచి సు మారు 70మంది హాజరయ్యారు. అండర్–14 బా లుర విభాగంలో అవ్యుత్, ఆదిత్య, సిద్ధార్థ్, అభిజి త్, సంజయ్, శ్రీహర్ష, అండర్–17 బాలుర విభా గంలో అనిల్కుమార్, దీక్షిత్, శ్రీహర్ష, మహేంద్ర, మనీశ్, బాలికల విభాగంలో విశాఖ, వాసవి, అక్షర, అశ్విత, వనిత, అనన్య, అక్షయ, హర్షిత, దివ్య, మ ల్లేశ్వరి, ప్రవళి, వివిధ బరువు విభాగాల్లో ఎంపికయ్యారు. వీరు త్వరలో మంచిర్యాలలో నిర్వహించనున్న జోనల్ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా క్రీడల అధికా రి శ్రీకాంత్రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్, జిల్లా బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. -
అనుమానమే పెనుభూతమై..
నెన్నెల: అనుమానం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆమెను హత్య చేసిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం అచ్చులాపూర్కు చెందిన సబిత (35)కు నెన్నెల మండల కేంద్రానికి చెందిన తోట మల్లేశ్తో 2009లో వివాహమైంది. దంపతులకు పదోతరగతి చదువుతున్న కుమార్తె ప్రవస్తి, ఏడోతరగతి చదువుతున్న కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. భార్యపై అనుమానంతో మల్లేశ్ గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పట్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పలుమార్లు ప్రయత్నాలు జరిగినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో బుధవారం పిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న భార్యపై పదునైన ఆయుధంతో గొంతులో గుచ్చి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన పిల్లలు బెడ్పై తల్లి మృతదేహాన్ని చూసి రోధించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితునికోసం గాలిస్తున్నారు. మృతురాలి సోదరుడు పూదరి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసీపీ వివరించారు. -
వేర్వేరు చోట్ల దేశీదారు స్వాధీనం
ఆదిలాబాద్టౌన్/సాత్నాల: మహారాష్ట్ర నుంచి ద్వి చక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న దేశీదారు పట్టుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ ఆర్.విజేందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు బుఽ దవారం భోరజ్ మండలం పిప్పర్వాడ టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పిప్పర్వాడకు చెందిన శరన్ శైలేంద్రరెడ్డి, ఆనంద్పూర్ గ్రామానికి చెందిన గౌరు సాయికృష్ణ, సాంగ్వికి చెందిన శంకర్ వద్ద రూ.10,300 విలువైన 161 దేశీదారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
వెయ్యిరోజులైనా హామీల అమలేది?
నిర్మల్ టౌన్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వెయ్యిరోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి రాంకిషన్రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ నాయకుడు రాంకిషన్రెడ్డి నివాసం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారంటీల వివరాలతో రూపొందించిన 420 అడుగుల భారీ బ్యానర్ను ప్రదర్శించి వినూత్న నిరసన తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన కాంగ్రెస్ ‘బాకీ కార్డులను’ వాహనదారులు, ప్రయాణికులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం రాంకిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, వృద్ధులు, బీడీ కార్మికులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా, వరికి బోనస్, రైతు కూలీలకు ఉపాధిహామీ, రెండు లక్షల ఉద్యోగాలు, విద్యాభరోసా కార్డు తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, సీనియర్ నాయకుడు అయ్యన్నగారి రాజేందర్, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, బీఆర్ఎస్వీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ షోయబ్ మీర్జా, నాయకులు సల్మాన్, నహీం, విశాల్, ఓం ప్రకాశ్, జుబేర్, మసూద్, నజీర్, సచిన్, హరీశ్, రోహిత్, అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పూరీజగన్నాథ్ యాత్రకు ఆర్టీసీ బస్సు
నిర్మల్టౌన్: నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి పూరీ జగన్నాథ్ యాత్రకు ప్రత్యేక బస్సు బుధవారం బయలుదేరింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పండరి కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభించారు. ని ర్మల్ నుంచి బయలుదేరిన ఈ ప్రత్యేక బస్సు అన్నవరం, సింహాచలం, కోణార్క్ మీదుగా పూరీ జగన్నాథ్ క్షేత్రానికి చేరుకుంటుంది. అనంతరం అరసవల్లి, శ్రీకూర్మం, విశాఖపట్నం, ద్వారకా తిరుమల తదితర ప్రాంతాలను సందర్శించి ఈ నెల 7న తిరి గి నిర్మల్కు చేరుకుంటుందని డీఎం తెలిపారు. ఈ నెల 20తర్వాత సోమనాథ్, ద్వారకా, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రాల సందర్శనకు మరో యా త్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పోడు సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం
మంచిర్యాలక్రైం: పోడు భూముల సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేద్దామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో బుధవారం డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి పోడు భూముల సమస్యలపై చర్చించారు. గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా కల్పించాల్సిన హక్కుల అమలు, ఆర్ఓఎఫ్ఆర్ భూములకు సంబంధించిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గిరిజనుల భూ హక్కుల పరిరక్షణకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేద్దామని అన్నారు. -
కార్మికుల బండికి గోల్డెన్ జూబ్లీ
