breaking news
Nirmal District News
-
చేపల వేటకు వెళ్లి శవమయ్యాడు
పెంచికల్పేట్: పెంచికల్పేట్ పెద్దవాగులో పడి యువకుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికల్పేట్ గ్రామానికి చెందిన మేకల జంపన్న (20) తన స్నేహితుడు అరికిల్ల కిశోర్తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం చేపలు పట్టడానికి పెద్దవాగుకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఎల్కపల్లి గ్రామానికి చెందిన బాలుడితో కలిసి వాగులో స్నానం చేయడానికి దిగాడు. వాగులో లోతు ఎక్కువగా ఉండటం, వరద ప్రవాహం పెరగడంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయారు. ఎల్కపల్లి గ్రామానికి చెందిన బాలుడు సమీపంలోని పిల్లర్ చువ్వను పట్టుకుని బయటికి రాగా, జంపన్న నీటిలో మునిగిపోయాడు. ఒడ్డునున్న స్నేహితుడు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. గ్రామస్తులు జాలర్లతో గాలింపు చేపట్టగా జంపన్న మృతదేహం లభించింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోధించిన తీరు కంటతడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్పేట్, దహెగాం ఎస్సైలు అనిల్కుమార్, రమేశ్ పరిశీలించారు. -
జాతీయస్థాయి పురస్కారానికి నామినేట్
నిర్మల్ఖిల్లా: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి రాష్ట్రం నుంచి నామినేట్ అయిన ఆరుగురిలో నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు మాదరి ఎల్లన్న ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం నుంచి జాతీయ జ్యూరీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎల్లన్న పాల్గొన్నారు. తన 18 ఏళ్ల ప్రస్థానంలో చేపట్టిన వినూత్న బోధనా విధానాలు, విద్యార్థుల అభ్యసనాభివృద్ధి కోసం నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, జేడీ వెంకట నర్సమ్మ, హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, విశ్వనాథం గుప్తా తదితరులు ఎల్లన్నను అభినందించారు. -
పాత నాణెం.. నాగన్నకు ప్రాణం
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ పట్టణానికి చెందిన ఉస్కామొల్ల నాగన్న పాత నాణేలు, విదేశీ కరెన్సీ సేకరణను హాబీగా చేసుకున్నారు. పాత బస్టాండ్ ఆవరణలో ఓ చిన్న పాన్ షాప్ నడుపుకొనే నాగన్న ఇప్పటివరకు పాత నాణేలతోపాటు 57 దేశాల కరెన్సీని సేకరించారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు వాడుకలో ఉన్న రాగి నాణేలు, అణాలు, పైసల నుంచి మొదలుకుని నేటి ఆధునిక కరెన్సీ వరకు నా గన్న వద్ద విభిన్న రకాల నాణేలున్నాయి. బ్రి టిష్ కాలం నాటి రాగి నాణేలు, నిజాం నవా బుల కాలం నాటి నాణేలు, పాతకాలపు రంధ్రం నాణేలు, ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, ఇందిరాగాంధీ, నెహ్రూ బొమ్మల నాణేలను ఆయన ఎంతో భద్రంగా దాచారు. తన షాప్నకు వచ్చే వారికి నాణేలు చూపిస్తూ అప్పటి చరిత్రను వివరిస్తుంటారు. అతని అభిరుచిని చూసిన వారంతా అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇదే నాకు ఇష్టమైన హాబీ ఇప్పటి పిల్లలకు పాతకాలపు నాణేలు, అణాలు అంటే ఏంటో తెలీదు. మనం వాడిన కరెన్సీ మన రాబోయే తరాలకు తెలియాలి. మన సాంస్కృతిక, ఆర్థిక ప్రస్థానాన్ని వారికి చూపించడమే నా తాపత్రయం. అందుకే పాతకాలపు నాణేలు, విదేశీ కరెన్సీ సేకరణ హాబీగా ఎంచుకున్నాను. – నాగన్న -
వీధుల్లో వందేమాతరం నినాదాలు
మంచిర్యాలఅర్బన్: ప్రస్తుత కాలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు భారీ వేదికలు, మైకులు, విద్యుత్ కాంతులతో సాగుతున్నప్పటికీ నాటి రోజుల్లో కనిపించే దేశభక్తి, నిరాడంబరత కొంతమేర కొరవడ్డాయి. అప్పట్లో తెలంగాణ గ్రామాల్లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే అత్యంత పవిత్రమైన దేశభక్తి భావంతో జెండా ఎగురవేశాం. గ్రామ పంచాయితీ కార్యాలయం, పాఠశాలల వద్ద హెడ్మాస్టర్లు, పెద్దల ఆధ్వర్యంలో ఊరంతా ఏకమై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేవారు. గ్రామస్తులు, యువకులందరూ చేతుల్లో త్రివర్ణపతాకాలు పట్టుకుని వీధుల్లో వందేమాతరం అంటూ నినాదాలు చేశాం. స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ చేసే ప్రసంగాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉండేవి. – విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తవడ్ల రామయ్య(88), మంచిర్యాల -
స్వాతంత్య్రం వచ్చేనని..
దొర ఇంట్లోనే కరెంటు ఉండే.. బజార్హత్నూర్: నా పేరు నారడి మల్లయ్య, వయస్సు 95. 1947 ఆగస్టు 15రోజు నా వయస్సు 16 సంవత్సరాలు. అప్పుడు మా మండలం మొత్తం దొరల పాలనలో ఉండేది. పల్సికార్ రంగారావ్(పల్సి దొర) బజార్హత్నూర్ వతందార్. దొర ఇంట్లో తప్ప మా గ్రామంలో కరెంటు లేదు. ఆ రోజు అర్ధరాత్రి రేడియోలో బ్రిటీష్ వాళ్లు మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారని నెహ్రూ ప్రసంగం విన్నారు. తెల్లవారుజాము నుంచే గ్రామంలో కోలాహలం ఉండే. పల్సికార్ రంగారావ్ ఆధ్వర్యంలో దొడ్డి మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేను మా నాన్న మల్లన్నతో కలిసి మా గ్రామంలో స్వతంత్ర దినోత్సవం సంబరాల కార్యక్రమానికి వెళ్లాను. డప్పులతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. భారతమాతకి జై, వందేమాతరం నినాదాలు చేశారు. తర్వాత అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు. – నారడి మల్లయ్య, బజార్హత్నూర్స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో నాడు ఊరు..వాడ.. చిన్నా పెద్ద అందరూ పాల్గొన్నారు. అప్పటి వేడుకలకు సజీవసాక్ష్యంగా నిలిచిన పెద్దలు ఆనందంతో పంచుకున్నారు. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
ప్రాచీన బహుమనీ సుల్తానుల రాగి నాణెం
ఇది సుమారు 500–650 ఏళ్ల క్రితం (14వ–16వ శతాబ్దం) నాటి దక్కన్ బహుమనీ సుల్తానుల కాలానికి చెందిన ప్రాచీన రాగి నాణెం. చేతితో అచ్చు వేసిన ఈ నాణెంపై అరబిక్ లిపిలో సుల్తానుల బిరుదులు ముద్రించి ఉన్నాయి. గుల్బర్గా, బీదర్ కేంద్రాలుగా సాగిన మధ్యయుగాల నాటి దక్కన్ వాణిజ్య లావాదేవీలకు ఇది చారిత్రక సాక్ష్యంగా నిలుస్తోంది. మొఘల్ కాలం నాటి వెండి నాణెం ఇది 18–19వ శతాబ్దానికి చెందిన హైదరాబాద్ సంస్థానం మొఘల్ చివరి కాలం నాటి అరుదైన వెండి నాణెం. దీనిపై పర్షియన్ లిపిలో ‘సనహ్ జులూస్ మైమనత్ మానుస్’ అనే రాజరిక శాసనం, పూల గుర్తులు చెక్కి ఉన్నాయి. నాడు పెద్ద ఎత్తున జరిగిన వ్యాపారాలు, విదేశీ వాణిజ్య లావాదేవీలకు ఉపయోగించిన సుసంపన్న కరెన్సీకి ఇది సజీవ సాక్ష్యం. నిజాం కాలపు తుఘ్రా రాగి నాణెం ఇది హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం నవాబుల (ఆసఫ్ జాహీ కాలం) హయాంలో ముద్రించిన ‘హాలీ సిక్కా’ రాగి నాణెం. దీనిపై నిజాం రాజరిక చిహ్నమైన ప్రత్యేక కాలిగ్రఫీ ముద్ర ‘తుఘ్రా’ చెక్కబడి ఉంది. సంస్థానాల కాలంలో దక్కన్ ప్రాంతంలో స్థానిక వాణిజ్యానికి ఉపయోగించిన స్వదేశీ కరెన్సీ సంపదకు దీనిని వినియోగించేవారు. -
సరైన గుర్తింపు లేదు..
తాంసి: మా తాతలు, తండ్రులు స్వాతంత్య్రం కోసం ఎంతో పోరాడారు. మేము మాత్రం పొట్ట కూటి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. మా కుటుంబానికి పెద్ద ఉద్యమ చరిత్ర ఉంది. ఉద్యమ సమయంలో నిర్మల్లోని కుభీర్లో గణష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మా నాన్న స్వామి రామానందతీర్థ్ వారితో ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశం కోసం ఉద్యమాన్ని చేస్తున్నామని మా నాన్న గంగారం సింగ్ తెలిపేవారు. నిజాంకు వ్యతిరేకంగా సైతం పోరాడి నాందేడ్ జైలులో మూడు నెలలపాటు ఉన్నారు. సమరయోధుల కుటుంబాలకు సాగుభూమితో ఇళ్లను ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతియేటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం రోజున సన్మానించి గౌరవిస్తే బాగుంటుంది. ఠాకూర్ రాంసింగ్, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు -
నాణేమైన చరిత్ర
బోథ్: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రానికి చెందిన బాశెట్టి రాజ్కుమార్ రూపాయి పరిణా మ క్రమాన్ని సజీవంగా కళ్ల ముందుంచుతున్నారు. దేశభక్తి, ప్రాచీన సంస్కృతిపై మక్కువతో నాణేలు సేకరించి శతాబ్దాల నాటి చరిత్రను నిక్షిప్తం చేస్తున్నారు. దాదాపు ఆరు శతాబ్దాల కిందటి దక్కన్ బహుమనీ సుల్తానుల రాగి కాసులు, హైదరాబాద్ నిజాం సంస్థానపు హాలీ సిక్కా నాణేలతో పాటు స్వాతంత్య్ర పోరాట కాలానికి చెందిన ఎన్నో విశిష్ట నాణేలు సేకరిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ తీవ్రతతో లోహాల కొరత ఏర్పడినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తక్కువ లోహంతో ముద్రించిన 1945 నాటి మధ్యలో రంధ్రం గల పైసా నాణెం నాటి యుద్ధ సంక్షోభ పరిస్థితులను కళ్లకు కడుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గతకాలపు జ్ఞాపకాలు, నాటి కరెన్సీ చరిత్రను పదిలపరుస్తున్న రాజ్కుమార్ను చరిత్రకారులు ప్రశంసిస్తున్నారు. -
ముందు తరాలకుఅందించాలనే..
