Nirmal District Latest News
-
విద్యార్థుల సంఖ్య పెంచాలి
● ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్ నిర్మల్ రూరల్/సోన్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్ సూచించారు. పోషకుల సమావేశంలో భాగంగా నిర్మల్ రూరల్ మండలం ముఠాపూర్ ప్రాథమిక పాఠశాలలో, సోన్ మండలం న్యూవెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాలలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో శుక్రవారం మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రతీరోజు ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తామన్నారు. ప్రాథమిక పాఠశాల దశ నుంచి విద్యార్థులకు కంప్యూటర్పై అవగాహన కల్పించబడుతున్నదని, ఈ సంవత్సరం నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధన కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలతో పాటు డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్లు ఉన్నాయని వివరించారు. పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత గ్రామ వీడీసీలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులపై ఉందన్నారు. పాఠశాల హెచ్ఎంలు సుధాకర్, విద్యాసాగర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ గోదావరి,ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్ తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ ప్రచార జాతలో భాగంగా మండల కేంద్రంలో ఉపాధ్యాయులతో శుక్రవారం ప్రచారం చేపట్టారు. అన్ని రకాల అర్హతలు కలిగిన, అంకిత భావంతో పనిచే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధధన చేస్తానని వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పోషకులను కోరారు. -
దోమలకు చెక్ పెట్టాలి
నిర్మల్చైన్గేట్: దోమల అభివృద్ధిని అడ్డుకోవాలంటే లార్వా స్థాయిలోనే చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ అన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో శుక్రవారం పర్యటించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్లాస్టిక్ డబ్బాలు, పగిలిపోయిన రంజన్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, చిప్పలు, టైర్లు, పగిలిపోయిన కుండలను తొలగించాలని సూచించారు. కూలర్లలో నీటిని వారానికి ఒకసారి పూర్తిగా తొలగించి తిరిగి నింపు కోవాలన్నారు. వర్షాలు పడుతున్న దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు భోజారెడ్డి, ఆరోగ్య సహాయకులు పురుషోత్తం, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
మేకను కాపాడబోయి..
● బావిలో చిక్కుకున్న కాపరి బోథ్: మేకను కాపాడబోయి కాపరి బావిలో చిక్కుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన ఓ మేకల కాపరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గల వ్యవసాయ క్షేత్రంలో మేకలను మేతకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు ఓ మేక పడిపోయింది. గమనించిన కాపరి మేకను కాపాడాలని బావిలోకి దిగాడు. తనకు తోడుగా వచ్చిన వ్యక్తి బావి బయట ఉండడంతో మేకను తాడు సాయంతో పైకి పంపించాడు. ఆ తర్వాత అతనూ పైకి రావడానికి నానా ఇబ్బందులు పడ్డాడు. స్థానికులు గమనించి అతడిని అతికష్టం మీద బయటకు తీశారు. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇచ్చోడ నుంచి ఫైరింజన్ కూడా వచ్చింది. అప్పటికే కాపరి బావి నుంచి బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసరలో చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరికొన్ని రోజుల్లో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. దీంతో అమ్మవారి దర్శనానికి వారం రోజులు గా భక్తులు భారీగా వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి ని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూ జలు చేయిస్తున్నారు. శుక్రవారం ఆలయానికి వచ్చిన భక్తులు వేకువజామున గోదావరిలో పుణ్యస్నానాలు చేసి శ్రీమహాలక్ష్మి, శ్రీసరస్వతి, శ్రీమహాకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్షరాభ్యాస మండపంలో ఆలయ అర్చకులు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరి పించారు. రూ.1000 అక్షరాభ్యాస టికెట్లు 255, రూ.150 అక్షరాభ్యాస టికెట్లు 650 విక్రయించా రు. ఇతర అర్జిత సేవల ద్వారా మొత్తం రూ. 8.70 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గ్గురికి గాయాలు
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుప్యా తండాకు చెందిన లావణ్య, ఆమె భర్త రాథోడ్ దినేష్ ద్విచక్ర వాహనంపై పెట్రోల్ బంకులో పెట్రోలు పోయించుకుని తిరిగి నిర్మల్వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో అతివేగంగా సారంగాపూర్వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భూమేశ్ వారి వాహనాన్ని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో లావణ్య, దినేష్కు స్వల్ప గాయాలు కాగా భూమేష్కు తలకు గాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
అటవీ అధికారులపై కేసులు పెట్టాలి
బెల్లంపల్లి: పేద దళిత రైతులపై దాడులు చేస్తున్న అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధిత రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు సర్వే నంబర్ 65, 67లో ఉన్న భూములను ఐదు దశాబ్దాల నుంచి సాగు చేసి జీవిస్తున్నారని తెలిపారు. అటవీ అధికా రులు అడ్డుతగులుతూ దాడులకు తెగబడుతున్నార ని విమర్శించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం డీఏఓ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు బి.కేశవరెడ్డి, రైతులు బానయ్య, లింగయ్య, సతీష్, రాజయ్య, పర్వతాలు, మహిళలు పాల్గొన్నారు. -
బుద్ధ విగ్రహం తొలగింపుపై నిరసన
● భైంసా–బాసర జాతీయ రహదారిపై అంబేడ్కర్ వాదుల ఆందోళన ● బోరిగాం ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ముధోల్ : ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో ఇటీవల బుద్ధుని విగ్రహం తొలగింపు ఘటనపై దళిత సంఘాలు, అంబేడ్కర్వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. న్యాయం కోరుతూ శుక్రవారం ముధోల్ మండల కేంద్రంలో భైంసా–బాసర జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బుద్ధుని విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు కలెక్టర్ హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుమారు 5 గంటలపాటు ఆందోళన చేశారు. ప్రభుత్వ స్థలంలో ప్రతిష్టించిన బుద్ధుని విగ్రహంపై దాడులు జరగడం బాధించిందని పలువురు పేర్కొన్నారు. న్యాయం చేయాల్సిన అధికారులు మొండి వైఖరి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల హామీతో.. ఎస్పీ జానకీ షర్మిల శాంతియుతంగా చర్యలు చేపడతామని చెప్పినానిరసనకారులు కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ కోరారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కతో చర్చలు జరిపారు. మంత్రి సంబంధిత అధికారులకు బుద్ధ విగ్రహం పునఃప్రతిష్టకు స్థలం కేటాయించాలని ఆదేశించారని విఠల్రెడ్డి, ఆర్డీవో కోమల్రెడ్డి తెలిపారు. రాబోయే సోమవారం బుద్ధ విగ్రహం ఆవిష్కరణ, బౌద్ధ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రభుత్వమే కాంస్య విగ్రహం నిర్మించి అందిస్తుందని హామీ ఇచ్చారు. పోలీసుల నిఘా మండలంలోని బోరిగాం గ్రామంలో ఉద్రిక్తతల దృష్ట్యా శుక్రవారం పోలీసులు నిఘా పటిష్టం చేశారు. దళిత సంఘాలు శుక్రవారం చలో బోరిగాంకు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి దళిత నాయకులు అధిక సంఖ్యలో తరలివస్తారని సమాచారం మేరకు ఉదయం నుండే పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు. తనిఖీలు నిర్వహించారు. సుమారు 150 మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బందోబస్తును ఎస్పీ జానకీషర్మిల పర్యవేక్షించారు. గ్రామంలో ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. -
ధాన్యం తరలించాలని రైతుల ఆందోళన
నర్సాపూర్(జి): ఆరుగాలం కష్టపడి పండించిన ధా న్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని తురాటి గ్రామ ఎక్స్రోడ్ వద్ద 61వ జాతీయ రహదారిపై శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు. ఈనెల 27న డొంగుర్గాం పీఏసీ ఎస్ కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన గొర్ల ప్రవీణ్కు చెందిన 1100 బస్తాల ధాన్యాన్ని ఒక లారీ, 4 ట్రాక్టర్లలో మామడ, కుంటాల, వానల్పాడ్, భైంసా రైస్ మిల్లులకు పంపారు. తేమశాతం సరిగా లేదనే కారణంతో మిల్లర్లు వాటి ని గురువారం వెనక్కి పంపించారు. గురువారం రాత్రి వర్షం కురవడంతో మళ్లీ ధాన్యం తడిసింది. దీంతో శుక్రవారం రైతులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ఒకవైపు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారని, మిల్లర్లు మాత్రం తిప్పి పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై సాయికిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. సుమారు గంటపాటు రైతులు రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైతులు తహసీల్దార్ శ్రీకాంత్కు వినతిపత్రం అందించి సమస్య పరిష్కరించాలని కోరారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్చైన్గేట్: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న అరుణ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. దుకాణంలోని విత్తనాలు, పురుగుమందుల ప్యాకింగ్, లేబుళ్లు, అమ్మకాల రిజిస్టర్లు, నిల్వల వివరాలు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిషేధించిన మందులు విక్రయించొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రెగ్యులర్గా దుకాణాలు తనిఖీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ రాజు, అధికారులు ఉన్నారు. యూనిఫాం స్టిచ్చింగ్ నాణ్యతగా ఉండాలి.. నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫాం(ఏకరూప దుస్తులు) స్టిచ్చింగ్ నాణ్యంగా ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఈద్గాం, మంజులాపూర్లో ఏర్పాటు చేసిన యూనిఫాం స్టిచ్చింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇవ్వబోయే దుస్తులు కచ్చితంగా కొలతలకు తగినట్లుగా ఉండాలన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు విద్యార్థులకు యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో విజయలక్ష్మి, మెప్మా పీడీ సుభాష్, విద్యాశాఖ అధికారులు లింబాద్రి, ప్రవీణ్, తహసీల్దార్ రాజు ఉన్నారు. పుకార్లు నమ్మొద్దు నిర్మల్చైన్గేట్: ముధోల్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అసత్య ప్రచారా లు, పుకార్లు వ్యాప్తి చేయడానికి యత్నిస్తున్నట్లు గుర్తించామని, వాటిని నమ్మొద్దని కలెక్టర్ అభిలా ష అభినవ్ సూచించారు. బోరెగాం గ్రామంలోని సర్వే నంబరు 249 లోని ప్రభుత్వ భూమిని ఇటీవల కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు య త్నించగా రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, సంబంధిత భూమి హద్దులను గుర్తించా రు. ఆక్రమణలు తొలగించారు. ఈ ఘటన నేపథ్యంలో రెవెన్యూ, ల్యాండ్ సర్వే విభాగాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ని జిల్లా యంత్రాంగం నియమించిందన్నారు. ప్రస్తుతం ఆ కమిటీ విచారణ కొనసాగిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో అక్రమాలు చోటుచేసుకోకుండా నివారించేలా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతుందని పేర్కొన్నా రు. బోరెగాం గ్రామ ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
రైతన్నా.. జాగ్రత్త!
అప్రమత్తంగా ఉండాలి.. నకిలీ విత్తనాల సమస్య నుంచి రైతులను కాపాడేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలని, అదే సమయంలో రైతులకు నాణ్యతా విత్తనాల గుర్తింపుపై అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు కూడా బ్రాండెడ్, ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, తక్కువ ధరలకు ఆకర్షితులై నాన్బ్రాండెడ్ విత్తనాలను కొనకుండా జాగ్రత్త వహించాలని సలహా ఇస్తున్నారు.భైంసాటౌన్: మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయాలు రైతులకు, వ్యవసాయ రంగానికి పెను సవాల్గా మారుతున్నాయి. ఏటా ఏప్రిల్, మే నెలల్లో ఈ విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. పేరు తెలియని, నాసిరకం విత్తనాల కారణంగా పంట మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నప్పటికీ, ఫలితాలు సంతృప్తికరంగా లేవన్న విమర్శలు వస్తున్నాయి. నాన్బ్రాండెడ్ విత్తనాల వల.. ఈ సీజన్లో వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో మార్కెట్లో విత్తనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, ఇదే అదునుగా కొందరు వ్యాపారులు నాన్బ్రాండెడ్, నకిలీ విత్తనాలను తక్కువ ధరకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పత్తి, సోయా, వరి విత్తనాల్లో నాన్బ్రాండెడ్ రకాలు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. అనధికార మార్కెట్ ద్వారా ఈ విత్తనాలు విక్రయిస్తున్నారు. తనిఖీలు నామమాత్రమేనా? నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం వ్య వసాయ, పోలీసు, రెవెన్యూ, సీడ్ కార్పొరేషన్ శా ఖలతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పా టు చేసింది. ఈ బృందాలు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, నకిలీ విత్తనాల విక్రయాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. అయినా ఈ తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు కొందరు డీలర్లతో లోలోపలి సంబంధాలు కలిగి ఉండడం వల్ల తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్లో నకిలీ విత్తనాల బెడద అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులుచర్యలు తీసుకుంటాం... ప్రభుత్వ ఆదేశాలతో విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నాం. స్టాక్ నిల్వలు, రిజిస్టర్లు పరిశీలిస్తున్నాం. ఎవరైనా నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. గడువు ముగిసిన క్రిమిసంహారక మందులు విక్రయించొద్దు. – కోమల్రెడ్డి, ఆర్డీవో, భైంసాభైంసాలోని ఓ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు -
కేసులకు భయపడేది లేదు..
● ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ● బాధితుడికి పరామర్శ శ్రీరాంపూర్: కాంగ్రెస్ సర్కార్లో అక్రమ కేసులను భయపడేది లేదని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శుక్రవారం ఆమె న స్పూర్లో పర్యటించారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు కందుల ప్రశాంత్పై ఇటీవల సీసీసీ నస్పూర్ పోలీ సులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఊరు శ్రీరాంపూర్లోని ఆయన నివాసానికి ఆమె వెళ్లి అతడితోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్రమ కేసులకు భయపడవద్దని, పార్టీ, తాను అండగా ఉంటామని చెప్పారు. కేసులతో జాగృతి నా యకులు, కార్యకర్తలను బెదిరించలేరని, తాను ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. అనంతరం నస్పూర్ కాలనీలో తెలంగాణ తల్లి విగ్రహాని కి పూలమాల వేసి నివాళులర్పించారు. ఊరు శ్రీ రాంపూర్ వద్ద కవితను అభిమానులు గజమాలతో సత్కరించగా, మహిళలు మంగళహారతులతో స్వా గతం పలికారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అ ధ్యక్షుడు కందుల ప్రశాంత్, సింగరేణి జాగృతి శ్రీ రాంపూర్ కన్వీనర్ కుర్మ వికాస్, కార్యకర్తలు రత్నాకర్రెడ్డి, తొంగల రమేశ్, వినయ్ పాల్గొన్నారు. జర్నలిస్టు మునీర్ కుటుంబానికి పరామర్శపాతమంచిర్యాల: జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఎండి.మునీర్ గత శనివారం మృతిచెందగా.. శుక్రవారం ఆయన నివాసంలో మునీర్ భార్య రిజ్వానా, కుమారుడు మయూర్, కూతుళ్లు ముజిభా, రేష్మా, తన్వీర్ గౌసియా, తమ్ముళ్లు సందాని, మొహియోద్దీన్లను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునీర్ తెలంగాణ ఉద్యమానికి చాలా కృషి చేశారని అన్నారు. ఐఎఫ్టీయూ నాయకులు బ్రహ్మానందం పాల్గొన్నారు. లక్సెట్టిపేటలో..లక్సెట్టిపేట: ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల నుంచి హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యంలో లక్సెట్టిపేట పట్టణంలో ఆగారు. పట్టణానికి చెందిన జాగృతి నాయకురాలు నిషా, విశ్రాంత ఉద్యోగి విజయసారథి ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జన్నారం మాజీ జెడ్పీటీసీ ఎర్రం చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు. గులాబీ శ్రేణుల దూరం.. కవిత పర్యటనకు బీఆర్ఎస్తోపాటు టీబీజీకేఎస్ నేతలు దూరంగా ఉన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె సింగరేణి క్షేత్రంలో పర్యటించిన సందర్భంలో నేతలెవ్వరూ హాజరు కాలేదు. కనీసం మర్యాద పూర్వకంగానూ కలువకపోవడం సింగరేణిలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. గతంలో ఆమె సింగరేణి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కార్మికులు, కార్మిక నేతలతో పెద్ద కాన్వాయ్ వెంట ఉండేది. నేతల హడావిడి చెప్పనక్కర్లేదు. కానీ నేడు ఎలాంటి హంగు ఆర్భాటాలు కనిపించలేదు. పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దూరంగా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. -
మాంత్రికుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను మంత్రపూజల ద్వారా నయం చేస్తానని ఆమైపె అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళకు అనారోగ్య సమస్య ఉండడంతో కుటుంబ సభ్యులు ఓ వ్యక్తి సలహా మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా సార్ఖానికి చెందిన అభినయ్కుమార్ను పిలిపించారు. అభినయ్కుమార్ గురువారం రాత్రి పూజల పేరిట మహిళను గదిలోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు మహిళ కేకలు వేయగా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వన్టౌన్ పోలీసులు అభినయ్కుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాధిత మహిళకు అవసరమైన వైద్య, మానసిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వన్టౌన్ సీఐ సునీల్కుమార్ పాల్గొన్నారు. -
చివరి దశకు సిరాల
నిర్మల్అపు‘రూప’ శిల్పి మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. అన్నాడు ఓ సినీ కవి. ఆ పదాలను గట్టిగా పట్టుకున్న కుభీర్కు చెందిన యువకుడు శిల్ప కళలో రాణిస్తున్నాడు. నీటి కోసం ఎదురుచూపు శనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 202510లోu ఏడాదికి 200 పని దినాలు కల్పించాలి నిర్మల్చైన్గేట్: ఉపాధి హామీ కూలీల కూలి రూ.600 పెంచి ఏడాదికి 200 రోజులు పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. ఉపాధి హామీ పనుల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు ఇతర సిబ్బంది పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధి బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు పెంచాలని, ఉదయం సాయంత్రం రెండు ఫొటోలు తీసి పంపాలనే నిబంధన తొలగించాలన్నారు. ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బర్కుంట గంగారం, తిమ్మాపురం ముత్తన్న నాయకులు చింతకుంట శంకర్, కదాం దినేష్, బీరోళ్ల నవీన్, కూలీలు కూతాడి విజయ, నీలగిరి పోసాని పాల్గొన్నారు. భైంసారూరల్: రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు చివరి దశకు చేరుకున్నారు. దీంతో 1,800 ఎకరాల ఆయకట్టు రైతుల్లో సాగునీటి ఆశలు చిగురిస్తున్నాయి. ముధోల్ ఎమ్మె ల్యే రామారావు పటేల్ పనులను పర్యవేక్షిస్తూ అధి కారులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించి, అధికా రులతో సమీక్ష నిర్వహించారు. రైతులతో సమావేశమై, త్వరలోనే నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన తూము నిర్మాణం.. ప్రాజెక్టు ప్రధాన తూము నిర్మాణం చివరి దశలో ఉంది. పాత తూము స్థానంలో సిమెంటుతో కొత్త షెట్టరు నిర్మిస్తున్నారు. నిజాం కాలంలో 1902లో రాతి, సున్నంతో నిర్మించిన పాత తూము లీకేజీలతో నీరు వృథాగా బయటకు వచ్చేది. భారీ వర్షాలతో తెగిపోయిన ఈ తూమును ఇప్పుడు నూతన టె క్నాలజీతో నిర్మిస్తున్నారు. సీసీ డ్రైనేజీ నుంచి నీరు తూము ద్వారా కాలువలకు చేరేలా డిజైన్ చేశారు. కట్ట నిర్మాణం.. తెగిపోయిన కట్టను చదును చేసి, దాని అడుగు భాగంలో బండరాళ్లు పేర్చారు. చుట్టూ మట్టి, మొరం వేస్తున్నారు. ప్రధాన కట్ట నిర్మాణం చివరి దశలో ఉంది. భారీ టిప్పర్లతో మొరం, మట్టి వేస్తూ, నీరు నిల్వ ఉన్నా కట్ట తెగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వందల ఏళ్ల క్రితం నిర్మితమైన సిరాల ప్రాజెక్టు భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినా విపత్తు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది వర్షాకాలం ముందు పనులు పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాలువలకు మరమ్మతు.. ప్రాజెక్టు పనులు తుది దశలో ఉన్న సమయంలో కాలువలపై దృష్టి సారించాలని ఇరిగేషన్ అధికారులను రైతులు కోరుతున్నారు. ఎనిమిది కిలోమీటర్ల సీసీ కెనాల్కు భారీ వర్షాల కారణంగా అనేకచోట్ల గండ్లు పడ్డాయి. కెనాల్లోని మట్టి, చెత్త, పిచ్చిమొక్కలను తొలగించి, తూముల మరమ్మత్తులు చేపట్టాలి. సిరాల, ఇలేగాం గ్రామాల మధ్య కెనాల్ పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. కాలువలపై శ్రద్ధ పెడితే పంట పొలాలకు నీరు సజావుగా అందుతుందని రైతులు పేర్కొంటున్నారు. నీరందిస్తాం సిరాల ప్రాజెక్టు పనులు చివరి దశకుచేరుకున్నాయి. పనులు పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు నీరందించే విషయంపై దృష్టిపెడతాం. ఇప్పటికే ప్రధాన కట్ట పనులు చివరి దశకుచేరుకున్నాయి. ప్రధాన తూము, షెట్టరు పనులు కొనసాగుతున్నాయి. ఆయకట్టు రైతులకు నీటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – అనిల్, ఇరిగేషన్ డీఈ న్యూస్రీల్సీసీ రోడ్ల పరిశీలన లక్ష్మణచాంద: మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను పంచాయతీరాజ్ డీఈ యాదగిరి శుక్రవారం పరిశీలించారు. మండలంలోని రాచాపూర్, పొట్టపెల్లి(కె) గ్రామంలో ఇటీవల వేసిన సీసీ రోడ్లను, దుర్గామాత షెడ్డును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏఈ సంజయ్కుమార్ ఉన్నారు. 80శాతం పనులు పూర్తి సాగునీటిపై రైతుల ఆశ వేగంగా ప్రధాన తూము పనులు సిరాల ప్రాజెక్టు నిర్మాణం ఈ ఏడాది పూర్తయి పంటలకు నీరు అందుతుందని ఆయకట్టు రైతులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా నీరు అందక రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. సిరాల ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో తానూరు మండలంలోని ఝరి, బెంబర, బోరిగాం, ఉమ్రి, బోల్సా, బోసి, బోంద్రట్, భైంసా మండలంలోని ఇలేగాం, పాంగ్రి, మాంజ్రి, దేగాం గ్రామాల్లో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి. ప్రాజెక్టులో నీరు నిలిచి ఉంటే, భూగర్భ జలాలు పెరిగి, తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తేవి కావు. ప్రధాన తూము, షెట్టరు పనులు -
● శిల్పాలతో ఉపాధి పొందుతున్న సాయిశ్యాం ● శిల్పకళాధామం ఏర్పాటుచేసి పలువురి ఉపాధి.. ● ఐదు జిల్లాలకు ఇక్కడి నుంచే విగ్రహాలు..
శిల్పాలు చెక్కుతున్న సాయిశ్యాంకుభీర్: మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. అన్నాడు ఓ సినీ కవి. ఆ పదాలను గట్టిగా పట్టుకున్న కుభీర్కుచెందిన యువకుడు తన పూర్వీకుల నుంచి వస్తున్న కళను నమ్ముకున్నాడు. ఆదరణ లేని వృత్తే అయినా.. దానిని సరికొత్తగా ఆవిష్కరించాలనుకున్డాను. ఆధునిక విధానంలో పాత కళకు ప్రా ణం పోస్తున్నాడు. తాను ఉపాధి పొందుతూ మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. కుభీర్లో శిల్పకళకు ఆధునిక రూపం ఇస్తూ, కళాకారుడు సాయిశ్యాం. విశ్వకర్మ శిల్పకళాధామాన్ని స్థాపించి, తనకు ఉపాధి సమకూర్చుకోవడమే కాక, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు. ఈ కళాధామంలో ప్రస్తుతం ఐదుగురు యువకులు పనిచేస్తుండగా, అవసరాన్ని బట్టి మరికొందరిని కూడా నియమించుకుంటున్నారు. కళాకారుల వంశంసాయిశ్యాం కుటుంబం మొత్తం కళాకారులతో నిండి ఉంది. ఆయన తాత వడ్ల పెద్దన్న కట్టెతో విగ్రహా లు తయారు చేయడంతోపాటు జానపద గురుభో ద పాటలు రాసేవారు, పాటలు పాడేవారు. తండ్రి శంఖర్ సిమెంట్, మట్టితో విగ్రహాలు తయారు చే స్తారు. తమ్ముడు నరేశ్ విగ్రహాల తయారీలో సాయిశ్యాంకు సహకరిస్తూ, నైపుణ్యం కలిగిన పెయింటర్గా కూడా పనిచేస్తున్నాడు. సాయిశ్యాం ఇంటర్మీడియట్, డ్రాయింగ్లో టీచర్ ట్రైనింగ్ కోర్సు(టీటీసీ) పూర్తి చేసి, ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా క్రాఫ్ట్, డ్రాయింగ్ బోధిస్తూ, మిగి లిన సమయంలో కళాధామంలో పనిచేస్తున్నారు. విగ్రహాల తయారీలో నైపుణ్యంసాయిశ్యాం నల్లరాయి, కృష్ణశిల, ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ), సిమెంట్, సుద్దమట్టితో రకరకాల విగ్రహాలు తయారు చేస్తారు. లక్ష్మీ, సరస్వతి, గణపతి, కృష్ణుడు, శంకరుడు, ఎల్లమ్మ, పోచమ్మ వంటి దేవీదేవతల విగ్రహాలతోపాటు, శివాజీ, వివేకానంద, గాంధీజీ, అంబేద్కర్ వంటి దేశ నాయకుల, మహాత్ముల విగ్రహాలను కూడా నైపుణ్యంతో రూపొందిస్తారు. ఆర్డర్, అడ్వాన్స్ ఆధారంగా విగ్రహాలు తయారు చేసి ఇస్తారు. ఇక్కడి నుంచి నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రలోని గ్రామాలకు విగ్రహాలు పంపిస్తాడు. కళాధామంలో పనిచేసే కార్మికులకు జీతాలు, ఇతర ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చవుతాయని సాయిశ్యాం తెలిపారు. అవార్డులు, గుర్తింపుసాయిశ్యాం కళాప్రతిభకుగాను అనేక అవార్డులు అందుకున్నారు. 2013లో హైదరాబాద్లో ట్రూ ఇండియన్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి హోం మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా అవార్డు పొందారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం, 2018 లో గోల్కొండ క్రాఫ్ట్స్ సంస్థ నుంచి అవార్డులు అందుకున్నారు. 2025 జనవరి 26న కలెక్టర్ అభిలాష చేతుల మీదుగా ప్రశంసా పత్రం పొందారు. భవిష్యత్ ఆకాంక్షలు2015లో స్థాపించిన విశ్వకర్మ శిల్పకళాధామం ద్వారా సాయిశ్యాం అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని, సహాయం అందితే మరింత మందికి శిల్పకళ నేర్పించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని సాయిశ్యాం తెలిపారు. -
గురుకులంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు
సారంగపూర్:మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయం ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్లలో గురుకులంలో చదువుకున్న అందుబాటులో ఉన్న విద్యార్థులందరికీ పాఠశాల సిబ్బంది ఆహ్వాన పత్రాలు పంపించారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను, పాఠశాలతో తమకున్న అనుబంధాలను పంచుకున్నారు. అనంతరం అప్పట్లో తమకు చదువు నేర్పిన గురువులను సత్కరించారు. అప్పటి ప్రిన్సిపాల్ చలపతి, ప్రస్తుత ప్రిన్సిపాల్ సంగీత, గతంలో ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ నూతన కార్యవర్గం
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక సీఈఆర్ క్లబ్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ సమావేశానికి మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలకు చెందిన అసోసియేషన్ సభ్యులు, ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్లుగా ఆర్.నారాయణరెడ్డి, గడ్డం జగన్నాథం, కేవీ ప్రతాప్, జి.భీమ్లానాయక్, అధ్యక్షుడిగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కె.భాస్కర్, బి.గోవర్ధన్ రెడ్డి, జి.ఈశ్వర్, వి.మహేందర్, మారిన శృతి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.తిరుపతి, కోశాధికారిగా యు.శంకర్, సంయుక్త కార్యదర్శులుగా మారిన వెంకటేశ్వర్లు, ఆర్.గోపాల్, సాంబశివరావు, ఎల్.హరిలాల్, అంకం సరిత, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పి.భానయ్య, కార్యవర్గ సభ్యులుగా మారిన చందర్, గుజ్జ మల్లేశ్, ఆర్వీ రామకృష్ణ, కె.మల్లేష్, సతీష్, రెడ్డి సతీష్, జి.శ్రీధర్, పి.శ్రీనివాస్, ఏ.జ్యోతి, జి.వెంకన్న, క్రాంతికుమార్, శరత్యాదవ్, సలహాదారులుగా ఎం.లక్ష్మణ్, ఆర్.శ్రీనివాస్రెడ్డి, పి.సాంబయ్య, సదానందం, వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. -
పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి
లోకేశ్వరం: రైతులు పంట మార్పిడి పద్ధతి అవలంబించాలని ముధోల్ ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ నర్సయ్య అన్నారు. మండలంలోని రాజూర గ్రామ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం గురువా రం నిర్వహించారు. వానాకాలంలో సాగుచేసే పంటలపై రైతుల ప్రశ్నలకు నర్సయ్య సమాధానం ఇచ్చారు. జీవన ఎరువుల వాడకం, రసాయనిక పురుగు మందుల వాడకం, త క్కువ యూరియా వడటం ద్వారా ఆదాయాన్ని ఎలా పొందాలో వివరించారు. మరో శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ చెట్లు పెంచడం వలన పర్యావరణానికి కలిగే మేలును తెలియజేశారు. వివిధ పంటలకు అవసరం మేరకు రసాయనాల వినియోగిస్తే పంట దిగుబడి శాతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో లోకేశ్వరం ఇన్చార్జి పశువైద్యాధికారి రవీందర్, ఏవో గిరిరాజ్, ఏఈవోలు మౌనిక, రుచిత, ఎఫ్పీవో నవీన్ పాల్గొన్నారు. -
గోవులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
● జిల్లా సరిహద్దులో ఏడు చెక్ పోస్టులు ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. గోవుల రవాణా విషయంలో వెటర్నరీ డాక్టర్ నిబంధనలు పాటించాలని సూచించారు. గో వుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా సరిహద్దులో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపా రు. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఏ ర్పాటు చేసిన చెక్పోస్టును, కొండాపూర్ సెంట్థామస్ స్కూల్ వద్ద గల చెక్ పోస్టును గురువారం ఎస్పీ తనిఖీ చేశారు. సిబ్బందికి తగు సూచనలు చే శారు. గోవుల రవాణాను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక చెక్ పోస్టులలో పోలీ సు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గోవుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చెక్ పోస్ట్ల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు..పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో మత సామరస్యానికి భంగం కలిగించేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా, అస భ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. అంతేకా కుండా జిల్లా ముఖ్య కార్యాలయంలో సోషల్ మీడియా సెల్ ప్రత్యేకంగా పరిశీలన చేస్తుంటారని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుబక్రీద్ పండగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చోట్ల ముందస్తుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మతపెద్దలతో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి, భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి భైంసాటౌన్: ప్రజలు పండుగలను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని ఏఎస్పీ అవినాష్కుమా ర్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో హిందూ, ముస్లిం మతపెద్దలతో పీస్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ పండు గ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు నమ్మవద్దని, ఏదైనా సమస్య తలెత్తితే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు సహించేది లేదన్నారు. ఆర్డీవో కోమల్రెడ్డి మాట్లాడుతూ.. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి.రాజేశ్కుమార్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, సీఐ గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ శాంతియుతంగా నిర్వహించుకోవాలి ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకల్యాణి నిర్మల్టౌన్: బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్న కల్యాణి సూచించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రానున్న బక్రీద్ పండుగకు మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమంగా గోవులను వధిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, అర్బన్ తహసీల్దార్ రాజు, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
భైంసాటౌన్: నేటి ఆధునిక కాలంలో మన సంస్కృతి, సంప్రదాయాలను విస్మరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ వాటిని కాపాడుకోవాలని విశ్వమాంగళ్య సభ దక్షిణ భారత ఇన్చార్జి గాయత్రి లోమ్టే అన్నారు. గురువారం భైంసాకు వ చ్చిన ఆమె స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. మహిళలకు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలపై వివరించేందుకు విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలి పారు. ఇందులో భాగంగా మహిళలకు ధ్యా నం, ప్రాణాయామం, యోగా, శ్లోకాలు నేర్పి స్తున్నట్లు వివరించారు. తద్వారా మహిళల్లో దేశభక్తిని పెంపొందింపచేయడం, విద్యార్థి దశనుంచే బాలికలకు మాతృత్వంపై అవగా హన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. స మావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అ లివేణి, మండల అధ్యక్షులు సుష్మారెడ్డి, పట్ట ణ అధ్యక్షుడు రావుల రాము పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
లక్ష్మణచాంద: మండలంలో వరి కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని తిర్పెల్లి, లక్ష్మణచాంద గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను గురువారం సందర్శించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున కల్లాల్లో ధాన్యం తడిసిపోతుందని తెలిపారు. రైతులకు నష్టం జరుగకుండా కొనుగోళ్లు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. గన్నీ సంచులు త్వరగా ఇచ్చి తూకం వేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. కూలీల సంఖ్య పెంచాలని, లారీల సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఆర్ఐ నరేందర్రెడ్డి, సిబ్బంది దినకర్ తదితరులు ఉన్నారు. -
పకడ్బందీగా.. ప్రణాళికాబద్ధంగా..
