breaking news
Nirmal District News
-
‘మున్సిపల్’లో కాంగ్రెస్దే పైచేయి
ఖానాపూర్: జిల్లాలోని ఖానాపూర్, నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడారు. మున్సిపల్ ఎన్ని కల్లో బీజేపీ, బీఆర్ఎస్ చేసిన అసత్య ప్రచారాలను, జేఏసీ పేరిట దొరలు ఆడిన నాటకాలను ప్రజలు నమ్మలేదన్నారు. పదేళ్ల ఖానాపూర్ వెనుకబాటుకు కొంతమంది దొరలే కారణమని విమర్శించారు. గోండు బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం దొరల ఆటలు సాగవని స్పష్టం చేశారు. ఖానాపూర్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని బీఆర్ఎస్, బీజేపీ చేసిన కుట్రలను ప్రజలు గమనించార ని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో కరపత్రాలు పంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, బీఆర్ఎస్, బీజేపీకి ఓటు వేయాలని జేఏసీ నాయకులు ప్రచారం చేశారని తెలిపారు. జేఏసీ నాయకులు ప్రజలపక్షాన ఉంటే వారే జేఏసీ తరఫున అభ్యర్థులను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆయా పార్టీలతో లోపాయికారి ఒప్పందం చేసుకుని వారి అభ్యర్థులకు లాభం చేకూరేలా కాంగ్రెస్పై విమర్శలు చేశారన్నారు. సమవేశంలో దయానంద్, ఎంఏ.మాజిద్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, యూసుఫ్ఖాన్, కావలి సంతోష్, నిమ్మల రమేశ్, ద్యావతి రాజేశ్వర్, జన్నారపు శంకర్, కస్తూరి మహేందర్, నేత శ్యాం, అమానుల్లాఖాన్, షౌకత్పాషా, రాజేందర్నాయక్, జంగిలి శంకర్, షబ్బీర్పాషా, గంగనర్సయ్య, వెంకటప్పయ్య, మ్యాదరి రాజేశ్వర్, తూము చరణ్, అయూబ్ పాల్గొన్నారు. -
కౌంటింగ్కు పటిష్ట ఏర్పాట్లు
నిర్మల్చైన్గేట్:మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. సమయపాలన అత్యంత ముఖ్యమని, సిబ్బంది నిర్ణీత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు రావాలని తెలిపారు. అన్ని నియమాలు పాటిస్తూ, పారదర్శకంగా, వేగవంతంగా కౌంటింగ్ పూర్తి చేయాలన్నారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ విజయవంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని అభినందించారు. ఓట్ల లెక్కింపును కూడా విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించాలినిర్మల్చైన్గేట్:సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న ఖానాపూర్లో కార్యక్రమాల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఖానాపూర్ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రాంగణంలో అంబులెన్స్తోపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలకు వచ్చే భక్తుల కోసం రవాణా సౌకర్యాలు కల్పించడంతోపాటు వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రత దృష్ట్యా అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో రత్న కళ్యాణి, డీటీడీవో అంబాజీ, అధికారులు, ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు. -
నేడే ‘పుర’ తీర్పు!
నిర్మల్చైన్గేట్:మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్, భైంసా, ఖానాపూర్ నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఈ నెల11న మూడు మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఓట్లు లెక్కించనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను మూడు మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన టేబుల్పై లెక్కిస్తారు. రెండు రౌండ్లలో పూర్తయ్యేలా... జిల్లాలోని బైంసా, ఖానాపూర్, నిర్మల్ మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులు ఉన్నాయి. రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యేలా అధికారులు ఏర్పాటు చేశారు. 244 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 44 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. నిర్మల్ మున్సిపాలిటీ 42 వార్డులకు సంబంధించి 22 టేబుళ్లను, భైంసా మున్సిపాలిటీలోని 26 వార్డులకు 13, ఖానాపూర్ నియోజకవర్గంలోని 12 వార్డులకు 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో రిటర్నింగ్ అధికారి, అదనపు రిటర్నింగ్ అధికారి కాకుండా ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్ను నియమించారు. వీరి సమక్షంలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కింపు ప్రక్రియను సాయంత్రం 4 గంటలలోపు ముగిసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం.. తొలుత అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూములను తెరవనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8:30 గంటలకు బ్యాలెట్ బాక్సులలో ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఈ మేరకు లెక్కింపు కేంద్రంలోని ఏర్పాట్లను కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం పరిశీలించారు. శుక్రవారం నాటి ఓట్ల లెక్కింపు కోసం సుమారు 60 మంది సూపర్వైజర్లు, 121 మంది సూపర్వైజర్ అసిస్టెంట్లతోపాటు ఇతర అధికారులు విధుల్లో ఉండనున్నారు. నిర్మల్ కౌంటింగ్ వివరాలు.. వార్డులు:42ఏర్పాటు చేసిన టేబుళ్ల సంఖ్య: 22, ఒకటి పోస్టల్ బ్యాలెట్ కావాల్సిన సూపర్వైజర్లు: 23 రిజర్వ్లో సూపర్వైజర్లు: 05 కౌంటింగ్ అసిస్టెంట్లు: 46 రిజర్వ్ కౌంటింగ్ అసిస్టెంట్లు: 09 మొదటిరౌండ్లో లెక్కించే వార్డులు: 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 37, 39, 41. రెండోరౌండ్లో లెక్కించే వార్డులు: 2, 4 , 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42. భైంసా కౌంటింగ్ వివరాలు.. వార్డులు:26ఏర్పాటు చేసిన టేబుళ్ల సంఖ్య: 13, ఒకటి పోస్టల్ బ్యాలెట్ కావలసిన సూపర్వైజర్లు: 14 రిజర్వ్ లో సూపర్వైజర్లు: 03 కౌంటింగ్ అసిస్టెంట్లు: 28 రిజర్వ్ కౌంటింగ్ అసిస్టెంట్లు: 06 మొదటిరౌండ్లో లెక్కించే వార్డులు: 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25. రెండోరౌండ్లో లెక్కించే వార్డులు: 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26. ఖానాపూర్ కౌంటింగ్ వివరాలు.. వార్డులు: 12ఏర్పాటు చేసిన టేబుళ్ల సంఖ్య: 06, ఒకటి పోస్టల్ బ్యాలెట్ కావాల్సిన సూపర్వైజర్లు : 07 రిజర్వ్లో సూపర్వైజర్లు : 01 కౌంటింగ్ అసిస్టెంట్లు: 14 రిజర్వ్ కౌంటింగ్ అసిస్టెంట్లు: 3 మొదటిరౌండ్లో లెక్కించే వార్డులు: 1, 3, 5, 7, 9, 11 రెండోరౌండ్లో లెక్కించే వార్డులు: 2, 4, 6, 8, 10, 12 -
ప్రకృతివనంలో మద్యం తాగితే జరిమానా
కడెం: పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ కరువై మందుబాబులకు అడ్డాలుగా మారాయి. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రకృతి వనాలను కా పాడుకునేందుకు మండలంలోని లింగాపూర్ పంచాయతీ పాలకవర్గం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వనంలో మద్యం సేవిస్తే రూ.2 వేలు జరిమానా, మద్యం సేవిస్తుండగా ఫొటోలతో సమాచారం అందించిన వారికి రూ.500 బహుమతి చెల్లించనున్నట్లు సర్పంచ్ కుమ్మరి రంజిత్ తెలిపారు. ఈమేరకు పల్లె ప్రకృతి వనాల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో కార్యదర్శి రాజు,ఉప సర్పంచ్ కమ్మల స్వామి, ఏఎఫ్ఏ రాజు, గ్రామస్తులు ఉన్నారు. నాన్ గెజిటెడ్ వెటర్నరీయన్ అసోసియేషన్నిర్మల్చైన్గేట్: నాన్ గెజిటెడ్ వెటర్నరీయన్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాల యం ప్రాంగణంలో గురువారం నిర్వహించా రు. అధ్యక్షుడిగా జె.జ్ఞానేశ్వర్, కార్యదర్శిగా అల్లం హరీశ్, కార్యనిర్వహక అధ్యక్షుడిగా తోట అమృతం, కోశాధికారిగా ఉమారాణి, ఆర్గనైజేషన్ సెక్రెటరీగా క్రాంతికుమార్ను ఎన్నుకున్నారు. టీఎన్జీవో జిల్లా కార్యదర్శి కుడాల రవి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, టీఎన్జీవో ప్రతినిధులు అభిషేక్రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులులక్ష్మణచాంద: రైతులు పంటలకు సేంద్రియ ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ తెలిపారు. సోన్ మండలం మాదా పూర్ గ్రామంలో సేంద్రియ ఎరువులతో పసుపు సాగుచేసి మంచి దిగుబడి సాధించిన యువరైతు మింకరాజ్ కిరణ్రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం సందర్శించారు. ఆర్గానిక్ నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి సేంద్రీయ ఎరువులతోపాటు సూక్ష్మధాతు పోషకాలు, ట్రైకోడెర్మ వంటి జీవన ఎరువులను వినియోగించడంతో యువరైతు అధిక దిగుబడి సాధించాడని తెలిపారు. మార్కెట్లో వివిధ రకాల సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, వ్యవసాయ శాఖ ఆమోదం తెలిపిన ఎరువులు మాత్రమే రైతులు వాడాలన్నారు. ఆయన వెంట ఏఈవో అశోక్కుమార్, విశ్వ అగ్రిటెక్ కంపెనీ జనరల్ మేనేజర్ కృష్ణ, రైతులు మహేందర్రెడ్డి, నరేందర్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియపై పోలీసు అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ బారికేడింగ్, ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రవేశంపై పాటించాల్సిన విధివిధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనుమతి పత్రాలు ఉన్న సిబ్బంది, ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతాచర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు, గస్తీ బలగాల మోహరింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. -
నిర్మల్
నిర్మల్ పీఠం ఎవరిది..నిర్మల్:నిర్మల్లో 42వార్డుల విజేతలు ఎవరు..!? భైంసా బల్దియా 26 వార్డులు ఎవరెవరికి దక్కనున్నాయి..!? ఖానాపూర్ మున్సిపాలిటీ 12 వార్డుల్లో గెలిచేదెవరు..!?పోటాపోటీగా సాగిన పుర సమరంలో పీఠం ఎవరికి దక్కనుంది..!? అధికార కాంగ్రెస్ గెలుచుకుంటుందా..!? తొలిసారి బీజేపీ దక్కించుకుంటుందా..!? ఎంఐఎం జెండా ఎగరేస్తుందా..!? బీఆర్ఎస్ కారు మళ్లీ దూసుకువస్తుందా..!? స్వతంత్రులు ప్రభావం చూపుతారా..!? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని గంటల్లోనే సమాధానాలు రానున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. చాలా వార్డుల్లో ఎవరికి ఓటేయాలనే విషయంలో ఓటర్లు సైతం స్పష్టంగా తేల్చలేకపోయారు. దీనికి తోడు తక్కువగా నమోదైన పోలింగ్ శాతం ఎవరిపై ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గంటల వ్యవధిలోనే బ్యాలెట్ బాక్సుల్లోని అభ్యర్థుల జాతకం, పట్టణాల్లో పార్టీల భవితవ్యం తేలనుంది. భైంసా బల్దియా దక్కేదెవరికి..! హైదరాబాద్ పాతబస్తీ తర్వాత వరుస విజయాలతో భైంసా బల్దియాను ఎంఐఎం తమ అడ్డాగా మార్చుకుంది. మైనార్టీ ఓట్లే కీలకంగా మైషా పట్టణం తీర్పు ఉండనుంది. ఈసారి కూడా విజయం తమదేనని మాజీ మున్సిపల్ చైర్మన్ జాబీర్ అహ్మద్ చెబుతున్నారు. మరోవైపు ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ స్థానం దక్కించుకుంటామని, మ్యాజిక్ ఫిగర్ దాటుతామని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ టికెట్లు దక్కని సీనియర్ నేతలు చాలా వార్డులలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఆయా వార్డుల్లో వారి ప్రభావమూ ఉంది. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ ప్రభావం చూపుతుందని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ చెబుతున్నారు. ఇక గత ఎన్నికల్లో దెబ్బతిన్న కారు పార్టీ ఈసారి కొన్ని స్థానాలైనా దక్కించుకుంటుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఖానా‘పురం‘లో పాగా వేసేదెవరో.. జిల్లాలో చిన్న మున్సిపాలిటీగా 12 వార్డులతో రెండోసారి ఎన్నికలను నిర్వహించుకున్న ఖానాపురం ఎవరి పరం కానుందో చెప్పడం కష్టం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మున్సిపల్ ఎన్నికలను ముందుండి నడిపించారు. మున్సిపాలిటీని గెలుస్తామని చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో అంతోఇంతో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందంటే అది ఖానాపూర్లోనే. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ తన సత్తాను కూడా తెలిపేందుకు పురపోరును సీరియస్గా తీసుకున్నారు. తమకు వచ్చిన నివేదికల ప్రకారం చైర్మన్స్థానం కారు కై వసం చేసుకుంటుందని చెబుతున్నారు. ఇక పార్టీ ఓటుబ్యాంకుపై బలమైన నమ్మకం పెట్టుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ సైతం ఖానాపూర్ తమదేనని బలంగా చెబుతున్నారు. ఇక్కడ మూడు పార్టీలు పోటాపోటీగా తలపడటంతో హంగ్ వాతావరణం కనిపిస్తోంది. ఒకరిద్దరు స్వతంత్రులు గెలిస్తే వారికి పండుగే. క్యాంపుల్లోకి ‘కౌన్సిలర్లు‘..! ‘ఎవరు గెలుస్తారో తెలియదు.. ఫలితాల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పలేం. అందుకే కౌన్సిలర్ అభ్యర్థులు అందరినీ క్యాంపులకు తరలించాం’ అని జిల్లాకేంద్రానికి చెందిన ఓ పార్టీ నేత పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తమ అభ్యర్థులందరినీ క్యాంపులకు తరలించాయి. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి కచ్చితంగా 20 స్థానాలకుపైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ అభ్యర్థులను మహారాష్ట్ర వైపు పంపించినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎలాగూ చైర్మన్ స్థానం తమదేనని, అభ్యర్థులు కలిసి ఉండడానికే క్యాంపులకు తరలించినట్లు చెబుతోంది. పార్టీల లెక్కలు ఎలా ఉన్నాప్రజలు తీర్పు మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నిర్మల్చైన్గేట్:కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కా వాలని సీపీఐయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు గురువారం తలపెట్టిన సమ్మెలో భాగంగా సీపీఐయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ గాంధీపార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన నూతన కార్మిక చట్టాలను, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ, గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. అసంఘటిరంగ కార్మికులకు కార్మికుల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని, స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని కోరారు. నాలుగు లేబర్కోడ్లతో తీవ్ర నష్టం.. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల అమలుతో సంఘటిత, అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాలకు తీవ్ర నష్టమన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని కార్మిక చట్టాలను నియంతృత్వ, దౌర్జన్యపూరితంగా కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని మార్చిందన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాడాలని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గ నూతనకుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి డి.పోశెట్టి, గిరిజన సంఘం నాయకులు తొడసం శంభు, గొర్రెల, మేకల సంఘం జిల్లా నాయకుడు ముత్యం, ఆశ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి లలిత, కార్యదర్శి శైలజ, మధ్యాహ్న భోజన యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బొడ్డు గోదావరి, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, మల్లేశ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. మూడు వార్డుల్లో అధిక పోలింగ్భైంసాటౌన్:భైంసా మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కాస్త తక్కువగా నమోదైంది. ఈసారి మూడు వార్డుల్లోనే అధికశాతం ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. 26 వార్డుల్లో 51,118 మంది ఓటర్లు ఉండగా, 32,035 మంది మాత్రమే ఓటేశారు. మొత్తంగా 62.67 శాతం పోలింగ్ జరిగింది. 22వ వార్డులో అత్యధికంగా 69.56 శాతం పోలైంది. ఇక్కడ 2,267 మంది ఓటర్లు ఉండగా, 1,577 మంది ఓటేశారు. 6, 14 వార్డుల్లోనూ అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. రెండు వార్డుల్లో 69.24 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా 20వ వార్డులో 56.58 శాతం పోలవగా, ఇక్కడ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎండీ జాబీర్ అహ్మద్ బరిలో ఉన్నారు.నిర్మల్ మున్సిపాలిటీలో 2014, 2020 ఎన్నికల్లో దాదాపు ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. ఈసారి ఎన్నికలు మాత్రం పోటాపోటీ వాతావరణంలో సాగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ స్థానికంగా బీజేపీ ప్రజాప్రతినిధులు ఉండటంతో ఈ రెండు పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొంది. 42 వార్డులలో 10–14 మైనార్టీ వార్డులు మినహాయిస్తే, మిగిలిన 28–30 వార్డులలో బీజేపీ ఈసారి బలమైన పోటీ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమకు 20పైన వార్డులు గెలుస్తామని, చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటామని బీజేఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చెబుతున్నారు. మరోవైపు మైనారిటీ వార్డులు కలుపుకొని మెజార్టీ స్థానాల్లోనూ తామే విజయం సాధిస్తామని, నిర్మల్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి అప్పల కావ్య గణేశ్చక్రవర్తి పేర్కొంటున్నారు. ఆరేళ్ల క్రితం మున్సిపాలిటీని గెలిచి పాలించిన బీఆర్ఎస్ ఈసారి ఉనికిని చాటుకునేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. కారు గుర్తుపై పోటీ చేసిన సీనియర్లలో కొంతమందికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్చార్జిగా వ్యవహరించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ నిర్మల్లో తమ పార్టీ కీలకంగా మారుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో దెబ్బతిన్న ఎంఐఎం ఈసారి మాత్రం పట్టు పెంచుకుంటామని, బల్దియాలో పతంగి ఎగురవేస్తామని చెబుతోంది. మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే నిర్మల్లో స్వతంత్రుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది. -
దూరమైనా.. భారమనుకోలే..
జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన పలువురు ఉన్నత చదువులు, జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటుండగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు బుధవారం చేరుకున్నారు. దూరభారమైనా సకాలంలో చేరుకుని రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటు విలువను చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు. అలాంటి పలువురిని ‘సాక్షి’ పలకరించగా వారు వెలిబుచ్చి న అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – నిర్మల్చైన్గేట్ఖానాపూర్: హైదరాబాద్లో ఉపాధి నిమిత్తం స్థిరపడ్డాను. మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఖానాపూర్కు వచ్చాను. కుటుంబీకులమంతా ఓటుహక్కు వినియోగించుకున్నాం. – ఎన్నం ఆనంద్, ఖానాపూర్ హైదరాబాద్ నుంచి వచ్చాను -
తప్పుడు ప్రచారంపై ఆందోళన
ఖానాపూర్: పట్టణంలోని నాలుగో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గాజుల గుర్తుపై పోటీ చేసి న సల్ల చంద్రహాస్ తన పేరిట కొందరు ఓట ర్లను తప్పుదోవ పట్టించేలా కరపత్రాలు, న మూనా బ్యాలెట్లు ముద్రించారని బుధవారం ఆందోళన వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ టికెట్ రా కపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తు న్న తనకు తెలియకుండా తన పేరిట నమూనా బ్యాలెట్ కింది భాగంలో కారు గుర్తుకు ఓటేయాలని ముద్రించారని ఆరోపించాడు. ఇందుకు కారకులను గుర్తించి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. నమూనా బ్యాలెట్ చూపుతున్న బాధితుడు -
● రేపే మున్సిపల్ ఓట్ల లెక్కింపు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ● ఫలితాలపై ఆందోళనలో అభ్యర్థులు ● గతానికి భిన్నంగా పోలింగ్ సరళి
నిర్మల్: ఎన్నికలు పూర్తయిన ఒక్కరోజు తేడాలోనే మున్సిపల్ ఫలితాలు వెలువడనున్నాయి. మున్సిప ల్ ఎన్నికల ఓట్లను శుక్రవారం లెక్కించనున్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చేపట్టనున్నారు. ఈమేరకు మూడు వేర్వేరు కేంద్రాలు, కౌంటర్లు, టేబుళ్లు ఏర్పాటు చే శారు. వీటిని బుధవారం ఉదయం కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులు పరిశీలించి సూచనలు చేశా రు. బందోబస్తు మధ్య కౌంటింగ్ చేపట్టనున్నారు. అభ్యర్థుల్లో టెన్షన్.. పోలింగ్కు కౌంటింగ్కు మధ్య ఒక్కరోజే తేడా ఉంది. కానీ.. ఈ 24గంటలు కూడా ఈసారి అభ్యర్థులను ఆందోళన పెట్టిస్తున్నాయి. ప్రధానంగా నిర్మల్ మున్సిపాలిటీలో గతానికి భిన్నంగా పోలింగ్ సరళి సాగింది. మొత్తం 42వార్డుల్లో చాలాచోట్ల కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్, ఎంఐఎంలు గట్టిపోటీ ఇచ్చాయి. ఒకట్రెండు చోట్ల బీఎస్పీ, స్వతంత్రులూ బలంగా కనిపించారు. భైంసాలో ఎంఐఎం, బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా నిలిచింది. బీజేపీ రెబల్స్గా నిలిచిన స్వతంత్రులు ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఖానాపూర్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు పోటీపడ్డాయి. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందనే విషయం చెప్పడం కష్టంగా మారింది. హలో.. మీదగ్గర ఏం పరిస్థితి? మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైన గంట నుంచే పోలింగ్ సరళిపై పలువురు ఆరాతీయడం ఆరంభమైంది. ‘హలో మీవార్డులో ఏం పరిస్థితి. ఎవరు బ యటపడతరు..’ అంటూ గంటకోసారి ఫోన్లు చేయ డం కనిపించింది. విదేశాలు, దూరప్రాంతాల్లో ఉంటున్న జిల్లావాసులూ మున్సిపల్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు ఆరాతీశారు. ఎన్నికలు ముగిసిన నుంచి ఎక్కడికక్కడ అభ్యర్థులు, అనుచరులు, పార్టీల నేతలు వార్డుల వారీగా లెక్కలు వేయడం కనిపించింది. ఎక్కడెక్కడ గెలుస్తున్నాం.. ఎక్కడ వెనుకబడ్డాం.. అని ముందస్తుగా ఓ అంచనా వేసుకుంటున్నారు. బ్యాలెట్బాక్సుల్లో దాగిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం మధ్యాహ్నం వరకు తేలిపోనుంది. పకడ్బందీగా ఓట్లు లెక్కించాలి నిర్మల్చైన్గేట్: ఈ నెల 13న నిర్వహించను న్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికా రులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి తనిఖీ చేశారు. నిర్మ ల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల వా రీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ టేబుళ్లు, అ భ్యర్థుల గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులకు టీ, టిఫిన్, భోజనం, తాగునీటి వసతులు కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు తదితరులున్నారు. -
ఓటెత్తిన పట్టణం
నిర్మల్జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ బూత్ వద్ద తొలిసారి ఓటేసిన విద్యార్థిని సన్మానిస్తున్న కలెక్టర్ జిల్లా కేంద్రంలో ఓటు వేసి సిరా చుక్క చూపుతున్న మహిళలు పోలింగ్కు పకడ్బందీ బందోబస్తు నిర్మల్ టౌన్: జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానా పూర్ మున్సిపాలిటీల్లోని 80వార్డులకు బుధవా రం ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలోని 244 పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు వెయ్యి మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ జానకీ షర్మిల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 48 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 37 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సా రించారు. ఎన్నికల నేపథ్యంలో సీఆర్పీసీ 144 సెక్షన్ అమలు చేశారు. ఎస్పీ జానకీ షర్మిల స్వ యంగా మూడు మున్సిపాలిటీల్లోని పలు పో లింగ్ కేంద్రాలను పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోనే ఉంటుందని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మల్, భైంసాలో ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, రామారావు పటేల్నిర్మల్: నిర్మల్ మున్సిపాలిటీ నిధానంగా ఓటేసింది. భైంసా బల్దియా పొద్దున్నుంచే బారులుదీరింది. ఖానా‘పురం’ ప్రశాంతంగా పోలింగ్ ముగించింది. మూడుచోట్ల కలిపి 65.60 పోలింగ్శాతం నమోదైంది. ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటర్లు నిధానంగా ఓటేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్అహ్మద్, కిశోర్కుమార్, ఎన్నికల పరిశీలకుడు వీరా రెడ్డి, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు మున్సిపాలిటీల్లో పోలింగ్కేంద్రాలను పర్యవేక్షించారు. తొలిఓటర్లు, సీనియర్ సిటిజన్లూ హుషారుగా ఓటేయ డం కనిపించింది. రోడ్లన్నీ సందడిగా మారగా మూ డు పట్టణాల్లో పండుగ వాతావరణం కనిపించింది. పొద్దున్నుంచే ప్రారంభం నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో కలిపి 80వార్డులకు గాను 244పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేశారు. గంటముందే మరోసారి అంతా సరిచూసుకున్న పోలింగ్ సిబ్బంది ఉదయం 7గంటల నుంచి ఓటర్లను లోపలికి అనుమతించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో అన్నిపార్టీలు టెంట్లు వేసుకుని కూర్చున్నాయి. ఓటర్లకు స్లిప్లు రాసివ్వడంతో పా టు తమ పార్టీకి ఓటేయండంటూ చివరిసారి బతి మాలడం కనిపించింది. మొదటి రెండుగంటల పా టు ఓటర్లు నిధానంగా కేంద్రాలకు వచ్చారు. దీంతో నిర్మల్లో చాలా కేంద్రాలు ఖాళీగా కనిపించాయి. ఉదయం 9గంటల వరకు భైంసా, ఖానాపూర్లో పోలింగ్ 10శాతం దాటగా, నిర్మల్లో 6శాతమే నమోదైంది. ఆ తర్వాత నుంచి జిల్లాకేంద్రంలోనూ క్రమంగా ఓటింగ్ పెరుగుతూ వచ్చింది. గతం కంటే తక్కువే.. పట్టణవాసి ఈసారి కూడా ఓటేయడంలో సోమరితనాన్ని ప్రదర్శించాడు. తమకంటే పల్లెఓటర్లే నయం అనిపించాడు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ 2020లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి తక్కువ పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అప్పుడే కొత్తగా ఏర్పడిన ఖానాపూర్ మున్సిపాలిటీలో తొలిసారే 76.12శాతం నమోదుకాగా, ఇప్పుడు కాస్త తగ్గి 74.83శాతం నమోదైంది. భైంసాలో గత ఎన్నికల్లో 64.70శాతం ఓటింగ్ కాగా, ఇక్కడా రెండుశాతం తగ్గింది. ఈసారి 62.67శాతం ఓటేశారు. నిర్మల్ బల్దియాలో ఆరేళ్లక్రితం 65.31శాతం పోలింగ్ కాగా, తాజా ఎన్నికల్లో 65.47 ఓటింగ్శాతం నమోదైంది. ఒక్క నిర్మల్లో మాత్రమే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లే ఈసారీ వచ్చాయి. చాలాచోట్ల ఓటర్ల ఆందోళన ‘నా ఓటు వేరేవారు వేశారు..’ అంటూ ఈసారి ము న్సిపల్ ఎన్నికల్లో చాలాచోట్ల ఓటర్లు ఆందోళన వ్య క్తంచేశారు. భైంసా, నిర్మల్లోని పలువార్డుల్లో ఇలా దొంగ ఓట్లు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాకేంద్రంలోని బుధవార్పేట్ పోలింగ్ కేంద్రాల్లో ఏ జెంట్లను మారుస్తున్నారంటూ పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో గల పోలింగ్ కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇక్కడ సీనియర్ ఓటర్లతోపాటు తొలి ఓటర్లను కలెక్టర్ అభిలాషఅభినవ్, అధికారులు శాలువాలతో సన్మానించారు. సెల్ఫీ పాయింట్వద్ద వారితో ఫొటోలు దిగారు. వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ సిబ్బంది స్వయంగా లోపలికి తీసుకెళ్లి ఓటు వేయించారు. ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో పోలీస్శాఖ పకడ్బందీగా వ్యవహరించింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు చోటివ్వలేదు. సెల్ఫోన్లను కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఎవరు గెలుస్తరంటవ్..?పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్పోలైన ఓట్ల వివరాలు.. మున్సిపాలిటీ మొత్తం పోలైన పోలింగ్ ఓట్లు ఓట్లు శాతం నిర్మల్ 98,204 64,295 65.47 భైంసా 51,118 32,035 62.67 ఖానాపూర్ 17,693 13,240 74.83 మొత్తం 1,67,015 1,09,570 65.60బ్యాలెట్బాక్సుల్లో అభ్యర్థుల భవిత మున్సిపాటీల వారీగా పోలింగ్ సరళి సమయం నిర్మల్ భైంసా ఖానాపూర్ 6.89 11.91 9.83 15.73 27.12 23.65 33.73 43.53 42.81 51.12 51.80 59.64 57.83 61.63 72.62 65.47 62.67 74.83జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 80వార్డులుండగా కాంగ్రెస్ నుంచి 78మంది, బీజేపీ నుంచి 66, బీఆర్ఎస్ నుంచి 63, ఎంఐఎం నుంచి 39, ఇతరులంతా కలిపి 107మంది పోటీచేశారు. మొత్తం 353మంది ఈసారి ఎన్నికల్లో తలపడ్డారు. పోటాపోటీగా ప్రచారం చేసిన వీరంతా గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. పోలింగ్ రోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కేంద్రాల వద్ద ఉంటూ ఓటర్లను చివరి నిమిషంలోనూ ఓటేయాలంటూ కోరారు. పోలింగ్ సిబ్బంది సాయంత్రం 5గంటలలోపు కేంద్రాల్లో ఉన్న ఓటర్లతో ఓట్లు వేయించారు. బ్యాలెట్బాక్సులను సాయంత్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేర్చారు. అక్కడి నుంచి అభ్యర్థుల భవిత ఉన్న బ్యాలెట్బాక్సులను మూడంచెల భద్రత వ్యవస్థ ఉన్న స్ట్రాంగ్రూమ్లలో జాగ్రత్తగా భద్రపర్చారు. పోలింగ్ ముగిసేవరకు -
పటిష్ట బందోబస్తు
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది.నిర్మల్టౌన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 244 పోలింగ్ కేంద్రాలు.. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్లో మొత్తం 80 వార్డులు ఉన్నాయి. పోలింగ్ కోసం 244 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 48 సమస్యాత్మక, 37 అతి సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు. వీటిని సీసీ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీమ్లు నిరంతర పర్యవేక్షిస్తాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరుకు 44 సెక్షన్ అమలులో ఉంటుంది. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ సెంటర్లు, రహదారులు 24/7 కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలన ఉంటుంది. అప్రమత్తంగా విధులు.. పోలీస్లు ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలి. ఓటర్లు స్వేచ్ఛగా ఓటువేసేలా భద్రత కల్పించాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. – జానకీషర్మిల, ఎస్పీ శాంతియుత ఎన్నికలకు చర్యలు భైంసాటౌన్: భైంసా పట్టణంలోని మున్సి పల్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్న ట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో భైంసా సబ్ డివిజన్ పోలీ సు అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. బందోబస్తు ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై సూచనలు చేశారు. పోలింగ్ సందర్భంగా 500 మంది పోలీసుల బలగాలతో బందో బస్తు ఏర్పాటు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మొద్దని, పేర్కొన్నారు. ప్రశాంత పోలింగ్కు అంద రూ సహకరించాలని సూచించారు. అనంతరం పోలీసు బలగాలతో పట్టణంలో రూట్ మార్చ్ నిర్వహించారు. ఆమె వెంట ఏఎస్పీ రాజేశ్మీనా, సీఐలు సాయికుమార్, ప్రవీణ్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, శివంగి బృందం సభ్యులు ఉన్నారు. -
ఖానాపూర్లో పోలీసుల ఫ్లాగ్మార్చ్
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు నిర్మల్ అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు, పార్టీలు సహకరించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు సెక్షన్ 144 అమలులో ఉంటుందని తెలిపారు. కండువాలు కప్పుకుని ప్రచారం చేయడం, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు నిషేధమని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఫ్లాగ్మార్చ్లో సీఐ అజయ్కుమార్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధికి ‘తొలి’ ప్రాధాన్యం
మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అంతా సిద్ధమైంది. అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పుర పౌరులు సిద్ధమవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 18 ఏళ్లు నిండిన యువత తొలి ఓటు వేసేందుకు ఉత్సాహంగా ఉంది. ‘ఎవరు గెలిచినా ఒకటే‘ అన్న నిర్లక్ష్యాన్ని పక్కనపెట్టి, ‘మా ఓటుతో మార్పు రావాలి‘ అన్న అభిప్రాయంతో ఉంది. తొలి ఓటుతో భవిష్యత్తుపై మొదటి సంతకం పెట్టేందుకు ఉత్సాహం చూపుతోంది. ఈ నేపథ్యంలో తొలి ఓటర్ల అభిప్రాయం వారి మాటల్లో.. నిర్మల్టౌన్/భైంసాటౌన్/ఖానాపూర్కుల మతాలకు అతీతంగా.. యువతే కీలకం.. ఓటు హక్కు వజ్రాయుధం. ఐదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ ఓటెయ్యాలి. రాజ్యాంగం కల్పించిన నా తొలి ఓటు అభివృద్ధికే వేస్తాను. – షేక్ ఖలీల్, డిగ్రీ విద్యార్థి, భైంసారాజకీయాల్లో కుల మతాలకు తావుండొద్దు. ఓటర్లు అభివృద్ధి చేసే, సమస్యలు పరిష్కరించే నాయకులను ఎన్నుకోవాలి. ప్రలోభాలకు తలొగ్గవద్దు. కులమతాల కు అతీతంగా సమస్యలు పరిష్కరించే నాయకుడికి ఓటు వేస్తా. – మహ్మద్ ఇమ్రాన్, డిగ్రీ విద్యార్థి, భైంసా -
పురవాసి.. మార్చుకో ఓటేసి..