పరాయి రాజుల పేర్లతో ఉన్న నాణేల నుంచి స్వాతంత్య్రం సిద్ధించాక అశోక స్తంభం, మూడు సింహాల చిహ్నాలతో మన స్వతంత్ర భారత నాణేలు ఎలా రూపుదిద్దుకున్నాయో భావితరాలకు తెలియజేయాలన్నదే నా లక్ష్యం. స్వాతంత్య్రం కోసం మన పూర్వీకుల త్యాగాలు, పరాయి పాలనలో మన దేశం అనుభవించిన బానిసత్వ ఛాయలను తెలియజేయడమే నా ఉద్దేశం. ఈ నాణేలను చూసినప్పుడు మనకు లభించిన స్వాతంత్య్రం విలువ, స్వయం పాలన గొప్పదనం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. అందుకే పాఠశాలలకు వెళ్లి నాణేలను విద్యార్థులకు చూపి వివరిస్తూ ఉంటాను. – బాశెట్టి రాజ్కుమార్ -
దశాబ్దాల చరిత్ర
ఆదిలాబాద్: ఆదిలాబాద్లోని దేవీచంద్ చౌక్లో జాతీయ జెండా ఆవిష్కరణకు ప్రత్యేక చరిత్ర ఉంది. 1952లో ఆదిలాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు దేవీచంద్ మిట్టల్, హరిరామ్ బగాడియా, గంధె యాదవ్రావు, రధిరామ్ రిచ్పాల్, ఓంకార్మల్ మఖారియా తదితరులు కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేవీచంద్ మిట్టల్, పూల్చంద్ అగర్వాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తల చేతుల మీదుగా తొలిసారిగా ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని దేవీచంద్ చౌక్గా పిలుస్తున్నారని చాంబర్ అధ్యక్షుడు దినేష్ మాటోలియా తెలిపారు. దశాబ్దాలుగా ప్రతీ స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాంబర్ ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ కొనసాగుతోందని తెలిపారు. -
వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
నిర్మల్ టౌన్: పట్టణంలో జరిగిన రెండు వేర్వేరు చోరీ కేసులను పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని సాయి గణేశ్ నర్సరీలో కూలీలు నిద్రిస్తున్న సమయంలో నిర్మల్కు చెందిన మోసిన్ఖాన్ లోపలికి ప్రవేశించి రెండు సెల్ఫోన్లు చోరీ చేశాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు ఫోన్లతో పాటు బైక్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అతడిపై గతంలోనూ నిర్మల్ టౌన్, రూరల్, సోన్, ఆర్మూర్ తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులున్నాయని, రౌడీ షీటర్గా కూడా ఉన్నట్లు తెలిపారు. రాగి తీగ చోరీ చేసిన మహిళ అరెస్ట్ ఈ నెల 6న స్థానిక ఓల్డ్ బస్టాండ్ సమీ పంలోని నయీమ్ ఎలకి్ట్రకల్ షాపులో చోరీ జరిగింది. షట్టర్ తాళం పగులగొట్టి లోనికి వెళ్లి సుమారు రూ.17వేల విలు వైన 15కిలోల రాగి తీగ దొంగిలించారు. ఈ మేరకు షాప్ యజమాని పట్టణ పోలీ స్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీ సులు కేసు నమోదు చేసి ఘటనా స్థలా న్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పరి సర ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఇందులో భాగంగా శుక్రవారం నిందితురాలు స్వప్నను అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు నర్సవ్వ, గంగామణి ప రా రీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొ నసాగుతుందని పోలీసులు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న ఒకరిపై కేసు నస్పూర్: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గాయత్రీనగర్కు చెందిన బోడకుంట ప్రభాకర్ తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న సమాచారం మేరకు ఎస్సైలు కిరణ్కుమార్, జితేందర్ సింగ్ సిబ్బందితో వెళ్లారు. రెండు గంజాయి మొక్కలను గుర్తించారు. ప్రభాకర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి శిక్షకుడిగా ఫయాజ్
ఖానాపూర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నియమితులైన సమాచార, సమాచార సాంకేతిక పరిజ్ఞాన బోధకులకు నిర్వహించిన నాలుగు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఖానాపూర్ మండలం మస్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ గణిత ఉపాధ్యాయుడు సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీమ్ రాష్ట్రస్థాయి శిక్షకుడిగా సేవలందించారు. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆగస్టు 11 నుంచి 14 వరకు డిజిటల్ అభ్యసనంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షకుడిగా సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీమ్ వివిధ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ తన అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణార్థులతో పంచుకున్నారు. సమగ్ర శిక్ష తెలంగాణ అదనపు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ పీవీ.శ్రీహరి, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆయన సేవలను అభినందించారు. నిర్మల్ డీఈవో భోజన్న, పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ మస్కాపూర్ హెచ్ఎం శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీమ్ను అభినందించారు. -
ఆ నలుగురు దోచుకుంటున్నారు
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, వారి సంపద భారీగా పెరిగిందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. నిర్మల్లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి రామనే భయంతో ముఖ్యమంత్రి, మంత్రులు ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న ధోరణిలో ఉన్నారన్నారు. స్థానిక సంస్థలు, జిల్లా, మండల పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని విమర్శించారు. కీలక శాఖల్లో వసూళ్లు, కమీషన్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు నిర్వహిస్తున్న శాఖల్లో వసూళ్లు, కమీషన్ల ఆ రోపణలు తీవ్రస్థాయికి చేరాయన్నారు. సీఎం సోదరుడు కొండల్రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని రూ.7 కోట్లకే కేటాయించారనే కథనాలపై సీఎం వివరణ ఇవ్వాలన్నారు. లక్ష రూపాయల పెట్టుబడి, ఉద్యోగులు లేని కంపెనీకి ఏ ప్రాతిపదికన భూమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బిల్లుల క్లియరెన్స్కు కమీషన్ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ బిల్లులకు 10 శాతం, చిన్న కాంట్రాక్టర్లకు 20 శాతం, మరికొన్నింటికి 30 శాతం కమీషన్ అడిగారనే ఆరోపణలపై భట్టి విక్రమార్క స్పందించాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబ కంపెనీకి ఫీనిక్స్ నుంచి రూ.15 వేల కోట్ల ఆస్తులు బదిలీ అయ్యాయనే ఆరోపణలపై వివరణ కోరారు. మంత్రులపై అవినీతి ఆరోపణలను ఆధారాలతో దర్యాప్తు సంస్థలకు తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. బాధిత చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఏసీబీకి ఫిర్యాదు చేయాలని, వారికి ఇబ్బందులు వస్తే బీజేపీ అండగా నిలుస్తామన్నారు. అవినీతిని ప్రశ్నించడం ద్వేషం కాదని, ప్రజాస్వామ్య హక్కులను అణచే చట్టాలను సహించమన్నారు. కరప్షన్ కేబినెట్.. ఆంధ్రా కాంట్రాక్టర్లను ప్రభుత్వం దోచుకుంటోందని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించడంపై సీఎం, మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తుంటే అవినీతి స్థాయి అర్థమవుతోందని, మంత్రివర్గం ‘కరప్షన్ కేబినెట్’ అయిందన్నారు. అంతర్గత విభేదాలు మొదలయ్యాయని, మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలో బహిరంగంగా మాట్లాడతారని, మంత్రుల అవినీతి వ్యవహారాలు బయటపడతాయన్నారు. సమావేశంలో రావుల రాంనాథ్, చిన్నయ్య, రాజు, శ్రీరామోజీ నరేశ్, అర్జున్, ఈశ్వర్, సాత్విక్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కడెం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ కృషి చేస్తుందని యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట నరేంద్రబాబు, బీవీ.రమణారావు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మండల శాఖ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్లుగా ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాల కల్పనలో పీఆర్టీయూ పాత్ర ఎంతో ఉందన్నారు. రానున్న కాలంలో సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానం, అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ ఇప్పించే బాధ్యత తమ సంఘం తీసుకుంటుందని తెలిపారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొమ్మిడి మహేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా బోయిని వెంకటరమణ, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.దామోదర్, మహిళా అసోసియేట్ అధ్యక్షుడిగా వనిత, ఉపాధ్యక్షులుగా గంగారం, జ్యోతి, కార్యదర్శులుగా చిట్టేటి నరేశ్, ఓం సాయి, మహిళా కార్యదర్శులుగా విద్యాలత, సాయిరాణిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కోట వేణు, ఎన్నికల పరిశీలకులుగా శంకర్ వ్యవహరించారు. నాయకులు రమేశ్, దశరథ్, ప్రేమదాస్, గణేశ్, లక్ష్మీనర్సయ్య, చిలివేరి వెంకటరాములు, రమేశ్బాబు పాల్గొన్నారు. -
పోరు వీరులను మరిసిండ్రు..!
నిర్మల్: స్వాతంత్య్రం కోసం దేశం యావత్తూ పోరుబాట పట్టిన వేళ నిర్మల్ జిల్లా కూడా వెనుకడుగు వేయలేదు. ఆంగ్లేయులు, నిజాం సేనల దమనకాండను ఎదురించి ఎందరో అమరవీరులు, సమరయోధులు అలుపెరగని పోరాటం చేశారు. స్వేచ్ఛ కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. నెలల తరబడి జైళ్లలో మగ్గారు. కుటుంబాలకు దూరమై ఎన్నో కష్టాలను అనుభవించారు. వారి పోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. అలాంటి మహనీయుల త్యాగాలను నేటి తరానికి పరిచయం చేయడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నప్పటికీ.. స్థానికంగా కీలకపాత్ర పోషించిన సమరయోధుల చరిత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. సమరయోధులెందరో.. ప్రథమ భారత సంగ్రామంలో భాగంగా 1858లో రాంజీగోండు సహా వెయ్యిమంది అమరవీరులు నిర్మల్ గడ్డపై అలుపెరుగని పోరాటం చేశారు. తమ ప్రాణాలు అర్పించారు. వారి పోరాట స్ఫూర్తితో ఎంతోమంది సమరయోధులు స్వాతంత్య్ర పోరాటంలోకి దిగారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రుమూకలపై పోరాడారు. తొలిదశ పోరులో రాంజీగోండు ప్రజలను ఏకం చేస్తే.. మలిదశ పోరులో నిర్మల్ ప్రాంతానికి చెందిన ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు సంఘటితంగా పరాయిపాలనపై ఉద్యమించారు. నాటి నిర్మల్ పంచాయతీ సమితి పరిధిలో గోపిడి గంగారెడ్డి, గణపతి, బాపూరావు, బోరేగాం గజన్న, లాలు పటేల్, ఏ.రాజన్న, పోశెట్టి, గంగాధర్, శివన్న, గంగారామ్, విఠల్రావు, జమునాలాల్, వెంకోబరావు, చిన్న నర్సింహులు, లింగారెడ్డి, సుందర్రాజ్, ముడుసు ఎల్ల య్య, అర్గుల గంగాధర్గుప్తా, గాంధారి లక్ష్మణ్, ఠాకూర్ హన్మంత్రావు.. ఇలా ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాడారు. నెలల తరబడి జైళ్లల్లో.. నిజాం, ఆంగ్లేయుల అణచివేతలో భాగంగా ఎందరోమంది సమరయోధులు జైళ్లకు వెళ్లారు. స్థానిక జైళ్లల్లో కాకుండా వీరిని ఇక్కడి నుంచి వరంగల్, మహారాష్ట్రలోని నాందేడ్, చంద్రాపూర్, ఔరంగాబాద్ తదితర దూర ప్రాంత జైళ్లకు పంపించేవారు. అక్కడ నెలల తరబడి మనవాళ్లు మగ్గేవారు. ఒక్కోసారి ఎన్ని నెలలైనా వాళ్లు ఇంటికి రాకపోవడంతో చనిపోయారేమో అనుకుని కర్మకాండలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా వెరువకుండా పోరు సాగించారు. ఇదేనా గుర్తింపు..! రాంజీగోండు సహా వెయ్యిమంది అమరవీరులను, స్వాతంత్య్ర సమరయోధులను పాలకులు, అధికారులు ఇప్పటికీ గుర్తించడం లేదు. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన వారికి గౌరవాన్ని ఇవ్వడం లేదు. దయనీయ స్థితుల్లో ఉన్న వారి కుటుంబాల వైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం పంద్రాగస్టు లాంటి వేడుకల్లోనైనా వారి పోరాటాలు, త్యాగాలను గుర్తించాలని, వారి కుటుంబాలకు ఆహ్వానం అందించాలని జిల్లాప్రజలు కోరుతున్నారు. -
చనిపోయాడని కర్మకాండలు చేశారు..
మా నాన్న ముడుసు ఎల్ల య్య యువకుడిగా ఉన్నప్పుడే స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. నిర్మల్ ప్రాంత విప్లవ వీరులతో కలిసి ఆంగ్లేయ, నిజాం సేనలపై తిరుగుబాటు చేశారు. ఇందులో భాగంగా 1947లో అజ్ఞాతంలో ఉన్న నాన్నతోపాటు ఉద్యమకారులను మంథనిలో పట్టుకుని సిర్పూర్ దగ్గర ఉన్న రోనవెల్లి పోలీస్స్టేషన్ తరలించారు. అక్కడ పోలీసుల చేతుల్లో నరకం అనుభవించారు. అక్కడి నుంచి వరంగల్ జైలుకు తరలించారు. అప్పట్లో నెలలతరబడి నాన్న ఆచూకీ లేకపోవడంతో ఆయన చనిపోయాడని భావించి నాన్నమ్మ రాజవ్వ కర్మకాండలు చేయించారు. చాలా నెలలకు తిరిగి వచ్చినా జైళ్లల్లో కొట్టిన దెబ్బలకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందిపడ్డారు. వారు చేసిన త్యాగాల ఫలితంగానే ఈరోజు మనకు స్వేచ్ఛను ఇచ్చింది. ఇలాంటి సమరయోధులను ప్రభుత్వాలు మర్చిపోవద్దు. – ముడుసు సత్యనారాయణ -
కాంగ్రెస్ మెరుపు నిరసన
నిర్మల్చైన్గేట్: ఉత్తరాఖండ్ హల్ద్వాని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, దళిత నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగం అనంతరం మైదానాన్ని శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెరుపు నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బీఆర్.అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. మోదీ హఠావో దేశ్కి బచావో.. అంటూ నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే దళితుడు అన్న కారణంగా బీజేపీ శుద్ధీకరణ చేపట్టడం రాజ్యాంగ హక్కును కాలరాసేలా ఉందని విమర్శించారు. ఈ సంఘటనతో బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
స్వర్ణ నీరు.. వృథా
మధ్య కాలువ తూము చెడిపోయి.. యాసంగి పంట సాగు సమయంలో మధ్యకాలువ గేటును కిందకు దింపే ప్రక్రియలో గేటును పైకి–కిందకు కదిలించే రాడ్ విరిగిపోయింది. ఫలితంగా గేటు కిందకు దిగని పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ప్రాజెక్టులో ఉన్న నీరంతా అధికారులు మధ్యకాలువ ద్వారా ధని, బోరిగాం, ఆలూరు, వేంగ్వాపేట్ చెరువులకు మళ్లించారు. ప్రస్తుతం ఈ నాలుగు చెరువులు పూర్తిగా నిండుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యకాలువ తూములో ఇసుక సంచులు, గడ్డి కట్టలు అడ్డువేసి తాత్కాలికంగా మూసివేశారు. అయితే ప్రాజెక్టు నిండిన తర్వాత ఆయకట్టుకు నీటిని విడుదల చేసినా సరిగా పొలాలకు చేరకపోవడంతో రైతులు వరినాట్లు వేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ గేటును సరైన మోతాదులో ఎత్తితేనే ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి ఉంది. సారంగపూర్: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో ఈసారి ఆశించిన వర్షాలు కురవడం లేదు. ఇటీవల అల్పపీడనం ప్రభావంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ఇటీవలి వర్షాలతో నీటిమట్టం 1,182.5 అడుగులకు చేరుకుంది. మరో అయిదు అంగుళాల నీరు చేరితే పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉంది. విలువైన నీరు వృథా అయితే ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలు అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వర్షాలు కురవకపోవడమే కాకుండా, లీకేజీల రూపంలో ప్రతిరోజు వందలాది క్యూసెక్కుల విలువైన సేద్యపు నీరు వృథాగా గోదావరిలో కలుస్తోంది. దీంతో ఆయకట్టు రైతుల పంటల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ప్రాజెక్టు కింద మూడు ప్రధాన కాలువలు (కుడి, మధ్య జౌళినాల, ఎడమ) ఉన్నాయి. వీటి ద్వారా 10 వేల ఎకరాల సాగుభూమి, అలాగే ఆలూరు, బోరిగాం, ధని, నిర్మల్ రూరల్ మండలం వేంగ్వాపేట్ చెరువులు సాగునీరు విడుదల చేస్తారు. రైతుల వేడుకోలు గేటు నుంచి కొద్దిపాటి నీరు మాత్రమే రావడంతో పంటలకు సరిపడా నీరు అందుతుందా లేదా అనే సంశయంతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అదే సమయంలో విలువైన సేద్యపు నీరు లీకేజీల రూపంలో బయటకు వెళ్తుండటం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇకనైనా అధికారులు తక్షణం స్పందించి గేట్ల లీకేజీలను అరికట్టి, మధ్యకాలువ ద్వారా పంటలకు సరిపడా నీరు అందించే చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు. గేట్ల లీకేజీలు అరికడతాం.. గేట్ల లీకేజీతో నీరు బయటకు వెళ్లిపోతున్న విషయం వాస్తవమే. ప్రస్తుతం గేట్ల లీకేజీలు సవరించడానికి ఇబ్బంది లేదు. జనుముతో గేట్ల లీకేజీలను సవరించవచ్చు కానీ మళ్లీ వర్షాలు కురిస్తే గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే వేసిన జనుమంతా వరదలకు కొట్టుకుపోతుంది. అందుకే ఆరుగేట్లలో నాలుగు గేట్లు జనుముతో మూయించి మరో రెండు గేట్లను అలాగే ఉంచేలా చర్యలు చేపడుతున్నాం. – వేణుగోపాల్, ఏఈ, స్వర్ణ ప్రాజెక్టు -
పంద్రాగస్టుకు సర్వం సిద్ధం
నిర్మల్చైన్గేట్: జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం నిర్వహించే వేడుకలకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాలు ఏర్పాట్లు చేశాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకలు అధికారికంగా నిర్వహించనున్నారు. ఈమేరకు మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేడుకల్లో పాల్గొనే ప్రజాప్రతినిధులు అధికారులు స్థానికులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు సమకూర్చారు. 9.30 గంటల నుంచి వేడుకలు.. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 9:35 గౌరవ వందన స్వీకరణ, 9:37 నుంచి 10 గంటల వరకు ముఖ్య అతిథి సందేశం, 10 నుంచి 10.40 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10:45 నుండి ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థలకు, ఉత్తమ శకటాలకు పతకాలు ప్రదానం చేస్తారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలు ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. పోలీసు పరేడ్ మైదానం, ముఖ్యులు, ప్రజాప్రతినిధులు కూర్చునే స్థలాలు, సాంస్కృతిక ప్రదర్శనల విభాగాలు, తాగునీటి సరఫరా, విద్యుత్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం కడ్తాల్ సమీపంలోని సాగర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. కార్డుల పంపిణీకి వచ్చే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఈవో భోజన్న, అగ్నిమాపక అధికారి శివాజీ, డీఎస్పీ శ్రీనివాస్, డీఎస్వో రాజేందర్ ఉన్నారు. -
సీఎంఆర్ బకాయిలపై చర్యలు తీసుకోవాలి
నిర్మల్చైన్గేట్: రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ను భారత ఆహార సంస్థకు సకాలంలో సరఫరా చేయడంతో పాటు, పెండింగ్ వివరాలు వెల్లడించి పారదర్శక చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈమేరకు అదనపు కలెక్టర కిశోర్కుమార్కు గురువా రం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్కుల సత్తన్న యా దవ్ మాట్లాడుతూ పెండింగ్ ఉన్న సీఎంఆర్ సరఫ రాను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. మిల్లింగ్, రవాణా, నిల్వలో ఎదురవుతున్న ఆటంకా లు తొలగించాలన్నారు. సీఎంఆర్ పురోగతి జిల్లా వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. సరఫరాలో ఆలస్యంతో ప్రభుత్వంపై పడుతున్న అదనపు భారం, దానికి కారణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రైతుల ప్రయోజ నా లు, ప్రజాధనం, ప్రజాపంపిణీ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని అత్యవసర చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆహ్లాదమా.. అదెక్కడ?