● సర్కారుబడులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి ● నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు ● ఇప్పటికే ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ● తాజాగా రాష్ట్రస్థాయిలో శిక్షణకు ఎంఈవోలునిర్మల్ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పాఠశాల విద్యాశాఖను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయ డం, నాణ్యమైన విద్య అందించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు మౌలిక సదుపాయాలు సమకూర్చడం, ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ అందించడం, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టింది. జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 19 మండలాల పరిధిలో 735 పాఠశాలలు ఉండగా, 69 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఎంఈవోల నియామకంపాఠశాలల్లో విద్యా నాణ్యతను మెరుగుపరిచేందు కు పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండల స్థాయిలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు (ఎంఈవోలు)ను నియమించి, వారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మాన వ వనరుల కేంద్రంలో మూడు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమే శ్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా వంటి ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని, పాఠశాలల పర్యవేక్షణ, విద్యా నాణ్యత మెరుగుదలకు సంబంధించిన సూచనలు అందించారు. జిల్లాలోని 19 మండలాలకు చెందిన ఎంఈవోలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. జూన్ 6 నుంచి బడిబాట..2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ‘‘బడిబాట’’ కార్యక్రమాన్ని జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రామసభలు, ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను గుర్తించడం, డ్రాప్ఔట్ విద్యార్థుల ను తిరిగి చేర్పించడం, తల్లిదండ్రుల సమావేశాలు, పాఠశాలల అలంకరణ, పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్ల పంపిణీ వంటి కార్యకలాపాలు ఉన్నాయి. అలాగే, ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ దినోత్సవం, బాలికా విద్యా దినోత్సవం నిర్వహించి, బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తారు. డిజిటల్ సాంకేతికత, మౌలిక సదుపాయాలను తల్లిదండ్రులకు పరిచయం చేయడం, క్రీడా పోటీలు, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి.సమర్థవంతమైన బోధన కోసం..విద్యా నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతులపై శిక్షణ అందించడం అవసరమని ప్రభుత్వం భావించింది. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ మూడు విడతలుగా వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లాస్థాయి నుంచి సబ్జెక్టు వారీగా ఎంపికై న డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ (డీఆర్పీలు) రాష్ట్రస్థాయిలో ఎస్సీఈఆర్టీ, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. వీరు మండలస్థాయిలో ఎంపికై న మాస్టర్ రిసోర్స్ పర్సన్స్ (ఎంఆర్పీలు)కు శిక్షణ అందించారు. ఈ శిక్షణలో ఆధునిక బోధనా పద్ధతులు, ఎల్ఐపీ, ఎఫ్ఎల్ఎన్ వంటి నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించే అంశాలపై దృష్టి సారించారు. ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తి కాగా, మూడో విడత శిక్షణ ఈనెలాఖరు నాటికి ముగియనుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల సంఖ్యను పెంచడం, విద్యా సంవత్సరంలో అమలు చేయాల్సిన కార్యచరణలపై కూడా చర్చించింది. బడుల బలోపేతం కోసం.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల నుంచి మొదలుకుని డీఈవోల వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ విద్యా సంవత్సరం సర్కారు బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తూ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. పాఠశాలల్లో నాణ్యమైన విద్య విద్యార్థులకు అందేలా పటిష్టపర్యవేక్షణ ఉంటుంది. – పి.రామారావు, డీఈవో -
నీటి లభ్యత బట్టి పంటలు వేసుకోవాలి
● ముందస్తు వర్షాలు సాగుకు అనుకూలం ● మక్క, సోయా, పసుపు విత్తుకోవచ్చు ● విత్తన కొనుగోలుకు రశీదు తప్పనిసరి ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఏవో అంజిప్రసాద్ నిర్మల్చైన్గేట్: పంటల అవసరాలు, నీటి లభ్యతను బట్టి సాగును నిర్ణయించాలనీ జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో జిల్లాలో కురుస్తున్న ముందస్తు వర్షాలు సాగుకు అనుకూలమేనని తెలిపారు. తేలికపాటి భూముల్లో ఆరు, బరువు నేలల్లో ఏడు సెంటీ మీటర్ల వర్షం కురి సి మట్టి తేమగా ఉంటే మొక్కజొన్న, సోయా, పసు పు విత్తుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో వర్షాలను అంచనా వేయలేమని, నీటి సౌకర్యం ఉన్న పంటలకై తే డోకా లేదన్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలని తెలిపా రు. గురువారం నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఏవో మాట్లాడారు. ముందస్తు వర్షాలతో సాగుపై సందేహాలు, విత్తనాల ఎంపిక, ఎరువుల లభ్యతపై రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రైతు: పసుపులో అడుగు రోగం రాకుండా ఏటువంటి చర్యలు తీసుకోవాలి? – గంగారెడ్డి, పెంబి డీఏవో: పసుపులో అడుగు రోగం రాకుండా ట్రైకో డెర్మా విరిడిని వాడాలి. ప్రస్తుతం ఇది ఆదిలా బాదులో దొరుకుతుంది. మీరు మీ సంబంధిత ఏఈవోను సంప్రదిస్తే వారు తెప్పిస్తారు. రైతు: ఐదు రోజులుగా వర్షం కురుస్తుంది. మొక్కజొన్న పంట వేసుకోవచ్చా? – ముత్యం, రాచాపూర్, లక్ష్మణచాంద డీఏవో: నీటి వనరులు అధిక మొత్తంలో ఉంటే మొ క్కజొన్న పంటకు అనుకూలం. జూన్ మొదటి వారంలో మేలైన రకం చూసి విత్తుకోవచ్చు. రైతు: నాకు రెండెకరాల భూమి ఉంది. ఇప్పుడే పసుపు విత్తుకోవచ్చా? – మల్లేశ్, పీచర, లక్ష్మణచాందడీఏవో: సందేహం లేకుండా పసుపు విత్తనాలు వేసుకోవచ్చు. ముందుగా విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తిన తర్వాత అడుగు మందులు కూడా వేసుకోవచ్చు. కత్తెర పురుగు వస్తే విషపు ఎరను తయారు చేసి చల్లాలి. అదనపు సమాచారం కోసం స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తే మరిన్ని సూచనలు సలహాలు ఇస్తారు. రైతు: దాన్ 75 రకం జిల్లాలో అందుబాటులో ఉన్నాయా? – మత్త రాజా బాబు, (మందపల్లి, పెంబి.), నారాయణ (నర్సాపూర్(జి))డీఏవో: దాన్–75 అనే కొత్తరకం వరి విత్తనాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ తయారు చేసింది. ఈ విత్తనాలు మార్కెట్లోకి ఇంకా రాలేదు. కానీ రాజేంద్రనగర్ యూనివర్సిటీకి వెళ్తే ఇస్తున్నారు. జిల్లాకు ఈ విత్తనాలు వస్తే రైతులందరికీ సమాచారం ఇస్తాం. రైతు: జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? – గంగారెడ్డి, నర్సాపూర్(జి))డీఏవో: జీలుగు విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు దిలావర్పూరు మండలంలో రైతులకు పంపిణీ చేశాం. ఎకరానికి 10 కిలోల జీలుగ విత్తనాలకు ఒక యూరియా బస్తా మాత్రమే వాడాలి. రైతు: నకిలీ విత్తనాలు ఎలా గుర్తించాలి? – రాజన్న, జామ్, సారంగాపూర్డీఏవో: నకిలీ విత్తనాలు గుర్తించాలంటే మనం తీసుకున్న విత్తనాల పాకెట్ మీద ఉన్న లాట్ నంబర్ని బిల్లు మీద తప్పనిసరిగా రాయించా లి. అలా షాపు యజమాని రాయకపోతే అది నకిలీ విత్తనంగా భావించాలి. అలా మీ దృష్టికి వస్తే వ్యవసాయ శాఖలు అధికారులకు ఫిర్యాదు చేయాలి. రైతు: వరిలో ఏయే విత్తనాలు మేలైనవి; – బలరాం, లోకేశ్వరండీఏవో: వరిలో చాలా రకాల విత్తనాలు అందుబా టులో ఉన్నాయి. అందులో దోమ, అగ్గి తెగులు వంటి చీడపీడలను తట్టుకునే రుద్రూర్–1200, జేజీఎల్–27356, 1248, 11118, 1798, 2 –44, 5 –5204. ఆర్ఎస్ఆర్–15048, కునారం– 1638, ఎంటీ యూ–1262 రకాలు మేలైనవిగా చెప్పొచ్చు. ప్రభుత్వం సూ చించిన 33 రకాల విత్తనాలను వేసుకుంటే బో నస్ వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది. రైతు: మక్క, సోయా విత్తనాలు ఎప్పటి వరకు వేసుకోవచ్చు? – భూమన్న, కుంటాలడీఏవో: ముందస్తుగా కురుస్తున్న వర్షాలు మక్క. సోయా సాగు చేసేందుకు అనుకూలమే. నేల బాగా తడిసి తేమతో ఉంటే విత్తనాలు విత్తుకోవచ్చు. జూలై 15 వరకు కూడా సాగు చేసుకోవచ్చు. విత్తనం వేసిన తర్వాత వర్షాలు లేక పోతే ఎండకు విత్తనం కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. నీటి సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచు కుంటే మంచిది. రైతు: ఎర్రచౌక భూమిలో ఎటువంటి పంటలు వేయాలి? – దాసరి సుజాత, విట్టాపూర్, కుంటాలడీఏవో: ముందస్తు వర్షాలు కురుస్తున్న కారణంగా మొదట నేలని పూర్తిగా చదును చేసుకోవాలి. జూన్ మొదటి వారంలో ఎర్రచౌక భూములలో తొందరగా చేతికి వచ్చే పంటలను మాత్రమే వేసుకోవాలి. రైతు: మా పంట పొలాల్లో నీరు బాగా నిలువ ఉంటుంది. ఈ భూమిలో ఎటువంటి పంటలు వేసుకోవచ్చు? – శంకర్, మహాగావ్, భైంసాడీఏవో: మొదట మీ పంట పొలాల్లో ఉన్న నీటిని నాగలి పెట్టి కాలువలు తీసి బయటకు పంపించాలి. నీరు ఆగకుండా చూసుకోవాలి. ఇటువంటి నేలలో కంది, పత్తి వంటి పంటలు వేసుకోవచ్చు. -
ధాన్యం తిప్ప పంపిన మిల్లర్
నర్సాపూర్(జి): ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు అధికారులు తడిచిన ధాన్యం కొంటామని చెబుతున్నారు. మరోవైపు మిల్లర్లు ధాన్యం సరిగా లేదని తిప్పిపంపుతున్నారు. మండలంలోని డొంగుర్గాంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లను చేపట్టారు. తురాటి గ్రామానికి చెందిన గొర్ల ప్రవీణ్కు చెందిన ధాన్యాన్ని ఈనెల 27న తూకం వేసి ట్రాక్టర్లలో కుంటాల రైస్ మిల్లుకు తరలించారు. ట్రక్ షీట్లో మాత్రం రైతు, రైస్ మిల్లు పేర్లు, కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల వివరాలు ఏమీ లేకుండా తరలించారు. ఇలా తరలించిన ధాన్యాన్ని రెండు మూడు రోజుల తర్వాత మిల్లర్లు తేమశాతం సరిగా లేదనే కారణంతో గురువారం వెనక్కి పంపించారు. దీంతో సదరు రైతు చేసేదేమీ లేక మళ్లీ ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు. -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. వేడుకలకు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వేదికను పూలతో అలంకరించి, ప్రొటోకాల్ నిబంధనల మేరకు సీటింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థులతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంటులు, షామియానాలు, తాగునీరు, అల్పాహారం, పండ్ల సరఫరా నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. పరిసరాలలో శుభ్రత పాటించాలని, పోలీస్, అగ్నిమాపక శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యశాఖ అత్యవసర మందులతోసహా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం సహా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యంబస్తాతో కలెక్టరేట్కు..
● తేమ సాకుతో కొనడం లేదంటూ ఆవేదన.. ● కలెక్టర్ చాంబర్ ఎదుట రైతు నిరసన నిర్మల్: తేమ సాకుతో తమ ధాన్యం కొనడం లేద ని, కోతలు ఎక్కువగా పెడుతున్నారని ఓ రైతు కు టుంబం ధాన్యంతో కలెక్టరేట్కు వచ్చింది. లక్ష్మ ణచాంద మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు లింగన్న, శ్రీనివాస్ ఇద్దరూ గురువారం కలెక్టరేట్కు వచ్చారు. తమవెంట తీసుకువచ్చిన ధాన్యం బస్తాను మోసుకుంటూ కలెక్టర్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వడ్లు పోసి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకున్నారు. కొర్రీలు పెడుతున్నారు..బాబాపూర్ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో సుమారు 600 బస్తాల ధాన్యం కొనడం లేదని వారు పేర్కొన్నారు. ధాన్యం తేమశాతం రావడం లేదని, ఎక్కువ కటింగ్ చేస్తానని ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోయారు. తమ బాధ తెలుపాలన్న ఉద్దేశంతోనే వడ్లబస్తాలతో కలెక్టరేట్కు వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్ను కలవగా, ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. -
ఘనంగా సావర్కర్ జయంతి
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని బీజేపీ కా ర్యాలయంలో బుధవారం వినాయక్ దామోద ర్ సావర్కర్ జయంతిని నిర్వహించారు. ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ మాట్లాడుతూ.. సావర్కర్ దేశభక్తిని బ్రిటీష్ హింస కదిలించలేదని తెలిపా రు. ఆయన ధైర్యం, పోరాటం ఎప్పటికీ మరువరాదని పేర్కొన్నారు. ఆయన త్యాగాలు దేశ అభివృద్ధికి దీప స్తంభమని కొనియాడారు. కా ర్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసె ల అర్జున్, పట్టణాధ్యక్షులు ఆకుల కార్తిక్, సుంకరి సాయి, మండల ప్రధాన కార్యదర్శి విజ య్, నాయకులు గవాస్కర్, రాజు, కుర్మరాజు, రావుల్వార్ విఠల్, విజయ్ పాల్గొన్నారు. -
భూసర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● లైసెన్స్డ్ సర్వేయర్లకు కిట్ల పంపిణీనిర్మల్చైన్గేట్: భూ సర్వే నిర్వహణలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కిట్లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. భూభారతి చట్టాన్ని అనుసరించి భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 113 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు 50 రోజులపాటు ఉదయం, సాయంత్రం శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఏడీ ల్యాండ్ సర్వేయర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలి బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన బక్రీద్ పీస్ కమిటీ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈద్గాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించా రు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, పుకార్లు పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. బక్రీద్ పండుగకు పోలీస్శాఖ త రఫున జిల్లాలో పటిష్ట భద్రత చర్యలు చేపడతా మని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, పీస్ కమిటీ స భ్యులు, అధికారులు పాల్గొన్నారు. సేవలు అభినందనీయం ధర్మసేవ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధర్మసేవ ట్రస్ట్ జిల్లాలోని ఆరు కేజీబీవీల్లో నిర్వహించిన ధీర వెల్నెస్ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. లా భాపేక్ష లేకుండా ఫిబ్రవరి 25నుంచి ఏప్రిల్ 1వరకు జిల్లాలోని ఆరు కేజీబీవీల్లో విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జూ న్ 26న జిల్లాలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, అన్ని ఉన్నత పాఠశాలల్లో ర్యాలీలు నిర్వహిస్తామ ని తెలిపారు. జిల్లా పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలోని కళాజాత బృందాలు గ్రామాల్లో మత్తుపదార్థాల నిర్మూలన, మాదకద్రవ్యాల ద్వారా కలిగే అనర్ధాలపై విశేష అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి డీఈవో పరమేశ్వర్, సమన్వయకర్త లింబాద్రి, ధర్మసేవ మేనేజింగ్ ట్రస్టీ నిశాంత్రెడ్డి, ధీర ప్రో గ్రాం నిర్మల్ కోఆర్డినేటర్ ఎస్.స్రవంతి, డీసీవో గీత, ఏసీఎంవో శివాజీ, కేజీబీవీల ఎస్వోలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పదవొస్తుందా?
● కేబినెట్ బెర్త్ కోసం ఎమ్మెల్యేల పోటాపోటీ ● పార్టీ, నామినేటెడ్ పోస్టులపైనా ఉత్కంఠ ● ‘హస్తం’ పార్టీ ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం మొదలు కావడంతో ఎవరిని ఏ పదవి వరిస్తుందోననే ఉత్కంఠ శ్రేణుల్లో నెలకొంది. ఈ నెల 30న పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే నేపథ్యంలో పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతున్న తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరిని అమాత్య పదవి వరిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకే మంత్రి యోగానికి అవకాశం ఉంది. వీరిలో చెన్నూర్, మంచిర్యాలతోపాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ బెర్త్ కోసం ఢిల్లీ దాకా లాబీయింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సామాజిక వర్గాలు, సీనియర్లు తదితర అంశాల నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందోనని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పదవుల్లో మొండి ‘చెయ్యి’ ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులున్నా వారికి సముచిత అవకాశాలు రాలేదని నిరాశలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆదివాసీ నాయకుడు కోట్నాక తిరుపతి ఒక్కరికే రాష్ట్ర గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆయన పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో జోడోయాత్రలో చురుగ్గా ఉండడంతో మొదటి దఫాలో ఆయనను పదవి వరించింది. ఇక కార్మిక సంఘాల కోటాలో జనక్ప్రసాద్కు రాష్ట్ర కనీస వేతన బోర్డు చైర్మన్గా అవకాశం దక్కింది. ఆ తర్వాత ఎవరికీ పదవు లు దక్కలేదు. ఇటీవల నామినేట్ చేసిన ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎవరికి అవకాశం రాలేదు. అలాగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఉమ్మడి జిల్లా నాయకులకు పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇవ్వలేదు. తర్వాత రాష్ట్ర కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవుల్లో తమకు అవకాశం వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరినప్పటికీ ఎవరికీ అవకాశం రాలేదు. కేడర్లో నారాజ్ ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులున్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా పట్టుకుని కష్టకాలంలోనూ పని చే స్తున్న వారున్నారు. సీనియర్ నాయకులతోపా టు అనేక మంది యువ నాయకులు, మహిళా, విద్యార్థి, యువజన, కార్మిక అనుబంధ సంఘా ల నుంచి అనేక మంది ఉన్నారు. అందరూ తమ స్థాయిని బట్టి పదవుల్లో ప్రాధాన్యతను కోరుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుంచి సీనియర్ నాయకుల పేర్లు పీసీసీ పదవుల్లో చోటు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపారు. వారితోపాటు నాయకులు కూడా తమకున్న పరిచయాలతో గాంధీభవన్లో ఇప్పటికే తమ బయోడేటాలతో కూడిన వివరాలు అందజేశారు. తమకు పదవుల్లో అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. -
గుండేగాం కష్టం తీరేదెప్పుడో!
● ప్రతీ వానాకాలంలో తప్పని ముంపు ● ఇటీవలి అకాల వర్షాలకు ఆందోళన ● పునరావాసం కోసం గ్రామస్తుల నిరీక్షణభైంసా/భైంసారూరల్: వారం రోజులుగా కురుస్తు న్న వర్షాలతో గుండేగాం వాసుల్లో మళ్లీ భయం ప ట్టుకుంది. భారీ వర్షాలు కురిస్తే ఈసారి కూడా నీట మునిగిపోతామని ఆందోళన చెందుతున్నారు. గుండేగాం పునరావాసంపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావడంలేదు. ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ అసెంబ్లీలో పునరావాసం విషయం ప్రస్తావించారు. ఇటీవలే కుంటాలలో నిర్వహించిన భూభారతి రెండో విడత కార్యక్రమానికి హాజరైన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమక్షంలో గుండేగాం పునరావాస విషయం చర్చకు వచ్చింది. ము ధోల్ ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి పునరావాసం కల్పించాలని మంత్రులను కోరారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గతంలోనే సర్వే పూర్తయినా.. గత ప్రభుత్వ హయాంలో అధికారులు సర్వే పూర్తి చేశారు. రూ.200 కోట్లకుపైగా నిధులు అవసరమని ప్రతిపాదించారు. భైంసా మండలం సిద్దూర్ శివా రులో సర్వేనంబర్ 73లో మూడెకరాలు గుర్తించి పు నరావాసం కల్పిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించిన నమూనాలు పూర్తికాలేదు. గత ప్రభుత్వ హయాంలో పునరావా సానికి రూ.66 కోట్లు అవసరమని మరో ప్రతిపాదన పంపించారు. ఈ నిధులు సరిపోవంటూ మరో రూ.33 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించా రు. ఇలా పలుసార్లు ఇచ్చిన నివేదికలన్నీ ప్రభుత్వం వద్దే మగ్గుతున్నాయి. మరోవైపు గుండేగాంవాసులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చు ట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా.. ముంపు స మస్యకు పాలకులు పరిష్కారం చూపడంలేదు. రెండేళ్లుగా పునరావాస కేంద్రంలోనే.. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోనే ఇప్పటికీ గుండేగాం వాసులు ఉంటున్నారు. కమలాపూర్ గుట్ట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రతీరోజు అక్కడి పంట పొలాల్లో పని చేసుకుని సాయంత్రానికి ఇక్కడికే తిరిగివస్తున్నారు. ఇంకొంత మంది ఊరిలోనే ఉంటున్నారు. రోజూ రాకపోకలు కష్టమని వానాకాలంలో నీరొస్తే ఊరు నుంచి బయటికి వెళ్తారు. తగ్గగానే మళ్లీ గుండేగాంకు చేరుకుని ఇబ్బందుల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. గ్రామం : గుండేగాం కుటుంబాలు : 270 ఆయకట్టు : 364 ఎకరాలు ప్రధాన సమస్య : పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఊరిలోకి రావడం, ఏటా గుండేగాం నీటమునగడం. పరిష్కారం : భైంసా సమీపంలోని కమలాపూర్ గుట్టవద్ద పునరావాస గ్రామం ఏర్పాటు చేయడం. ప్రాజెక్ట్ నిర్మాణంతోనే.. పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రతీ వానాకాలంలో గుండేగాం గ్రామం పూర్తిగా నీటమునుగుతోంది. ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఊరు మునగదని గ్రామస్తులకు తేల్చిచెప్పారు. కట్ట నిర్మాణం పూర్తయితే వానాకాలంలో కచ్చితంగా నీరు వస్తుందని గుండేగాం గ్రామస్తులు చెప్పినా అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. గతేడాది భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ గుండేగాంను నీటముంచింది. వాగు పరీవాహక ప్రాంతాల్లో నివాసముంటున్నవారు కట్టుబట్టలతో బయటకువచ్చారు. సమస్య పరిష్కరిస్తాం గుండేగాం గ్రామంలో మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. ఇప్పటికే అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించాను. అధికారులతోనూ సమీక్ష నిర్వహించాం. ఈ వానాకాలంలో గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం ఇచ్చాం. – పవార్ రామారావుపటేల్, ముధోల్ ఎమ్మెల్యే -
వివాహం కావడంలేదని యువకుడు..
సోన్: వివాహం కావడంలేదని మనస్తాపంతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన గోలి సుదర్శన్ (31) ఆరునెలల క్రితం విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. తనకు వివాహం కావడంలేదని మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తిపై కేసు ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఖానాపూర్కు చెందిన జావిద్ ఖాన్పై మంగళవారం కేసు నమోదు చే సినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పట్టణానికి చెందిన అబ్దుల్ అజీజ్ ఇద్దరు కుమారులకు కాంట్రాక్ట్ పద్ధతిలో తహసీల్దార్ కార్యాలయంలో, సిటీ యూనియన్ బ్యాంక్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. వారి వద్ద నుంచి రూ.2లక్షల చొప్పున రూ.4లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితులు వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. ద్విచక్ర వాహనం చోరీఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన దార్ల అశోక్ ద్విచక్ర వాహనం మంగళవారం చోరీకి గురైంది. తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనం కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. -
బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి 60 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం అక్షరాభ్యాస మండపంలో లెక్కించారు. రూ.77,77,746 నగదు, 126 గ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల 440 గ్రాముల మిశ్రమ వెండి, 17 విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డి తెలిపారు. బాక్సింగ్ కమిటీ ఎన్నికశ్రీరాంపూర్: ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన కమిటీని మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ్గౌడ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆరుమల్ల రాజు, ప్రధాన కార్యదర్శి కే.దేవేందర్ను ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
వలసదారులూ వెళ్లిపోండి...!
● దేశం విడిచి వెళ్లాలని మలేషియా ప్రభుత్వం ఆంక్షలు ● నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న వారికి క్షమాభిక్ష పథకం అమలు ● ఉమ్మడి జిల్లాలోని వలస కార్మికుల్లో ఆందోళన నిర్మల్ఖిల్లా: బతుకుదెరువుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వందలాది మంది కార్మికులు విజిట్ వీసాపై మలేషియా వెళ్లారు. కానీ అక్కడి ప్రభుత్వం వలస కార్మికులను తిరిగి వెళ్లి పోవాలని ఆంక్షలు విధించడంతో ఆందోళన చెందుతున్నారు. వీసా నిబంధనలకు విరుద్ధంగా విజిట్ వీసాపై వచ్చి అక్రమ వలసదారులుగా ఉంటున్న వారిని తక్షణమే స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ అక్కడి ప్రభుత్వం తాజాగా ‘క్షమాభిక్ష’ (ఆమ్నెస్టీ) పథకం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం మలేషియా దేశంలో పాస్పోర్ట్ లేకుండా ఉన్నవారితో పాటు తాత్కాలిక వర్క్ వీసాలు, విజిట్ పర్మిట్ వంటివి గడువు ముగిసినా అక్కడే తలదాచుకుంటున్న వలస కార్మికులు వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. క్షమాభిక్ష పథకం ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేవారు ఎటువంటి జైలు శిక్ష లేకుండానే 500 రింగిట్లు, మనదేశ కరెన్సీలో రూ.10వేలు జరిమానా చెల్లించి తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. పాస్పోర్టు ఉన్నప్పటికీ, వీసా గడువు ముగిసిన వారితో పాటు, వీసాలు లేని వారందరినీ ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ ఆధారంగా పక్షం రోజుల్లో రిటర్న్ జర్నీకి అవకాశం కల్పించింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న వలసదారులందరూ మలేషియాలోని లాబువాన్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంటు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 500 మంది.. నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి కోసం మలేషియా వెళ్లిన వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 500 మంది వరకు ఉండవచ్చని ఎన్ఆర్ఐ రాష్ట్ర కమిటీ అడ్వైజరీ మెంబర్ స్వదేశ్ పరికిపండ్ల పేర్కొంటున్నారు. ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని వెళ్లిన వారంతా తాజా నిబంధనలతో స్వస్థలాలకు తిరిగి రావాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా వేలాది మంది మలేషియాలో ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలైన దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలతో పాటు మలేషియా కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలో మలేషియాలో ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2,500 మంది వరకు ఉండగా తాజా నిబంధనలతో అందులో 500 మంది స్వదేశాలకు తిరిగి రావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి గడువు 2026, ఏప్రిల్ 30 వరకు నిర్దేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. -
నలభీములకు c/o కుభీర్
● మండల కేంద్రంలో 20 బృందాలు ● ఏడాది పొడవునా చేతినిండా పని ● జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ వంటల తయారీ కుభీర్: నిర్మల్ జిల్లాలోని కుభీర్ నలభీములకు (వంట మనుషులకు) ప్రసిద్ధి గాంచింది. మండల కేంద్రంలో సుమారు 20 బృందాలు ఉన్నాయి. ఒక్కో బృందంలో ఒక మాస్టారు, ఇద్దరు లేదా ముగ్గురు సహాయకులు ఉంటారు. అంతేకాకుండా కూరగాయలు కోయడానికి, చపాతీ, పూరీ, లడ్డూ, బాదుషా తయారు చేయడానికి మహిళలను కూలీకి మాట్లాడుకుని వెంట తీసుకెళ్తారు. జిల్లాలోని వివిధ గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని పలు గ్రామాలకు వంటలు చేయడానికి వెళ్తారు. ఒక్కో శుభకార్యానికి మనుషుల లెక్కన రూ.8 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటారు. ఏడాది పొడవునా పని.. కుభీర్కు చెందిన సుమారు 100 మంది మహిళలు, పురుషులకు ఈ రంగంలో ఏడాది పొడవునా ఉపాధి లభిస్తోంది. వెజ్, నాన్వెజ్తో పాటు లడ్డూ, బాదుషా, జిలేబీ, కాకినాడ కాజా, చపాతీ, పూరీ, మజ్జిగ, కార, బూంద, పాపడాలు, అన్నం, పప్పు, కూరగాయలు.. ఇలా అన్నిరకాల వంటలు చేస్తారు. నాన్వెజ్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల ఫ్రై, బోటి.. ఇలా అన్నిరకాల వంటలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం ఉన్నవారు రెండు నెలల ముందుగానే ఆర్డర్ ఇచ్చి బుక్ చేసుకుంటారు. వారి వద్ద వంటకు సంబంధించిన కొన్ని పాత్రలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తే మరిన్ని పాత్రలు కొనుగోలు చేసుకోవడంతో పాటు మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. ప్రధాన వంటాచార్యులు వీరే కుభీర్కు చెందిన ప్రధాన వంటాచార్యులు ఆరె లక్ష్మణ్, కందూర్ పోతన్న, పెద్ద పోతన్న, బత్తిని సాయన్న, మధు, కిని సంతోష్, బ్రాహ్మణ్ శేఖర్, బ్రాహ్మణ్ శేషు, జరి ముత్యం, సిద్దూర్ పోతన్న, పోతాజీ, సాకలి రాందాస్, కొబ్బాజి పోతన్న, బంక బాబు, బ్రాహ్మణ్ రాజు, చవాన్ విశ్వనాథ్, అడెల్లు, సాయినాథ్, గంగాధర్ ఉన్నారు. చేతినిండా పని మాకు ఏడాది పొడవునా చేతినిండా పని ఉంటుంది. ఎండాకాలంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం, చలికాలంలోనూ చిన్నచి న్న శుభకార్యాలు ఉంటాయి. నావద్ద ముగ్గురు అనుచరులు ఉన్నారు. అవసరమైనప్పుడు మహిళా కూలీలను కూడా తీసుకుంటాను. – బ్రాహ్మణ్ శేఖర్, వంటాచార్యుడు, కుభీర్ ప్రభుత్వం ప్రోత్సహించాలి నేను 20 ఏళ్లుగా వంటలు చేస్తున్నా. ప్రభుత్వం ప్రోత్సాహం అందించి ఆర్థికసాయం అందిస్తే మరిన్ని వంటపాత్రలు కొనుగోలు చేసి మరికొందరికి ఉపాధి కల్పిస్తా. – ఆరె లక్ష్మణ్, వంటాచార్యుడు, కుభీర్ -
తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు
ఆదిలాబాద్: తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం జూన్ 14 నుంచి జూలై 13 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్ సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్ రాజ్, శృంగ్వార్పూర్ ప్రాంతాలు సందర్శించాలనుకునే వారికి గంగా రామాయణ పుణ్యక్షేత్ర ప్యాకేజీ అందుబాటులో ఉందన్నారు. ఉజ్జయిని, త్రయంబకేశ్వర్, మహాకాళేశ్వర్ వంటి ఐదు జ్యోతిర్లింగాలను దర్శించాలనుకునే ప్రయాణికులకు మరో ప్యాకేజీ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఎన్నో సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి కలవారు www. irctctourism.com వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9281030712, 9701360701, 9281495845, 9281030749, 9281030750 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య
తాంసి: మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కప్పర్లకు చెందిన అనుప నారాయణ (32) వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం మద్యం సేవించి పంటచేనుకు వెళ్లాడు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చేను యజమానికి సమాచారం ఇచ్చాడు. యజమాని చేను వద్దకు వెళ్లేసరికి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అంబులెన్సులో రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్చార్జి ఎస్సై రాధిక తెలిపారు. -
క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 18న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–25 జిల్లా ఎంపిక పోటీలు నిర్వహించారు. 200ల మంది క్రీడాకారులు పాల్గొనగా 90 మందిని ఎంపిక చేసి ఆరు టీంలుగా విభజించారు. ప్రతీ టీంను మిగిలిన అన్ని టీంలతో రెండు రోజుల పాటు ఆడించాలని భావించగా వర్షంతో వాయిదా పడింది. మంగళవారం జిల్లాలోని మూడు మైదానాల్లో ఎంపిక పోటీలు నిర్వహించినట్లు హెచ్సీఎల్ సెక్రటరీ కోదాటి ప్రదీప్, కోచ్ పి.ప్రదీప్ తెలిపారు. మంచిర్యాలలోని ఉషోదయ పాఠశాల, గుడిపేట 13వ పోలీసు బెటాలియన్ మైదానం, మందమర్రిలోని సింగరేణి మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆరు టీంలలో ప్రతిభ కనబర్చిన వారిని ఒక టీంగా చేసి, వారిని ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. -
సమయానికి రారు.. పట్టించుకోరు!