నిర్మల్సీఎం కప్ పోటీల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ సారంగపూర్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన జిల్లాస్థా యి సీఎం కప్పోటీల్లో జామ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతి భ కనబర్చారు. జావలిన్త్రో, కిక్బాక్సింగ్లో పాఠశాలకు చెందిన ముగ్గురు బాలికలు బంగా రు పతకాలు సాధించారు. క్యారమ్, కిక్బాక్సింగ్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో వెండి పతకాలు గెలిచారు. 17 మంది విద్యార్థినులు జావలిన్త్రో, కిక్బాక్సింగ్, ఆత్యపాత్య, బాల్ బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ సంగీత, పీఈటీ సుష్మిత, పీడీ సుప్రియ అభినందించారు. నిర్మల్: ఏడాదిగా పట్టణవాసులు ఎదురుచూస్తున్న సందర్భం రానేవచ్చింది. పుర పోరకు సమయం ఆసన్నమైంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో బుధవారం మున్సిపల్ పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బరిలో ఉన్న అభ్యర్థుల తలరాతతోపాటు, పుర ఓటర్లు తమ పట్టణ భవితవ్యం తేల్చుకునేందుకు పోలింగ్కేంద్రాలకు ఓ(పో)టెత్తాల్సిందే. గత ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి చూస్తే పట్టణ ఓటర్లలో చాలామంది ఓటేయడమంటేనే పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లే చాలానయం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లే అధికంగా ఓటేశారు. తమకు అన్నీ తెలుసని చెప్పుకునే పట్టణ ఓటరు మాత్రం పోలింగ్కు దూరంగా ఉంటున్నారు. ఈసారి మాత్రం అలా ఉండకూడదని, ఇప్పుడైనా పురజనం కదలాలని కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు పిలుపునిచ్చారు. మున్సి‘పోల్స్’కు సర్వం సిద్ధం.. నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డులు, భైంసా 26, ఖానాపూర్లోని 12 వార్డులకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు అన్నిఏర్పాట్లు చేశారు. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియం, భైంసా, ఖానాపూర్లో స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ/స్వీకరణ కేంద్రాల నుంచి మంగళవారం పోలింగ్ సిబ్బంది ద్వారా ఎన్నికల సామగ్రిని పంపించారు. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు చేరుకుని, పోలింగ్ కోసం ముందే ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షించారు. ఉదయం 7 గంటల నుంచే.. మూడు మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారు ఓటేసే వరకు సమయం ఇవ్వనున్నారు. నిర్మల్లో 98,204 మంది ఓటర్లకు, 145 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భైంసాలో 53,118 మంది ఓటర్లకు 74 కేంద్రాలు, ఖానాపూర్లో 17,693 మంది ఓటర్లకు 25 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. మూడు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 1,69,015 మంది ఓటర్లకు 244 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణను పోలింగ్ సిబ్బందితోపాటు ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సున్నిత కేంద్రాలతోపాటు దాదాపు అన్ని పోలింగ్కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సూక్ష్మపరిశీలకులుగా నియమించారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి, వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అతి సున్నిత, సున్నిత ప్రాంతాల్లో అదనంగా పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వివరాలు.. వివరాలు ఖానాపూర్ నిర్మల్ భైంసా మొత్తం వార్డులు 12 42 26 80 పోలింగ్ కేంద్రాలు 25 145 74 244 అతిసున్నిత కేంద్రాలు 15 59 33 107 సున్నిత కేంద్రాలు 10 86 41 137 పోలింగ్ ప్రాంతాలు 07 52 26 85 పోలింగ్ రూట్లు 02 17 09 28 ఎఫ్ఎస్టీ బృందాలు 02 10 05 17 ఎస్ఎస్టీ బృందాలు 10 13 13 36పోలింగ్ సిబ్బంది వివరాలు.. మున్సిపాలిటీ పోలింగ్ ఒక్కో కేంద్రంలో పీఓలు ఏపీఓలు ఓపీఓలు కేంద్రాలు ఓటర్లు నిర్మల్ 145 599–792 145 145 435 భైంసా 74 519–860 74 74 222 ఖానాపూర్ 25 581–800 25 25 75 మొత్తం 244 244 244 732 మున్సిపాలిటీలు, వార్డులు, ఓటర్ల వివరాలు.. మున్సిపాలిటీ వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం నిర్మల్ 42 50,824 47,362 18 98,204 భైంసా 26 25,623 25,486 09 53,118 ఖానాపూర్ 12 9,169 8,524 00 17,693 బాధ్యతగా ఓటేద్దాం.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రజలందరూ సహకరించాలి. ఓటువేయడం బాధ్యతగా భావించాలి. పోలింగ్ డే అంటే సెలవుదినంగా భావించొద్దు. మీరు వేయడమే కాకుండా మిగతా వారితోనూ ఓటు వేయించాలి. ఈసారి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో వందశాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలి. – అభిలాషఅభినవ్, కలెక్టర్ -
ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనరల్ అబ్జర్వర్ వీరారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ నిర్వహణ కీలకమని, ఓటర్లు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. పోలింగ్ ముగిసిన తర్వాత సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను నిబంధనల మేరకు రిసెప్షన్ కౌంటర్లలో అప్పగించాలని సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పకడ్బందీ పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం రూట్ల వారీగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ సూచనలు చేశారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం తగ్గుతుంది. తెల్లవారుజామున చల్లగా ఉంటుంది. చేతల్లో చూపేవాళ్లు రావాలి.. అది చేస్తాం, ఇది చేస్తాం.. అంటూ పబ్బం గడిపేవాళ్లు కాకుండా చేతల్లో చూపే వాళ్లనే ఎన్నుకోవాలి. నాయకత్వమార్పుతోనే నిర్మల్ మారుతుంది. ఇప్పటికై నా పాతబస్తీలో సమస్యలు పరిష్కరించాలి. – పాల్దె మహేందర్బాధ్యతగా ఉండాలి..నిర్మల్ చారిత్రక ప్రాంతం. పట్టణా న్ని అభివృద్ధి చేసేందుకు బాధ్యతాయుతంగా పనిచేసేవా రినే ఎన్నుకోవాలి. ఈసారి పాలకవర్గంతో మున్సిపాలిటీలో మార్పు కనిపించాలి. – నాళం ప్రేమ్నాథ్ ఒక్క పార్కూ లేదు.. దశాబ్దాల క్రితమే నిర్మల్లో మహిళలకు ప్రత్యేకంగా లేడీస్పార్క్ ఉండేది. ఇందిరానగర్లో గాంధీపార్క్ ఉంటుండే. ఇప్పుడు ఒక్క పార్కు లేదు. పార్కుతోపాటు స్విమ్మింగ్పూల్స్, ఓపెన్జిమ్లు ఏర్పాటు చేయాలి. – దశరథ పోశెట్టి -
స్వేచ్ఛగా ఓటు వేయండి
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల్లో పౌరులంతా ఓటుహక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని, ప్రలోభాలకు తలొగ్గకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు స్వీప్(సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ఆధ్వర్యంలో సోమవారం ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పలు పాఠశాల విద్యార్థులు ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిపేలా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధమన్నారు. బ్యాంకింగ్ కేవైసీ పూర్తి చేయాలి.. ప్రజలందరూ బ్యాంకింగ్ కేవైసీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడంతో సైబర్ మోసాలకు గురికాకుండా సురక్షితంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్, డీఈవో భోజన్న, ఎకై ్సజ్ అధికారి ఎంఏ.రజాక్, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు సోమవారం మూడో రోజు కొనసాగాయి. కబడ్డీ, యోగా, తైక్వాండో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, ఉషూ, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, సేపక్ తక్రా, రెజ్లింగ్ తదితర పోటీలు నిర్వహించారు. మూడు నియోజకవర్గాల నుంచి దాదాపు 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి ప్రారంభించారు. అనంతరం గెలిచిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
● ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన పార్టీలు ● చివరి దాకా తిరిగిన అభ్యర్థులు ● ముగిసిన ప్రచార ఘట్టం
హోరెత్తిన ప్రచారం నిర్మల్: మున్సిపోల్స్లో కీలకమైన ప్రచారపర్వం ముగిసింది. మూడు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలతోపాటు పాటు స్వతంత్ర, రెబల్ అభ్యర్థులూ చివరిరోజైన సోమవారం ప్రచారం హోరెత్తించారు. వార్డుల్లో ఏ ఇంటినీ వదలకుండా మరోసారి కలియదిరిగారు. రెండు చేతులెత్తి దండం పెడుతూ ‘దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి..’ అంటూ ఓట్లు అభ్యర్థించారు. ఉదయం 8 గంటల నుంచే ప్రచారం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించారు. రోజుంతా నిమిషం వృథా చేయకుండా ప్రజల్లో తిరిగారు. ప్రధాన పార్టీలన్నీ.. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడుగా వ్యవహరించాయి. చివరిరోజు జిల్లాకేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి అభ్యర్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అప్పాల కావ్య, గణేశ్చక్రవర్తి రోజంతా వార్డుల్లో ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ వేర్వేరుగా వార్డుల్లో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తరఫున బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్రెడ్డి, సీనియర్ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పోటీ చేస్తున్న ప్రతీవార్డులో ఒకటికి రెండుసార్లు ఓటర్లను కలిసి అభ్యర్థించారు. అంతా సైలెంట్.. పోలింగ్కు ఒకరోజు ముందే ప్రచారం నిలిపివేశారు. ఈనెల 3 నుంచి చెవుల్లో ఇళ్లు కట్టుకున్నట్లు వినిపించిన పాటలు, మైకులు, ప్రచారాలన్నీ మూగబోయాయి. క్షణం తీరిక లేకుండా తిరిగిన ప్రచార రథాలన్నీ కార్యాలయాలకు వెళ్లిపోయాయి. ఒక్కసారిగా నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు పట్టణాలూ సైలెంట్గా మారిపోయాయి. -
ఒక్క రోడ్డూ సక్కగ లేదు..
జిల్లాకేంద్రంలోని ప్రియదర్శినినగర్, శ్రీనగర్కాలనీ తదితర కాలనీల్లో రోడ్లు సక్కగ లేవు. వర్షాకాలం నడవడమూ కష్టమే. డ్రైనేజీలు లేకపోవడంతో మురికినీరు రోడ్లపైకి వస్తోంది. – జొన్న వినోద్కుమార్ఇప్పటికీ తాగునీటి సమస్య.. జిల్లా కేంద్రంలోని చాలా కాలనీలకు ఇప్పటికీ తాగునీరు అందడం లేదు. పాతబస్తీలోని వీధుల్లో మురికి కాలువల గుండా ఉన్న పైప్లైన్లు లీకవుతున్నాయి. నీరు కలుషితమై ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. – ఒడ్నం మహేందర్ట్రాఫిక్ చికాకు పెడుతోంది.. పేరుకు జిల్లాకేంద్రం అన్నట్లే కానీ.. ఇక్కడ ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. ప్రధానరోడ్లు, చౌరస్తాలు, ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో నిత్యం చికాకు పెడుతోంది. పండుగలప్పుడు మరీ ఇబ్బందవుతోంది. – పోల కృష్ణ -
అన్నా.. ఓటుకు రావాలె
నిర్మల్చైన్గేట్: ‘అన్నా.. నేను ఫలానా వ్యక్తిని.. మన కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. ఈ నెల 11న మీరు, మీ కుటుంబ సభ్యులు ఓటుకు రావాలె.. నాకే ఓటేసి గెలిపించండి. రానుపోను చార్జీలు పంపుతున్న.. వచ్చాక మిగతావి చూసుకుంటా.’ నిర్మల్లో ఓ అభ్యర్థి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లతో ఫోన్లో అన్న మాటలివీ. ప్రచార పర్వం ముగియడంతో వలస ఓటర్లను పోలింగ్ రోజు రప్పించేందుకు అభ్యర్థులంతా పాట్లు పడుతున్నారు. ఓటరు జాబితాలు పరిశీలిస్తూ ఎవరిని ప్రభావితం చేస్తే ఓట్లు పడతాయనే అంశాలపై కుస్తీ పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి సంబంధించిన ఓట్లు వేయించాలని ప్రాధేయ పడుతున్నారు. యువత, విద్యార్థులే అధికం.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, వ్యాపారులు ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. యువకులు, విద్యార్థులే అధికంగా ఉంటారు. జిల్లాల నుంచి ఎక్కువగా హైదరాబాద్, ముంబైకి కార్మికులు వలస వెళ్తుంటారు. వారికి ఫోన్లు చేసి పోలింగ్ రోజు వచ్చి వెళ్లమని అభ్యర్థులు ప్రాధేయపడుతున్నారు. రవాణా సదుపాయం కల్పిస్తామని లేకుంటే దారి ఖర్చులు ఇస్తామని పేర్కొంటున్నారు. ఫోన్పే, గూగుల్పే నంబర్లను తీసుకుని సిద్ధంగా ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కూలీలుగా స్థిరపడ్డవారికి కూలి డబ్బులు సైతం ఇస్తున్నారు. ఉద్యోగులను సెలవు పెట్టి రావాలని కోరుతున్నారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో 1,67,015 మంది ఓటర్లుండగా అందులో 8 వేల నుంచి 10 వేల వరకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారే ఉన్నారు. ఒక్కొక్క వార్డులో 80 నుంచి 100 వరకు అలాంటి వారు ఉంటారు. ఆయా వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఇదే తరహాలో వలస ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. -
మార్పు చూపిస్తాం
నిర్మల్చైన్గేట్: నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీ అ భ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి పాలించే అవకాశం ఇస్తే మార్పు చూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్ధులతో కలిసి బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాకేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జయశంకర్ సర్కిల్లో కార్న ర్ మీటింగ్లో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అవినీతిరహిత పాలన అందిస్తామని, అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని తెలిపారు. ఆ పార్టీలకు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే మైనార్టీలతోనే అని సీఎం ప్రకటించారని అందుకే బీజేపీ రేవంత్రెడ్డిని రేవంతుద్దీన్ అని పిలుస్తోందన్నారు. ఎన్ని షేర్వాణీలొచ్చినా 32 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్చార్జి బస్వపురం లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచార హోరు.. దావత్ల జోరు
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అభ్యర్థులు తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పకుండా, హామీలు ఇవ్వకుండా.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎవరికి ఎంత ఇవ్వాలి.. ఎవరెవరికి మందు, విందు ఏర్పాటు చేయాలని ఓటర్లను ఆకర్షించే ప్రలోభాలపై దృష్టి పెడుతున్నారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. దావత్లు ఇస్తున్నారు. ఓటర్ల ప్రసన్నం కోసం.. పేద ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వార్డుల వారీగా బియ్యం, నూనె, పప్పు, చక్కెర వంటి పదార్థాలతో కూడిన కిట్లను నేరుగా ఓటర్ల ఇంటికి పంపుతున్నారు. ఇక చీకటి పడిన తర్వాత కాలనీల్లో ఇల్ల డాబాలపై దావత్లు ఏర్పాటు చేస్తున్నారు. గెలుపు కోసం ఖర్చులకు వెనుకాడడం లేదు. మహిళలు, యువతపై ఫోకస్.. మహిళలు, యువత, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపైనే అభ్యర్థులు ప్రధాన దృష్టి పెట్టారు. అభివృద్ధి హామీలకు బదులు ఈ వర్గాలను తక్షణం ప్రసన్నం చేసే పద్ధతులు అమలు చేస్తున్నారు. ‘ఓటు మనదే, అభ్యర్థి మనోడే‘ అనే నినాదంతో ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. సాయంత్ర సామూహిక విందులు ఏర్పాటు చేస్తున్నారు. -
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
లక్ష్మణచాంద: సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నిర్మల్లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి జూడో పోటీల్లో లక్ష్మణచాంద కేజీబీవీకి చెందిన గంగోత్రి, తేజశ్రీ, జాహ్నవి, సుప్రియ, బిందూర, అపర్ణ, విశ్వశ్రీ ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్యారమ్స్ సింగిల్స్లో నవ్య కుమారి, డబుల్స్లో నవ్యకుమారి, నిశిత రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. కరాటేలో రిశిక, పూజిత రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులను ఎస్వో నవిత, ఉపాధ్యాయులు అభినంధించారు. ముధోల్ శిశుమందిర్ విద్యార్థులు.. ముధోల్: ముధోల్ శ్రీసరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు సీఎంకప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానాచార్యులు సారథిరాజు తెలిపారు. జిల్లాస్థాయి ట్రియల్తోన్లో రమ్మెల్ల యోగిత ప్రథమ స్థానం, 3వేల మీటర్ల రన్నీంగ్లో బొడ్డోల్ల సాత్విక్ ప్రథమ, 400 మీటర్ల రన్నింగ్లో అంకంవార్ సాత్విక ప్రథమ, 1500 మీటర్లలో రన్నింగ్లో కోరి సాత్విక ద్వితీయ స్థానం, జావెలిన్త్రోలో శైలజ ప్రథమ, చక్రవం విసరడంలో ఆర్.సాత్విక్ ద్వితీయస్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని వివరించారు. -
శ్రీసంత్ రవిదాసు పుస్తక పరిచయం
నిర్మల్ఖిల్లా: జిల్లా కవి, రచయిత కడారి దశరథ్ రచించిన ‘శ్రీ సంత్ రవిదాసు’ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని జిల్లాకేంద్రంలోని మోచి సంఘ భవనంలో ఆదివారం నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ.. సంత్ రవిదాసు జీవితం, ఆయన చేపట్టిన భక్తి ఉద్యమం, మధ్యయుగ కాలంలో సమాజంలో ప్రబలంగా ఉన్న అసమానతలు, అంధవిశ్వాసాలు వంటి రుగ్మతలను రూపుమాపడంలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. సంత్ రవి దాసు భక్తి మార్గం ద్వారా సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రజ ల్లోకి తీసుకువచ్చారని కొనియాడారు. అనంతరం పుస్తక రచయిత కవి కడారి దశరథ్ను సన్మానించా రు. కవి కడారి దశరథ్తోపాటు సంఘం జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు కావల్ల సాయన్న, కోశాధికారి అల్లకొండ విశ్వనాథ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి
నిర్మల్చైన్గేట్: నిర్మల్ మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు అనిల్యాదవ్ అన్నారు. పట్టణంలోని 38వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నాందేడపు అన్నపూర్ణ తరఫున ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ ఏమీ చేయలేదన్నారు. మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరాడు. ఆదరించండి.. అండగా ఉంటాం నిర్మల్టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రజలకు అండగా ఉంటామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. పట్టణంలోని 38వ వార్డు అభ్యర్థి పూదరి ఉదయశ్రీ రంజిత్ తరఫున ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. బీజేపీకి పట్టం కట్టి, ఐక్యతను చాటాలని కోరారు. కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి సాంఘికశాస్త్రం పరీక్షలో ప్రతిభ నిర్మల్ రూరల్: రాష్ట్రస్థాయి సాంఘికశాస్త్ర ప్రతి భ పరీక్షలో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచా రు. బోసి ఉన్నత పాఠశాలకు చెందిన డి.అక్షర ఇంగ్లిష్ మీడియం విభాగంలో నాలుగో ర్యాంక్, ఉర్దూ మీడియం విభాగంలో నర్సాపూర్(జి) ఉర్దూ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆఫ్రిన్ రెండో ర్యాంకు సాధించారు. విజేతలను జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అభినందించారు. క్యారమ్స్లో ఎంజేపీ విద్యార్థి ప్రతిభఖానాపూర్: పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి గాండ్ల వర్షిత్ సీఎం కప్ జిల్లాస్థాయి క్యారం పోటీల్లో ప్రతిభ కనబబర్చాడు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో వర్షిత్ రెండోస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. ఈనెల 18న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. -
ఆఖరి పోరాటం
నిర్మల్ఇక్కడకాదు.. అక్కడ! మున్సిపల్ ప్రచారం తుది అంకంలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఓటర్లు ఇతర వార్డుల్లో ఉంటున్నారు. వారిని రప్పించేందుకు అభ్యర్థులుపాట్లు పడుతున్నారు.ముందే ఓటేశారు.. నిర్మల్ఖిల్లా/నిర్మల్ రూరల్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 11వ తేదీన జరుగనుంది. కానీ వీరు మూడు రోజుల ముందే ఓటేశారు. అందేటి అనుకుంటున్నారా.. కానీ నిజమే.. పోలింగ్ రోజున విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది మూడు రోజుల ముందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల సిబ్బంది ఫారం–12 నింపి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల్లో ఓటరుగా నమోదైన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖానాపూర్, నిర్మల్, బైంసా పరిధిలోని తదితర ప్రాంతాల్లో పోలింగ్ అధికారులుగా విధులు నిర్వహించనున్నారు. నిర్మల్: మున్సిపల్ ఎన్నికలు క్లైమాక్స్కు చేరాయి. ప్రచారానికి ఈ ఒక్కరోజే మిగిలింది. దీంతో నిమిషం కూడా వృథా కావొద్దన్నట్లు అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. మూడు మున్సిపాలిటీల్లో అన్నిపార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సంఘాల వారీగా పిలుస్తూ, కులాలను కలుస్తూ, వర్గాలకు దగ్గరవుతూ అభ్యర్థులందరూ అన్ని రకాలుగా ఓట్లు రాబట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వార్డు బయట ఉన్న ఓటర్ల దగ్గరికి నేరుగా అభ్యర్థే వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ‘ఇంకా ఏమైనా ఇళ్లు మిగిలాయా..! ఇంకా ఏ ఓటరునైనా కలువలేదా..!’ అంటూ మరోసారి ఓటరు లిస్టును చెక్ చేసుకుంటున్నారు. ఏ ఒక్కరినీ వదలకుండా కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పొద్దంతా చేసేది ఒకెత్తయితే, రాత్రివేళ చేస్తున్న ‘విందు ప్రచారం’ మరో ఎత్తు. తగ్గేదేలే అంటున్న రెబల్స్.. మున్సిపల్ అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి మరికొన్ని గంటలే మిగిలాయి. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటకే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, బీఎస్పీలతో ఆయా పార్టీల రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులూ ‘తగ్గేదెలే..’ అన్నట్లు వార్డుల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. భైంసాలో రెబల్స్, స్వతంత్రులూ ప్రధాన పార్టీలకు తగ్గకుండా జనసమీకరణ చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు, స్వతంత్రులు ఏ నిమిషమూ వృథా చేయొద్దు అన్నట్లుగా చివరిరోజు షెడ్యూల్ పెట్టుకున్నారు. చివరిరోజు మరోసారి అన్ని ఇళ్లనూ టచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. విందు ప్రచారం.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల దినచర్య ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమవుతోంది. 8 గంటలోపు కార్యకర్తలు, అనుచరులను పిలిపించుకోవడం, వారితో కలిసి టిఫిన్ చేసి వార్డులో ప్రచారానికి వెళ్లడం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఓవైపు, లంచ్ తర్వాత ఓ గంట విశ్రాంతి తీసుకుని సాయంత్రం మరోవైపు వెళ్తున్నారు. ఇక రాత్రిళ్లు చేపడుతున్న ‘విందు ప్రచారం’ ప్రభావం వేరే ‘ఎత్తవుతోంది’. జిల్లాకేంద్రంలోని చాలావార్డుల్లో ఆదివారం రాత్రి పోటాపోటీగా అభ్యర్థులు విందులు ఏర్పాటు చేశారు. కొన్నివార్డుల్లో ఓటర్లు ఎటువెళ్లాలో తెలియక తికమకపడ్డారు. ప్రచారం ముగిసినా.. మిగిలిన ఈ రెండురాత్రులూ విందులతో, ప్రలోభాలతో సాగనున్నాయి. -
హనుమాన్ విగ్రహానికి రూ.30 లక్షల విరాళం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ గ్రామంలో భారీ హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ఆదివారం భూమిపూజ చేశారు. మండలంలోని వడ్యాల్ గ్రామంలో 22 అడుగుల ఎత్తతో ఏర్పాటు చేస్తున్న అభయాంజనేయ రాతి విగ్రహానికి ఇదే గ్రామానికి చెందిన నల్ల వినయ్రెడ్డి రూ.30 లక్షలు విరాళంగా అందిస్తున్నారు. వేద పండితులు పూజలు నిర్వహించారు. ప్రత్యేక హోమం చేశారు. విగ్రహానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని నల్ల వినయ్రెడ్డి తెలిపారు. ఇందులో మాజీ ఎంపీపీ నల్ల నరేందర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కల్పనరెడ్డి, డాక్టర్ గోవర్ధన్రెడ్డి, మనోహర్రెడ్డి, సర్పంచ్ నరేశ్, ఉప సర్పంచ్ రవీందర్, నాయకులు నరేశ్రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నదము గ్రంథావిష్కరణ
బాసర: ప్రముఖ రచయిత కవి, భీమన్న సాహితీ పీఠం అధ్యక్షులు సుప్పని సత్యనారాయణ రచించిన నదము గ్రంథాన్ని బాసర శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో రాష్ట్ర గేయ రచయిత స్వర్గీయ డాక్టర్ అందెశ్రీ కుమారుడు దత్తసాయి ఆదివారం ఆవిష్కరించారు. అందెశ్రీకి 35 ఏళ్లుగా బాసర క్షేత్రంతో మంచి అనుబంధం ఉందని ఏటా డిసెంబర్ 31న బాసరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లేవారని గుర్తు చేశారు. వాక్కులమ్మ ప్రచురణలు పేరిట వారి సంకల్పంలో భాగంగా ఇప్పటివరకు 5 పుస్తకాలు ప్రచురించామని, ఆరో పుస్తకంగా నదము గ్రంథం తీసుకువచ్చినట్లు వివరించారు.కార్యక్రమంలో ప్రముఖ ఆర్టిస్ట్ బిక్కనూరి రవి, దాసరి రాజేశ్, సుప్పని సాయి కృష్ణ, బొద్దుల హరికృష్ణ పాల్గొన్నారు. -
డిజిటల్ ప్రచారం..!
నిర్మల్ఖిల్లా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తుండడంతో ప్రచారంలో కొత్త పంథా మొదలైంది. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు డిజిటల్ ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. గడపగడపకూ ప్రచారానికి తోడుగా సామాజిక మాధ్యమాలను విస్తతంగా వినియోగిస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్లు ప్రచార సాధనాలుగా మారాయి. నిమిషంలోపు నిడివితో ఆకర్షణీయ వీడియోలు, సినిమా పాటల పేరడీలు, ట్రెండింగ్ రీల్స్తో అభ్యర్థులు తమ సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేలా సంగీతం, నినాదాలతో కూడిన షార్ట్స్ విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రతీ కాలనీ, ప్రతీ వార్డును లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో అభ్యర్థుల ప్రచార వీడియోలు, పోస్టర్లు, హామీలు పోస్టు చేస్తున్నారు. ‘‘డోర్ టు డోర్’’ ప్రచారానికి బదులుగా ‘‘ఫోన్ టు ఓటర్’’ ప్రచారం ఊపందుకుంది. ఒక క్లిక్తో వందల మందికి సందేశం చేరుతుండటంతో అభ్యర్థులు ఈ డిజిటల్ మార్గాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఖర్చు తక్కువగా ఉండటం, తక్కువ సమయంలో ఎక్కువ మందిని చేరుకునే అవకాశం ఉండటంతో సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ధర్మం కోసం ఏకమవ్వాలి
ఖానాపూర్: హిందుత్వ భావన, ధర్మ రక్షణ, దేశ రక్షణ బాధ్యత ప్రతీ హిందువుపై ఉందని, ఇందుకోసం అంతా ఏకమవ్వాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నవనీత్రాణా కౌర్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పట్టణంలోని జగన్నాథ్రావు చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మ సంకల్ప సభలో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ను ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎంఐఎం చీఫ్ ఒవైసీ దేశాన్ని ఆకు పచ్చమయం చేయాలని చూస్తున్నారని, హిందువులంతా దేశాన్ని కాశయమయం చేయాలన్నారు. ఖానాపూర్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రమేశ్రాథోడ్ ఆశయాలు కొనసాగించాలంటే ఖానాపూర్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ అన్నారు. అంతకుముందు పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ముత్యాల పోచమ్మ ఆలయంలో నవనీత్రాణా కౌర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖానాపూర్ ప్రబరీ పుల్లారావు, నాయకులు ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, రవీందర్రెడ్డి, అనిల్రావు, శారద, మాదిరే శ్రీనివాస్, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, ఖానాపూర్ మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. భైంసాలో కాషాయ జెండా ఎగరేస్తాం.. భైంసాటౌన్: ‘భైంసా మున్సిపల్ ఎన్నికల్లో 12 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను గెలిపించండి చాలు.. భైంసా మున్సిపల్ చైర్మన్ పీఠం కై వసం చేసుకుని చూపుతాం’ అని అమరావతి మాజీ ఎంపీ నవనీత్రాణా కౌర్ అన్నారు. 12 మంది అభ్యర్థులను పోటీకి దింపి ఎలా అధికారంలోకి వస్తారన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ నివాసంలో మాట్లాడారు. ఎంఐఎం గెలవకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, హిందువులు తమ నుదుటన బొట్టు పెట్టుకోవాలంటే వారికి ఎల్లప్పుడూ అండగా ఉండే బీజేపీకి ఓటేయాలని కోరారు. భైంసాలో ఎంఐఎం వరుసగా అధికారంలోకి రావడానికి హిందువుల్లో అనైక్యతే కారణమన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి పాండే, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక
ఖానాపూర్: పార్టీ ఆధ్వర్యంలో పలు సర్వేలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను పోటీలో నిలిపిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్తో కలిసి శనివారం మాట్లాడారు. ఖానాపూర్కు ఇటీవల మంజూరైన రూ.15 కోట్ల నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని ఒక్కో వార్డుకు రూ.కోటికిపైగా నిధులు కేటాయించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.22 కోట్ల నిధులతో అమృత్–2 పనులు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు అందజేశామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతీ రేషన్ కార్డుదారుకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో హుడా చైర్మన్ తాహెర్బిన్ హమ్దాన్, మాజీ మంత్రి ఐకేరెడ్డి, టీపీసీసీ జిల్లా పరిశీలకులు చంద్రశేఖర్గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ.మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్లు చిన్నం సత్యం, అంకం రాజేందర్, జెడ్పీ మాజీ కోఅప్షన్ సభ్యుడు యూసుఫ్ఖాన్ పాల్గొన్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి
ఖానాపూర్: పదేళ్లు అధికారంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్తోపాటు, ఉపాధి హామీ పథకాన్ని ఖానాపూర్కు తెస్తామని తప్పుడు హామీలు ఇస్తున్న బీజేపీకి ము న్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పట్టణంలోని 7వ వార్డు ఏకలవ్య నగర్లో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలంపల్లి రమేశ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎరుకలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగన్నాథ్రావు చౌరస్తా నుంచి ఇందిరానగర్వరకు త్వరలో 66 రోడ్డు విస్తరణ చేస్తామన్నారు. -
ఆటలు సరే.. ఆడే చోటేది?
భైంసారూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం కప్ క్రీడలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆవరణల్లో నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో ప్రత్యేక మైదానాలు లేకపోవడంతో కబడ్డీ, ఖోఖో, షటిల్ పోటీలతో సరిపెట్టారు. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పాలకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలు భిన్నంగా ఉన్నాయి. ఇవి విద్యార్థుల శారీరక అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయి. మాటలు కాదు చేతలు కావాలి.. క్రీడలు మానసిక శక్తి, శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని ప్రసంగాల్లో పోటీల ప్రారంభం సందర్భంగా నేతలు ప్రసంగాలు చేస్తారు. కానీ, పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు, విశాల స్థలాలు లేవు. గ్రామీణ పిల్లల్లో కబడ్డీ, యోగా, కరాటేలో ప్రతిభ ఉన్నప్పటికీ, సదుపాయాల కొరత వారిని వెనక్కి నెడుతోంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటే నైపుణ్యం ఉన్నా.. దీర్ఘకాలిక శిక్షణ లేకపోవడంలో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి రావడం లేదు. స్థలాల కొరత.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 5 ఎకరాలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 3 ఎకరాలు అవసరమని మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, మెజారిటీ పాఠశాలలకు ఎకరం నుంచి రెండెకరాలకు మించి స్థలాలుల ఏవు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. తరగతి గదులే ఇరుకుగా ఉంటున్నాయి. ఆటలకు ఇక చోటే ఉండడం లేదు. యోగా సెషన్లు కూడా సరైన స్థలాలు లేక ఆగిపోతున్నాయి. ప్రోత్సహిస్తే జాతీయ స్థాయికి.. ప్రతీ పాఠశాలకు అనుబంధ మైదానాలు, వ్యాయామ శిక్షకులు, సామగ్రి సరఫరా తప్పనిసరి. పిల్లల ఆసక్తి ఆధారంగా శిక్షణ ఇస్తే జాతీయ క్రీడాకారులు ఎదుగుతారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు, మానిటరింగ్లో దృష్టి పెట్టాలి. క్రీడా దినోత్సవాలు ప్రసంగాలకు మాత్రమే కాకుండా, ఆచరణలో పెట్టాలి. -
సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు షురూ..
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని వాసవీ వరల్డ్ స్కూల్ సమీపంలోని క్రీడా మైదానంలో శనివారం జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు వాలీబాల్, ఫుట్బాల్, చెస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, నెట్బాల్, సిమ్మింగ్, హాకీ, స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి దాదాపు 800 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేందర్, జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ నిమ్మల శ్రీధర్రెడ్డి, ఎల్లంపల్లి సర్పంచ్ భీమ్రావు, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని, అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు అంతరయం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సుల రవాణా, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల సామగ్రి సరఫరా వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళిక అవసరమన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు ముందుగానే తనిఖీ చేసి సిద్ధం చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, కౌంటింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు, సిబ్బంది సౌకర్యార్థం హెల్ప్డెస్క్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అన్ని సదుపాయాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నాకళ్యాణి, వివిధ శాఖల నోడల్ అధికారులు భోజన్న, శ్రీనివాస్, శంకర్, రమణ, విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్ఫరాజ్, ఈడీఎం నదీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆయన మనోడేనా..?
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా ప్రధాన పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి గడపగడపకూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో హామీలు ఇస్తున్నారు. మాటలు చెబుతున్నారు. గెలుపు కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. అయితే కొందరు అనుచరులు ప్రత్యర్థి వర్గాలకు తమ వ్యూహాల సమాచారం చేరవేస్తున్నారనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ విషయంపై బరిలో ఉన్న అభ్యర్థులు, ముఖ్య నాయకులు ఆందోళన చెదుతున్నారు. చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలు ప్రత్యర్థులకు తెలిసిపోకుండా అప్రమత్తమవుతున్నారు. వ్యూహాల అమలు వివరాలను గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గంపగుత్తగా ఓట్లు రాబట్టేలా ప్రణాళికలు రచించి, అనుచరులను సమాయత్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘‘మన అనుచరవర్గంలో ఉన్నవాళ్లంతా నిజంగా మనోళ్లేనా?’’ అనే ప్రశ్న తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
విద్యార్థులకు నాయకత్వ పాఠాలు
లక్ష్మణచాంద: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో చదివే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించింది. పాఠశాలల్లో హౌస్ సిస్టంను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా విద్యార్థులు పాఠశాలస్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటారు. ఇందుకు ప్రతీ పాఠశాలకు రూ.6,350 ప్రత్యేక గ్రాంట్ కేటాయించి, కార్యక్రమం పకడ్బందీగా అమలు అవుతోంది. జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య.. జిల్లాలో 577 ప్రాథమిక పాఠశాలల్లో 23,398 మంది, 89 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,373 మంది, 164 ఉన్నత పాఠశాలల్లో 37,019 మంది చదువుతున్నారు. ఇక 18 కేజీబీవీల్లో 3,600 మంది విద్యార్థులు ఈ వ్యవస్థ పాల్గొంటున్నారు. అన్ని పాఠశాలల్లో హౌస్ల స్థాపన పూర్తయింది. హౌస్లకు దేశ నాయకుల పేర్లు.. ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో నాలుగు హౌస్లు ఏర్పాటు చేశారు. రెడ్ హౌస్(అబ్దుల్ క లాం), గ్రీన్ హౌస్(శకుంతలా దేవి), బ్లూ హౌస్ (సీవీ.రామన్), ఎల్లో హౌస్(రవీంద్రనాథ్ ఠాగూర్) పేర్లు. ప్రతీ హౌస్కు ఉన్నత తరగతి నుంచి కెప్టెన్, టీచర్ మాస్టర్ లేదా హౌస్ మదర్ను నియమిస్తారు. హౌస్ విధులు ఇవీ.. ప్రతీ హౌస్కు 15 రోజులు కేటాయించారు. ఆ కాలంలో ఆ హౌస్ సభ్యులు ఉదయం ప్రార్థన, మధ్యాహ్న భోజనం, క్లీనింగ్, వ్యక్తిగత పరిశుభ్రత వంటి పాఠశాల కార్యకలాపాలను నడుపుతారు. విద్యార్థి కౌన్సిల్లో హెడ్ బాలుడు, హెడ్ బాలిక, డిప్యూటీలు, ఆరు క్లబ్ల సెక్రెటరీలు(ఎకో, జీసీఈఏసీ, పహరీ, డిజిటల్, లైబ్రరీ, స్పోర్ట్స్) ఎంపిక అవుతారు. ప్రోత్సాహకాలు.. ఉత్తమ హౌస్లకు బహుమతులు, షూస్, బ్యాడ్జీ లు, క్రీడా పరికరాలు అందిస్తారు. పాఠశాల కార్యక్రమాలన్నీ ఈ కమిటీలే నిర్వహిస్తాయి. ఇవి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభిమానం పెంచుతుందని ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు. -
పల్లె నేతల ప్రచారం
నిర్మల్ఖిల్లా: జిల్లాలో పుర ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాల్లో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున మిత్రులు, బంధువులు, సహచర నాయకులు గడపగడపకూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల క్రితం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా పట్టణాల నుంచి నాయకులు తరలివెళ్లి ప్రచారం నిర్వహించారు. అప్పట్లో ‘పల్లె గెలుపు కోసం పట్టణం’ అన్న నినాదం వినిపించగా, ఇప్పుడు దానికి భిన్నంగా ‘పుర విజయం కోసం పల్లె’ అన్న దృశ్యం కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సారంగాపూర్, దిలావర్పూర్, లక్ష్మణచాంద, మామడ మండలాల నాయకులు ప్రచారం చేస్తున్నారు. తమకు పరిచయం ఉన్న, బంధుత్వం కలిగిన కుటుంబాల ఓట్లపై ఫోకస్ పెడుతున్నారు. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, సమావేశాల్లో పల్లె నాయకుల సందడి స్పష్టంగా కనిపిస్తోంది. -
చైర్మన్గిరీపై హస్తం గురి
నిర్మల్ఎన్నికల ఉపాధి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యువతీ, యువకులు, రోజు వారి కూలీలకు ఉపాధి లభిస్తోంది. ప్రచారంతోపాటు పోల్ చీటీల పంపిణీకి ఉపయోగిస్తున్నారు. నిర్మల్: ‘గాడిదకు గడ్డేసి.. ఆవు పలు పిండితే రావు.. ఓట్లు ఇతర పార్టీలకు వేసి.. అభివృద్ధి కాంగ్రెస్ చేయాలంటే జరగదు. కాంగ్రెస్కు ఓట్లు వేసి.. అభివృద్ధి చేసుకోండి’ ఇదీ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్రెడ్డి నినాదం. ‘ప్రభుత్వం మనది–పట్టణం మనది–ప్రగతీ మనది’ అన్న నినాదంతో ఈసారి పురాలను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో పార్టీ జెండా ఎగురవేసేందుకు శ్రమిస్తోంది. ప్రధానంగా నిర్మల్లో ఈసారి ఎలాగైనా గెలువాలన్న లక్ష్యంతో మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి అప్పాల కావ్య, గణేశ్చక్రవర్తి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాము పోటీచేస్తున్న వార్డుల్లోనే కాకుండా పట్టణంలోని ప్రతీ వార్డు, ప్రతీ ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీమంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, వేణుగోపాలచారి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీకూడా నిర్మల్లో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ చేతిగుర్తును తీసుకెళ్తున్నారు. పార్టీని గెలిపిస్తే, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. గతంలో చేసిన పనులతో.. నిర్మల్ మున్సిపాలిటీలో 2014–19 వరకు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులను మాజీ మున్సిపల్ చైర్మన్, 37వవార్డు అభ్యర్థి అప్పాల గణేశ్చక్రవర్తి ప్రచారం చేస్తున్నారు. ఈసారి నిర్మల్ మున్సిపాలిటీ పీఠం బీసీ మహిళకు రావడంతో తన భార్య కావ్యను 36వ వార్డు నుంచి బరిలో నిలిపారు. ఈ రెండువార్డులతోపాటు మిగితా 40 వార్డుల్లోనూ తమ హయాంలో చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. మార్నింగ్వాక్ ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం, కోతుల సమస్యను అరికట్టడం, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడటం, వీధుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం ఇలా తాము చేసిన పనులను ప్రజలకు గుర్తుచేస్తున్నారు. ఈసారి అవకాశమిస్తే రాష్ట్రప్రభుత్వ సహకారంతో నిర్మల్ను రోల్మోడల్గా తీర్చిదిద్దుతామంటున్నారు. కమిట్మెంట్తో కాంగ్రెస్.. సీఎం ఫోకస్..సీఎం రేవంత్రెడ్డి ఈసారి ఉత్తర తెలంగాణ మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. బీజేపీ ప్రభావం ఉన్న నిర్మల్లో గెలువాలంటూ పార్టీ సీనియర్లు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పట్టణంపై అప్పాల గణేశ్చక్రవర్తికి పట్టు ఉండటంతో కచ్చితంగా గెలిచేలా అందరూ కృషిచేయాలని ఇటీవల నిర్మల్ పర్యటన సందర్భంగా సీనియర్ నేదలకు సూచించారు. తాజాగా ప్రచార సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతోపాటు జిల్లాలో ఖానాపూర్ మినహా మిగిలిన రెండు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేయడంతో ఈసారి ఎలాగైన మున్సిపాలిటీలను కై వసం చేసుకోవాలని చూస్తోంది. ఖానాపూర్లో స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ పూర్తి సమయం కేటాయించి గెలుపు కోసం కృషిచేస్తున్నారు. భైంసాలోనూ మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావుపటేల్, విఠల్రెడ్డి అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. -
మాతాశిశులో మెరుగైన సేవలు అందించాలి
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మాతా, శిశు ఆస్పత్రిని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ వార్డులు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, స్కానింగ్ కేంద్రం, టీకాల గది, చిన్నారులకు పాలిచ్చే గది, మందుల గది, మరుగుదొడ్లు పరిశీలించారు. పలు రిజిస్టర్లను తనిఖీ చేసి, అన్ని విభాగాల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అవసరమైన టీకాలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతోపాటు తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చికిత్స కోసం వచ్చిన మహిళలతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందుతుందని భరోసా ఇచ్చారు. పార్కింగ్ సమస్యలు లేకుండా చూడాలని, భద్రత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్ఎంవో రమేశ్, విభాగాధిపతి సరోజ, ప్రోగ్రాం ఆఫీసర్ సౌమ్య, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, తహసీల్దార్ రాజు తదితరులు ఉన్నారు. -
కేంద్రం నిధులతోనే పట్టణాభివృద్ధి
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గొడెం నాగేష్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్తో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసింది శూన్యమన్నారు. ఖానాపూర్ను మున్సిపాలిటీగా చేసి పన్నులు పెంచారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఖానాపూర్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించేలా కృషిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మున్సిపాలిటీలకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కార్యక్రమంలో 9వ వార్డు అభ్యర్థి అంకం మౌనిక మహేందర్, 1వ వార్డు అభ్యర్థి బత్తుల లక్ష్మీనారాయణ, 3వ వార్డు అభ్యర్థి ఆకుల శోభ శ్రీనివాస్, 4వ వార్డు అభ్యర్థి గుమ్ముల అశోక్, 11వ వార్డు అభ్యర్థి ఎనగందుల నారాయణ, నాయకులు పాల్గొన్నారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. తెల్లవారుజామున చల్లగా ఉంటుంది.‘ఫీల్డ్’పై భారంలోకేశ్వరం: కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో వలసలు తగ్గించి, అన్నదాతకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వీబీజీ రామ్జీ(ఎన్ఆర్ఈజీఎస్) అమలు చేస్తోంది. పనుల పర్యవేక్షణ, హాజరు నమోదు, కొత్త పనుల గుర్తింపు తదితర పనుల కోసం ప్రతీ పంచాయతీకి ఫీల్డ్ అసిస్టెంట్ను(ఏఫ్ఏ) నియమించింది. అయితే గత ప్రభుత్వం 500 జనాభా కలిగిన గ్రామాలను పంచాతీలుగా ఏర్పాటు చేసింది. అయితే ఈ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదు. కొత్త పంచాయతీల్లో ఎఫ్ఏల కొరత.. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో క్షేత్ర సహాయకులు లేకపోవడంతో పథక అమలు కష్టంగా మారింది. పనుల గుర్తింపు, హాజరు రికార్డు, పనిస్థలంలో వసతి, వేతనాల చెల్లింపు వంటి బాధ్యతలు భారంగా మారాయి. 204 గ్రామాల్లో మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. మిగిలిన చోట్ల సమస్యలు ఉన్నాయి. ఎఫ్ఏల బాధ్యతలు.. కూలీలకు పనుల కేటాయింపు, మాస్టర్లు వేయడం, పర్యవేక్షణ, జాబ్ కార్డుల మంజూరు, ఆధార్ లింకింగ్, వసతి కల్పన వంటి పనులు ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకోవాలి. వారు లేనిచోట అనుభవజ్ఞులైన కూలీలను మేట్లుగా నియమించారు. దీంతో పక్క గ్రామాల ఎఫ్ఏలపై అదనపు భారం పడుతోంది. అమలులో సమస్యలు.. మేట్ల అవగాహన కొరతతో తప్పులు జరిగి, సహాయకులు, కార్యదర్శులు ఆడిట్లో బాధ్యులవుతున్నారు. పనుల కేటాయింపు, గ్రామ సభలు, హాజరు, వేతన మంజూరులో పర్యవేక్షణ లోపం. జాబ్ కార్డు ధారుకులకు 100 రోజుల పని కల్పనలో వైఫల్యాలు విమర్శలకు గురవుతున్నాయి. పూర్తిస్థాయి సహాయకులను నియమించి శిక్షణ కార్యక్రమాలు, డిజిటల్ మానిటరింగ్ పెంచడం అవసరం. పంచాయతీల్లో సమన్వయం మెరుగుపరచి, పథకం ప్రయోజనాలను పూర్తిగా చేరవేయాలి. ఎఫ్ఏలను నియమిస్తాం ఉపాధిహామీ పనులకు ఉమ్మడి జీపీల్లో నియమించిన ఎఫ్ఏలు పని చేస్తున్నారు. దీంతో కొంత భారం పడుతున్న మాట వాస్తవమే. కొందరు తమకు తెలియకుండానే అవకతవకలకు బాధ్యులవుతున్నారు. కొత్తగా ఏర్పటు చేసిన జీపీలకు ఎఫ్ఏల నియామకానికి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. జీవో వచ్చాక నియామకాలు చేపడుతాం. దీంతో గ్రామాల్లో ఎఫ్ఏలపై పని భారం తగ్గుతుందని తెలిపారు. – విజయలక్ష్మి, డీఆర్డీవోపూర్తిస్ధాయిలో భర్తీ చేయాలి గతంలో జోహర్పూర్ జీపీ కింద ఐదు గ్రామాలు ఉండేవి. ఇందులో రెండు కొత్తగా జీపీలు ఏర్పడ్డాయి. అర్లి–గొడిసెరా జీపీలో పని జరిగితే 6 కిలో మీటర్లు ప్రయాణం చేసి కూలీల హాజరు తీసుకోవాల్సి వస్తోంది. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ఎఫ్ఏ పోస్టు భర్తీ చేయాలి. దీంతో మాపై అదనపు భారం ఉండదు. – అంజన్రెడ్డి, ఎఫ్ఏ, జోహర్పూర్ జిల్లాలో ఇలా .. గ్రామ పంచాయతీలు 400 జిల్లాలో మండలాలు 18 క్షేత్రసహాయకులు 204 జాబ్ కార్డులు 1.74 లక్షలు మొత్తం ఉపాధి కూలీలు 3.20 లక్షలు క్షేత్ర సహాయకులు లేని జీపీలు 196 -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
భైంసాటౌన్/లోకేశ్వరం: కార్మికుల సమస్యల పరిష్కారం ఈనెల 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.హరిత పిలుపునిచ్చారు. భైంసా పట్టణంలోని శివాజీ బీడీ సెంటర్లో, లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామంలోని శివాజీ బీడీ ప్యాకింగ్ కేంద్రం వద్ద సమ్మె పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, కార్మిక, శ్రామిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. బీడీ పరిశ్రమ నాశనానికి జీఎస్టీ విధిస్తోందని, బీడీ కార్మికులకు నష్టం చేసే కోప్టా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస పింఛన్ రూ.9 వేలు ఇవ్వాలని, బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ షరతులు లేని జీవనభృతి అమలు చేయాలన్నారు. కార్యక్రమాల్లో లక్ష్మి, బేబీ, మీనా, విజయ, గంగాధర్, రాములు, భారతి, రుక్మ, హుస్సేన్, రాజ్సింగ్, లతీఫ్, యోగేష్, గంగాధర్, రామ్సింగ్, నర్సయ్య, సురేశ్, నయీమ్ పాల్గొన్నారు. -
నిర్మల్
పరిమితికి మించి..! మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయపరిమితిని మించి ఖర్చు చేస్తున్నారు. ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని పుర ప్రజలు కోరుతున్నారు. మైక్రో అబ్జర్వర్లే కీలకం నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లే అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు శుక్రవారం రెండోవిడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మైక్రో అబ్జర్వర్లకు అదనపు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. శిక్షణలో, శిక్షకులు అందించే వివరాలు సమగ్రంగా తెలుసుకుని ఎన్నికల్లో విధుల్లో పాల్గొనాలన్నారు. సిబ్బందికి సమయపాలన క్రమశిక్షణ అత్యంత కీలకమన్నారు. బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించి, ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో డీఈవో భోజన్న, ఎల్డీఎం రామ్గోపాల్, శిక్షకులు పాల్గొన్నారు. నిర్మల్: ప్రచార రథాలు ఒకదాని వెంట ఒకటి రోజంతా గల్లీలో లొల్లి చేస్తున్నాయి. ఇగ మూడు రోడ్ల కూడళ్ల దగ్గరయితే మూడు వార్డుల నుంచి మూడునాలుగు ఇలాంటి పాటల లొల్లి చేసే పార్టీల బండ్లు రోజంతా తిరుగుతూనే ఉన్నాయి. చెవుల ఇల్లు కట్టుకున్నట్లే పొద్దంతా పాటల వినిపిస్తున్నాయి. చీకటి పడుతుందంటే.. నేతల కార్నర్ మీటింగ్లు మొదలవుతున్నాయి. ఏ గల్లీలను చూసినా పార్టీల జెండాలు, అభ్యర్థుల ఫొటోలతో కలర్ఫుల్ పండుగ వాతావరణం కనిపిస్తోది. ఇక.. పొద్దున టిఫిన్ మొదలు రాత్రి ముక్కసుక్క దాకా అభ్యర్థుల ఇళ్ల దగ్గరే వంటావార్పులు కొనసాగుతున్నాయి. అటు అన్న.. ఇటు తమ్ముడు ‘అరె ఏమే రాజన్న.. నువ్వేమో పొద్దుగాల లేసిన్నుంచి, రాత్రి బారాబజే దాకా మన పార్టీల తిరుగుతున్నవ్. మీ తమ్ముడేమో ఆళ్ల పార్టీల తిరుగుతున్నడు. మీ గేటుకు ఒకదిక్కు మన స్టిక్కరుంది. ఇంకో దిక్కు గోడకు ఆ పార్టీ రాతలున్నయ్. ఒకటే ఇంట్లకెళ్లి ఒకళ్లు అటు, ఇంకొకళ్లు ఇటు..! ఇదేం కథనే..!?’ అని ప్రచారం చేస్తుండగా సాటి కార్యకర్త రామన్న ఆశ్చర్యంతో అడిగిండు. ‘ఆ.. ఏమున్నదే రామన్న. మావోడు ముందటి నుంచి ఆ పార్టీకే తిరుగుతుండు. ఇగ మన సంగతైతే తెల్సిందే గదనే. నేను పార్టీ పుట్టిన్నుంచి ఇదే జెండా పట్టుకున్న. ఎందరు నాయకులు మారినా.. నేనిండ్లనే ఉన్న కదా. ఓళ్ల ఇష్టం ఆళ్లది..’ అంటూ రాజన్న చెప్పిండు. ఇలా.. ఒకే ఇంట్లో నుంచి రెండుమూడు పార్టీల్లో తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. అభ్యర్థులకు దగ్గర బంధుమిత్రులైతే ఇంటిల్లిపాదీ ప్రచారంలో పాల్గొంటున్నారు. పొద్దున్నే మొదలు..పార్టీల ప్రచారం పొద్దున్నే మొదలవుతోంది. ‘అన్నా.. వస్తున్నారా..? ఇవ్వాళ్ల ఆ మిగిలిన రెండు గల్లీలు పూర్తిచేద్దాం తొందరగా రండి అన్న..’ అంటూ అభ్యర్థులు ఫోన్లు చేయడమే ఆలస్యం గుంపులుగుంపులుగా కార్యకర్తలు, అనుచరులు వచ్చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం వీధులవారీగా విడిపోయి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకూ ఇలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పగటిపూట భోజనం, కాస్త విశ్రాంతి తర్వాత మళ్లీ సాయంత్రం యథావిధిగా మరోవైపు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఏదో ఒకపూట పెద్దలీడర్లు, చైర్మన్ బరిలో ఉన్న అభ్యర్థులు గల్లీలవారీగా కౌన్సిలర్ అభ్యర్థులతోపాటు ప్రచారంలో భాగమవుతున్నారు. రాత్రిళ్లు విందుప్రచారం.. రోజంతా ఇంటింటి ప్రచారం సాగుతుంటే.. రాత్రి నిబంధనల ప్రకారం మైకులు బంద్కాగానే, విందుపార్టీలు ప్రారంభమవుతున్నాయి. వార్డుల్లో గల్లీగల్లీకి ఎక్కడికక్కడ పార్టీనేతలు విందురాజకీయం చేస్తున్నారు. కాలనీల కమిటీలు, కులసంఘాలు, పెద్దలు, యువజనసంఘాలకు వేర్వేరుగా పార్టీలు ఇస్తున్నారు. అక్కడే ఏం చేయాలో, ఎలా పార్టీ అభ్యర్థిని గెలిపించాలో చర్చిస్తున్నారు. ఉదయాన్నే మళ్లీ ఎలా వార్డులో ప్రచారం చేపట్టాలో, ఎవరెవరి దగ్గరకు వెళ్లాలో డిసైడ్ చేసుకుంటున్నారు. -
జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవాలు
నిర్మల్ రూరల్: జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవా లు జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీబీవీలో గు రువారం జరిగాయి. వికసిత్ భారత్– 2047 అనే అంశంపై విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి శ్రీనిధి(సోఫీనగర్ గురుకుల పాఠశాల), రెండో బహుమతి (నందిని, కేజీబీవీ కుభీర్), మూడో బహుమతి(జ్యోతి, కేజీబీవీ మస్కాపూర్), శివ కార్తీక్ (జెడ్పీహెచ్ఎస్, మంజులాపూర్) గెలుచుకున్నారు. సెక్టోరియల్ అధికారులు నరసయ్య, రమాదేవి, డీఎస్వో వినోద్కుమార్, ఎంఈవో విజయ్కుమార్, ఎస్వో సుజాత, పాల్గొన్నారు. -
బ్యాలెట్ ముద్రణ గడువులోపు పూర్తిచేయాలి
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణ గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని విజయ్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియను ఎస్పీ జానకీషర్మిలతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముద్రణలో లోపాలు తలెత్తకూడదన్నారు. అనధికార వ్యక్తులను ముద్రణ కేంద్రంలోకి అనుమతించొద్దని సూచించారు. ముద్రణ పూర్తయ్యే వరకు పోలీసు బందోబస్తు కొనసాగించాలన్నారు. వారివెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, జెడ్పీ సీఈవో శంకర్, ఉద్యానవన పంటల అధికారి రమణ, తహసీల్దార్ రాజు ఉన్నారు. ఆధునిక సాగును ప్రోత్సహించాలి నిర్మల్చైన్గేట్: ఆధునిక పద్ధతిలో పంటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించా రు. వ్యవసాయం లాభసాటిగా మార్చేలా రైతులకు అధికారులు చేయూతనివ్వాన్నారు. పంట మార్పిడి విధానం అలవాటు చేయాలన్నారు. సహజ ఎరువు ల వాడకం పెంచేలా ప్రోత్సహించాలని సూచించా రు. భూసార పరీక్షలు నిర్వహిస్తూ, మోతాదుకు మించిన ఎరువుల వాడకంతో కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద నిర్దేశించిన అన్ని లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి రైతులందరికీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని తె లిపారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం మ రింత పెంచాలని, ఆయిల్పామ్ సాగుతో రైతులు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని వివరించారు. రైతులకు అధిక లాభసాటిగా ఉండే పండ్లు, కూరగాయలు, పూల సాగు పెంచేలా అధికారులు చొరవ చూపాలన్నారు. స మావేశంలో డీఏవో అంజిప్రసాద్, ఏడీఏలు విద్యాసాగర్, శ్రీనివాసరాజు, సుజాత, వీణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారులకు మరమ్మతు చేయాలినిర్మల్చైన్గేట్: జిల్లా పరిధిలో జాతీయ రహదారులకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో జాతీయ రహదారి సంస్థ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలో చేపట్టిన మరమ్మతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంతలు పూడ్చి రహదారుల వెంట లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రదేశాల్లో సూచిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్ లైన్స్, ఇతర క్రాసింగ్ మార్క్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జాతీయ రహదారి సంస్థ ఇంజినీరింగ్ అధికారి సుభాష్బాబు, ఆర్అండ్బీ డీఈఈ భీమ్సింగ్, మున్సిపల్, ఇంజినీరింగ్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● బల్దియాల్లో గేరు మార్చిన బీఆర్ఎస్ ● కీలకంగా మారేందుకు కసరత్తు ● నిర్మల్పై ఎమ్మెల్యే అనిల్జాదవ్ ఫోకస్ ● 9న జిల్లాలో కేటీఆర్ ప్రచారం
నిర్మల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కార్.. కింగ్మేకర్ కానుందా..!? అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. వరుస ఎన్నికల్లో దెబ్బతిన్న కారుపార్టీ పురపోరులో గేరు మార్చింది. తన బలమున్న వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రధాన పోటీదారుగా మారింది. పట్టణా లను గెలువకున్నా పట్టు సాధించే దిశగా ప్రయత్నిస్తోంది. బీజేపీ నుంచి సీనియర్ నేతలు రావడంతో నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా పుంజుకుంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్లు, సీట్లు చీలి హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సీట్లే కీలకం కానున్నాయి. పూర్వ వైభవం కోసం..జిల్లాలో పూర్వవైభవం సాధించేదిశగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పట్టణాల్లో పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ప్రభావం చూపేందుకు గులాబీశ్రేణులు సీరియస్గా పనిచేస్తున్నాయి. నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులకు గానూ 36 చోట్ల బీఆర్ఎస్ బరిలో దిగింది. దాదాపు 10 వార్డుల్లో గెలుస్తామన్న ధీమాతో ఉంది. మరో ఐదు వార్డుల్లో గెలుపోటములపై ప్రభావం చూపనుంది. బీజేపీ సీనియర్నేత, వరుసగా గెలుస్తున్న మాజీకౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ బీఆర్ఎస్లో చేరడం గులాబీ పార్టీకి కలిసివచ్చింది. భైంసాలో 26వార్డులకు 15 చోట్ల బీఆర్ఎస్ పోటీపడుతోంది. ఇక్కడ బీజేపీ కన్నా మూడు ఎక్కువస్థానాల్లో గులాబీపార్టీ పోటీచేస్తోంది. బీజేపీ–ఎంఐఎం మధ్యన తామే గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఇక ఖానాపూర్లో మొత్తం 12 స్థానాల్లో పోటీపడుతోంది. ఇక్కడ చైర్మన్ పీఠంపై కన్నేసింది. చైర్మన్ స్థానాలను సాధించే పరిస్థితి లేనప్పుడు కింగ్మేకర్ కావాలని భావిస్తోంది. 9న కేటీఆర్ రాక..మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 9న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు రానున్నట్లు పార్టీవర్గాలు తెలిపా యి. జిల్లాకేంద్రంలో రోడ్షో, ప్రధాన చౌరస్తాల్లో మీటింగ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్ల డించాయి. ఇన్చార్జీల నియామకం..బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకదృష్టి పె ట్టింది. ఒక్కో మున్సిపాలిటీకి పరిస్థితులను బట్టి ఎమ్మెల్యే, సీనియర్ నేతలను ఇన్చార్జీలుగా ని యమించింది. నిర్మల్ మున్సిపల్ బాధ్యతలు బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్కు అప్పగించింది. ఆయన గులాబీశ్రేణులను పరుగులు పెట్టిస్తున్నా రు. సీనియర్ నేతలు, నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్రెడ్డి, సుభాష్రావు, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, జీవన్రెడ్డి తదితరుల సమన్వయంతో ప్రచారం చేస్తున్నారు. ఖానాపూర్లో నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముజీబ్ పార్టీ శ్రేణుల ను నడిపిస్తున్నారు. భైంసా బల్దియా ఇన్చార్జి జక్క వెంకటరెడ్డితోపాటు సీనియర్ నేతలు విలా స్గాదేవార్, లోలం శ్యాంసుందర్, రమాదేవి, కిరణ్ కొమ్రేవార్ ప్రచారంలో పాల్గొంటున్నారు. -
బీజేపీని అడ్డుకోవడం ఎంఐఎంతోనే సాధ్యం
నిర్మల్: ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఏ పార్టీ అడ్డుకోలేకపోయిందని, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తాము అడ్డుకుంటామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకేంద్రంలో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న పలువార్డుల్లో గురువారం ప్రచారం చేశారు. అనంతరం గాజుల్పేట్లో గంజ్బక్ష్ మైదానంలో నిర్వహించిన సభలో మాట్లాడా రు. నిర్మల్లో గతపాలకులు ఈద్గా పేరిట ముస్లింలను మోసం చేశారని ఆరోపించారు. ఫారెస్ట్ భూమి అంటూ ఈద్గా కాకుండా అడ్డుకున్నారని, అదే భూమిని స్కిల్సెంటర్కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈద్గా కోసం 20 ఎకరాలు కేటాయించాలని నిర్మల్ ఎంఐఎం నేతలతో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణరావును కలిశామని విన్నవించారని తెలిపారు. ఎంఐఎం గెలిస్తే స్లాటర్హౌస్ సమస్యనూ పరిష్కరిస్తుందన్నారు. నిర్మల్లో బాలికల కోసం మరో విద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఏ ఒక్కరు కూడా ఓటుహక్కును వృథా చేసుకోవద్దని, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజీంబినయహ్యా, ప్రధాన కార్యదర్శి మజర్, కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. -
బంగారు భవితకు బాటలు
లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల ముందు ప్రభుత్వ, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవగాహన చేపట్టింది. గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులు ఎంచుకోవడంలో ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందుకోసం ఉపాధ్యాయులకు ముందుగా శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 9,932 మందికి ప్రయోజనంజిల్లా ప్రభుత్వ ఉన్నత, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలల్లో 4,911 మంది బాలురు, 5,021 మంది బాలికలు పదో తరగతి చదువుతున్నారు. మొత్తం 9,932 మందికి కెరీర్ గైడెన్స్పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో అయోమయాన్ని తగ్గించి, సరైన కెరీర్ ఎంపికకు సహాయపడుతుంది. మార్కులతోపాటు జీవిత మార్గదర్శకత్వం అందిస్తూ గ్రామీణ యువతకు ఆత్మవిశ్వాసం నింపుతుంది. కార్యక్రమ లక్ష్యాలు..అవగాహన కల్పించాలి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. ఏ కోర్సు చదివితే భవిష్యత్తులో అవకాశాలు ఎలా ఉంటాయో తెలియజేయాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలి. – భోజన్న, డీఈవో -
నిర్మల్
7బీజేపీ నుంచి ఇద్దరి సస్పెన్షన్ఖానాపూర్: పట్టణంలోని నాలుగో వార్డులో పోటీలో ఉన్న బీజేపీ నాయకుడు నాయిని సంతోష్తోపాటు, 10వ వార్డులో పోటీలో ఉన్న నారవేణి శిరీషసాయిని పార్టీ నుంచి సస్పెడ్ చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ తెలిపారు. పార్టీ అభ్యర్థులకు పనిచేయక పోవడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో సస్పెండ్ చేశామని జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రవీందర్రెడ్డి పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. పగలు వేడిగా, రాత్రి చల్లగా ఉంటుంది. తెల్లవారుజామున చలి ప్రభావం పెరుగుతుంది.కఠినంగా కోడ్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు, అభ్యర్థుల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రూపొందించింది. ఎన్నికలు ప్రశాంతంగా, నిర్వహించడానికి దీనిని అమలు చేస్తోంది. -
ల్యాబ్ టెక్నీషియన్ల కార్యవర్గం
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ ల్యాబ్ టెక్నీషియన్ల నూతన కార్యవర్గాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రి లో తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ స్టేట ప్రెసిడెంట్ నిజముద్దీన్ ఆదిలాబాద్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కార్యదర్శి అన్సారీ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జాన్ అనిల్, ప్రధాన కార్యదర్శిగా ఎవలే మాధవ్రావు, ఉపాధ్యక్షులుగా మహేశ్, శోభ, కోశాధికారిగా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గా నర్సారెడ్డి, మల్లారెడ్డి, గంగారావు, సలీంఖాన్, లక్ష్మీరాజాం ఎన్నికయ్యారు. -
గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తేవాలి
కడెం: గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం నియోజకవర్గస్థాయి పోటీలను ప్రారంభించా రు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని సూచించారు. సీఎం కప్ పో టీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చే విద్యార్థులకు రూ.25 వేల నగదు ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ భూషణ్, సర్పంచ్ ధీకొండ విజయ్, సర్పంచుల ఫోరం అధ్యక్షు డు చంద్రశేఖర్, జిల్లా నాయకుడు సతీశ్రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మల్లేశ్యాదవ్, వాజీద్, కన్వీనర్ రమాకాంత్, కోకన్వీన ర్ వెంకటరమణ, ఎంఈవో షేక్ హుస్సేన్, హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవోలు సునీత, అరుణ, ఎంపీవో రత్నాకర్రావు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం అందాలి
నిర్మల్చైన్గేట్: సమాజంలోని ప్రతీ వర్గానికి సా మాజిక న్యాయం అందాలని కలెక్టర్ అభిలాష అ భినవ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక న్యాయ దినోత్సవా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్ సామాజిక న్యాయ ప్రతిజ్ఞ చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే హక్కులు, బాధ్యతలు, సామాజిక న్యాయం తదితర అంశాలపై అవగాహన కల్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాలకే కాకుండా, ప్రతీ పౌరుడికి సమన్యాయం అందేలా వ్యవస్థ పనిచేయాలని సూచించారు. సామాజిక న్యాయం అనే ది ప్రభుత్వ పరిరక్షణకే కాకుండా, ప్రతీ పౌరుడి మౌలిక హక్కు అని పేర్కొన్నారు. సామాజిక న్యా య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపన్యాసాలతోపాటు వివిధ పోటీలు ని ర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. యాప్లో వివరాలు నమోదు చేయాలి ప్రభుత్వ వసతిగృహాల్లో సౌకర్యాల పర్యవేక్షణకు రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్పై కలెక్టర్ అధికారులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు వసతిగృహాలను సందర్శించినప్పుడు అక్కడి సదుపాయాల వివరాలను ఫొటోలతో యాప్లో నమోదు చేయాలని సూచించారు. దీంతో వసతిగృహాల సమగ్ర సమాచారం సులభంగా సేకరించడానికి సదుపాయాల మెరుగుదలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్ను జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశముందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
అమ్మో.. బూచోళ్లు..! చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై వారికి అవగాహన కల్పించాలని మానసిక వైద్యనిపుణలు సూచిస్తున్నారు. భైంసాలో తనిఖీలు భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా పట్టణంలో మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన వీధుల్లో తిరుగుతూ పెట్రోలింగ్, పికెటింగ్ పాయింట్లను పరిశీలించారు. నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సీఐ సాయికుమార్, ఎస్సైలున్నారు. నిర్మల్: ఐదేళ్లలో మున్సిపల్ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. అప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇప్పుడు ఉనికి కోసం కొట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కనీసం సీట్లు, ఓట్లు రాని పార్టీలు ఇప్పుడు గట్టి పోటీనిస్తున్నాయి. ఈసారి తామే గెలుస్తామన్న ధీమా ప్రతీ పార్టీలో కనిపిస్తోంది. ఎవరి పోరు వారిదే అన్నట్లుగా వార్డుల్లో ఫైట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా పైకి ప్రకటించకున్నా.. లోలోపల పలు పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. జిల్లాలో మాత్రం అలాంటి పొత్తులేవీ కనిపించడం లేదు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడుచోట్లా ఎవరికివారే అన్నట్లుగా పార్టీలు బరిలో ఉన్నాయి. దాదాపు ప్రతీవార్డులో కాంగ్రెస్, బీజేపీ నువ్వా.. నేనా? అనే తరహాలో తలపడుతున్నాయి. కొన్నివార్డుల్లో ఈరెండు పార్టీల మధ్యలోకి బీఆర్ఎస్ కారు దూసుకువస్తోంది. భైంసా, నిర్మల్ మున్సిపాలిటీల్లో తామే కీలకమవుతామని ఎంఐఎం ‘పతంగి’ ఎగురవేస్తోంది. ప్రధాన పార్టీలకు తామేం తీసిపోమంటూ బీఎస్పీ, ఆప్తోపాటు రెబెల్స్, స్వతంత్రులూ పోటీపడుతున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో.. జిల్లాకేంద్రమైన నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. రెండు పార్టీలు కూడా మొత్తం 42వార్డుల్లో అభ్యర్థులను నిలిపాయి. ఈసారి మైనార్టీలు ఎక్కువగా ఉన్న వార్డుల్లోనూ బీజేపీ అభ్యర్థులను నిలుపడం గమనార్హం. గతంలో బల్దియాలో కలిసి పనిచేసిన బీఆర్ఎస్ నుంచి 36మంది, ఎంఐఎం నుంచి 19మంది వేర్వేరుగా బరిలో ఉన్నారు. ఎంఐఎం పోటీచేస్తున్న వార్డుల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపింది. నిర్మల్లో 2014లో అత్యధిక వార్డులు గెలిచి, అధికారంలోకి వచ్చిన బీఎస్పీ ఈసారి 11స్థానాలకే పరిమితమైంది. ఆప్ తొలిసారి నాలుగుచోట్ల, సీపీఎం, జనసేన ఒక్కోచోట పోటీలో ఉన్నాయి. ఆంధ్రలో బీజేపీతో పొత్తులో ఉన్నా.. జనసేన ఇక్కడ పోటీ పడుతోంది. భైంసా బల్దియాలో.. తెలంగాణ సరిహద్దు బల్దియాగా, సున్నిత ప్రాంతంగా పేరున్న భైంసాపై అందరి దృష్టి ఉంటుంది. ఇక్కడ మొత్తం 26వార్డుల్లో కాంగ్రెస్ 24, బీజేపీ 12, బీఆర్ఎస్ 15, ఎంఐఎం 18వార్డుల్లో తలపడుతున్నాయి. ఇక్కడ బీజేపీకి ఈసారి రెబెల్స్ బెడద తప్పడం లేదు. మూడు ప్రధాన వార్డుల్లో సొంతపార్టీ నేతలే పోటీలో నిలిచారు. భైంసాలో ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్ నుంచీ పలువురు బరిలో ఉన్నారు. ఎంఐఎం పోటీచేస్తున్న పలువార్డుల్లోనూ బీఆర్ఎస్ తన అభ్యర్థులను బరిలో నిలిపింది. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ఖానాపూర్ రెండో ఎన్నికను ఎదుర్కొంటోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలూ మొత్తం 12వార్డుల్లో పోటీపడుతున్నాయి. ఈసారి ఎంఐఎం, బీఎస్పీ రెండువార్డుల్లో బరిలో నిలువగా, 18మంది ఇతరులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ ఉన్నచోటా ఎంఐఎం పోటీ చేస్తోంది. ఏ రెండుపార్టీలు, అభ్యర్థులూ పొత్తులదిక్కు వెళ్లకుండా పోటీపడుతున్నారు. ఎవరికివారే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. నాలుగో వార్డులో బీజేపీకి రెబెల్ ఉండగా, ఐదోవార్డులో కాంగ్రెస్ నేత బీఎస్పీ నుంచి పోటీలో ఉన్నారు.ఖానాపూర్ ‘పుర’ పోరులో.. -
పూరికి ఆర్టీసీ బస్సులు
నిర్మల్టౌన్: నిర్మల్ బస్టాండ్ నుంచి బుధవా రం పూరికి రెండు ఆర్టీసీ బస్సులు బయలుదేరాయి. డిపో మేనేజర్ పండరి పూజలు చేసి బ స్సులను ప్రారంభించారు. ఈ బస్సులు నిర్మల్ నుంచి అన్నవరం సత్యనారాయణ టెంపుల్, సింహాచలం అప్పన్న, అరసవెల్లి సూర్యనారా యణ, పూరి జగన్నాథ్, కోణార్క్ సన్ టెంపుల్, విశాఖపట్నం బీచ్, ద్వారక తిరుమలకు చేరుకుంటాయని తెలిపారు. తిరిగి 9వ తేదీన బ స్సులు నిర్మల్కు చేరుకుంటాయని పేర్కొన్నా రు. ఎస్టీఐ శకుంతల, రిజర్వేషన్ ఇన్చార్జి టీ వీ రమణ, గంగాధర్, గంగన్న పాల్గొన్నారు. -
‘స్మైల్’ సక్సెస్!
నిర్మల్టౌన్: గత నెల 1నుంచి జిల్లాలో ప్రారంభమై న ఆపరేషన్ స్మైల్ సత్ఫలితాలనిస్తోంది. నెలరో జులుగా అన్ని శాఖల సమన్వయంతో దిగ్విజయంగా కొనసాగినట్లు నోడల్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపారు. పాఠశాలలకు బదులు పనిలోకి వెళ్తున్న బాలబాలికలను గుర్తించి ఆపరేషన్ స్మైల్ బృందం వారు మళ్లీ బడికి వెళ్లేలా ప్రోత్సహించింది. బాలకార్మికులను జిల్లాలోని హోటళ్లు, పశువులు మందల వద్ద, వెల్డింగ్ షాపులు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల్లో గుర్తించారు. పిల్లల భవిష్యత్కు భద్రత పిల్లల భవిష్యత్కు భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్’ జిల్లాలో విజ యవంతమవుతోంది. వీధుల్లో భిక్షాటన చేస్తున్నవారిని, బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని రక్షించే దిశగా ఈ కార్యక్రమం మా నవీయ కోణంలో ముందుకెళ్తోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, నిర్మాణ ప్రదేశాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టిన పోలీసులు 66మంది బాలకార్మికులను గుర్తించారు. ఇందులో 54మందిపై కేసు నమోదు చేయగా, మిగతా వారికి జరిమానా విధించారు. నిర్మల్ డివిజన్లో 34, భైంసా సబ్ డివిజన్లో 32మంది బాలబా లికలకు అవసరమైన కౌన్సిలింగ్, వైద్య పరీక్షల అ నంతరం కుటుంబాలకు చేర్చారు. ఇందులో 61 మంది బాలురు, అయిదుగురు బాలికలున్నారు. -
బరిలో తాజా మాజీలు
నిర్మల్టౌన్: మున్సిపల్ ఎన్నిక బరి లో తాజా మాజీ కౌన్సిలర్లు మరోసా రి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబో తున్నారు. గత పాలకవర్గంలో నిర్మల్ మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్గా గె లిచినవారు మళ్లీ నామినేషన్ వేశారు. తాము వార్డులో చేసిన అభివృద్ధి పనులు, వ్యక్తిగత పరిచయాలు, స్థానిక సమస్యలపై అవగాహనే తమ ప్రధాన బలమంటూ వారు ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అదృష్టం పరీక్షించుకుంటున్న వారిలో.. కత్తి నరేందర్ గత ఎన్నికల్లో 36వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి రిజర్వేషన్ అనుకూలించక ఒకటో వార్డు నుంచి బరిలోకి దిగారు. రెండోవార్డు నుంచి సాదం అరవింద్ గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందగా, ప్రస్తుతం రిజర్వేషన్ అనుకూలించక తన భార్య స్వప్నను అదే పార్టీ నుంచి పోటీలోకి దింపారు. నాలుగో వార్డులో బిట్లింగ్ నవీన్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఈసారి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. తొమ్మిదోవార్డు నుంచి అయ్యన్నగారి రాజేందర్ ఇప్పటికే హ్యాట్రిక్ కౌన్సిలర్గా గెలుపొందారు. ఆయన గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలువగా, ఈసారి అదే పార్టీ నుంచి 30వ వార్డు నుంచి బరిలోకి దిగుతున్నారు. 14వ వార్డు నుంచి మతిన్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఈసారి ఇండిపెండెంట్గా పోటీలో నిలిచాడు. 17వ వార్డు నుంచి పార్వీన్ గతంలో ఎంఐఎం, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి రెండుసార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. 18వ వార్డు నుంచి పురస్తు రూప గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందగా ఇప్పుడు బీజేపీ నుంచి తన కుమారుడు వినయ్ను పోటీలో నిలిపారు. 20వ వార్డు నుంచి అంజుంబేగం గతంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందగా ఈసారి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. 21వార్డు నుంచి ఇమ్రాన్ ఉల్లా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఈసారి రిజర్వేషన్ అనుకూలించక 22వ వార్డులో కాంగ్రెస్ నుంచి పోటీలో దిగారు. 24వ వార్డు నుంచి మేడారం ప్రదీప్ గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత రిజర్వేషన్ అనుకూలించక అతడి భార్య అపర్ణ రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి బరిలో నిలిచారు. 26వ వార్డు నుంచి ఆకుల లక్ష్మీనర్స గతంలో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించి మరోసారి అదృష్టాన్ని కాంగ్రెస్ నుంచి పరీక్షించుకుంటున్నారు. 27వ వార్డు నుంచి అయేషా కౌసర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి మరోసారి బరిలో నిలిచారు. 30వ వార్డు నుంచి సముందర్పల్లి రాజేందర్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. 39వ వార్డు నుంచి తౌహీద్ ఉద్దీన్ రఫ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఈసారి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బరిలో బంధుగణం.. మున్సిపల్ ఎన్నికల బరిలో సీనియర్ నేతల బంధువులు, సీనియర్ నాయకురాలు దిగారు. ప్రజాభిమానాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అభివృద్ధి పనులే తమ అస్త్రంగా, అనుభవమే తమ బలమని చెబుతూ రంగంలోకి దిగుతున్నారు. 2019 జనరల్ ఎన్నికల్లో బీఎల్పీ నుంచి ఎమ్మెల్యేగా అలివేలి మంగ పోటీ చేశారు. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరి పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఎదిగారు. పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో తొమ్మిదోవార్డులో బీజేపీ నుంచి పోటీలోకి దిగారు. రావుల రాంనాథ్ 1991నుంచి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ.. పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించారు. ప్రస్తుతం బీజేపీ మున్సిపల్ ఎన్నికల జిల్లా కన్వీనర్గా పని చేస్తున్నారు. ఈయన కుమార్తె రావుల రమ్యను ప్రస్తుతం పట్టణంలోని 13వ వార్డు నుంచి బరిలోకి దింపారు. తన రాజకీయ సీనియార్టీని ప్రయోగించి తన కుమార్తెను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. -
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
కుభీర్: ముధోల్లో బుధవారం నిర్వహించిన ని యోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీల్లో మండలా నికి చెందిన వాలీబాల్ బాలురు, బాలికల జట్లు గెలిచి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాయి. గెలుపొందిన జట్లను పలువురు అభినందించారు. జిల్లా స్థాయిలోనూ గెలవాలని ఆ కాంక్షించారు. గెలిచిన జట్లకు ఎమ్మెల్యే రామారా వ్ పటేల్ ట్రోఫీలు అందజేశారు. ఎంపీడీవో గంగ సాగర్రెడ్డి, ఎంఈవో విజయ్కుమార్, పీడీ క్రాంతికుమార్, క్రీడాకారులు, అధికారులున్నారు. నర్సాపూర్(జీ): సీఎం కప్ నియోజకవర్గ స్థాయి కబడ్డీ, చెస్, అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీల్లో మండలానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కబడ్డీ బాలికల విభాగం మొదటి స్థానంలో సోనీ, మమత, సోనూనుతాయి, వైష్ణవి, హర్షవర్ధని, నిషా, షిఫా, చెస్లో సాత్విక్, వాలీబాల్ పోటీల్లో మధుప్రియ, అవంతిక, అథ్లెటిక్స్ పోటీల్లో మొదటి స్థానంలో అభినయ్, అజయ్ ఎంపికై నట్లు పీడీ దేవేందర్ తెలిపారు. వీరిని అభినందించారు. -
ఢిల్లీ ధర్నాకు వెళ్లిన ఉపాధ్యాయులు
నిర్మల్ రూరల్: సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు జిల్లా నుంచి ఎస్టీయూ ఉపాధ్యాయులు బుధవారం వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు ఈనెల 5న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఏఐఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, జాతీయ విద్యా విధానాన్ని పునఃపరిశీలించాలనే డిమాండ్లతో ధర్నా చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్రావు, నాంపల్లి నాగభూషణ్, రాజారెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, వివిధ మండల బాధ్యులు పాల్గొన్నారు. ఢిల్లీకి వెళ్తున్న ఉపాధ్యాయులు -
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ఘాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాసర పుష్కర ఘాట్ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతీ పుష్కరఘాట్ వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మండలాల వారీగా రెవెన్యూ, ఇంజినీరింగ్, పోలీసు, విద్యుత్, శాఖల అధికారులు ఘాట్లను సందర్శించి, అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ ఘాట్ వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు, సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సహాయాన్ని అందించేందుకు చ ర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో, పుష్కరఘాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని తెలిపారు. సమావేశంలో భైంసా సబ్ క లెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, అదనపు ఎస్పీ ఉ పేంద్రారెడ్డి, వివిధ విభాగాల ఇంజినీరింగ్ అధి కారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీకి ‘బల్దియా’ పరీక్ష
నిర్మల్: జిల్లాలో కనీస ప్రాతినిథ్యం లేని బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస విజయాలను అందుకుంటూ వస్తోంది. వరుసగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో గెలిచింది. పోటీచేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని స్థితి నుంచి ఇప్పుడు బీజేపీ సీటు కోసం పోటాపోటీ పడాల్సిన స్థాయికి చేరింది. ఇదంతా ఒకవైపు. ఇప్పుడు ఎదుర్కొంటున్న పురపోరు మరో ఎత్తు. మున్సిపోల్స్ ఆ పార్టీకి అంతా ఈజీగా కనిపించడం లేదు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు బల్దియాల్లోనూ చైర్మన్ స్థానాలు దక్కించుకోవడం నల్లేరుమీద నడకేం కాదు. ఈ ఎన్నికలకు వచ్చేసరికి వార్డుల్లో సొంతపార్టీలోనే కుంపట్లు కనిపిస్తున్నాయి. వాటిని చల్లారుస్తూనే సీనియర్లను కలుపుకుంటూ ఓటర్లను ఆకట్టుకోవడం, పట్టణాల్లో పాగావేయడం బీజేపీకి పరీక్షే. పోటాపోటీ పరిస్థితి.. ‘అన్న.. మా పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీచేయండి. కచ్చితంగా గెలుస్తరు. ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం..’ అని బీజేపీ సీనియర్ నేతలు అడిగితే.. ‘లేదన్న.. మీ పార్టీ నుంచి పోటీచేస్తే గెలువడం అటుంచి, డిపాజిట్ కూడా వస్తుందో లేదో వద్దన్న..’అని చెప్పేవారు. ఇది ఒకప్పటి పరిస్థితి. పదేళ్ల నుంచి క్రమంగా మారుతూ వస్తోంది. ఇప్పుడు కౌ న్సిలర్ టికెట్ కోసం పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఒక్కో వార్డు నుంచి నలుగురైదుగురు పోటీపడుతున్నారు. ఈ పోటీవాతావరణమే రేపొద్దున మున్సిపల్ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని పార్టీ నేతలు కలవరపడుతున్నారు. ‘పట్టణ’పార్టీకి పరీక్షా సమయం.. అసెంబ్లీ, లోక్సభ, శాసనమండలి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్కు పోటాపోటీగా పల్లెలను గెలుచుకుంది. ఇక ముందునుంచీ పట్టణాలకు పరిమితమైన పార్టీగా పేరున్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికలు అసలైన సవాలుగా చెప్పవచ్చు. జిల్లాలోని కీలకమైన నిర్మల్, భైంసా మున్సిపాలిటీలు ఇద్దరు ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్, ఖానాపూర్ బల్దియా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. తమ పరిధిలోని ఆయా మున్సిపాలిటీల్లో కాషాయజెండా ఎగురవేయించాల్సిన బాధ్యతను పార్టీ వారిపైనే పెట్టింది. వార్డుల్లో రెబల్స్ను తప్పించడం, సీనియర్లను సమన్వయం చేసుకుంటూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ను ఎదుర్కొంటూ గెలుపుదిశగా పార్టీని తీసుకెళ్లడం పరీక్షగానే చెప్పవచ్చు. సీనియర్లు కలిసొచ్చేనా..! అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలోనూ గ్రూపులు తయారయ్యాయి. ఎన్నికలకు ముందు పార్టీలో చేరి న నేతలు, వారి అనుచరులు ఓవైపు, పార్టీనే నమ్ముకుని ఉన్న సీనియర్లు మరోవైపు అన్నట్లుగా కొనసాగుతున్నారు. నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ టికెట్ల కేటాయింపుల్లో సీనియర్లను పరిగణనలోకి తీసుకోలేదన్న వాదన ఉంది. చాలామంది సీనియర్ నేతలూ ఈ విషయంపై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో కొంతమంది సీనియర్లు తమ వార్డుల్లో టికెట్ ఇవ్వాలని అడిగితే, సంబంధం లేని వార్డుల్లో కేటాయించారు. దీనిపైనా సదరు అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎక్స్ అఫీషియోల ఎంపికకు నోటీసులు
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల అనంతరం పరోక్ష విధానంలో నిర్వహించే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎక్స్ అఫీషియోల ఎంపిక కోసం నోటీసులు జారీచేసి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. కలెక్టర్లు, అధికారులకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరోక్ష విధానం ద్వారా చేసే ఎన్నిక సమయంలో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫీషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకుని ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఇంతవరకు ఆప్షన్ ఇవ్వని పక్షంలో మున్సిపల్ ఎన్నికలు అయిన 30 రోజుల్లో ఆప్షన్ను మున్సిపల్ కమిషనర్కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి, 11 నుంచి 14 లోపు నోటీస్ జారీచేసి ప్రజాప్రతినిధుల నుంచి ఆప్షన్ తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
మల్లయోధుల కుస్తీ
తానూరు: మండల కేంద్రం తానూరుతోపాటు ఎల్వి గ్రామాల్లోని మల్లన్న దేవుని ఆలయాల్లో సోమవారం భక్తులు పూజలు నిర్వహించారు. తానూరులో మల్లన్న కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. ఎల్వి గ్రామంలో భక్తులు ఉదయం పూజలు నిర్వహించి మల్లన్న పల్లకిని వీధుల్లో ఉరేగించారు. పల్లకి కార్యక్రమంలో పాల్గొని భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఎల్వి గ్రామంలో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సాంఘికశాస్త్ర ప్రతిభా పోటీలు
నిర్మల్ రూరల్: జిల్లాస్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభాపాటవ పోటీలు జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ప్రశ్నాపత్రాన్ని జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్ ఆవిష్కరించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమొంటోలు, ప్రైజ్మనీ అందజేశారు. విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో పాత కార్యవర్గాన్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. కొత్తగా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా మధుసూదన్, ఉపాధ్యక్షుడిగా గంగాధర్ను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్కుమార్, భూషణ్, గౌరవ అధ్యక్షుడు నారాయణరెడ్డి, పోతన్న, ఆంజనేయులు, అనిత, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
నిర్మల్
రథాలపై శివ కేశవులునిర్మల్ రూరల్ మండలం ముజ్గిలో మల్లన్న జాతర ఘనంగా సాగుతోంది. మరోవైపు కడెం మండలం అక్కకొండ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో వాగంగా దేవదేవులు మల్లన్న, లక్ష్మీనృసింహస్వామి సోమవారం ఉదయం రథాలపై భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథాలపై ఉంచి ఊరేగించారు. జాతరలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవ దేవులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నమో మల్లన్న.. నమో నారసింహ నినాదాలతో జాతర ప్రాంగణాలు మార్మోగాయి. కార్యక్రమాల్లో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ముజ్గి మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ అక్కకొండ నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఎస్పీ జానకీ షర్మిల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. – నిర్మల్ రూరల్/కడెంబండారి పట్టుకుని నృత్యం చేస్తున్న యాదవులుఇళ్లపైకి ఎక్కి రథోత్సవాన్ని తిలకిస్తున్న ప్రజలు, భక్తులు -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
ఖానాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థులకు సోమవా రం బీ–ఫాంలు అందజేశారు. పార్టీ చేపట్టిన సర్వేల మేరకు అభ్యర్థులను ఖరారు చేశామని తెలిపారు. అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి చైర్మన్, వైస్చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
మిగిలినోళ్లు.. రెబెల్స్
నిర్మల్: పురపోరులో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు తలపడనున్నారో దాదాపు ఫైనల్ అయ్యింది. నామినేషన్లు వేసిన తమ పార్టీ అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. మూడురోజులుగా బుజ్జగించినా, సంప్రదింపులు జరిపినా నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే వారిని రెబెల్స్(స్వతంత్ర)గా పరిగణించనున్నారు. మూడు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచే ఒక్కోవార్డుకు ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేశారు. బుజ్జగించినా.. జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో కలిపి 80 వార్డులు ఉండగా, అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి ఏకంగా 629 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా బీజేపీ నుంచి160, కాంగ్రెస్ నుంచి 142, బీఆర్ఎస్ నుంచి 104, ఎంఐఎం నుంచి 81, ఇతరులు 142 నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒక్కో వార్డుల్లో కనీసం ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. కొన్నిచోట్ల ముగ్గురు నలుగురూ వేశారు. ఈ మూడురోజులపాటు పార్టీల జిల్లా ఇన్చార్జీలు, సీనియర్ నేతలు వారితో సంప్రదింపులు, బుజ్జగింపులు జరిపారు. అయినా.. నిర్మల్, భైంసాల్లోని కొన్నివార్డుల్లో కొందరు వెనక్కి తగ్గడం లేదు. ఉపసంహరణకు నేడే ఆఖరు.. నామినేషన్ల ఉపసంహరణకు ఒకరోజు ముందు అంటే సోమవారమే దాదాపు ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. నిర్మల్లో బీజేపీ ఒకట్రెండు వార్డులు మినహా అందరినీ ఖరారు చేశాయి. కాంగ్రెస్ మొత్తం 42 వార్డుల అభ్యర్థులను సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఇక ఈ రెండుపార్టీల్లో టికెట్లు రాని, తమ పార్టీ పేరును రాసిచ్చిన వారికి బీఫాం ఇచ్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ తన జాబితా ప్రకటించకుండా, మంగళవారం వరకూ వెయిట్ చేసేలా కనిపిస్తోంది. ఇక నామినేషన్ల పర్వం ముగిసినా.. ఉపసంహరణ చేసుకోనివారిని ఆయా పార్టీలు సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించాయి. అలాంటి అభ్యర్థులు సొంతపార్టీ అభ్యర్థులపైనే రెబల్స్గా బరిలో నిలువనున్నారు. -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్టౌన్: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మా ట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాల ని ఆదేశించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘవ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు -
ఎట్టకేలకు కేజీబీవీలకు గీజర్లు
లక్ష్మణచాంద: చలికాలంలో వణికే చలిలో చన్నీటి స్నానాలు చేశారు కేజీబీవీ విద్యార్థులు. కొందరు రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అభిలాష అభినవ్ గీజర్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. మూడు నెలల క్రితమే పాఠశాలలకు గీజర్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం చలికాలం ముగింపు దశకు వచ్చాక మంజూరు చేసింది. ఎన్నికల కారణంగా ఆలస్యం చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నవంబర్ మొదటి వారంలోనే కేజీబీవీలకు గీజర్లు అందించాల్సి ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల కారణంగా కొంత ఆ లస్యం అయిందని విద్యాశాఖ అధికారులు తెలిపా రు. జిల్లాలోని 18 కేజీబీవీలు ఉండగా, ఒక్కో విద్యాలయానికి నాలుగు గీజర్లు సరఫరా చేశారు. రూ.18 లక్షలతో పూర్తి సరఫరా ఒక్కొక గీజర్ 25 లీటర్ల సామర్థ్యం కలిగినది. ధర రూ.25 వేలు. ఒక కేజీబీవీకి నాలుగు గీజర్లకు రూ.లక్ష చొప్పున, మొత్తం 18 కేజీబీవీలకు రూ.18 లక్షలు వెచ్చించారు. ఇప్పటికే అన్ని విద్యాలయాలకు గీజర్లు చేరాయి. బాలికల ఆనందం.. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల బాలికలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు గీజర్లతో ఆ సమస్య పూర్తిగా తొలగిపోయింది. విద్యార్థినులు ఈ సౌకర్యంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.జిల్లా సమాచారం...జిల్లాలోని మొత్తం కేజీబీవీలు 18 గీజర్లు వచ్చిన కేజీబీవీలు 18 ఒక్కో దానికి అందించిన గీజర్లు 04 ఒక్కో దాని ధర రూ.25 వేలు ఒక యూనిట్ ధర రూ.లక్ష -
నిర్మల్కు అమిత్ షా..?