నిర్మల్: జిల్లా రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నా ప్రజలకు ఆహ్లాదం పంచే విషయంలో మాత్రం చాలా వెనుకంజలో ఉంది. కనీసం హాలీడేస్లో కుటుంబంతో కాసింత సేదతీరేందుకు సరైన పా ర్కులు లేక.. పిల్లలు ఆడుకునేందుకు మైదానా లు కనిపించక.. యువతకు క్రీడా వసతులు అంతంత మాత్రంగానే ఉండటంతో వారాంతాల్లోనూ జిల్లావాసులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడేలా ఒక సమగ్ర వినోద, క్రీడా ప్రాంగణం లేకపోవడం జిల్లాలో ప్రధాన సమస్యగా మారింది. బోటింగ్ ఏదీ..?నిర్మల్ చుట్టూ అనేక చెరువులు, కుంటలు ఉన్నా యి. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. వీటిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో మాత్రం ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదు. కనీసం ఒకటి, రెండు చెరువులను ఎంపిక చేసి శుద్ధి చేసి.. చుట్టూ వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, పిల్లల ఆటస్థలం, కూర్చునే ప్రదేశాలు ఏ ర్పాటు చేసి బోటింగ్ సౌకర్యం కల్పిస్తే ప్రజలకు ఆహ్లాదంతోపాటు స్థానికంగా పర్యాటక ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది. ఆహ్లాదం కోసం వెతుకులాటకుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు అనువైన పార్కులు కూడా లేవు. ఉన్న ఒకట్రెండు కూడా అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్వహణ, వసతుల విషయంలో ప్రజలు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఆట పరికరాలు, వృద్ధులకు వాకింగ్ ట్రాక్లు, మహిళలకు సురక్షితమైన కూర్చునే ప్రదేశాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక పార్కులు అవసరమని పట్టణవాసులు కోరుతున్నారు. ఆటస్థలాలకూ కొరత..పిల్లలు, యువతకు క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ జిల్లాలో ఇప్పటికీ సరైన మైదానాలు లేవు. ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఫలితంగా క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ వంటి క్రీడలు ఆడేందుకు పిల్లలు, యువత ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రతి ప్రధాన ప్రాంతంలో ఒక క్రీడా మైదానం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలూ కనుమరుగయ్యాయి.జిల్లాకేంద్రం చుట్టూ గొలుసుకట్టు చెరువులు, చారిత్రక కట్టడాలుఅభివృద్ధిలో ‘ఆహ్లాదం’ ఉండాలి..అభివృద్ధి అంటే రహదారులు, భవనాలు మా త్రమే కాదని జిల్లావాసులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి పచ్చదనం, పా ర్కులు, క్రీడా మైదానాలు, సరస్సుల అభివృద్ధి కూడా అవసరమే. చెరువులను పరిరక్షిస్తూ వాటి చుట్టూ వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు, గ్రీన్ బెల్ట్, పిల్లల ఆటస్థలాలు ఏర్పాటు చేసి.. వీలైన చోట్ల బోటింగ్ సౌకర్యం కల్పించాలంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స మగ్ర ప్రణాళిక రూపొందించి.. ఉన్న వనరులను సద్వినియోగం చేస్తే ‘ఆహ్లాదకర నిర్మల్’కు బాటలు పడతాయని అంటున్నారు. హాలీడేస్లో జిల్లా దాటాల్సిందే..సెలవురోజు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాలంటే స్థానికంగా కనీసం అభివృద్ధి చేసిన పర్యాటక ప్రాంతాలూ లేవు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లావాసులు ఇతర జిల్లాలు, పట్టణాల వైపు వెళ్లాల్సి వస్తోంది. పిల్లలకు వినోదం, పెద్దలకు ఆహ్లాదం కలిగించే ప్రదేశాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కరోజు విహారానికి కూడా ప్రయాణం తప్పడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. -
కడెంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పర్యటన
కడెం: మండల కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రాకేశ్ గురువారం సందర్శించారు. మందుల నిల్వలు, రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నా రు. అనంతరం మండల కేంద్రంలోని తహసీ ల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. సెన్సన్లో భాగంగా జిల్లాలో కడెం, బాసర మేజర్ గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారని, అందులో భాగంగా ఆయా గ్రామాల జీపీవోల ద్వారా ఆయా శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా గ్రామాల చారిత్రక అంశాలను సేకరించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీనివాస్, ఆర్ఐ శారద, జీపీవోలు ఉన్నారు. -
రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మామడ: ప్రభుత్వ రాయితీ పథకాలను రైతులు స ద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధి కారి రమణ అన్నారు. మండలంలోని పరిమండల్, ఆరేపల్లి గ్రామాల్లో బిందు సేద్యంతో చేస్తున్న సాగు ను, బిందుసేద్యం పరికరాల పనితీరును గురువా రం పరిశీలించారు. ఆయిల్పామ్ సాగు చేస్తున్న రై తులతో మాట్లాడారు. ఆయిల్పామ్ మొక్కల సాగులో బిందుసేద్యం పరికరాల వినియోగంలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రై తులకు నాణ్యమైన డ్రిప్ పరికరాలను అందించాల ని కంపెనీల ప్రతినిధులకు సూచించారు. బీఎస్పీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులు సాగులో బిందుసేద్యం పరికరాల వినియోగం, రైతులకు ప్రయోజనం, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డివిజన్ అధికారి మౌనిక, కంపెనీ ప్రతినిధులు మహేందర్, రైతులు, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు పాల్గొన్నారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై కొరడా
నిర్మల్టౌన్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్మల్ మున్సిపల్ అధికారులు గురువారం సింగిల్ యూ జ్ ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై నియంత్రణకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ దుకాణాలతోపాటు ఇతర వ్యాపార సముదాయాల ను తనిఖీ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు. మొత్తం రూ.28,500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని దుకాణదారులకు సూచించారు. పర్యావరణహితమైన బట్ట సంచులను వినియోగించాలని కోరారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలు, వ్యాపారులు మున్సిపాలిటీ కి సహకరించాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రజిని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
తిరంగా హోరు
నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్: స్వాతంత్య్ర సంబు రాల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు నిర్మల్, భైంసా పట్టణాల్లో గురువారం తిరంగా ర్యాలీలు నిర్వహించారు. పాఠశాల, కళా శాలల విద్యార్థులు, యువకులు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని భారత్మాతాకీజై, వందేమాతరం నినాదాలతో ఉత్సాహంగా ర్యాలీ తీశారు. మహనీయులను స్మరించుకున్నారు. నిర్మల్లో ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, అంబేడ్కర్ చౌక్, పాత బస్టాండ్ మీదుగా వివేక్ చౌక్ వరకు కొనసాగింది. అంబేడ్కర్, స్వామి వివేకానంద విగ్రహాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భైంసాలో పద్మావతి కాలనీలోని వెంకటేశ్వరాలయం నుంచి ర్యాలీని ప్రారంభించారు. ముందుగా గాంధీగంజ్ వద్ద గల గాంధీ విగ్రహా నికి ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ పూలమాల వేశారు. అక్కడి నుంచి బస్టాండ్ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని యువతతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ జెండా ఔన్నత్యాన్ని కాపాడటం మనందరి బాధ్యతన్నా రు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, భైంసా మున్సిపల్ చైర్మన్ తూముల దత్తాత్రి, నా యకులు రావుల రాంనాథ్, భూమయ్య, స్రవంతిరెడ్డి, తక్కల రమణారెడ్డి, కరిపే విలాస్, మెడిసెమ్మ రాజు, రాజేశ్వర్రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: బీడీ కార్మికులకు పెన్షన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూని యన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం బీడీ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా రు. వయసు పైబడిన బీడీ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించకపోవడం అన్యాయమన్నారు. ప్రజాపాలన అంటే బీడీ కార్మికులకు పెన్ష న్ దూరం చేయడమేనా అని ప్రశ్నించారు. ఉపాధ్యక్షుడు కట్ట రాజన్న మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతీ బీడీ కార్మికుడికి ఆసరా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీడీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, జిల్లా ఉపాధ్యక్షుడు రామలక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శి గంగన్న, జిల్లా కోశాధికారి గఫూర్, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మి, నాయకురాలు గోదావరి, సీపీఐ ఎంఎల్ మాస్లై న్ నాయకుడు వి.మహేందర్ పాల్గొన్నారు. పెన్షన్ పోరు -
యువత చేతిలో దేశ భవిష్యత్తు
నిర్మల్చైన్గేట్: దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని సరస్వతీ విద్యాపీఠం దక్షిణ మధ్యక్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్రెడ్డి అన్నారు. స్థానిక మున్నూరుకాపు సంఘ భవనంలో రాష్టీయ్ర స్వయంసేవక్ సంఘ్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో గురువారం హిందూ యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానవక్త సుధాకర్రెడ్డి మాట్లాడుతూ యువత చదువు కుటుంబంతోపాటు దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందన్నారు. యువత ఆర్ఎస్ఎస్లో పాల్గొని దేశం కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి భీమ్లా అక్షయ్, ప్రత్యేక అతిథి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, నూకల విజయ్కుమార్, అరవింద్, శివకుమార్, బొబ్బిలి అశోక్, మాజీ కౌన్సిలర్ రవి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల సర్దుబాటులో లోపాలు సవరించాలి
భైంసాటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను ఖాళీలు ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేస్తున్న క్రమంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్ కోరారు. పట్ట ణంలో గురువారం మాట్లాడుతూ.. విద్యార్థులకు బోధనలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టడం సబబే అన్నారు. అయితే జీవో 25లోని నిబంధనల కు విరుద్ధంగా కొన్ని కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో ఉపాధ్యాయులకు అన్యాయం జరగడంతోపాటు సర్దుబాటు ఉద్దేశం దెబ్బతీస్తుందన్నారు. టీచ ర్లు అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించాల్సి ఉండగా, కోరుకున్న ప్రాంతాలకు సర్దుబాటు చేయించుకుంటున్నారని పేర్కొన్నా రు. సీని యారిటీ, నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా కొంతమంది సంఘ నా యకుల జోక్యంతో కేటాయింపులు చేయడం సరికాదన్నారు. సర్దుబాటుపై అభ్యంతరాలు తెలియజేయాలని ఒకవైపు అధికారులు సూ చిస్తూ, మరోవైపు హెచ్ఎంలు, ఎంఈవో లు వెంటనే ఉపాధ్యాయులను విడుదల చేయాలని ఆదేశించడం గందరగోళానికి దారితీస్తోందన్నారు. అభ్యంతరాలను పూర్తిస్థాయిలో స్వీకరించి, వాటిని పరిశీలించిన తరువాతే తుది జాబితా విడుదల చేయాలని కోరారు. -
అక్రమ నిర్మాణం కూల్చివేత
నర్సాపూర్(జి): మండలంలోని టెంబుర్నిలో గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని అధికారులు గురువారం కూల్చి వేయించారు. గతంలో గ్రామపంచాయతీ నిర్మాణానికి ఈ స్థలాన్ని కేటాయించారు. అయితే కొందరు దీనిని ఆక్రమించగా.. 2022లో ఈ అంశంపై కేసు నమోదైంది. గ్రామానికి చెందిన లోస్ర గంగాధర్ ఆ స్థలాన్ని మారెడ్డి అనూషకు అక్రమంగా విక్రయించాడు. మారెడ్డి అనూష గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అదే స్థలంలో నిర్మాణం చేపట్టారు. దీనిపై పంచాయతీ అధికారులు రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. జిల్లా న్యాయస్థానం అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చివేయాలని తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ 2018 చట్టం ప్రకారం గురువారం కూల్చివేత చేపట్టినట్లు ఎంపీవో తిరుపతిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ, పంచాయతీ స్థలాలను ఆక్రమించి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మల లలిత, ఉపసర్పంచ్ బ్యాగరి ముత్తన్న, కార్యదర్శి కపిలారాణి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసులతో గ్రామస్తుల గస్తీ
భైంసారూరల్: మండలంలో ఇటీవల జరుగుతున్న దొంగతనాలతో గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. చోరీల నియంత్రణకు పోలీసులు చేపడుతున్న రాత్రి పెట్రోలింగ్కు గ్రామస్తులు భక్తి మార్గంలో బాసటగా నిలుస్తున్నారు. మండలంలోని మిర్జాపూర్, వానల్పహాడ్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో రాత్రివేళల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా గ్రామస్తులు భజనలు చేస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. భజన పేరుతో ఒకచోట చేరి రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండటంతోపాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెడుతున్నారు. ప్రజల భాగస్వామ్యమే బలం...నేరాలను అరికట్టడంలో పోలీసుల చర్యలకు ప్రజల సహకారం ఎంతో కీలకమని ఎస్సై సుప్రియ అన్నారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా పోలీసులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులు–ప్రజలు కలిసి పనిచేస్తే భద్రత మరింత పటిష్టమవుతుందని, ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంచడంతోపాటు నేరగాళ్లలో భయం కలిగించవచ్చని వివరించారు. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుతూ నేరాల నియంత్రణలో వారిని భాగస్వాములను చేస్తున్న ఎస్పీ, ఏఎస్పీ చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు. -
మన్నించు రాంజీ..