మంచిర్యాలఅర్బన్: రోజంతా భూగర్భ గనుల్లో నల్ల టి బొగ్గు దుమ్ముల్లో చెమటోడ్చి పనిచేసిన కార్మికులకు, తమ స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చి ఓదార్పునందించిన నేస్తం సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు. ఇనుప పట్టాలపై నడిచే యంత్రం కాదు.. వేలాది కార్మికుల కుటుంబాల సంతోషాలు, బాధ్యతలు, బంధాలను మోసుకెళ్లే సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ప్రైవేటు రవాణాతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణించే సౌలభ్యం ఉండటంతో దశాబ్దాలుగా కార్మికులకు ఊరటనిచ్చింది. 50 వసంతాలు.. సింగరేణి గని కార్మికులు, వారి కుటుంబాల కోసం సేవలందిస్తున్న సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి యాజమాన్యం కలిసి బొగ్గు గని కార్మికుల సౌకర్యార్థం 1976 సెప్టెంబర్ 2న ఈ రైలును ప్రారంభించారు. సిర్పూర్టౌన్ నుంచి భద్రాచలం రోడ్ వరకు దాదాపు 340 కిలోమీటర్ల దూరం బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, వ రంగల్, డోర్నకల్, కారేపల్లి మీదుగా రైలు పరుగులు తీస్తోంది. సింగరేణి బెల్ట్లోని బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రధాన బొగ్గు గని ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబాలు ఇతర ప్రాంతా లకు ప్రయాణించడానికి ఎంతో సులువుగా మారింది. సింగరేణి ఎక్స్ప్రెస్ మొదటి సర్వీసు ప్రారంభోత్సవ జ్ఞాపకార్థం ప్రత్యేక తపాలా కార్డు విడుదల చేసింది. ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్ వరకు..గతంలో ఇది సాధారణ ప్యాసింజర్ రైలుగా నడిచేది. ప్రయాణికుల రద్దీ వేగం దృశ్యా ఎక్స్ప్రెస్ రైలుగా అప్గ్రేడ్ చేశారు. రైలు ప్రారంభ నాటి రోజుల్లో 10 నుంచి 12 వరకు ప్యాసింజర్ బోగీలు ఉండగా ప్రస్తుతం 16 నుంచి 18 వరకు బోగీలతో రవాణా సాగిస్తోంది. మొదట్లో భద్రాచలం రోడ్డు నుంచి బెల్లంపల్లి మధ్య ప్రారంభం కాగా తర్వాత ప్యాసింజర్ స్థాయిని తగ్గించి సిర్పూర్ టౌన్ వరకు పొడిగించారు. 2007 వరకు సింగరేణి ప్యాసింజర్ రైలు కాజీపేట్ జంక్షన్ వరకు వెళ్లి ఇంజన్ అమర్చుకుని మళ్లీ వెనక్కి సిర్పూర్ టౌన్ వైపు వెళ్లేది. కరోనా సమయంలో ఈ రైలును ఎక్స్ప్రెస్గా మార్చారు. రైలు ప్రారంభ సమయంలో ఎక్స్ప్రెస్ స్టాప్లు మాత్రమే ఉండేవి. తర్వాత ప్యాసింజర్గా మార్చి అన్ని స్టాప్లు ఇచ్చారు. ఆ తర్వాత ఎక్స్ప్రెస్గా మార్చి కొన్నిస్టాప్లు తొలగించారు. కొత్తలో సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు స్టీమ్ ఇంజన్, తర్వాత డీజిల్ ఇంజన్, 1995 నుంచి పూర్తిగా విద్యుత్ ఇంజన్తో నడుస్తోంది.మణుగూరు వరకు పొడగించాలి సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్లో 10 గంటలు ఖాళీగా ఉంటోంది. మణుగూరు వరకు పొడగిస్తే సింగరేణి ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఎగువ మార్గంలో కొత్తగూడెం నుంచి బల్లార్షా మధ్య, దిగువ మార్గంలో సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్డు మధ్య రాకపోకలు సాగిస్తూ 50 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. – ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు -
రాష్ట్రస్థాయి పోటీల విజేత ఉమ్మడి ఆదిలాబాద్
మంచిర్యాలటౌన్: హైదరాబాద్లో జరుగుతున్న అండర్–16 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు హీరాధి జట్టుపై విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో హీరాది జట్టు 45.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు కేవలం 35.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి విజేతగా నిలిచిందని ఉమ్మడి జిల్లా క్రికెట్ కార్యదర్శి కోదాటి ప్రదీప్, కోచ్ పోరండ్ల ప్రదీప్ తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్టు నుంచి పాల్గొన్న మాధవ త్రిశూల్ 91 బాల్స్లో 62 పరుగులు చేయగా, ఈ. శైలేష్ పది ఓవర్లలో 4 వికెట్లు తీసి 27 పరుగులు ఇచ్చి, జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. మొత్తం 12 మ్యాచ్లకు ఇప్పటికే నాలుగు మ్యాచ్లను ఉమ్మడి జిల్లా జట్టు గెలుపొందినట్లు వారు పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం
రెబ్బెన: మెదక్ జిల్లా బీహెచ్ఈఎల్లో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ అండర్–14 రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు కాంస్య పతకాన్ని సాధించినట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. ఆదివారం జరిగిన సెమీఫైనల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు వరంగల్ జట్టుతో పోటీపడగా హోరాహోరీగా సాగిన మ్యాచ్లో స్వల్ప తేడా ఓడిపోయిందన్నారు. టోర్నమెంట్లో తృతీ యస్థానం కోసం జరిగిన మ్యాచ్లో జిల్లా జట్టు నిజామాబాద్తో పోటీపడగా 35–25, 35–28 పాయింట్లతో విజయం సాధించి కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోషియేషన్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, అసోషియేషన్ ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి, కోశాధికారి భాస్కర్, సీనియర్ క్రీడాకారులు శంకర్, సంయుక్త కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అడ్వైజర్ శ్రీనివాస్రెడ్డిలు బాలికల జట్టును అభినందించారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: అర్జీలు సత్వరం పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మండలాల ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. ల్యాప్ టాప్ మంజూరు చేయాలని ఉట్నూర్ మండలం భూరుమాజీగూడకు చెందిన కుర్సెంగ మహేశ్, తనకు బ్లడ్కాన్సర్ చికిత్సకు ఆర్థికసా యం అందించాలని గుడిహత్నూర్ మండలం తోషం వాసి మెస్రం శ్రీను, ఇతరులు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఐటీడీఏ శాఖల అధి కారులు పాల్గొన్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ సీఐ హన్నన్ పేర్కొన్నారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ఝా ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రధాన చౌరస్తాల వద్ద సోమవారం తనిఖీ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని 12 బైక్లను గుర్తించి సీజ్ చేశారు. మరో 40 వాహనాలకు జరిమానా విధించారు. సీఐతోపాటు సిబ్బంది ఉన్నారు. మందుబాబులకు జరిమానా మంచిర్యాలక్రైం: డ్రంకెన్ డ్రైవ్లో ఇటీవల పట్టుబడిన 24 మందికి న్యాయమూర్తి రమేశ్ సోమవారం జరిమానా విధించారు. మందుబాబుల కు మొత్తం రూ.40,500 జరిమానా విధించిన ట్లు ట్రాఫిక్ సీఐ హన్నన్ తెలిపారు. ఒకరి రిమాండ్ మంచిర్యాలక్రైం: పోలీస్ విధులకు ఆటంకం కల్గించిన ఒకరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ ప్రమోద్రావు తెలి పా రు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో ఎస్సై మజా రొద్దీన్ ఆదివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. ముగ్గురు స్కూటీపై వెళ్తుండగా ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో నలిగేటి వివేక్.. కానిస్టేబుల్పై దుర్బాషలాడి వీరంగం సృష్టించాడు. వివేక్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇద్దరికి ఏడాది జైలు తానూరు: విద్యుత్ తీగలు చోరీకి పాల్పడిన ఇద్దరికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి శ్రీవాణి సోమవారం తీర్పునిచ్చింది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2023లో ముధోల్కు చెందిన అభిబ్ హైమద్, సయ్యద్ జీషన్లు భైంసా నుంచి ఎల్వి సబ్స్టేషన్కు సరఫరా చేసే 33 కేవీ విద్యుత్ తీగలు చోరీ చేశారు. ఏఈ ప్రదీప్ ఫిర్యాదుతో అప్పటి ఎస్సై విక్రమ్ కేసు దర్యాప్తు చేపట్టారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు అనంతరం వారిని విచారించగా నేరం రుజు వైంది. ఈమేరకు జిల్లా జడ్జి తీర్పుచెప్పారు. -