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఈనెల 8 లేదా 9 తేదీల్లో నిర్మల్కు రానున్నట్లు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు. ఆదివారం రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్తో కలిసి సభ ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వపురం లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, రావుల రాంనాథ్ పాల్గొన్నారు. -
ఆశ నిరాశల పద్దు
నిర్మల్కేసీఆర్ను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర నిర్మల్రూరల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగా విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొండాపూర్లోని పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ కి కాలం చెల్లేరోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామ్కిషన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు తుల శ్రీనివాస్, సుభాష్రావు, అయ్యన్నగారి రాజేందర్, భూషణ్రెడ్డి, శంకర్ యాదవ్, రిజ్వాన్ఖాన్, మహేష్రెడ్డి, గండ్రత్ రమేశ్ పాల్గొన్నారు.నిర్మల్: ‘ఈసారి ఇన్కంట్యాక్స్లో ఏమైనా మార్పులు చేస్తారేమో.. మాకేమైనా లాభం జరుగుతుందేమో అనుకున్నం. కానీ ఈసారి ఎలాంటి మార్పులూ చేయలేదు..’ అంటూ పన్ను చెల్లింపుదారులు నిట్టూర్చారు. ‘బేటీ బచావో–బేటీ పడావో’ అంటూ నినదిస్తున్న కేంద్రం ఆడపిల్లల చదువులకు మరో ముందడుగు వేసింది. జిల్లాకు ఒక బాలికల వసతిగృహాన్ని ఏర్పాటు చేయనుంది. ఇలా.. నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆశ నిరాశల మధ్య సాగింది. నేరుగా జిల్లాకు పెద్దగా లబ్ధి చేకూరే అంశాలు లేవు. కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు బాగున్నా.. అందులో జిల్లా మీదుగా లైన్ నిర్మాణం ఉందా? లేదా.. అన్న స్పష్టత రావాల్సి ఉంది. రైల్వేలైన్పై నోక్లారిటీ.. ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే బడ్జెట్లో రూ.2,77,830 కేటాయించారు. ఇందులో రూ.36,721కోట్లను కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధుల్లో ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ ఉందా? లేదా అనే స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే డీపీఆర్పూర్తయ్యింది. దక్షిణమధ్య రైల్వే 136.50 కిలోమీటర్ల ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ నిర్మాణానికి రూ.4,300 కోట్ల అంచనాతో ఈ డీపీఆర్ పూర్తి చేసింది. సోన్ వద్ద గోదావరిపై బ్రిడ్జితో పాటు ఘాట్రోడ్లలో ఎనిమిది చోట్ల టన్నెళ్ల నిర్మాణాలను చేపట్టాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇప్పటికే రైల్వేశాఖకు చేరింది.మార్పులు, చేర్పుల్లేవ్ ఈసారి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పెద్దగా మార్పులు, చేర్పులు లేవు. ఆదాయపన్ను స్లాబుల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. సవరించిన పన్ను విధానమే వర్తింపు చేయనున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాలు ఆశించినవి బడ్జెట్లో కనిపించలేదు. – భూమన్న యాదవ్, ఎకానమిస్ట్ ఐటీచెల్లింపు గడువు పెంచారు.. ఈసారి బడ్జెట్లో ఆడిట్ అవసరం లేని వ్యాపారులకు నెల గడువు పెంచారు. గతంలో జులై 31వరకు ఉండేది. ప్రస్తుతం ఆగస్టు 31 వరకు పొడగించారు. ఐటీఆర్–1, ఐటీఆర్–2 ఫైల్ చేసేవాళ్లకు జులై 31 వరకు గడువు ఉంటుంది. – ముక్క సాయిప్రసాద్, చార్టెడ్ అకౌంటెంట్ జిల్లాకు ఏమిస్తారు..! సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు వరుసగా రెండుసార్లు ఎంపీలను, భారీ మెజార్టీతో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనూ గెలిపించినా కేంద్రం నిర్మల్ ప్రాంతంపై ఇంకా శీతకన్ను చూస్తోందన్న వాదన ఉంది. రైల్వేలైన్ అంశాన్ని పక్కనపెడితే, మిగితా ఏరంగంలోనూ కేంద్రం నుంచి నేరుగా మన ప్రాంతానికి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు అందలేదు. ఈసారి బడ్జెట్లో పలు పరిశ్రమలు, సంస్థల ఏర్పాటును కేంద్రమంత్రి ప్రకటించారు. ఇందులో కనీసం ఒకట్రెండైనా జిల్లాకు కేటాయించాలన్న డిమాండ్ వస్తోంది. ప్రజామోదంతో పరిశ్రమలు, బాసర యూనివర్సిటీ, నవోదయ, సైనిక్ విద్యాలయాల ఏర్పాటుపై ఈసారైనా దృష్టిపెట్టాలంటున్నారు. ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్న ఎన్హెచ్ 61విస్తరణను పూర్తిచేయాల్సిన అవసరమూ ఉందంటున్నారు. -
క్రాప్లోన్ ఇవ్వట్లే..
కడెం: పులి ఆవాసం కోసం ఉన్న ఊరిని వదిలివెళ్లి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పునరావాస గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. పరిహారంలో భాగంగా అందించిన వ్యవసాయ భూములకు నేటికీ పట్టాలు ఇవ్వకపోవడంతో అట్టి భూములు సాగుకు నోచుకోవడం లేదు. ఇటీవలే పట్టాలిస్తున్నామని రెవెన్యూ అధికారులు హడావుడి చేసినప్పటికీ అందించడంలో జాప్యం జరుగుతుండడంతో గిరిజనులు సాగుకు ముందడుగు వేయలేకపోతున్నారు. పట్టా పాస్ పుస్తకాలు, భూములు సాగులో లేకపోవడంతో పంటరుణం ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు నిరాకరిస్తున్నారు. పట్టా చేతికందలే కవ్వాల్ టైగర్జోన్లోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను 2024 ఏప్రిల్లో మండలంలోని కొత్తమద్దిపడగ సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీకి తరలించారు. పునరావాసంలో భాగంగా ఆప్షన్–1 ఎంచుకున్న 94 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు, పెత్తర్పు సమీపంలో ఒక్కొక్కరికి 2.32 ఎకరాల చొప్పున సాగు భూమి ఇచ్చారు. కానీ వాటికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. గతంలో పునరావాస గ్రామస్తులు ఆందోళన చేపట్టగా రెవెన్యూ అధికారులు పట్టాలు అందజేస్తామని హడావుడి చేశారు. కా నీ నెలలు గడుస్తున్నా నేటికీ పంపిణీ చేయలేదు. రుణం ఇస్తలేరు.. పునరావాస గిరిజనులకు అప్పగించిన భూమి పట్టా వివరాలు ఆన్లైన్లో ఉన్నాయి. పట్టా పాస్ పుస్తకాలు, భూమి సాగులో లేకపోవడంతో బ్యాంక్ అధికారులు క్రాప్లోన్ ఇవ్వడం లేదు. ఆన్లైన్ కాపీపై తహసీల్దార్తో సంతకం చేయించి ఇస్తామని చెప్పినా ఒప్పుకోవడం లేదని, బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ చెప్తే ఇస్తామని అంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటి వరకు మూడు పంటలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టా బుక్ ఇయ్యలేదు మాకు పునరావాసంలో భాగంగా అందించిన భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. రుణం తీసుకోవాలని బ్యాంకుకు వెళ్తే పట్టా పాస్బుక్లు లేకుంటే మీ భూములకు లోన్ ఇవ్వమని అధికారులు తిరస్కరిస్తున్నారు. – దేవురావు ఉన్నతాధికారులు స్పందించాలి పునరావాసంలో భాగంగా మాకు అందించిన భూములకు రెవెన్యూ పట్టాలిస్తామని కలెక్టర్, ఇతర అధికారులు చెప్పినా నేటికీ ఇవ్వలేదు. బ్యాంక్లో రుణం తీసుకుని సాగు పనులు చేపడుదామంటే అధికారులు లోన్ ఇస్తలేరు. ఉన్నతాధికారులు స్పందించి పంటరుణం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – కోవ ప్రవీణ్ ఆందోళన చెందవద్దు పునరావాస గ్రామస్తులకు పరిహారంలో భాగంగా పంపిణీ చేసిన భూములకు పట్టా పాస్ పుస్తకాలు అందించడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ వారికి ఇబ్బందులు లేకుండా బ్యాంక్ రుణం అందేలా చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందవద్దు. – శివకుమార్, ఎఫ్డీవో, ఖానాపూర్ -
హిందూ ధర్మ పరిరక్షణకు కృషి
కుంటాల: సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి సూచించారు. మండలంలోని లింబా(బి)లో ఆదివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని గురుదేవ దత్త సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దత్తమహా యజ్ఞంలో పాల్గొని భక్తులకు ప్రవచనాలు బోధించారు. భారతీయ సంస్కృతి శ్రేష్టమైందని, పాశ్ఛాత్య దేశాలు మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతున్నాయన్నారు. గోమాత, రైతును రక్షించుకుంటే మనమంతా సుభిక్షంగా ఉంటామన్నారు. ధర్మాన్ని కాపాడితే మనల్ని రక్షిస్తుందన్నారు. మహాదత్త యజ్ఞంలో పలువురు జంటలు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆదుముల్ల సుహాసిని రవి, వీడీసీ చైర్మన్ కేశవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఓటరు ప్రోజెని మ్యాపింగ్లో వేగం పెంచాలి
నిర్మల్చైన్గేట్: ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. 2002 వివరాలతో, ప్రస్తుత వివరాలు సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. బూత్స్థాయి అధికారులు (బీఎల్వోలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రక్రియను చేపట్టాలన్నారు. బీఎల్వోలు రోజువారీగా చేపట్టి ప్రోజెని మ్యాపింగ్ వివరాలు తమకు అందించాలని తెలిపారు. ఎక్కడైనా పోలింగ్ బూత్లలో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత బూత్లకు చెందిన బీఎల్వోలను సమన్వయం చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్సింగ్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలినిర్మల్చైన్గేట్: జిల్లాలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వారం రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు. ఎంపికై న లబ్ధిదారులు వెంటనే పునాది పనులు మొదలుపెట్టేలా క్షేత్రస్థాయి అధికారులు ప్రోత్సహించాలన్నారు. నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. పనులు పూర్తయి దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యేలా చూడాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఆయా మండల ప్రత్యేక అధికారులు శంకర్, బాలిక్ అహ్మద్, శ్రీనివాస్, రాజనర్సయ్య, మండల హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. -
● నిర్మలమ్మ ఈసారైనా కరుణిస్తారా? ● పెండింగ్లోనే ఈఎస్ఐ, నవోదయ ఏర్పాటు ● కేంద్ర బడ్జెట్పై జిల్లావాసుల ఆశలు
నిర్మల్: ఎక్కడ నుంచి ఎక్కడి దాకా రైలు వేయాలి, ఈ మార్గంలో ఎన్ని బ్రిడ్జీలు కట్టాలి, ఎన్ని సొరంగాలు తవ్వాలి, మొత్తం ఎంతవరకు ఖర్చవుతుంది.. ఇదిగో ఇలాంటి లెక్కలన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే నాలుగైదుసార్లు సర్వేలూ చేశారు. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కు రైలు వెళ్లినట్లు ఫైళ్లు కదులుతున్నాయి కానీ.. జిల్లాకు మాత్రం రైల్వేలైన్ రావడం లేదు. ప్రతీఏడాది బడ్జెట్లో నిధులకు పచ్చజెండా ఊపుతారని ఆశలు పెట్టుకుంటుంటే, కేంద్రం మొండిచేయే చూపుతోంది. గతంతో పోలిస్తే.. ఈసారి బడ్జెట్పై జిల్లావాసుల్లో బాగానే ఆశలు ఉన్నాయి. ఎందుకంటే.. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్కు సంబంధించి డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) పూర్తయింది. ఈ లైన్ వెళ్లే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలూ బీజేపీవాళ్లే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు రైల్వేమంత్రిని, రైల్వేబోర్డు చైర్మన్నూ కలిశారు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో జిల్లామీదుగా రైలుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మ నిధుల జెండా ఊపుతారని భావిస్తున్నారు. రైల్వేలైన్తోపాటు జిల్లా అభివృద్ధికి మరింత సహకరించాలన్న కోరుతున్నారు. ఈసారి నవ్వులాట కావొద్దు.. దశాబ్దాలుగా జిల్లావాసులు రైలు కోసం ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ లైన్ కాకుండా, కేవలం ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ వేస్తే సరిపోతుందన్న డిమాండ్ ఉంది. దీనిపై రెండు నెలల క్రితం పార్లమెంట్ సమావేశాల్లోనూ ఆదిలాబాద్ లోక్సభ ఎంపీ నగేశ్తోపాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, జిల్లావాసి సిర్గాపూర్ నిరంజన్రెడ్డి సైతం గొంతెత్తారు. యూనివర్సిటీ ఏర్పాటు దిశగా.. ‘చదువులతల్లి కొలువైన నిర్మల్ జిల్లాలోనే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం..’ అంటూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం కూ డా యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిధుల కేటా యింపులు చేయాల్సిన అవసరం ఉంది. చదువులమ్మ కొలువైనా ఇప్పటికీ జిల్లా విద్యారంగంలో వెనుకబడే ఉంది. పీజీ, ఇంజినీరింగ్ చదవడానికి హైదరాబాద్ వరకూ వెళ్లాల్సిన దుస్థితి. కేంద్రం నవోదయ, సైనిక్ విద్యాలయాలు జిల్లాలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. బాసరకు కేటాయించిన కేంద్రీయ విద్యాలయాన్ని వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి తీసుకురావాలి. పురావస్తు.. పట్టేదెప్పుడు..!? చారిత్రక నేపథ్యమున్న జిల్లాలో వందల ఏళ్ల కింద టి కట్టడాలు, నిర్మాణాలు ఉన్నాయి. అవన్నీ కబ్జాలు, ఆక్రమణలతో రూపుకోల్పోతున్నాయి. పట్టించుకోవాల్సిన పురావస్తుశాఖ అసలు ఉందా.. పనిచేస్తుందా..!? అన్నట్లుగా మారింది. కేంద్రం ఆధీనంలోని ఈ శాఖకు ఇప్పటికీ సరిపడా సిబ్బంది లేకపోవడం జిల్లాకూ శాపంగా మారింది. వీటితోపాటు జి ల్లాలో ఇథనాల్, ఆయిల్పామ్లాగా కాకుండా ప్ర జామోదంతో కొనసాగే పరిశ్రమలను కేటాయించా ల్సిన అవసరముంది. నిర్మల్లో ఈఎస్ఐ ఆస్పత్రి, భైంసాలో డిస్పెన్సరీని కేటాయిస్తామని చెప్పి, దశాబ్దం గడుస్తోంది. ఈసారైనా వీటిని కేటాయించాలి. ఈ బడ్జెట్లోనే కేటాయించాలి.. జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి ఈసారి బడ్జెట్లోనే నిధులు కేటాయించి, పనులను త్వరగా ప్రారంభించాలని కోరుతున్నాం. ఇప్పటికే ఈ లైన్ నిర్మాణంలో చాలా ఆలస్యమైంది. ఇకనైనా వేగవంతం చేయాలి. – ఎంసీ లింగన్న, రైల్వేలైన్ సాధన కమిటీ చైర్మన్ -
అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షీద్
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి నిర్వహించిన రెండో ఎన్నికల్లో మసూద్ హైమద్ ఖుర్షీద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1965 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మున్సిపల్ పరిధిలో అందించిన సేవలతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ఈ క్రమంలో 1972లో కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రజలు ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. -
నిర్మల్
పెండింగ్ కేసులు పూర్తి చేయాలి నిర్మల్టౌన్: అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసుల స్థితిగతులను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు త్వరగా పూర్తిచేసి, చార్జిషీటు దాఖలు చేయాలని జిల్లా జడ్జి శ్రీవాణి, ఎస్పీ జానకీ షర్మిల పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో అండర్ ట్రయల్ ఖైదీల కేసులపై శనివారం సమీక్ష నిర్వహించారు. అనవసరంగా ఖైదీలు జైల్లో ఉండకుండా.. న్యాయపరమైన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అలాగే చట్టపరమైన అర్హత ఉన్న, ఖైదీలకు బెయిల్, విడుదల వంటి అంశాలను కూడా పరిశీలించాలని తెలిపారు. న్యాయ సూత్రాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక, ఆర్డీవో రత్నకళ్యాణి, పోలీస్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్: ‘తమ్మీ.. ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇయ్యే.. గెలిచినంక ఎట్లయితే అట్లా. వార్డు మొత్తం నువ్వే చూసుకో. ఇద్దరం ఒకే పార్టోళ్లం. నువ్వొక్కడివి పోటీ నుంచి తప్పుకుని నాకు సహకరిస్తే నేను గెలుస్త.. జర ఈసారి బెట్టు చేయకు తమ్మీ’ అంటూ సొంత పార్టీ నుంచి నామినేషన్ వేసిన రెబల్స్ను బుజ్జగిస్తున్నారు. వార్డు పెద్దలతోపాటు పార్టీ సీనియర్ నేతలతోనూ వారి ఇంటికి తీసుకెళ్లి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమిస్తే తన మాట వింటాడోనని సదరు రెబల్స్ బంధువులు, మిత్రులతోనూ మంతనాలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియనే కీలకమైన దశ ఇక్కడే పోటీ లేకుండా సాఫీగా గెలిచే దిశగా అభ్యర్థులు సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా సొంతపార్టీ, కులం, వర్గం నుంచి పోటీ లేకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూ డు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద ఉంది. ఈనెల 3లోపు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో పంచాయితీ... గతనెల 28, 29, 30 మూడు రోజులపాటు నామినేషన్ల హంగామా కొనసాగింది. ఒక్కో వార్డులో కనీ సం ఏడెనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్నిచోట్ల పది దాటాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు కూడా బీఫామ్లను ఇవ్వకపోవడంతో వార్డుల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేశారు. పార్టీ సూచించిన అభ్యర్థి కాకుండా పార్టీతో సంబంధం ఉన్న, టికెట్ ఆశించిన నాయకులు కూడా నామినేషన్లు వేశారు. ఎలాగైనా పార్టీ పెద్దలను ఒప్పించి తామే బీఫామ్ తీసుకుంటామన్న నమ్మకంతో నామినేషన్లను వేశా రు. కొంతమంది పార్టీ టికెట్ ఇవ్వకపోతే రెబల్గా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి చాలా వార్డుల్లో సొంత పార్టీ నేతలే పోటాపోటీగా నామినేషన్లు వేశారు. భైంసా బల్దియాలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పెద్దగా ఇబ్బంది కనిపించడం లేదు. బీజేపీ నుంచి మాత్రం కొన్ని వార్డుల్లో రెబల్ నామినేషన్లు పడ్డాయి. ఖానా పూర్లో మాత్రం కాంగ్రెస్ ఇప్పటికే 12 మంది అభ్యర్థులను ప్రకటించి స్పష్టత ఇచ్చింది. ఇక బీజేపీలో కొంతమేరకు రెబల్స్ ప్రభావం కనిపిస్తోంది. పోటీగా నామినేషన్ వేసిన వారిని ఉపసంహరించుకునేలా చేయడానికి శుక్రవారం రాత్రి నుంచి సంప్రదింపులు మొదలయ్యాయి. ఓవైపు వేసిన నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతుంటే, వార్డుల్లో శని వారం అంతా బుజ్జగింపుల పర్వమే కొనసాగింది. ఏదైనా 3 లోపే... మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తారా.. లేదా.. అనే ఫలితం దాదాపు నామినేషన్ల ఉపసంహరణతోనే తేలిపోనుంది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుగా బరిలో ఉంటే, ఓట్లు చీలిపోయి ప్రత్యర్థి పార్టీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఈ రెండు రోజుల్లో సొంత పార్టీ రెబల్స్తోపాటు అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులను సైతం పోటీ నుంచి తప్పించాలని యోచిస్తున్నారు. మన రైలుకు ఏ సిగ్నలో..! పార్టీ నేతలకు తలనొప్పి... మూడు మున్సిపాలిటీలలో వేర్వేరు రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందో స్పష్టంగా చెప్పలేని విధంగా ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు చాలాచోట్ల విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి నామినేషన్ల ఘట్టంలో ఆయా పార్టీలను ఇబ్బంది కూడా పెడుతోంది. పార్టీకి సంబంధం లేకుండా కూడా కొంతమంది సీనియర్ నేతలు నామినేషన్లు వేయడం, ఎన్నికల్లో తామే గెలుస్తామని బలంగా చెబుతుండటంతో వారిని ఉపసంహరణకు ఒప్పించడం ఆయా పార్టీల పెద్దలకు కష్టంగా మారింది. నిర్మల్లో బీజేపీకి సంబంధించి కొన్నివార్డుల్లో తమను కాదని కొత్తవాళ్లకు టికెట్లు ఇవ్వడంతో సీనియర్లు నామినేషన్లు వేశారు. మరికొంతమంది సీనియర్లకు సొంత వార్డులు కాకుండా ఎక్కడెక్కడి నుంచో నామినేషన్లు వేయించారు. వారిలో చాలామంది అసంతృప్తితోనే ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండడంతో రెండు మూడుచోట్ల సొంత పార్టీ నుంచే పోటీ తప్పడం లేదు. రెబల్స్ విషయంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ఇబ్బంది లేదు. ఎంఐఎం నుంచి పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకే నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, ఎంఐఎం నుంచి టికెట్ ఆశించి, రాని మైనార్టీ నేతలు గులాబీ కండువా వేసుకుని బీఆర్ఎస్ బీఫామ్ కోసం ఎదురుచూస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణే షీటీం లక్ష్యం నిర్మల్టౌన్: మహిళలు, బాలికల రక్షణే ప్రధా న లక్ష్యంగా షీటీం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి స్కూల్ పరిసరాల్లో రెండు, మూడు రోజులుగా కొందరు పోకిరీలు స్కూల్ ముగిసే సమయంలో అక్కడే చెక్కర్లు కొడుతున్నారన్న సమాచారంతో.. భరోసా సి బ్బంది శనివారం అక్కడికి వెళ్లి పహారా నిర్వహించారు. పోకిరీలను అదుపులోకి తీసుకున్నా రు. వారు మైనర్లు కావడంతో తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలి కలు, విద్యార్థుల రక్షణపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నరు. చట్టపరమైన రక్షణ కల్పించడంలో షీటీం, భరోసా సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ‘నడిపెల్లి’
నడిపెల్లి దివాకర్రావు సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. కిరాణ దుకాణ వ్యాపారిగా, ఎల్ఐసీ ఏజెంట్గా పని చేశారు. 1981లో మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి 7వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు. 1987లో మంచిర్యాల సింగిల్ విండో చైర్మన్గా పోటీచేసి విజయం సాధించారు. బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలోనే 1999లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో టికెట్ లభించింది. విజయం సాధించిన ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009లో టీఆర్ఎస్ ప్రభంజనంలో ఓటమి చెందారు. తిరిగి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మూడోసారి, 2018లో ఎన్నికల్లో నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతగా చురుగ్గా ఉన్నారు. -
తెలంగాణ సాయుధ పోరు నుంచి.. రంగనాథ్రావు
● అంచెలంచెలుగా ఎదిగి.. ● ఎమ్మెల్యేలుగా ఎన్నికై న కౌన్సిలర్లు, చైర్మన్లుతెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ రంగనాథ్ రావు బొల్లాన్వార్ ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఆవిర్భావంతోనే ఎన్నికల బరిలో నిలిచారు. నాడు నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఐపై అప్పట్లో నిషేధం విధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకుడైనప్పటికీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున మున్సిపల్ బరిలో నిలిచారు. అధ్యక్షుడిగా విజయం సాధించి 1952 నుంచి 1961 వరకు దాదాపు దశాబ్దకాలం పాటు పట్టణ ప్రజలకు సేవలందించారు. ఈ క్రమంలో అదే పార్టీ తరఫున 1957లో ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రజల మద్దతుతో అసెంబ్లీలో అడుగు పెట్టారు. చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మరోసారి మున్సిపల్ బరిలో నిలిచి గెలుపొందారు. రెండోసారి 1967 నుంచి 1972 వరకు చైర్మన్గా సేవలందించారు. పదవులు చేపట్టినప్పటికీ అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడివలే కాలినడకన తిరిగేవారని ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు ఆయన సమకాలీకులు. -
కౌన్సిలర్ నుంచే ‘గోనె’ ప్రస్థానం
కాంగ్రెస్ నుంచి గోనె హన్మంతరావు రెండు పర్యాయాలు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 1961 ఎన్నికల్లో పాతమంచిర్యాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1967లో మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. 1987లో కాసిపేట మండలం ముత్యంపల్లి నుంచి సింగిల్ విండో చైర్మన్గా గెలిచారు. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని అలంకరించారు. 1989లో లక్సెటిపేట(ప్రస్తుతం మంచిర్యాల) నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్ కోసం విఫలయత్నం చేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టికెట్ లభించగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1999, 2010లో పోటీ చేసినా ఓటమి చవిచూశారు. రాజకీయాల నుంచి వైదొలిగిన ఆయన అనారోగ్యంతో మృతిచెందారు. -
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
లక్ష్మణచాంద: పూర్వ ప్రాథమిక విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. మండలంలోని వడ్యాల్లో శనివారం నిర్వహించిన అంగన్వాడీ టీచర్ల క్లస్టర్ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. చిన్నారులకు ఎఫ్ఆర్ఎస్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందించాలని పేర్కొన్నారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య నేర్పించాలని ఆదేశించారు. అభయ్, అఫా వంటి యాప్ నమోదులో కలుగుతున్న ఇబ్బందులను అంగన్వాడీ టీచర్లు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో సీడీపీవో నాగలక్ష్మి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘పుర’ బరిలో ఉండుడే..!
నిర్మల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చివరిరోజైన శుక్రవారం జాతర కొనసాగింది. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలు బీఫామ్ ఇవ్వకున్నా పార్టీపేరుతో ఒకటి, ఇండిపెండెంట్గా మరొకటి అంటూ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించక పోవడంతో ఎవరు ఏ పార్టీ నుంచి వేస్తున్నారో, ఎవరు బరిలో ఉంటున్నారో స్పష్టత రాలేదు. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం శుక్రవారం సాయంత్రం డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. నిర్మల్లో ఏపార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. భైంసాలో బీజేపీ టికెట్ల పంచాయితీ హైదరాబాద్ చేరింది. నామినేషన్లు.. అందరూ వేశారు.. పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడం, బీఫామ్లు ఇవ్వకపోవడంతో దాదాపు ఆశావహులందరూ నామినేషన్లు వేశారు. ఎంఐఎం మినహా దాదాపు మూడు ప్రధాన పార్టీల్లో ఒక్కోవార్డు నుంచి కనీసం ఇద్దరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. ‘ముందయితే నామినేషన్ వేసేద్దాం. బీఫామ్ వస్తే పార్టీ నుంచి లేదంటే ఇండిపెండెంట్గా బరిలో ఉందాం..’ అన్న ధోరణిలో జిల్లా కేంద్రంలోని కొన్నివార్డుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి ముగ్గురు నలుగురూ వేయడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ ఆశావహులు చివరిరోజు బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ బీఫామ్ ఇస్తామని గ్యారంటీ ఇవ్వడంతో నామినేషన్ వేశారు. బీఫామ్ ఇచ్చేలోపే.. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. ఈలోపే తమ పార్టీ నుంచి తమ వార్డుల్లో రెబల్స్గా నామినేషన్లు వేసిన వారిని తప్పించే సంప్రదింపుల పర్వం మొదలైంది. ‘నీకేం కావాలి చెప్పు.. ఏమిస్తే నాకు మద్దతిస్తవ్..’అనే కోణంలో బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. పార్టీ నేతలతో ఫోన్లు చేయించడం.. లేదంటే గల్లీ పెద్దలను ఇంటికి తీసుకెళ్లి మాట్లాడించడం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ తమకే బీఫామ్ ఇచ్చినా ఎన్నికల్లో తమ ఓట్లను రెబల్స్ చీల్చకుండా నామినేషన్లు వేసిన మరుక్షణం నుంచే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వార్డుల్లోనూ సొంతపార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేశారు. వీరంతా ఈనెల 3లోపే విరమించుకుంటారంటూ ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. -
కమనీయం.. రమణీయం
కడెం: మండలం దిల్దార్నగర్, ఎలగడప, సారంగపూర్ గ్రామాల సమీపంలోని కొండపై కొలువుదీరిన పురాతన అక్కకొండ శ్రీలక్ష్మీనరసింహాస్వామి కల్యాణం ప్రధాన అర్చకులు వొద్దిపర్తి వెంకరమణాచార్యులు ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తుల తరలివచ్చారు. ఈనెల 28న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రముఖ దర్శకుడు పైడిపల్లి వంశీ అక్కకొండ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. వంశీకి ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కొప్పుల లక్ష్మణ్, గౌరవ అధ్యక్షుడు జగ్గరావు, సర్పంచులు స్టీఫెన్, ఆశ్విత, కోల తేజస్విని తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వెల్లడించాలి
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.వీరారెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్తో కలిసి సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు ఎన్నికల వ్యయాలపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని రకాల ఫారాలు, రిజిస్టర్లను సక్రమంగా పూరించాలన్నారు. సమావేశంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు షుజావుద్దీన్, డీఈవో భోజన్న, డీసీవో నర్సయ్య, అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలోని 12 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసిందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. 1వ వార్డు నుంచి గొర్రె తిరుమల, 2వ వార్డు ద్యావతి రాజేశ్వర్, 3వ వార్డు జన్నారపు విజయలక్ష్మి, 4వ వార్డు కస్తూ రి మహేశ్, 5వ వార్డు నేత పవిత్ర, 6వ వార్డు అఫ్రీన్బేగం, 7వ వార్డు పోలంపెల్లి రమేశ్, 8వ వార్డు అస్మాత్ జాహన్షౌకత్పాషా, 9వ వార్డు చింతపండు రవి, 10వ వార్డు తొంటి రాధ, 11వ వార్డు చిన్నం సత్యం, 12వ వార్డు లావుడ్య లాలు పోటీ చేస్తున్నట్లు వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని, ఆమేరకే అభ్యర్థులను బరిలో దించాయని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆరోపించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. పట్టణంలో రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పెండింగ్లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను పునఃప్రారంభించామని తెలిపా రు. విపక్షాల తప్పుడు మాటలు నమ్మొద్దని కోరా రు. ఖానాపూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. దయానంద్, మజీద్, అంకం రాజేందర్, యూసఫ్ఖాన్, జంగిల్ శంకర్, కుత్బొద్దీన్, శేషాద్రి, రాము, శెట్టి శ్యామ్, శ్రీహరి, మణికంఠ, శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
హైటికాస్ సేవలు అభినందనీయం
కడెం: హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్సొసైటీ(హైటికాస్) స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని మండలంలోని ఉడుంపూర్ అటవీరేంజ్ అధికారి ప్రకాశ్, సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ అభినందించారు. గ్రామంలో సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు రెండు నెలలపాటు ఉచిత కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ అందించారు. శుక్రవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అటవీ శాఖ ద్వారా చేపట్టే పనులకు తోడ్పడాలని కోరారు. అనంతరం హైటికాస్ సంస్థ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ కోఆర్డినేటర్ వెంకట్ ఎనగందుల మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ మహిళలకు చేతినిండా పని ఉండాలనే సదుద్దేశంతో గ్రామంలో శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న మెలకువలతో ఉపాధి పెంపొందించుకోవాలని కోరారు. గ్రామంలోని యువతీ యువకులకు కూడా హైదరాబాద్లో 45 రోజులపాటు బైక్, కార్ మెకానిజం, ఫుడ్ ప్రొడక్షన్, హౌస్ వైరింగ్, డాటా ఎంట్రీ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఈడీఐఐ ప్రాజెక్ట్ అధికారి దేవేందర్, రాజేశ్వర్, నాంపల్లి సుమలత తదితరులు పాల్గొన్నారు. -
కుష్ఠు రహిత సమాజానికి కృషి చేద్దాం
నిర్మల్చైన్గేట్: కుష్టు రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పర్శ లెప్రసీ అవగాహన సదస్సులో మాట్లాడారు. స్పర్శ లేని తెలుపు, ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చికిత్స పొందడం ద్వారా నివారణ సాధ్యమవుతుందన్నారు. లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరవన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుపై వివక్ష చూపొద్దన్నారు. అనంతరం వ్యాధి నివారణలో భాగస్వామవుతామని విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కవిత, జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి బి.రవీందర్, డీపీఎంవోలు రాజేశ్వర్, గంగన్న, ఫిజియోథెరపిస్ట్ కిషన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ వీణ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో గాంధీ వర్ధంతి
బాసర: బాసర ఆర్జీయూకేటీలో మహాత్మాగాంధీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలోని గాంధీ చిత్రపటానికి ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గాంధీజీ బోధించి న సత్యం, అహింస అనే ఆయుధాలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు గాంధీ మార్గంలో నడవాలని పిలుపుని చ్చారు. ఓఎస్డీ మురళీదర్శన్ మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాట పటిమను, సామాజిక సంస్కరణలపై ఆయనకున్న అంకితభావాన్ని కొని యాడారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్స్ ఎస్.విఠల్, కె.మహేశ్, ఎస్. శేఖర్, డీఎస్డబ్ల్యూవో జి.నాగరాజు, సీఎస్వో రాజేశ్, చంద్రశేఖర్రావు, శంకర్, సాంస్కృతిక శాఖ సభ్యులు ఎం.రమాదేవి, నాగలక్ష్మి, శ్రీవిద్య, సారిక, .శ్వేత, శ్రీలక్ష్మి ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని బాపూజీకి అంజలి ఘటించారు. -
అభివృద్ధిని చూసే ఓటేసేవారు
నిర్మల్చైన్గేట్: నేను నిర్మల్ పట్టణంలో బంగల్పేట కాలనీ నుంచి మూడుసార్లు కౌన్సిలర్గా గెలిచాను. ఒకసారి కోఆప్షన్ సభ్యుడిగా ప్రజలకు సేవ చేశారు.1986, 1995లో స్వతంత్ర అభ్యర్థిగా సింహం, ఓడ గుర్తుపై పోటీ చేసి గెలిచాను. 2000లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ సాధించాను. నా హయాంలో మా కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. అయ్యన్నగారి భూలక్ష్మి చైర్పర్సన్గా ఉన్న సమయంలో ఖిల్లా గుట్ట నుంచి పైప్లైన్ వేయించి బోయవాడ బంగల్పేట్ నీటి కష్టాలు తీర్చాం. ప్రభుత్వ పాఠశాల కోసం స్థలాన్ని కేటాయించి నిర్మాణం చేపట్టాం. కురన్నపేటకు తరలించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బంగల్పేట్కు మంజూరు చేయించి భవన నిర్మాణానికి కృషి చేశాను. 90 శాతం రోడ్లు, డ్రైనేజీ పనులు నా హయాంలోనే చేశాను. -
● ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ● ఇప్పుడు స్వార్థ, అవకాశవాద రాజకీయాలే ఎక్కువ ● సాక్షితో నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు, కౌన్సిలర్
నిర్మల్చైన్గేట్: అప్పట్లో రాజకీయాలు అంటే సేవాతత్పరత, నమ్మకం ఉండేవి. ప్రజల విశ్వాసం చూరగొనేలా పనులు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందంటున్నారు. ఒకప్పుడు మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు పనిచేసిన నేతలు. ఇప్పటి రాజకీయాల అర్థాలే మారిపోయాయని పేర్కొంటున్నారు. సేవాభావం స్థానంలో స్వార్థం, విశ్వాసం స్థానంలో అవకాశవాదం వచ్చాయని పేర్కొంటున్నారు. 1995–2000 కాలంలో నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్గా వ్యవహరించిన అయ్యన్నగారి భూలక్ష్మి, 2006 – 2010 వరకు చైర్పర్సన్గా పనిచేసిన అప్పాల అనురాధ, మాజీ కౌన్సిలర్ చిలక గోవర్ధన్ తమ హయాంలో రాజకీయాల గురించి వెల్లడించారు. చరిత్రలో నిలిచేలా పనులు చేశాం.. అధికారం చేపట్టిన నాటి నుంచే అభివృద్ధిని ఎజెండాగా మార్చుకున్నా. పట్టణంలోని ప్రతి గల్లీలో పర్యటించాను. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నా. తాగునీరు, డ్రెయినేజీ, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చా. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి పన్ను వసూలు చేయకుండా ఉన్న గృహాలను రెగ్యులరైజ్ చేసి పన్నులు వసూలు చేయడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1997లో నిర్మల్ ము న్సిపాలిటీకి ఉత్తమ పురస్కారం దక్కింది. అప్ప టి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.1,50,000 రివార్డును పొందాను. ఆదర్శనగర్ లో వాటర్ ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టి ఈద్గాం, రామ్నగర్, సిద్ధాపూర్ కాలనీలకు తాగునీటి సమ స్య తీర్చాం. ప్రస్తు తం ఉన్న జిల్లా గ్రంథాలయ కేంద్రం మా హయాంలో కేటాయించబడిన స్థలమే. 1997లో జన్మభూమి కార్యక్రమం మున్సిపాలిటీలో పకడ్బందీగా చేపట్టినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాం. రిజర్వేషన్ కలిసి రావడంతో..మా ఆయన అయ్యన్నగారి భూమయ్య 1995లో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండే వారు. 1995లో నిర్మల్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ అయింది. అప్పటి పరిస్థితులలో బీజేపీ తరఫున నాకు టికెట్ ఇచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు మరో నలుగురు బరిలో నిలవగా 4వేల ఓట్ల మెజారిటీతో గెలిచి నిర్మల్ బల్దియాకు చైర్పర్సన్ అయ్యాను. 2000 వరకు పదవిలో కొనసాగాను. నిర్మల్ మున్సిపాలిటీ చరిత్రలో తొలి మహిళా చైర్పర్సన్ నిలిచిపోయాను. -
ప్రజలతో మమేకమయ్యాం..