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో చైన్గేట్ వద్ద కుమురంభీం విగ్రహం పక్కనే బుర్ర మీసాలు, పట్టు కాసు, విల్లంబులతో నిలబడి ఉన్న వీరుడు రాంజీగోండు. ఈ గడ్డపై ఆంగ్లేయులను, నిజాం పాలకులను గడగడలాడించిన పోరుబిడ్డ. వేలాది వీరులను తయారుచేసి చెట్లు, కొండకోనలను రక్షణగా చేసుకుని అలుపెరుగకుండా పోరాడాడు. చివరకు వెయ్యిమంది వీరులతో కలిసి ఒకే మర్రిచెట్టుకు ప్రాణాలర్పించాడు. ఆ పోరాటం వినగానే ఒళ్లు గగ్గుర్లుపొడుస్తుంది. మన గడ్డకు ఇంతటి గొప్ప చరిత్ర ఉందన్న గర్వంతో గుండె ఉప్పొంగుతుంది. పోరు నేర్పిన వీరుడునిర్మల్ కేవలం కొయ్యబొమ్మలు, కోటలు, నదుల ప్రాంతం కాదు. పరాయి పాలనను ఎదురించి ప్రా ణాలను త్యాగం చేసిన అమరవీరుల నేల. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలోనే ఈ ప్రాంతం పాల్గొన్న ఘనత ఉంది. గోండురాజు రాంజీగోండు నాయకత్వంలో ఆంగ్లేయులు, హైదరాబాద్ పాలకులపై ఏకకాలంలో పోరాటం సాగింది. అడవి బిడ్డలను ఏకం చేసి అడవులు, గుట్టలు, గోదావరిని అనుకూలంగా మలుచుకుని యుద్ధం చేశాడు. చిరునవ్వుతో ఉరికొయ్యలకురోజుల తరబడి శత్రువులకు ముప్పు తెచ్చిన రాంజీ సహా వెయ్యిమంది వీరులు దొంగదెబ్బతో పట్టుబ డ్డారు. నిర్మల్–ఎల్లపెల్లి మార్గంలోని మహా మర్రిచెట్టుకు వారినందరినీ ఒకేసారి ఉరితీశారు. ఇలాంటి ఘటన దేశ చరిత్రలోనే అరుదు. చిరునవ్వుతో ఉరి కొయ్యలను ముద్దాడిన ఆ వీరుల స్ఫూర్తి తర్వాత కుమురంభీం లాంటి యోధులకు ప్రేరణైంది. నివాళులైనా అర్పించలేమా?ప్రాణ త్యాగం చేసిన వీరులను తలుచుకుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. చైన్గేట్ వద్ద విగ్రహం, ఎల్లపెల్లి మార్గంలో స్థూపం ఉన్నా, చుట్టూ బండ్లు, బజ్జీలు, మందు సేవనం జరుగుతోంది. మర్రిచెట్టు కూలిపోయింది. స్వా తంత్య్ర దినోత్సవం రోజునైనా నివాళులు అ ర్పించడం లేదు. ముందుతరానికి వారి కథ చెప్పడం లేదు. పాలకులు, అధికారులు, స్థా నికులు నీ విగ్రహం ముందు తిరుగుతున్నా నీ త్యాగాన్ని గుర్తించలేదు. నీ స్థూపాన్ని అవమానిస్తున్నారు. మా నిర్లక్ష్యాన్ని పెద్దమనసుతో మన్నించు రాంజీ అని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కలెక్టరేట్లో బీడీ కార్మికుల నిరసన
నిర్మల్చైన్గేట్: సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో బీడీ కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం ఏవో ప్రవీణ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ.. పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులకు జీవన భృతి అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15నుంచి చేయూత పింఛన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం బీడీ కార్మికులకూ కల్పించాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు రూ.4,016 పెన్షన్ అమలు చేయాలని, రిటైర్మెంట్ తర్వాత రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పి.గంగామణి, నాయకులు క్లేమెంట్ వెస్లీ, రియాౌత్, మల్లీశ్వరి, అనూష, ఆసియా బాన్, పావని సరిన్, ఉమేరా పాల్గొన్నారు. -
వేతన వెతలు
లక్ష్మణచాంద: మూడు నెలల వేతనాలు అందక వీబీజీ రామ్జీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద కూలీలకు పని కల్పిస్తూ, వివరాలు ఆన్లైన్ చేస్తూ సకాలంలో కూలీ డబ్బులు అందేలా క్షేత్రసహాయకులు నిరంతరం శ్రమిస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలోగల 400 పంచాయతీల్లో 203 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. మే, జూన్, జూలై వేతనాలు అందక కుటుంబ పోషణకు వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. -
ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ఖానాపూర్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేర కు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, ఎంఈవో సంధ్యారాణి జెండా ఊపి ర్యా లీని ప్రారంభించారు. నాయకులు ఆకుల శ్రీని వాస్, అంకం మహేందర్, మాదిరే శ్రీనివాస్, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, అశోక్, ప్రకాశ్గౌడ్, రమేశ్, బుచ్చన్న యాదవ్, రాజశేఖర్, అశోక్రెడ్డి, శ్రావణ్, భూమన్న తదితరులున్నారు. -
అర్హులందరికీ ‘చేయూత’ అందించాలి
నిర్మల్చైన్గేట్: అర్హులందరికీ చేయూత పింఛన్లు అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష ని ర్వహించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమో దు, అర్హతల పరిశీలనతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, వ నమహోత్సవం, తెలంగాణ జలసిరి కార్యక్రమాల అమలు పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త చేయూ త పింఛన్ల కోసం ఈ నెల 31వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తులను గ్రామపంచాయతీ కార్యదర్శికి లేదా ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాలవారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందించాల ని సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లు వెంటనే ప్రారంభించి గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. మండలాల వారీగా ఇళ్ల నిర్మాణ పు రోగతిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవా లని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ జలసిరి పథకం కింద సోక్ పిట్స్, బోర్వెల్స్, ఫామ్పాండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు కఠినచర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, నిషేధిత ప్లాస్టిక్ విక్రయిస్తు న్న దుకాణాలను సీజ్ చేసి భారీ జరిమానాలు వి ధించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీ ర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వ ర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, మున్సి పల్ కమిషనర్లు రవిబాబు, సుందర్సింగ్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, అధికారులు పాల్గొన్నారు. -
‘ప్రసాద్’లో బాసరకు చోటేది?
భైంసా: దేశవ్యాప్తంగా అక్షరాభ్యాస కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ పథకంలో ఇప్పటివరకు చోటు దక్కలేదు. తెలంగాణలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నిధులు కేటాయించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బాసరకు మొండి చేయి చూపారు. లోక్సభలో బీజేపీ ఎంపీ అర్వింద్ ధర్మపురి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. స్వదేశ్ దర్శన్ కింద మహబూబ్నగర్ ఎకో టూరిజం సర్క్యూట్కు రూ.91.62 కోట్లు, ములుగు–లక్నవరం సర్క్యూట్కు రూ.79.87 కోట్లు, కుతుబ్షాహి హెరిటేజ్ పార్క్కు రూ.96.90 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ప్రసాద్ పథకం కింద అలంపూర్ జోగులాంబ ఆలయానికి రూ.38.90 కోట్లు, రామప్ప ఆలయానికి రూ.62 కోట్లు, భద్రాచలానికి రూ.41.38 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి బాసరకు నిత్యం అధికసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా విజయదశమి, వసంత పంచమి వంటి పర్వదినాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అక్షరాభ్యాసానికి దేశవ్యాప్తంగా పేరున్న బాసరను ప్రసాద్ పథకంలో చేర్చకపోవడంతో భక్తులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ చూపితేనే.. బాసర ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.270 కోట్ల నిధులు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రసాద్ పథకం కింద కేంద్రం నిధులు అందితే బాసర అభివృద్ధి ఆలయానికే పరిమితం కాకుండా జాతీయస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశముండేది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు దేశవ్యాప్తంగా బాసర ప్రత్యేకతను మరింతగా ప్రచారం చేసే వీలుండేది. జిల్లాలో బీజేపీకి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో బాసర ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రసాద్ పథకంలో చోటు కల్పించేలా ప్రత్యేక చొరవ చూపాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. -
అంతర్గతం.. అధ్వానం
ప్రియదర్శినినగర్ రోడ్ నంబర్–2లో భారీ గుంతలో నిలిచిన నీరు ఇంద్రనగర్ నుంచి గుల్లపేట వెళ్లే ప్రధాన రహదారిపై నిలిచిన నీరు గుంతలు, పశువులతో సాగర్ కాలనీ నుంచి హాస్పిటల్ వెళ్లే రోడ్డు జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షానికే భారీగా వర్షపు నీరు చేరి చిత్తడవుతున్నాయి. వాహనదారులు, పాదచారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై గుంతలు పూడ్చివేయించి ఇబ్బందులు తీర్చాలని ఆయా కాలనీలవాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
శ్రావణం.. శుభకరం
నిర్మల్రీసర్వే పనుల పరిశీలన సారంగపూర్: మండలంలోని నాగాపూర్ తండా రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్ బుధవారం పరిశీలించారు. ఆయన స్థానిక సర్వే బృందంతో మాట్లాడి గ్రామకంఠం, భూముల వివరాలు, వ్యవసాయ భూములు, పట్టాభూముల వివరాల గురించి ఆరా తీశారు. నివాస స్థలాల్లోని సర్వే నంబర్లు, వాటి వివరాలు పరిశీలించారు. సర్వే పనులు పారదర్శకంగా చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ విజయ్కాంత్రావు, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్ తదితరులున్నారు. పవిత్రమైన శ్రావణ మాసంలో వ్రతాలు, పండుగలతో ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. ఇంటింటా ప్రత్యేక పూజలతోపాటు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో మహిళలు మంగళవారాల్లో గౌరీపూజలు, శుక్రవారాల్లో లక్ష్మీపూజలు, శనివారాల్లో విష్ణుపూజలు చేస్తారు. శ్రావణ మొదటి సోమవారం 17న నాగులపంచమి, మొదటి మంగళవారం 18న మంగళగౌరీ వ్రతం ప్రారంభం కానుంది. 28న అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల క్షేమాన్ని కోరుకుంటూ రక్షాబంధన్ కడతారు. సెప్టెంబర్ 4న లోక రక్షణ కోసం విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరించిన పవి త్ర దినం కృష్ణాష్టమిని జరుపుకోనున్నారు. 11న పొలాల అమావాస్యతో శ్రావణం ముగియనుంది. వ్యాపారులకు ఊరట.. దాదాపు 60రోజులుగా వివాహాలకు ముహూర్తాలు లేకపోవడంతో ప్రధానంగా పెళ్లిళ్లపై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్న ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, వస్త్ర, నగల దుకాణాలు వెలవెలబోయాయి. పెళ్లి తంతు నిర్వహించే పురోహితులు ఖాళీగా ఉన్నారు. ఫొటోగ్రాఫర్లు, క్యాటరింగ్, డెఒరేషన్, భోజనాల తయారీదారులు డీలా పడ్డారు. శ్రా వణ మాసం రాకతో వారికి ఊరట లభించనుంది. ఆలయాలకు శోభశ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పవిత్రోత్సవాలు, తిరునక్షత్రాలు, భగవద్గీత పారాయణాలు, విష్ణు సహస్ర పారాయణాలు, శ్రీలలితా సహస్ర పారాయణాలు, కుంకుమ పూజలు నిర్వహించడానికి ఆలయాలు ముస్తాబు చేస్తున్నారు.శుభముహూర్తాలు ఇవే..ఆగస్టు 15, 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 30, సెప్టెంబర్ 3, 4 ,5, 8, 10 తేదీల్లో శుభముహూర్తాలున్నాయి. వివాహాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్నారు.హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ప్రత్యేక విశిష్టత ఉంది. శ్రావణ మాసం శివునికి ప్రీతి పాత్రమైనది కావడంతో ఈ నెల రోజులు పాటు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రమే కావడంతో ఈ మాసానికి మరింత ప్రాముఖ్యత వచ్చింది. శుభాలను కలిగించే శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. – నిర్మల్చైన్గేట్ -
పాఠశాలల్లో గ్రంథాలయాలు
ముధోల్: సెల్ఫోన్లు, కంప్యూటర్ల కారణంగా విద్యార్థుల్లో క్రమంగా తగ్గుతున్న పఠనాసక్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొదటి దశలో ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయనుంది. ఎంపికై న బడుల్లో గ్రంథాలయం నిర్వహణకు తొలుత పాఠశాల కమిటీ పేరిట రూ.15వేల నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసి గ్రంథాలయం నిర్వహిస్తే ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందించనున్నారు. గ్రంథాలయాల్లో కథలు, జీవిత చరిత్రలు, సైన్స్, సాహిత్యం, పోటీ పరీక్షలు, బాల సాహిత్యం పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గ్రంథాలయశాఖ అధికారులు తెలిపారు. ఎంపికై నవి ఇవే.. గ్రంథాలయాల ఏర్పాటుకు అధికారులు జిల్లాలోని ఎనిమిది పాఠశాలలను ఎంపిక చేశారు. మామడ మండలంలో మామడ, పొన్కల్ ఉన్నత పాఠశాలలు, నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, కడెం మండలంలోని పెద్దూర్ లింగాపూ ర్ ఉన్నత పాఠశాల, భైంసా మండల కేంద్రంలోగల కిసాన్గల్లీ బాలికల ఉన్నత పాఠశాల, తానూర్ మండలంలోని భోసి ఉన్నత పాఠశాల, కుభీర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, నిర్మల్లోని సోమవార్పేట్ హైస్కూల్ ఎంపికయ్యాయి. -
చోరీల నియంత్రణకు ‘టాస్క్’ఫోర్స్!