హాజీపూర్ పీహెచ్సీ సిబ్బంది సమయానికి రాకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఉదయం సమయానికే తాళాలు తీసినా.. సిబ్బంది మాత్రం సమయం దాటాకే వస్తున్నారని, సాయంత్రం కూడా సమయం కాకముందే తాళం వేసి ఎంచక్కా వెళ్లిపోతున్నారని ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – మంచిర్యాలరూరల్(హాజీపూర్) -
తుర్కం చెరువును సందర్శించిన ట్రైనీ అటవీ అధికారులు
మామడ: మండలంలోని ఎకో టూరిజం సందర్శన కేంద్రం అయిన తుర్కం చెరువును ట్రైనీ అటవీ అధికారులు శిక్షణలో భాగంగా మంగళవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 42 మంది ట్రైనీ బీట్ అధికారులు తుర్కం చెరువుతోపాటు యెంగన్న చెరువు వద్ద వలస పక్షులను ప్రత్యేక కెమెరాలతో వీక్షించారు. చెరువులకు వస్తున్న పక్షుల రకాల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడవిలో పెరుగుతున్న మొక్కల రకాలను తెలుసుకున్నారు. వారివెంట ఎఫ్ఆర్వోలు శ్రీనివాస్రావు, స్వరూప, ఎఫ్ఎస్వో శ్రీనివాస్, పీడీ కొండల్రావు ఉన్నారు. -
ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి నగదు అపహరణ
రెబ్బెన: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి హ్యాండ్బ్యాగ్లో నుంచి నగదు అపహరించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు చింతలమానెపల్లి చెందిన మహిళ మంగళవారం రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వరకు వచ్చింది. అక్కడి నుండి మంచిర్యాల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే కండక్టర్కు చూపించేందుకు తన హ్యాండ్బ్యాగ్లో ఉన్న ఆధార్కార్డును తీసేందుకు బ్యాగు తెరవగా అందులో ఉన్న రూ.15వేలు కనిపించలేదు. దీంతో బస్సును దేవులగూడ వద్ద ఆపి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది బస్సులో ఉన్న ప్రయాణికులందరి బ్యాగులను తనిఖీ చేసినా డబ్బులు లభించలేదు. అయితే రెబ్బెన బస్స్టాప్లో కొంతమంది ప్రయాణికులు బస్సు దిగిపోయారని, వారిలోనే డబ్బులను చోరీ చేసిన ఉండి ఉంటారని పోలీసులు భావించారు. ఘటనతో మంచిర్యాలకు వెళ్లే ప్రయాణికులు సుమారు 1:15 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయమై ఎస్సై చంద్రశేఖర్ను వివరణ కోరగా ఘటనపై బాధితురాలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. -
పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
● డీఈవో రామారావు నిర్మల్ రూరల్: పాఠశాలల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డీఈవో రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో మంగళవారం ప్రారంభమైన చివరి విడత ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ బడులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థుల నమోదు, విద్యా ప్రగతి, విద్యా కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థుల్లో సంపూర్ణ అభివృద్ధి, పాఠశాలల్లో నూతన కార్యక్రమాల అమలు, విద్యార్థులను పోటీ పరీక్షల్లో పాల్గొనేలా చేయడం, విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా చూసుకోవడం తదితర అంశాలపై దృష్టి పెట్టాలని వివరించారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అభినందనలు తెలపాలన్నారు. అనంతరం బాలశక్తి శిక్షణ కార్యక్రమం జిల్లా ఇన్చార్జి దేవిప్రియ మాట్లాడుతూ బాలశక్తి కార్యక్రమం 4 ప్రధాన ఉద్దేశాలను వివరించారు. జూన్ 15 నుంచి జిల్లాలోని 118 ఉన్నత పాఠశాలల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో ఏఎంవో నరసయ్య, సీఎంవో ప్రవీణ్ కుమార్, రీసెర్చ్ ఉపాధ్యాయులు తోడిశెట్టి పరమేశ్వర్, మైసాజి, రాజశేఖర్, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
జొన్న రైతుల తిప్పలు
కుభీర్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల రోజులుగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం జొన్నలు తెచ్చిన రైతులు వర్షంలో ఇబ్బంది పడ్డారు. మార్కెట్ యార్డు నుంచి తెలంగాణతల్లి చౌక్ వరకు రోడ్డువెంట వాహనాలు బారులుతీరాయి. బుధవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తామని అధికారులు చెప్పడంతో మంగళవారం భారీగా రైతులు జొన్నలు తీసుకువచ్చారు. యార్డులో ఇప్పటి వరకు సుమారు 28 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశారు. మంగళవారం లారీలు రాక బస్తాలతో అక్కడే ఉండడంతో జొన్నలతో వచ్చిన వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. వర్షం కారణంగా టార్పాలిన్లు కప్పి ఉంచారు. జొన్నల కొనుగోళ్లు జూన్ 30 వరకు చేస్తామని గతంలో చెప్పారు. జూన్ 17 వరకు టోకెన్లు జారీచేశారు. తీరా ఇప్పుడు కొనుగోలు కేంద్రం ఎత్తేస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపాధ్యాయుల ఎంపిక
నిర్మల్ రూరల్: జిల్లాలోని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపాధ్యాయుల ఎంపికను కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ సురేశ్బాబు ఉపాధ్యాయుల ప్రదర్శనలు పరిశీలించారు. 88 మంది ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఎం.ఎల్లన్న (ఎంపీపీ ఎస్ వానల్పాడు, బైంసా), జాడి శ్రీనివాస్(జెడ్పీహెచ్ఎస్ మస్కాపూర్), ప్రవీణ్కుమార్(ఎంపీపీఎస్ సేవాలాల్ తండా, లోకేశ్వరం)ను ఎంపిక చేసి వీరిపేర్లు హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపినట్లు అధికారులు తెలిపారు. -
వానమ్మా.. జర ఆగమ్మా..!
● వారం రోజులుగా జిల్లాను వీడని వరుణుడు ● కల్లాల్లో తడుస్తున్న ధాన్యం.. ● కొద్ది రోజులు ఆగాలని రైతుల వేడుకోలు ● తేమశాతం పెరగడంతో కోతలుకొనుగోళ్లలో జాప్యంపై ఆందోళనజొన్న రైతులకు నష్టం.. తానూరు: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హిప్నెల్లి, బెంబర, తానూరుతోపాటుఆయా గ్రామాల్లో కొతకు వచ్చిన జొన్నపంట నెలావాలింది. కంకులకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్: ‘ఒక్కో యేడు ఎంత వేడుకున్నా జాడ కూడా ఉండవు. ఈయేడాదేమో.. జరంత ఆగుమంటే కూడా ఆగుతలేవు. గీ వడ్లు పోయేదాకన్నా ఓపిక పట్టమ్మా.. నీకు పుణ్యముంటది. చేసిన కష్టం చేతికందే వేళ.. నీళ్లపాలైతుంటే కన్నీళ్లు అగుతలేవు తల్లీ. ఇప్పటికే తాలుతప్ప అంటూ కోతలు పెట్టే మిల్లర్లు తడిసిన వడ్లంటే సగం పైసలే ఇస్తమంటరు. నిన్నే నమ్ముకుని బతికేటోళ్లం. అందరికీ అన్నం పెట్టేటోళ్లం. మమ్మల్ని పగబట్టినట్లు చేయకు..ఓ వానమ్మా.. జర ఆగిరావమ్మా..’ అంటూ కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యాన్ని తడికళ్లతో చూస్తూ వేడుకుంటున్నారు బాధిత రైతులు. జిల్లాల్లో ఇప్పటికే 80 శాతం వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తయినా.. మిగిలిన వడ్లను వాన ముంచేస్తోంది. తడిసిన, మొలకల వచ్చిన వడ్లంటూ మిల్లుల్లో బస్తాకు 4 కిలోల చొప్పున కోతలు పెడుతున్నారు. అకాలంలో వచ్చిన అల్పపీడనం రైతన్నపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. అకాలం ముప్పు తొలగక ముందే.. రుతుపవనాలు రావడంతో పది రో జులుగా జిల్లాను వర్షాలు వీడడం లేదు. మబ్బులు కమ్ముకుని, ముసురు పెట్టినట్లు వాన కురుస్తూనే ఉంది. కొన్నిమండలాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న, సంచుల్లో నింపిన ధాన్యం తడుస్తోంది. వివిధ కారణాలతో పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటికే తడిసిన ధాన్యానికి మొలకలూ వస్తున్నాయి. ఇక జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖతోపాటు జిల్లా అధికారులూ హెచ్చరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదలో ధాన్యం..కుంటాల: మండలంలో మంగళవారం సాయంత్రం భారీవర్షం కురిసింది. లింబా(కె), కుంటాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోయింది. కుప్పల నుంచి వరద నీరు తొలగించేందుకు రైతులు తిప్పలు పడ్డారు. కారు మబ్బులు కమ్ముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. పొంగిన వాగులు.. కడెం: మండలంలోని ఉడుంపూర్, మిద్దెచింత, గండిగోపాల్పూర్, ఇస్లాంపూర్, తదితర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. సారంగపూర్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మండలంలోని ధని గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నిర్మల్–స్వర్ణ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై మొలకెత్తిన ధాన్యం పోసి గంటన్నరపాటు ఆందోళన చేశారు. వర్షాల కారణంగా పంట కోయకుండా పొలాల్లోనే ఉండిపోయి నష్టపోతున్నామని తెలిపారు. ఇక, మార్కెట్కు తరలించిన ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో నష్టపోతున్నామని పేర్కొన్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయి రైతులను దోచుకునేందుకు ప్రణాళిక రూపొందించారని ఆరోపించారు. క్వింటాల్కు 6 కిలోల ధాన్యం అదనంగా తూకం వేస్తున్నారని తెలిపారు. నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ రైతులను సముదాయించేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. సివిల్ సప్లయ్ అధికారులతో మాట్లాడతామని ఫోన్ద్వారా అధికారులను సీఐ సంప్రదించి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనతో ఈరహదారిపై రాకపోకలు స్తంభించాయి. పోలీసులు బోరిగాం మీదుగా వాహనాలను మళ్లించారు. ఆందోళన చేస్తున్న ధని గ్రామ ఽ రైతులు ఆందోళనలో రైతన్న.. ‘ఇదేం కాలమో.. ఏమో..! ముందస్తుగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది..’ అంటూ చాలామంది రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఆలస్యంగా సాగు చేసి, హార్వెస్టర్లు సమయానికి అందుబాటులో లేక వరి కోతలు చేయనివాళ్లు, కోతలు కోసి ఆరబెట్టుకున్నవాళ్లు, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్న రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్నీ కొంటామంటూ ప్రభుత్వం, జిల్లా అధికారులు భరోసా ఇస్తున్నా.. సదరు ధాన్యానికి రైసుమిల్లర్లు పెడుతున్న కొర్రీలు రైతులకు ఇబ్బంది పెడుతున్నాయి. ధాన్యం కొనుగోలు వివరాలు..ధాన్యం కొనుగోలు అంచనా 1,62,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలు 318కొనుగోలు చేసిన ధాన్యం 1,33,000 మెట్రిక్ టన్నులు ఇంకా రావాల్సిన ధాన్యం 40 వేల మెట్రిక్ టన్నులు కోతలు తప్పవు.. ప్రభుత్వం గ్రేడ్–ఏ ధాన్యం క్విటాల్కు రూ.2,320, సాధారణ రకం క్వింటాల్కు రూ.2,300 చొప్పున మద్ధతు ధర చెల్లిస్తోంది. ఈ ధర దక్కాలంటే ధాన్యంలో తేమ 17శాతం మించకూడదు. కానీ.. అకాలవర్షంతో ఆగమైన వాతావరణం రైతన్నను పరేషాన్ చేస్తోంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో తేమశాతం అటుంచి, ధాన్యం తడవకుండా చూసుకోవడం రైతులకు పెద్ద పరీక్షగా మారింది. టార్పాలిన్లను కప్పుతూ.. తీస్తూ.. ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక తడిసిన ధాన్యాన్నీ సర్కారు ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తున్నా.. రైసుమిల్లర్లు సంచికి 3–4 కిలోల కోత తప్పదంటున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదు.. నాకున్న ఎకరంన్నరతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసుకున్న. అకాలవర్షం కారణంగా ఇంతవరకు కోత కోయలేదు. ఇప్పుడింకా వానలు పడుతాయంటున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదు. – వాసాల పోశెట్టి, జామ్, మం.సారంగపూర్ తడిసిన ధాన్యం కొనుగోలు.. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు లారీలలో లోడ్ చేయించి, రైసుమిల్లులకు తరలిస్తున్నాం. సాధ్యమైనంత వరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నాం. –కిశోర్కుమార్, అడిషనల్ కలెక్టర్లింబా(కె)లో వర్షపునీరు తొలగిస్తున్న రైతు -
మత్స్యశాఖ ఏడీపై చర్య తీసుకోవాలి
దస్తురాబాద్: మత్స్యశాఖ ఏడీ రాజనర్సయ్యపై చర్య తీసుకోవాలని మండలంలోని భూత్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ మత్స్యకారులు గోదావరి తీరంలో మంగళవారం నిరసన తెలిపారు. 2016లో హైకోర్టు తీర్పు ప్రకారం రాంపూర్ మత్స్య సహకార సంఘం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని, ఆ తీర్పు ప్రకారం జిల్లా మత్సశాఖ అధికారులు సంఘం ఏర్పాటు చేసి గోదావరి తీరంలో చేపల వేట సాగించాలని లైసెన్స్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి లైసెన్స్లు రెన్యూవల్ చేసుకుంటున్నామని, ఈసారి మాత్రం రెన్యూవల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్త చేశారు. లైసెన్స్లు ఇవ్వకుంటే ఇతర గ్రామాల వారు కూడా వచ్చే అవకాశం ఉందని, దీంతో గొడవలు జరుగుతాయని పేర్కొన్నారు. మత్స్యకారుల మధ్య గొడవ సృష్టించేలా వ్యవహరిస్తున్న ఏడీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంపూర్ మత్స్యకారులకు లైసెన్స్లు జారీ చేయాలని కోరారు. -
పేదల సొంతింటి కల సాకారం
● మంత్రి సీతక్క ● అభివృద్ధి పనులకు శంకుస్థాపనముధోల్/లోకేశ్వరం: పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. లోకేశ్వరం, ముధోల్ మండలాల్లో మంగళవారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముధోల్ మండలం బ్రాహ్మణ్గావ్లో గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామరావుపటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్లతో కలిసి రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యగా స్టీల్ బ్యాంకును ఆవిష్కరించారు. దౌనెల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు, తానూర్ బీటీ రోడ్డు సహా రూ.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. రూ.1.90 కోట్లతో కుంటాల–దౌనెల్లి రోడ్డు, రూ.5.9 కోట్లతో తానూర్–హుండా రోడ్డు రినివల్, రూ.10 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. లోకేశ్వరంలో కుమురంభీం విగ్రహావిష్కరణ లోకేశ్వరం మండల కేంద్రంలో కుమురంభీం విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలు తమ సంస్కృతి, భాష, ఆచారాలను కాపాడుకోవాలన్నారు. హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అర్లి నుంచి ముధోల్ వరకు రోడ్డు నిర్మాణం, ముధోల్లో డిగ్రీ ఆశ్రమ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీల కుల ధ్రువీకరణ పత్రాల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఎమ్మెల్యేలు రామారావుపటేల్, వెడ్మ బొజ్జుపటేల్, భైంసా వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ ఆనంద్రావుపటేల్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్రెడ్డి, ఆదివాసీ నాయకపోడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సట్ల అశోక్, ఉపాద్యక్షుడు వెంకగారి భూమయ్య, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి జగదీష్, పీఏసీఎస్ చెర్మన్ రత్నకర్రావు, నాయకులు సుదర్శన్రెడ్డి, బోడికె సాయన్న, రాజేశ్బాబు, శ్రీధర్, చిన్నారావు, విగ్రహదాత జయసాగర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై మరో భారం
● రెట్టింపైన జీలుగ విత్తనాల ధర ● వానాకాలం సీజన్కు ముందే పెంచిన ప్రభుత్వం ● 30 కేజీల జీలుగ ధర రూ.2,137లక్ష్మణచాంద/మామడ: సాగు భూములను సారవంతం చేయడానికి ఖరీదైన రసాయన ఎరువులు, బయటి నుంచి మట్టి తరలించడం కన్నా, జీలుగ వ ంటి పచ్చిరొట్ట పంటలు రైతులకు పెట్టుబడి భారం తగ్గిస్తాయి. ఈమేరకు వ్యవసాయాధికారులు కూడా పచ్చిరొట్ట సాగును ప్రోత్సహిస్తారు. జీలుగ సాగు నేల స్వభావాన్ని మెరుగుపరిచి, పంటల దిగుబడిని పెంచుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జీలుగ విత్తనాల ధరలను రెండింతలు పెంచింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూసారం పెంచేందుకు.. జీలుగను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసి, 45 రోజు ల తర్వాత కలియదున్నడం ద్వారా నేల సారవంతం అవుతుంది. ఇది నీటి సామర్థ్యాన్ని పెంచి, 2% నత్రజని, సూపర్ పాస్ఫేట్, జింక్, కాల్షియం, ఇను ము వంటి సూక్ష్మ పోషకాలను పంటలకు అందిస్తు ంది. ఎకరానికి 10–12 కిలోల జీలుగ విత్తనాలను తొలకరి వర్షాల తర్వాత విత్తి, పూత దశలో దుక్కి దున్నడం ద్వారా 10 టన్నుల పచ్చిరొట్ట ఎరువు తయారవుతుంది. ఒక టన్ను ఎరువులో 6 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 3 కిలోల పొటాష్ లభిస్తాయి. ఇది రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, రైతుల పెట్టుబడి ఖర్చును తగ్గిస్తుంది. జీలుగ ధరల పెంపు.. రైతు భరోసా సబ్సిడీపై స్పష్టత లేని నేపథ్యంలో, రైతులు పెట్టుబడికి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో జీలుగ విత్తనాల ధరలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతేడాది 30 కిలోల జీలుగ బస్తా రూ.1,116 ఉండగా, ఈ ఏడాది రూ.2,137కి పెంచారు. ఈ ధరల పెంపు సాగు ఖర్చులను పెంచి, రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పంపిణీ ఆలస్యం.. మరోవైపు జిల్లాకు జీలుగ విత్తనాలు ఇంకా పంపిణీ కాకపోవడం రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పచ్చిరొట్ట విత్తుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగుకు 3,500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించారు. ఇవి 50% సబ్సిడీపై త్వరలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది 35 వేల ఎకరాలకు సరిపోతుంది. పెంచిన ధర తగ్గించడంతోపాటు త్వరగా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలి
నిర్మల్టౌన్: నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిలకు విన తి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పలువురు నకిలీ విలేకరులుగా చలామణి అవుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డీపీఆర్వో కార్యాలయంలో డీపీఆర్వో విష్ణుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, సభ్యులు మనోజ్, అశోక్, రవి, యోగేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సంఖ్య పెంచాలి
కుభీర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఈవో రామారావు అన్నారు. సోమవారం మండలంలోని పల్సి ఉన్నత పాఠశాలలో గ్రామస్తులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జూన్ 6 నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్యమం కావాలనుకునేవారు పాఠశాలల కమిటీ తీర్మాణాలను పంపిస్తే మంజూరు చేస్తామన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తైమిన్బేగం ఇంటికి వెళ్లి అభినందించారు. సమావేశంలో ఎంఈవో విజయ్కుమార్, ప్రధానోపాధ్యాయులు సురేష్, గ్రామపెద్దలు హన్మాండ్లు, రమేశ్, ధర్మపురి, తదితరులు పాల్గొన్నారు. -
అసైన్డ్భూమిని కబ్జా నుంచి కాపాడాలి
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లెలో అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్భూమిని కబ్జా నుంచి కాపాడి ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్, సహాయ కార్యదర్శి ఎల్ఆర్ ఉపాలి సోమవారం తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోసంపల్లె గ్రామాన్ని ఆనుకుని ఉన్న పీపీల్యాండ్ను కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బూక్యా రమేశ్నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
‘భరోసా’ ఇంకెప్పుడు?
లక్ష్మణచాంద: పంటల సాగుకు అవసరమైన వి త్తనాలు, ఎరువులు ఇతర ఖర్చుల కోసం గతంలో రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తె చ్చి పంటలు సాగు చేసేవారు. దీంతో వడ్డీ చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవా రు. రైతుల పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి అందించి ఆదుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ.10 వేలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామి ఇచ్చింది. కానీ గత వానాకాలంలో ఎకరానికి కేవలం రూ.10 వేలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. సాగు పనులు షురూ జిల్లాలో ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కు రుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే పంట చేలలోకి నల్లమట్టి, పశువుల ఎరువు తరలించి పొలమంతా చల్లుతున్నారు. దుక్కులు దున్ని విత్తనా లు వేయడానికి పంటచేలను సిద్ధం చేస్తున్నారు. 4.20 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ ఏడాది వానాకాలం 4 లక్షల 20 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయని జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ప్రధానంగా సోయాబీన్ 1.10 లక్షల ఎకరాలు, వరి 1.20 లక్షల ఎకరాలు, పత్తి 1.50 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 30 వేల ఎకరాలు, కంది 7 వేల ఎకరాలు, ఇతర పంటలు 3 వేల ఎకరాలలో సాగు కానున్నాయని జిల్లా వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయం రూ.275 కోట్లు జిల్లాలోని 19 మండలాల పరిధిలోని 400 గ్రామాలకు చెందిన లక్షా 84 వేల మంది రైతులకు గానూ రైతు భరోసా కింద రూ.275 కోట్లు అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయని డీఏవో అంజిప్రసాద్ పేర్కొన్నారు. ఆందోళన చెందుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పటి వరకు రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. దీంతో విత్తనాలు, ఎరువులు ఎలా కొనుగోలు చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాం. – సాయన్న, రైతు, పొట్టపెల్లి ఆదేశాలు రాలేదు రైతు భరోసా నిధుల గురించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం వద్ద రైతులకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. – అంజిప్రసాద్, డీఏవో, నిర్మల్ ఇప్పటికీ ప్రకటన చేయని ప్రభుత్వం ఎదురుచూపుల్లో రైతులు అప్పులు తప్పవంటున్న అన్నదాతలు జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు స్పష్టతలేని వైనం... ఈ సారి ముందస్తుగానే రుతుపవనాలు వచ్చాయి. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు. కానీ రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో రైతు భరోసా వస్తుందా? రాదా? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి రైతు భరోసాపై స్పష్టత ఇచ్చి ఖాతాల్లో నగదు జమచేసి ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు. -
జొన్న కొనుగోళ్లు నిలిపివేత..
భైంసాటౌన్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలు పలుచోట్ల మూసివేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముధోల్కు చెందిన రాజేశ్వర్ రావు దేశాయ్ అనే రైతు జొన్నలు విక్రయించేందుకు ఈనెల 23న టోకెన్ తీసుకున్నాడు. వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సోమవారం తీసుకురావాలని సూచించగా మాటేగాంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. కేంద్రం మూసి ఉండడంతో నిర్వాహకులను ఫోన్లో సంప్రదించాడు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ అక్కడికి చేరుకుని మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్కుమార్ను ఫోన్లో సంప్రదించగా కుంటాలలోని కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో సదరు రైతు కుంటాల కొనుగోలు కేంద్రంలో జొన్నలు విక్రయించాడు. ‘సాక్షి’ చొరవతో జొన్నలు కొనుగోలు చేయడంతో రైతు కృతజ్ఞతలు తెలిపాడు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్టౌన్: ఈ నెల 24 నుంచి 26 వరకు మంచిర్యాల ఎఫ్ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఏడుగురు పాల్గొని జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఇందులో పి.అభినయ (54–57), ఏ.కీర్తన (46–48), శ్రావణి (64–67) కేటగిరీలలో బంగారు పతకాలు సాధించగా నక్షత్ర కాంస్య పతకం సాధించింది. ఇందులో అభినయ, కీర్తన జూన్ 4 నుంచి 7 వరకు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ అండర్–17 బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ స్థాయికి ఎంపికై న అభినయ, కీర్తనలను అభినందించారు. జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి
మార్కెట్ తరలించాలి పట్టణంలోని గాంధీ కూరగాయల మార్కెట్లో రోడ్లపై వ్యాపారాలు చేయడం వల్ల ఇంద్రనగర్ కాలనీకి వెళ్లడం కష్టంగా మారింది. ఇంద్రనగర్ నుండి విశ్వేశ్వరయ్య మార్గ్ వెళ్లే దారిలో మెయిన్ రోడ్డుపై ఉన్న డివైడర్ క టింగ్ను ఈ కూరగాయల మార్కెట్ వల్ల మూసివేశారు. దీనిని తిరిగి తెరిపించాలి. ఈ విషయంపై కలెక్టర్ చొరవ తీసుకొని సత్వర మే మార్కెట్ను మరో చోటుకు తరలించాలి. – ఇందిరానగర్ కాలనీవాసులు, నిర్మల్ ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి వెంగ్వాపేట్లోని కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యం తరలించి 30 రోజులు కావస్తున్నా ఇప్పటికీ కొనుగోలు చేయడం లేదు. అధికారులు త్వరగా స్పందించి ధాన్యం కొనుగోలు చేసి లారీల్లో తరలించాలి. లేదంటే కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి. – వెంగ్వాపేట్ గ్రామ రైతులు నా భర్త ఉద్యోగం ఇప్పించాలి ఎస్డీసీఎల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నా భర్త కృష్ణకాంత్ గతేడాది మృతి చెందాడు. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నా భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. కలెక్టర్గారు మానవతా దృక్పథంతో ఆలోచించి నా భర్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగం నాకు ఇప్పించాలని వేడుకుంటున్నా. – ఎన్.కల్పన, ఎల్లపెల్లి, నిర్మల్ నిర్మల్టౌన్: ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. రైతు రుణమాఫీ, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, విద్య, వైద్యం, తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును సంబంధిత అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పరిశీలించాలి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని, వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి ఖానాపూర్ మండలం పాత తర్లపాడు గ్రామ శివారులోని 113 సర్వేనంబర్లో 1990లో ప్రభుత్వం 19 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండెకరాల చొప్పున కేటాయించి పట్టాలు కూడా ఇచ్చింది. ఇట్టి భూమిని సాగుచేసుకుంటున్నాం. ఇది అటవీ శాఖ భూమి అంటూ అధికారులు వ్యవసాయ పనులు చేపట్టిన ప్రతీసారి పనులకు ఉపయోగించే టాక్టర్లు, జేసీబీలను సీజ్చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి మా వ్యవసాయ భూమిలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా చర్యలు చేపట్టి మా నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి. – పాత తర్లపాడు గ్రామ రైతులు పింఛన్ ఇస్తలేరు సారూ.. నిర్మల్ మండలానికి చెందిన షేక్నైమా పుట్టుకతోనే బుద్ధిమాంధ్యం, అంగవైకల్యంతో బాధపడుతోంది. 13 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు దివ్యాంగుల పెన్షన్ రావడంలేదు. తన తల్లి సహాయంతో పలుమార్లు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చి కలెక్టర్కు తన గోడు వెల్ల బోసుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ -
ప్రాణ రక్షకులు
● ప్రమాద స్థలాలకు క్షణాల్లో చేరుతున్న పైలెట్లు ● క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. ● వైద్య చికిత్సతో నిలబెడుతున్న ప్రాణాలు ● నేడు జాతీయ పైలెట్ దినోత్సవంచెన్నూర్: 108 అంబులెన్స్ పైలట్లు ప్రాణరక్షకులని.. ప్రమాదం జరిగిందని సమాచారం వస్తే చాలు క్షణాల్లో అక్కడికి చేరుకుంటారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. సకాలంలో వైద్య చికిత్స అందించడంతో వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. పైలట్ల సేవలను పలువురు కొనియాడుతున్నారు. సోమవారం జాతీయ అంబులెన్స్ పైలెట్ దినోత్సవం సందర్భంగా సాక్షి కథనం. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 అంబులెన్స్లు పని చేస్తున్నాయి. 176 మంది పైలెట్లు విధులు నిర్వహిస్తున్నారు. అంబులెన్స్లు ఆయా మండలాల పరిధిలో జరిగే రోడ్డు, ఇతర ప్రమాదాలు జరిగిన సమయంలో సంఘటన స్థలాలకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పైలెట్లు ప్రమాద స్థలాలకు చేరుకునేందుకు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. జిల్లా అంబులెన్సులు పైలెట్ మంచిర్యాల 18 45 అదిలాబాద్ 25 60 నిర్మల్ 15 36 కుమురం భీం 15 35 -
పంచ్ అదుర్స్!
● మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ● 260 మంది క్రీడాకారులు హాజరు.. ● హోరాహోరీగా తలపడుతున్న బాక్సర్లుమంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు వేదికగా నిలిచింది. ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ (బాక్సింగ్ ఫెడరేషన్ అనుబంధం) పర్యవేక్షణలో ఈనెల 24న ప్రారంభమైన ఈ పోటీలు 26 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 260 మంది బాక్సింగ్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. వయస్సు, బరువు ఆధారంగా విభజించిన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతూ శక్తివంతమైన పంచ్లతో ఆకట్టుకుంటున్నారు. టైసన్ బాక్సింగ్ క్లబ్ ఏర్పాట్లు పోటీలను తిలకించేందుకు పెద్దఎత్తున ప్రేక్షకులు తరలివస్తున్నారు. టైసన్ బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించి, లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురి క్రీడాకారులను ‘సాక్షి’పలకరించగా తమ అనుభవాలు వెల్లడించారు. -
శత జన్మదిన సందడి
● వాగ్దారిలో ఓ వృద్ధుడి వందో పుట్టినరోజు వేడుక నేరడిగొండ: మండలంలోని వాగ్దారి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడి శత జన్మదిన సంబురం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల మధ్య ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన బదావత్ కిర్యానాయక్ 1925 మే 24న జన్మించాడు. శనివారంతో వందేళ్లు పూర్తికాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిర్యానాయక్ కేక్ కట్ చేశారు. తన ఆరోగ్యానికి జీవనశైలే కారణమని పేర్కొన్నాడు. కార్యక్రమంలో ఐదు తరాల వారసులు పాల్గొని సందడి చేశారు. -
● నృత్యంలో రాణిస్తున్న చిన్నారులు ● మహా బృంద నాట్యంలో పాల్గొని గిన్నిస్ రికార్డు ● బాలకేంద్రం చిన్నారుల ప్రతిభ
ఆదిలాబాద్: చిన్నారులు ఆయా వేదికల్లో శాసీ్త్రయ నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్నారు. అందులోనే రాణిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారు. వారే జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటూ గిన్నిస్ రికార్డులకెక్కిన చిన్నారులు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2023 డిసెంబర్ 24, 25వ తేదీల్లో కూచిపూడి కళా వైభవం–మహా బృందనాట్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 4,218 మంది నృత్యకారిణులు ఒకేసారి ప్రదర్శించి గిన్నిస్ రికార్డు సాధించారు. వారిలో బాల కేంద్రానికి చెందిన 26 మంది కూచిపూడి చిన్నారి నర్తకులు ఉండడం విశేషం. గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులు.. గడ్డం శ్రీనిధి, దువాస హర్షిని, పన్నాల లాస్య, ఠాకూర్ హర్షిని, అక్షర గీత, క్షీరసాగర్ జాహ్నవి, సన్నిధి దేశ్ముఖ్, కుర్ర భవిష్య, జాబు శ్రీ వర్ధిని, ఆర్. ఓజస్విని, నాలంవార్ మహాలక్ష్మి, గుండేటి అశ్విత, ఉపలంచివార్ అక్షిత, కొంకటీ ఇతీక్ష, పోలాజి ఉమారాణి, మోర శ్రేష్ట, సామ మహతి, చిలుక ఆమని, మామిడి అక్షయ, అవరగొండ సంజన, యానాకి నక్షత్ర, మచ్చ సాత్విక, కటకం భావనశైని, కొండ్ర అలేఖ్య, కానిందే మహాశ్రీ, రామోజీ రచన. గిన్నిస్ రికార్డు సాధించిన బాలకేంద్రం చిన్నారులతో కలెక్టర్ రాజర్షి షా నాట్యశిఖామణి ‘ఆమని’ కై లాస్నగర్ కాలనీకి చెందిన చిలుక వెంకటస్వామి–అన్నపూర్ణ దంపతుల కుమార్తె ఆమని 2021 నుంచి బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు చేస్తూ ఎన్నో వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చింది. అద్భుత కళా నైపుణ్యంతో అన్నమయ్య పురస్కారాన్ని సాధించింది. ఇప్పటివరకు 10 రికార్డులు సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఈవెంట్లో పాల్గొని ధ్రువపత్రాన్ని అందుకుంది. -
ఇంద్రాదేవి ఆలయంలో విత్తన పూజలు
ఇంద్రవెల్లి: ఖరీఫ్సీజన్ నేపథ్యంలో ఇంద్రాదేవి ఆలయంలో ఆదివాసీలు విత్తన పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విత్తన పూజలు చేశారు. అమ్మవారికి నవధాన్యాలతో నైవేద్యాలు సమర్పించారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు పుష్కలంగా కురవాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఆలయ మహారాజ్ చహకటి సూర్యరావ్, ఆయా గ్రామాల ఆదివాసీలు ఉన్నారు. 108లో ప్రసవంబెల్లంపల్లి: పురిటినొప్పులతో బాధపడుతున్న 8 నెలల గర్భిణికి 108 సిబ్బంది ఎంతో నేర్పుతో ఆదివారం ప్రసవం చేశారు. కుమురం భీం జిల్లాలోని భీమన్గూడ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన ఆత్రం పోసుబాయికి పురిటినొప్పులు వచ్చాయి. ఆశ కార్యకర్త సహాయంతో కుటుంబీకులు 108 అంబులెన్స్లో ఆసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియాస్పత్రికి రెఫర్ చేయడంతో అక్కడికి తీసుకెళ్లారు. 8 నెలల గర్భిణి, రక్తం తక్కువగా ఉండటం, ఐదో కాన్పు కావడంతో అక్కడి వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. వెంటనే పోసుబాయిని మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సోమగూడెం శివారుప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. రోడ్డు పక్కన అంబులెన్స్ను నిలిపి ఈఆర్సీపీ వైద్యుడి సలహాతో ఈఎంటీ దుర్గం ఆత్మరావు, పైలెట్ అజయ్ ఆమెకు నార్మల్ డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. వారిని మంచిర్యాల మాతా శిశుకేంద్రానికి తరలించారు. బెల్లంపల్లి 108 అంబులెన్స్ ఈఎంటీ, పైలెట్ను కుటుంబీకులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు. -
మరోసారి సత్తా చాటుతా..
