ఖానాపూర్: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామంలోని గోదావరి వద్ద నూతన పుష్కరఘాట్ మంజూరు చేయాలని సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, ఉపసర్పంచ్ మాదస్తు నవీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు విన్నవించారు. ఉట్నూర్లోని క్యాంపు కార్యాలయంలో గ్రామ వార్డు సభ్యులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యేను ఆదివారం కలిశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు రాజశంకర్, భీంరాజ్, రాజేశ్వర్, ఎనగంటి హరి, రాజేందర్, ఎం.శంకర్ తదితరులు ఉన్నారు.