నిర్మల్టౌన్: జిల్లాలో దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చోరీ కేసులు ఛేదించేందుకు రెండు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ పి.శ్రీనివాస్ టాస్క్ఫోర్స్ బృందాలకు నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈమేరకు మంగళవారం ప్రెస్నోట్ విడుదల చేశారు. వారంలో 20 కేసులు ఛేదన సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు, గత నేరాల వివరాల విశ్లేషణ ఆధారంగా వారం రోజుల్లో 20 దొంగతనాలను ఛేదించామని తెలిపారు. మరో 15 కేసుల్లో కీలక ఆధారాలు లభించా యని వెల్లడించారు. బైంసా, నిర్మల్, నిర్మల్ రూర ల్, మామడ, సారంగాపూర్, లక్ష్మణచాంద, తానూర్, కడెం ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనాలు, ఆలయాల్లో చోరీ లు, ద్విచక్ర వాహనాలు, కాపర్ వైర్ చోరీలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 48 గంటల్లో హుండీ దొంగల పట్టివేత బైంసా టౌన్ పరిధిలోని పోచమ్మ ఆలయంలో జరి గిన హుండీ చోరీని 48 గంటల్లో ఛేదించామని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నింది తుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాలుడు కావడంతో చట్టప్రకారం చర్యలు చేపట్టామన్నారు. కడెం పోలీస్స్టేషన్ పరిధిలోని ఐదు దొంగతనం కేసులు కూడా ఛేదించామని తెలిపారు. నియంత్రణకు 13 చెక్పోస్టులు దొంగతనాల నియంత్రణకు జిల్లాలో 13 ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశామని వెల్ల డించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెట్టామని, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణను పటిష్టం చేశామన్నారు. నిరంతర గస్తీ, వాహన తనిఖీలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా, అనుమానాస్పద వ్యక్తుల పరిశీలన కొనసాగుతున్నాయని వివరించారు. చోరీ కేసుల్లో పెద్ద ముఠాల పాత్రపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల సంబంధాలను పరిశీలిస్తున్నామన్నారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు నిఘా, అవగాహన కార్యక్రమాలు, కేసుల నమోదు కొనసాగుతున్నాయని వివరించారు. నిర్మల్ అయ్యప్ప ఆలయం సహా ఇతర ఆలయాలు, ఇళ్ల చోరీ లపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. -
హ్యాండ్ బుక్కు సమాచారం ఇవ్వాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా సెన్సెస్ హ్యాండ్ బుక్ రూపకల్పనకు శాఖల వారీగా సమాచారం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సెన్సెస్ హ్యాండ్ బుక్ రూపకల్పనపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని జనాభా, అక్షరాస్యత, భౌగోళిక పరిస్థితులు, విద్య, వైద్యం, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, వివిధ ప్రభుత్వ శాఖల వారీగా లభ్యమయ్యే సమాచారాన్ని అత్యంత కచ్చితత్వంతో సేకరించాలన్నారు. భవిష్యత్తులో జిల్లా సమగ్ర అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలుకు, భౌగోళిక, సాంస్కృతిక అంశాల్లో అభివృద్ధికి ఈ సెన్సస్ హ్యాండ్ బుక్ ప్రామాణికంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రణాళిక, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వైద్యారోగ్య శాఖల అధికారులు సమన్వయంతో నిర్ణీత గడువులోగా నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. సేకరించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించిన తర్వాతే నివేదికలో పొందుపరచాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, సీపీవో గంగారెడ్డి, ఆర్డీవో దేవీదాస్, అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాలలు ఎట్లున్నయ్!
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తూ, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, రెండు జతల యూనిఫామ్లు అందజేస్తోంది. అదనంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు నాణ్యమైన, రుచికరమైన, పోషక విలువలు గల మధ్యాహ్న భోజనం అందిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత కోసం గతేడాది నుంచి ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు అమలులో ఉంది. తనిఖీలకు అకడమిక్ ప్యానెల్ బృందాలు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అకడమిక్ ప్యానెల్ బృందాలు ఏర్పాటు చేసింది. ఎంపికై న బృందాల్లోని ఉపాధ్యాయులకు ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో రెండు రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. శిక్షణ అనంతరం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఈ నెల 21 నుంచి తనిఖీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. జిల్లాలో ఆరు బృందాలు జిల్లాలో 577 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 89 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి తనిఖీకి ఆరు బృందాలను నియమించారు. ప్రాథమిక పాఠశాలల కోసం ఐదు బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రతీ బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒకరు ఎఫ్ఎల్ఎన్ హెచ్ఎం, ఇద్దరు ఎస్జీటీలు. ప్రాథమికోన్నత పాఠశాలల తనిఖీకి ఒక బృందం ఉంది. ఇందులో ఒకరు స్కూల్ అసిస్టెంట్, ఇద్దరు ఎస్జీటీలు సభ్యులుగా ఉన్నారు. తనిఖీ చేసే అంశాలు.. పకడ్బందీగా నిర్వహిస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని పలు విషయాలను తని ఖీ చేయడానికి ఆరు బృందాలు ఏర్పాటు చేశారు. ఈనెల 21 నుంచి తనిఖీలు మొదలవుతాయి. ఈ బృందాల ద్వారా పకడ్బందీగా తనిఖీలు చేసేలాగా చ ర్యలు తీసుకుంటున్నాం. – భోజన్న, డీఈవో -
ఈహెచ్ఎస్ అమలు చేయాలి
సారంగపూర్: ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీమ్ ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం బాధాకరమని, ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దుర్శనం దేవేందర్, గడ్డం భూమన్న కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ మూడు నెలల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల నుంచి కోత విధిస్తున్నప్పటికీ నేటికీ హెల్త్కార్డులు జారీ చేయకపోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే ఉపాద్యాయులు, ఉద్యోగులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయని, పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల డీఏలు, ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన బదిలీలు అమలు చేయాలన్నారు. జిల్లా నాయకులు పుట్ట రవికిరణ్, తాళ్ల చిన్నయ్య పాల్గొన్నారు. -
చిట్యాల్లో ప్లాస్టిక్ బ్యాన్
నిర్మల్ రూరల్: మండలంలోని చిట్యాల్ గ్రామ ప్రజలు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో ప్లాస్టిక్ను నిషేధించారు. ఇక నుంచి స్టీల్ డబ్బాలు, జూట్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిళ్లను వాడుతామని ప్రకటించారు. గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరై గ్రామస్తుల నిర్ణయాన్ని అభినందించారు. డీఆర్డీవో విజయలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో మార్కెట్కి వెళ్లినప్పుడు జూట్ బ్యాగులు తీసుకెళ్లే వారని.. ప్రస్తుతం అంతా ప్లాస్టిక్ మయం అయిందన్నారు. ప్లాస్టిక్ నిషేధించాలని గ్రామస్తులంతా కలిసి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ విధానాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గ్రామంలో ప్రతీ ఇంట్లో చర్చ జరగాలని సూచించారు. ఇతర గ్రామాల ప్రజలు చిట్యాల్ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సురేశ్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నిషేధాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలన్నారు. యువత మత్తు పదార్థాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఆర్డీవో రాందాస్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్తో క్యాన్సర్ భూతం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధించాలని సూచించారు. డీఎంహెచ్వో రాజేందర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరుగుతోందని, దీనివల్ల క్యాన్సర్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సర్పంచ్ ఏనుగు సుప్రియ మాట్లాడుతూ.. గ్రామంలో ప్లాస్టిక్ నిషేధించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. గ్రామస్తులు, వీడిసి, యువత సహకారంతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ ఇంటికి ఒక వాటర్ బాటిల్, జూట్ బ్యాగు, టిఫిన్ డబ్బా ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. అంతకుముందు విద్యార్థులు, గ్రామస్తులు ప్లాస్టిక్కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. డీఏవో అంజిప్రసాద్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సుధాకర్, ఎంఈవో విజయస్వప్న, ఎంపీవో శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
నిర్మల్చైన్గేట్: నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. కడ్తాల్ సమీపంలోని సాగర్ కన్వెన్షన్లో 15న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. కొంతమంది లబ్ధిదారులను కార్యక్రమానికి ఆహ్వానించాలని తెలిపారు. సరైన లైటింగ్, సౌండ్ సిస్టం, ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఎప్పటికప్పుడు తాగునీరు అందిస్తూ ఉండాలన్నారు. సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిశోర్కుమార్, ఆర్డీవో దేవిదాస్, పౌరసరఫరాల అధికారి రాజేందర్ పాల్గొన్నారు. -
పంపిణీ ప‘రేషాన్’
లోకేశ్వరం : ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్డుల సంఖ్యకు దుకాణాల సంఖ్య పెంచడం లేదు. కొన్ని చోట్ల పరిమితికి మించి కార్డుదారులు ఉండగా, మరికొన్ని చోట్ల బియ్యం తెచ్చుకోవడానికి దూర ప్రయాణం చేయాల్సి వస్తుండటంతో లబ్ధిదారులకు నెలనెలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 2.49 లక్షల కార్డులు.. జిల్లావ్యాప్తంగా 2,49,583 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వం కొత్తగా 41,954 రేషన్ కార్డులను మంజూరు చేసింది. ప్రస్తుతం వాటి ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల పరిధిలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం అందజేస్తున్నారు. పలు మండలాల్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో గోదాములు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 16 రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. చాలా చోట్ల సహాయకులు లేకుండానే డీలర్లు బియ్యం అందజేస్తున్నారు. దీంతో పంపిణీ ఆలస్యం అవుతోంది. దుకాణాలు పెరిగితే ప్రజల ఇబ్బందులు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. కొత్త పంచాయతీల్లో.. జిల్లాలో గతంలో నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. అయినా ఆయా గ్రామాల్లో కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయలేదు. పలు తండాలను పంచాయతీలుగా మార్చినా అక్కడా కొత్త షాపులు రాలేదు. దీంతో ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించి రేషన్ దుకాణాల నుంచి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. నూతన రేషన్ కార్డులతోపాటు ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బియ్యానికే పరిమితం.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆసరాగా ఉండాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాలు కేవలం అలంకార ప్రాయంగా మారుతున్నాయి. గతంలో రేషన్ షాపుల్లో బియ్యం, కిరోసిన్, పసుపు, పప్పు, పంచదార, పామాయిల్తో పాటు వివిధ సరుకులను ప్రభుత్వం రాయితీ ధరలకు అందించేది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త విధానాలు అమలు చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే సరుకులను తగ్గిస్తున్నాయి. జిల్లా వివరాలు.. గ్రామపంచాయతీలు 400 రేషన్ దుకాణాలు 412 ఆహారభద్రతాకార్డులు 2,49,583 కొత్తగా మంజూరు చేసిన కార్డులు 41,954 అంత్యోదయ కార్డులు 13,013 అన్నపూర్ణ కార్డులు 32 -
నిర్మల్
‘స్వర్ణ’ను చెరబట్టారు ఒకప్పుడు స్వర్ణ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి సిబ్బంది ఉండేది. ఉద్యోగులు పదవీ విరమణ పొంది తాము ఉన్న క్వార్టర్లలో తిష్ట వేసుకుని ఉన్నారు. స్థలాలు కబ్జా అవుతున్నాయి. ఈవీఎం గోదాం తనిఖీ నిర్మల్చైన్గేట్: కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ భవేశ్ మిశ్రా సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలన సీసీ కెమెరాలు, అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, అగ్నిమాపక అధికారి శివాజీ, తహసీల్దార్ రాజు, అధికారి స్వాతి ఉన్నారు.ఎస్ఐఆర్ వివరాలు చెక్ చేసుకుంటున్న నాయకులు, ఓటర్లు(ఫైల్)నిర్మల్: జిల్లాలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో కీలకఘట్టం పూర్తయింది. ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయడంలో జిల్లా యంత్రాంగం వందశాతం లక్ష్యాన్ని చేరుకుంది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,55,344 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించి, పూర్తి వివరాలతో సేకరించారు. ఈనెల 10తో గడువు ముగిసింది. సేకరించిన ప్రకారం జిల్లాలో 6,42,174 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. మరో 1,13,170 మంది ఓటర్ల వివరాలు యూఈఎఫ్(మృతులు, ఆచూకీలేనివారు, డబుల్ఓట్లు, వలసలు)గా ఆన్లైన్లో నమోదు చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో.. నిర్మల్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో మొత్తం 2,64,070 మంది ఓటర్ల వివరాలు నమో దు చేశారు. ఇందులో 2,19,763 ఈఎఫ్(ఎన్యూమరేషన్ ఫామ్)లు డిజిటైజ్ కాగా, 44,307 యూ ఈఎఫ్(అన్ మ్యాప్డ్ ఎన్యూమరేషన్ ఫామ్)లు న మోదయ్యాయి. నియోజకవర్గం ఈఎఫ్ డిజి టైజేషన్ శాతం 83.22గా నమోదైంది. ఖానాపూర్ నియోజకవర్గంలో.. ఖానాపూర్ నియోజకవర్గంలో జిల్లాలోని కడెం, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, సిరికొండ, మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలాలు ఉన్నాయి. మొత్తం 2,30,162 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు నమోదు చేశారు. ఇందులో 2,00,165 ఈఎఫ్లు డిజిటైజ్ కాగా, 29,997 యూఈఎఫ్లు నమోదయ్యాయి. 86.97 శాతం డిజిటైజేషన్ నమోదైంది. యూఈఎఫ్లలో నిర్మల్ అర్బన్ టాప్ మండలాల వారీగా చూస్తే జిల్లాలో నిర్మల్ అర్బన్లో అత్యధికంగా 26,926 యూఈఎఫ్లు నమోదయ్యాయి. ఆ తర్వాత భైంసాలో 20,853, ఖానాపూర్లో 5,638 యూఈఎఫ్లు నమోదయ్యాయి. ఈఎఫ్ డిజిటైజేషన్ శాతంలో దస్తురాబాద్ 94.74 శాతంతో ముందంజలో ఉంది. ఆ తర్వాత తానూరు 92.18, లోకేశ్వరం 91.79, సోన్ 91.74 శాతం నమోదయ్యాయి. నిర్మల్ అర్బన్లో 70.98 శాతం ఈఎఫ్లు నేరుగా డిజిటైజ్ కాగా, 26,926 యూఈఎఫ్లతో మొత్తం వందశాతం వివరాలు పూర్తయ్యాయి. సర్ జాబితా వివరాలు.. మొత్తం ఓటర్లు 7,55,344 నిర్మల్ 2,64,070 ముధోల్ 2,61,112 ఖానాపూర్ 2,30,162 ఈఎఫ్ డిజిటైజ్ 6,42,174 యూఈఎఫ్ 1,13,170 శాతం 85.02లక్షకుపైగా ఓట్లు గల్లంతు... సర్ నివేదిక ప్రకారం జిల్లాలో మొత్తం 1,13,170 మంది ఓటర్ల వివరాలు యూఈఎఫ్(అన్మ్యాప్డ్/అన్మ్యాచింగ్ ఎన్యూమరేషన్)గా నమోదయ్యాయి. వీటినే గల్లంతైన ఓటర్లుగా పరిగణించవచ్చు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. ఖానాపూర్ 29,997 మంది, నిర్మల్ 44,307, ముధోల్ 38,866 మంది ఓట్లు తొలగించనున్నారు. ఇందులో మరణించిన వారు 26,864 మంది, ఆచూకీ లభించనివారు 26,615, శాశ్వతంగా వలసవెళ్లినవారు 41,765, డబుల్ ఓట్లు ఉన్నవారు 17,926 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరు అన్ మ్యాపింగ్గా గుర్తించిన వారు మాత్రమే. ఈనెల 17 ముసాయిదా(డ్రాఫ్ట్) విడుదలైన తర్వాత తొలగింపులు/చేర్పులకు అవకాశమిస్తారు. అక్టోబర్ 19న పూర్తిస్థాయి మార్పులు/చేర్పులతో ఫైనల్ జాబితా వెల్లడిస్తారు. ముధోల్లో..ఈ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో మొత్తం 2,61,112 మంది ఓటర్ల వివరాలు నమోదు చేశారు. 2,22,246 ఈఎఫ్లు డిజిటైజ్ కాగా, మృతులు, ఆచూకీ లేనివారు, వలసలు, డబుల్ ఓట్లు అన్నీ కలిపి 38,866 మంది తేలారు. నియోజకవర్గంలో ఈఎఫ్ డిజిటైజేషన్ శాతం 85.12గా నమోదైంది. -
పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పెంబి: గ్రామ పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని అంకెన గ్రామ పంచాయతీ భవనాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. గిరిజనుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన గుర్తు చేశారు. అనంతరం సర్పంచ్ సురేశ్ను నూతన గ్రామ పంచాయతీ భవనంలో సన్మానించారు. గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించే వ్యవసాయ గోదాంకు భూమిపూజ చేశారు. గిరిజన గ్రామాల రోడ్డు, వంతెన పనులు అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో నిలిచిపోతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిసె రమేశ్, నాయకులు స్వప్నీల్రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బీడీ కార్మికులకు ఏదీ చేయూత
భైంసాటౌన్: రెక్కాడితే గానీ డొక్కాడని బీడీ కార్మికుల జీవితాల్లో ఆశల దీపాలు వెలగడం లేదు. దశాబ్దాలుగా పొగచూరుతున్న కార్మికుల బతుకుల్లో వెలుగులు నిండడం లేదు. ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చిన హామీలు నీటి మూటలవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకంలో కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు నిర్ణయించింది. ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితుల నుంచి మాత్రమే నూతన ఫించన్లకు దరఖాస్తులు స్వీకరించనుండగా, బీడీ కార్మికులకు మొండిచేయి చూపింది. చేయూతలో బీడీ కార్మికులను విస్మరించడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో లక్షన్నరకు పైగా.. జిల్లాలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు దాదాపు లక్షన్నరకుపైగా ఉన్నారు. వీరిలో బీడీలు చుట్టే మహిళలతోపాటు పరిశ్రమలో పనిచేసే ప్యాకర్లు, చాట్వాలాలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 61,933 మంది బీడీ కార్మికులకు పింఛన్లు అందుతున్నాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా.. కొంతమందికి మాత్రమే పరిమితమైంది. ఒకే ఇంట్లో ఇద్దరు బీడీ కార్మికులు ఉంటే ఒక్కరికే పింఛన్ ఇవ్వడం, కటాఫ్ తేదీల పేరుతో వేలాది మంది పథకానికి దూరమయ్యారు. ఆ తరువాత ప్రతీసారి ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తామని, రూ.4,016కు పెంచుతామని హామీలు ఇచ్చారు. కానీ, ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కార్మిక సంఘాల ఆందోళన.. ప్రభుత్వం నూతనంగా అందించనున్న చేయూత పింఛన్లకు బీడీ కార్మికుల ప్రస్తావన లేకపోవడంతో కార్మిక సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపునిచ్చారు. రాత్రింబవళ్లు పొగాకు వాసన పీలుస్తూ క్షయ, ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్న కార్మికులకు సరైన వైద్య సదుపాయాలు కరువయ్యాయి. బీడీ కార్మికుల ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంటోంది. ఒకవైపు ప్రభుత్వాల ఆంక్షలు, మరోవైపు కంపెనీల దోపిడీతో బీడీ పరిశ్రమ రోజురోజుకూ కుదేలవుతోంది. కొన్ని యాజమాన్యాలు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పని దినాలు అమలు చేస్తున్నాయి. దీంతో కార్మికుల ఉపాధి దెబ్బతింటోంది. చాలీచాలని కూలీతో కుటుంబాన్ని పోషించుకోవడం గగనంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయూత పింఛన్ అందిస్తే ప్రయోజనంగా ఉంటుందన్న డిమాండ్ వినిపిస్తోంది. -
పింఛన్లు అందించాలి...
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు పింఛన్ అందించాలి. ఆంక్షలు లేకుండా ప్రతీ కార్మికురాలికి జీవన భృతి అమలు చేయాలి. చాలీచాలని వేతనాలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఓట్ల కోసం వచ్చే నేతలు పింఛన్ ఇప్పిస్తామన్నరు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. – ఆర్తి, బీడీ కార్మికురాలు, భైంసా కార్మికులందరికీ ఇవ్వాలి.. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేయాలి. బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా జీవనభృతి అందించాలి. ఓట్ల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచాక మరచిపోవడం సరికాదు. అలాగే, పింఛన్ను రూ.4,016కు పెంచాలి. లేనిపక్షంలో కార్మికుల పక్షాన ఆందోళనలు చేపడతాం. – హరిత, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షురాలు, భైంసా -
శతావధానంలో జిల్లా కవులు
నిర్మల్ఖిల్లా: మంచిర్యాల జిల్లా సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం లక్ష్మీనరసింహ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన డాక్టర్ మారేపల్లి పట్వర్ధన్ శతావధానం కార్యక్రమంలో జిల్లా పద్యకవులు దత్తపది ప్రాశ్నికులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కడారి దశరథ్, కొండూరు పోతన్న, కోవెల శ్రీనివాసాచార్యులు, బొందిడి పురుషోత్తంరావు, శ్రీమతి వల్లంభట్ల వనజ, శఠగోపం నరేషాచార్యులు పాల్గొని తమ సాహితీ ప్రతిభను చాటారు. కార్యక్రమ నిర్వాహకులుగా నోముల చంద్రశేఖర్, దండనాయకుల వామన్రావు వ్యవహరించగా, అవధాన కార్యక్రమానికి దత్తాత్రేయ సంచాలకులుగా, అనంతకృష్ణ అధ్యక్షులుగా వ్యవహరించారు -
పాత కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
నిర్మల్టౌన్: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని ఎస్పీ జానకీషర్మిల పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ, రౌడీషీటర్లపై నిఘా తదితర అంశాలపై సమీక్షించారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలి.. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై సంబంధిత ఎస్డీపీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. కేసుల పురోగతిపై ఎస్హెచ్వోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి, పాత కేసుల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. మాన్యువల్ రికార్డులు, సీసీటీఎన్ఎస్ నమోదుల మధ్య వ్యత్యాసాలు సరిచేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై నిఘా.. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. చోరీల నియంత్రణకు చర్యలు.. ఇళ్ల దొంగతనాలు, వాహన చోరీలు, చైన్ స్నాచింగ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. క్లూస్ టీమ్, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. రాత్రి గస్తీని పెంచడంతోపాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచి ప్రజల సహకారంతో చోరీలు అరికట్టాలని తెలిపారు. సైబర్ మోసాలపై అలర్ట్.. ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే గోల్డెన్అవర్లోపు 1930 హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలన్నారు. లేదా ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. నిత్యం డ్రంక్అండ్డ్రైవ్లు.. ప్రతిరోజూ సాయంత్రం డ్రంక్అండ్డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఫేక్ నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్ల మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ పోలీసు ప్రధాన కార్యాలయంలోని వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల కండీషన్, నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వాహనాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, అన్ని పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పీఆర్సీ ప్రకటించాలి
నిర్మల్టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావా ల్సిన పీఆర్సీ ఇప్పటివరకు ప్రకటించకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దర్శనం దేవేందర్, గడ్డం భూమన్న అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని కోరారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 101 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీ ఉద్యోగులు, గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. టీఆర్టీఎఫ్ గౌరవాధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా నాయకులు రవికిరణ్, పెంట పవన్, భోజన్న పాల్గొన్నారు. -
నిర్మల్లో జైల్భరో
నిర్మల్టౌన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్లో జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజన్న మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూల, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రతను కాపాడాలని కోరారు. మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చెరువుకు చేరనున్న చేప
లక్ష్మణచాంద: మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా చెరువుల్లోకి ఉచితంగా చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈసారి జూలై నెల చివరి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో చెరువుల్లో నీళ్లు నిండకపోవడంతో టెండర్ల ప్రక్రియ కొంత ఆలస్యం అయినట్టుగా అధికా రులు అంటున్నారు. ఇక ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చెరువుల్లోకి, ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెల 17 వరకు గడువు ఈ నెల 6న ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ ఈ నెల 17 వరకు గడువు ఉందని జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ తెలిపారు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ సమక్షంలో టెండర్లు తెరవనున్నారు. టెండర్లలో రెండు షెడ్యూళ్లకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిచి తక్కువ ధర కోట్ చేసిన వారికే చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. టెండర్ వచ్చిన గుత్తేదారుల చేప పిల్లల పెంపకం కేంద్రాలను తనిఖీ చేసి అర్హతలున్న వారిని ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చే నెల మొదటి వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ చివరి వరకు చెరువుల్లోకి చేప పిల్లలను వదిలే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. జిల్లాలో ఇలా... జిల్లాలో మొత్తం 19 మండలాలు, 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 557 చెరువులు, 4 ప్రా జెక్టుల్లో చేప పిల్లలను వేసేందుకు మత్స్యశాఖ అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 427. 35 లక్షల చేప పిల్లలు వదిలేందుకు అధికారులు కా ర్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. 35 ఎం.ఎం. నుంచి 40 ఎం.ఎం. పరిమాణం గల చేప పిల్లలను 480 చెరువుల్లో 215.76 లక్షలు, 80 ఎం.ఎం నుంచి 100 ఎం.ఎం. పరిమాణం గల చేప పిల్లలను 77 చెరువుల్లో 82.21 లక్షలు, అలాగే 80 ఎం.ఎం. నుంచి 100 ఎం. ఎం. పరిమాణం గల చేప పిల్లలను 4 ప్రాజెక్టుల్లో 129.38 లక్షల చేప పిల్లలను వదలనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలోని మత్స్యకారులకు మెరుగైన ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ఈ నెల 17 వరకు స్వీకరిస్తాం. గడువులోగా టెండరు దారులు ముందుకు వస్తే సకాలంలో చేప పిల్లలను వంద శాతం సబ్సిడీతో మత్స్యకారులకు అందించి జీవనోపాధి కల్పించేందుకు తగిన చర్యలు చేపడుతాం. – అవినాష్, జిల్లా మత్స్యశాఖ అధికారిజిల్లా సమాచారం.. మొత్తం మత్స్యకార సంఘాలు 225సంఘాల్లో సభ్యులు 13,348జిల్లాలో ఎంపికై న చెరువులు 557పంపిణీ చేసే చేప పిల్లలు 297.97 లక్షలు ఎంపికై న ప్రాజెక్టులు 04పంపిణీ చేసే చేప పిల్లలు 129.38 లక్షలు మొత్తం చేప పిల్లలు 427.35 లక్షలు -
ఎరువుల విక్రయాల్లో డీలర్ల దోపిడీ