ఇటీవల పదో తరగతి పూ ర్తయింది. మంచిర్యాలలో ని ఖేలో ఇండియా ద్వారా బాక్సింగ్లో రెండేళ్లుగా శిక్షణ పొందుతున్నాను. ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రెండుసార్లు పాల్గొని సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించాను. సీఎంకప్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ పతకం సాధించగా, ఓపెన్ స్టేట్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో మూడోస్థానంలో నిలిచాను. జాతీయస్థాయిలో ఆడినా పతకం అందుకోలేకపోయాను. మంచిర్యాలలో నిర్వహిస్తున్న పోటీల్లో గోల్డ్ పతకం సాధిస్తాను. – క్రితి అగర్వాల్, మంచిర్యాల జాతీయస్థాయిలో రాణిస్తా ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ఇటీవల టెన్త్ చదివాను. రాష్ట్రస్థాయిలో ఎస్జీఎఫ్లో రెండు గోల్డ్మెడల్స్ సాధించాను. బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీల్లో 46, 48 కేజీల విభాగంలో గోల్డ్మెడల్స్ సాధించాను. జాతీయస్థాయి పోటీల్లో నాలుగుసార్లు పాల్గొనగా ఒకసారి దేశంలోనే 8వ స్థానంలో నిలిచాను. జాతీయస్థాయిలో గోల్డ్మెడల్ సాధించడమే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నాను. – నిహారిక, నిజామాబాద్ గోల్డ్మెడల్ సాధిస్తా రాష్ట్రస్థాయిలో సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో, ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్మెడల్స్ సాధించాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గోవాకు ఎంపికయ్యాను. పదోతరగతి ఇటీవల పూర్తి చేయగా, 8వ తరగతి నుంచే బాక్సింగ్లో శిక్షణ పొందుతున్నా. జాతీయస్థాయిలో పాల్గొని గోల్డ్మెడల్ను సాధించాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్నాను. – జె.అనుగ్రహ, హైదరాబాద్ జాతీయస్థాయిలో ఆడేందుకు శిక్షణ ఇటీవల ఇంటర్ పూర్తయింది. నాలుగుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడి గోల్డ్మెడల్ సాధించాను. జాతీయస్థాయిలో ఒకసారి ఆడి, సెమీఫైనల్ చేరాను. ఫైనల్ చేరేలా శిక్షణ తీసుకుంటూనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నా. జాతీయస్థాయిలో రాణించేలా బాక్సింగ్లో శిక్షణ పొందుతున్నా. – సంస్కృతి, మంచిర్యాల -
రాణిస్తున్న ‘జాహ్నవి’
జిల్లా కేంద్రంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన కె.జాహ్నవి ఏడో తరగతి చదువుతోంది. 2022 నుంచి బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటూ రాణిస్తోంది. చిన్ననాటి నుంచే నృత్యంపై ఆసక్తితో శిక్షణలో చేర్పించినట్లు తల్లిదండ్రులు సంజుతాయి– రవికుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఆరు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా 7 రాష్ట్రస్థాయి నృత్య పోటీల్లో ప్రదర్శనలు ఇచ్చింది. మహారాష్ట్ర వార్ధాలో జరిగిన నృత్య పోటీల్లో పాల్గొని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. కళాశక్తి పురస్కారంతోపాటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో పాల్గొని ధ్రువపత్రం అందుకుంది. -
సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మృతి
మందమర్రిరూరల్/పాతమంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణా నికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ (69) అ నారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో ఆదివారం ఉదయం మృతిచెందారు. నెల రోజు లుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని మంచిర్యాలలోని నివాసానికి తీసుకువ చ్చారు. మధ్యాహ్నం వరకు సందర్శనార్థం అక్కడే ఉంచారు. పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం పార్థివదేహాన్ని సాయంత్రం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్ మీదుగా ఈద్గాకు తరలించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్సీ కోదండరామ్, యూనియన్ నేతలు, స్నేహితులు, తోటి పాత్రికేయులు, రాజకీ యనాయకులు, అభిమానులు నివాళులర్పించారు. ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్గా ప్రస్థానం మునీర్ ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్గా జిల్లాలో చెరగని ముద్రవేశారు. విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్లో పనిచేసి, సీపీఐలో చురుకైన నాయకుడిగా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. 1981లో సింగరేణిలో కార్మికుడిగా చేరి, భూస్వాముల అరాచకాలపై పో రాటాలు చేశారు. 1982లో హత్య కేసులో నిందితుడిగా శిక్ష పొందినా, హైకోర్టు కేసును కొట్టివేసింది. ఇక జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో 40 ఏళ్ల్లు పనిచేశా రు. 2008లో సింగరేణి గోల్డెన్ హ్యాండ్షేక్ పథకం ద్వారా ఉద్యోగ విరమణ పొంది, జర్నలిజంలో కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్గా సమ్మెను విజయవంతం చేశారు. పలువురి నివాళి మునీర్ మృతికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, కోనేరు కోనప్ప, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తంచేశారు. మునీర్కు భార్య రిజ్వానా, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
రికార్డుల ‘హర్షిణి’
జిల్లా కేంద్రంలోని ఠాకూర్ ప్రదీప్ సింగ్– అనూష దంపతుల కుమార్తె హర్షిణి కూచిపూడి నృత్యంలో అరుదైన రికార్డులను సాధిస్తుంది. 2022 నుంచి ఇప్పటివరకు 11 అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. 2022లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2023లో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫెంటాస్టిక్ అచీవ్మెంట్స్ అండ్ రికార్డ్స్, జేమ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా రికార్డ్స్ దక్కాయి. ఇప్పటివరకు 40కి పైగా జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి వేదికలపై అద్భుత ప్రదర్శనలు ఇచ్చింది. తల్లి ప్రోత్సాహంతో రాణిస్తున్నానని హర్షిణి తెలిపింది. -
అ‘పూర్వ’ం.. అద్వితీయం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009–10లో పదోతరగతి చదివినవారంతా ఆదివారం మండలంలోని కనకాపూర్ కేఎన్ఆర్ గార్డెన్స్లో పూర్వవిద్యార్థుల స మ్మేళనం పేరిట కలుసుకున్నారు. వివిధ ప్రాంతా ల్లో ఉంటున్నవారంతా ఒక్కచోట చేరి ఒకరినొక రు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి యో గక్షేమాలు ఒకరు తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు రవికుమార్, మోహన్రావు, నారా యణ, వకుల కుమారి, లక్ష్మణ్ను ఆహ్వానించి స న్మానించారు. పూర్వవిద్యార్థులు అశోక్, రాజు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పొన్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో.. మామడ: మండలంలోని పొన్కల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2010–11లో పదోతరగతి చదివినవారంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతా ఒక్కచోట చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో చది విన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని ఆనందంగా గడిపారు. పూర్వవిద్యార్థులు స్రవంతి, స్వప్న, కృష్ణవేణి, మౌనిక, అనిత, కళ్యాణి, నాగరాజు, అనిల్, ముత్యం తదితరులు పాల్గొన్నారు. -
పేదలకూ కార్పొరేట్ విద్య
● టెన్త్ మెరిట్ ఆధారంగా ఇంటర్లో సీట్లు ● ఈ నెల 31వరకు దరఖాస్తు గడువు నిర్మల్చైన్గేట్: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చా లా కీలకమైంది. చాలామందికి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదవాలనే కోరిక ఉంటుంది. కానీ.. కార్పొరేట్ విద్య పేదలకు అందని ద్రాక్షే. కాగా, ప్ర తిభ గల పేద విద్యార్థుల కల సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేట్ విద్యా పథకాన్ని తీసుకువచ్చింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ ఉజ్వ ల భవిష్యత్కు బాటలు వేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ పథకానికి సంబంధించి 2025–26 విద్యాసంవత్సరానికి గాను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 400పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, ఎయిడెడ్, కేజేబీవీ, నవోదయ, గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో చదివినవారే అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు కళాశాలతో కూడిన సమాచారం అందిస్తారు. ఇదీ.. ఎంపిక విధానం ఉచిత కార్పొరేట్ విద్య కోసం అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులతో పాటు ఆయా వర్గాలకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఏ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్లో సీటు కేటాయించారో తెలుపుతూ దరఖాస్తులో పొందుపరిచిన సెల్ నంబర్కు సంక్షిప్త సమాచారం పంపిస్తారు. అందులో సూచించిన గడువులోపు వారికి కేటాయించిన కళాశాలకు వెళ్లి అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేసి జాయిన్ కావాలి. నిర్ణీత గడువులోపు చేరకుంటే సీటు రద్దు చేసి ఆ తరువాత మెరిట్లో ఉన్న వారికి కేటాయిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి కార్పొరేట్ విద్యాపథకం ప్రతిభ గల పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్లపాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య, వసతి కల్పిస్తారు. – రాజేశ్వర్గౌడ్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దరఖాస్తు విధానం ఇలా.. మీసేవా కేంద్రాల ద్వారా telangan aepass. cgg. gov. in లో ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి పూర్తి వివరాలు, పదో తరగతి మార్కుల ధ్రువపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఆదాయం, కుల ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలకు మించకూడదు. ఒక్కో విద్యార్థి పేరిట ప్రభుత్వం రూ.36 వేల చొప్పున సదరు కళాశాలకు ప్రోత్సాహకం అందించనుంది. -
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
కుంటాల: అకాల వర్షాలు జిల్లాకు చెందిన అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. కుంటాల మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షం రైతులను నిండా ముంచింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జొన్నలు తడిసి ముక్కిపోయాయి. తడిసిన ధాన్యం బస్తాలు ఆరబెట్టేందుకు ఆదివా రం రైతులు ఇబ్బంది పడ్డారు. షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. ఖానాపూర్: కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తోంది. కొన్నిచోట్ల తడిసిన ధాన్యం మొలకెత్తింది. ఖానాపూర్, కడెం మండలాల్లోని స దర్మాట్ ఆయకట్టు కింద 50శాతం వరి కోతకు రా గా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నదా తలు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మణచాంద: నాలుగురోజులుగా కురుస్తున్న వర్షా లకు మండలంలోని రాచాపూర్ సమీపంలో రైతులు ఆరబోసిన ధాన్యం మొలకెత్తింది. ధాన్యం నుంచి మొలకను వేరు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. కుంటాల: జొన్న కుప్పల చుట్టూ నిలిచిన వరదనీరు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు అన్నదాతల పాట్లు -
తడిసిన ధాన్యం కొంటాం
● తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి సారంగపూర్: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేద ని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి సారంగపూర్ చేరుకున్న అ న్వేశ్రెడ్డి మార్కెట్ యార్డు ఆవరణలో వరి ధా న్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది యాసంగిలో 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఈసారి 60లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. అయినప్పటికీ రైతులు పండించిన చివరి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యు డు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మ న్ అయిర నారాయణరెడ్డి, స్వర్ణ ప్రాజెక్ట్ ఆయక ట్టు మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ పోతిరెడ్డి సుజాత–నర్సారెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, రాజన్న తదితరులున్నారు. -
నిర్మల్
పంచ్ అదుర్స్! మంచిర్యాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు రెండోరోజుకు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా హాజరైన 260 మంది క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతున్నారు. సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025ఎవరెస్ట్ బేస్క్యాంపునకు ఎంపిక లక్ష్మణచాంద: ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు మండలంలో ని రాచాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు చెందిన తొ మ్మిదో తరగతి విద్యార్థి జే గోకుల్నాయక్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల నుంచి 100 మంది బాలికలు, 100 మంది బాలురను ఎంపిక చేసి ఇటీవల భువనగిరిలో మాలవత్ పూర్ణ ఆధ్వర్యంలో రెండురోజులు శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు ఎంపిక చేయగా ఇందులో గోకుల్నాయక్కు అవకాశం దక్కింది. గోకుల్నాయక్ను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రానికి చెందిన మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి ఒకరు 2024 జూన్లో రిటైర్డయ్యారు. ఇతనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపేణా రూ.60 లక్షల వరకు రావాలి. ఇందులో గ్రాట్యూటీ రూ.16 లక్షలు, కమ్యూటేషన్ రూ.20 లక్షలతోపా టు సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ డబ్బులు ఇంతవరకు అందలేదు. దీంతో సదరు రిటైర్డ్ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. దాదాపు ఏడాది గడుస్తున్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక అవసరాలకు ఇ బ్బంది పడుతున్నట్లు తెలిపారు. అనుకున్న పనులు ఆగిపోయాయని ఆయన వాపోయారు. ఇలా ఉద్యోగ విరమణ పొందిన జిల్లాలోని పలువు రు ఏడాదైనా తమకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో నిత్యం ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, జిల్లా ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 5,584 మంది పెన్షనర్లు ఉండగా గతేడాది ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల్లో పనిచేసే 284 మంది రిటైర్డయ్యారు. వీరిలో కొందరికి పెన్షన్ వచ్చినా.. ఇతర బెనిఫిట్స్ కోసం ఏడాదిగా నిత్యం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రణాళిక తారుమారై.. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వచ్చే డబ్బుల కోసం వేసుకున్న ప్రణాళిక అంతా తారుమారైనట్లు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ డబ్బులు చేతికి అందితే పిల్లల వివాహాలు చేయాలని కొందరు, ఇళ్లు కట్టుకోవాలని మరి కొందరు, నిరుద్యోగులైన కుమారులకు వ్యాపారాలు పె ట్టించాలని ఇంకొందరు, భార్యకు బంగారం కొనా లని మరికొందరు వేసుకున్న ప్లాన్ తలకిందులై ని రాశతో ఉన్నారు. రిటైర్మెంట్ వేడుక అందరి సమక్షంలో అట్టహాసంగా చేసుకున్న తాము బంధువుల ముందు ప్రణాళికలు వేసుకోగా ఇప్పుడు మాట తప్పాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని కొందరు పెన్షనర్లు తమ హక్కులు కాపాడుకోవడానికి తప్పనిసరి పరి స్థితుల్లో కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టు ద్వారా వా రు తమ పెన్షన్ చెల్లింపులు, ఇతర పెన్షనరీ బెనిఫి ట్స్ పొందాలని కోరుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 28మంది కోర్టు మెట్లు ఎక్కారు. వారికి రావాల్సిన బెనిఫిట్స్ న్యాయపరంగా పొందేందుకు పోరాడుతున్నారు. మిగతా వారంతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. న్యూస్రీల్ అందని ‘విరమణ’ ప్రయోజనాలు 284 మందికి తప్పని ఎదురుచూపు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ కోర్టును ఆశ్రయించిన 28 మంది రిటైర్మెంట్ రోజే ఇవ్వాలి ఉద్యోగి పనిచేసిన కాలంలో మూలవేతనం నుంచి కటింగ్ చేయించుకుని దాచుకున్న డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చే బె నిఫిట్స్ను రిటైర్మెంట్ అయిన రోజే ఇవ్వాలి. జాప్యం చేస్తే డబ్బుల కోసం వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అంచనాలు తారుమారై.. రాష్ట్రంలో మూడు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక వారి అంచనాలు తారుమారు అవుతున్నాయి. జాప్యం చేయకుండా ప్రభుత్వం సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి. – ఎంసీ లింగన్న, పెన్షనర్ల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి(25ఎన్ఆర్ఎల్277) ======= జిల్లాలోని పెన్షనర్ల వివరాలు జిల్లాలోని పెన్షనర్లు : 5,584 మంది బెనిఫిట్స్ రానివారు : 284 మంది కోర్టును ఆశ్రయించింది : 28 మంది -
ఎక్స్రే సేవలు వినియోగించుకోవాలి
● బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ● డిజిటల్ ఎక్స్రే మిషన్ ప్రారంభం ● కొనుగోలు కేంద్రం పరిశీలన నర్సాపూర్ (జి): డిజిటల్ ఎక్స్రే సేవలు సద్విని యోగం చేసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం డిజిటల్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వ సతులు లేక ప్రమాదాల్లో గాయపడ్డ వారిని నిర్మ ల్, భైంసా ఏరియా ఆస్పత్రులకు తరలిస్తుండగా జాప్యం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. త్వరలో దీనిని 50పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కొనుగోలు కేంద్రం పరిశీలన మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సందర్శించా రు. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని పరి శీలించారు. సెంటర్ నిర్వాహకులు 3కిలోల చొ ప్పున అదనంగా ధాన్యాన్ని తూకం వేస్తున్నారని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. అధిక తూకం, రై స్ మిల్లుల్లో ధాన్యం కటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎ మ్మెల్యే ఫోన్లో ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. డీఎంహెచ్వో రాజేందర్, డీసీహెచ్ఎస్ సురేశ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రమోద్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నా యకులు రావుల రాంనాథ్, దొడ్డికింది ముత్యంరెడ్డి, చంద్రకాంత్, నరేందర్, శ్రీకాంత్రెడ్డి, అర్జున్ ఠాకూర్, దత్తురాం, సుధాకర్, రాజేందర్, మహిపాల్, రాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ సారంగపూర్: మండలంలోని సిర్పెల్లి నుంచి బండ్రేవుతండా వరకు రూ.75లక్షలతో చేపట్టిన బీటీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి భూమిపూజ చేశారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోగల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. సారంగపూర్లో గన్నీ సంచుల కొరత ఉందని తెలుసుకుని సివిల్ సప్లయ్ అధికారులతో మాట్లాడారు. ఆదివారం తప్పనిసరిగా సంచులు తెప్పిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. బీజేపీ మండలాధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు తిరుమలాచారి, నాయకులు సాహెబ్రావు, వీరయ్య, చంద్రప్రకాశ్గౌడ్, గంగారెడ్డి, విలాస్ తదితరులున్నారు. -
నిర్మల్
సాహిత్యంలో ‘అరుణ’కిరణం ఇంద్రవెల్లి జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయురాలు బుట్టేవార్ అరుణ 1,937 కవితలు రాసి 10 సాహిత్య పుస్తకాలు ప్రచురించారు. బాలల్లో సాహిత్య ఆసక్తిని పెంపొందిస్తున్నారు. ఆదివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 20258లోu ఏసీబీకి చిక్కిన సర్వేయర్ కడెం: కడెం మండల సర్వేయర్ పవార్ ఉమాజీ ఏసీబీకి చిక్కాడు. మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన గు గ్లవత్ ప్రభాకర్ తన తండ్రి మరణించగా అతని పేరిట ఉన్న ఐదెకరాల పట్టా మార్పిడికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు సర్వేయర్ ఉమాజీ ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున రూ.25వేలు డిమాండ్ చేశాడు. ఒప్పందం మేరకు ప్రభాకర్ ఈనెల 20న రూ.12వేలు ముట్టజెప్పాడు. మిగతా డ బ్బులు ఇస్తేనే పని పూర్తవుతుందని సర్వేయర్ తెలుపగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆ శ్రయించాడు. వారి సూచన మేరకు శనివారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.7వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ విజయకుమార్ సర్వేయ ర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా, గతేడాది జనవరిలో లంచం తీసుకుంటూ తహసీల్దార్ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య ఏసీబీకి పట్టుబడిన విషయం మరువక ముందే మరొక రెవె న్యూ అధికారి ఏసీబీకి చిక్కడం గమనార్హం. ● ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ● ఈనెల 17న ముగిసిన గడువు ● 26న ధ్రువపత్రాల పరిశీలన ● ఎంపికై నవారికి 50 రోజుల శిక్షణ ● త్వరలో అందుబాటులోకి సేవలునిర్మల్చైన్గేట్: భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, లా వాదేవీలు మరింత పారదర్శకంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలను అమలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ల సమయంలోనే భూమి కొలతలు, హద్దులు తదితర వివరాలతో కూడిన మ్యాప్ (స్కెచ్) కూ డా రైతులకు అందించాలని నిర్ణయించింది. అయి తే ఇందుకు అవసరమైన సర్వేయర్ల కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంటోంది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పక్షం రోజుల క్రితమే దరఖా స్తుల స్వీకరణ ప్రారంభించి ప్రక్రియ పూర్తి చేసింది. సివిల్ సబ్జెక్ట్తో ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్హతలున్న వారు ఈనెల 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 26వ తేదీన అధికారులు వారి ధ్రువపత్రాలు పరిశీలించనున్నా రు. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయితే త్వరలోనే వారి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. భూముల లావాదేవీలు మరింత సమర్థవంతంగా, శాసీ్త్రయంగా జరిగేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని సర్కారు భావిస్తోంది. ఈ విధానాన్ని త్వరలోనే అమలులోకి తీసుకురావడానికి కార్యాచరణ ప్రారంభించింది. ఎంపికై నవారికి 50 రోజుల శిక్షణ లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకు నిరుద్యోగులు చేసిన దరఖాస్తులు పరిశీలించాక అధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. ఈ నెలాఖరు నుంచే 50రోజుల పాటు వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నిజాం పాలనలో మాత్రమే సెత్వార్ పేరిట సర్వే నిర్వహించారు. ఆ సమయంలో రెవె న్యూ గ్రామాలవారీగా పట్టాదారుల సమాచారంతో ఖాస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. అప్పటినుంచి రెవెన్యూశాఖ దానినే ప్రామాణికంగా పరిగణిస్తూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన చేపట్టింది. భూమి హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. వీటి శాశ్వత పరిష్కారానికే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్వే మ్యాప్లతో రిజిస్ట్రేషన్లులైసెన్స్డ్ సర్వేయర్ల విధానాన్ని అమలు చేయ డం ద్వారా భవిష్యత్లో భూములకు సంబంధించిన వివాదాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని సర్కారు భావిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రైతుల పేర్లు, సర్వే నంబర్, విస్తీర్ణం లాంటి వివరాలతో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆ భూమికి సంబంధించిన మ్యాప్ ఉండదు. కానీ.. లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే రిజిస్ట్రేషన్ కంటే ముందే భూమికి సంబంధించిన మ్యాప్ (స్కెచ్) తయారు చేస్తారు. దానిని సంబంధిత పోర్టల్ అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ సర్వేయర్లు వాటిని పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటేనే ఆమోదిస్తారు. ఈ మ్యాప్లోనే అన్ని వివరాలుంటాయి. దీంతో ఇప్పుడున్న దానికంటే శాసీ్త్రయమైన పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంటుంది. భూ భారతితో పాటు సర్వే మ్యాప్స్ రూపకల్పన కూడా ఒకే సమయంలో అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.న్యూస్రీల్శిక్షణ ఫీజుల వివరాలు రిజర్వేషన్ కేటగిరి ఫీజు ఓసీ అభ్యర్థులు రూ.10వేలు బీసీ అభ్యర్థులు రూ.5వేలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500జిల్లా వివరాలు జిల్లాలోని మండలాలు 19 రెగ్యులర్ సర్వేయర్లు 12 ఐకేపీ సర్వేయర్లు 5 భూముల సర్వే నంబర్లు 1,67,046 భూ విస్తీర్ణం 8,96,523.11 ఎకరాలు26న సర్టిఫికెట్ల పరిశీలన లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా 212 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26న ఉంటుంది. అనంతరం ఎంపికై న వారికి దాదాపు 50రోజులపాటు రెండు దశల్లో స్థానిక పెన్షనర్ సంఘ భవనంలో ఉదయం థియరీ మధ్యాహ్నం ప్రాక్టికల్ క్లాసులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – రాథోడ్ సుదర్శన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, నిర్మల్ -
శాశ్వత భవనం నిర్మించాలి
నిర్మల్చైన్గేట్: నిర్మల్ మెడికల్ కళాశాలలో ఎంబీబీ ఎస్ మూడో సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిర్మల్లో శాశ్వత భవన నిర్మాణం చేపట్టా లని కళాశాల ప్రిన్సిపాల్ ఓరుగంటి శ్రీనివాస్ డీఎంఈ నరేంద్రకుమార్ను కోరారు. ఈ మేరకు శనివా రం హైదరాబాద్లో రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎ డ్యుకేషన్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం కోసం బస్సు వేయాలని, టీచింగ్ ఫ్యాకల్టీని నియమించాలని, కళాశాలలో మంటలు ఆర్పే పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి డీఎంఈ సానుకూలంగా స్పందించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రిన్సిపాల్ వెంట వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మనోజ్కుమార్ ఉన్నారు. -
ఫస్ట్రోజే పాఠ్యపుస్తకాలు
లక్ష్మణచాంద: పాఠశాలల పునఃప్రారంభం రోజే వి ద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాకు 90 శాతం పుస్తకాలను అన్ని మండలాల ఎమ్మార్సీలకు సరఫరా చేసింది. జిల్లాకు పార్ట్–1 పాఠ్య పుస్తకాలు 3,40,220 అవసరముండగా ఇప్పటికే 3,06,740 వచ్చాయి. ఇంకా 33,480 పుస్తకాలు పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి వస్తాయని అధికారులు చె బుతున్నారు. పార్ట్–2 పుస్తకాలు సెప్టెంబర్లో వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. 6–10 విద్యార్థులకూ పాఠ్యపుస్తకాలతోపాటు నోట్బుక్స్ అందజేయనున్నారు. 1–5 తరగతుల విద్యార్థులకు ఇంకా నోట్బుక్స్ రాలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వస్తే వెంటనే అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బడిబాట షెడ్యూల్ ఇలా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఏటా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ పెద్ద ఎత్తున గ్రామసభ నిర్వహించాలి. 7న ఉపాధ్యాయులు ప్రతీ ఇంటికి వెళ్లి బడీడు పిల్ల లను గుర్తించాలి. 8, 9, 10 తేదీల్లో కరపత్రాలతో ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన చేపట్టాలి. డ్రాపౌట్స్ను గుర్తించి పాఠశాలల్లో, ప్రత్యేకావసరాలు గల పిల్లలను గుర్తించి సమీప భవిత కేంద్రాల్లో చేర్పించాలి. 11వ తేదీన 6నుంచి 10వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలి. 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలి. అదేరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, యూనిఫాంలు అందించాలి. 13న ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి. 16న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్) దినోత్సవాలను జరపాలి. అన్ని తరగతి గదుల్లో విషయాల వారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్ ప్రదర్శించాలి. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో తరగతి గదులను అలంకరించాలి. చదవడం, గణిత సంబంధిత అంశాలపై ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు నిర్వహించాలి. 17న సమీకృత విద్య, బాలిక విద్యాదినో త్సవం నిర్వహించి బాల్య వివాహా లు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి. 18న త ల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలీకరణ, ఇత ర ఆధునిక సౌకర్యాలు చూపించాలి. మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వి ద్యార్థులకు వివరించాలి. 19న బడిబా ట ముగింపు సందర్భంగా విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించాలి. ఈ నెల 23 వరకు జిల్లా సమాచారం ప్రాథమిక పాఠశాలలు 577 ప్రాథమికోన్నత పాఠశాలలు 89 ఉన్నత పాఠశాలలు 164 కేజీబీవీలు 18 మొత్తం పాఠశాలలు 848 మొత్తం విద్యార్థులు 71,390 అవసరమైన పార్ట్–1 పుస్తకాలు 3,40,220 ఇప్పటివరకు వచ్చినవి 3,06,740 ఇంకా రావాల్సినవి 33,480 -
ఘనంగా పీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
నిర్మల్చైన్గేట్: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మ హేశ్కుమార్ గౌడ్ జన్మదినాన్ని జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్ ఎంబడి రాజేశ్వర్ ఆ ధ్వర్యంలో పట్టణంలోని నగరేశ్వరవాడ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంత రం డవ్ వృద్ధాశ్రమంలో అనాథలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మహాలక్ష్మివాడలో నిరుపేదల కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కా ర్యక్రమాల్లో కాంగ్రెస్ సేవాదల్ జిల్లా చైర్మన్ కందుల రాజేశ్వర్, కాంగ్రెస్ ఆదివాసీ జిల్లా చైర్మన్ బానావత్ గోవింద్నాయక్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు రాకేశ్, నాయకుడు నాంపల్లి నర్సయ్య, ఎస్సీ సెల్ నాయకులు తలారి రాజేశ్వర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదంపై విచారణ
ముధోల్: మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో శుక్రవారం భూవివాదంపై ఆర్డీవో కోమల్రెడ్డి, అడిషనల్ ఎస్పీ అవినాష్కుమార్ విచారణ చే పట్టారు. కొంతమంది తన భూమి ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారని బాధితుడు కొందపురం సాయన్న ఏప్రిల్ 27న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. దీంతో భూవివా దంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల ని ఆర్డీవో, ఏఎస్పీని కమిషన్ ఆదేశించగా విచా రణ చేపట్టారు. వివాదంలో ఉన్న భూమికి కొ లతలు, హద్దులు నిర్వహించాలని సర్వేయర్ ప్రవీణ్ను ఆదేశించారు. దీంతో తహసీల్దార్ శ్రీ లత ఆధ్వర్యంలో సర్వేయర్, ఆర్ఐలు నారా యణరావుపటేల్, సరస్వతి, రెవెన్యూ సిబ్బంది భూమికి కొలతలు తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. సీఐ మల్లేశ్, ఎస్సై సంజీవ్, పంచా యతీ కార్యదర్శి శివారెడ్డి తదితరులున్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● అధికారులతో సమీక్ష నిర్మల్చైన్గేట్: బాల్యవివాహాలను నియంత్రించాల ని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్యవివా హాల నిర్మూలన, లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం, మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, ఇసుక అక్రమ రవాణా, మున్సి పల్ అంశాలు, రహదారి భద్రత, ఎరువులు, విత్తనాల పంపిణీ తదితర అంశాలపై సంబంధిత అధి కారులతో సమావేశమై మాట్లాడారు. గత రెండేళ్లలో జిల్లాలో 29 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చె ప్పారు. స్కానింగ్, రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాల ను తనిఖీ చేసి అర్హతపత్రాలు పరిశీలించాలని సూ చించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన క ల్పించాలన్నారు. డ్రంకెన్డ్రైవ్ చేపట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయించిన దుకాణాదారులు, డీలర్లపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. బాల్య వివాహాలను నిరోధించడానికి సంక్షేమ, పో లీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపా రు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. త్వరలోనే ట్రాఫిక్, మ హిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని చెప్పారు. గంజాయి, నిషే ధిత మత్తుపదార్థాలు వినియోగించినా.. రవాణా చేసినా టోల్ఫ్రీ నంబర్ 100 లేదా 8712659599కు సమాచారం అందించాలని సూచించారు. అనంత రం మత్తుపదార్థాల నిషేధంపై ముద్రించిన ప్రచార పోస్టర్ను కలెక్టర్, ఎస్పీ, అధికారులు ఆవిష్కరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఏఎస్పీలు అవినాష్కుమార్, రాజేశ్మీనా, ఉపేంద్రరెడ్డి, సంక్షేమ, వైద్యారోగ్య, పోలీస్, అబ్కారీ, ఆర్అండ్బీ, మున్సిపల్, రెవెన్యూ, వ్యవసాయ, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘మావో’ళ్లు ఎట్లున్నరో..!