నిర్మల్టౌన్: అప్పట్లో ఎన్నికల ప్రచారం అంటే ఇంటింటికీ తిరిగేవారమని, ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి. అప్పట్లో ఇంటింటికి తిరుగుతూ.. ప్రచారం చేసేవాళ్లం. అప్పట్లో పరిమిత వ్యయంతోనే ప్రజల మద్దతు సంపాధించే వాళ్లం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేసేవాళ్లం. వార్డుల అభివృద్ధి మాకు రాజకీయ గుర్తింపుగా మారేది. ప్రస్తుతం పదవి కంటే ప్రజల అవసరాలే ముఖ్యం .నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటేనే రాజకీయాల్లో నిలదొక్కుకుంటాడు. కొత్తగా రాజకీయాల్లో వచ్చేవారు స్నేహభావంతో ముందుకు వెళ్లాలి. -
గద్దెకు చేరిన సమ్మక్క
7 సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజలు నిర్వహిస్తున్న భక్తులు ముధోల్: ముధోల్ మండలం ఎడ్బిడ్ తండాలో సమ్మక్క– సారలమ్మల జాతర గురువారం రెండో రోజు కొనసాగింది. సమ్మక్కను గిరిజన పూజారులు గద్దైపెకి తీసుకువచ్చారు. అమ్మవారు వనం నుంచి గద్దైపెకి చేరుకోవడంతో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. పూజలు చేశారు. సమ్మక్క – సారలమ్మ మొక్కులు తీర్చుకుని నిలువెత్తు బంగారం(బెల్లం) ఒడి బియ్యం సమర్పించారు. మేకలు, కోళ్లతో మొక్కులను తీర్చుకున్నారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త జాదవ్ సతీశ్కుమార్ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. -
అమ్మవారిని దర్శించుకున్న అబ్జర్వర్
బాసర: మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్గా నియమితులైన వీరారెడ్డి గురువారం బాస ర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. నామినేషన్ కేంద్రం పరిశీలనఖానాపూర్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు వీరారెడ్డి గురువా రం సందర్శించారు. కేంద్రంలో ఏర్పాట్లు, సిబ్బంది విధులు తెలుసుకున్నారు. -
పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు
నిర్మల్: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సమీకృత కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పూర్తి చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని, హెల్ప్డెస్క్లనూ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. కంట్రోల్రూమ్లో అప్రమత్తంగా ఉండాలిమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పా టు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాషఅభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కంట్రోల్రూమ్ను తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. హెల్ప్లైన్..9100577132ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలి పారు. ఎవరైనా 9100577132 నంబర్కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ప్రతి ఫోన్కాల్ను సిబ్బంది స్వీకరించాలని, ఫిర్యాదుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా సెంటర్ ప్రారంభం..ఎన్నికలకు సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో వచ్చే రాజకీయ వార్తలపై నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని పౌరసంబంధాలశాఖ కార్యాలయంలో మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ (మీడియా సెంటర్)ని ప్రారంభించారు. రోజువారీగా వార్తపత్రికలు, చానళ్లలో వచ్చే వార్తలను నిశితంగా గమనించాలన్నారు. పెయిడ్న్యూస్ వివరాలు నమోదు చేయాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై నిఘా ఉంచాలని తెలిపారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఈడీఎం నదీమ్ పాల్గొన్నారు. -
‘మధ్యాహ్నం’ మెరుగుపడాలి
లక్ష్మణచాంద: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. మౌలిక వసతులు, ప్రయోగశాల పరికరాలకు నిధులు కేటాయించారు. వంటగదుల నిర్మాణానికి కలెక్టర్లు ఇటీవల నిధులు మంజూరు చేయించారు. ఇది పాఠశాల వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. మధ్యాహ్న భోజనం పారదర్శకతకు..మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకతను మరింత పెంచేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు తీరుపై సర్వే చేపట్టింది. ఇందులో జిల్లా 16వ స్థానం సాధించింది. జిల్లాలో 74.6% విద్యార్థులు రోజూ భోజనం చేస్తున్నట్లు తేలింది. నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించి ర్యాంక్ మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. క్షేత్ర స్థాయి సవాళ్లు..సర్వేలో 12 అంశాలపై పరిశీలన జరిగింది. ఆహార కమిటీలు నాణ్యత తనిఖీ చేయకపోవడం, స్టీరింగ్ కమిటీల పరిశీలన లోపాలు, కట్టెల పొయ్యిపై వంటలు చేయడం వంటి సమస్యలు బయటపడ్డాయి. ఇవి అమలులో లోపాలను సూచిస్తున్నాయి. మధ్యాహ్న భోజనం నిత్యం ముందుగా ఆహార కమిటీ భోజన నాణ్యతను పరిశీలించిన తర్వాతనే విద్యార్థులకు అందించాలి. కానీ ఇది క్షేత్రస్థాయిలో చాలా చోట్ల ఆచరణలో లేదన్నట్టుగా తెలుస్తుంది. ప్రతీ మండలంలో స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఉన్నా పరిశీలన సరిగా చేయడం లేదని సమాచారం. జిల్లాలోని పలు పాఠశాలల్లో ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదనే మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. తనిఖీలు, మానిటరింగ్..ఎంఈవోలు ప్రతిరోజూ పాఠశాలలు సందర్శించి భోజన నాణ్యతను పరిశీలిస్తున్నారు. పరిశీలనలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇది పథకం సమర్థతను పెంచుతుంది. మెరుగైన అమలుతో విద్యార్థుల హాజరు, పోషకాహారం మెరుగుపడతాయి. నాణ్యత పెంచాలి.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలి. ప్రతీ పాఠశాలలో తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని విధిగా ఆహార కమిటీ వారు రుచిచూసిన తర్వాతనే విద్యార్థులకు అందించాలి. ప్రతీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీనిని బాధ్యతగా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం సరిగా అమలు అయ్యేలాగా చూడాలి. – భోజన్న, డీఈవో -
నామినేషన్లకు నేడే ఆఖరు..
నిర్మల్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. తొలిరోజు నిర్మల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండోరోజు గురువారం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 128 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం చాలామందికి కలిసి వస్తుండటంతో మూడు మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే నామినేషన్ల జాతర ఉండనుంది. రెండురోజులుగా మున్సిపల్ ఖజానాకూ పన్నుల రూపంలో రాబడి పెరుగుతోంది. పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు వారిని బలపరుస్తున్నవారూ మున్సిపల్ పన్నులను చెల్లించాలనే నిబంధన ఉండటమే ఇందుకు కారణం. భైంసాలో 68 నామినేషన్లు..భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భైంసాలో రెండోరోజు నామినేషన్ల జోరు కనిపించింది. తొలిరోజు కేవలం రెండు నామినేషన్లు దాఖలు కాగా, గురువారం ఒక్కరోజే 68 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం పార్టీ నుంచి 18 మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ ఎండీ.జాబీర్అహ్మద్ కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 70 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అజ్మీర సంకేత్కుమార్ తెలిపారు. ఖానాపూర్లో 23..ఖానాపూర్: ఖానాపూర్లో గురువారం 23 నామినేషన్లు దాఖాలయ్యాయని కమిషనర్ సుందర్సింగ్ తెలిపారు. బుధవారం 3 నామినేషన్లు రాగ, రెండు రోజుల్లో 26 నామినేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. -
భైంసా.. మినీ భారత్..!
భైంసాటౌన్: మున్సిపల్తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న భైంసా పట్టణం భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, భాషలకు నిలయం. వివిధ మతాలు, సంస్కృతులు, భాషలు మాట్లాడే ప్రజలు కలిసి నివసించే వైవిధ్యమైన, చారిత్రక ప్రాధాన్యత ఉన్న పట్టణం. అందుకే మినీ భారత్గా పేర్కొంటారు. ఇక్కడ ఎక్కువగా తెలుగు, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. పత్తి పరిశ్రమలకు పెట్టింది పేరు కాగా, నియోజకవర్గానికి వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. గతంలో నగర పంచాయతీగా ఉన్న భైంసా పట్టణం తొలుత నిజాం రాజ్యంలో కొనసాగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో భాగంగా ఉండేది. 1953లో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనతో భైంసా పట్టణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసింది. ఆపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. 1956లోనే తొలుత నాలుగు రెవెన్యూ వార్డులతో గ్రేడ్–3 మున్సిపల్గా ఏర్పడగా, 1995లో 17, 2005లో 20, 2014లో 23 వార్డులకు పెరగగా, 2019లో 26 వార్డులకు చేరింది. ప్రస్తుతం పట్టణంలో 51,118 మంది ఓటర్లు ఉన్నారు. త్రిభాషా సంగమం...భైంసా పట్టణంలో ప్రధానంగా హిందూ సామాజికవర్గంతోపాటు ముస్లింలు అధిక సంఖ్యలో ఉంటారు. మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో ఇక్కడ మరాఠీ భాష మాట్లాడేవారు కూడా అధికంగానే ఉంటారు. తెలుగు, మరాఠీ, ఉర్దూ భాషల సంగమం ఇక్కడ కనిపిస్తుంది. కర్ణాటకకు చెందిన బసవేశ్వర ఆరాధకులు సైతం ఇక్కడ కనిపిస్తారు. ఇక, వ్యాపారాల నిమిత్తం గుజరాత్, రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడినవారూ ఉన్నారు. భైంసా పట్టణం పత్తి పరిశ్రమల కేంద్రంగా ఉండగా, క్రమేణా పత్తి ఫ్యాక్టరీలు మూతపడి ప్రస్తుతం పదుల సంఖ్యకు పరిమితమయ్యాయి. ఇక్కడి ప్రజలు అధికసంఖ్యలో వ్యవసాయంపై ఆధారపడినవారున్నారు. సున్నిత ప్రాంతంగా..గతంలో జరిగిన మతపరమైన అల్లర్లతో భైంసా ప ట్టణం రాష్ట్రంలోనే సున్నితప్రాంతంగా అపఖ్యాతిని పొందింది. 1984 నుంచి పలుమార్లు అల్లర్ల ఘటనలు చోట చేసుకోగా, అప్పటి నుంచి అత్యంత సున్ని తప్రాంతంగా మారింది. 2008, 2020, 2021లో నూ ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో అభివృద్ధిపరంగా కాస్త వెనుకబడిన ప్రాంతంగా మారింది. భైంసా పట్టణం మున్సిపల్ కేంద్రంగా ఉండడంతోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. ఇక్కడ సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి, ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి అందుబాటులో ఉన్నారు. మహిష నుంచి భైంసాగా...దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడంతో మహిషాగా పిలవబడిందని చరిత్ర చెబు తోంది. దీనికి నిదర్శనంగా గట్టు మైసమ్మ ఆ లయం సమీపంలో ఫిల్టర్బెడ్ ప్రాంతంలో మహిషాసుర రాతి పాదాలు కనిపిస్తాయి. కా లక్రమంలో మహిష మైసగా, ప్రస్తుతం భైంసాగా మారింది. ఈ పట్టణంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి గోపాలకృష్ణ మందిర్ వంటి పురాతన నిర్మాణాలు ఉన్నాయని చరిత్ర. -
కాంగ్రెస్తోనే బీజేపీకి పోటీ
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే బీజేపీకి పోటీ ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టణాలతోపాటు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలతోపాటు పట్టణాలకు నిధుల కేటాయింపు శూన్యమన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాటీల్లో బీజేపీ కై వసం చేసుకుంటుందన్నారు. ఈ సందర్భం బీఆర్ఎస్ పార్టీ 12వ వార్డు ఇన్చార్జి బండిపెల్లి ప్రకాశ్గౌడ్ సుమారు 50 మంది కార్యకర్తలతో బీజేపీలో చేరారు. రితీశ్ రాథోడ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, మంత్రరాజం సురేశ్, నల్ల రవీందర్రెడ్డి, కీర్తి మనోజ్, ఎనగందుల నారాయణ, పుప్పాల ఉపేందర్, మట్టెరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సీట్ల కోసం సిగపట్లు
నిర్మల్అరైవ్–అలైవ్.. ప్రమాదాలకు చెక్! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు చెక్పెట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది.5న ‘చలో పార్లమెంట్’ భైంసాటౌన్: సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలన్న డిమాండ్తో ఫిబ్రవరి 5న తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్ డిమాండ్ చేశా రు. ఈ మేరకు పట్టణంలోని సంఘ కార్యాలయంలో గురువారం మాట్లాడారు. సీపీఎస్ రద్దు, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు, నూతన విద్యావిధానంపై తక్షణ సమీక్ష డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహాధర్నా చేయనున్న ట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణ్, కార్యదర్శి బాజారెడ్డి, ఆర్థిక కమిటీ సభ్యులు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్, భైంసా, కుభీర్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. నిర్మల్: మున్సిపల్ ఎన్నికలు పార్టీల్లో నేతల మధ్య పంచాయితీ పెడుతున్నాయి. ఇప్పటికే వర్గాలుగా ఉన్న నాయకులు వార్డుల్లో తమవాళ్లకు టికెట్లు ఇ ప్పించుకునే విషయంలో నువ్వెంత.. అంటే నువ్వెంత అనుకునేదాకా చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారం సాయంత్రం ముగియనుంది. అయినా.. గురువారం సాయంత్రం వరకూ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్లో మాత్రం కొంతమందికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి, నామినేషన్లను వేసుకోమని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అలా గ్రీన్సిగ్నల్ అందినవాళ్లు ఆగమేఘాల మీద మొదటిసెట్ నామినేషన్లు గురువారం వేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రెండోరోజు 123నామినేషన్లు దాఖలయ్యాయి. బీఫామ్ ఇచ్చేదాకా డౌటే...‘తమ్ముడూ.. కంగ్రాట్స్. ఇంకేం నీకే ఇచ్చిండ్రట పార్టీ టికెట్. సార్ కూడా నామినేషన్ వేసుకోమని చెప్పిండట కదా..’ అని చెబితే.. ‘అన్నా.. ఇక్కడ పరిస్థితి వేరే ఉందన్న. ఎవరికి టికెట్ ఇస్తరో, ఎవరి ని దూరం పెడతరో తెలుస్తలేదు. నామినేషన్ నాకే కాదు, మావార్డులో మరొకరికీ వేసుకోమని చెప్పా రు. చివరకు ఎవరికి బీఫామ్ ఇస్తరో తెలియదన్న..’ అని సదరు పార్టీ ఆశావహుడు వాపోయాడు. నిర్మల్ మున్సిపాలిటీలో ఓ ప్రధాన పార్టీలో ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నామినేషన్లకు ఈ ఒక్కరోజే గడువున్నా.. తమ అభ్యర్థుల పేర్లను, బీఫామ్ ఎవరికి ఇవ్వనున్నామనే విషయాలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు వెల్లడించకపోవడం గమనార్హం. జిల్లా అధ్యక్షులూ.. ఎక్కడ..!?మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నుంచి ఎవరు పోటీచేయాలనేది పీసీసీ అధ్యక్షుడు ప్రకటిస్తారని సీఎం పేర్కొన్నారు. తమ పార్టీ అధ్యక్షుడే ఎ వరెవరు పోటీలో ఉంటారనేది ఫైనల్ చేస్తారని బీజేపీ సీనియర్లు చెప్పారు. కానీ.. జిల్లాకు వచ్చేసరి కి పరిస్థితి ఉల్టా ఉంది. మున్సిపల్ ఎన్నికల లొల్లి ప్రారంభమై మూడోరోజుకు చేరుకున్నా.. రెండు ప్ర ధాన పార్టీల జిల్లా అధ్యక్షులు అభ్యర్థిత్వా ల ఖరారు ప్రక్రియలో కనిపించడం లేదు. బీజేపీలో నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు చెప్పిన జాబితానే ఫైన ల్ అన్నట్లు నడుస్తోంది. కాంగ్రెస్లో స్థానిక సీనియర్ నేతలు చెప్పిన పేర్లే దాదాపు ఖరారు అని చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ ఇద్దరూ దాదాపు ఖానాపూర్ మున్సిపల్ వరకే పరిమితమైనట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ వేసేందుకు వస్తున్న బీఆర్ఎస్ నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి యోగిత పార్టీల్లో ఫైట్..‘ఇన్నేళ్లు పార్టీకోసం పనిచేసిన నా మనిషికి టికెట్ ఇవ్వరా.. ఏమనుకుంటున్నరు..’అని ఒక సీనియర్ నేత అంటే.. ‘నా వార్డులో నీ మనిషికి టికెట్ ఎట్ల ఇస్తరో చూస్త..’అని మరో సీనియర్ నేత వాగ్వాదానికి దిగారు. మరోచోట.. ‘మేం చెప్పినవాళ్లకు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినవారికి టికెట్ ఇస్తామంటే కుదరదు..’ అంటూ యువరక్తం గల్లాలు పట్టి అడిగేదాకా పరిస్థితి చేరింది. ఇంకోపార్టీలో ‘ఇంత సీనియారిటీ ఉన్నా.. కనీసం మా పేర్లు కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంటే ఇన్నేళ్లు పార్టీకి మేం చేసిన సేవలు కనిపించడం లేదా..! మీ ఎన్నికలప్పుడే మేం కనిపిస్తామా..! దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న మమ్మల్ని కాదని, నిన్నమొన్న వచ్చినోళ్లకు టికెట్లు ఇస్తరా..!?’ అంటూ ఓ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. జిల్లాకేంద్రంలో ఓ పార్టీకి చెందిన నాయకులు, క్యాడర్ వర్గాలుగా విడిపోయి, వార్డుల్లో పోటీపడుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు.. ఇప్పుడు జిల్లాలో ప్రధాన పార్టీల్లో ఇదే పరిస్థితి. ఓ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు తమను నమ్ముకున్నవాళ్లకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ముఖం చాటేస్తున్నారు. -
‘ఖానాపూర్లో కుంటుపడిన అభివృద్ధి’
ఖానాపూర్: పదేళ్ల బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఖానాపూర్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ ఆరోపించారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఖానాపూర్ మున్సిపల్గా ఏర్పడ్డా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఖానాపూర్ మున్సిపల్ పీఠమే లక్ష్యంగా అన్ని వార్డుల్లో కాషాయజెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కరిపె రంజిత్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన పలువురికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, నల్ల రవీందర్రెడ్డి, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, ఎనగందుల నారాయణ, తిరుమల్, రాజ్కుమార్, పవన్, మురళి తదితరులు పాల్గొన్నారు. -
1956లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా భైంసా..
భైంసాటౌన్: భైంసా పట్టణం 1956లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 11,750 నివాస గృహాలు, 50,134 మంది జనాభా ఉండేది. ప్రస్తుతం 14,730 గృహాలు, 53,374 మంది జనాభా ఉన్నారు. భైంసా పట్టణం 35.11 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా, భైంసా నుంచి నిర్మల్, నిజామాబాద్, మహారాష్ట్రలోని భోకర్, ఇతర ప్రాంతాలకు ప్రధాన మార్గాలున్నాయి. పట్టణానికి పశ్చిమాన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా, దక్షిణాన నిజామాబాద్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. పట్టణంలో మొత్తం 26వార్డులుండగా, 51,118 మంది ఓటర్లున్నారు. వీరిలో 25,486 మంది పురుషులు, 25,623 మంది మహిళలు, తొమ్మిదిమంది ఇతరులున్నారు. పట్టణానికి ఆనుకుని రెండు కిలోమీటర్ల దూరంలో మిర్జాపూర్ మార్గంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఉండగా, పట్టణానికి ఇదే తాగునీటి ఆధారంగా ఉంది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కలిగి ఉంది. పత్తి పరిశ్రమలూ ఇక్కడ అధిక సంఖ్యలోనే ఉన్నాయి. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, అయ్యప్ప ఆలయం, మహదేవ్ మందిర్, గట్టు మైసమ్మ ఆలయాలున్నాయి. -
ఎన్నికలు సజావుగా నిర్వహిస్తాం
భైంసాటౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కౌంటర్లు పరిశీలించారు. ఎన్నికల నియమావళి పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎస్పీ జానకీ షర్మి ల మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంతోపాటు పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ నామినేషన్ కేంద్రం వద్ద 24 గంటలు గార్డులు విధుల్లో ఉంటారని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ఏఎస్పీ రాజేశ్మీనా, మున్సిపల్ అధికారులున్నారు. ప్రక్రియ సజావుగా నిర్వహించాలి నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని హెల్ప్డెస్క్ సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. సమస్యలుంటే తెలుపాలి ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలున్నా హెల్ప్లైన్కు లేదా తమ దృష్టికి తేవాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. అభ్యర్థులు, ఓటర్లకు ఇబ్బందుల్లేకుండా అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
నిర్మల్
జాతరెళ్తున్నారా.. జాగ్రత్తా.. సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఎఫ్ఎల్ఎస్ పరీక్షకు సన్నద్ధం చేయాలి నిర్మల్ రూరల్: ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎస్ పరీక్షకు మూడో తరగతి విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈవో భోజన్న సూ చించారు. బుధవారం మండలంలోని రత్నాపూర్ కాండ్లీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్జీటీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులకు తొలిమెట్టు అత్యంత కీలకమని, వారిని సంసిద్ధులను చేయాలని సూచించారు. అంతకుముందు ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదోతరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గురించి ఆరా తీశారు. ఎస్వో నర్సయ్య, ఎంఈవో వెంకటేశ్వర్లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు విజయస్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్: ‘అరె.. ఏమన్నా ఇదేం టెన్షనే..!? నామినేషన్లకు ఒకరోజు గడిచిపోయే. మన పేర్లు ఇంకెప్పుడు ఫైనల్ చేస్తరు..!? మనకు ఏదో ఒకటి చెబితే.. మనం ఈడ ఉండుడా లేక వేరే పార్టీలకు పోవుడా తెలుస్తది కదా..!?’ ఇది నిర్మల్ మున్సిపల్లో ప్రధాన పార్టీ నుంచి బీఫామ్ కోసం పోటీపడుతున్న ఓ ఆశావహుడి ఆందోళన. ఈ ఒక్క నాయకుడిదే కాదు.. జిల్లాలోని మూ డు మున్సిపాలిటీల్లో ఇదే కథ. మూడు ప్ర ధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అలాగే ఎంఐఎం బుధవారం రాత్రి వరకూ తమ అభ్యర్థులెవరో ప్రకటించలేదు. నామి నేషన్ల పర్వం ప్రారంభమై ఒకరోజు గడిచిపోయి, మరో రెండురోజులే గడువున్నా.. ఇలా వివిధ రాజ కీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అటు ఆశావహులు, ఇటు గల్లీల్లో క్యాడర్ అ యోమయంలో ఉన్నారు. ఒక్కోవార్డులో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ టికెట్ల కోసం ముగ్గురు, నలు గురు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరు గెలుపుగుర్రాలనేది ఆరా తీసి బుధవారం వరకు పార్టీలు ఇద్దరు చొప్పున పేర్లు తీసుకున్నాయి. ఇక అందులో బరిలో ఎవరు నిలుస్తారు, బీఫామ్ ఎవరికిస్తామనేది గురువారం తేలుస్తామని చెబుతున్నాయి. అన్ని పార్టీలూ అంతే.. జిల్లాలో ఈసారి మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో నిర్మల్, ఖానా పూర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, భైంసాలో ఎంఐఎం, బీజేపీ మధ్య పోటాపోటీ నడిచింది. ఈసారి ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పరిస్థితి ఉంది. బీజేపీ బా గా పుంజుకోవడం, బీఆర్ఎస్ కాస్త వెనుకంజలో ఉండటం, కాంగ్రెస్ అధికార పార్టీగా మారడం, ఎంఐఎం తన ఓటుబ్యాంక్ పదిలం చేసుకోవడంతో పు రపోరు ఎలా ఉండబోతోందనే విషయాన్ని పక్కాగా తేల్చలేకపోతున్నారు. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీల సీట్ల కోసం పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇక పార్టీలు ఎదుటివాళ్లు టికెట్లు ఇచ్చిన తర్వాత పరిస్థితిని, అభ్యర్థులను బట్టి తమ జాబితాను ప్రకటిద్దామనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. నామినేషన్ల గడువులో ఒకరోజు గడిచినా.. జాబితా ప్రకటించలేదని చెబుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ దాదాపు గురువారం మధ్యాహ్నంలోపు తమ అభ్యర్థుల ఫైనల్ జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆశావహుల్లో ఆందోళన దాదాపు రెండునెలలుగా గల్లీలో పనులు చేస్తూ, ప్ర జలతో మమేకమవుతూ వస్తున్న లీడర్లంతా ఇప్పు డు పార్టీ టికెట్ కోసం అపసోపాలు పడుతున్నారు. నిర్మల్లో బీజేపీ, కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో వార్డులో నలుగురైదుగురూ పో టీపడుతున్నారు. ఇందులో ఎవరికివ్వాలనేది తేల్చ డం పార్టీ నాయకులకూ అంతుపట్టడం లేదు. చైర్మ న్ స్థానం ఆశిస్తున్న నేతల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొంతకాలంగా నిర్మల్లో బీజేపీ నుంచి చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న సీనియర్నేత, హ్యాట్రిక్ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ సొంతపార్టీలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో బుధవారం రాత్రి బీఆర్ఎస్లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సమక్షంలో హైదరాబాద్లో గులాబీ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారు కూడా ఇక్కడ రాకపోతే బీఆర్ఎస్ నుంచైనా బరిలో నిలువాలన్న యోచనలో ఉన్నారు. నిర్మల్లో నిల్నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు స్పందన నామమాత్రంగానే ఉంది. మూడు మున్సిపాలిటీల్లో కలిపి బుధవారం ఐదు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. ఖానాపూర్లో 7, 9, 11 వార్డులకు ఒక్కటి చొప్పున, భైంసాలో 9, 14వార్డులకు ఒక్కో నామినేషన్ చొప్పున వేశారు. జిలాకేంద్రమైన నిర్మల్లో 42 వార్డులుండగా తొలిరోజు ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజునే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించడం, మరోవైపు పార్టీలు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో ఎవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదు. చాలామంది బుధవారం మున్సిపాలిటీల్లో పన్నులు చెల్లించారు. రెవెన్యూ నుంచి ధ్రువపత్రాలు తీసుకోవడంలోనే బిజీగా కనిపించారు. మున్సిపాలిటీకి కూడా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పన్నులు ఇలా ఎన్నికల పుణ్యాన కొంతమేరకై నా క్లియర్ అవుతున్నాయి. ఇక గురువారం ఉదయమే అభ్యర్థిత్వాలు ఖరారైతేనే నామినేషన్లు వేయడానికి రెండురోజుల గడువు ఉంటుంది. మరోరోజు ఆలస్యం చేసినా చివరిరోజే ఆగమేఘాల మీద నామినేషన్ వేయాల్సి వస్తుందని ఆశావహులు వాపోతున్నారు. -
సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవా రం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని ము న్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ప రిశీలించి పోలీసులు అధికారులు, సిబ్బందికి పలు సూ చనలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ, మెటల్ డిటెక్టర్లు, బారికే డ్లు, ట్రాఫిక్ నియంత్రణ లాంటి భద్రతా చర్యలను సమర్ధవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి సమస్య ఎదుర్కొ న్నా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. అధికారులు సుజాత, సుందర్సింగ్, రమాకాంత్, అజయ్, సమ్మయ్య, శ్రీపాల్. రాహుల్ గైక్వాడ్, సిబ్బంది ఉన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్మల్ టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామి నేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా వెంటనే తమకు సమాచా రం ఇవ్వాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఇన్స్పెక్టర్లు నైలు, కృష్ణ, సమ్మయ్య, పోలీస్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. -
మూడు బల్దియాల్లో ఐదు నామినేషన్లు
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభమైంది. పట్టణంలోని 12వార్డులకు గాను ఆరు కౌంటర్ల ద్వారా కమిషనర్ సుందర్సింగ్, తహసీల్దార్ సుజాత పర్యవేక్షణలో నామినేషన్లు స్వీకరించారు. తొలిరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్కు చెందిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్య, బీజేపీ నాయకురాలు అంకం మౌనిక మహేందర్, బీఆర్ఎస్కు చెందిన మాజీ కో ఆప్షన్ సభ్యుడు బండారి కిశోర్ నామినేషన్ వేసినవారిలో ఉన్నారు. మరో 50 మంది అభ్యర్థులు హెల్ప్ డెస్క్ నుంచి నామినేషన్ పత్రాలు తీసుకువెళ్లారు. భైంసాలో రెండు.. భైంసాటౌన్: భైంసా మున్సిపాలిటీలో 26వార్డులుండగా, నామినేషన్ల స్వీకరణకు వార్డులవారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటిరోజు రెండు నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అజ్మీరా సంకేత్కుమార్ తెలిపారు. ఏఎస్పీ రాజేశ్మీనా నేతృత్వంలో పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బల్దియాకు పన్నుల రూపంలో రూ.7.40 లక్షల ఆదాయం సమకూరింది. -
‘హక్కులను హరిస్తున్న కేంద్రం’
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మికులకు హక్కులు, రక్షణ లేకుండా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా, వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూనే దేశవ్యాప్తంగా రైతాంగంపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వీబీజీ రామ్జీ చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసం పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు. జల్–జంగల్–జమీన్ విధానాన్ని అనుసరించకపోవడంతో పాటు మతపరమైన దాడులను కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్లో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాయకులు రాజన్న, శంకర్, మోహన్, లక్ష్మణ్, జైతు తదితరులున్నారు. -
ఖానాపూర్లో రెండో సమరం!