ఒకే నంబర్ ప్లేట్తో రెండు బైక్లు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఒకే నంబర్ ప్లేట్తో రెండు బైక్లు ఉన్నాయి. మంచిర్యాల మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని నంనూర్కు చెందిన లారీ డ్రైవర్ కారుకూరి వినోద్ బైక్కు ఆదివారం చలాన్ పడినట్లు ఫోన్కు మెస్సేజ్ చూసి ఖంగుతిన్నాడు. ఓపెన్ చేసి ఫొటో క్లిక్ చేస్తే తన వాహన నంబర్ ప్లేట్ మరో బైక్కు ఉండడంతో అవాక్కయ్యాడు. వినోద్ వెంటనే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. కాగా, భీమారం పోలీస్స్టేషన్ పరిధిలో తన నంబర్ ప్లేట్తో తిరుగుతున్న వాహనదారుడికి లైసెన్స్ లేని కారణంగా చలాన్ విధించినట్లు వినోద్ తెలిపారు. ఒకటే నంబర్ ప్లేటు ఉన్న బైక్లు -
ఒప్పందాలు చూసి ఓర్వలేక విమర్శలు
శ్రీరాంపూర్: యాజమాన్యంతో ఆర్ఎల్సీ సమక్షంలో తాము చేసుకున్న మెరుగైన ఒప్పందాలు చూసి ఓర్వలేకనే టీబీజీకేఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సీసీసీ కార్నర్లోని నరసయ్య భవన్లో సోమవారం నిర్వహించి న కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 24 డి మాండ్లను చర్చల్లో సాధించామన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పెర్క్స్పై ఆదాయపన్ను చె ల్లింపు, హైదరాబాద్లో సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, మెడికల్ బోర్డు నిర్వహణ, సొంతింటి పథకం వంటి వాటిపై చర్చల్లో కీలక ఒప్పందాలు చేసుకున్నామన్నారు. వారి గుర్తింపు సంఘం 11 ఏళ్లలో కార్మికులకు ఏ హక్కులు సాధించారో చెప్పాలని సవాల్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు వీరభద్ర య్య, వైవీ రావు, ముస్కే సమ్మయ్య, మోత్కూరి కొ మురయ్య, బద్రి బుచ్చయ్య పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ సిబ్బంది తొలగింపు
ఆదిలాబాద్టౌన్: ఆరోగ్యశ్రీ పథకం కింద డాటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్లుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రిమ్స్లో 15 ఏళ్లకు పైగా 13 మంది డాటాఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు అటెండర్లు పనిచేస్తున్నారు. గత 17 నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు ఇటీవల డీఎంఈని కలిసి తమ సమస్యను విన్నవించారు. సర్దుబాటు చేసి వేతనాలు అందించాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే గత రెండు, మూడేళ్ల నుంచి శ్రీ మహాలక్ష్మి మ్యాన్పవర్ ప్లేస్మెంట్ సర్వీస్ ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వీరిని టర్మినెట్ చేస్తున్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు సోమవారం ఉత్తర్వులు జారీ చేసి కాపీలు అందజేశారు. తమను అర్ధాంతరంగా తొలగించడం ఏమిటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి తమ గోడు విన్నవిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని స్పష్టం చేశారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను వివరణ కోరగా, ప్రభుత్వ ఆదేశాలతోనే టర్మినెట్ చేసినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా బడ్జెట్ విడుదల కావడం లేదని, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు అందజేసి టర్మినెట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రెబ్బెన: ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కెరమెరి మండలం గోయగాం పంచాయతీ ఇందాపూర్కు చెందిన వాడై మునేశ్వర్ (28) కాగజ్నగర్లో పనిచేస్తుంటాడు. రోజు వెళ్లి వస్తుంటాడు. సోమవారం రాత్రి పనులు ముగించుకుని బైక్పై ఇంటికి బయల్దేరాడు. రెబ్బెన మండలం రాంపూర్, నవేగాం బస్టాప్ల మధ్య చేరుకున్నాడు. ఎదురుగా బెజ్జూర్కు వెళ్తున్న ఆదిలాబాద్ డిపో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఎగిరిపడిన మునేశ్వర్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోక్సో కేసు.. యువకుడి అరెస్టు కౌటాల(బెజ్జూర్): బెజ్జూర్ మండలంలోని ఓ గ్రా మానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన యువకుడు రౌతు మహేశ్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సర్తాజ్ పాషా సోమవారం తెలిపారు. బాలిక ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరిట పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మహేశ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చికిత్సపొందుతూ మృతి పాముకాటుతో వృద్ధుడు.. -
పశుసంపద వృద్ధిపై ప్రత్యేక దృష్టి
తలమడుగు: జిల్లాలో పశుసంపద వృద్ధిపై రైతులు ప్రత్యేక దృష్టిసారించాలని ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దూద్రామ్ రాథోడ్ పేర్కొన్నారు. మండలంలోని భరంపూర్, ఝరి గోపాలమిత్ర కేంద్రాలను సోమవారం సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల, పశువులకు అందిస్తున్న కృత్రిమ గర్భధారణ గురించి వి వరాలను గోపాలమిత్రలను అడిగి తెలుసుకున్నా రు. రైతులు ప్రతీ ఆవులు, గేదెల చెవులకు గుర్తింపు ట్యాగ్లు వేయించాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 111 గోపాలమిత్ర సేవ కేంద్రాలు ఉన్నాయని వీ టిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భరంపూర్ సర్పంచ్ దేవన్న, గ్రామపెద్దలు కేదారేశ్వరరెడ్డి, కార్యదర్శి అనిల్రెడ్డి, తలమడుగు సర్పంచ్ చంటి, లక్ష్మీనారాయణ, సాయి, పవన్, గోపాలమిత్ర జంగు స్వామిరెడ్డి గంగన్న తదితరులు ఉన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా అరెస్టు