● ఉద్యమంలో ఉమ్మడి జిల్లా వాసులు ● దశాబ్దాలుగా అడవుల కే పరిమితం ● వైభవం నుంచి ఉనికి కోల్పోతున్న దశకు చేరిన పార్టీ ● ‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో సర్వత్రా చర్చ ● నేతల కుటుంబాల్లో ఆందోళనసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా ఒకప్పుడు వామపక్షవాద ఉద్యమానికి బలమైన కేంద్రంగా ఉండేది. ప్రతీ గ్రామం నక్సలైట్లకు ఆశ్రయంగా మారిన రోజులు గతంలో ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ జిల్లా మావోయి స్టు ప్రభావ రహిత ప్రాంతంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి మావోయిస్టు పా ర్టీని అంతం చేసేందుకు ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ పరిస్థితిలో ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు ఇంకా సిద్ధాంతానికి కట్టుబడి పోరు బాట లోనే కొనసాగుతున్నారు. వారి ఆచూకీపై కు టుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉనికి కోల్పోతున్న ఉద్యమం! ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలపాటు మావోయిస్టు ఉద్యమం బలంగా సాగింది. ప్రస్తుతం దాని ఉనికి దాదాపు క్షీణించింది. వందలాదిమంది కార్యకర్తలు ఎన్కౌంటర్లలో మరణించారు. కొందరు లొంగిపోయారు. పార్టీ కేంద్ర కమిటీ స భ్యుడు కటకం సుదర్శన్ (ఆనంద్, 69) 2024 జూన్లో మరణించారు. సీనియర్ నాయకులు ఒగ్గు సత్వాజీ, కాసర్ల రవి (అశోక్), కంతి లింగ వ్వ, గడ్డం మధూకర్, సుమన్, రవిబాబు లాంటి వారిని పార్టీ కోల్పోయింది. మూల దేవేందర్రెడ్డి అరెస్టయ్యారు. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్క మరణించారు. మావోయిస్టు రహిత జిల్లాగా.. కేంద్ర హోంశాఖ ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల జా బితా నుంచి తొలగించింది. ప్రస్తుతం తెలంగా ణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రమే ఈ జాబితాలో కొనసాగుతోంది. గతంలో నిర్మల్ నుంచి బెజ్జూరు వరకు, బొగ్గు గనులు, అడవులు, గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలా పాలు సాగేవి. పీపుల్స్వార్ గ్రూప్ ద్వారా సింగరేణిలో సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య) బ లంగా పనిచేసిన రోజుల్లో ఎన్కౌంటర్లు తరచూ జరిగేవి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సానుభూతిపరుల బలంతో ఉద్యమం విస్తరించింది. కొత్త నియామకాలతో విద్యావంతులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, గత రెండు దశాబ్దాల్లో పరిస్థితులు మారాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ ఉనికి దాదాపు క్షీణించింది. ఇప్పుడు అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు మినహా ఎలాంటి కార్యకలాపాలు కనిపించడం లేదు. కుటుంబాల్లో ఆందోళన దండకారణ్యం, అబూజ్మడ్ వంటి ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో, ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన నాయకుల ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి బలమైన ఉద్యమం ఇప్పుడు దాదాపు అంతరించిన స్థితిలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణ, ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, జిల్లాలో గతంలో ఉన్న సానుభూతి, కార్యకలాపాలు గణనీయంగా తగ్గడం, భవిష్యత్తులో ఈ ఉద్యమం పూర్తిగా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇప్పటికీ కీలక స్థానాల్లో కొందరు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఇప్పటికీ ఉద్యమ బాట వీడలేదు. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇర్రి మోహన్ రెడ్డి: సెంట్రల్ బ్యూరో, కేంద్ర సాంకేతిక కమిటీ సభ్యుడు. బండి ప్రకాశ్: సింగరేణి కోల్బెల్ట్ కమిటీ సెక్రటరీ, ఇటీవల కేంద్ర కమిటీలో చేరారు. మైలారపు అడెల్లు: స్టేట్ కమిటీ సభ్యుడు, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల కమిటీ ఇన్చార్జి. సలాకుల సరోజ: సీనియర్ నాయకురా లు, పార్టీ ప్రింటింగ్ప్రెస్ బాధ్యురాలు. జాడి వెంకటి, పుష్పలత: సీనియర్ నాయకులు, దండకారణ్యంలో ఉన్నారు. చౌదరి అంకుబాయి, లచ్చన్న, తూము శ్రీనివాస్: సీనియర్ కేడర్గా కొనసాగుతున్నారు. -
భూముల వ్యవహారం తేల్చాలి
నిర్మల్చైన్గేట్: గుమ్మేనాఇంగ్లాపూర్ గ్రామంలో రెవె న్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే ని ర్వహించి భూముల స్థితిగతులు తేల్చాలని ఆదివా సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసం శంభు డిమాండ్ చేశారు. ఈ గ్రామంలో సాగు భూములపై అటవీశాఖ జోక్యం ఆపాలని శుక్రవారం కలెక్టరేట్లో ఏవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుమ్మేనాఇంగ్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల బీసీ, ఆదివాసీ సామాజిక వర్గాలకు చెందిన వారు 50 ఏళ్లుగా రెవెన్యూ, ప్రభుత్వ, లావోణి పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల అ టవీ అధికారులు ఈ భూములు అటవీశాఖకు చెందినవని పేర్కొంటూ సాగు చేయొద్దని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరి పి వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పంద్రం ఆనంద్రావు, నాయకులు లింగన్న, బాబురావు ఎల్లయ్య, పోషన్న, పిట్ల ఎల్ల య్య, సాయిరెడ్డి, ఉప్పు రామవ్వ, మక్కల చిన్నక్క, ఇంకవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
ఖానాపూర్: కొద్దిరోజులుగా కురిసిన అకాల వర్షాల కు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సుర్జాపూర్, బాదనకుర్తి తదితర గ్రామాల రైతులు డిమాండ్ చే శారు. శుక్రవారం మండలంలోని సుర్జాపూర్లో ఖా నాపూర్–మెట్పల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తహసీల్దార్ సుజాత, ఐకేపీ ఏపీఎం భోజ న్న అక్కడికి చేరుకుని ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. నాయకులు, రైతులు బూసి నరేందర్, బక్కశెట్టి అశోక్, శని గారపు శ్రావణ్, అన్ప హరీశ్, సుద్దాల మహిపాల్, బొమ్మెన రాకేశ్, బర్లపాటి రాజేందర్, పుప్పాల ఉపేందర్, తుప్ప నరేందర్ తదితరులున్నారు. -
త్వరలో పట్టాల పంపిణీ
కడెం: పునరావాస ప్యాకేజీలో భాగంగా నిర్వాసితులకు పంపిణీ చేసిన భూములకు రెవెన్యూ పట్టాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీంతో మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాల్లో శుక్రవా రం అధికారులు సమావేశాలు నిర్వహించారు. మరణించిన ఒకరిద్దరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను ఎంపిక చేసి మొత్తం 94మందితో తుది జాబితా ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో వీరందరికీ పట్టాలు అందుతాయని తహసీల్దార్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఎఫ్ఆర్వో అనిత, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, ఆర్ఐ లక్ష్మణ్, సర్వేయర్ ఉమాజీ, హైటికాస్ ప్రతినిధి వెంకట్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ముంగిటకే రైతు నేస్తాలు
నిర్మల్చైన్గేట్: జిల్లాలో 75శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీ విస్తున్నారు. అతివృష్టి, అనావృష్టితోపాటు చీడపీడ ల బెడదతో ఎక్కువమంది రైతులు నష్టపోతున్నా రు. ఇలాంటి పరిస్థితి నుంచి అన్నదాతలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వినూత్న కా ర్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ‘మూస ప ద్ధతి మారాలి.. ఫలితం పెరగాలి’ అనే ఆలోచనతో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్లి వారి సమస్యలు తెలు సుకుంటున్నారు. సలహాలు, సూచనలు ఇస్తూ రైతులను వానాకాలం సాగుకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నెల 5నుంచి కార్యక్రమాలు షురూ.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధనాస్థానం, ఏరువాక కేంద్రం, ముధోల్, నిర్మల్ జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖలతో కలిసి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు‘ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్లో కార్యక్రమం నిర్వహించారు. జూన్ 10వరకు జిల్లాలో లోకేశ్వరం మండలం రాజుర, కుంటా ల మండలం అంబకంటి, బాసర మండల మహిళా పూర్లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. ఇందులో స్థానిక తహసీల్దార్, ఎంపీడీవోతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయులూ భాగస్వాములవుతున్నారు. ఈ అంశాలపైనే ప్రధాన ఫోకస్ దిగుబడి రాక నష్టపోయే రైతులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మూస పద్ధతికి స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు. వరిలో వెద, పత్తిలో అధిక సాంద్రత పద్ధతులు పాటించా లని చెబుతున్నారు. యూరియా, ఇతర రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువు ల వాడకం పెంచాలని సూచిస్తున్నారు. ఇందుకో సం పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట, జీలుగు, పెసర వేసి కలియదున్నాలని చెబుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఇందుకు తక్కువ కాలపరిమితి వంగడాలను సాగుచేయాలని సూచిస్తున్నారు. గట్లపై, ఇతర ఖాళీ ప్రదేశాల్లో విరివిగా చెట్లు నాటాలని చెబుతున్నారు. దీని ద్వారా వాతా వరణంలోని సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని సూచిస్తున్నారు. అన్నిటికన్నా ప్రధానంగా పంట మార్పిడి పద్ధతి పాటించాలని చెబుతున్నా రు. రెండు, మూడేళ్లకోసారి మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. పోషక విలువల ఆధారంగా ఇతర ఎరువులు వినియోగించాలని, ఎరువులు కొన్నప్పుడు రశీదు పొంది భద్రపర్చుకోవాలని చెబుతున్నారు. వీటితోపాటు స్థానికంగా ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం అన్నదాతల చెంతకే శాస్త్రవేత్తలు కొనసాగుతున్న అవగాహన సదస్సులుసద్వినియోగం చేసుకోవాలి ఈ నెల 5నుంచి జూన్10 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు రైతులు సద్వి నియోగం చేసుకోవాలి. అవగాహన కార్యక్రమాలతో రైతులకు మేలు జరుగుతుంది. – అంజిప్రసాద్, డీఏవో సూచనలు పాటించాలి వరిలో వెద, పత్తిలో అధికసాంద్రత పద్ధతి పాటించాలి. తక్కువ కాల పరిమితిలో దిగుబడి వచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవాలి. పంట మార్పిడి, మొక్కజొన్న సాగులో జంట సాళ్ల పద్ధతి అవలంబించాలి. వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. – నర్సయ్య, ప్రధాన శాస్త్రవేత్త -
మొక్కలు సిద్ధం చేయాలి
● బాసర సర్కిల్ సీసీఎఫ్ శర్వాణన్ నర్సాపూర్(జి): వన మహోత్సవానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వాణన్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని కేంద్రీయ హరిత నిధి వన నర్సరీ, ఈజీఎస్ నర్సరీలను గురువారం పరిశీలించారు. మొక్కలను బాధ్యతాయుతంగా సంరక్షించాలని అటవీ అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతంలో గతంలో నాటి ఏపుగా పెరిగిన వివిధ రకాల పండ్ల, ఇతర మొక్కలను పరిశీలించారు. అటవీ జంతువులకు, పక్షులకు ఆహారంగా అవి ఉపయోగపడతాయన్నారు. సిబ్బందికి తగు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట డీఎఫ్వో నాగిని భాను, సారంగాపూర్ డీఆర్వో నజీర్ ఖాన్, ఎఫ్ఎస్వో అలేఖ్య, ఎఫ్బీవోలు సాయరెడ్డి, ఫాజిల్ హుస్సేన్ ఉన్నారు. -
అవగాహనతో మోసాలకు చెక్
● 25 వరకు అంతర్జాతీయ తూనికల వారోత్సవాలు ● జిల్లాలో కనిపించని కార్యక్రమాలు ● రెగ్యులర్ అధికారిగా శంకర్ నియామకంభైంసాటౌన్: అంతర్జాతీయ తూనికలు, కొలతల ది నోత్సవం (మే 20) సందర్భంగా లీగల్ మెట్రాలజీ శాఖ వారోత్సవ కార్యక్రమాలను(మే 25 వరకు) నిర్వహించాలని నిర్ణయించింది. వినియోగదారులను తూకాల్లో మోసాలపై చైతన్యపరచడం, కచ్చితమైన కొలతలను నిర్ధారించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. అయితే, జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తూకాల్లో మోసాలు.. జిల్లావ్యాప్తంగా వ్యాపారులు కూరగాయలు, బియ్యం, మాంసం, పెట్రోల్ వంటి వస్తువుల తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. రైతులు కూడా పంట విక్రయంలో మోసపోతున్నారు. ఎలక్ట్రానిక్, మాన్యువల్ కాంటాలు, వేబ్రిడ్జిలు, పెట్రోల్ పంపులలో తనిఖీలు సక్రమంగా జరగకపోవడం ఈ సమస్యలకు కారణం. దీంతో నిత్యం వినియోగదారులు మోససోతూనే ఉన్నారు. నివారణకు తూనికలు, కొలతల శాఖ పర్యవేక్షణ చేపట్టాలి. తరచూ ఎలక్ట్రానిక్ కాంటాలు, మ్యానువల్ కాంటా బాట్లు, వేబ్రిడ్జిలు, ప్యాకింగ్ వస్తువులు, పెట్రోల్పంపులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇన్చార్జి అధికారుల కొరత జిల్లాకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఇన్చార్జి అధికారులు పనిభారంతో పర్యవేక్షణను నిర్లక్ష్యం చేశారు. దీంతో మోసాలు అరికట్టడం సాధ్యం కాలేదు. ‘సాక్షి’ కథనాల ఒత్తిడితో ఇటీవల రెగ్యులర్ అధికారిని నియమించారు. ఇకనైనా, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, వినియోగదారులకు కచ్చితమైన వస్తు సేవలు అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
పట్టణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: నిర్మల్ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కలెక్ట ర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. క లెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ పరిధిలో చే పట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్, రె వెన్యూ శాఖల అధికారులతో గురువారం సమీక్ష ని ర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లను సుందరీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. చెరువుల అభివృద్ధి, వీధి లైట్ల ఏర్పాటు, రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల ని ఆదేశించారు. జూన్ 30లోపు గృహ, వాణిజ్య ప న్నుల వసూలు వంద శాతం వసూలు చేయాలని ల క్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి త డి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యా ర్డుకి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ వార్డులో పారిశుద్ధ్య, డ్రై డే నిరంతరం కొనసాగించాలన్నారు. దోమల నియంత్రణకు అవసరమైన ఫాగింగ్ మిషన్లు సిద్ధంగా ఉంచాలని వీధి వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ ప్రాంతా ల్లో తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. కూడళ్ల వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అ హ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు, అధికారులు పాల్గొన్నారు. -
స్టిచ్చింగ్ స్లో..!
● 20 రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు ● బడులు తెరిచేనాటికి యూనిఫాం అందడం కష్టమే.. లక్ష్మణచాంద: పాఠశాలలను బలోపేతం చేయడాని కి ప్రభుత్వం బహుముఖ చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు సమగ్ర విద్యను అందించేందుకు తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, రెండు జతల యూనిఫాంలను అందజేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు కొత్త యూనిఫాం ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు నెల క్రితమే విద్యార్థులకు అవసరమైన క్లాత్ను జిల్లాలకు సరఫరా చేసింది. యూనిఫాం స్టిచ్చింగ్ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించింది. అయితే జిల్లాలో యూనిఫాం స్టిచ్చింగ్ పనులు నిదానంగా సాగుతున్నాయి. 48,874 మంది విద్యార్థులు.. జిల్లాలో 577 ప్రాథమిక పాఠశాలలు, 89 ప్రాథమికోన్నత పాఠశాలలు, 164 ఉన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు, ఒక మోడల్ పాఠశాలలో మొత్తం 48,874 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచిత రెండు జతల యూ నిఫాంలు అందించేందుకు, జిల్లాలోని 531 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు యూని ఫాం కుట్టు పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటివర కు 20,500 మంది విద్యార్థులకు ఒక జత యూ నిఫాం స్టిచ్చింగ్ మాత్రమే పూర్తయింది. ఒక్కో జత చొప్పున ఇచ్చిన ఇంకా 28,374 జతలు ఈ నెల 31లోగా కుట్టాల్సి ఉంది. క్లాత్ సరఫరాలో జాప్యం.. ప్రస్తుతం యూనిఫాం కుట్టు కోసం ఒక జతకు సంబంధించిన క్లాత్ మాత్రమే జిల్లాకు సరఫరా అయింది. ఏప్రిల్ 14, 15, 16 తేదీలలో బాటమ్ క్లాత్, షర్ట్ క్లాత్, మే 2,3 తేదీల్లో కొంత భాగం సరఫరా అ యింది. క్లాత్ సరఫరాలో జాప్యం కారణంగా కుట్టు పనిలో కొంత ఆలస్యం జరుగుతోంది. రెండో జత యూనిఫాం కోసం క్లాత్ ఇంకా రావాల్సి ఉంది. అధి కారులు రెండో జత క్లాత్ వచ్చిన తర్వాత ఉన్నతాధికారుల సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. జతకు రూ.75 చెల్లింపు ప్రభుత్వం ఒక జత యూనిఫాం కుట్టడానికి స్వ యం సహాయక సంఘాల మహిళలకు రూ.75 చెల్లి స్తోంది. గతంలో ఒక జతకు రూ.50 చెల్లించగా, ఈ సారి రూ.25 పెంచి రూ.75గా నిర్ణయించారు. ఈ మొత్తంలో రూ.50 కుట్టు కూలీగా, రూ.25 కటింగ్, బటన్స్, కాజాలు వంటి ఇతర ఖర్చుల కోసం కేటా యించారు. ఈ చర్య ద్వారా స్థానిక మహిళలకు ఆర్థి క స్వావలంబనకు అవకాశం కల్పించబడుతోంది.వేగం పెంచుతాం పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు అందజేసే యూనిఫాంలను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాం. ఇప్పటి వరకు 20,500 జతల స్టిచ్చింగ్ పూర్తయింది. ఈ ప్రక్రియను మరింత వేగం చేసి త్వరగా పూర్తి చేసి ప్రధానోపాధ్యాయులకు అందజేస్తాం. – కేవీఎస్.ప్రసాద్, డీపీఎం డీఆర్డీఏప్రారంభానికి అందేలా చూస్తాం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందచేసే యూనిఫాంలు పాఠశాలలు పునఃప్రారంభం నాటికి అందజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. మహిళా సంఘాల సమన్వయంతో స్టిచ్చింగ్ ప్రక్రియ వేగవంతం చేసి సకాలంలో విద్యార్థులకు పంపిణీ చేసేలా పర్యవేక్షిస్తున్నాం. – రామారావు, డీఈవోతరగతుల వారీగా యూనిఫాం డిజైన్లు 1 నుంచి 5వ తరగతి (బాలురు): చొక్కా, నిక్కర్ 6 నుంచి 10వ తరగతి (బాలురు): చొక్కా, ప్యాంట్ 1 నుంచి 3వ తరగతి (బాలికలు): చొక్కా, లాంగ్ ఫ్రాక్ 4 నుంచి 5వ తరగతి (బాలికలు): షర్ట్, స్కర్ట్ 6 నుంచి 10వ తరగతి (బాలికలు): పంజాబీ డ్రెస్ -
వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చర్యలు
● ఎస్పీ జానకీషర్మిలనిర్మల్టౌన్: రానున్న వర్షాకాలంలో జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. వర్షాలతో ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సాయుధ దళ కార్యాలయంలో గురువారం ఫ్లడ్ రిలీఫ్ కోసం ఏర్పాటు చేసిన సామగ్రిని పరిశీలించారు. జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండనున్న దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపడుతామన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్, రోప్ వస్తువులు వాడకంపై పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాంనిరంజన్, రమేశ్, ఆర్ఎస్సైలు రవికుమార్, రాజశేఖర్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
● అన్నదాతల ఆశలపై వాననీళ్లు ● కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిన ధాన్యం ● కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ ● పలు మండలాల్లో ఆందోళనలు
తడిసిన వడ్లు కొనాలి..అకాలవర్షంతో కష్టప డి పండించిన ధా న్యం తడిసిపోయింది. నాతోపాటు చాలా మంది రైతుల పరిస్థి తి ఇలాగే ఉంది. తడిసిన వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చే సి, మద్దతు ధర ఇప్పించాలని కోరుతున్నాం. – జోగు రాజేశ్వర్, ఖానాపూర్వేగవంతం చేయాలి..పదిరోజుల నుంచి సెంటర్లోనే ధాన్యం పెట్టుకుని ఉన్నాం. ఈసారి వర్షాలు ముందుగానే వస్తున్నాయి. ఇంకా వానాలు పడుతాయన్న వాతావరణ సూచనలు ఉన్నాయి. ఇప్పటికై నా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. – కోడె సుధాకర్, నర్సాపూర్(జి)ఖానాపూర్ మండలంలోని రాంరెడ్డిపల్లెలో రాస్తారోకో చేస్తున్న రైతులునిర్మల్: కాలం ఎలా ఉన్నా.. రైతన్నకు కష్టం మా త్రం వెంటే ఉంటోంది. తన సమయం కాకున్నా.. అకాలంలో వచ్చిన వానలు పంట చేతికొచ్చిన రైతులను పరేషాన్ చేస్తున్నాయి. జిల్లాలో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన, సంచుల్లో నింపిన ధాన్యాన్ని తడిపేశాయి. ఇలా తడిసిన ధాన్యాన్ని చేతుల్లో పట్టుకుంటూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈమేరకు జిల్లాలో పలుచోట్ల ఆందోళనలూ చేపడుతున్నారు. అకాల వర్షం.. జిల్లాలో యాసంగిలో 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఈ సీజన్లో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఈమేరకు జిల్లాలో మొత్తం 318 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 1.07 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా 30 వేల నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కొన్ని మండలాల్లో ఇంకా వరికోతలు, కల్లాలు, ధాన్యం ఆరబెట్టడం చేస్తున్నారు. మరోవైపు కొన్ని కేంద్రాల్లోనూ కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. ఇంతలోనే నైరుతీ రుతుపవనాలు, వాతావరణ మార్పులతో అకాలవర్షాలు దూసుకువచ్చాయి. రైతన్నకు సమయం ఇవ్వకుండా చేతిలో ఉన్న పంటను నీళ్లపాలు చేస్తున్నాయి. సాగు ఆలస్యం.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలో వరిసాగు కాస్త ఆలస్యంగానే ఉంటోంది. దాదాపు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాగా, మిగతా జిల్లాల్లో పూర్తయ్యే దశకు చేరాయి. జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఇంకా కొంతమంది రైతుల పంట కోత కూడా కాకపోవడం గమనార్హం. ప్రతీ సీజన్లోనూ ఇలాగే ఉంటుంది. కానీ.. ఈసారి వర్షాలు ముందుగా రావడం ఇక్కడ రైతులకు ఇబ్బందికరంగా మారింది. మరో రెండురోజులపాటు ఇలాగే వర్షాలు ఉంటాయన్న వాతావరణ సూచనల నేపథ్యంలో రైతులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది టార్పాలిన్లను కప్పి, నీళ్లు రాకుండా కాలువలు తీసి, కట్టలు కట్టి పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భారీగా వర్షాలు కురిస్తే మాత్రం వడ్లు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతుల ఆందోళన.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అన్నదాతలు అమ్ముకునే వేళకు అకాలవర్షం వచ్చిపడింది. చాలామంది ముందస్తుగా టార్పాలిన్లను కప్పి పెట్టుకున్నా.. ఆరబెట్టుకున్న ధాన్యంలోకి వర్షపునీ రు చేరింది. కాస్త ఏమరుపాటుగా ఉన్న రైతుల వడ్ల సంచులూ తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే తేమ పేరిట కొర్రీలు పెడుతూ రైతన్నలను తిప్పలు పెడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో తేమశా తం వచ్చినా.. సీరియల్ నంబర్ వచ్చేదాకా వేచిచూడాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్లు రైస్మిల్లర్లు కూడా క్వింటాలుకు ఇంత అంటూ కోతలు పెడుతున్నారు. ఇవన్నీ ఎదుర్కొంటున్నా.. ఎంతోకొంత మిగులుబాటు అవుతుందనుకుంటున్న రైతన్న ఆశలపై ఇప్పుడు వాననీళ్లు వచ్చిపడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం కింద అకాలవర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని సదరు రైతులు కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే పలు మండలాల్లో ఆందోళనలను చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ కొనుగోలుకు భరోసా ఇస్తున్నారు. రోడ్డెక్కిన రైతులు తడిసిన ధాన్యం కోనుగోలు చేయాలని డిమాండ్ ఖానాపూర్/కడెం/మామడ/నర్సాపూర్(జి)/దస్తురాబాద్: : ఖానాపూర్, కడెం, నర్సాపూర్ (జి), మామడ మండలాల్లో రైతులు గు రువారం రోడ్డెక్కారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశా రు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ఖానాపూర్ రైతులు ఎన్టీఆర్ చౌరస్తా, మండలంలోని రాంరెడ్డిపల్లె శివారులోని బాసర–మంచిర్యాల ప్రధాన రహదారిపై వేర్వేరుగా రాస్తారోకోలు చేశారు. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. మండలంలోని అంబారిపేట్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ పరిశీలించారు. మామడ మండలంల పొన్కల్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా చేశారు. నర్సాపూర్(జి) మండ ల కేంద్రంలోని 61వ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తరుగు పేరుతో కోతలు, హమాలీ, లారీల కొరతల కారణంగా రోజుల తరబడి ధాన్యం కుప్పలు అలాగే ఉంటున్నాయ ని రైతులు మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని షరతులు, కోతలు లేకుండా కొనుగోలు చేయాలని, జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్లో రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐఎంఎల్ నాయకులు మద్దతు తెలిపారు. కడెంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రైతులతో మా ట్లాడి, కొనుగోలకు హామీ ఇచ్చారు. నర్సాపూర్లో ధాన్యం తరలింపు జాప్యం, టార్పాలిన్ల కొరతతో రైతులు రాస్తారోకో చేపట్టగా, తహసీల్దార్ శ్రీకాంత్ సమస్య పరిష్కార హామీతో విరమించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కుప్పలు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ల అదనపు తూకం, తరుగు కోతలతో కూడా నష్టపోతున్నామని పేర్కొన్నారు. దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట, దస్తురాబాద్, బుట్టాపూర్ కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పరిశీలించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్: అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 80 శాతానికిపైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. ఖానాపూర్ ప్రాంతంలో ఆలస్యంగా నాట్లు వేయడంతో ధాన్యం ఆలస్యంగా వచ్చిందన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు దిగాలు చెందొద్దన్నారు. జిల్లాస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులను ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో ధాన్యం తూకం వేయిస్తామన్నారు. అధికారులు గంటగంటకు అప్డేట్లు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యంలో ఇష్టారాజ్యంగా కోతలు విధించిన 22 రైస్ మిల్లులపై ఇప్పటికే కేసులు నమోదు చేయించామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు సహకార సంఘం అధికారులు, సిబ్బంది తీరుపై కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ధాన్యం తూకం వేసేందుకు నిర్వాహకులు కమీషన్లు ఆశిస్తున్నారని దీంతో తూకంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. గన్నీ సంచులు, హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
దేశం గర్వించే సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ
నిర్మల్చైన్గేట్: దేశం గర్వించదగ్గ సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ అని అదనపు కలెక్టర్ ఫైజా న్అహ్మద్ అన్నారు. భాగ్యరెడ్డివర్మ 137వ జ యంతి వేడుకలను కలెక్టరేట్ సమావేశ మంది రంలో గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ జ్యోతిప్రజ్వలన, చిత్రపటానికి పూలమాల చేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కి, ముఖ్యంగా దళిత మహిళల విద్యాభివద్ధికి భాగ్యరెడ్డివర్మ చేసిన కృషి అపూర్వమన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అభివృద్ధి శాఖల అధికారులు రాజేశ్వర్గౌడ్, శ్రీనివాస్, శంకర్, మోహన్సింగ్, నరసింహారెడ్డి, దళిత సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో..నిర్మల్టౌన్: భాగ్యరెడ్డివర్మ జీవితం నేటి తరానికి ఆదర్శమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భాగ్యరెడ్డి జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనిస్ అలీ, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్కుమార్, సమ్మయ్య, ఆర్ఐలు రామ్నిరంజన్, రమేశ్, ఆర్ఎస్ఐలు రవికుమార్, రాజశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
దస్తురాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకో వాలని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ కె.సత్యనారాయణరెడ్డి సూచించారు. మండలంలోని మున్యాల జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణను గురువారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న డిజిటల్ కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో మార్పులు చేసుకోవాలని సూ చించారు. ప్రతీ ఉపాధ్యాయుడు శిక్షణను సద్వి నియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గంగాధర్, ప్రధానోపాధ్యాయుడు వేణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలు ● డీఈవో పి.రామారావు లక్ష్మణచాంద/ఖానాపూర్: ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలని డీఈవో రామారావు అన్నారు. మండలంలోని వడ్యాల్ ఉన్నత పాఠశాలలో, ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బా లికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను గురువారం పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించాలని సూచించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)బోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎంఈవోలు ఆర్.అశోక్వర్మ, ప్రేమ్సాగర్, మండల రిసోర్స్ పర్సన్లు అర్చన, శివరాణి, మోహన్, చంద్రమోహన్, తేజ, సాయన్న, గంగాధర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు మహేందర్, సుధాకర్, డీఆర్పీలు తిరుమలేశ్, సుజాత, సీఆర్పీలు కవిత, వనిత, పాల్గొన్నారు. -
భైంసా ఏరియాస్పత్రికి కార్పొరేట్ కళ
భైంసాటౌన్: భైంసా ప్రభుత్వ ఏరియాస్పత్రికి కా ర్పొరేట్ కళ సంతరించుకోనుంది. ఈ మేరకు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ బ్రాండింగ్ పథకానికి ఈ ఆస్పత్రిని ఎంపిక చేసింది. తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రిలో మౌలిక వ సతులు, సుందరీకరణ, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్, టీఎస్ఎంఐడీసీ ఇంజినీరింగ్ విభా గం అధికారులు ఏరియాస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, ఆర్ఎంవో కై లాస్పతితో చర్చించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. భైంసా ఏరియాస్పత్రిలో అవసరమైన మౌలిక వసతులు, సుందరీకరణ, పార్కింగ్, ఓపీ, ఐపీ బ్యూటిఫికేషన్, ఫైర్సేఫ్టీ, గార్డెనింగ్ తదితర పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ వి భాగం అధికారులు రూపొందించిన నివేదికను టీవీ వీపీ కమిషనర్కు అందిస్తామన్నారు. ఆపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపడతామని చెప్పారు. -
23న తిరంగా ర్యాలీ
నిర్మల్చైన్గేట్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా మన దేశ సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తిరంగా ర్యాలీ జిల్లా కన్వీనర్ మేడిసమ్మె రాజు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ర్యాలీ అంబేడ్కర్ చౌక్ నుంచి వివేక్ చౌక్కు చేరుకుంటుందని తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాలవారు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాట్లాడుతున్న నాయకులు -
శిక్షణ కేంద్రాల తనిఖీ
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న మండల స్థాయి శిక్షణ కేంద్రాలను బుధవారం జిల్లా విద్యాధికారి రా మారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రాథమిక తరగతులకు బోధించే ఉపాధ్యాయులు తమ బోధన తీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. శిక్షణకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. శిక్షణ కేంద్రాలను రాష్ట్ర బాధ్యుడు రామకృష్ణ పరిశీ లించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశా రు. ఎంఈవో వెంకటేశ్వర్, కోర్సు బాధ్యుడు గజ్జరామ్, డీఆర్పీలు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ‘భూభారతి’ అమలు
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● కుంటాలలో అధికారులతో సమీక్ష ● ముధోల్లో వ్యవసాయ క్షేత్రం పరిశీలన కుంటాల: భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దా ర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన స మీక్షా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు నోటీసు జారీ చేసి ఇరుపక్షాల సమక్షంలో పారదర్శకంగా విచారణ చేపట్టి స మస్యలు పరిష్కరించాలని సూచించారు. సమా వేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్లు కమల్సింగ్, ఎజాజ్ అహ్మద్ఖాన్, ప్రవీణ్కుమార్, డీటీ నరేశ్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. ‘మహా’జొన్నలు కొనుగోలు చేయొద్దు మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్నలను కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు అన్యాయం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. త్వరలో కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. కొనుగో ళ్లకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, డీసీవో పల్లె పాపారావు, త హసీల్దార్ కమల్సింగ్, పీఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, సీఏవో నాగభూషణం తదితరులున్నారు. పంట మార్పిడితో లాభాలు ముధోల్: మట్టి నమూనా పరీక్షలు చేయించుకుని పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని తరోడ గ్రామంలో రైతు హ ర్షియాబేగం సాగుచేస్తున్న సమీకృత వ్యవసాయ క్షే త్రాన్ని పరిశీలించారు. ఉపాధిహామీతోపాటు ఐకేపీ నుంచి తీసుకున్న రుణంతో వివిధ పంటలు, కూరగాయలు, పశువులు, చేపల పెంపకం చేపట్టడాన్ని అభినందించారు. కంపోస్టు ఎరువులను ఎక్కువగా వాడి తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు పొందాలని సూచించారు. చేపల పెంపకంతో ఉపాధి పొందడంతోపాటు భూగర్భ జలాలను పెంచవచ్చని పేర్కొన్నారు. రెండు గుంటల భూమిలో చేప ల పెంపకంతో ఏడాదికి రూ.4లక్షల ఆదాయం సంపాదించవచ్చని తెలిపారు. సమీకృత క్షేత్రంపై రైతులకు అవగాహన కల్పించారు. డీఆర్డీవో విజయలక్ష్మి, ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో శివకుమార్, ఏపీవో శిరీష, ఏపీఎం గురుచరణ్, ఉపాధిహామీ సిబ్బంది యోగేశ్, భాస్కర్రెడ్డి, సుశీల్, పోశెట్టి, సూర్యకాంత్, వందేమాతరం, వీవోఏ ఓమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మొదటి స్థానంలో నిలవాలి
నిర్మల్టౌన్: ఇప్పటివరకు ఆదిలాబాద్ రీజియ న్లో నిర్మల్ డిపో మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్లో రాష్ట్రంలోనూ మొదటి స్థానంలో నిలువాలని ఆదిలాబాద్ ఇన్చార్జ్ రీజినల్ మేనేజర్ ప్రణీత్ ఆకాంక్షించారు. బుధవారం నిర్మల్ ఆర్టీసీ డిపోను డిప్యూటీ ఆర్ఎం శ్రీహర్షతో కలి సి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదాయ, వ్య యాల గురించి ఆరా తీశారు. కండక్టర్లు, డ్రైవర్ల పనితీరును పరిశీలించారు. పలు ఫైళ్లను తనిఖీ చేశారు. వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులకు అనుగుణంగా బ స్సులను సమయపాలనతో నడపాలని సూ చించారు. డిపో మేనేజర్ పండరి, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో జాప్యంపై రైతుల రాస్తారోకో
● ఆర్డీవో హామీతో ఆందోళన విరమణకుంటాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తుండటంతో బుధవారం మండలంలోని అర్లి(కే) క్రాస్ రోడ్ వద్ద నిర్మల్–భైంసా 61 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. రెండురోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ధాన్యం తడుస్తోందని రైతులు వాపోయా రు. విషయం తెలుసుకున్న భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. రైతులు ఆర్డీవోకు సమస్య వివరించారు. రెండురోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని ఆర్డీవో హామీ ఇవ్వగా వారు శాంతించారు. గంటన్నరపాటు రాస్తారోకో చేయగా రో డ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. భైంసాటౌన్ సీఐ గోపీనాథ్, ఏఎస్సైలు దేవన్న, శంకర్, లింబాద్రి పరిస్థితిని చక్కదిద్దారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్ కొ మ్రే వార్, సోషల్ మీడియా ఇన్చార్జి పెంటవార్ దశరథ్, మండల కన్వీనర్లు పడకంటి దత్తాత్రి, కోర్వ శ్యామ్, అశోక్ రాథోడ్, రాజుర అనిల్, రజనీకాంత్, రావుల పోశెట్టి, అసడే సజన్, వంశీ హుస్సేన్, ఎ ర్రం తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
రాజీవ్గాంధీకి నివాళి మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాతావరణం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముంది. పుష్కరఘాట్లపై మట్టి కుప్పలుబాసరలోని గోదావరి పుష్కరఘాట్లు అపరిశు భ్రంగా మారాయి. వాటిపైనున్న మట్టికుప్పల తో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ● కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వరి ధాన్యం ● కొన్నిచోట్ల కొట్టుకుపోయిన వ డ్లు ● నేలవాలిన వరి, నువ్వు చేన్లు ● అవస్థలకు గురైన అన్నదాతలు గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 20258లోu లోకేశ్వరం/లక్ష్మణచాంద/కుంటాల/భైంసాటౌన్/భైంసారూరల్/మామడ/ఖానాపూర్/పెంబి/ దస్తురాబాద్/తానూరు: జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం రైతుల వరి ధాన్యాన్ని తడిపేసింది. రైతులు రాత్రిపూట ధాన్యం తడ వకుండా ఉండేందుకు నానా తిప్పలు పడ్డారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తూకంలో జాప్యం కారణంగానే ధాన్యం తడిసినట్లు రైతులు ఆరోపించడం గమనార్హం. లోకేశ్వరం మండలం జోహర్ఫూర్, అబ్దుల్లాపూర్, రాయపూర్కాండ్లీ, ధ ర్మోరా, పంచగుడి, పిప్రి, వట్టోలి, గడ్చాంద, రా జూర, అర్లి, గొడిసెరా, నగర్ తదితర గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, మె రుపులతో కురిసిన వర్షానికి వరి, నువ్వు చేన్లు నేలవాలాయి. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. లక్ష్మణచాంద మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి వరి, నువ్వు ధాన్యం తడిసింది. కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. లక్ష్మణచాంద మండలంలో బుధవారం సా యంత్రం కురిసిన కుండపోత వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. కుంటాల మండలంలోనూ బుధవారం వేకువజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. అప్రమత్తమైన రైతులు కల్లాల వద్దకు పరుగులు పెట్టి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పారు. బుధవారం ఉదయం కురిసిన వర్షానికి భైంసా మండలంలోని దేగాం, ఇలేగాం, కామోల్, కుంసర, వానల్పాడ్, మహాగాం తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు అవస్థలు పడ్డారు. వాలేగాం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. భైంసా పట్టణంలోనూ భారీ వర్షం కురిసింది. మామడ మండలం పొన్కల్, మామడ, కొరిటికల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న, రైతులు సంచుల్లో నింపుకొన్న ధాన్యం తడిసింది. తానూరు మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఖానాపూర్ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యం వరదనీటికి కొట్టుకుపోయింది. ఖానాపూర్ పట్టణంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురియగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. శివాజీనగర్, బస్టాండ్ ఏరియాలో వరదనీరు డ్రైనేజీల నుంచి రోడ్లపై వరదలా పారింది. దీంతో పట్టణవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్, తాంశా, కౌట్ల(కే) చించోలి, ముజ్జిగాలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. పెంబి మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి, నువ్వు పంటలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. కొన్ని చోట్ల వడ్లు వరద ఉధృతికి కోట్టుకుపోయాయి. మండలంలోని మందపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవకుండా ఎస్సై హన్మాండ్లు రైతులతో కలిసి కుప్పలపై టార్పాలిన్లు కప్పి సాయపడ్డారు. దస్తురాబాద్ మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా సంబంధిత సిబ్బంది పునరుద్ధరించారు. మొత్తంగా అకా ల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. -
ఇద్దరు యువకుల బైండోవర్
నిర్మల్రూరల్: గంజాయి విక్రయిస్తున్నారన్న అనుమానంతో జిల్లా కేంద్రంలో ఇద్దరు యువకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. గుండంపెళ్లి గ్రామానికి చెందిన సత్యపోలు యోగేష్, భైంసా పట్టణం పురాణ బజార్కు చెందిన షేక్ కై ఫ్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద ఎలాంటి గంజాయి లభించలేదు. కానీ భవిష్యత్లో గంజాయి సేవించడం లేదా విక్రయిస్తారన్న అనుమానంతో వారిద్దరిని రూరల్ తహసీల్దార్ సంతోష్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇసుక ఫిల్టర్ చేసే బోట్ సీజ్
జైనథ్: పెన్గంగ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యాపారి అభిలాష్రెడ్డితో పాటు సాంగ్వి గ్రామ వీడీసీ సభ్యులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు పెన్గంగ నది శివారులోని సాంగ్వి గ్రామం వద్ద ఎస్సై గౌతమ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉల్లాస్, సిబ్బందితో కలిసి దాడు లు నిర్వహించినట్లు తెలిపారు. ఇసుకను ఫిల్టర్ చేసే బోట్ను సీజ్ చేసినట్లు పేర్కొ న్నారు. వారిపై ఇసుక దొంగత నం, పీడీపీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. -
విత్తనాలు కొంటున్నారా?