ఖానాపూర్: పాత తాలుకాగా ఉండే నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ 2018 ఫిబ్రవరికి ముందు వరకు మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగింది. 1958లోనే ఖానాపూర్ నగరపంచాయతీగా ఏర్పాటైంది. అప్పట్లోనే స్వర్గీయ అబ్దుల్ హమీద్ ఏకగ్రీవంగా తొలి చైర్మన్గా ఎన్నికై 1958 నుంచి 1961 వరకు కొనసాగారు. ఆ తర్వాత ఖానాపూర్ను పంచాయతీగా మార్చారు. 1961లో స్వర్గీయ గంగాధర్రావు దేశ్పాండే తొలిసర్పంచ్గా ఎన్నికయ్యారు. తదనంతరం 1963లో జరిగిన ఎన్నికల్లో జబ్బర్ఖాన్ సర్పంచ్గా ఎన్నికై 1981 వరకు 18 ఏళ్లపాటు కొనసాగారు. 1981నుంచి 1987 వరకు నర్సింహరావు జోషి, 1987 నుంచి 1994 వరకు బక్కశెట్టి రాములు సర్పంచ్గా ఉన్నారు. 1994 నుంచి 1997 వరకు విలాస్రావు దేశ్పాండే సర్పంచ్గా పనిచేసి మృతి చెందారు. తదనంతరం శికారి లక్ష్మీనారాయణ సర్పంచ్గా కొనసాగారు. అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లో విలాస్రావు సతీమణి శోభారాణి సర్పంచ్గా గెలిచి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మధ్యలోనే వెళ్లిపోయారు. ఆమె స్థానంలో బక్కశెట్టి లక్ష్మణ్ సర్పంచ్గా కొనసాగారు. 2001నుంచి జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల రత్నకుమారి, మైలారపు గంగాధర్, ఆకుల శ్రీనివాస్, నేరెళ్ల సత్యనారాయణ వరుసగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. 2019–2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు చెందిన అంకం రాజేందర్ తొలి చైర్మన్గా ఎన్నిక కాగా, నాలుగేళ్ల తర్వాత అతడిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గగా కాంగ్రెస్కు చెందిన చిన్నం సత్యం రెండో చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నోటిఫికేషన్ రావడంతో ఖానాపూర్లో రెండోసారి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఖానాపూర్ పేరెలా వచ్చిందంటే.. దశాబ్దాల క్రితం జిల్లాలో కరువు ఏర్పడింది. దీంతో చాలామంది దూర ప్రాంతాల నుంచి ఖానాపూర్ ప్రాంతానికి వలస వచ్చారు. ఈ క్రమంలో ఎస్సారె స్పీ కంటే ముందే ఖానాపూర్ మండలంలోని మే డంపల్లి గ్రామం వద్ద అప్పటి గోండు రాజులు గో దావరి నదికి అడ్డంగా మాటు కట్టారు. ఆ మాటునే నేటికి సదర్మాట్ అని కూడా అంటారు. మాట్ నుంచి దిగువనున్న భూములకు ప్రధాన కాలువ నిర్మించి గోదావరి నుంచి మళ్లించిన సాగునీటితో ఏటా రెండు పంటలు పండించే వారు. ఆ సమయంలో ఆది ఎంతోమంది వలస కూలీలకు ఉపాధి కల్పించింది. ఆహార పంటలు అందించింది. దీంతో పని కల్పించి అన్నం పెట్టే ఊరు కావడంతో ఖానా దేనేవాలా గావ్ ‘ఖానా’పూర్గా రూపాంతరం చెందిందని ఈ ప్రాంతవాసులు చెబుతుంటారు. కొత్తగా పెరిగిన ఓటర్లు పట్టణంలో 15,604 ఓటర్లుండగా 8,020 మంది మహిళలు, 7,584 మంది పురుషులున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా కొత్తగా 2,089 ఓట్లు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం 8,524 మంది పురుషులు, 9,169 మంది మహిళలున్నారు. మొత్తం 17,693 మంది ఓటర్లతో 12వార్డుల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. -
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత
నిర్మల్: బీజేపీ సీనియర్నేత, హ్యాట్రిక్ కౌన్సిలర్గా గుర్తింపు పొందిన అయ్యన్నగారి రాజేందర్ బీఆర్ఎస్లో చేరారు. ఈమేరకు ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా వేసుకున్నారు. కొంతకాలంగా బీజేపీ నుంచి రాజేందర్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించారు. సొంత పార్టీలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఆయన బీఆర్ఎస్లో చేరినట్లు తెలుస్తోంది. బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ సమక్షంలో అయ్యన్నగారి రాజేందర్ బీఆర్ఎస్లో చేరారు. -
● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి
లోకేశ్వరం: జీరామ్జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి డిమాండ్ చేశారు. మండలంలోని పుస్పూర్ గ్రామంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు పని కల్పిస్తున్న ఉపాధి చట్టం రద్దు చేసి జీరామ్జీ చట్టాన్ని తేవడం ప్రజల ఉపాధి హక్కుని దెబ్బతిస్తుందన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా బిల్లు రూపొందించిందని విమర్శించారు. కూలీలకు రోజుకు రూ.800 చెల్లించి ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్కుమార్, నాయకులు కృష్ణదాస్, తిమ్మాపురం ముత్తన్న, గ్రామ అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. -
‘మానవులు–వన్యప్రాణుల సంఘర్షణ’ పై అవగాహన
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం మానవులు–వన్యప్రాణుల సంఘర్షణ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాసర సర్కిల్లోని నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాలకు చెందిన పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అడవిని అనుకుని ఉన్న గ్రామాలు వన్యప్రాణులతో మానవులకు ఏర్పడే సంఘర్షణలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చించారు. ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ జిల్లా అటవీ శాఖ అధికారులు సుశాంత్ సుఖదేవ్ బోబడే, ప్రశాంత్ పాటిల్, రవి ప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మి, నాలుగు జిల్లాల ట్రైబల్ వెల్ఫేర్, హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఎలక్ట్రిసిటీ అధికారులు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు, అరణ్య ఎన్జీవో సభ్యులు, సర్పంచులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
సమయం లేదు మిత్రమా..!
సమ్మక్క జాతర పోయొద్దామా..నిర్మల్7కాగజ్నగర్ మండలం నందిగూడ సమీపంలో గద్దెలుఆరోగ్య లక్ష్యాలు చేరుకోవాలి నిర్మల్చైన్గేట్: ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ ఆరోగ్య లక్ష్యాలు చేరుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని మహిళా ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య పర్యవేక్షకులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్వో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సాధించిన ప్రగతి గురించి సమీక్షించారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించడానికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహణ అధికారులు డాక్టర్ నైనారెడ్డి, డాక్టర్ సౌమ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ అధికారి డాక్టర్ ఆకాశ్, ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. నిర్మల్: పురపోరుకు మంగళవారం నగారా మోగింది. పట్టణాల్లో హీట్ పెంచింది. పార్టీలను టెన్షన్ పెడుతోంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సమయం ఇవ్వకుండా బిజీ షెడ్యూల్ ఇచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేవలం పక్షంరోజుల్లోనే కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. బల్దియాల్లో బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. బరిలో ఎవరు ఉండాలనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోవడం, అభ్యర్థులను ఫైనల్ చేయకపోవడం, ఇంతలోనే షెడ్యూల్ రావడంతో ఒక్కసారిగా పార్టీల్లో హడావుడి పెరిగింది. ఆశావహులు మంగళవారం సాయంత్రం నుంచే ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుల ఇళ్లవద్ద బారులుతీరారు. నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభమై మూడు రోజుల్లోనే ముగస్తుండటంతో ఇన్నిరోజులు పార్టీ టికెట్పై ఆశలు పెట్టుకున్న ఆశావహులూ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు బుధవారం ఉదయం 10.30 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈమేరకు నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులే ఫైనల్ కాలేదు.. ఓదిక్కు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఇంకా మున్సిపల్ బరిలో నిలిచే తమ అభ్యర్థులను ఏ పార్టీ ప్రకటించలేదు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ప్రతిష్టాత్మకంగా బరిలో దిగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ సీట్ల కోసం పోటాపోటీ వాతావరణం ఉంది. నిర్మల్లో 42 వార్డులు, భైంసాలో 26, ఖానాపూర్లో 12 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్ల లెక్కతేలినా అభ్యర్థుల జాబితాను మాత్రం పార్టీలు తేల్చలేదు. నోటిఫికేషన్ రావడంతోనే వెంటనే షెడ్యూల్ ప్రకటించడం, అందులో బుధవారం నుంచే మూడురోజుల్లోనే నామినేషన్ల గడువు ముగుస్తుండడం ఆశావహులను కలవరపెడుతోంది. ఎవరో ఒకరిపేరు ప్రకటిస్తే.. మిగతావాళ్లు ఏం చేయాలో తేల్చుకుంటామన్న భావనను ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఇళ్లచుట్టూ ఆశావహులు తిరగడం కనిపించింది. నామినేషన్లతోపాటు ప్రచారానికీ సమయం ఎక్కువగా లేకపోవడంతో వారంతా కంగారు పడుతున్నారు. దాదాపు బుధవారం తమ అభ్యర్థులను ఫైనల్ చేయవచ్చని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక ముధోల్: మండల కేంద్రంలో తెలంగాణ ఉత్త ర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, సభ్యుడు రాజాగౌడ్ పాల్గొన్నారు. పలువురు విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేయగా చాలావరకు అక్కడే పరిష్కరించారు. మరికొన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఏఈ శ్రీకాంత్ తెలిపారు. జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలిఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం వన దేవతల జాతర ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. నిర్వాహకులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. భక్తుల కోసం సౌకర్యాలు కల్పించారు. నేటి నుంచే నామినేషన్లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 30వరకు మాత్రమే గడువు ఇచ్చారు. అంటే కేవలం మూడురోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మూడురోజులపాటు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈనెల 31న ఉదయం 11 నుంచి నామినేషన్ పత్రాల స్క్రూటినీ చేపట్టనున్నారు. ఆ వెంటనే సరైన నామినేషన్లు ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలలోపు అప్పీల్కు వెళ్లొచ్చు. వచ్చేనెల 2న అప్పీళ్లను పరిష్కరించనున్నారు. వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వచ్చేనెల 3న సాయంత్రం 3 గంటల వరకు గడువు ఇచ్చారు. 3 గంటల తర్వాత అభ్యర్థుల ఫైనల్ జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఫలితాల ప్రకటన ఉండనున్నాయి. నామినేషన్ కేంద్రాలు ఇవేఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్ సుజాతమున్సిపాలిటీల వారీగా ఓటర్లు మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం నిర్మల్ 47,362 50,824 18 98,204 భైంసా 25,486 25,623 9 51,118 ఖానాపూర్ 8,524 9,169 0 17,693నిర్మల్ మున్సిపాలిటీలో ఈసారి మూడుచోట్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. మున్సిపాలిటీ రెవెన్యూ సెక్షన్లో 1నుంచి 10వ వార్డు వరకు, పైఅంతస్తులోని కౌన్సిల్హాల్లో 11వ వార్డు నుంచి 28వ వార్డు వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 29వ వార్డు నుంచి 42వ వార్డు వరకు జెడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. భైంసాలో మున్సిపల్ కార్యాలయంలో, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. -
సరిహద్దులో కూరగాయల పంట
తానూరు: నిర్మల్ వ్యవసాయ ఆధారిత జిల్లా. 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో సోయా, వరి, పత్తి ప్రధాన పంటలు అయితే సంప్రదాయ పంటలకు భిన్నంగా తానూర్ మండలం జౌలా(కె), వడ్గాం, కోలూరు, కళ్యాణి, జౌలా(బి), ఖర్బాలా, హిప్నెల్లి, ఎల్వి, దాగాం, నంద్గాం, మొగ్లి, బోరిగాం గ్రామాల రైతులు కూరగాయల సాగుతో ఆర్థికంగా స్థిరపడుతున్నారు. సీజన్లతో సంబంధం లేకుండా ఏడాదికి నాలుగు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు వేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. పంట ఉత్పత్తులను స్థానికంగా, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ మార్కెట్లకు పంపి మంచి ఆదాయం పొందుతున్నారు. మార్కెట్ డిమాండ్ మేరకు సాగు.. గతంలో ఈ రైతులు పత్తి, సోయాపై ఆధారపడేవారు. మార్కెట్ అవసరాలను గుర్తించి కూరగాయ ల సాగువైపు మళ్లారు యాసంగిలో మొక్కజొన్న, గోధుమలతోపాటు ఎకరం లేదా రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిశాయి. బావులు, బోర్లలో నీరు ఉంది. రెండు నెలల శ్రమతో పంటలు చేతికొస్తున్నాయని, ఇతర పంటల ఖర్చులను కవర్ చేస్తూ లాభాలు ఇస్తున్నాయని రైతులు చెబుతున్నారు. 250 ఎకరాల్లో పంటలు.. అధికారుల అంచనాల ప్రకారం యాసంగి మండలంలో 250 ఎకరాల్లో వివిధ కూరగాయలు పండిస్తున్నారు. వంకాయలు, టమాటాలు, క్యాబేజీ, మి ర్చి, బెండకాయలు, కాయకూరలు, కొత్తమీర, మెంతికూర, పాలకూర, కరివేపాకు వంటివి ప్రధానం. తక్కువ నీటితో పంటలు వచ్చేందుకు చుట్టుపక్క గ్రామాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. ‘మహా’ రైతుల స్ఫూర్తి.. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. పక్క రాష్ట్రంలో రైతుల లాభాలు చూసి స్ఫూర్తి పొందారు. బోరు బావులు ఉన్న స్థానికులు ఈ పంటలకు మొగ్గు చూపారు. పదేళ్లుగా జౌలా, వడ్గాం, కళ్యాణి, ఖర్బాలా, కోలూరు, మొగ్లి గ్రామాల్లో రైతులంగా కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. పంటలను నిజామాబాద్, భైంసా, ముధోల్, ధర్మాబాద్, ఉమ్రి పట్టణాలకు ప్రత్యేక వాహనాల్లో పంపుతున్నారు. రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, బస్సు సౌకర్యం లేని గ్రామాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
గెలుపు గుర్రాలకే టికెట్
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ తెలిపారు. పట్టణంలో పార్టీ ఎన్నిల ఇన్చార్జి పుల్లారావు యాదవ్తో కలిసి మంగళవారం పర్యటించారు. వార్డుల వారీగా సమీక్ష నిర్వహించారు. పోటీ చేస్తామనే ఆశావాహులంతా పార్టీ నియమాలు, నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. బీజేపీ తరఫున పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో నల్లా రవీందర్రెడ్డి, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, మదిరె శ్రీనివాస్, నాయిని సంతోష్, అనిల్రావు, తోకల బుచ్చన్నయాదవ్, పడాల రాజశేఖర్, ఎనగందుల నారాయణ, ఆసం సాయికృష్ణ, సందుపట్ల శ్రావణ్, బొప్పారపు సత్యవతి, రాపెల్లి రవీందర్, మంత్రరాజం సురేశ్, మట్టేరి రాజశేఖర్, కాశవేణి ప్రణయ్, ఎనగందులకుమార్, నరవేని సాయి, దానిపెల్లి సుధాకర్ పాల్గొన్నారు. -
ఎవరికీ పట్టని వేదికలు
నిర్మల్చైన్గేట్/భైంసారూరల్: రైతులకు లాభదాయక సాగు పద్ధతులు, చీడపీడల నియంత్రణ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సాధించే మార్గాలు సూచించేందుకు గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించింది. ఈ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయితో పంటల పరిశీలన చేస్తారు. నాలుగేళ్ల క్రితం జిల్లాలో 18 మండలాల్లో 79 క్లస్టర్లకు వ్యవసాయ ఇంజినీరింగ్ అధికారులు వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు, ఉపాధి హామీ పథకం నుంచి రూ.10 లక్షలతో నిర్మించారు. అధికారుల సొంత ఖర్చు నిధులు రాకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు సొంత డబ్బులతో వేదికలను నడుపుతున్నారు. ఉదయం–సాయంత్రం అందుబాటులో ఉంటూ రైతులకు సాగు సలహాలు, శిక్షణ ఇస్తున్నారు. ఈ సౌకర్యాలు లేకపోతే రైతులకు క్షేత్రస్థాయి మార్గదర్శకత్వం లోపిస్తుంది. అయితే అధికారులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేస్తే, రైతుల అభివృద్ధికి ఇది బలమైన సాధనంగా మారుతుంది.నిర్వహణ ఖర్చులు.. ప్రతీ రైతు వేదికకు నెలకు రూ.9 వేల నిధులు మంజూరు చేసి, తాగునీరు (రూ.500), శుభ్రత (రూ.3,000), సరఫరా సామగ్రి (రూ.1,000), విద్యుత్ చార్జీలు (రూ.1,000), మరమ్మత్తులు (రూ.1,000), నెలలో 8 సమావేశాలకు టీ–స్నాక్స్(రూ.2,500) వంటి ఖర్చులు చేపట్టాలి. జిల్లా మొత్తంగా 79 వేదికలకు నెలకు రూ.3.60 లక్షలు అవసరం. 2022, ఆగస్టు వరకు నిధులు క్రమబద్ధంగా వచ్చాయి. అనంతరం 40 నెలలుగా మంజూరు ఆగిపోయింది. ఫలితంగా రూ.2.84 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. -
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
నిర్మల్టౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేలా చూస్తామని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కఠినంగా కోడ్ అమలు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ తెలిపారు. డబ్బు, మద్యం, ఓటర్ల ప్రలోభాలతో ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తగిన సిబ్బంది అందుబాటులో ఉంటారని, అవసరమైతే అదనపు బలగాలను మొహరించి ఓటర్లకు భద్రత కల్పిస్తామని వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. లైసెన్స్ ఆయుధాలు ఉన్నవారు సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఆదేశించారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీలు, ధర్నాలు నిషేధం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించొద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, విద్వేషపూరిత లేదా రెచ్చగొట్టే పోస్టులు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే శాంతియుత ఎన్నికలు విజయవంతమవుతాయని, అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని కోరారు. -
అభ్యర్థుల ఎంపికే ముఖ్యం
ఖానాపూర్: త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికే కీలకమని పార్టీ మున్సిపల్ ఎన్నికల ఖానాపూర్ ఇన్చార్జి అబ్దుల్ ముజీబ్ అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో మంగళవారం మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తలను నియమించిన నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జిగా హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ ముజీబ్ను నియమించారు. ఆయన మంగళవారం పట్టణానికి రావడంతో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. -
మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం
నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి మంగళవారం మాట్లాడారు. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానా పూర్ మున్సిపాలిటీల్లో 244 పోలింగ్ కేంద్రాల్లో, 80 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆర్వోలు, ఏఆర్వోలు, ఇతర అధికారుల విధులకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రేపు ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 30వ తేదీ, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని పేర్కొన్నారు. బుధవారం నుంచే వార్డుల వారీ గా ఎలక్టరోల్స్ ప్రదర్శిస్తామన్నారు. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన పూర్తి చేయడంతో పాటు, చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా ను ప్రదర్శిస్తామన్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి, 13న ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలన్నారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు.. అనంతరం ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నా రు. నామినేషన్ల స్వీకరణ మొదలుకుని, పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు బందోబస్తు కల్పిస్తామన్నారు. మద్యం, నగదు రవాణాపై నిఘా ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, భైంసా ఏఎస్పీ రాజేవ్మీనా, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, డీపీఆర్వో విష్ణువర్ధన్, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, సుందర్సింగ్ పాల్గొన్నారు. -
అన్నదాతకు అండగా..
నిర్మల్చైన్గేట్: రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా ఈ పథకానికి 4,454 యూనిట్లు మంజూరు కాగా, ప్రభుత్వం రూ.3.35 కోట్లు కేటాయించింది. సబ్సిడీ వివరాలు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయ సబ్సిడీలు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు పరికర ధరలో 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తుంది. రైతు ఎంపిక చేసుకున్న కంపెనీ ధరలో సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రైతు డీడీ రూపంలో దరఖాస్తతో కలిపి సమర్పించాలి. పెరిగిన సాగు ఖర్చులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు యాంత్రీకరణవైపు మళ్లినప్పటికీ, గత ప్రభుత్వ కాలంలో పథకం ఆగిపోయింది. దీంతో రైతులు సొంత ఖర్చుతో పనిముట్లు కొనుగోలు చేసుకుంటున్నారు. పరికరాల ధరలు ఎక్కువగా పెరగడంతో ఇది భారంగా మారింది. వరి సాగులో ఆధునిక పరికరాలు వచ్చినా, వాటి ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి. ఎన్నికల కోడ్తో ఆలస్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం యాంత్రీకరణ పథకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో రూపొందిన ఈ పథకానికి రూ.3.35 కోట్లు విడుదలయ్యాయి. తొమ్మిది నెలల క్రితం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హుల ఎంపిక పూర్తి చేశారు. సెప్టెంబర్ 17లోగా పరికరాలు అందించాల్సి ఉన్నా, పంచాయతీ ఎన్నికల కోడ్ వల్ల ప్రక్రియ ఆగిపోయింది. త్వరలోనే పూర్తి అమలు జరుగనుంది. చిన్న రైతులకు ప్రయోజనం.. గతంలో పెద్ద ట్రాక్టర్లు పంపిణీ చేసినప్పుడు అవి పెద్ద రైతులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇప్పుడు చిన్న, సన్నకారు రైతులకు సరిపడేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. హార్వెస్టర్లు, పవర్ టిల్లర్లు, ఎంబీ నాగాలు, తైవాన్ స్ప్రేయర్లు, గడ్డి బేలర్ యంత్రాలు, రొటేవేటర్లు వంటి చిన్న పరికరాలు అందిస్తారు. జిల్లాకు 4,454 యూనిట్లు మంజూరయ్యాయి. మంజూరైన పరికరాలు.. పరికరం యూనిట్లు నిధులు రూ.లక్షల్లో బ్యాటరీ ఆపరేటర్మ్యానువల్ 3,228 32.28 పవర్ స్ప్రేయర్ 525 5.25 రోటవేటర్ 239 11.9 పవర్ వీడర్ 50 1.75 సీడ్ అండ్ ఫర్టిలైజర్ 50 1.50 కల్టివేటర్, అదర్స్ 290 58 గట్లు వేసే మిషన్(పీవోటీ కానివి) 6 0.90 బ్రష్ కట్టర్ 41 14 పవర్ టిల్లర్ 25 25 -
వేడెక్కిన ‘పుర’ రాజకీయం
నిర్మల్/నిర్మల్చైన్గేట్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే, పార్టీలు అభ్యర్థులను ప్రకటించక ముందే పట్టణాల్లో రాజకీయాలు వేడెకుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ఓవైపు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలు సైతం మెజారిటీ స్థానాలు కై వసం చేసుకోవడం కోసం ఎత్తులు వేస్తున్నాయి. జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఆశావహుల సందడి నెలకొంది. ముందస్తు ప్రచారం.. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండడంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. షెడ్యూల్ వెలువడకముందే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కనిపించని వారు ఇంటింటికీ తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పలకరిస్తూ.. పనులు చేస్తూ.. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోఎన్నికల బరిలో నిలవడానికి ఆసక్తితో ఉన్నవారంతా జనం బాట పట్టారు. ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన చెట్లు, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తున్నారు. కొందరు డ్రెయినేజీలు శుభ్రం చేయించగా, మరికొందరు విద్యుత్ దీపాలు, పైపులైన్ల మరమ్మతులు చేయించడంపై దృష్టి సారించారు. ప్లాన్–బి సిద్ధం... రిజర్వేషన్ కలిసి వచ్చినప్పటికీ టికెట్ రాకుంటే ఏం చేయాలా అన్న దానికి ప్లాన్–బీతో రెడీగా ఉన్నారు. వార్డులో ఇతర ఆశావహునికి తాము కోరుకున్న పార్టీ టికెట్ వస్తే ఇండిపెండెంట్గానైనా, కండువా మార్చుకుని అయినా బరిలో దిగాలన్న ఆలోచనతో ముందుస్తుగానే ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా రంగంలోకి దిగేందుకు అవసరమైన అంగబలం, అర్ధబలం సిద్ధం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకునేందుకు ఫొటోలు, వీడియోలతో సిద్ధంగా ఉన్నారు. -
ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం అలసత్వం
ఖానాపూర్: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ విమర్శించారు. ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారందరికీ తనవంతు సాయంగా రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం చెల్లిస్తానని హామీ ఇచ్చి డ్రైవర్ల వివరాలు సేకరించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆటో డ్రైవర్లకు బీమా ప్రీమియం చెల్లిస్తానని ప్రకటించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతోందని విమర్శించారు. రూ.5 లక్షల బీమా రద్దు చేసి ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అసంఘటితరంగ కార్మికులకు రైతుబీమా తరహాలో రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ నుంచి బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.1,000 చొప్పున (సంవత్సరానికి రూ.12,000) సహాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ రెండేళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదన్నారు. ప్రతీ ఆటో డ్రైవర్కు ప్రభుత్వం రూ.24 వేల బాకీ ఉందని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన సంక్షేమ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3 వేల మందికిపైగా ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారికి ప్రభుత్వం బీమా కట్టకపోవడంతో వ్యక్తిగతంగా తానే బీమా ప్రీమియం చెల్లిస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, రాజగంగన్న, శ్రీనివాస్, ప్రదీప్, కేహెచ్.ఖాన్, షోయబ్, సుమిత్, రాకేశ్, చంద్రహాస్, వాల్సింగ్, వాహబ్, రాజు, డ్రైవర్లు పాల్గొన్నారు. -
గణతంత్ర స్ఫూర్తితో ప్రజాపాలన
నిర్మల్మాట్లాడుతున్న కలెక్టర్ అభిలాష అభినవ్ శివంగి దళానికి సెల్యూట్ చేస్తున్న కలెక్టర్, ఎస్పీ నిర్మల్: ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు జిల్లాలో అమలు చే స్తూ, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి తో ప్రజాపాలన అందిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నా రు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్అహ్మద్, కిశోర్కుమార్, భైంసా సబ్కలెక్టర్ సంకేత్కుమార్, నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి, ఏఎస్పీలు రాజేశ్మీనా, సాయికిరణ్, ఉపేంద్రారెడ్డి, ఐఎఫ్ఎస్ సుశాంత్సుఖ్దేవ్ బోబడే పాల్గొన్నారు. కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన సందేశాన్ని వినిపించారు. పేదలకు ఇళ్లు.. రైతులకు భరోసా.. ప్రజాపాలనలో భాగంగా పేదలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ అభిలాషఅభినవ్ పేర్కొన్నారు. పేదల సొంతింటి కల ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో.. జిల్లాలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనలో పలుఅభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతామన్నారు. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పురప్రముఖులు పాల్గొన్నారు.జాతీయ జెండాతో చిన్నారి -
నిబద్ధతతో విధులు నిర్వహించాలి
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధులను గౌరవిస్తూ.. ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు విధులు నిర్వహించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 77వ గణ తంత్ర దినోత్సవాన్ని సోమవారం నిర్వహించా రు. ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయ సేవలు అందించడమే పోలీస్ వ్యవస్థ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, సాయికిరణ్, ఎస్సైలు ఆర్ఎస్సైలు, పోలీస్, డీపీవో పాల్గొన్నారు. 10న బాసర హుండీ లెక్కింపు బాసర: బాసర అమ్మవారి ఆలయ హుండీలను ఫిబ్రవరి 10న లెక్కించనున్నట్లు ఈవో అంజనాదేవి తెలిపారు. మొదట ఈనెల 28 లెక్కించాలని నిర్ణయించారు. అనివార్య కారణాలతో 10వ తేదీకి వాయిదా వేశారు. -
రాజ్యాంగ రథయాత్ర
నిర్మల్టౌన్: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో రాజ్యాంగ రథయాత్ర నిర్వహించారు. స్థానిక మంచిర్యాల చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు భారత రాజ్యాంగ విలువలు తెలుసుకుని, పూలే, అంబేడ్కర్, కాన్షీరాం మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, జిల్లా అధ్యక్షుడు సాయన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ పోశెట్టి, గౌరవ అధ్యక్షుడు బర్మ చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి రాజులదేవి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆవరణంలో గణతంత్ర వేడుకలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణంలో 77వ గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి శ్రీవాణి జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల త్యాగాలను గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, న్యాయవాదులు రాజశేఖర్, రమణ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయంలో.. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మున్సిపల్ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జెండాను ఆవిష్కరించి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, ఆర్వో రాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి
నిర్మల్చైన్గేట్: తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సాధనకు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీమ శ్రీనివాస్, విశిష్ట అతిథిగా మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమబోర్డు, ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి రూ.25 వేల పెన్షన్, గుర్తింపు కార్డులను ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతూనే ఉందన్నారు. ఉద్యమకారుల ఐక్యతతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల డిమాండ్ల సహేతుకమైనవని , ఆ రోజుల్లో తెలంగాణ అంశం లేవనెత్తినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశానన్నారు. ఉద్యమకారుల డిమాండ్లు ముఖ్యమంత్రి వద్దకు ప్రస్తావించి డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు . టీయూఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ చైర్మన్ కొట్టే శేఖర్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముష్కం రామకృష్ణగౌడ్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, సీనియర్ ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. -
వృక్షశాస్త్రంలో..