తానూరు: ఎరువుల విక్రయాల్లో దళారుల ప్రమే యం లేకుండా పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ వ్యవస్థ రూపొందింది. ఇంత వరకు బాగానే ఉన్న సంబంధిత అధి కారుల పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్లు రైతుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో అన్నదాతపై అదనపు భారం పడుతోంది. ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రైతుల ఫిర్యాదు ... తానూరు మండలంలోని పలు గ్రామాల్లోని కేంద్రాల్లో సంబంధిత డీలర్లు ఒక్కో యూరియా బస్తాకు రూ.54 అదనంగా వసూలు చేస్తుండడంపై ఝరి(బి)తోపాటు పలు గ్రామాల రైతులు ఏవోకు ఫిర్యాదు చేశారు. బస్తాకు రూ.54 అదనంగా తీసుకుంటున్నారని తెలిపారు. స్పందించిన ఏవో డీలర్ల సెంటర్లు తనిఖీ చేస్తామని తెలిపారు. చర్యలు తీసుకుంటాం ఆయా గ్రామాల్లోని సెంటర్లలో యూరియా బస్తా బిల్లుకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఫిర్యాదు చేశారు. మండలంలో ఉన్న సెంటర్లను తనిఖీ చేసి అదనంగా వసూలు చేసిన డీలర్లపై చర్యలు తీసుకుంటాం. అధిక ధలరకు విక్రయించేవారిపై రైతులు ఫిర్యాదు చేయాలి. – మనీషా, ఏవో, తానూరు ఈ రైతు పేరు అసం మాధవ్. తానూరు మండలం ఝరి(బి) గ్రామానికి చెందిన తన సోదరి సురేఖబాయి పేరిట ఆన్లైన్లో 3 యూరియా బస్తాలు బుక్చేశాడు. బోరిగాం గ్రామంలోని(డీసీఎంఎస్) డీలర్ వద్దకు వెళ్లి యూరియా బస్తాలు పొందాడు. ఽఒక బస్తా ధర రూ.266 కాగా రూ.320 తీసుకుంటున్నారు. సంబంధిత డీలర్ మూడు బస్తాలకు రూ.960 వసూలు చేసి.. బిల్లు మాత్రం రూ.798 ఇచ్చాడు. ఒక్కో బస్తాకు రూ.54 అదనంగా చెల్లించాడు. జిల్లాలోని రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. -
పల్లెకు చేరువగా ప్రజావాణి
నిర్మల్చైన్గేట్: అనేక వ్యయప్రయాసలకు గురవుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామీణులు అర్జీలు చేతపట్టుకుని ప్రతీ సోమవారం జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కలెక్టర్కు చెప్పుకుంటే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. ప్రజావాణికి వచ్చిన రోజు పని బంద్ పెట్టుకోవాల్సిందే. ఒకవైపు దూరభారం, ఇంకోవైపు ఖర్చులు, మరోవైపు ఇతర పని చేసుకునే వీలు ఉండదు. ఈ క్రమంలో ప్రజావాణిని మండల స్థాయిలో నిర్వహించాలని విన్నపాలు వచ్చాయి. దీంతో గ్రామీణుల ముంగిటకు అధికార యంత్రాంగాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రతీ సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. వికేంద్రీకరణతో జిల్లాలోని 18 మండలాలు, 400 గ్రామాల ప్రజలకు వెసులుబాటు కలుగుతుంది. ఎంపీడీవో నోడల్ అధికారిగా ప్రజావాణి కార్యక్రమాన్ని వెంటనే అమలుచేసే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు ఈనెల 10వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కావాలి. కానీ, బోనాల పండుగ సెలవు ఉండడంతో 17వ తేదీ నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి మొదలవుతుందని తెలు స్తోంది. గ్రామీణ ప్రజలు మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి ఉపయోగించుకుంటారా అనే సందిగ్ధం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంతోపాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజా వాణి నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ తర్వాత జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజావాణి ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా మే 4 రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ప్రజావాణి ప్రారంభించారు. తగ్గనున్న దూర, ఆర్థిక భారం.. జిల్లాలోని 400 గ్రామాల ప్రజలు సమస్యలు కలెక్టర్కు విన్నవించుకోవడం ద్వారా పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసంతో ప్రతీ సోమవారం కలెక్టరేట్ కు వస్తున్నారు. దీనివల్ల దూర భారమే కాకుండా ఆ ర్థికంగా ఇబ్బందులు కూడా పేద, మధ్యతరగతి ప్ర జలు ఎదుర్కొంటున్నారు. పలు మండలాలు కలెక్టరేట్కు 60 కిలోమీటర్ల పైనే దూరం ఉన్నప్పటికీ ప్ర జలు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. దీనికి తోడు ఒక్కో దరఖాస్తుదారుడు తన సమస్యను విన్నవించుకోవడానికి రూ.200లకు పై గా ఖర్చు చేస్తున్నారు. ఒకసారితో సమస్య తీరడం లేదని, నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతు న్న వారూ ఉన్నారు. అంతేకాకుండా నిర్మల్ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ చేరుకోవాలంటే ఆటో చార్జి రూ.150 వసూలు చేస్తున్నారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి గ్రామాల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు.నిధుల లేమితో పరిషత్లు.. ఒకప్పుడు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నటువంటి మండల, జిల్లా పరిషత్లు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. 2019 నుంచి నిర్వహణ నిధులు విడుదల కావడం లేదు. కొందరు ఎంపీడీవోలు తమ సొంత నిధులతో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రజావాణి బాధ్యతలను మండల పరిషత్లకే అప్పగించింది. ఈ కార్యక్రమానికి మండల ప్రజావాణికి దాదాపు 23 శాఖల నుంచి అధికారులు హాజరవుతారు. తహసీల్దార్, వ్యవసాయ, ఉద్యాన, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, గహ నిర్మాణం, మిషన్ భగీరథ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్ ఇలా అధికారులు అందరూ ప్రజావాణికి వస్తారు. ఈ నేపథ్యంలో నిధులు విడుదల చేస్తేనే కార్యక్రమం విజయవంతం కానుంది. ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి ఆర్డీవో స్థాయిలో ఏర్పాటు చేసి మూడు నెలలు గడుస్తున్నా దరఖాస్తులు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆర్డీవోలకు ఒకటి రెండు దరఖాస్తులు మాత్రమే వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఐదు, ఆరు దరఖాస్తులు దాటడం లేదు. ప్రతీ సోమవారం కలెక్టర్కు 120 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. ఈక్రమంలో మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
పంట మార్పిడితో అధిక లాభాలు
లక్ష్మణచాంద: పంట మార్పిడి విధానంతో అ ధిక లాభాలు పొందవచ్చని నిర్మల్ డివిజనల్ హార్టికల్చర్ అధికారి మౌనిక అన్నారు. సోన్ మండలం కూచన్పెల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ఒకేవిధమైన పంటలు సాగు చేయడం వల్ల నేల సారం కోల్పోవడంతోపాటు దిగుబ డులు తగ్గుతాయన్నారు. పంట మార్పిడి పా టించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఎక్కువ పడే అవకాశం లేదని, ఈ పరిస్థితుల్లో వరికి బదులు ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుము, నూనె గింజల పంటలైన నువ్వులు, వేరుశనగ సాగు చేయాలని సూచించారు. లాభదాయకమైన ఆయిల్పామ్ సాగుచేయాలని తెలిపారు. సోన్ ఏఈవో ఉమామహేశ్వరి, సర్పంచ్ మమత, ఉప సర్పంచ్ రాజమణి పాల్గొన్నారు. -
పురివిప్పిన ప్రకృతి అందం
నిర్మల్: ‘వావ్.. అటు చూడు.. వంపుల ఒంపుసొంపులతో ‘సహ్యాద్రి’ పచ్చనికోక కట్టినట్లు ఎంత అందంగా ఉందో.. అదిగదిగో.. అక్కడ.. కనిపిస్తోందా.. ‘కడెం’ నిండుకుండలా ఎలా తొణకిసలాడుతోందో..! ఆ దిక్కు చూడు గలగలా గోదారి కొత్తనీళ్లతో ఎలా ఉరుకులు తీస్తోందో..! అక్కడ చూడు.. అంతెత్తు నుంచి వాస్తాపూర్ జలపాతం ఎలా జాలువారుతోందో.. అసలు.. ఉట్టిగనే అలా.. కాసేపు ఖానాపూర్ వైపో లేదంటే ఆదిలాబాద్ ది క్కునో వెళ్లిచూడు.. మనసుకు హాయినిచ్చే పచ్చద నం వెంటే వస్తుంది. ఇటీవల కురిసిన వానలకు పురివిప్పిన ప్రకృతి తన అందాలతో ప్రకృతి ప్రే మికులను కనువిందు చేస్తోంది. సహజసిద్ధమైన ఎన్నో ప్రకృతి అందాలున్న జిల్లా ఈ సీజన్లో మ రింత సొగసులు అద్దుకుంటుంది. కాస్త ఓపికతో పాటు జర.. జాగ్రత్తగా అలా అడుగు బయటపెడితే మన చెంతనే ఈ అందాలను ఆస్వాదించవచ్చు. జాగ్రత్తలు తప్పనిసరి..పచ్చని ప్రకృతి అందాల వీక్షణానికి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలూ తప్పనిసరి. వర్షాకాలం కనుక జలపాతాలు, వాగుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు పడే ప్రాంతంలో, దిగువ ప్రాంతంలో నీళ్లల్లో ఉండొద్దు. ఎప్పుడు పైనుంచి వరద పెరుగుతుందో చెప్పలేం. స్థానికం వర్షం కురిసినా, కురవకపోయినా.. ఎగువ నుంచి వచ్చే వరదతో జలపాతం ఉప్పొంగవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. పచ్చని ప్రదేశాల్లో పాములు, తేళ్లు ఉండే అవకాశాలు ఎక్కువ. కాసింత ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్తేనే మంచిది. మనం వెళ్లే ప్రాంతంతో ఎంతోకొంత పరిచయం ఉన్నవాళ్లను వెంట తీసుకెళ్లడం ఉత్తమం.వాస్తాపూర్ జలపాతంవాస్తాపూర్ జలసౌందర్యం...ప్రకృతి ఒడిలో జాలువారే జలసౌందర్యం.. వాస్తాపూర్ జలపాతం. నిర్మల్ నుంచి మామడ మండలంలోని తాండ్ర గ్రామం మీదుగా వాస్తాపూర్ వెళ్లాల్సి ఉంటుంది. ఎన్హెచ్–44 బైపాస్ నుంచి కేవలం 5 కి.మీ. మాత్రమే ఉంటుంది. నిర్మల్ నుంచి 20 కి.మీ. వరకు వస్తుంది. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. కాస్త జాగ్రత్తగా ఉంటే అక్కడి అందాలను ఆస్వాదించవచ్చు. ఎన్హెచ్–44పై తాండ్ర గ్రామం నుంచి ఆదిలాబాద్ వైపు ఇంకాస్త ముందుకు వెళ్తే నేరడిగొండ మండలంలోని కొరటికల్, కుంటాల జలపాతాలనూ చూడొచ్చు. ఒంపుసొంపుల అందాలు..హైదరాబాద్–నాగపూర్ దారిలో ఎన్హెచ్–44పై వెళ్తుంటే.. నిర్మల్ జిల్లాకేంద్రానికి 10–12కి.మీ. దూరంలో సహ్యాద్రి పర్వతాల చివరి సానువులు పరిచయం చేసుకుంటాయి. ఒంపులు తిరిగే ఘాట్రోడ్డు, చుట్టూ పచ్చని, ఎత్తయిన చెట్లతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రకృతితోపాటు సాహసయాత్రలను ఇష్టపడే పర్యాటకులు, సందర్శకులకు ఈ రహదారి ఆహా.. అనిపిస్తుంది. ఘాట్రోడ్డు ప్రారంభంలోనే కొంత దూరంలో ఇటీవల బాహుబలి పేరిట ఓ పొడవాటి జలపాతాన్ని గుర్తించారు. కానీ.. అది కేవలం వర్షం ఎక్కువగా కురిసినప్పుడే పారుతుంది. ఈమధ్య ఇక్కడికి అటవీ అధికారులు వెళ్లనివ్వడం లేదు. ఘాట్రోడ్డు మధ్యలో ఉన్న వాచ్టవర్ వద్ద నుంచి కిందికి వీక్షిస్తే.. పచ్చని అటవీ అందాలు మనసుకు ఎంతో హాయినిస్తాయి. కాస్త జల్లులు పడి, పొగమంచు కురుస్తున్నట్లుగా ఉన్న వేళ.. అలా సహ్యాద్రి మార్గంలో వెళ్తుంటే కశ్మీర్ను తలపిస్తుంది. -
నిరీక్షణకు మోక్షం
నిర్మల్చైన్గేట్: అర్హులైన నిరుపేదలకు అందించే చేయూత పింఛన్ల మంజూరుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పింఛన్ ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ లాగిన్ ఓపెన్ అయింది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 15 నాటికి అర్హులను ఎంపిక చేసి, సెప్టెంబర్ నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 1,44,773 మంది చేయూత పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. నూతన ఫార్మాట్లోనే దరఖాస్తులుపింఛన్ కోసం అర్హులు గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ బుట్టదాఖలయ్యాయి. తాజాగా ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్లోనే దరఖాస్తు చేయాలని తెలిపింది. గతంలో ప్రజాపాలన, మీసేవ కేంద్రాల్లో లేదా సాధారణ తెల్లకాగితాలపై దరఖాస్తు చేసినవారు కూడా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్లోనే వివరాలు సమర్పించాలి. గతంలో దరఖాస్తులతోపాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలకు ఈ కొత్త దరఖాస్తు ఫారాన్ని జతచేసి సమర్పించాలి. ఆన్లైన్ నమోదుకు వీలుగా దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, సమగ్ర వ్యక్తిగత వివరాలను ఈ ఫారంలో పొందుపరిచారు. ఎక్కడ దరఖాస్తు చేయాలిగ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఆన్లైన్ లాగిన్లో నమోదు చేస్తారు. అనంతరం ఆ ఫైళ్లను డీఆర్డీవో ద్వారా కలెక్టర్ పరిశీలనకు పంపి, తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు.అర్హులు వీరు..వితంతువులు (రూ.2,016): 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఒంటరి మహిళలు(రూ.2,016): వివాహిత మహిళలైతే 18 ఏళ్లు నిండి, భర్త నుంచి విడిపోయి లేదా భర్త వదిలివేసిన పరిస్థితిలో ఉండాలి. విడిపోయిన కాలం ఏడాదికి పైబడి ఉండాలి. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు నిండి ఉండాలి. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి ధ్రువీకరణ అవసరం. గీత కార్మికులు (రూ.2,016): 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. టాడీ ట్యాపర్ కోఆపరేటివ్ సొసైటీలో సభ్యత్వం, ఎకై ్సజ్ శాఖ ధ్రువీకరణ అవసరం. చేనేత కార్మికులు (రూ.2,016): 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ నుంచి ధ్రువీకరణ పొందాలి. దివ్యాంగులు (రూ.4,016): వయసుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం అంగవైకల్యం ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం ఉండాలి. ఇందుకు ఆన్లైన్ విధానంలో జారీ చేసిన యూడీఐడీ, సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఫైలేరియా బాధితులు (రూ.2,016): వయసుతో సంబంధం లేదు. గ్రేడ్–2, గ్రేడ్–3 ఫైలేరియా బాధితులు అర్హులు. డీఎంహెచ్వో ద్వారా ధ్రువీకరణ అవసరం. డయాలసిస్ రోగులు (రూ.2,016): వయసుతో సంబంధం లేదు. డయాలసిస్ చికిత్స పొందుతున్నవారు అర్హులు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నమోదు, ధ్రువీకరణ అవసరం. వృద్ధాప్య పింఛన్లపై స్పష్టత లేదుకొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడినా వృద్ధాప్య పింఛన్లపై స్పష్టత లేదు. కొత్తగా అర్హత పొందే వృద్ధులకు వయోపరిమితి ఎంత అనే అంశాలపై మార్గదర్శకాల్లో వివరాలు లేకపోవడంతో అయోమయం నెలకొంది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.వీరు అనర్హులుమండలాల వారీగా లబ్ధిదారులు..మండలం లబ్ధిదారుల సంఖ్య బాసర 2,851 భైంసా 8,039 ౖభైంసా మున్సిపాలిటీ 7,794 దస్తురాబాద్ 3,601 దిలావర్పూర్ 5,990 కడెం 7,243 ఖానాపూర్ 6,761 ఖానాపూర్ మున్సిపాలిటీ 3,904 కుభీర్ 9,251 కుంటాల 5,610 లక్ష్మణచాంద 7,906 లోకేశ్వరం 9,448 మామడ 6,511 ముధోల్ 6,181 నర్సాపూర్(జి) 5,814 నిర్మల్ రూరల్ 7,017 నిర్మల్ మున్సిపాలిటీ 14,847 పెంబి 1,794 సారంగాపూర్ 11,587 సోన్ 7,022 తానూరు 5,602 -
ఆదివాసీ హక్కులను కాపాడాలి
నిర్మల్టౌన్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ఆదివారం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి డీటీడీవో నిహారిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆదివాసీ ఉద్యమ వీరులు కొమురంభీం, రాంజీగోండు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివా సీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నా యకులు మాట్లాడుతూ.. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆదివాసీ యువత విద్య, ఉపాధి, అభివృద్ధి రంగాల్లో రాణించేలా అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంద మల్లేశ్, నైతం భీంరావు, తొడసం శంభు, తొడసం గోవర్ధన్, ముసలి చిన్నయ్య, సాకి లక్ష్మణ్, సంచు శ్రీనివాస్, పెందోర్ మాధవరావు, పి.శంకర్, సంఘపు నర్సయ్య, ఈశ్వర్, సురేశ్, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కోర్టుకెక్కిన నిధుల ‘పంచాయతీ’..!