● జాగ్రత్తలు తప్పనిసరిచెన్నూర్రూరల్: మరికొద్ది రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభమవుతోంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలులో రైతులు బిజీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమతులు లేని కంపెనీలకు చెందిన విత్తనాలు, కల్తీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని వివరాలు పరిశీలించాకే కొనుగోలు చేయాలి. అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలని చెన్నూర్ ఏవో యామిని సూచించారు. లైసెన్స్ లేని దుకాణాలు, దళారుల వద్ద ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకూడదు. సరుకు, లాట్ నంబర్, తయారీ, తేదీ, రకం ఇలా అన్ని వివరాలు ఉండి సంతకం చేసిన బిల్లును విక్రయదారు (షాపు) నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. సంచులపై సీల్ తీసినట్లు లేదా విప్పదీసి తిరిగి కుట్లు వేసినట్లు కనిపిస్తే తీసుకోకూడదు. వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన డీలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల నుంచి మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలి. క్రిమిసంహారక మందుల డబ్బాలపై కంపెనీ పేరు, తేదీ, కాలపరిమితి, గమనించి రసీదులు తీసుకోవాలి. ఏది ఎంత ధరతో కొన్నా.. డీలర్ లేదా దుకాణాదారు సంతకంతో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి. మీరు తీసుకున్న విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు నకిలీవని అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. అలాగే లాట్ నంబర్, తయారీ తేదీలను తప్పనిసరిగా చూసుకోవాలి. లేదంటే గతేడాది విత్తనాలు, మందులు, ఎరువులు అంటకడతారు. రైతులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి కాలం చెల్లిన మందులు, ఎరువులు, విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. అలాగే మందు డబ్బాలపై ఆకుపచ్చని లేబుల్ ఉందో లేదో గమనించాలి. ఆకుపచ్చ లేబుల్ ఉంటేనే ఆ మందును కొనుగోలు చేయాలి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలు విషయంలో రైతులు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించి నాణ్యమైన దిగుబడులు పొందాలి. -
విదేశీ పర్యటనకు ఏవో
● మంత్రులు, ఐఏఎస్లతో కలిసి వెళ్లనున్న విశ్వనాథ్ ● బెల్లంపల్లికి చెందిన హార్టికల్చర్ అధికారి కూడా..ఆదిలాబాద్టౌన్: వ్యవసాయ శాఖ ద్వారా విదేశాల్లో అధ్యయనం కోసం ఆ శాఖ మంత్రి, ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాన్ని పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎం.రఘునందన్రావు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కె.సురేంద్ర మోహన్, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏవో గా పనిచేస్తున్న విశ్వనాథ్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఉద్యానవన అధికారి జె. అర్చన ఎంపికయ్యారు. వీరు నెదర్లాండ్, ఫ్రాన్స్లోని ప్యారీస్ లలో పర్యటించనున్నారు. జూ న్ 10 నుంచి 15 వరకు కొనసాగే పర్యటనలో ఆ దేశాల్లో వ్యవసాయం, ఉద్యానవన పంటల సాగు స్థితిగతులు, దిగుబడులు సాధించేందుకు అనుసరి స్తున్న విధానాలు, నూతన వంగడాల సృష్టికి అవలంభిస్తున్న పద్ధతులు వంటి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. మూడు రోజుల చొప్పున ఆయా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్ర బృందంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు ఉండటంతో ఇక్కడి రైతులకు సాగుపరంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
యూత్ కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ
మంచిర్యాలటౌన్: సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా అవమానించడాన్ని నిరసిస్తూ బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వర్గీయులు బూతులు తిడుతూ అడ్డుకున్నారని ఎంపీ వర్గీయులు తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా వినకుండా తమను అడ్డుకోవడం సరికాదని యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, ఆసంపల్లి శ్రీకాంత్ అన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పున్నం, సృజన్, మాయ తిరుపతి, దాసరి సంపత్, శ్రీశైలం, అరుణ్, రాజేశ్, వెంకటేశ్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ ప్లాంట్ పనులపై సమీక్ష
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సింగరేణి నూతనంగా ఏర్పాటు చేస్తున్న 67.5 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ పనులపై ఏరియా జీఎం ఆఫీస్ ఆవరణలోని కాన్ఫ్రెన్స్ హాల్లో సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ బుధవారం ఏరియా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏరియా జీఎం దేవేందర్తో పాటు అధికారులను అడిగి పనుల అభివృద్ధిని తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జీఎం (ఈఅండ్ఎం) సోలార్ ఎనర్జీ జీఎస్ జానకీరామ్, ఎస్వో టూ జీఎం విజ య్ప్రసాద్, ఏరియా ఇంజనీర్ (ఈఅండ్ఎం) వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ శ్యామ్సుందర్, కేకే గ్రూపు ఏజెంట్ రాంబాబు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఐఈడీ రాజన్న పాల్గొన్నారు. -
టోల్ ట్యాక్స్ నిలిపివేయాలని ధర్నా
చెన్నూర్రూరల్: కిష్టంపేట సమీపంలోని వైజంక్షన్ వద్ద టోల్ ట్యాక్స్ నిలిపి వేయాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో టోల్గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ట్యాక్స్ పేరుతో దోపిడీకి గురిచేస్తున్నారన్నారు. అటవీశాఖలో ఎక్కడా ఈ టాక్స్లు వసూలు చేయడం లేదన్నారు. కాళేశ్వరంలో పుష్కరాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ట్యాక్స్ వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తుల సమ్మయ్య, రాపర్తి వెంకటేశ్వర్గౌడ్, బుర్ర రాజశేఖర్గౌడ్, తుమ్మ శ్రీపాల్, తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు సరికాదు’
జైపూర్: జైపూర్ మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతిపై మాదిగ హక్కుల దండోరా నాయకులు చేసిన అసత్యపు, నిరాధారమైన ఆరోపణలు ఖండిస్తున్నామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాన్గెజిటెడ్ ఉద్యోగుల సంఘం మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి సతీశ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై కక్షపూరితంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతి, సభ్యులు రవిచందర్, శ్రీనివాస్, ప్రశాంత్, సత్యనారాయణ, సురేశ్, ఉదేయ్కుమార్, స్వామి, అపర్ణదేవి, రజిత, విజయ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర ఘాట్లపై మట్టికుప్పలు
● బాసరలో భక్తులకు తప్పని అవస్థలుబాసర: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతీ అమ్మవారు కొలువైన బాసర గో దావరిన ది పుష్కరఘాట్ల వద్ద పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి పుష్కర ఘాట్ నుంచి రెండో పుష్కరఘాట్ వరకు గోదావరి నీటి ప్రవాహం తగ్గడంతో పుష్కరఘాట్లపై నల్లమట్టి పెద్దపెద్ద కుప్పలుగా పే రుకుపోయింది. బాసర సరస్వతీ అమ్మవారి సన్ని ధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దక్షిణాది రా ష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ముందుగా పవిత్ర గోదావరినదిలో పుణ్య స్నానం ఆచరించడం పుణ్యఫలంగా భావిస్తారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనంతో గోదావరి ఘాట్ తీరమంతా అస్తవ్యస్తంగా మారింది. బురద, చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. బాసర ప్రధాన స్నానఘాట్ పైభాగంలో గంగమ్మ విగ్రహం, ఘాట్ కిందిభా గం మెట్ల వద్ద శివలింగం ఉంది. ఇక్కడ అనేక ఏళ్లుగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల పారిశుద్ధ్య నిర్వహణ గాలి కొదిలేయడంతో శివలింగం కళ తప్పుతోంది. ఎంట్రన్స్లోనే పుష్కర ఘాట్లు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. కలుషిత నీటిలోనే స్నానాలు మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో పుట్టిన గోదారమ్మ బాసర వద్ద చదువులమపాదాలను తాకి తెలుగురాష్ట్రాల్లోకి అడుగిడుతుంది. ఎగువన భారీ వర్షాలు కురిసినపుడు వచ్చే వరదలతో ఘాట్లు పరిశుభ్రమవుతున్నాయే తప్ప అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. గత పుష్కరాల సమయంలో రూ.10 కోట్లు వెచ్చించి నిర్మించిన ఘాట్లు అధ్వానంగా మారిపోయాయి. ఫలితంగా పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. అంతేకాకుండా గోదావరినదిలో నీళ్లు కూడా కలుషితం అయ్యాయి. ఆలయ అధి కారులు భక్తుల సౌకర్యార్థం షవర్స్ ఏర్పాటు చేసినా కొంతమంది భక్తులు కలుషిత నీటిలోనే స్నా నాలు చేస్తున్నారు. ఇప్పటికై నా దేవాదాయశాఖ అధి కారులు స్పందించి పుష్కరఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
జైనథ్ : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద బుధవారం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై గౌతమ్ తెలిపారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్నగర్కాలనీకి చెందిన సాహీల్, ముషీర్ గంజాయి విక్రయిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసి 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేకాడుతున్న 13 మంది..నేరడిగొండ: పేకాడుతున్న 13 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది తో కలిసి వెళ్లి మండల కేంద్రంలోని నీలిమ దా బా వెనకాల దాడులు నిర్వహించి పేకాడుతు న్న 13 మందిని పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి పేక ముక్కలతో పా టు రూ.14,080 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సయ్యద్ జహీర్, గడ్డం రవి చందర్రెడ్డి, గూడూరు లవకుమార్, రాథోడ్ రవీందర్, అల్లూరి శివారెడ్డి, ఉప్పు పోశెట్టి, సోలంకి శ్రీనివాస్, నల్ల అడెల్లు, సోలంకి కరన్ సింగ్, గోతి గులాబ్ సింగ్, మాడ గంగాధర్, అల్లూరి శ్రీనివాస్ రెడ్డి, పవార్ సంతోష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. టపాసులతో ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిపై కేసుఆదిలాబాద్టౌన్: అర్ధరాత్రి టపాసులు పేల్చి జనాలను ఇబ్బందికి గురిచేసిన వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. వడ్డెర కాలనీకి చెందిన చోట ముష్రఫ్ తన జన్మదినం సందర్భంగా ఇంటి ముందు, బిల్డింగ్పై బాణసంచాలు పేల్చాడు. దీంతో చుట్టుపక్కల వారు ఇబ్బందులకు గురయ్యారు. ఓ ఇంటిపై వేసిన ప్లాస్టిక్ కవర్కు నిప్పు అంటుకోవడంతో కొంత భాగం కాలిపోయింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. ఐదుగురిపై.. ఆదిలాబాద్రూరల్: మండలంలోని చాందా (టి) శివారు ప్రాంతం మీదుగా ఎలాంటి డా క్యుమెంట్లు లేకుండా వాహనంలో రెండు ఎ డ్లను తరలిస్తున్న రాథోడ్ నితిన్, షేక్ సాకీర్పై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి ష్ణు వర్ధన్ తెలిపారు. అలాగే వాహనాన్ని అడ్డుకుని బెదిరింపులకు గురి చేసిన చాందా (టి) గ్రామానికి చెందిన ముగ్గురు యువకులపై రాథోడ్ నితిన్, షేక్ సాకీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దాడి చేసిన వ్యక్తులపై.. ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని పండ్ల వాపారిపై దాడికి పాల్పడిన షన్ను, మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో తోపుడు బండ్లపై షేక్ షహెబాజ్ పండ్లు విక్రయిస్తున్నాడు. ఎద్దు వచ్చి పండ్లను తింటుండగా అతను ఎద్దును కొట్టడంతో షన్నుకు తగిలింది. దీంతో ఆయన ద్విచక్ర వాహనం దెబ్బతింది. ఇందుకు రూ.2వేలు ఇవ్వాలని అడిగాడు. తనవద్ద లేవని చెప్పడంతో తన మిత్రులను పిలిచి షహెబాజ్పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
నిర్మల్టౌన్: జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసులు సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివాదాలు రాజీపడే క్రిమినల్ కేసులు, పెండింగ్లో ఉన్న మోటార్ కేసులు, పెట్టి కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు కక్షిదారులందరికీ సమాచారం అందించి రాజీ పడేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఇందులో నిర్మల్ ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్, రాజేశ్మీనా, జిల్లాలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ కనిపిస్తే కాల్ చేయండి జిల్లాలో మత్తు పదార్థాలు ఎవరైనా విక్రయిస్తే పోలీ సులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జానకీషర్మిల మంగళవారం కోరారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసినా, విక్రయించినా 8712659599 నంబర్కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
● ఆర్జేడీ సత్యనారాయణరెడ్డినిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులలో నమ్మకం పెంచాలని వరంగ ల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. రెండో విడత ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంగళవారం పరిశీలించారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా కాలానికి అనుగుణంగా బోధనా విధానం మార్చుకోవాలని సూచించారు. ప్రతీ ఉపాధ్యాయుడికి శిక్షణ లక్ష్యాలు తెలిసి ఉండాలన్నారు. అకాడమిక్ మానిటరింగ్ అధికారి నరసయ్య, జిల్లా ప్రణాళిక సమన్వయకర్తలు రాజేశ్వర్, లింబాద్రి, డీఆర్పీలు పాల్గొన్నారు. ఆరోగ్య మెలకువలు నేర్పాలి.. వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతీరోజు విద్యార్థులకు ఆరోగ్య మెలకువలు నేర్పాలని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కత్తి కిరణ్ అన్నారు. విజయ హైస్కూల్లో నిర్వహిస్తున్న వ్యాయామ ఉపాధ్యా య శిక్షణ శిబిరంలో మాట్లాడారు. విద్యార్థులతో రోజూ ఆసనాలు వేయించాలన్నారు. సరైన క్రమంలో వ్యాయామం చేయకపోతే జరిగే అనర్థాలను వివరించారు. అధికారులు ప్రవీణ్ కుమార్, శ్రీని వాస్, భూమన్న, జమున, అన్నపూర్ణ పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ గెలల కోత షురూ..
లోకేశ్వరం: మండలంలోని పంచగుడి గ్రామంలోని ఆలూర్ శ్రీనివాస్రెడ్డి ఆయిల్పామ్ తో టలో మొదటి గెలల కోతను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయిల్పామ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇద్దరు రైతులకు కొనుగోలు కేంద్రం ఐడీ కార్డులు అందజేశారు. ఆయిల్పాం టన్ను ధర ప్రస్తుతం రూ.21 వేలు ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి రమణ, ప్రియూనిక్ ఇండియా కంపెనీ డీజీఎం మల్లేశ్వర్రావు, భైంసా మార్కెట్ కమిటీ చెర్మన్ ఆనంద్రావు పటేల్, పీఏసీఎస్ చెర్మన్ రత్నకర్రావు, బీజేపీ మండల కన్వీనర్ సాయన్న, ఆయిల్పామ్ ఏరియా మేనేజర్ శేఖర్ పాల్గొన్నారు. కోత ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్ -
ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: జిల్లాలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పర్యావరణానికి ప్లాస్టిక్ హానికరంగా మారుతోందని, మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాల సహకారంతో కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. పంచాయతీ స్థాయిలో ప్లాస్టిక్ నిషేధానికి అనుగుణంగా తీర్మానాలు చేయాలన్నారు. కలెక్టరేట్లో ఇప్పటికే స్టీల్ బాటిళ్లు వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు, వ్యాపార లైసెన్సులను రద్దు చేయడం సహా చట్టపరమైన చర్యలకు వెనకాడొద్దని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జూట్, పేపర్ సంచుల తయారీ కేంద్రాలను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాలని, దోమల నియంత్రణకు ఫాగింగ్ యంత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవోలు రత్నాకళ్యాణి, కోమల్రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, రాజేశ్కుమార్, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
‘గిరి’ రైతులకు చేయూత
● పోడు భూముల్లో సాగుకు సర్కారు తోడ్పాటు ● ‘ఇందిర సౌర జల వికాసం’తో ముందడుగు ● ఉమ్మడి జిల్లాలో పలువురికి చేకూరనున్న లబ్ధి ● డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఈ వారంలో ప్రారంభం ఉమ్మడి జిల్లాలో గిరి తెగల జనాభా.. (2011 జనాభా లెక్కల ప్రకారం) గోండు : 2,63,515 లంబాడా : 1,12,793 కొలాం : 38,176 కోయ, ఇతరులు : 30,739 పర్దాన్ : 26,029 మన్నెవార్ : 15,370 నాయక్పోడ్ : 5,206 తోటి : 2,231 ఎరుకల : 1,735 మొత్తం జనాభా : 4,95,794 పోడు భూముల వివరాలు.. విస్తీర్ణం : 2,12,256 ఎకరాలు రైతుల సంఖ్య : 66,839 పట్టాల జారీ సంఖ్య : 66,839 సాక్షి, ఆదిలాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి కుటుంబ ఆదాయం రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఇందిర సౌర గిరి జలవికాసం అనే ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ పథకాన్ని ఈ వారంలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ఈమేరకు లబ్ధి చేకూరనుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక మంది గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం కింద పోడు వ్యవసాయం చేసుకునేందుకు భూ యాజమాన్య హ క్కును కల్పించింది. ఆ భూముల్లో రాబోయే ఐదేళ్లల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రస్తుతం సర్కా రు నిర్ణయించింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. లబ్ధి ఇలా.. పోడు భూముల్లో వంద శాతం సబ్సిడీతో సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. తద్వారా ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చి గిరి రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో బోరుబావుల స్థానంలో చేతిబావులు తవ్వించాలని ఐటీడీఏ నిర్ణయించింది. దీనికి ఇందిర సౌరజల వికాస పథకం ద్వారా సౌర పలకలు బిగించనున్నారు. అర్హులు వీరు.. అటవీ హక్కు చట్టం కింద జారీ చేయబడిన భూ యాజమాన్యం హక్కు కలిగిన ప్రతీ గిరిజన రైతును అర్హులుగా నిర్ణయించారు. సదరు రైతుకు రెండున్న ర ఎకరాలు(హెక్టారు), అంతకంటే ఎక్కువ ఉంటే ఒక యూనిట్గా మాత్రమే మంజూరు చేస్తారు. అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నట్లయితే సరిహద్దులో గల ఇద్దరి నుంచి ఐదుగురిని గ్రూప్గా ఏర్పా టు చేసి యూనిట్గా మంజూరు చేయనున్నారు. అభివృద్ధి పనులు ఇవి.. ● ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు. ● ఉపాధిహామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ● ఈ భూముల్లో భూగర్భ, నీటి సర్వే చేపట్టి రైతుకు లబ్ధి చేకూరేలా చేతిబావులు తవ్విస్తారు. ● 5 హెచ్పీ, 7.5 హెచ్పీ సోలార్ పంపుసెట్లు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. ● వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, యాంత్రీకరణకు సహకారం అందించనున్నారు. ● ఉద్యానవన శాఖ ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయనున్నారు. శాఖల సమన్వయం.. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నారు. డిప్యూటీ సీఎం రానున్నారు.. ఇందిర సౌరజల గిరి వికాస పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఈ వారం ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వేదికను ఖరారు చేస్తున్నాం. జిల్లాలో ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనేది పథకం ప్రారంభించిన తర్వాత స్పష్టం అవుతుంది. – ఖుష్బూ గుప్తా, పీవో, ఉట్నూర్ ఐటీడీఏ -
గ్రామ పాలనకు కొత్త ఊపిరి
● జీపీవోల నియామక ప్రక్రియ వేగవంతం.. ● ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి ● జిల్లా నుంచి 100 మంది విద్యార్హతల నివేదిక ● ఈనెల 25న రాత పరీక్షకు ఏర్పాట్లు ● త్వరల్లో విధుల్లోకి గ్రామ పాలన అధికారులునిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రా మ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలన అధికారి (జీపీవో) నియామక ప్ర క్రియను వేగవంతం చేసింది. ఈ నెల 25న జీపీవోల ఎంపికకు అర్హత పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఒక పరీక్ష కేంద్రాన్ని గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి జీపీవోలను ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోంది. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలకు ప్రాధాన్యం.. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, జీపీవో పోస్టుల కోసం ఆన్లైన్లో 151 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కొన్నింటిని తిరస్కరించారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారు, ఇంటర్తోపాటు ఐదేళ్ల సర్వీసు ఉన్నవారికి ఆమోదం లభించింది. జిల్లా నుంచి 63 మంది వీఆర్వోలు, 80 మంది వీఆర్ఏలు, 8 మంది ఇతరులు దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు, 430 రెవె న్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతీ రెవెన్యూ గ్రా మానికి ఒక జీపీవోను నియమించనున్నారు. గ్రామీణ భూసమస్యలపై అవగాహన ఉన్న పూ ర్వ వీఆర్వో, వీఆర్ఏలను జీపీవోలుగా ఎంపిక చేస్తున్నారు. వీరు భూభారతి చట్టం అమలు బా ధ్యతలు నిర్వహించడంలో కీలకం కానున్నారు. సర్వీసుపై అస్పష్టత.. 2022లో వీఆర్వో వ్యవస్థను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి వరకు పనిచేస్తున్నవారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. చాలా మంది ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిని స్వస్థల జిల్లాలకు తిరిగి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. గత డిసెంబర్లో ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించగా, గతనెల 26 వరకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించారు. డిగ్రీ, ఇంటర్ అర్హత ఉన్నవారికి స్క్రీనింగ్ పరీక్ష రాయాలని స్పష్టం చేశారు. అయితే, సర్వీసు విషయంలో స్పష్టత లేకపోవడంతో కేవలం 151 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వివరాలు మొత్తం మండలాలు 18 గ్రామపంచాయతీలు 400 జీపీవోలుగా దరఖాస్తు చేసుకున్నవారు 151 ఆమోదం పొందినవి 100 తిరస్కరించినవి 51 వీఆర్వోలు 63 ఆమోదించినవి 51 తిరస్కరించినవి 12 వీఆర్ఏ 80 ఆమోదించినవి 49 తిరస్కరించినవి 31 ఇతరులు 8 ఆమోదించినవి 0 తిరస్కరించినవి 8 -
భైంసాలో ఘనంగా తిరంగా ర్యాలీ
భైంసాటౌన్: ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా పట్టణంలో పలు కులసంఘా ల ఆధ్వర్యంలో మంగళవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పద్మావతి కాలనీలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ర్యాలీని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుల సంఘాలు, హిందూ సంఘాల నాయకులు, యువకులు, చిన్నారులు జాతీయజెండాలు చేతపట్టి ర్యాలీ లో పాల్గొన్నారు. దారి పొడువునా భారత్మాతాకీజై, సైనిక అమరవీరులకు జై నినాదాలతో హోరెత్తించారు. కుభీర్ చౌరస్తా నుంచి గాంధీగంజ్ మీదుగా, బస్టాండ్ ఎదురుగాగల అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జాతీయగీతాలాపన చేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. భారత త్రివిధ దళాల ధైర్య సాహసాలను స్మరించుకునేలా కుల, మత, రాజకీయాలకు అతీతంగా పాల్గొనడం హర్షణీయమన్నారు. యాత్రలో పట్టణానికి చెందిన వైద్యులు, న్యా యవాదులు, వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికులు, యువకులు, మహిళలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిలిచిన ధాన్యం తరలింపు
ఖానాపూర్: మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం తరలింపు ప్రక్రియ మూడు రోజులుగా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన లారీలను ఉన్నతాధికారులు రైస్మిల్లులకు ట్యాగ్ చేయకపోవడంతో ధాన్యం తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. వాతా వరణంలో మార్పుల కారణంగా ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా, ఖానాపూర్లో నూ వర్షం కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. హమాలీలు, గన్నీ సంచుల కొరతతో ధాన్యం కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయి. తూకంలో కోతపై ఆందోళన.. ఖానాపూర్: మండలంలోని రాజురా గ్రామంలో ఖానాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు క్వింటాల్కు 10 కిలోలు కోతకు అంగీకరిస్తేనే తూకం వేస్తామని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై రాజురా ఎక్స్రోడ్ వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మామడ పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడించారు. నిరసనలో రాజురా, బావాపూర్(ఆర్), చందునాయక్తండా తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
మా భూమి మాకే కేటాయించాలి..
మేము కుంటాల మండలం పెంచికల్పాడు గ్రామస్తులం. 2019లో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్లకు దరఖాస్తు చేసుకుంటే సొంత భూమి ఉంటేనే నిర్మాణ పనులు చేపడతామని చెప్పడంతో మా సొంత ఖర్చులతో సర్వే నంబర్ 269/అ 1 లో 2196/2019 రిజిస్ట్రేషన్ ప్రకారం 0.29 గుంటల భూమి కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇచ్చాం. అప్పుడు ప్రభుత్వం అందరికీ భూమి కేటాయించి 20 ఇండ్లు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. కాంట్రాక్టర్ పిల్లర్ల దశ వరకు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము కాంట్రాక్టర్ కు గిట్టుబాటు కాదు అని మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. భూమి కోసం ఒక్కొక్కరం రూ.3 లక్షలు ఇచ్చాం. భూమిని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేశాం. ఆ భూమి కొన్నది మేమే కాబట్టి మాకే కేటాయించాలి. పట్టాలు ఇవ్వాలి. – డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు, పెంచికల్పడ్ -
అహల్యబాయి హోల్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ నిర్మల్చైన్గేట్: రాణి అహల్యబాయి హోల్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకను పట్టణంలోని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పార్టీ శాఖ ఆదేశాల మేరకు జిల్లా వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ మొఘలుల కాలంలో ధ్వంసమైన హిందూ దేవాలయాలను పరిరక్షణకు రాణి అహల్యబాయి హోల్కర్ కృషి చేశారన్నారు. ఆమె హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి, హిందువులను సంఘటితం చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, కార్యక్రమ జిల్లా కన్వీనర్ అలివేలు మంగ, రాష్ట్ర నాయకురాలు ఆడె లలిత, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వైద్య రజిని, ముధోల్ కన్వీనర్ సీరం సుష్మారెడ్డి, ఖానాపూర్ కన్వీనర్ సత్యవతి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి పాల్గొన్నారు. -
వన్యప్రాణులను సంరక్షించాలి
● అటవీ శాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్నిర్మల్ టౌన్: వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని అటవీ శాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో వైల్డ్ లైఫ్ ఫండ్ ఎన్జీవో ఆధ్వర్యంలో ‘వన్యప్రాణుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర ’అను అంశంపై సోమవారం శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా శర్వాణన్ మాట్లాడుతూ.. వన్య ప్రాణులను సంరక్షిస్తే ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని కాపాడినవారమవుతామని తెలిపారు. జిల్లా ఆటవీశాఖ అధికారి నాగిని భాను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు హర్షవర్ధన్, రాజు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
పార్టీని బలోపేతం చేయాలి
బూత్స్థాయి నుంచి నిర్మల్చైన్గేట్: కాంగ్రెస్ పార్టీని బూత్స్థాయి నుంచి బలోపేతం చేయాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భవాని అన్నారు. జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు అలకలాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ జిల్లాలోని 90,026 బూత్లలో కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. మారుమూల గ్రామల్లో సైతం కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నిర్మల్, కడెం, ఖానాపూర్ తదితర మండలాల్లో బూత్ కమిటీలు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో మిగతా కమిటీలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ను నిర్మాణం చేస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అపర్ణ, కార్యదర్శి మౌనిక, జిల్లా నాయకులు సుశీల, వసంత, సంగీత, నుస్రత్ బేగం పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భవాని -
రైతు సంక్షేమానికి ఆత్మ కమిటీలు
నిర్మల్చైన్గేట్: రైతుల సంక్షేమం కోసం ఆత్మ కమిటీలు పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్గా రామ్రెడ్డి, 27 మంది డైరెక్టర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా శ్రీహరిరావు హాజరై మాట్లాడారు. రైతులకు ఆధునిక పద్ధతుల గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆత్మ కమిటీపై ఉందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మద్దతు ధరపై రూ.500 బోనస్ వంటి పథకాలు రైతుల జీవితాలను మెరుగుపరుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రజల‘వాణి’ విని.. భరోసా కల్పించి..