వృక్షశాస్త్రంలో 30 మార్కులు సాధించా లంటే విద్యార్థులు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా చదవాలని మామడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వృక్షశాస్త్రం అధ్యాపకుడు పురుషోత్తం అంటున్నారు. ప్రధానంగా ఇందులో 5 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న వృక్ష వర్గీకరణ శాస్త్రంకు సంబంధించి 3 కుటుంబాలపై అడుగుతారు. ఇందులో మొక్క శాఖీయ లక్షణాలతోపాటు, పుష్ఫ లక్షణాలు రాయాలి. దీనికి 6 మార్కులు కేటాయించారు. రెండో ప్రశ్న కాండం అడ్డుకోతపై ఉంటుంది. దీనికి 6 మార్కులు ఇచ్చినది సెక్షన్ తీసి దాని గుర్తింపు లక్షణాలు రాయాలి. మూడోది వృక్ష శరీరధర్మ శాస్త్రంరం ప్రయోగాల నుంచి వస్తుంది. దీనికి 6 మార్కులు ప్రయోగం ఉద్దేశం, సూత్రం, పరిశీలన, అనుమితి రాయాలి. స్లైడ్స్, స్ఫెసిమెన్స్లకు 5 మార్కులు, ఇక మిగిలిన 7 మార్కులలో 2 మార్కులు హెర్బేరియం, 5 మార్కులు రికార్డుకు ఉంటాయి. మన దైనిందిన జీవితంలో ఉండే మొక్కలు సేకరించాలి. పటాలు వేయడం, పుష్ప సంకేతంపై దృష్టి సారిస్తే 30 మార్కులు పొందడం సులభం. -
ముగిసిన వన్యప్రాణుల గణన
నిర్మల్టౌన్: ఈనెల 20 నుంచి నిర్వహించిన వ న్యప్రాణుల గణన ఆదివారంతో ముగిసింది. ఆరు రోజులుగా శాఖాహార, మాంసాహార జంతువులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి ప్ర త్యక్ష, పరోక్ష ఆధారాలను మొబైల్ యాప్లో న మోదు చేశారు. జిల్లాలో 102 బీట్లో వన్యప్రాణుల గణన చేశారు. దీనిలో బీట్ అధికారులు, సెక్షన్ డిప్యూటీ రేంజ్ అధికారులు పాల్గొన్నా రు. వీరితోపాటు ఎన్జీవో సభ్యులు, 60 మంది వలంటీర్లు పాల్గొన్నారు. వన్యప్రాణుల గణనలో పాల్గొన్న వలంటీర్లకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో నిర్మల్ ఎఫ్డీవో నాగిని భాను ప్రశంసాపత్రాలు అందజేశారు. ఖానాపూర్ డివిజన్లో.. ఖానాపూర్: ఖానాపూర్ డివిజన్ పరిధిలో జంతు, వృక్ష గణన విజయవంతంగా ముగిసిందని ఖానాపూర్ ఎఫ్డీవో శివకుమార్ తెలి పారు. పట్టణంలోని ఎఫ్డీవో కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సర్వే వివరాలన్నీ ఆన్లైన్ ద్వారా యాప్లో అప్లోడ్ చేశామన్నారు. త్వరలో సర్వే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం గణనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారికి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎఫ్ఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రతీ పౌరుడు ఓటుహక్కు వినియోగించుకోవాలి
నిర్మల్చైన్గేట్: ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సమాజంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి సూచిక అని, భారతదేశంలో ఓటు హక్కు అమలైన తీరును వివరించారు. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, పిల్లలందరికీ చిన్ననాటి నుంచే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలపాలన్నారు. అంతకుముందు సమావేశానికి హాజరైన వారితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాలలో పాలుపంచుకున్న విద్యార్థులు, అధికారులకు, క్రమం తప్పకుండా పలు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లను, కలెక్టర్ సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం సైకిల్ ర్యాలీని కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. ఉత్తమ ఎలక్టోరల్ అవార్డు లక్ష్మణచాంద: ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గంలో ఉత్తమ ఎలక్టోరల్ అవార్డును లక్ష్మణచాంద తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మహేందర్ ఎంపికయ్యారు. కలెక్టర్ అభిలాష అభినవ్ అవార్డు అందించారు. ఇందులో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి ఉన్నారు. -
ప్ర
నిర్మల్ణాళికతో యోగంలో వ్యాసరచనలో సోన్ విద్యార్థిని ప్రతిభ లక్ష్మణచాంద: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సోన్ జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న ఆరేపల్లి రాజశ్రీ ప్రతిభ కనబర్చింది. కలెక్టర్ అభిలాష అభినవ్ రాజశ్రీని అభినందించి ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థినిని హెచ్ఎం ఆరాధన, ఉపాధ్యాయులు అభినందించారు. లక్ష్మణచాంద: ఇంటర్ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రయోగ పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చని అధ్యాపకులు సూచిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు వార్షిక పరీక్షలకు చదివినట్లుగానే ప్రయోగాలకు సన్నద్ధంగా ఉండా లంటున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు మరో వారం మాత్రమే గడువు ఉందని, సీసీ కెమెరాల నిఘాతో జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు పూర్తి సిద్ధత కావాలని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ టైంటేబుల్లో ప్రత్యేక స్లాట్లు కేటాయించి, పాత ప్రయోగాలు పునరావృత్తం చేయిస్తున్నట్లు తెలిపారు. -
మున్సిపల్ కార్యాలయం తరలించొద్దు
ఖానాపూర్: పట్టణంలోని సాయినగర్ కాలనీలో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని తరలించొద్దని హన్మాన్మందిర్ కాలనీవాసులు కోరారు. కాలనీలోని పాఠశాలలోఆదివారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కాలనీలో అభివృద్ధిలో వెనుకబడిందని, భూములు, ప్లాట్ల ధరలు పడిపోయాయన్నారు. ఉన్న కార్యాలయాన్ని తరలిస్తే కాలనీ అభివృద్ధిలో మరింత వెనుకబడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని రోడ్డుపై లీకేజీలను నిర్మూలించలేని నాయకులు కాలనీని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. సమావేశంలో ఆయిందాల జనార్దన్, నాయిని శంకర్, నాయిని రాజేశ్వర్, బిల్ల రాజేశ్వర్, కరిపె రాజశేఖర్, నాగరాజు, నిమ్మల సాయి, ఎలిశెట్టి మహేశ్, గోపాల్, ప్రణీత్, ప్రవీణ్, మహేశ్, భూమరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాలతో కదలిక
నిర్మల్: ‘ఏంటి నాన్నా.. మన నిర్మల్కు ఇంత హి స్టరీ ఉందా..!?’ ‘ఏంటమ్మా.. మన ఏరియా కూడా హిస్టారికల్ ప్లేసా..!?’ అని పిల్లలు అడుగుతుంటే చాలామంది తల్లిదండ్రులు అవునని తలూపుతూ నే.. లోలోపల తమకూ ఇప్పుడిప్పుడే మన చరిత్ర తెలుస్తోందని ఫీల్ అవుతున్నారు. ‘మరి మన నిర్మ ల్ గురించి, రాంజీగోండు చేసిన ఫైట్ గురించి మా సోషల్బుక్స్లో ఎందుకు లేదు..?’ అనే ప్రశ్నకు చాలామంది సమాధానమివ్వడం లేదు. తమకుతాము ఇప్పుడిప్పుడే ‘అవును.. మా ఏరియా హిస్టరీ ఎందుకు బయటకు రావడం లేదు..’ అని ప్రశ్నించుకుంటున్నారు. వారసత్వ వేడుకలుగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘నిర్మల్ ఉత్సవాలు’ నేటితరంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా తమదైన చరిత్రను తెలుసుకుంటున్న నేటితరం గర్వంగా ఫీలవుతున్నారు. ఇక్కడి చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు చరిత్రను ముందుతరాలకు అందేలా చేయాలంటూ పాలకులు, అధికారులను కోరుతున్నారు. చాలామంది నేరుగా కలెక్టర్ అభిలాషఅభినవ్ దృష్టికీ తీసుకెళ్లారు. ఈక్రమంలో కలెక్టర్ జిల్లాలో మ్యూజియం ఏర్పాటుతోపాటు ఒకట్రెండు గఢ్లనూ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మ్యూజియం ఏర్పాటు.. జిల్లాలో ఒక మ్యూజియం ఏర్పాటు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి ముందడుగు పడనుంది. గతంలో కలెక్టర్గా పనిచేసిన వరుణ్రెడ్డి హయాంలోనూ నిర్మల్లో హిస్టారికల్ మ్యూజియం ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. సమీకృత కలెక్టరేట్ నిర్మా ణం తర్వాత ఆఫీసులన్నీ అక్కడికి తరలిపోవడంతో, ఖాళీ అయిన పాత ఆర్అండ్బీ కార్యాలయాన్ని మ్యూజియంగా మార్చాలన్న యోచన చేశారు. ఎదురుగా ఉన్న సర్డ్మహల్(శీతలమందిరం) అభివృద్ధికీ ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అంతలోనే 2023 అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆయన బదిలీ కావడంతో ఆ పనులు, ప్రతిపాదనలు అలాగే నిలి చిపోయాయి. తాజాగా జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుండటం, అలాగే చరిత్రను కాపాడాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ మ్యూజియం ఏర్పాటు దిశగా యోచిస్తున్నారు. గఢ్ల అభివృద్ధి.. అడుగడుగునా ఉన్న రాతికట్టడపు గఢ్లు నిర్మల్ చరిత్రను ఇప్పటికీ కళ్లకు కట్టిస్తున్నాయి. ఈ ప్రాంత రాచరికపు ఠీవిని ప్రదర్శిస్తున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మల్–నిజామాబాద్ మార్గంలోని శ్యాంగఢ్, నిర్మల్–ఎల్లపల్లి దారిలో గల బత్తీస్గఢ్ల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. కానీ.. అవి కేవలం బయట గోడలకు పూతలు పూయడానికి మాత్రమే సరిపోయాయి. లోపల నామమాత్రంగా కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదు. కలెక్టర్ ప్రశాంతి శ్యాంగఢ్ లోపల అక్కడక్కడ కూర్చోవడానికి సిమెంట్ కుర్చీలు వేయించారు. బయట అభివృద్ధి చేసేలోపు ఆమె బదిలీ అయ్యారు. ముషరఫ్అలీ కలెక్టర్గా ఉన్న సమయంలో నిర్మల్ సుందరీకరణలో భాగంగా శ్యాంగఢ్ చుట్టూ లైటింగ్ పెట్టించారు. ఇప్పుడు కలెక్టర్ అభిలాషఅభినవ్ స్థానిక సమీకృత కలెక్టరేట్కు దగ్గరలో ఉన్న బత్తీస్గఢ్ను అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామని చెబుతున్నారు.ప్రతిపాదనలు చేస్తున్నాం.. జిల్లాకేంద్రంలో రెండేళ్లుగా నిర్వహిస్తున్న ‘నిర్మల్ ఉత్సవాలు’ విజయవంతం కావడం హర్షనీయం. జిల్లా చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఓ మ్యూజియం ఏర్పాటుతోపాటు గఢ్ల అభివృద్ధికీ ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికీ తీసుకెళ్తాం. – అభిలాషఅభినవ్, కలెక్టర్ -
ఆ రైళ్లు ఆగేదెప్పుడో..!
ఆదాయం ఉన్నా రైళ్లేవి?ఆదాయం ఉన్నా మంచిర్యాల రైల్వేస్టేషన్లో ఆ రైళ్ల నిలుపుదల సంఖ్య తక్కువే. ఇక్కడ స్టాఫ్ ఉన్నా తక్కువ రైళ్లతోనే ప్రయాణికుల నుంచి ఆదాయం అధికంగా వస్తున్నట్లు తెలు స్తోంది. 2024–25లో రైల్వే వార్షిక ఆదాయపరంగా చూస్తే దాదాపు మంచిర్యాల రైల్వేస్టేషన్ రూ.21 కోట్లతో ఎన్ఎస్జీ–3 కేటగిరిలో చోటు లభించింది. రామగుండానికి రూ.15 కోట్లు, పెద్దపల్లి జంక్షన్కు రూ.11 కోట్లు, సిర్పూర్కు రూ.11 కోట్లతో ఎన్ఎస్జీ–4వ కేటగిరి లో చోటు దక్కింది. తక్కువ ఆదా యం ఉన్నా బెల్లంపల్లికి 5వ కేటగిరి పరిగణిస్తున్నారు. ఎన్ఎస్జీ–4వ గ్రేడ్ రైల్వేస్టేషన్ సిర్పూర్కాగజ్నగర్లో 124 రైళ్ల హాల్ట్ ఉన్నప్పటికి దాదాపు రూ.11 కోట్లు కాగా, మంచిర్యాలలో 83 రైళ్ల హాల్ట్తో రూ.20 కోట్లపై ఆ దాయం ఉన్న అనుకున్నమేర హాల్టింగ్ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పనులతో రద్దు..జాతరకు ప్రత్యేక రైళ్లు!మంచిర్యాలఅర్బన్: మేడారం జాతర వేళ రైల్వేశా ఖ నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల నుంచి మే డారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈనెల 28, 30 ఫిబ్రవరి 1 తేదీ ల్లో మంచిర్యాల నుంచి మధ్యాహ్నం 3.30 గంట లకు బయల్దేరి రాత్రి 10.10 గంటలకు సి కింద్రాబాద్కు చేరుకుంటుంది. 28, 30, ఫిబ్రవరి 1 తేదీ ల్లో ఉదయం 5.45 గంటలకు అక్కడి నుంచి బ యల్దేరి మధ్యాహ్నం 1.30గంటలకు మంచి ర్యాలకు చేరుకోనుంది. జనసాధారణ్ పేరుతో రైలు లో రిజర్వేషన్ బోగీలు ఉండవని ప్రకటించింది. 29, 31 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ కు ఉదయం 5.45 గంటలకు బయల్దేరి కాగజ్నగర్కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు. తిరిగి కాగజ్నగర్ నుంచి మధ్యాహ్నం 2.20 బయల్దేరి సికింద్రాబాద్ కు రాత్రి 10.10 గంటలకు చేరుకుంటుందన్నారు. ఇంటర్ లాకింగ్ పనులతో రైళ్లు రద్దుమందమర్రి నుంచి బెల్లంపల్లి మధ్య 10 కి.మీ మూడవ రైల్వే మార్గం అందుబాటులోకి తీసుకురావడానికి నాన్, ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని పాక్షికంగా, ఇంకొన్ని దారిమళ్లించి ప్రయాణికులు ప్రత్నామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ద.మ. రైల్వే జోన్ అఽధికారులు సూచించారు. ఈనెల 24 నుంచి 17003 కాజీపేట్ నుంచి సిర్పూర్ టౌన్, 17004 బల్లార్షా నుంచి కాజీపేట్ రామగిరి మెము ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 14వ తేదీ వరకు రద్దు చేశారు. ఈనెల 23 నుంచి ఫిబ్రవరి 13 వర కు 17035 కాజీపేట్ నుంచి బల్లార్షా ఎక్స్ప్రెస్, ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 17036 బల్లార్షా నుంచి కాజీపేట్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 17033 భ ద్రాచలం రోడ్డు నుంచి బల్లార్షా, 17034 సిర్పూ ర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్డు వరకు నడిచే సింగరేణి మెము ఎక్స్ప్రెస్ వరంగల్ నుంచి బల్లార్షా, సిర్పూర్ టౌన్ నుంచి వరంగల్ మధ్య పాక్షికంగా రద్దయింది. వరంగల్ నుంచి భద్రాచలం వరకు యధాతథంగా నడస్తుందని అఽధికా రులు తె లిపారు. బోధన్–కరీంనగర్–సిర్పూర్టౌన్ ప్యా సింజర్ రైలు ఫిబ్రవరి 14 వరకు రద్దు చేశారు. -
పెండింగ్ డీఏలు ప్రకటించాలి
మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయుల పెండింగ్ ఐదు డీఏలు ప్రకటించి పీఆర్సీని అమలు చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ అన్నారు. మంచిర్యాలలో ఆదివారం నిర్వహించిన తపస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, జీవో 317తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహఅధ్యక్షుడు బండి రమేశ్, వెబ్సైట్ వింగ్ కన్వీనర్ విద్యాసాగర్, మహిళా కోకన్వీనర్ రమాదేవి పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం..తపస్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బగ్గని రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా భారతీ ఆశోక్, ఉపాధ్యక్షులుగా సమ్మయ్య, నీలేష్కుమార్, శ్రీనివాస్, శ్రీధర్, రాజ్యలక్ష్మి, సత్తిరెడ్డి, నాగరాజ్, కార్యదర్శులుగా పి.శ్రీనివాస్, నాగేందర్, తిరుపతి రెడ్డి, రజిత, శ్రీకాంత్, శ్రీరాములు, ఎగ్జిక్యూటివ్ మె ంబర్లు, సోషల్ మీడియా, స్పోర్ట్స్, కల్చరల్, సేవా వింగ్తోపాటు పలువురిని ఎన్నుకున్నారు. -
భారత్ పర్వ్–2026కు ఎంపిక
కోటపల్లి: గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఈనెల 26 నుంచి 31 వరకు నిర్వహించే భారత్ పర్వ్–2026కు మండలంలోని కొల్లూర్కు చెందిన నిమ్మల విజయ్కుమార్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, కళలు, వారసత్వాన్ని చాటిచేప్పే భారీ ప్రదర్శనలో రాష్ట్రం తరపున జానపద నృత్యాలు ప్రదర్శించనున్నారు. గ్రామస్తులు, నాయకులు విజయ్కుమార్ను అభినందించారు. పొచ్చెర జలపాతం వద్ద వింటర్ క్యాంప్ బోథ్: ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి ఔత్సాహికులు పొచ్చెర జలపాతం వద్ద వింటర్ క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ పులుల గణనలో భాగంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వలంటీర్లు, నేచర్ సొసైటీ సభ్యులు ప్రత్యేకంగా నైట్ క్యాంపు ఏర్పాటు చేశారు. రాత్రంతా అక్కడే బస చేశారు. ఉదయం అటవీ అందాలు, జలపాతాలను చూసి వలంటీర్లు అబ్బురపడ్డారు. పొచ్చెర జలపాతం వద్ద సహజ సిద్ధమైన ప్రకృతిని చూసి వారు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
కలప పట్టివేత
ఇచ్చోడ: గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ అటవీ డివిజనల్ అధికారి చిన్న విశ్వనాథభూస్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పక్కా సమాచారంతో శనివారం రాత్రి అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కొందరు ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకుని ఇచ్చోడ ప్రభుత్వ టింబర్ డిపోకు తరలించారు. నిందితులు రాంటెంకి శ్రీకాంత్, దుర్గం నవీన్, రాంటెంకి వికాస్, జాడే రంజిత్, గొల్లపల్లి కిరణ్, కడారి మల్లేశ్, బోర్లకుంట సునీల్, పిప్పాల విజయ్, దుర్గం భగవాండ్లపై కేసులు నమోదు చేశారు. మొత్తం 122 కలప సైజులు ఉండగా, వీటి విలువ రూ.1,60,876 ఉన్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కలప అవసరమైన వారికి ఇచ్చోడ ప్రభుత్వ కలప డిపోలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చోడ, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, బోథ్ ఎఫ్ఆర్వోలు టి.పుండలిక్, గులాబ్సింగ్, సంతోష్, ప్రణయ్, బజార్హత్నూర్, ఇచ్చోడ డిప్యూటీ ఏఆర్ఓలు ప్రవీణ్ మహాజన్, ఇబ్రహీం షరీఫ్, గుడిహత్నూర్ ఎఫ్ఎస్ఓ ఇమ్రాన్, దామన్గూడ ఎఫ్బీఓ బి.ప్రశాంత్ పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని చుక్కల దుప్పి మృతి
భీమారం: మండలంలోని మాంతమ్మ సమీపంలో రోడ్డు దాటుతున్న చుక్కలదుప్పిని ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మంచిర్యాల అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ జి.రత్నాకర్ రావు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఘటన స్థలాన్ని మంచిర్యాల ఎఫ్డీవో సర్వేశ్వర్ పరిశీలించారు. యువకుడిని కాపాడిన ఆటోడ్రైవర్బాసర: బాసర గోదావరి బ్రిడ్జిపై దూకేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని ఆదివారం ఆటోడ్రైవర్ కాపాడాడు. నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ షకీర్, రిపోర్టర్ లతీఫ్ గమనించారు. యువకుడు మద్యం మత్తులో గోదావరిలో దూకేందుకు యత్నించగా కాపాడి ఆటోలో బాసరకు తరలించారు. -
సాగు పనులను అడ్డుకున్న ఎఫ్బీవోపై దాడి
రెబ్బెన: రెబ్బెన రేంజ్ పరిధి తక్కళ్లపల్లి బీట్లో అటవీశాఖ భూమిలో సాగు పనులను అడ్డుకున్న ఎఫ్బీవో ఎండీ అయాజ్పై ముగ్గురు దాడికి పాల్పడ్డారు. రెబ్బెన ఫారెస్ట్ రేంజ్ అధికారి భానేష్ వివరాల ప్రకారం.. టైగర్ ఎస్టిమేషన్ ప్రక్రియలో భాగంగా వన్యప్రాణుల గణన పూర్తిచేసుకుని అయాజ్ వస్తున్నాడు. ఆదివారం తక్కళ్లపల్లి బీట్లోని 336 కంపార్టుమెంట్లో సప్ప రాజశేఖర్ అటవీశాఖ భూమిలో పంట సాగు పనులు చేస్తూ కనిపించాడు. ఎఫ్బీవో అడ్డుకోగా రాజశేఖర్ దురుసుగా ప్రవర్తించాడు. తన వద్ద పట్టా ఉందని తెలపగా రెవెన్యూ, అటవీశాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి వివాదంలో ఉన్న భూమి సమస్య పరిష్కరించుకోవాలని ఎఫ్బీవో సూచించి అడ్డుకోబోయాడు. రాజశేఖర్, తల్లి సప్ప లక్ష్మి, మామ పుప్పాల రమేశ్ కర్రతో అతనిపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. -
నాగోబాకు మొక్కులు
ఇంద్రవెల్లి:ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కా వడంతో ఆలయం జనసంద్రమైంది. దర్శనం కో సం బారులు తీరారు. అనంతరం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమి షన్ చై ర్మన్ బక్కి వెంకటయ్య ప్రత్యేక పూజలు అ నంతరం దర్శించుకున్నారు. మెస్రం వంశీయులు ఆయన్ను శాలువాతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని బహూకరించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, రాంబాబు నాయక్, శంకర్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, అధికారులు సునీత, అంబాజీ, నర్సింగ్, నారాయణరెడ్డి, సర్పంచ్ తుకారాం, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావు ఉన్నారు. -
ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మృతి
నెన్నెల: గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం..మండలంలోని కోణంపేటకు చెందిన దుర్గం సౌమ్య(28)కు 2022లో గుండ్లసోమారం గ్రామానికి చెందిన రాజ్కుమార్తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కొన్నిరోజుల నుంచి సౌమ్య కడుపునొప్పితో బాధపడుతోంది. తరచూ మాత్రలు వేసుకునేది. ఈనెల 21న మధ్యాహ్నం కడుపునొప్పి తీవ్రం కావడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు ఆమెను ఆటోలో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. ఆదివారం మృతదేహానికి పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
జూడో చాంపియన్షిప్ పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి ఎల్.లక్ష్మణ్ జూనియర్ నేషనల్ జూడో చాంపియన్షిప్ పోటీల్లో సత్తాచాటాడు. పశ్చిమబెంగాల్ కోల్కతాలో జరుగుతున్న ఈ పోటీల్లో రజత పతకంతో మెరిశాడు. – 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. రాష్ట్రానికి జాతీయ స్థాయి జూనియర్ పోటీల్లో జూడోలో వచ్చిన మొట్టమొదటి రజత పతకం అందుకోవడం విశేషం. సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్, డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, డీటీఎస్ఓ పార్థసారథి, కోచ్ రాజు అతన్ని అభినందించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్
నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపల్ అధికారులు పన్ను ల వసూలుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా పట్టణంలోని అద్దె భవనంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఓ ప్రైవేట్ పాఠశాలను శని వారం సీజ్ చేశారు. పాఠశాల యాజమాన్యం రూ.2 లక్షలకుపైగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రూ.87,297 పన్ను బకాయి ఉన్నట్లు తెలిపారు. 15 రోజుల క్రితం రెడ్ నోటీసులు జారీ చేశారు. అయినా అలసత్వం వహించడంతో పాఠశాలను, సబ్ రిజిస్ట్రార్ కార్యాయాన్ని సీజ్ చేశామని అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ అధికారి రాజు, బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
నిర్మల్చైన్గేట్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్చార్జి సుదర్శన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటే ల్ అధ్యక్షతన శనివారం నిర్మల్లో నిర్వహించారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సర్వేల ఆధారంగా అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి బోస్లే నారాయణరావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎంబడి రాజేశ్వర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, జిల్లా, నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ముగిసిన నిర్మల్ ఉత్సవాలు
జానపద నృత్య ప్రదర్శనలో యువతులునిర్మల్చైన్గేట్: నిర్మల్ జిల్లా చరిత్ర, వారసత్వం, కళావైభవానిన చాటిచెబుతూ ఆరు రోజులు నిర్వహించిన ’నిర్మల్ ఉత్సవాలు’ శనివారం ముగిశాయి. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 19 నుంచి వేడుకలు నిర్వహించారు. జిల్లా చరిత్రలు తెలిపే ప్రదర్శనలు, నాటకాలు, సాసం్కృతిక కార్యక్రమాలు, జానపద కళలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్, హస్తకళల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రత్నకళ్యాని, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అధికారులు, సిబ్బంది, నిర్వాహకులు, ప్రజల సహకారంతో వేడులు విజయవంతమయ్యాయని తెలిపారు. చిన్నారుల నృత్య ప్రదర్శన.. -
నిర్మల్
నా దేశం నా ఓటు ప్రజాస్వామ్యంలో ఓటు తిరుగులేని ఆయుధం. పాలించేవారిని ఎన్నుకోవడానికి వాడే గొప్ప వజ్రాయుధం. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కథనం..వంద శాతం ఫలితాలు సాధించాలి లక్ష్మణచాంద: విద్యార్ధులు వంద శాతం ఫలితాలు సాధించేలాగా చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాధ్ జిల్లా ఎంజేపీ ఆర్సీవో శ్రీధర్ అన్నారు. మండలంలోని రాచాపూర్ మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. కిచెన్లోకి వెళ్లి వంట సరుకులను, తయారు చేసిన వంటను పరిశీలించారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రణాళికతో చదవాలని సూచించారు. పరీక్షలంటే భయం వీడాన్నారు. అనంతరం ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. ప్రయోగ పరీక్షలకు సన్నద్ధతపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.నిర్మల్చైన్గేట్: పేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్ష చొప్పున మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. మొదటి విడతలో జిల్లాలోని 18 మండలాల్లో 9,172 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముగ్గుపోసి ఇళ్ల నిర్మాణ పనులు అధికారులు ప్రారంభించారు. నిర్మాణ దశల ఆధారంగా బిల్లులు మంజూరు చేస్తున్నారు. అయితే ఇళ్లు మంజూరు చేసి ఏడాదైనా జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 28 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. లబ్ధిదారుల్లో చాలా మంది నిర్మాణం మొదలు పెట్టలేదు. దీంతో సుమారు 1,431 మంది ఇళ్లను రద్దు చేశారు. నిబంధనలతో అనాసక్తి.. ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారులు నిర్మాణాలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో పురోగతి కనిపించడంలేదు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా అధికారులు విభజించారు. ఒక్కో ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. నాలుగు విడతల్లో లబ్ధిదారులకు రూ.5 లక్షలు చెల్లించనున్నది. ఈ నిబంధనలతో చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. మొదట మండలానికి ఒక పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ గ్రామాల్లోనూ నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. తర్వాత మంజూరైన ఇళ్ల నిర్మాణంలోనూ జాప్యం జరుగుతోంది. కూలీలకు ఫుల్ డిమాండ్.. గతంలో కూలీల్లో పురుషులకు రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతం రూ.1200 నుంచి రూ.1500 అడుగుతున్నారు. మహిళలకు రూ. 500 ఉండగా రూ. వెయ్యి డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూలీలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలోని ఓ గ్రామంలో పునాది దశలోనే ఉన్న ఇందిరమ్మ ఇల్లు మండుతున్న ధరలు.. ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. మొత్తం మంజూరు 9,172 ప్రొసీడింగ్ పొందినవారు 7,741 మార్కౌట్ అయినవి 6,355 బేస్మెంట్ అయినవి 4,631 గోడలు పూర్తయినవి 2,485 స్లాబు పూర్తయినవి 1,536 ఇంటి నిర్మాణం పూర్తి 28 ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 525 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. పథకం ప్రారంభ దశలో బస్తా ధర రూ.280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్ను బట్టి బస్తా రూ.50 నుంచి 80 వరకు అదనంతో విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ.1,47,000కు సిమెంట్ వచ్చేది. ప్రస్తుత రేటుతో సుమారు రూ.1.80 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారు సిమెంటు కోసమే అదనంగా రూ.33 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సిఉంది. కానీ ఇసుక రవాణాదారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుక రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. వెయ్యి ఇటుకలకు ధర గతంలో రూ.6 వేలు ఉండగా ప్రస్తుతం రూ.9,500 పలుకుతోంది. అలాగే స్టీల్ ధర సైతం అమాంతం పెరిగింది. బేస్మెంట్ నిర్మాణంతోపాటు పిల్లర్లు స్లాబ్కు అవసరమయ్యే 20 ఎంఎం. కంకర ధర ట్రాక్టరుకు రూ.4,500 ఉండగా ప్రస్తుతం రూ.5,100 పలుకుతోంది. -
దళితులను వేధించొద్దు
లక్ష్మణచాంద: దళితులను వేధించొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో శనివారం పర్యటించారు. గ్రామంలోని దళితులకు చెందిన భూములను వారి ఇష్టానికి విరుద్ధంగా, బలవంతంగా తీసుకుంటున్నారన్న ఫిర్యాదు మేరకు గ్రామాన్ని సందర్శించారు. భూయజమానులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూయజమానుల సమ్మతి లేకుండా వారి భూములను స్వాధీనం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించే అధికారం ఎవరికీ లేదన్నారు. దళితుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. దళిత రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిని మాత్రమే తీసుకోవాలని సూచించారు. బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో చట్టాన్ని చేతిలోకి తీసుకుని అనధికారికంగా దళితులను వేధించొద్దని సూచించారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీపౌరుడిపై ఉందన్నారు. గ్రామంలో సివిల్ రైట్స్ కార్యక్రమం నిర్వహించి, గ్రామస్తులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ సాయికిరణ్, ఆర్డీవో రత్నకళ్యాణి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, తహసీల్దార్ మల్లేశ్, దళిత సంఘాల నాయకులు ఉన్నారు. -
వన్యప్రాణుల గణన పకడ్బందీగా నిర్వహించాలి
మామడ: వన్య ప్రాణులు, వృక్ష సంపద గణన పకడ్బందీగా చేపట్టాలని బాసర సర్కిల్ సీసీఎ ఫ్ అధికారి శరవణన్ అన్నారు. మండలంలోని నల్దుర్తి అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న గణన ను శనివారం పరిశీలించారు. మాంసాహార, శా కాహార, వృక్ష సంపద వివరాలను అటవీ సి బ్బంది నమోదు చేస్తున్నారు. చిరుతపులి, ఎలు గుబంటి, అడవి కుక్కలు, నక్కలు వంటి జంతువుల పాదముద్రల ఆధారంగా లెక్కిస్తున్నా రు. అటవీ జంతువుల వేట, చెట్ల నరికివేతను నిరోధించాలని, అటవీ ప్రాంతంలో అగ్ని ప్ర మాదాలు జరగకుండా చూడాలని సూచించా రు. సీపీఎఫ్ వెంట ఎఫ్డీవో నాగినిభాను, ఎఫ్ ఆర్వో శ్రీనివాస్రావు, ఎస్ఎస్వో శ్రీనివాస్, ఎఫ్బీవో అంజయ్య, రాజు ఉన్నారు. -
చరిత్రలో నిర్మల్ గమనం
నిర్మల్ఖిల్లా: గ్రామీణ భారతదేశంలోని అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర సాంస్కృక శాఖ నేషనల్ మిషన్ ఫర్ కల్చరల్ మ్యాపింగ్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ‘నా ఊరు – నా వారసత్వం(మేరా గావ్.. మేరీ ధరోహర్)’ పథకం గ్రామాల్లో సరికొత్త చరిత్ర అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. గ్రామాల చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానం, కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను లిఖితపూర్వకంగా నమోదు చేయనున్నారు. జిల్లా చారిత్రక ఖజానా జిల్లాలోని 400 రెవెన్యూ గ్రామాలు, మూడు పట్టణాలు దస్తూరాబాద్ నుంచి బాసర సరస్వతీ నిలయం వరకు విస్తరించిన ప్రాంతంలో గోదావరి తీర నాగరికత, రాజుల పరాక్రమం, కోటలు, బురుజులు, జానపద కళలు, పండుగలు అపారం. మౌఖిక కథలు, యుద్ధగాధలు, గ్రామ దేవతలు, వ్యవసాయ ఆచారాలు సర్వేలో నమోదవుతాయి. చరిత్రకారులు, పరిశోధకులు ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు. చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి... ‘నిర్మల్ గడ్డపై ప్రతీ రాయి ఒక కథ చెబుతుంది. ఈ మ్యాపింగ్ ద్వారా మన జిల్లా వైభవం ప్రపంచానికి తెలియడమే కాకుండా, అంతరించిపోతున్న కళలు, చా రిత్రక అంశాలకు పునర్జీవం లభిస్తుంది. మరుగునపడిన చరిత్రను తెలసుకుంటే ఔరా అని పించకమానదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణ యం ఆహ్వానించదగినదే.. – కటకం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హిస్టరీ, నిర్మల్ సమష్టి భాగస్వామ్యం అవసరం... ప్రభుత్వం చేపట్టే ఈ మహత్తర కార్యక్రామంలో చరిత్రకారులు, మేధావులు భాగస్వాములై మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నిర్మల్ జిల్లాలోని అద్భుతమైన చరిత్రను ప్రపంచపటంపై ఉంచేందుకు ఈ ‘నా ఊరు – నా వారసత్వం’ ఒక సువర్ణావకాశం. – ధోండి శ్రీనివాస్, చరిత్రకారుడు, నిర్మల్ ఈ సర్వేలో ప్రధానంగా ఏడు అంశాలపై దష్టి సారించనున్నారు: చారిత్రక నిదర్శనాలు కళావృత్తులు ఆధ్యాత్మిక కేంద్రాలు వీరత్వ గాధలు ఈ మ్యాపింగ్ గ్రామ చరిత్రను డిజిటల్గా భద్రపరచి, గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. యువతలో మూలాల అవగాహన పెరుగుతుంది. నిర్మల్ ’కోటల నగరం’గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతుంది. ఎంపీడీవోలు, గ్రామకార్యదర్శుల శిక్షణ తర్వాత సర్వే ప్రారంభిస్తారు. మ్యాపింగ్లో కీలకాంశాలు: -
ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య
నిర్మల్ రూరల్: ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఇంటర్మీడియెట్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్– టీచర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్య బలోపేతానికి విడుదల చేసిన నిధుల గురించి వివరించారు. నెల రోజుల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలవుతాయని అప్పటివరకు విద్యార్థులను తప్పనిసరిగా కళాశాలకు పంపాలని సూచించారు. డీఐఈవో పరశురాం మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమన్నారు. అనంతరం కళాశాలలో చదివి ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. కళాశాల పనితీరుకు సంబంధించి తయారుచేసిన వీడియోను ప్రదర్శించారు. విద్యార్థులు ప్రీఫైనల్ పరీక్షల్లో సాధించిన ఫలితాలను తల్లిదండ్రులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు విజయలక్ష్మి, నవీన్కుమార్, సత్యపాల్రెడ్డి, ఓంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
అంబరాన్నంటేలా సంబురాలు
● కొనసాగుతున్న నిర్మల్ ఉత్సవాలు ● మరోరోజు పొడగించిన కలెక్టర్ నిర్మల్ చైన్గేట్: చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ వేడుకలుగా నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఐదు రోజులుగా స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. మొదట ఐదు రోజుల ఉత్సవాలుగా మాత్రమే ప్రకటించడంతో శుక్రవారం భారీ సంఖ్యలో జిల్లావాసులు తరలివచ్చారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మరో రోజు ఉత్సవాలను పొడిగిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో చరిత్రను తెలుసుకోవడంతోపాటు, సాంస్కతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరిస్తున్నారు.