భైంసా: రాత్రివేళల్లో ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠా సభ్యులను ముధోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భైంసా పోలీసుస్టేషన్లో ఏఎస్పీ సాయికిరణ్ సోమవారం వివరాలు వెల్లడించారు. భైంసా డివిజన్లోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో గత ఎనిమిది నెలల్లో నమోదైన 33 ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. వారి నుంచి 250 కిలోల రాగి తీగ, నాలుగు బైక్లు, ఏడు సెల్ఫోన్లు, ఎనిమిది పానాలు, కటింగ్ ప్లేయర్, దబ్బనం స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో విలువైన రాగి తీగను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ముధోల్ పరిధిలో 8, తానూర్లో 11, కుభీర్లో 4, బాసరలో 3, భైంసా టౌన్లో 3, భైంసా రూరల్లో 2, కుంటాలలో 2 కేసులు నమోదయ్యాయి. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ భైంసా పర్యవేక్షణలో ట్రాన్స్ఫార్మర్ చోరీల ఛేదనకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేయడంతో ముఠా కదలికలపై నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. మహారాష్ట్రకు చెందినవారే..నిందితులను మహారాష్ట్రలోని ధర్మాబాద్, రత్నేల్లి ప్రాంతాలకు చెందిన పెడికే గణేశ్, పిట్లోల్ల పోశెట్టి, ఘోగరే దీపక్, గంటలవాడ్ సాయినాథ్, గజనంద్, నక్కలవాడ్ గణేష్ తదితరులుగా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించి న ముధోల్, బాసర, తానూరు పోలీసు అధికారులు , సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. -
కుంటాలకు కొత్త సొబగులు
నేరడిగొండ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రము ఖ పర్యాటక ప్రాంతం కుంటాల జలపాతానికి మరింత వన్నె తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రకృతి అందాలకు కేరాఫ్గా నిలిచిన ఈ జలపాతం ఇక మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. పర్యాటకులకు మె రుగైన వసతులు కల్పించడంతోపాటు, కుంటాల అందాలను మరింత పెంపొందించేలా పనులు కొనసాగుతున్నాయి. రిసార్ట్స్ అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. రూ.3.5 కోట్లతో పనులు..రిసార్ట్స్ అభివృద్ధి పనులు రూ.3.5 కోట్లతో చేపట్టా రు. అదే సమయంలో ట్రైబల్ హట్స్ నిర్మాణం కూడా కొనసాగుతోంది. పర్యాటకుల సంఖ్యను, భ విష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బోటింగ్ పాయింట్, ఓపెన్ స్టేజ్, స్విమ్మింగ్ పూల్ వంటి అ దనపు సౌకర్యాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూ పొందిస్తున్నారు. దీంతో సందర్శకులకు ప్రకృతి అందాలతో పాటు వినోదం, విశ్రాంతి సౌకర్యాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. సందర్శించిన కలెక్టర్..ఇటీవల కుంటాల ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా క లెక్టర్ రాజర్షి షా, రిసార్ట్స్ ప్రాంగణంలో అవసరమై న మౌలిక వసతులతోపాటు అదనపు సౌకర్యాల క ల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూ చించారు. పర్యాటకుల సంఖ్య, భవిష్యత్ అవసరా లను అంచనా వేసి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రిసార్ట్స్ అభివృద్ధి కేవలం భవన నిర్మాణాలకే పరిమితం కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఉండాలని, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పార్కింగ్, విశ్రాంతి ప్ర దేశాలు, భద్రత తదితర అంశాలపై సమగ్ర ప్రణా ళికతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ చొరవతో ప్రత్యేక వసతులు కుంటాల జలపాతం అభివృద్ధికి కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేక చొరవ చూపుతున్నారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. జలపాతాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్నాం. పర్యాటకులకు మరిన్ని వసతులు అందుబాటులోకి తెస్తున్నాం. రెండు, మూడు నెలల్లో రిసార్ట్స్ను అందుబాటులోకి తెస్తాం. – రవికుమార్, జిల్లా టూరిజం శాఖ అధికారిపర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి.. పర్యాటక ప్రాంత అభివృద్ధిపై టూరిజం శాఖ ప్ర త్యేక దృష్టి సారిస్తోంది. రిసార్ట్స్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తోంది. బోటింగ్ పాయింట్ వద్ద పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టనుంది. నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి త్వరగా సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలంలో ఇప్పటికే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రిసార్ట్స్, ట్రైబల్ హట్స్, బోటింగ్, ఓపెన్ స్టేజ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో స్థానిక చిరు వ్యాపారులు, హోటళ్లు, రవాణా రంగాలకు ఆదాయం పెరుగుతుంది. -
ముగిసిన మాజీ మావోయిస్టు రాధక్క ప్రస్థానం
ఆదిలాబాటౌన్: మావో యిస్టు ఉద్యమంలో దా దాపు మూడు దశాబ్దాలపాటు పనిచేసిన కా మ్రేడ్ కుర్సంగె మోతిబా యి అలియాస్ రాధక్క ప్రస్థానం ముగిసింది. అనారోగ్యంతో ఆదిలా బాద్ రిమ్స్లో చేరిన ఆమె చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందారు. గత కొంతకాలంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి ఉద్యమ సహచరులు సంతాపం తెలిపారు. దండకారణ్యంలో కీలక బాధ్యతలు2003లో రాధక్క దండకారణ్యానికి బదిలీపై వెళ్లారు. అక్కడ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘానికి నాయకత్వం వహించారు. ఈక్రమంలో ఆమెకు గుండె సంబంధిత సమస్య తీవ్రమైంది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆమె అరెస్టయ్యారు. 2013–16 వరకు తెలంగాణలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవించారు. ఆ తర్వాత విడుదలయ్యారు. అనంతరం తన సహచరుడితో కలిసి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో నివసించారు. నేడు అంత్యక్రియలురాధక్క అంత్యక్రియలు మంగళవారం ఉద యం 11 గంటలకు ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి రోడ్లోని వాన్వాట్–మామిడిగూడ మధ్యలో గల లింగూగూడలో నిర్వహించనున్నట్లు ఆమె సహచరులు తెలిపారు. ఈ సందర్భంగా రాధక్కకు ఉద్యమ సహచరులు జోహార్లు అర్పించారు. 1984లో ఉద్యమంలోకి..కామ్రేడ్ రాధాక్క 1984లో సీపీఐ(ఎంఎ ల్) పీపుల్స్వార్లో చేరారు. తొలుత సిర్పూర్ దళంలో సభ్యురాలిగా పనిచేశా రు. 1986లో పార్టీ సభ్యత్వం పొందారు. 1989లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, 2000లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. -
విద్యార్థుల నైపుణ్యాలకు వేదిక...
ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలి తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పోటీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఆసక్తి గల విద్యార్థులు పాల్గొనాలి. ఇందులో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేయాలి. – భోజన్న, డీఈవో లక్ష్మణచాంద: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బాలల దినోత్సవం సందర్భంగా పలు రకాల రచనాపోటీలు నిర్వహించనున్నారు. పోటీలు ఇవీ.. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కథ, కవిత, గేయం, పాట, పద్యం, నాటిక వంటి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని విద్యా శాఖ అధికారులు తెలిపారు. పోటీల్లో రాయాల్సిన అంశాలు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే విద్యార్థులు కింది అంశాలపైనే రాయాలి. ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, జీవన విధానం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు, భాష వంటి అంశాలపై రచనలు ఉండాలి. కవితలను 26 పంక్తులకు మించకుండా రాయాలి. పంపాల్సిన చిరునామా వివిధ అంశాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్ – 500004 అనే చిరునామాకు పోస్టు ద్వారా పంపాలని అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి పేర్కొన్నారు. పోటీకి సంబంధించిన ఇతర వివరాలు, సందేహాల నివృత్తి కోసం 9184245692 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జిల్లా సమాచారం... జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 795మొత్తం విద్యార్థులు 60,239జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 227మొత్తం విద్యార్థులు 69,751అర్హులైన విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు రచనలు పంపడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 -
వాతావరణం
ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. అల్పపీడనం ప్రభావంలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. కిశోర్కుమార్ సేవలు మరువలేనివి నిర్మల్చైన్గేట్: జిల్లాకు రెవెన్యూ అదనపు కలెక్టర్గా కిశోర్కుమార్ అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ప్రతీ ఉద్యోగి జీవితంలో బదిలీ లు, పదవీ విరమణలు సహజమని పేర్కొన్నారు. కిశోర్కుమార్ వరంగల్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికా రి బాలిగ్ అహ్మద్, ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ నరసింహమూర్తి ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కిశోర్కుమార్ రెవెన్యూ అదనపు కలెక్టర్గా భూ సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోళ్లు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాల్లో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. వరంగల్ జిల్లాలోనూ ఇదే అంకితభావంతో పనిచేసి మంచి పేరు పొందాలని ఆకాంక్షించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా బాలిగ్ అహ్మద్, ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీగా నరసింహమూర్తి సుదీర్ఘకాలం క్రమశిక్షణతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారన్నారు. విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కిశోర్కుమార్ను సన్మానిస్తున్న కలెక్టర్ భవేశ్మిశ్రా -
ఇప్పుడేం చేయాలి.. సర్?
నిర్మల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ఎన్యూమరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన జిల్లాలో నోటీసుల ప్రక్రియలో గందరగోళంగా మారింది. చాలామందికి నోటీసులు అందక, అందిన నోటీసుల్లో తప్పులు ఉండడం, ఎలా సరిచేయాలో తెలియకపోవడం, అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోనే పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇప్పటికీ నోటీసులు అందక ఆందోళన నెలకొంది. అందని నోటీసులు.. జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్ ప్రాంతంలోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులు చాలామందికి అందలేదు. ఓ పోలింగ్ కేంద్రం పరిధిలో బీఎల్వో అనారోగ్యం కారణంగా అందుబాటులో లేక ఎవరికీ నోటీసులు అందలేదు. వారికి సోమవారమే హియరింగ్ ఉన్నా.. నోటీసులు అందక కార్యాలయాల చుట్టూ తిరిగారు. చివరకు అర్బన్ తహసీల్దార్ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఇలాగే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నోటీసులు ఇవ్వడం, చిరునామాల్లో మార్పులు ఉండటం, పంపిణీ ప్రక్రియలో సమన్వయం లేకపోవడం వంటి కారణాలతో కొందరికి సమాచారం చేరలేదని తెలుస్తోంది. దీంతో సర్ జాబితాలో తమ పేరు, వివరాల విషయంలో ఏం జరుగుతుందో తెలియక పలువురు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అవగాహన అంతంతే..! ఎస్ఐఆర్కు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిన జిల్లా అధికారులు నోటీసులు, సవరణల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్యూరేషన్ ఎలా చేసుకోవాలో ప్రచారం చేసిన అధికారులు నోటీసులు వచ్చినవారు ఎలా సవరణలు చేసుకోవాలి, ఏయే ధ్రువపత్రాలు సమర్పించాలి అనే అవగాహన క్షేత్రస్థాయిలో కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నోటీసు వచ్చిన తర్వాత ఓటరు చేయాల్సిన ప్రక్రియ, అవసరమైన పత్రాలు, అభ్యంతరాలు లేదా మార్పుల కోసం దరఖాస్తు చేసే విధానం వంటి అంశాలను సులభంగా ప్రజలకు వివరించాల్సి ఉంది. భారంగా భావిస్తున్న బీఎల్వోలు.. నోటీసులు అందని వారికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవడం, తప్పుల సవరణకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సర్ ప్రక్రియ తమకు భారమవుతోందని బీఎల్వోలు పేర్కొంటున్నారు. నోటీసులు ఇవ్వడం, సవరణలు చేయించడం తలకు మించిన భారంగా మారిందంటున్నారు. అదనంగా సిబ్బందితో ఓ టీమ్గా పూర్తిచేయించాలని కోరుతున్నారు. ఏం చేయాలంటే.. ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియలో అన్ని వివరాలు పక్కాగా ఉంటేనే ఓటు భద్రంగా ఉంటుంది. లేదంటే.. జాబితాలో నుంచి గల్లంతవుతుంది. అందుకే.. ప్రతీ ఓటరు తమ ఓటు ప్రస్తుత స్థితి ఏమనేది తెలుసుకోవాలి. నోటీసులు ఇంటికి రాకపోతే బీఎల్వో దగ్గరికి వెళ్లి పరిశీలించాలి. ఒకవేళ వస్తే.. ఆ నోటీసు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలి. ప్రధానంగా పేరు, చిరునామా, కుటుంబసభ్యుల వివరాలు తప్పుగా ఉంటాయి. తప్పులు ఉంటే సవరణ కోరాలి. ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలు జతచేయాలి. నోటీసులో విచారణ(హియరింగ్)కు హాజరు అవసరమైతే తప్పనిసరిగా హాజరు కావాలి. చివరకు తుదిజాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి. తప్పులుంటే ఎలా..? నోటీసులు అందిన వారిలోనూ కొందరికి కొత్త సమస్య ఎదురవుతోంది. పేరులో అక్షరదోషాలు, వయసు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాల్లో పొరపాట్లు ఉంటేనే నోటీసు వస్తుంది. అయితే వాటిని ఎలా సరిచేయాలి? ఎవరిని సంప్రదించాలి? ఏ పత్రాలు సమర్పించాలి? అనే దానిపై స్పష్టత లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ప్రక్రియపై కొంత అవగాహన ఉన్నవారు మాత్రమే నోటీసులలో సవరణలను చేయించుకుంటున్నారు. అందులో ఇచ్చిన తేదీ ప్రకారం హియరింగ్కు వెళ్లి మార్చుకుంటున్నారు. వృద్ధులు, అవగాహన లేనివారు నోటీసులకు ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. -