● గ్రీవెన్స్ కు 71 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్ అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు అందించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రైతు రుణమాఫీ, వైద్యం, విద్య, వ్యవసాయం, భూ వివాదాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించి మొత్తం 71 దరఖాస్తులు అందాయి. ఇక టెలిఫోన్ ప్రజావాణికి విశేష స్పందన లభించింది. ఫోన్ ద్వారా వచ్చిన అర్జీలను నమోదు చేసి, వాట్సాప్లో రశీదు పంపించారు. అనంతరం కలెక్టర్ శాఖలవారీగా సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయడంతోపాటు, ఫైళ్లలో స్పష్టమైన రిమార్కులు నమోదు చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని, మండల ప్రత్యేకాధికారులు మండలస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతుల పరిశీలన, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరిక పెంచే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతుల ఆవేదన.. కౌట్ల గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ మందగించిందని, ఇప్పటివరకు కేవలం ఐదు లారీల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని గ్రామ రైతులు కలెక్టర్కు విన్నవించారు. తూకంలో ఆలస్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నామని తెలిపారు. డీసీఎంఎస్ ద్వారా మరో కేంద్రం ఏర్పాటు చేసి, కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం.. నర్సాపూర్(జి) మండలంలో మూడేళ్ల క్రితం నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇళ్లు పర్యవేక్షణ లోపంతో శిథిలమవుతున్నాయని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అక్రమ పట్టా రద్దు చేయాలి.. నిర్మల్లోని శాస్త్రినగర్లో 541 సర్వే నంబర్లో 6.21 భూమి కలదు. 541/3 సర్వే నంబర్ లో నా భార్య పాకాల స్వప్న పేరుమీద ఎకరం భూమి ఉంది. ఒక వ్యక్తి 541/4/హెచ్ సర్వే నంబర్ పేరుతో మూడు ఎకరాలు అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. ఇదే విషయం ఆర్డీవో, తహసీల్దార్కు 20 సార్లు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమ పట్టా రద్దు చేయాలి. – పాకాల చంద్రశేఖర్, నిర్మల్ నిధులు దుర్వినియోగంపై చర్య తీసుకోవాలి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు తమ కుటుంబ సభ్యుల పేరిట వాహనాలు కొని వాటిని అద్దెకు తీసుకుని నెలకు రూ.33 వేలు ప్రభుత్వం నుంచి పొందుతున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం.వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడమే కాకుండా, అవినీతికి కూడా తావిస్తోంది. ఇలాంటివారిపై చర్య తీసుకోవాలి. – హైదర్, ఆమ్ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు -
‘తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలపై కఠిన చర్యలు’
నిర్మల్చైన్గేట్: తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. పథకాల లబ్ధి కోసం కొందరు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటిని అరికట్టేందుకు రెవెన్యూ, పోలీసు శాఖలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామ, వార్డు స్థాయిలో తనిఖీలు చేపట్టి పత్రాలు జారీ చేసిన అధికారులు, వాటిని వినియోగించి లబ్ధి పొందినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాక్సింగ్లో ప్రతిభ నిర్మల్టౌన్: ఉమ్మడి జిల్లా బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. మంచిర్యాలలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 12 బాలుర విభాగంలో ఆరవ్, నిహాల్, బాలి కల విభాగంలో సహస్ర గోల్డ్ మెడల్ సాధించారు. జ్యోత్స్న కాంస్య పతకం సాధించింది. అండర్–14 బాలుర విభాగంలో ధృవ బంగా రు, దినేష్ వెండి పతకాలు సాధించగా, అండర్–17 బాలికల విభాగంలో నిఖిత, శ్రావణి గోల్డ్, అక్షిత సిల్వ ర్, కీర్తన, అభినయ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వీరు ఈనెల 24 నుంచి 26 వరకు మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులను జిల్లా బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి అభినందించారు. పోడు సమస్య పరిష్కరించండి కడెం: పట్టాలు లేని పోడు భూముల సమస్య పరిష్కరించాలని మండలంలోని పాండ్వపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు కోరారు. కలెక్టర్ అభిలాష అభినవ్కు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుకు సోమవారం వినతిపత్రాలు అందించారు. పోడు రైతులకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ కలెక్టరేట్లో మాట్లాడారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకుంటామని అటవీశాఖ ప్రకటించడం సరికాదన్నారు. వెంటనే ఈ ప్రక్రియ నిలిపివేయాలని కోరారు. ఇందులో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దావనపల్లి శేఖర్, తుమ్మల ప్రతాప్, బండి లచ్చన్న, కోండ్ర ఆనంద్, పిన్నం గోపి, కానుగంటి మల్లేశ్, మహేశ్, సురేశ్, లచ్చన్న పాల్గొన్నారు. -
ధరణి తప్పు.. భూభారతి సరిచేసేనా?
లక్ష్మణచాంంద: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2020 అక్టోబరు 24న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టింది. అయితే, ఈ పోర్టల్ అమలుతో లక్ష్మణచాంద మండలంలోని న్యూకంజర్, పొట్టపల్లి (బి), పొట్టపల్లి (కే) గ్రామాల రైతుల భూములు అసైన్డ్ భూములుగా పోర్టల్లో నమోదు చేశారు. ఈ మూడు గ్రామాల రైతులకు జారీ చేసిన పట్టా పాస్బుక్లలో భూములు అసైన్డ్గా నమోద అయ్యాయి. దీంతో ఐదేళ్లుగా ఈ మూడు గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమస్య రైతులను ఆర్థిక, మానసిక ఒత్తిడిలోకి నెట్టింది. భూ భారతితో రైతుల్లో ఆశలు.. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ధరణి పోర్టల్ను రద్దు చేసి భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ నూతన పోర్టల్తో రైతుల భూమి సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశలు మూడు గ్రామాల రైతుల్లో చిగురించాయి. రైతులు తమ భూముల క్రయవిక్రయాలకు వెసులుబాటు వస్తుందని ఆశిస్తున్నారు. పరిష్కారానికి మంత్రి హామీ.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈనెల 17న కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు వచ్చారు. దీంతో న్యూకంజర్ రైతుల సమస్యను డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ను ఆదేశించారు. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. పట్టా భూములను అసైన్డ్గా నమోదు.. ఐదేళ్లుగా క్రయ విక్రయాలు జరగని వైనం.. అవసరానికి అమ్ముకోలేక అన్నదాత అవస్థలు.. కొత్త చట్టంలో మూడు గ్రామాల రైతుల్లో చిగురిస్తున్న ఆశలుఐదేళ్లుగా ఇబ్బంది.. ధరణి పోర్టల్ చేసిన తప్పుకు ఐదేళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. మా ఊరి భూములన్నీ ధరణిలో అసైన్డ్గా నమోదయ్యాయి. అసైన్డ్ భూములు విక్రయించే అవకాశం లేకపోవడంతో భూమి ఉన్నా.. అత్యసర పరిస్థితిలో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నాం. సమస్య పరిష్కారం కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం. భూభారతి చట్టం రాకతో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. – ముద్దం మోహన్ రెడ్డి, న్యూ కంజర్ రైతు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు మండలంలోని న్యూకంజర్, పొట్టపల్లి(బి), పొట్టపల్లి(కె) గ్రామాలకు చెందిన 628 సర్వే నంబర్ల భూ సమస్యను గతంలోనే ఉన్నతాధికారులకు, కలెక్టర్కు సీసీఎల్ఏ కమిషనర్కు నివేదించాం. అయితే సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – జానకి, తహసీల్దార్, లక్ష్మణచాందఈ రైతు పేరు మాస్తా సాయన్న. లక్ష్మణచాంద మండలం న్యూ కంజర్ గ్రామానికి చెందిన ఈ యువరైతుకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2020లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో సాయన్న పట్టాభూమి మొత్తం అసైన్డ్ భూమిగా నమోదు అయింది. అప్పటి నుండి తన భూమిని అవసరానికి అమ్మలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్య ఈ ఒక్క రైతుదే కాదు న్యూకంజర్ గ్రామంలోని రైతులదీ ఇదే పరిస్థితి.ఓ రైతు పహణీలో అసైన్డ్గా నమోదు(వృత్తంలో..)ఐదేళ్లుగా నిరీక్షణ.. ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన 2020 నుంచి ఈ మూడు గ్రామాల రైతులు సమస్య పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామస్థాయి అధికారుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు, ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నతాధికారుల వరకు రైతులు తమ ఆవేదన చెప్పుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మండలంలో న్యూకంజర్కు చెందిన 465, పొట్టపల్లి (బి)కి 123, పొట్టపల్లి(కె)కు 40 సర్వే నంబర్లు మొత్తం 628 సర్వే నంబర్ల భూముల అసైన్డ్ గానే నమోదయ్యాయి. దీంతో క్రయవిక్రయాలు ఆగిపోయాయి. కొందరు రైతులు పిల్లల పెళ్లిళ్ల కోసం భూములు అమ్మగా, రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కొనుగోలుదారులకు ఇచ్చిన డబ్బులను అప్పుగా పత్రాలు రాయించుకున్నారు. -
సృజనాత్మకతకు పదును..
కస్తూరిబా పాఠశాలల విద్యార్థినుల్లో సృజనాత్మకత పెంచే లక్ష్యంతో ఈసారి ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నారాయణ హోటల్లో రేడియో రాగాలు.. 9లోu లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి గ్రామంలో నాగుల నారాయణ నడిపే హోటల్లో 25 ఏళ్లుగా రేడియో కార్యక్రమాలు శ్రోతలను ఆకర్షిస్తున్నాయి. టీ తాగడానికి వచ్చే గ్రామస్తులకు వార్తలు, జానపద గీతాలు వినిపిస్తూ, ఈ అలవాటును వారిలోనూ పెంపొందిస్తున్నాడు. -
‘కడెం’ ముంపు నివారణకు చర్యలు
● ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ అర్వింద్కుమార్ ● ప్రాజెక్టును సందర్శించిన అధికారుల బృందంకడెం:నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా పటిష్ట చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం కడెం ప్రాజెక్టును అధికారులతో కలిసి సందర్శించారు. గేట్ల పనితీరు, వరద నియంత్రణ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ దామోదర్సింగ్, కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ప్రాజెక్టు వద్ద జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. గతంలో రెండుసార్లు వర్షకాల సీజన్లో వరద గేట్లు మొరాయించడంతో ప్రాజెక్ట్ డేంజర్జోన్లో వెళ్లిన పరిస్థితిని కలెక్టర్ సీఎస్కు వివరించారు. దీనిపై స్పందించిన అర్వింద్కుమార్ అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కడెం, దస్తురాబాద్ మండలాల్లో వరద ముంపునకు గురయ్యే 10 నుంచి 12 గ్రామాల్లో మెరుగైన అలారం వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్షాలు అధికంగా కురిసినప్పుడు వరద నీటిని సమర్ధవంతంగా నియంత్రించేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వహణ తీరును పరిశీలించి ఇరిగేషన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎస్ఈ రవీందర్, ఈఈ విఠల్, డీఈ నవీన్, తహసీల్దార్లు ప్రభాకర్, సర్ఫరాజ్, ఎంపీడీవో అరుణ తదితరులు ఉన్నారు. వరదల నివారణకు శాశ్వత చర్యలు నిర్మల్చైన్గేట్:ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, విపత్తు నిర్వహణ విభాగం డిప్యూటీ కమాండెంట్ దామోదర్సింగ్తో కలిసి శనివారం కాలనీలో పర్యటించారు. కాలనీవాసులతో ముఖాముఖిగా మాట్లాడి వరదలతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. అధిక వర్షపాతం కారణంగా వరద ముప్పు తలెత్తుతుందని, పరీవాహక ప్రాంతాల్లో నిర్మించిన చెక్డ్యామ్ వల్ల నీటి ప్రవాహం వరదనీరు కాలనీలోకి చేరుతుందని కలెక్టర్ తెలిపారు. చెక్డ్యామ్ ఎత్తు తగ్గించేందుకు అనుమతులు లభించాయని, తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గతంలో సంభవించిన వరదల తీవ్రతను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా అధికారులకు వివరించారు. అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి స్థానిక ఫారెస్ట్ గెస్ట్హౌస్లో కలెక్టర్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చలో.. చెన్నూర్!
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయం. అగస్త్య మహాముని నడయాడిన నేల. కోటి లింగాలకు నెలవు.● ఇప్పటికీ పాతనేస్తాలకు ప్రాధాన్యం.. ● రేడియో, టేప్ రికార్డర్, బ్లాక్అండ్వైట్ టీవీల వినియోగం ● ఆహ్లాదంగా ఆత్మీయంగా బంధాన్ని కొనసాగిస్తూ.. ● అభిరుచిని ఆస్వాదిస్తున్న పలువురు జిల్లావాసులు..రేడియోతో ఐదు దశాబ్దాల బంధం.. కుంటాల మండలానికి చెందిన వృద్ధ దంపతులు అరిగెల లక్ష్మీబాయి–గజ్జరాం 50 ఏళ్లుగా రేడియోతో తమ రోజువారీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. దుబాయ్ నుంచి బంధువులు తెచ్చిన ఈ రేడియోలో ఇప్పటికీ వార్తలు, భక్తి గీతాలు, కథలు వింటారు. వ్యవసాయ కూలీలైన వీరు ఆధునిక గాడ్జెట్లకు దూరంగా ఉంటారు. -
ఆత్మీయత చాటుకున్న అదనపు కలెక్టర్
నిర్మల్ఖిల్లా:సాధారణంగా ఐఏఎస్ అధికారి అంటేనే ఉన్నత ఉద్యోగం. తన వద్ద పనిచేసే ఓ చిరుద్యోగి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటే ఆ చిరుద్యోగికి కలిగే ఆనందమే వేరు. సరిగ్గా అలాంటి ఆనందమే అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తన వద్ద డ్రైవర్గా పనిచేసే మహమ్మద్ ఆరిఫ్కు అందించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మహమ్మద్ ఆరిఫ్–యాస్మిన్ పర్వీన్ దంపతులకు శనివారం ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ఫైజాన్ అహ్మద్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి ఆరిఫ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లీబిడ్డల యోగక్షేమాలు తెలుసుకున్నారు. శిశువును కాసేపు ఎత్తుకున్నారు. దీంతో ఆ డ్రైవర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. -
పుస్తకాల గోదాంను పరిశీలించిన ఆర్జేడీ..
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాంను ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి శని వారం పరిశీలించారు. జిల్లాకు వచ్చిన పుస్తకా ల సంఖ్య రావాల్సిన సంఖ్య, ఇప్పటివరకు పంపిణీ చేసిన పుస్తకాల వివరాలు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ షెడ్యూల్ ప్రకారం ఆయా పాఠశాలలకు పుస్తకాలను సక్రమంగా అందజేయాలని సూచించారు. ఆయన వెంట డీఈవో రామారావు గోదాం మేనేజర్ భానుమూర్తి, ఉపాధ్యాయులు ఉన్నారు. కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలకు డీఈవో రామారావు పాఠ్యపుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, సోన్, కుబీర్ మండలాల ఎస్ఓలకు అందజేశారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను అందజేశారు. మిగతా కేజీబీవీలకు మరో రెండు రోజుల్లో పుస్తకాలు అందజేస్తామని డీఈవో తెలిపారు. పొట్టపెల్లి(కె)లో ముగిసిన ధాన్య కొనుగోళ్లులక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కె) గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. గ్రామంలో మొదటిసారి యాసంగిలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. శనివారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయని సెంటర్ నిర్వాహకురాలు మమత తెలిపారు. 128 మంది రైతుల నుంచి 12,151 బస్తాల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ ధాన్యాన్ని 16 లారీలలో మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. రైతుల సహకారంతో ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు పూర్తి చేశామని తెలిపారు. రైతుల వివరాలు ఆన్లైన్ చేస్తున్నామని, చెల్లింపులు కూడా రెండు రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. -
నిర్మల్
1990 దశకంలో రేడియో, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, టేప్ రికార్డర్లతో కూడిన ఆహ్లాదకరమైన సాయంత్రాలు ప్రతీ ఇంటిని ఆనందంతో నింపాయి. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వినోదాన్ని వ్యక్తిగతం చేశాయి. అయితే ఈ స్మార్ట్ కాలంలోనూ జిల్లాకు చెందిన కొందరు ఈ పాత అలవాట్లను, సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రేడియోలో పల్లె సీమ, జానపద గీతాలు, టేప్ రికార్డర్లోపాటలు, సంప్రదాయ వేషధారణలతో వారు గత కాలపు మధుర స్మృతులను సజీవంగా ఉంచుతున్నారు. – నిర్మల్ఖిల్లాఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలినిర్మల్చైన్గేట్:తరతరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలను ఆ భూముల నుంచి వెళ్లగొట్టకుండా భూములకు హక్కు పత్రాలు అందించాలని సీసీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. సీసీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అల్లంపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి, ఏవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తరతరాలుగా ఆదివాసులు, గిరిజనులు, ఇతర పేదలు అడవుల్లో జీవిస్తూ అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. 2006 అటవీ హక్కుల చట్టం వచ్చి, భూములు సర్వే జరిగినా, ఇప్పటికీ హక్కు పత్రాలు అందలేదన్నారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని పేర్కొన్నారు. రుణాలు, రుణమాఫీలు, బ్యాంకు లోన్లు, లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు ఖానాపూర్, కడెం మండలాల పరిధిలోని పేదలను బెదిరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కె.సర్దార్, ఎం.హరిత, అల్లంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. న్యూస్రీల్ -
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్రూరల్:ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను శనివారం పరిశీలించి మాట్లాడారు. ప్రతీ ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు విజేతలుగా మారుతారని తెలిపారు. బోధనా నైపుణ్యాలు మెరుగుపడితే పఠన, లెక్కింపు, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలు విద్యార్థుల్లో పెరుగుతాయని పేర్కొన్నారు. పాఠశాల దశ నుండే విద్యార్థుల్లో లక్ష్య నిర్ధారణ అలవాటు చేయాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన బోధన పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలన్నారు. శిక్షణ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో రామారావు, అధికారులు వి.నర్సయ్య, లింబాద్రి, డీఆర్పీలు, జిల్లా ఉపాధ్యాయ శిక్షణ నిపుణులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి కూడా శిక్షణ తరగతులను పరిశీలించారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన డీఆర్పీలను సన్మానించారు. -
మత్తెక్కిస్తున్నరు..!
● మద్యం.. గంజాయిని దాటి.. ‘ఇంజక్షన్ల’ దందా.. ● ఈజీమనీ కోసం ‘టెక్నీషియన్లు’ పెడదోవ.. ● జిల్లా యువతపై కొత్త ముప్పునిర్మల్టౌన్: జిల్లాలో మద్యం, గంజాయి మత్తులో మునిగిన యువత ఇప్పుడు ప్రాణాంతకమైన మిడాజోలం ఇంజెక్షన్ల బారిన పడుతోంది. శస్త్రచికిత్సల్లో అనస్థీషియాకు ఉపయోగించే ఈ మత్తు ఇంజెక్షన్లను యువతకు అలవాటు చేస్తూ కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్లు ఈ దందా నడుపుతున్నారు. ఇటీవల పట్టుకున్న గంజాయి విక్రేతల విచారణలో పోలీసులు మత్తు ఇంజెక్షన్ల విషయం తెలుసుకున్నారు. విక్రేతలపై నిఘా పెట్టి ముఠాను పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకీ శర్మిల, ఏఎస్పీలు రాజేశ్ మీనా, ఉపేంద్రారెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్ వివరాలను గురువారం వెల్లడించారు. టెక్నీషియన్లే సూత్రధారులుజిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేస్తున్న షేక్ ఫర్దీన్, మిడాజోలం ఇంజెక్షన్ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దందాను ప్రారంభించాడు. అతనితో కలిసి ల్యాబ్ టెక్నీషియన్లు అబ్దుల్ డానీష్, చవాన్ గోవింద్, స్నేహితుడు మహమ్మద్ పర్వేజ్ ఈ అక్రమ వ్యాపారంలో భాగమయ్యారు. ఆస్పత్రుల నుంచి మిగిలిన ఇంజెక్షన్లను సేకరించడంతోపాటు, కొన్నిచోట్ల దొంగతనాలకు కూడా పాల్పడ్డారు. గంజాయికి అలవా టు పడిన యువతను లక్ష్యంగా చేసుకుని పర్వేజ్ శివారు, నిర్మాణుష్యమైన ప్రాంతాలకు కస్టమర్లను పిలిపించి, వారికి సిరంజీతో మత్తు ఇంజక్షన్ ఇచ్చేవాడు. ఒక్కో మిడాజోలం ఇంజక్షన్ బుడ్డిలో 5.10 ఎంఎల్ లిక్విడ్ ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్ వద్ద రూ.500 తీసుకొని, ఒక ఎంఎల్ ఇచ్చేవారు. అలా వచ్చిన డబ్బును నలుగురు పంచుకునేవారు. యువత జీవితాలపై ముప్పుమత్తు కోసం దారి తప్పుతూ..మత్తు కోసం జిల్లా యువత దారితప్పుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు మద్యం, సిగరెట్కే పరిమితమైనవాళ్లు ఇప్పుడు గంజాయి, డ్రగ్స్, వైట్నర్, ఇంజక్షన్లు ఇలా.. ఎటో వెళ్లిపోతున్నారు. మత్తులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా రు. కుటుంబాలనూ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇప్పటికే గంజాయి మత్తులో నిండమునిగిన యువత ఇప్పుడు ఇలా.. ప్రాణాలకే ప్రమాదమైన మత్తు ఇంజక్షన్లనూ తీసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మిడాజోలం ఇంజెక్షన్లు శస్త్రచికిత్సల్లో అనస్థీషియాకు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన మందు. దీనిని నియంత్రణ లేకుండా తీసుకోవడం ప్రాణాంతకం. పోలీసులు ఈ దందాను అరికట్టినప్పటికీ, యువతలో అవగాహన కల్పించడం, ఆస్పత్రుల్లో మందుల నియంత్రణను కఠినం చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.మత్తుపై యుద్ధం.. జిల్లాలో మత్తు పదార్థాలపై జరిపే యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. మత్తు ఇంజక్షన్లను మెడికల్ షాప్లలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరాదు. హాస్పిటల్ యాజమాన్యం కూడా మిగిలిపోయిన మత్తు ఇంజక్షన్ సీసాలను డిస్పోస్ చేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా తేడా కనిపిస్తే డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించాలి. మత్తు పదార్థాలకు సంబంధించి ఏసమాచారం తెలిసినా వెంటనే 8712659599 ఫోన్నంబర్కు సమాచారం ఇవ్వాలి. – జానకీషర్మిల, ఎస్పీప్రాణాలకే ప్రమాదం... ఎలాంటి మత్తుమందులైనా ఏకాస్త మోతాదు మించినా ప్రాణాలకే ప్రమాదమవుతాయి. మిడాజోలం అనేది శస్త్రచికిత్సల సమయంలో పేషెంట్లకు అన్నిపరీక్షలు చేసిన తర్వాత తగు మోతాదులో ఇస్తుంటాం. ఎక్కువ మోతాదులో తీసుకుంటే శ్వాస ఆగిపోవడం, బ్రెయిన్ డ్యామేజీలతో ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. – డాక్టర్ అశ్వీర్రెడ్డి, అనస్థీషియా వైద్యుడుగంజాయి వేటలో బయటపడిన దందాజిల్లాలో గంజాయి వ్యాప్తిపై పోలీసులు ముమ్మర దాడులు చేస్తున్న క్రమంలో, అనుమానాస్పద కేసులో పర్వేజ్ను అదుపులోకి తీసుకున్న నిర్మల్ టౌన్ పోలీసులు మిడాజోలం దందాను బయటపెట్టారు. బైల్ బజార్లో జరిపిన తనిఖీల్లో షేక్ ఫర్దీన్, అబ్దుల్ డానీష్, చవాన్ గోవింద్ను అరెస్టు చేసి, 26 ఇంజెక్షన్లు, 10 సిరంజీలు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయంపై ఎస్పీ జానకీ షర్మిల పోలీసు బృందాన్ని అభినందించారు. -
నైపుణ్యాలు మెరుగుపరిచేందుకే శిక్షణ
● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్నిర్మల్ రూరల్: ఉపాధ్యాయుల నైపుణ్యాలు మెరుగుపరిచేందుకే ప్రభుత్వం శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో జరుగుతున్న శిక్షణ తరగతులను డీఈవో రామారావుతో కలిసి గురువారం పరిశీలించారు. శిక్షణలో డీఆర్పీలు చెప్పే బోధనా మెలకువలు, డిజిటల్ బోధనా పద్ధతులు, అభ్యసన ఫలితాల సాధన, జీవన నైపుణ్యాల పెంపు, కృత్యాధార బోధన మొదలగు అంశాలను అవగాహన చేసుకోవాలని సూచించారు. ఇవి తరగతి గదుల్లో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కరికులం అంశాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని డీఆర్పీలకు సూచించారు. ఇందులో ఎఫ్ఏవో రమణారెడ్డి, ఏఎంవో నరసయ్య, కోర్సు ఇన్చార్జీలు, డీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోక్సో చట్టంపై అవగాహన ఉండాలిఉపాధ్యాయులు పోక్సో చట్టంపై తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జి రాధిక పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని చాణక్య పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతులను గురువారం పరిశీలించి మాట్లాడారు. పోక్సో చట్టం గురించి వివరించారు. మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలన్నారు. ఇందులో సీఎంవో ప్రవీణ్కుమార్, కోర్సు ఇన్చార్జి విద్యాసాగర్, డీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థి కావాలి ఉపాధ్యాయులు నిత్య విద్యార్థి కావాలని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలని సాంఘికశాస్త్ర నిపుణులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కటకం మురళి పేర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో మాట్లాడారు. సాంఘికశాస్త్ర, భౌగోళిక, చారిత్రక అంశాలను చార్టులు వేసి వివరించారు. ఒక క్రమానుసారం అన్నీగుర్తుండేలా విద్యార్థులకు తరగతి గదిలో నేర్పించాలన్నారు. సాంఘిక శాస్త్ర విషయాలు ఏవిధంగా బోధించాలో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. -
‘చెర’ విడిపించండి అమాత్యా..!
● శిఖంలో పంటలు సాగు.. ● పట్టణాల్లో ‘రియల్’ ప్లాట్లు.. ● చెరువుల సమీపంలోనే ఇటుక బట్టీలు.. ● నేడు జిల్లాకు రెవెన్యూ మంత్రి ‘పొంగులేటి’ రాక భైంసా: నిర్మల్ జిల్లాకు చెరువుల జిల్లాగా గుర్తింపు ఉంది. అయితే ఇటీవల ఆక్రమణలు, నిర్వహణ లోపంతో ఈ చెరువులు కనుమరుగవుతున్నాయి. జిల్లాలోని 803 చెరువులు 47,000 ఎకరాలకు సాగునీరు అందించగా, అక్రమ ఆక్రమణలు, పూడిక పెరుగుదల వల్ల వీటి విస్తీర్ణం తగ్గుతోంది. భూ భారతి చట్టం అమలులో ఉన్నప్పటికీ, సర్వేలు, జీపీఎస్ అనుసంధానం లేకపోవడంతో ఆక్రమణలు అడ్డుకట్టలేకపోతున్నాయి. సిరాల ప్రాజెక్టు దుస్థితి1901లో నైజాం కాలంలో భైంసా మండలంలో సిరాల వద్ద 320.19 ఎకరాల్లో నిర్మితమైన సిరాల ప్రాజెక్టు, 7 గ్రామాల్లో 4 వేల ఎకరాలకు సాగునీ రు అందించేది. 2004 వరకు ముధోల్ నియోజకవర్గంలో ఇది ప్రధాన ప్రాజెక్టుగా ఉండేది. గతరెండేళ్లలో భారీ వర్షాలతో ఈ చెరువు తెగిపోయింది. 54 ఎకరాల శిఖం భూములు కబ్జా చేయబడి, అక్రమంగా పట్టాలతో పంటలు సాగవుతున్నాయి. ఇతర చెరువుల ఆక్రమణ1994లో మాంజ్రి సమీపంలో 70 ఎకరాల్లో, 2014 లో సిరాల శివారులో 73 ఎకరాల్లో నిర్మించిన చెరువులు ఆక్రమణలతో కనుమరుగయ్యాయి. కామోల్లోని పోచమ్మ చెరువు (82.30 ఎకరాలు), 180 ఎకరాల పెద్ద చెరువు, సుంక్లిలో 30 ఎకరాల చెరువులో 20 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. రియాల్టర్లు, నాయకులు, అధికారుల కుమ్మక్కుతో నిర్మల్, భైంసా పట్టణాల్లో చెరువులు, బఫర్ జోన్లు ప్లాట్లుగా మారుతున్నాయి. ఇలా చెబుతూ పోతే జిల్లా వ్యాప్తంగా చెరువులన్ని కబ్జాలకు గురవుతున్నాయి. ఈ చెరువులను ఎవరు పట్టించుకోవడంలేదు. జిల్లా కేంద్రమైన నిర్మల్లోనూ రియాల్టర్లు, నాయకులు, అధికారులు కుమ్మకై ్క చెరువులు, కుంటలను సైతం ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. భైంసా – బాసర, భైంసా – నిర్మల్, నిర్మల్ – సోన్, సారంగాపూర్, నర్సాపూర్, కుంటాల, లోకేశ్వరం, ముధోల్, తానూరు ఇలా అన్ని మండల కేంద్రాల్లోనూ చెరువులు, శిఖం భూములు, బఫర్జోన్లు ఆక్రమించి ప్లాట్లుగా మార్చి నిర్మాణాలుచేపడుతున్నారు. ఈ పరిస్థితిని ఎవరు నిలువరించడం లేదు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో చెరువులను కాపాడేందుకు జీపీఎస్తో సర్వేలు నిర్వహించి, హద్దులు గుర్తించాలి. ఆక్రమణలను అరికట్టడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది జరిగితే భూగర్భ జలాలు పెరిగి, సాగునీటి ఇబ్బందులు తీరుతాయని రైతులు కోరుతున్నారు. -
కల్లాల్లోనే వడ్లు!
ఈ రైతుపేరు చిన్నయ్య. లక్ష్మణచాంద మండలానికి చెందిన ఈ రైతు పది రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాడు. మాయిశ్చర్ వచ్చినా తూకం వేయకపోవడంతో కేంద్రంలోనే నిరీక్షిస్తున్నాడు. అధికారులు త్వరగా ధాన్యం తూకం వేయాలని వేడుకుంటున్నాడు. ఈ రైతుపేరు సంతోష్. ఖానాపూర్ మండలం ఎర్వచింతల్కు చెందిన సంతోష్ ధాన్యం తూకంలో నిర్వాహకులు దోపిడీకి పాల్పడ్డారు. 40 కిలోల బస్తాకు 43 కిలో లు తూకం వేశారు. దీంతో స్థానిక రైతులతో కలిసి ఆందోళనకు దిగాడు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. 15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేస్తాం.. జిల్లాలో యాసంగిలో ధాన్య కొనుగోలు లక్ష్యం1,62,414 మెట్రిక్ టన్నులు. ఇప్పటి వరకు 68,392.400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 2,625 మంది రైతులకు రూ.37.37 లక్షలు చెల్లించాం. కొనుగోలు కేంద్రాల్లో సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. జిల్లాలో రానున్న 15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – సుధాకర్, పౌర సరఫరాలశాఖ, నిర్మల్లక్ష్మణచాంద: జిల్లాలో యాసంగి సీజన్లో వరి ధా న్యం కొనుగోళ్లు నత్తనడకన జరుగుతున్నాయి. కొ నుగోళ్లు ప్రారంభమై 20 రోజులు గడిచినా సగం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. కొనుగోళ్లు వే గవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 24 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయినా ఇప్పటికీ కల్లాల్లోనే ధాన్యంపు రాశులు ద ర్శనమిస్తున్నాయి. కొనుగోళ్ల తీరుపై జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో కొనుగోలు ప్రక్రియలో లోపాలు, రైతుల ఆవేదనలు వెల్లడయ్యాయి. 318 కొనుగోలు కేంద్రాలు..ఈ యాసంగి సీజన్లో 1,62,414 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 318 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 209 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి, మిగిలిన 109 కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు. గడిచిన 20 రోజుల్లో కేవలం 68,392.400 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 94,022.00 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు.. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో గమనించిన సమస్యలు ఇలా ఉన్నాయి.. ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామంలోని ఖానాపూర్ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో అధికారులు తూకంలో మూడు కిలోలు అదనంగా కోత విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తూ, సిబ్బంది ని, సీఈవోను గదిలో బందించి నిరసన తెలిపారు. లోకేశ్వరం: మండలం ఒక సంచికి (40 కేజీలు) అదనంగా 3 కేజీలు తూకం వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మణచాంద: మండలంలో సరిపడా కూలీలు లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నర్సాపూర్ (జి): రైస్ మిల్లులకు అలాట్మెంట్ సకాలంలో జరగకపోవడంతో ధాన్యం తరలింపు నెమ్మదిగా సాగుతోంది. కుంటాల: మండలంలో 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా సోమవారం నుంచే తూకం మొదలు పెట్టారు. సోన్ : మండలంలో గన్నీ సంచులు సకాలంలో అందించకపోవడం, తూకం వేయడంలో ఆలస్యం కావడంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. కడెం: మండలంలో 15 రోజుల క్రితం కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ మూడు రోజుల నుంచి మాత్రమే తూకం వేయడం జరుగుతోంది. మామడ: మండలంలో లారీల కొరతతో ధాన్యం తరలింపు వేగంగా జరగడం లేదు. సారంగాపూర్ : మండలంలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ తూకం ప్రక్రియ మొదలు కాలేదు. దిలావార్పూర్ : మండలంలో వరి కోతలు, కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమై, నెమ్మదిగా సాగుతున్నాయి. అకాల వర్షాల భయం..కొన్ని రోజులుగా జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతం అయితే చాలు, ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. వర్షం వస్తే నష్టం చేతికి వచ్చిన ధాన్యం నోటికి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్ల వేగం పెంచాలి..కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. తగిన చర్యలు చేపట్టి, లారీల కొర త, కూలీల కొరత, గన్నీ సంచుల సమస్యలను పరి ష్కరించాలంటున్నారు. వర్షం వల్ల నష్టం జరగకుండా కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. జిల్లా వివరాలు.. నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు.. ఆందోళన చెందుతున్న అన్నదాతలు వర్షం వస్తే ఆగమవుతామంటున్న రైతులుఈ ఫొటోలోని రైతుపేరు అయిటి మల్లేశ్. నర్సాపూర్(జి) మండలానికి చెందిన మల్లేశ్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. నిర్వాహకులు మాయిశ్చర్ వచ్చాక తూకం వేశారు. అయితే మిల్లు అలాట్ చేయకపోవడంతో ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. దీంతో తూకం వేసినా ధాన్యానికి రక్షణగా ఉంటున్నాడు. -
పార్టీని బలోపేతం చేయాలి
నిర్మల్చైన్గేట్: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్గౌడ్ సూచించారు. నిర్మల్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అధ్యక్షతన స్థానిక రాజరాజేశ్వర గార్డెన్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్గౌడ్ మా ట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు. పనిచేసే వారికే పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. పార్టీ పరంగా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావా లని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ పర్యవేక్షకులు అవేజ్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు, కార్యక్తలు పాల్గొన్నారు. -
బాసరలో కేంద్రీయ విద్యాలయం
● తాత్కాలిక భవనంలో ఏర్పాట్లు.. ● భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్ బాసర: జ్ఞానసర్వసతీ దేవి కొలువై ఉన్న బాసరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కల నెరవేరబోతోంది. ఇప్పటికే కేందద్రీయ విద్యాలయం మంజూరైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్ భవన నిర్మాణం కోసం స్థలంతోపాటు, ప్రస్తుతం విద్యాలయం ప్రారంభం కోసం తాత్కాలిక భవనాన్ని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్తో కలిసి పరిశీలించారు. ట్రిబుల్ ఐటీ సమీపంలో తాత్కాలిక భవనంతోపాటు, గోదావరి నదికి వెళ్లే దారిలో మరో భవనాన్ని పరిశీలించారు. అధికారులు పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు సౌకర్యంగా ఉండే తాత్కాలిక భవనం, అనువైన స్థలం కావాలని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అనంతరం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందరి సహకారంతో త్వరలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్తోపాటు అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో రామారావు, తహసీల్దార్ పవన్చంద్ర తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన కేంద్ర బృందంనిర్మల్చైన్గేట్: జిల్లాలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ దక్షిణ భారత విభాగం డిప్యూటీ కమిషనర్ మంజునాథం, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, కలెక్టర్ అభిలాషా అభినవ్ను కలెక్టరేట్లో గురువారం కలిశారు. బాసరలో కేంద్రీయ విద్యాలయ స్థాపనకు అవసరమైన స్థలాలను పరిశీలించిన విషయాన్ని కలెక్టర్కు బృందం వివరించింది. వసతి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని గుర్తించేందుకు భౌగోళిక పరిస్థితులు, కమ్యూనికేషన్ సదుపాయాలు, భవిష్యత్ అవసరాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి పాల్గొన్నారు. -
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
భైంసాటౌన్: అర్జీదారులు తమ సమస్యలను నిర్భయంగా తన దృష్టికి తేవాలని ఎస్పీ జీ జానకీషర్మిల పేర్కొన్నారు. బుధవారం పట్ట ణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా వాణి నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు పరిష్కరించాలని సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్లో సూచించారు. భరోసా కేంద్రంలో షీ టీం సిబ్బందితో కుటుంబ కలహాల కేసుల్లో ఇరు పార్టీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. భైంసాలో భరోసా కేంద్రం ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు గోపీనా థ్, నైలు, షీ టీమ్ ఇన్చార్జి పెర్సిస్, సిబ్బంది, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ పాల్గొన్నారు. -
సమన్వయంతో పని చేయాలి
నిర్మల్చైన్గేట్: అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం పాటించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. జిల్లాలో ఆర్ఎఫ్ఆర్ (రైట్ఫుల్ ఫారెస్ట్ రూల్స్) అమలుపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, విద్యుత్, ఆర్అండ్బీ, పంచా యతీరాజ్శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బ్రిడ్జిలు, విద్యుత్ తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు అటవీశాఖకు సరైన విధంగా ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ప్రతీ శాఖ తమ ప్రపోజల్స్ను అటవీశాఖతో సమన్వ యం చేసుకుని ముందుగా ఆమోదం పొందాలని సూచించారు. చేపట్టనున్న అభివద్ధి ప్రాజెక్టులను త్వరగా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. శాఖల మధ్య సమన్వయంతో అభివద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తిచేయాలని, అ టవీశాఖ అవసరమైన మార్గదర్శకాలకు సంబంధి త శాఖలకు త్వరగా పంపించాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ తదితరులున్నారు.భూసమస్యలు పరిష్కరించాలికుంటాల: భూభారతి పథకానికి కుంటాల మండలాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం భూభారతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల దరఖాస్తులు, ఆన్లైన్ ప్రక్రియ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్లు కమల్సింగ్, శ్రీకాంత్, ఎజాజ్ అహ్మద్ ఖాన్, ప్రవీణ్కుమార్, డీటీ నరేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పనిచేసే వారికే పదవులు’
ఖానాపూర్: పార్టీ కోసం పనిచేసిన వారికే పార్టీ సంస్థాగత, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ఉమ్మడి జిల్లా పరిశీలకులు చంద్రశేఖర్గౌడ్, అవేజ్ఖాన్ పేర్కొన్నారు. పట్టణంలోని జేకే ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృత స మావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఎస్సీ రిజ ర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన ఘన త కాంగ్రెస్దేనని చెప్పారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి మరోసారి సీఎం అయ్యేలా పార్టీ కోసం ప్రభుత్వంలో పని చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ స మావేశానికి గైర్హాజరయిన మండల బాధ్యులపై చ ర్యలు తీసుకోవాలని జిల్లా పరిశీలకులను కోరారు. ఉమ్మడి జిల్లాకు నామినేటెడ్ పదవులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొందరు కోవర్టులతో పార్టీ అబాసు పాలవుతోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపుని చ్చారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, ప్రజాప్రతినిదులు, నాయకులు అడ్డి భోజారెడ్డి, తహర్బిన్ అ హ్మద్, అజ్మీరా శ్యాంనాయక్, భూమన్న, ముకాడే, విశ్వనాథ్, లక్ష్మీనారాయణ, చంద్రయ్య, ఇక్బాల్, మాజిద్, తరి శంకర్, దుర్గా భవాని, చిన్నం సత్యం, ఏ రాజెందర్, పీ సతీశ్రెడ్డి, ఇసాక్, దయానంద్, స్వప్నిల్రెడ్డి, నిమ్మల రమేశ్, షబ్బీర్పాషా, సలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజుల నియంత్రణపై ఫోకస్
నిర్మల్దసలిపట్టుతో వస్త్రం దసలి పట్టుకాయ దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న చెన్నూర్ పట్టుపరిశ్రమ మరో అడుగు ముందుకేసింది. పట్టు దారం, వస్త్రోత్పత్తికి కూడా సన్నద్ధమవుతోంది. ● భారమవుతున్న ‘ప్రైవేట్’ చదువులు ● రోజురోజుకూ పెరుగుతున్న ఫీజులు ● నియంత్రణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ● మంత్రి శ్రీధర్బాబు ప్రకటనపై హర్షంఎర్త్ రాడ్లతో ముప్పు విద్యుత్ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్త్ కోసం ఏర్పాటు చేసిన ఇనుపరాడ్లు ప్రమాదకరంగా మారాయి. గమనించకుంటే పశువులతోపాటు మనుషులూ బలవుతున్నారు. గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 20258లోu హెలిప్యాడ్ పరిశీలన భైంసాటౌన్: పట్టణంలోని పార్డి(బీ) బైపాస్రోడ్ లో గల హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల బుధవారం పరిశీలించారు. కుంటాలలో భూభారతి పైలెట్ ప్రాజెక్ట్ నేపథ్యంలో ఈనెల 16న రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భైంసాలో హెలీప్యాడ్ స్థలం పరిశీలించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఏఎస్పీ అవినాష్కుమార్, ఆర్డీవో కోమల్రెడ్డి, ఆర్అండ్బీ డీఈఈ సునీల్ ఉన్నారు. రేపు కుంట్రాలకు ‘పొంగులేటి‘ కుంటాల: భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శుక్రవారం కుంటాలకు రానున్నారు. స్థానిక ము న్నూరు కాపుసంఘ భవనంలో బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. వారి వెంట ఏఎస్పీలు రాజేశ్ మీనా, అవినాష్కుమార్, భైంసా రూరల్ సీఐ నైలు, ఎస్సై అశోక్ ఉన్నారు. నిర్మల్ఖిల్లా: ‘ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాల అభిప్రాయాలు సేకరించాం. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం. ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది’ ఇవి.. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈనెల 12న ‘విద్యా రంగంలో సంస్కరణ లు’ అంశంపై మంత్రివర్గ సబ్కమిటీ, విద్యాశాఖ ఉ న్నతాధికారులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. తల్లిదండ్రుల ఆ శలను అ వకాశంగా మ లుచుకున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు వివిధ పేర్లతో బురిడీ కొట్టిస్తున్నాయి. దీంతో అ త్యాశకు పోతున్న త ల్లిదండ్రులు లక్షలు కుమ్మరిస్తూ భారం భ రిస్తున్నారు. టాలెంట్, టె క్నో, ఈ–టెక్నో, డీజీ, ఒలింపియాడ్, మోడల్ స్కూల్, ఐఐటీ, జేఈ ఈ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులను ఊహాలోకంలోకి తీసుకెళ్లేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్ 665 గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. నిర్మల్ జిల్లాలో 194, ఆదిలాబాద్లో 151, మంచిర్యాలలో 218, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 102 ప్రైవేట్ బడులున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా 1నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య సు మారు 5లక్షల వరకు ఉండగా, ఇందులో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారు 2లక్షలకు పై గా ఉన్నారు. ప్లే, టెక్నో, ఇంటర్నేషనల్, ఈ–టెక్నో, ఒలింపియాడ్ తదితర పేర్లతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎల్కేజీ చదువుకే వేలల్లో ఫీజు వసూలు చేస్తున్నాయి. దాదాపు 50 శాతానికంటే ఎక్కువే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సర్కారు ఫీజుల నియంత్రణకు పూనుకోగా తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రూ.లక్షల్లో చెల్లిస్తున్నాం ఏటా రూ.లక్షా 50 వేల కు పైగా మా పిల్లల ఫీ జులు చెల్లిస్తున్న. ఏటేటా ఫీజులు పెంచేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రా ష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది. – ఆకుల భూమేశ్, ఈద్గాం, నిర్మల్ సంపాదనలో సగం చదువులకే.. ప్రైవేట్గా ఉపాధి పొందుతూ సంపాదిస్తున్న అరకొర వేతనాల నుంచి 50 శాతానికిపైగా డబ్బు పిల్లల ఫీజుల కోసమే ఖర్చు చేస్తున్నాను. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ఇష్టారీతిన పెంచకుండా ప్రభుత్వం నియంత్రించాలి. – మార్గం శ్రీనివాస్, నిర్మల్ కఠినంగా వ్యవహరించాలి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు పుస్తకాలు, యూని ఫామ్, అడ్మిషన్ ఫీజుల పేరిట తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపుతున్నారు. విద్యను వ్యాపారం చేస్తున్న ‘ప్రైవేట్’ యాజమాన్యాలపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలి. – కై రి శశి, ఏబీవీపీ నేత, నిర్మల్ న్యూస్రీల్ఏటా పెంచేస్తున్నారుప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజులతో సామాన్యులకు ‘బడి’ భారమవుతోంది. ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతుండగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం అమలు చేయాల్సి ఉండగా అధికారుల అలసత్వంతో ఫీజుల పెంపునకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వాల ఉదాసీన వైఖరి కారణంగా ఏటా ప్రైవేట్ పాఠశాలల్లో 10–30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారు. నిర్మల్: 194 ఆదిలాబాద్: 151కు.ఆసిఫాబాద్: 102 మంచిర్యాల: 218ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తాం ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల్లో ని ఫీజుల నియంత్రణపై చర్చ జరిగింది. విద్యాశా ఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫీజుల నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తాం. రానున్న విద్యాసంవత్సరం నుంచి నిర్ణీత ఫీజుల క న్నా ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. – పీ రామారావు, డీఈవో -
బంద్ సక్సెస్ చేయాలి
లక్ష్మణచాంద: గ్రామీణ బంద్ సక్సెస్ చేయాలని తె లంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు పేర్కొన్నారు. బుధవా రం మండలంలోని కనకాపూర్ గ్రామంలో కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి ఆయ న హాజరై మాట్లాడారు. మే 20న కార్మిక వర్గం నిర్వహిస్తున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో ఎస్కేయం ప్రజాసంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఉ పాధిహామీ పని దినాలను సగానికి తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూలీలు ఐక్యంగా గ్రామీ ణ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యా ప్త సమ్మె, గ్రామీణ బంద్లో పాల్గొని జయప్రదం చే యాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, పంటలకు గిట్టుబాటు ధర క ల్పించాలని తెలిపారు. వీటిలో పార్లమెంట్లో చ ట్టం చేసి వ్యవసాయ కూలీలకు ఉపాధిహామీలో రో జు కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రా ష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ లంక రాఘవులు, పద్మ, జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్కుమార్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి అశోక్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి నరసింహ, నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి ౖమురళీమోహన్, మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకులు బుచ్చ య్య, నిర్మల్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగారం, జాదవ్ కిషన్ పాల్గొన్నారు. కనకాపూర్లో మాట్లాడుతున్న వెంకట్రాములు -
గిరి‘జనులకు’ రైలు కూత!
● మంచిర్యాల–ఉట్నూరు–ఆదిలాబాద్కు ముందడుగు ● నిజామాబాద్–నిర్మల్, పటాన్చెరు–ఆదిలాబాద్ దాక ● కొత్త లైన్లకు ఇంజినీరింగ్, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ప్రతిపాదనలు ● పింక్బుక్ 2025–26లో నిధులు అంచనా వేసిన రైల్వే శాఖ ● పట్టాలెక్కితే ఏజెన్సీ ప్రాంత వాసులకు రైలు యోగంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజన ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ముందడుగు పడింది. తొలిసారిగా ఉమ్మడి జిల్లా గిరిజన, అడవుల వెంట రైలు మార్గాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. ఈ మేరకు 2025–26 ఆర్థిక సంవత్సర రైల్వే బడ్జెట్ కేటాయింపులు తెలిపే కీలక పింక్బుక్లో వెల్లడించింది. గత ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తాజాగా రైల్వేశాఖ ఈ బుక్లో ఉమ్మడి జిల్లాకు పలు కొత్త మార్గాలు, ట్రాఫిక్ సర్వేల కోసం నిధుల ప్రతిపాదనలు ఉన్నాయి. భవిష్యత్లో కాజీ పేట–బల్లార్షా 234కి.మీ. నాలుగో లైన్ సర్వేకు రూ.4.68కోట్లు, వన్యప్రాణులకు ప్రాణనష్టం జరగకండా బలార్షా, ఆసిఫాబాద్ రోడ్ వరకు రైల్వే పట్టాల ఫెన్సింగ్కు నిధులు ప్రతిపాదించారు. మంచిర్యాల టు ఆదిలాబాద్ వయా ఉట్నూరు మంచిర్యాల నుంచి వయా ఉట్నూరు ఆదిలాబాద్ దాక ప్రతిపాదిత కొత్త మార్గం 186కి.మీ నిడివి. ఇందుకు రూ.వంద కోట్లు అంచనా ప్రతిపాదించారు. ఈ లైను ఏర్పాటు కోసం భూమి, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ఈ నిధులు వెచ్చించనున్నారు. కొత్తగా నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ మధ్య మార్గం 125కి.మీ. కోసం ఇంజినీరింగ్, ట్రాఫిక్ స ర్వే కోసం రూ.31లక్షలు, మరో కొత్త మార్గమైన పటాన్చెరు (నాగలపల్లి) వయా బోధన్ ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు ఫైనల్ లొకేషన్ సర్వే 317కి.మీ కోసం రూ.7.92కోట్లు, ముత్కేడ్–ఆది లాబాద్–పింపల్కుటి 183కి.మీ ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.3.66కోట్లు, ఆదిలాబాద్ –గడ్చాందూర్ 70కి.మీ సర్వే కోసం రూ.1.75కోట్లు, యావత్మాల్–ఆదిలాబాద్– వయా గంటిజి, పందర్కావందన్, చానఖా వరకు 100కి.మీ సర్వే కోసం రూ.25లక్షలు, సికింద్రాబాద్–ముత్కేడ్– ఆదిలా బాద్ 420కి.మీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ ప్రాథమిక డబ్లింగ్ సర్వేకు రూ.1.64కోట్లు ప్రతిపాదించారు. ఆర్వోబీలు, స్టేషన్ల ఆధునికీకరణ ఆర్వోబీలు, వంతెనలకు ఆర్ఆర్ఎస్కే (రాష్ట్రీయ రేల్ సంరక్ష కోశ్), ఆర్ఎస్ నిధులు(రైల్వే సేఫ్టీ ఫండ్) కేటాయిస్తుంది. ఆదిలాబాద్ యార్డు–రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) లెవల్ క్రాసింగ్కు రూ.5.69 కోట్లు, ముత్కేడ్ ఆదిలాబాద్ పింపల్కుట్టి 68కి.మీ. రూ.4.71కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ 8.16కి.మీ. రూ.1.04కోట్లు, ఆర్ఆర్ఎస్కే రూ.1.93కోట్లు, ఆర్ఎస్ఎఫ్ రూ.9.73కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ ఘాట్ సెక్షన్లో ఆర్ఆర్ఎస్కే నుంచి రూ.6.40 కోట్లు, ఆదిలాబాద్ పిట్ లైన్ నిర్మాణం కోసం మూ లధన నిధులు రూ.22.28కోట్లు, మంచిర్యాల–పె ద్దంపేట మధ్య మూడో లైనుకు 4.37కి.మీ, మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచ్నీ, రేపల్లెవాడ మధ్య రోడ్ కొత్తగా అండర్ బ్రిడ్జికి రూ.7.64 కోట్లు, ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో భవనాలు, మరుగుదొడ్లు, విస్తరణ అభివృద్ధి కోసం రూ.4.44కోట్లు, ‘అమృత్’ స్కీం కింద ఆదిలాబాద్ స్టేషన్లో ఎఫ్ వోబీ (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం, దివ్యాంగుల ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లకు ఎంపిక చేశారు. స్టేషన్లో లెస్ ట్రా క్, క్విక్ వాటరింగ్ కోసం రూ.14.95కోట్లు, ప్లాట్ ఫాంలపైన కవర్ నిర్మించేందుకు రూ.4.61కోట్లు ప్రతిపాదించారు. మంచిర్యాల రైల్వేస్టేషన్కు అమృత్ స్కీం కింద నిధులు ప్రతిపాదించారు. కార్యరూపం దాల్చితేనే.. నిధుల ప్రతిపాదనలతో సరిపెట్టకుండా ఆ మేరకు మంజూరు చేసి కార్యరూపం దాల్చితేనే కొత్త మార్గాల్లో రైలు ప్రయాణ యోగం కలుగనుంది. గత కొన్నేళ్లుగా రైల్వేలో ఫైనల్ లొకేషన్ సర్వే జరిగిన పనులు సైతం ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు. తాజా ప్రతిపాదిత రైలు మార్గాలు అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలతోపాటు అనేక గిరిజన ప్రాంతాల నుంచి వెళ్లనుంది. దీంతో భూ సేకరణ, అటవీ అనుమతులు, పరిహరం రూ.వందల కోట్లలోనే ఉండనుంది. ఈ నేపథ్యంలో కేవలం పింక్బుక్లో కాగితాలపైనే సరిపెడితే మారుమూల ప్రాంతాలకు రైలు కూత అందని ద్రాక్షగానే మారనుంది. -
గాంధీనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్
సోన్: మండలంలోని గాంధీనగర్లో బుధవా రం కమ్యునిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 102 బైక్లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని ధ్రువపత్రాలు చూపించి తీసుకువెళ్లాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడవద్దని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించవద్దని, వ్యక్తిగత సమాచారం చెప్పవద్దని సూచించారు. సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి, ఎస్సైలు గోపి, సుప్రియ, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
దోపిడీపై తిరగబడ్డ రైతులు
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామంలోని ఖానాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు 40 కిలోల వరి ధాన్యం బస్తాకు మూడు కిలోలు అదనంగా తూకం వేస్తూ రైతులను బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. తాలు, తప్ప పేరుతో బస్తాకు మూడు కిలోల చొప్పున అదనంగా తూకం వేయడంతో రైతులు మండిపడ్డారు. మండలంలో ఎక్కడా లేని విధంగా ఎర్వచింతల్లో రైతులు క్వింటాల్కు 7 కిలోల పైచిలుకు ధాన్యాన్ని అదనంగా తూకం చేయడంపై తిరగబడ్డారు. కేంద్రానికి వచ్చిన పీఏసీఎస్ సీఈవో ఆశన్నతోపాటు సిబ్బంది రాజేశ్వర్, శ్రీకాంత్ను కొనుగోలు కేంద్రం ఆవరణలోని పాఠశాల గదిలో నిర్బంధించారు. ఎక్కడా లేని విధంగా తమ వద్ద కోతలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు వచ్చే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఈవో పొరపాటు జరిగిందని మరోసారి కోతలు విధించబోమని ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోళ్లు చేపడతామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం అక్కడికి వచ్చిన డీసీవో పాపయ్యను సైతం రైతులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే కేంద్రాల నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగుతోందని మండిపడ్డారు. కోతలు విధించిన ధాన్యంలో నుంచి కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు కమీషన్లు అందడంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు డీసీవో పూర్తిస్థాయి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొడారి గోపాల్, రైతులు బాదావత్ రవి, రంజిత్, సంతోష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ పీఏసీఎస్ సీఈవోతోపాటు సిబ్బందిని నిర్బంధించి నిరసన అక్కడికి వచ్చిన డీసీవో పాపయ్యను నిలదీసిన అన్నదాతలు -
‘ఆదర్శ’ ఫలితాలు విడుదల
కుంటాల: స్థానిక ఆదర్శ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి ఇటీవల 6వ తరగతి నుంచి పదో తరగతి ఖాళీల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు సోమవారం రాత్రి విడుదల చేసినట్లు కుంటాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ న వీన్కుమార్ తెలిపారు. విద్యార్థుల మార్కులు, ర్యాంకుల వివరాలు telanganams. cgg. gov. in/ TGMS WEB/20# వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. సీటు వచ్చిన విద్యార్థుల జాబితాను త్వరలో పాఠశాలల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. లోక్అదాలత్లో కేసులు పరిష్కరించాలి భైంసాటౌన్: పట్టణంలోని కోర్టు ఆవరణలో ఈనెల 16న జాతీయలోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి దేవేంద్రబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కోర్టులో పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్స్టేషన్లలో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ లోక్అదాలత్ నేపథ్యంలో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేలా చూడాలని సూచించారు. సమావేశంలో ఏపీపీ అరుణ, సీఐలు గోపీనాథ్, నైలు, ఎకై ్సజ్ సీఐ నజీర్హుస్సేన్, ఎస్సైలు పాల్గొన్నారు.ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం డీఏవో అంజి ప్రసాద్ కుంటాల: రాబోయే ఖరీఫ్ సాగుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఏవో అంజి ప్రసాద్ తెలిపారు. కుంటాలలో మార్క్ఫెడ్ సౌజన్యంతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. మోతాదుకు మించి ఎరువులు వాడడంతో కలిగే అనర్థాలను వివరించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్నలు కొనుగోలు చేయవద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏవో విక్రమ్, సీఈవో మురళీ కృష్ణ, ఏఈవోలు గణేశ్, శ్రీనివాస్, రైతులు ఉన్నారు. -
ఉపాధ్యాయులు బోధన మెరుగుపర్చుకోవాలి
● డీఈవో రామారావునిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు తమ బోధనా విధానాన్ని మెరుగుపర్చుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈవో రామారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు నిర్వహించే శిక్షణను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయుల చేతుల్లోనే భావిభారత ప్రగతి ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఐదు రోజుల శిక్షణ తరగతులను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. డీఆర్పీలు హైదరాబాద్లో శిక్షణ పొందారన్నారు. ఈ శిక్షణలో ఉపాధ్యాయుల అభ్యసన ఫలితాలు విభిన్న బోధనా మెలకువలు, డిజిటల్ బోధన, కృత్రిమ మేధ ఉపయోగించి అభ్యాసాలు కల్పించడం, జీవన నైపుణ్యాలు అందించడం, పనితీరు మెరుగుపరుచుకోవడం, నూత న సాంకేతికలు అలవర్చుకోవడం వంటి అంశాల గురించి వివరాలు అందిస్తారన్నారు. వీటన్నింటినీ ఉపాధ్యాయులు అవగాహన చేసుకుని తమ తరగ తి బోధనలో వినియోగించుకోవాలని సూచించా రు. ఐదు రోజుల శిక్షణను నారాయణ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ,గణితం, ఎస్జీటీ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు చాణ క్య పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్, ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు సమయానికి హాజరై, సమయపాలన పాటించి షెడ్యూల్ ప్రకారం శిక్షణలో పాల్గొనా లని సూచించారు. ఎంఈవో రమణారెడ్డి, అకడమి క్ మానిటరింగ్ అధికారి నర్సయ్య, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ప్రవీణ్కుమార్, ఆయా సబ్జెక్టుల ఇన్చార్జీలు పాల్గొన్నారు. -
పాలిసెట్కు 95 శాతం హాజరు
నిర్మల్ రూరల్: పాలిసెట్ పరీక్ష జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని 8 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,422 మంది దరఖాస్తు చేసుకోగా, 2,305 మంది(95%)పరీక్షకు హాజరయ్యారు. 117 మంది గైర్హాజరయ్యారు. 1,121 మంది బాలురకు 1,059 మంది, 1,301 మంది బాలికలకు 1,246 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల సమన్వయకర్త, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రమేశ్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. -
‘రెవెన్యూ’ నిర్లక్ష్యంతో బోరిగాంలో చిచ్చు?
ముధోల్ : మండలంలోని బోరిగాం గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో సోమవారం బుద్ధ విగ్రహం ప్రతిష్ఠాపన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భూమి విషయంలో గ్రామంలోని రెండు గ్రూపుల మధ్య కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. గతంలో ఈ సమస్య రెవెన్యూ శాఖ వరకు చేరగా, తాహసీల్దార్ నుంచి ఆర్డీవో వరకు చర్చలు జరిపారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించారు. అయినా రెవెన్యూ శాఖ ఈ భూమిని ఆధీనంలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేసింది.గ్రూపుల మధ్య ఘర్షణఈ నేపథ్యంలో, ఒక గ్రూపు బుద్ధ విగ్రహం ప్రతిష్టాపనకు సిద్ధమైంది. దీనికి మరో గ్రూపు అభ్యంతరం తెలపడంతో, రాళ్లతో దాడులు జరిగే స్థాయికి వివాదం చేరింది. ఎస్పీ జానకీ షర్మిల, భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ జోక్యంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, భారీ బందోబస్తుతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు పికెట్, బందోబస్తు కొనసాగుతోంది.రెవెన్యూ శాఖపై విమర్శలురెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడుతున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొంటున్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ, అనుమతి లేకుండా నిర్మాణాలు చేయవద్దని గతంలో సూచించినట్లు తెలిపారు. భూమి రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.శాంతి కోసం పోలీసు చర్యలుఎస్పీ జానకీషర్మిల ఆదేశాలతో మంగళవారం ఉదయం ముధోల్ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ముధోల్ ఎస్సై సంజీవ్, ఆయా మండలాల ఎస్సైలు, పోలీసులు, శివంగి టీం పోలీసులు పాల్గొన్నారు. -
పుట్టుక.. చావులో వైవిధ్యం!
● ‘ఆడ’ కంటే ‘మగ’ జననమే అధికం ● అధిక మరణాలు కూడా పురుషులవే.. ● ఆగని గర్భస్త, నవజాత శిశు మరణాలు ● ‘సీఆర్ఎస్– 2021’ నివేదికలో వెల్లడిసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుట్టుక, చావు మానవ జీవనంలో కీలక ఘట్టాలు. దేశ వ్యాప్తంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే కేంద్ర హోంశాఖ పరిధి రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్ఎస్)–2021 నివేదిక ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదికలో ఉమ్మడి జిల్లాలో జననాలు, మరణాలతో పాటు ఏడాదిలోపు శిశువులు, గర్భంలోనే చనిపోతున్న శిశువుల వివరాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీ్త్ర, పురుష నిష్పత్తిలో ఏర్పడిన అసమానతలు, జనన, మరణాల్లో నమోదవుతున్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తున్నాయి.కన్నుమూస్తే మరణం..ఉమ్మడి ఆదిలాబాద్లో నిర్మల్ జిల్లాలో మరణాలు అధికంగా నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832 మంది మరణించారు.మగ శిశువుల జననమే అధికం ఉమ్మడి ఆదిలాబాద్లోని నిర్మల్ జిల్లాలో అధికంగా జననాలు నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్లో తక్కువగా ఉంది. ఇందులో మగ శిశువుల జననాలే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లింగనిష్పత్తి తగ్గుతుండగా ఈ నివేదికలోనూ ఇదే తీరువెల్లడైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 26,576 మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25,124 మంది జన్మించారు.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జననాలు.. జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 2,073 1,865 2,710 2,729 4,783 4,594 9,377 నిర్మల్ 4,490 4,218 7,002 6,599 11,492 10,817 22,309 మంచిర్యాల 333 320 5,377 5,065 5,710 5,385 11,095 కు.ఆసిఫాబాద్ 3,458 3,240 1,132 1,088 4,590 4,328 8,918ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలుశిశు మరణాలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి మొదటి పుట్టిన రోజు కూడా జరుపుకోకుండానే ఎంతోమంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పుట్టిన సమయంలోనే అనేక సమస్యలుండగా, కొందరు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య కారణాలతో మృత్యువాత పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో 84మంది, మంచిర్యాలలో గ్రామీణ ప్రాంతంలో ఒక్కరూ చనిపోనప్పటికీ.. పట్టణ ప్రాంతంలో 11మంది, ఆదిలాబాద్లో 61, కుమురంభీం ఆసిఫాబాద్లో అధికంగా 77మంది నవజాత శిశు మరణాలు నమోదయ్యాయి. స్టిల్ బర్త్ మరణాలూ అధికమే..20 వారాలు దాటిన పిండం నుంచి ప్రసవ దశ శిశువు వరకు గర్భంలోనే మరణించే స్థితిని స్టిల్ బర్త్గా పేర్కొంటారు. ఈ పరిస్థితిని చాలామంది గర్భిణులు ఎదుర్కొంటున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఈ జిల్లాలో 178 మృతశిశువుల జననాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో గ్రామీణ పరిధిలో నమోదు లేనప్పటికీ పట్టణాల్లోనే 174 నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్లో 61, నిర్మల్లో 26 నమోదయ్యాయి. గర్భందాల్చి పిండ వృద్ధి దశలో ఎదురవుతున్న పలు సమస్యలతో గర్భంలోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.శిశుమరణాలు ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 27 18 10 06 37 24 61 నిర్మల్ 36 42 3 3 39 45 84 మంచిర్యాల 0 0 06 05 6 5 11 కు.ఆసిఫాబాద్ 43 29 02 03 45 32 77 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 1,367 1,206 890 842 2,257 2,048 4,305 నిర్మల్ 2,400 1,850 1,356 1,054 3,756 2,904 6,660 మంచిర్యాల 653 574 1,636 1,003 2,289 1,577 3,866 కు.ఆసిఫాబాద్ 1,890 1,172 263 131 2,153 1,303 3,456 గర్భస్రావాలు (స్టిల్ బర్త్) ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 21 20 14 06 35 26 61 నిర్మల్ 12 14 0 0 12 14 26 మంచిర్యాల 0 0 94 80 94 80 174 కు.ఆసిఫాబాద్ 98 74 04 02 102 76 178 -
అర్జీలు పెండింగ్లో పెట్టొద్దు
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణ నిర్మల్చైన్గేట్: ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని, ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, భూసమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితర అంశాలపై ప్రజల నుంచి 83 ఆర్జీలు వచ్చాయి. సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను శాఖల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక టెలీ ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 5 ఫోన్కాల్ అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. దూర ప్రాంతాల ప్రజలు 91005 77132 నంబరును సంప్రదించి వాట్సాప్ ద్వారా సమస్యలు పంపవచ్చని తెలిపారు. పకడ్బందీగా ప్రభుత్వ పథకాల అమలు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం మాట్లాడుతూ త్వరగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం గ్రామపంచాయతీలలో లబ్ధిదారుల లిస్టు వుంచి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను మండల స్థాయిలో త్వరితంగా పరిశీలించి బ్యాంకులకు పంపాలన్నారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉపాధి హామీ పనుల్లో తాగునీరు, టెంట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇటీవల రుణాల మంజూరులో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఎకరం స్థలం కేటాయించాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నిర్మల్ సీఏసీఎస్ చైర్మన్ సోమా భీమ్రెడ్డి, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నందెడపు చిన్ను, మండల అధ్యక్షులు భుజంగా శ్రీనివాస్రెడ్డి, ఓడ్నాల రాజేశ్వర్, గడ్డం ఇంద్రకరణ్రెడ్డి, బొల్లోజి నర్సయ్య, ఏనుగు లింగారెడ్డి, కొర్వ నవీన్, ఈటల శ్రీనివాస్, కొండ శ్రీనివాస్, గాజుల రవి కుమార్ ఉన్నారు. -
బాదనకుర్తిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి
ఖానాపూర్: బుద్ధుడి శిష్యుడు విడిది చేసిన ఖానాపూర్ మండలం బాదనకుర్తిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని పలువురు వక్తలు కోరారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా బాదనకుర్తిలోని బుద్ధుని విగ్రహం వద్ద సోమవారం వేడుకలు నిర్వహించారు. బుద్ధుని శిష్యుడు బాదనకుర్తి గ్రామంలో విడిది చేస్తూ తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు బౌద్ధం విస్తరింపజేశారని తెలిపారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని బౌద్ధ క్షేత్రంగా మారుస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో సత్యపరిశోదక్ సమాజ్, బామ్ సేఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ రక్షక, మాజీ సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, బుద్దిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా అధ్యక్షుడు మాదారపు రాములు, నాయకులు రా ము, గంగన్న, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సేవకు ప్రతీక ఫ్లోరెన్స్ నైటింగేల్
● జీజీహెచ్లో ఘనంగా నర్సుల దినోత్సవం నిర్మల్చైన్గేట్: సేవకు ప్రతీక ఫ్లోరెన్స్ నైటింగేల్ అని జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్సింగ్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని సోమవారం ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సేవాతపనతో నర్సులు పని చేస్తున్నారని తెలిపారు. రోగుల ప్రాణాలను కాపాడడంలో వారే కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సునీల్ కుమార్ రాథోడ్, విశ్వనాథ్, గణేశ్, నర్సింగ్ సూపరింటెండెంట్ వనజ, విజయలక్ష్మి, అపర్ణ, కమలమ్మ ఆస్పత్రి సిబ్బంది, రక్త నిధి సిబ్బంది రాకేశ్ పాల్గొన్నారు. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో.. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నర్సింగ్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించడంలో నర్సుల సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విద్యుల్లత, నర్సింగ్ పర్యవేక్షకులు ధనలక్ష్మి , విజయలక్ష్మి, వైద్యులు, నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.