‘హస్త’వ్యస్తం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయట పడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి జిల్లా నాయకుల వరకు వారి మధ్య ఐక్యత కొరవడుతోంది. నియోజకవర్గల్లో ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్లో మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా.. మిగతా చోట్ల ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరిన్ని శాసనసభ స్థానాలు గెలుచుకునేలా పని చేయాల్సి ఉండగా.. గ్రూపు రాజకీయాలతో కేడర్లో అయోమయం నెలకొంది. గాంధీభవన్కు పంచాయితీలు జిల్లా నుంచి పార్టీ పంచాయితీలు రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసేలా గాంధీభవన్ వరకు వెళ్తున్నాయి. ఇటీవల ఉట్నూరులో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ ముందే ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలంటూ నరేశ్జాదవ్పై బోఽథ్ నియోజకవర్గ ఇన్చార్జి అడె గజేందర్ తన అనుచరులతో గాంధీ భవన్కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందు ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు వ్యతిరేకంగా మాజీ డీసీసీ అఽధ్యక్షుడు విశ్వప్రసాద్ అనుచరులు గాంధీభవన్ ఎదుట ధర్నా చేశా రు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్నా యక్, మాజీ డీసీసీ అధ్యక్షుడి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఖానాపూర్లో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మధ్య సఖ్యత లేదు. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్వెంకటస్వామి వర్గాలుగా ఉన్నాయి. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోనే మంతెన జగన్మోహన్రావు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుకు వ్యతిరేకంగా ఓ గ్రూపు కడుతున్నారు. అసంతృప్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామ, మండల స్థాయి నాయకులను కూడగడుతున్నారు. ప్రేమ్సాగర్రావు, మంత్రి వివేక్ వర్గాల మధ్య వైరం ముదురుతోంది. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనను నిరసిస్తూ దండేపల్లి మండలం గూడెంలో ఎమ్మెల్యే వర్గీయులు స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. దీనిపై పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఒకే పార్టీలో రెండు వేర్వేరు వర్గాలుగా ఉన్నాయి. సరిదిద్దేవారేరి? ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ అధికార పార్టీలో ఉన్నారు. అయితే నాలుగు జిల్లాల్లో పరిస్థితులు చక్కబెట్టే వారే కరువయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. ఇక పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం తక్కువగానే ఉంటోంది. దీంతో ఎవరికి వారే అన్నట్లు సాగుతోంది. ఓ వైపు ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా వారికి నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కడం లేదు. జిల్లా స్థాయిలో భర్తీ కావడంతో పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి నా జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు ఏం ఒరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటిని చక్కబెట్టి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలో పేతం చేయాలనే అధిష్టానం ఆశలకు క్షేత్రస్థాయి నాయకుల మధ్య అనైక్యత అడ్డంకిగా మారాయి. -
కొనసాగుతున్న గణిత విజ్ఞాన మేళా
ముథోల్: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా కొనసాగుతోంది. విద్యార్థులు ప్రదర్శించిన గణిత, విజ్ఞాన, సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ నూతన ఆవిష్కరణలు, సృజనాత్మక నమూనాలను ప్రదర్శించారు. మేళాలో శిశువర్గ, బాలవర్గ, కిశోరవర్గకు చెందిన విద్యార్థుల సైన్స్, గణిత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలోని 8 విభాగాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మేళాలో పాల్గొన్నారు. విద్యార్థులు తమ ప్రదర్శనల ఉద్దేశం, తయారీ విధానం, ఉపయోగాలు తదితర అంశాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. ముధోల్ ఎంఈవో గోపిడి రమణారెడ్డి మేళాను తిలకించారు. నిర్వాహకులు ఆయనను సన్మానించారు. అలాగే ప్రదర్శనలను పరిశీలించేందుకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన న్యాయ నిర్ణేతలను కూడా సన్మానించారు. -
ఆర్టీఐ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్
నిర్మల్ఖిల్లా: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది జుట్టు చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏటి ఆంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగిండ్ల వెంకటేశ్తో కూడిన కార్యవర్గ సభ్యుల నిర్ణయం మేరకు చంద్రశేఖర్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రజలకు సహకరిస్తానని చంద్రశేఖర్ తెలిపారు. -
నిర్మల్
సంచార తెగల అభ్యున్నతికి కృషి చేయాలి నిర్మల్చైన్గేట్: సంచార తెగల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంచార జాతుల దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన సంచార, విముక్త తెగల అభ్యున్నతికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సంచార జాతుల పిల్లలకు నాణ్యమైన విద్యనందించడంతోపాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలు అందించే పథకాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సంచార జాతుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజంలో వారి ఆత్మగౌరవం పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేశ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. భైంసా/కుభీర్: శ్రావణ సోమవారం సందర్భంగా కుభీర్ మండలం పార్డి(బి) గ్రామానికి చెందిన పది మంది తీర్థయాత్ర విషాదాంతమైంది. పుణ్యక్షేత్రంలో దైవదర్శనం చేసుకుని, పూజలు చేసి.. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న జీపు మహారాష్ట్రలో తోటంబా ఘాట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పార్డి(బి) గ్రామానికి చెందిన తూము సాయిలు(60), ఆవుల గంగన్న(63), తూము గౌరాబాయి(70)తోపాటు ఆవుల ప్రేమలబాయి, తూము ముత్తుబాయి, తూముల కిషన్, బ్యారపు మోనాజీ, దొర్లా శంకర్, పుష్ప భాయ్, దనగర్ మల్లయ్య, శంకర్ గ్రామానికే చెందిన తులసీరామ్(27)జీపులో సోమవారం ఉద యం 8 గంటలకు మహారాష్ట్రలోని కై లాస్టెకిడి శివా లయ దర్శనానికి బయల్దేరారు. మధ్యాహ్నం వరకు అక్కడకు చేరుకుని పూజలు చేశారు. తిరుగు ప్రయాణంలో సాసర్ కుండ్ జలపాతం వద్దకు వెళ్లారు. తర్వాత స్వగ్రామానికి బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు కుభీర్, భైంసాలో చికిత్స పొందుతున్నారు. చివరి ప్రయాణం.. తూము సాయిలు(60)–భార్య ముత్తుబాయితో కలిసి యాత్రకు వెళ్లాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెళ్లిళ్లు జరిపించారు. మలి వయసులో కుటుంబంతో ప్రశాంతంగా జీవించాల్సిన దశలో ఆయన పుణ్యక్షేత్ర యాత్రలోనే మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో భార్య ముత్తుబాయి ప్రాణాలతో బయటపడింది. భర్తను కోల్పోయిన ఆమె ఏడుపు అక్కడున్న వారిని కలచివేసింది. ఇక ఆవుల గంగన్న(63)–ప్రేమలబాయి దంపతులు కూడా యాత్రకు వెళ్లారు. ప్రమాదంలో గంగన్న మృతి చెందాడు. ప్రేమలబాయి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందరికీ వివాహం చేశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన తూము గౌరాబాయి(70) భర్త మూడేళ్ల క్రితమే మరణించాడు. ఇద్దరు కుమారుల పెళ్లిళ్లు చేసి కుటుంబంతో కలిసి మలిదశ జీవనం సాగిస్తోంది. గ్రామస్తులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఆమెకు ఈ యాత్రే ఆఖరి ప్రయాణమైంది. ఊరంతా విషాదం జీపులో ప్రయాణించిన వారంతా గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు తమ ప్రియమైన వారిని కోల్పోయి, మరికొందరు మంచానికే పరిమితమయ్యారు. ప్రమాద వార్త అందుకున్న వెంటనే గ్రామస్తులు, బంధువులు మహారాష్ట్రకు చేరుకుని మృతదేహాలను భైంసాకు తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రిలో రక్షతగాత్రులను ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ సాయికిరణ్, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పరామర్శించారు. మృతుల బంధువులను ఓదార్చారు. ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుగు ప్రయాణంలో అదుపుతప్పి బోల్తాపడిన జీపు చెల్లాచెదురైన క్షతగాత్రులు.. ఘాట్ దిగుతుండగా జీపు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఎగిరి రోడ్డుపై పడ్డారు. జీపు టైరు ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు కొందరు చెబుతున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం భీతావాహంగా మారింది. క్షతగాత్రుల రోదనలు విన్న సమీప గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం చేశారు. అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. కుటుంబాలకు సమాచారం అందించారు. చివరి స్టేటస్.. గ్రామానికి చెందిన దాగాం సావిత్రిబాయి, గంగాధర్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహం జరిపించారు. కొడుకు తులసీరామ్కు భైంసాకు చెందిన యువతితో గత వేసవిలో వివాహం చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే తులసీరామ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో సాసర్ కుండ్కు వెళ్లాడు. భార్యతో కలిసి అక్కడ దిగిన ఫొటోను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. ఆ ఆనంద దృశ్యాలు చెరిగిపోకముందే విధి వెక్కిరించింది. సోమవారం గ్రామస్తులను జీపులో యాత్రకు తీసుకెళ్లిన తులసీరామ్ తిరుగు ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్టేటస్ పెట్టి 24 గంటలు కూడా గడవకముందే అతను లేడన్న విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భైంసా ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు, భార్య, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. -
కౌన్సిలర్ల ఆరోపణలు అవాస్తవం
ఖానాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శని వారం జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు చేసిన వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక పేర్కొన్నారు. సమావేశంలో జరిగిన పరిణామాలపై ఆదివారం కౌన్సి లర్లు, బీజేపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సర్వసభ్య సమావేశానికి తొలుత వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు కమిషనర్పై అధికా ర పార్టీ నాయకులతో ఒత్తిడి తెప్పించారని ఆరో పించారు. భయభ్రాంతులకు గురిచేసి ఎజెండా రిజిష్టర్లపై బలవంతంగా సంతకాలు చేయించడంతో సమావేశం వాయిదా పడిందని చెప్పించడం సరికాదని ఆరోపించారు. అనంతరం చైర్పర్సన్, కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకుని ఎ జెండా రిజిష్టర్, కాపీలు తీసుకురావాలని అధికా రులను కోరగా, సమావేశం వాయిదా పడిందని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. సమావేశం ప్రారంభం కాకుండానే ఎలా వాయిదా పడుతుందని ప్రశ్నించగా అధికారులు సమాధానం ఇవ్వలేదని తెలిపారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని అధికారులు ఆరోపించడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని సూచించినందుకే విషయాన్ని వేరే విధంగా చిత్రీకరించి కమిషనర్కు వినతిపత్రం అందించారని మౌనిక పేర్కొన్నా రు. మున్సిపాలిటీ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించకుండా ప్రజల కోసం పనిచేయాలని స ర్వసభ్య సమావేశంలో కోరామని, అయితే, దీని పై సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారని తె లిపారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ పదవి దక్కించుకునేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పట్టణాభివృద్ధికి ఆ టంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల ర్లు గుమ్ముల ఆనంద్, బొప్పారపు సత్యవతి, బండిపెల్లి సింధుజ, నాయకులు పాల్గొన్నారు. -
బల్దియా పాలకవర్గంలో విభేదాలు!
ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపాలిటీలో పాలకవర్గం మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. ప్రజాసమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన కౌన్సిల్ సమావేశం కో రం లేక వాయిదా పడటం, అనంతరం నిర్వహించిన సమావేశంలోనూ రెండు తీర్మానాలకే ఆమో దం లభించడం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో కోరం లేక సమావేశం వాయిదా పడగా, తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ కౌన్సిలర్ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి ప నులు ముందుకుసాగడం లేదని, నిధుల కేటాయింపు, పనుల మంజూరు, అమలుపై స్పష్టత లేదని పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమృత్ 2.0 పనులపైనా సమావేశంలో పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగుల బహిష్కరణతో వివాదం చైర్పర్సన్ భర్త తమతో దురుసుగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఎనిమిది మంది మున్సిపల్ ఉద్యోగులు సమావేశాన్ని బహిష్కరించి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు కౌన్సిలర్లు, నాయకుల ఒత్తిళ్లతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చైర్పర్సన్, వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార ఖర్చుపైనా అభ్యంతరం ఇటీవల జరిగిన చైర్పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఖర్చును కౌన్సిల్ అజెండాలో చేర్చడంపైనా పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని వారు కోరారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో నెలకొన్న పరిస్థితులతో పాలకవర్గం, అధికారుల మధ్య సమన్వయం కొరవడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు తదితర ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ ఉద్యోగుల సమావేశం బహిష్కరణ, ఉద్యోగుల ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. మున్సిపాలిటీలో విభేదాలు సమసిపోతాయా.. లేదా.. మరింత ముదురుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ముగిసిన అత్యపత్య పోటీలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రెండురోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థా యి బాలబాలికల అత్యపత్య–2026 పోటీలు ఆది వారం ముగిశాయి. బాలుర విభాగంలో హైదరాబా ద్ జట్టు విజేతగా నిలవగా, బాలికల విభాగంలో నాగర్కర్నూల్ జట్టు కప్పును కై వసం చేసుకుంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వన్నెల భూమన్న నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి 44 జట్లు పాల్గొన్నా యి. సుమారు 600 మంది క్రీడాకారులు పోటీల్లో త లపడ్డారు. బాలుర విభాగం ఫైనల్లో హైదరాబా ద్, రంగారెడ్డి జట్లు తలపడగా హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో నిర్మ ల్, నాగర్కర్నూల్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా నాగర్కర్నూల్ జట్టు విజేతగా నిలిచింది. నిర్మల్ జట్టు రన్నరప్గా నిలిచింది. విజేతలకు ఎన్ఆర్ఐ తడక చంద్రశేఖర్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు పోశెట్టి, బ్రహ్మయ్య కప్పులను అందజేశారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పో టీలకు నిర్మల్ వేదిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రా ణించాలని, క్రీడలు ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్, సాఫ్ట్బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు రవీందర్, శ్రీనివాస్, గంగాధర్, సురేశ్, భూమేశ్, కోచ్లు సాయిరాజు, ముఖేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనంలో కొత్త విధానమా?
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఏ–1, ఎస్ఏ–2 పరీక్షల జావాబు పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనంచేయించాలనే సర్కారు నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. అయితే, మరింత పారదర్శకత, జవా బుదారీతనం కోసమే ఒక పాఠశాల విద్యార్థులు రాసిన పరీక్షాపత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో వాల్యుయేషన్ చేయించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు వ్యతి రేకిస్తున్నాయి. కాగా, ఇదివరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1–9 తరగతుల విద్యార్థులు రాసిన ఎస్ ఏ–1, ఎస్ఏ–2 పరీక్షల జవాబు పత్రాలను ఆ యా పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులే మూ ల్యాంకనం చేశారు. కొత్త విధానంతో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడం కష్టంగా మా రుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అయితే, కొంతమంది చేసే తప్పులకు మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. లో పాలుంటే అకడమిక్ మానిటరింగ్ పెంచాలని, శాంపిల్ వెరిఫికేషన్ చేయాలని సూచిస్తున్నారు. మోడరేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అవసరమైతే రెండోసారి మూల్యాంకనం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నా రు. ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ను అమలు చే యడం తమ వృత్తి గౌరవాన్ని దెబ్బతీయడమేన ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయు ల కొరత ఉండటంతో ఇటీవలే సర్దుబాటు చేశారని, ఇప్పుడు ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ కోసం ఉన్న ఉపాధ్యాయులు వెళ్తే ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులకు ఎవరు పాఠాలు బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల పాఠ్యాంశాల బోధనకు కూడా ఆటంకమేర్పడి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని చెబుతున్నారు. విద్యార్థులకు కలిగే బోధన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. మూల్యాంకనం విషయంలో కొత్తగా తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నాయి. విద్యార్థులకు నష్టమే.. ప్రభుత్వం పునరాలోచించాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్ష పేపర్లు మరో పాఠశాల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించాలనే నిర్ణయానికి ముందు విద్యారంగ నిపుణులతో చర్చించాల్సింది. దానిపై శాసీ్త్రయంగా అధ్యయనం చేయాల్సింది. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకుంటే బాగుండు. ఇప్పటికై నా పునరాలోచించాలి. – అశోక్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ పాఠశాలల్లో 1–9 తరగతుల విద్యార్థుల ఎస్ఏ–1, ఎస్ఏ–2 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో చేయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు, పాఠశాల విద్యాశాఖ సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టాలని ఆయా మండలాల విద్యాధికారులకు సూచించాం. – భోజన్న, జిల్లా విద్యాధికారి