ఖానాపూర్: గోసంపల్లె గ్రామ పంచాయతీ కోర్టుకెక్కింది. జనాభా రికార్డుల్లో నెలకొన్న వ్యత్యాసాల ను సరిచేసి, గ్రామపంచా యతీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సర్పంచ్ కొక్కుల సుభద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 2026, మే 4న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జనాభా లెక్క తేల్చాలని.. పిటిషన్లో 2011 జనాభా లెక్కలు, 2019 గెజి ట్ నోటిఫికేషన్ తదితర అధికారిక రికార్డులకు అనుగుణంగా గోసంపల్లె గ్రామపంచాయతీ జనాభా వివరాలను సరిచేసేలా ఆదేశించాలని కోరారు. జనాభా రికార్డులను సరిచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో గ్రామపంచాయతీకి రావాల్సిన నిధులపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. జనాభా వివరాలను సవరించిన అనంతరం 2019 నుంచి ఇప్పటి వరకు గ్రామపంచాయతీకి రావాల్సి న ఆర్థిక సంఘం గ్రాంట్లు, సాధారణ, ప్రత్యేక గ్రాంట్లతోపాటు ఇతర బకాయిలను మళ్లీ లెక్కించి విడుదల చేయించాలని సర్పంచ్ కోర్టును కోరారు. ఆలస్యమైన కాలానికి తగిన వడ్డీని కూడా చెల్లించేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ యంత్రాంగంఈ కేసులో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్, నిర్మల్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఖా నాపూర్ ఎంపీడీవో తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గ్రామానికి న్యాయంగా రావాల్సిన నిధులు అందేలా జనాభా రికార్డులను సరిచేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని సర్పంచ్ కొక్కుల సుభద్ర తెలిపారు. -
నిర్మాణ దశలోనే కూలిపోయింది
కుభీర్: మండల కేంద్రమైన కుభీర్లోని వడ్డెర కాలనీ నుంచి వాగు వరకు డ్రైనేజీ నిర్మాణం కోసం వీబీజీ రామ్జీ నుంచి రూ.76 లక్షలు కేటాయించారు. పనులు ప్రారంభించి కొంత వరకు పూర్తి చేవారు. పనులు పూర్తికాకముందే.. నిర్మాణ దశలోనే శుక్రవారం రాత్రి డ్రైనేజీ ఒకవైపు గోడ సుమారు 30 ఫీట్ల వరకు ఇలా కూలిపోయింది. పనులు నాసిరకంగా ఉన్నాయని గ్రామస్తులు, వార్డు సభ్యులు ముందు నుంచే అభ్యంతరం చెబుతున్నారు. కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. దీంతో చివరకు నిర్మాణ దశలోనే పుల్లో నాణ్యత బయటపడింది. ఇప్పటికై నా నాన్యతతో పనులు చేగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఏపీవో హరిలాల్ను ప్రశ్నించగా డ్రైనేజీ ప్రక్కన ట్రాక్టర్లో బండరాళ్లు వేయడంతో ఒత్తిడితో డ్రైనేజీ కూలిపోయిందని తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ వారు వచ్చి పరిశీలిస్తారని చెప్పారు. మరోవైపు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు తహసీల్దార్ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. ఇందులో ఉపసర్పంచ్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ బషీర్, కాంగ్రెస్ నాయకుడు బంక బాబు, బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు అనిల్, వార్డు సభ్యులు ఇషాక్, బబ్లు, నాయకుడు ఫిరోజ్ ఉన్నారు. -
అడవితల్లి.. కంటతడి!
ఉమ్మడి జిల్లాలో.. ఐటీడీఏ పరిధిలోని మండలాలు 77ఆదివాసీ గిరిజన కుటుంబాలు 67,648 ఆదివాసీ గిరిజన జనాభా 4,84,790గుక్కెడు నీటికి తిప్పలే.. వేసవి వచ్చిందంటే చాలు ఆదివాసీలు ఏటా తాగునీటికి అవస్థలు పడాల్సి వస్తోంది. ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో కానరాని పరిస్థితి. గుక్కెడు నీటికోసం నెత్తిన బిందెలతో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి. చేదబావుల వద్ద గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని చెలిమనీటితో గొంతు తడుపుకోవాల్సి వస్తోందని అడవిబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడు గోడు పట్టించుకోవట్లేదు.. ఆదివాసీలు ఏళ్లుగా అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అటవీ ఉత్పత్తులు, పోడు వ్యవసాయం చేసుకుంటూ పూరి గుడిసెల్లో నివాసముంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసినా అటవీశాఖ అభ్యంతరంతో గూడు నిర్మాణానికి దూరమవుతున్న పరిస్థితి. ఇలాగైతే ఆదివాసీల అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది. – కుమ్ర రాజు, ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంక్షేమ ఫలాలు అందట్లేదు ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏ ఉన్నా సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షగా మారాయి. ఏటా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాలకులు హామీలు ఇస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ అనేక గ్రామాలకు రోడ్డు లేదు. తాగునీటికి తిప్పలు తప్పట్లేదు. విద్య, వైద్యం కూడా అంతంతే. చిన్న పిల్లలు రక్త హీనతతో బాధపడుతున్నారు. – మెస్రం శంకర్, ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు ఆదిలాబాద్రూరల్ మండలంలోని వాన్వాట్ పంచాయతీ పరిధిలోని మంగ్లీ గ్రామానికి వెళ్లే రోడ్డు దుస్థితి ఇదీ. ఇక్కడ సుమారు 20 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. 100 వరకు జనాభా ఉంటుంది. ఈ ఊరుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయంలో 108 వాహనం కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పాలకులు మారుతున్నా తమ తలరాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మెనూ పాటించని వార్డెన్లపై చర్య తీసుకోవాలి’ నిర్మల్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, రక్షిత మంచినీరు అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ డిమాండ్ చేశారు. మెనూ పాటించని వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. వసతి గహాల్లోని సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. కొన్ని హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు ఉన్నా వినియోగించకుండా కలుషిత నీటిని అందిస్తున్నారని ఆరోపించారు. తనిఖీలు చిత్తశుద్ధితో నిర్వహించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ పరిధిలోని 170కిపైగా గిరిజన గూడేలకు ఇప్పటికీ విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వర్షాకాలం వచ్చిందంటే నిత్యం అవస్థలే. వంతెనలు లేక వాగులు, వంకలు పొంగిన క్రమంలో రోజుల తరబడి ఆదివాసీలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిందే. విధిలేని పరిస్థితుల్లో వాగులు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్న వారెందరో. 108, 102 వాహనాల సంగతి అటుంచితే చాలా గ్రామాలకు కాలినడకన కూ డా వెళ్లలేని దుస్థితి. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే అవస్థలు వర్ణనాతీతమే. సుమారు 40కి పైగా ఆదివాసీ గామాల్లో ఇప్పటికీ కరెంట్ వసతి లేకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. చదవులోనూ వెనుకబాటే.. ఆదివాసీలకు విద్యాపరంగా వెనుకబాటు తప్పడం లేదు. గిరిజనులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వాలు ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఏళ్లుగా ఉపాధ్యాయుల నియామకాలు లేక సీఆర్టీలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఉట్నూర్ కేంద్రంగా మంజూరైన గిరిజన యూనివర్సిటీ మరో చోటికి తరలించడంతో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ హక్కుల కోసం నిరీక్షణ.. జల్.. జంగల్..జమీన్ నినాదంతో సాగిన భూపోరాటం స్ఫూర్తిగా ఆదివాసీలు ఏళ్లుగా తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. 1/70, పీసీ చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు భూములపై సర్వహక్కులు ఉంటాయి. ఆర్ఓఎఫ్ఆర్–2006 చట్టం ప్రకారం భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు పలుమార్లు హక్కుపత్రాలను ప్రభుత్వాలు అందించినప్పటికీ పూర్తి స్థాయిలో అందని పరిస్థితి. వాటికోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. తమపై అటవీ అధికారుల వేధింపులు పెరిగాయని, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల ఆధిపత్యం పెరుగుతుందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ ఆందోళనలు సైతం చేపడుతూనే ఉన్నారు. అడవితల్లిని నమ్ముకుని ప్రకృతి ఒడిలో జీవించే ఆదివాసీలు ఏళ్లుగా సమస్యలతో సహవాసం చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు సమీపిస్తున్నా గిరిపుత్రుల బతుకుల్లో మాత్రం ఇంకా వెలుగులు కనిపించని పరిస్థితి. ఇప్పటికీ తాగునీటి కష్టాలు వెంటాడుతుండగా.. కరెంటు లేని గ్రామాలు సైతం అనేకం ఉన్నాయి. విద్య, వైద్యపరంగానూ వెనుకబాటే కనిపిస్తోంది. పాలకులు మారుతున్నా తమ బతుకులు మారడం లేదని..హక్కులు, అస్తిత్వం కోసం అడవిబిడ్డలు నిత్యం పోరుబాట పడుతూనే ఉన్నారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీల స్థితిగతులపై ప్రత్యేక కథనం. – కై లాస్నగర్/ఆదిలాబాద్రూరల్/ఉట్నూర్రూరల్ రేపు టీఎంయూ సమావేశం నిర్మల్టౌన్: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూని యన్(టీఎంయూ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశం ఈనెల 10న ఆదిలాబాద్లో నిర్వహిస్తున్నట్లు యూనియన్ రీజియన్ కార్యదర్శి ఆర్.గంగాధర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా టీఎంయూ కార్యాలయ ప్రారంభం, జెండా ఆవిష్కరణ అనంతరం యూని యన్ ఎన్నికల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, మంచిర్యాల, నిర్మల్, భైంసా డిపోల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆదివాసీల అభ్యున్నతికి కృషి ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా పీవీటీజీ తెగలకు చెందినవారి అభ్యున్న తి, స్థితిగతులు, గూడెల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తుంది. ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా సమీక్షిస్తూ ఆదివాసీల సంక్షేమానికి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నాం. – గోడం నగేశ్, ఎంపీ -
ప్రణాళికాబద్ధంగా నీటి వినియోగం
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని శాసీ్త్రయంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాజెక్టుల నీటిమట్టం, సాగునీటి లభ్యత, పంటల సాగు, పంట మార్పిడి విధానం తదితర అంశాలపై శనివారం ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు అవసరమైన మేరకు వర్షపాతం నమోదైనా, కొన్ని మండలాల్లో 20 శాతం లోటు ఉన్నట్లు తెలి పారు. రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణతో సాగునీటి నిర్వహణ చేపడుతున్నామన్నారు. ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో సుమారు 35 వేల ఎకరాలకు, కడెం ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. గ్రామసభల ద్వారా ప్రస్తుత పరిస్థితులను రైతులకు వివరించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్వల్పకాలిక పంటలు సాగు చేసుకునేందు కు సమయం ఉన్నందున రైతులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా వ్యవసాయ అధికా రులు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో కంది సాగు విస్తీర్ణం 10 వేల ఎకరాలకు పెంచినట్లు చెప్పారు. పంట మార్పిడితో నీటి వినియోగం తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు గణనీయంగా పెరుగుతోందని, ఇప్పటి వరకు 2,500 ఎకరాలకు సంబంధించి రైతులు డీడీలు సమర్పించినట్లు తెలి పారు. తెలంగాణ జలసిరి పథకం కింద భూగర్భ జలాల పెంపు కోసం ఫామ్పాండ్ల నిర్మాణం ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 2,026 ఫామ్పాండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 3 వేల వరకు నిర్మాణానికి రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మ న్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికా రులతో నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశంలో ప్రాజెక్టుల నీటిమట్టం, సాగునీటి నిర్వహణ, భవిష్యత్తు అవసరాలు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై చర్చించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, నీటిపారుదల శాఖ ఎస్ఈ రాజేంద్రప్రసాద్, డీఏవో అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ పాల్గొన్నారు. -
బోనభాగ్యానికి వేళాయే..
● ఇప్పటికే ఊరూరా గ్రామదేవతలకు మొక్కులునిర్మల్: ‘అదిగో.. కొత్త కుండలు రానే వచ్చాయి. ఇదిగో.. అమ్మ చేతిలో ఆ తల్లులకు సమర్పించేందుకు పచ్చగూర, పెరుగన్నం, పాయసం, అప్పాలు, గారెలు అన్నీ సిద్ధమయ్యాయి. ద్వారాలకు మామిడాకుల తోరణాలు కట్టి, మొక్కులు చేతబట్టుకుని అందరూ సన్నద్ధమయ్యారు. డప్పు చప్పుళ్లు మొదలైన వెంటనే బయలుదేరుదాం’ అంటూ బోనాలు సమర్పించేందుకు ఊళ్లన్నీ తల్లుల గుళ్లవైపు తరలుతున్నాయి. పిల్లలను, పాడిపంటలను, పశువులను సల్లంగా కాపాడే గ్రామదేవతలకు బోనం పెట్టే సమయం ఆసన్నమైంది. పల్లెలు, పట్టణాలన్నీ ఆషాఢ పండుగలతో కళకళలాడుతున్నాయి. పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ తదితర అమ్మవార్ల గుడులన్నీ ముస్తాబయ్యాయి. ఆషాడమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు జిల్లా అంతటా బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. శుభం కలగాలని మొక్కులు ‘అమ్మా.. మమ్మల్ని సల్లంగా చూడు. పిల్లలు, పంటలు అన్నీ బాగుండాలి. ఏడాదంతా మంచే జరగాలి. నీ మొక్కులన్నీ తీర్చుకుంటాం. నువ్వే దిక్కు తల్లీ’ అంటూ రెండు చేతులెత్తి గ్రామదేవతలకు మొక్కుతుంటారు. ఆషాఢం ప్రారంభమైనప్పటి నుంచే గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలు, మొక్కుల తీర్చుకోవడం కొనసాగుతోంది. అన్నీ ప్రసాదించే తల్లులకే అన్నం రూపంలో బోనం సమర్పించే పండుగ ఇది. అన్నం, పెరుగు, పాయసం, ఆకుకూరలు, అప్పాలు, గారెలు ఆయా కుటుంబాల ఆచారానుసారం సమర్పిస్తారు. ఊరంతా ఒకేసారి బోనాన్ని కుండల్లో ఉంచి, పైన దీపం వెలిగించి, తలపై మోసుకుని శివసత్తులు, పోతరాజులు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తల్లుల సన్ని ధికి చేరుకుంటారు. దారి పొడవునా పసుపునీళ్లు, పసుపు, వేపాకులు చల్లుతూ వెళ్తారు. మోదుగ ఆకుల్లో బోనాలను సమర్పించడం ప్రత్యేకం. ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఆషాఢం మొదలైనప్పటి నుంచే అమ్మవార్ల ఆలయాలను అందంగా అలంకరించారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మమ్మ, పలువాడల్లోని పోచమ్మ, మంచిర్యాల రోడ్డులోని మారెమ్మ, పెద్దమ్మలతో పాటు ఇతర తల్లులకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో నైవేద్యాలు అర్పించనున్నారు. ఇందుకు సంబంధిత ఆలయ కమిటీలు, మున్సిపాలిటీ సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. మండల సమీపంలోని వరి పొలాలకు ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకెళ్లారు. విద్యార్థులతో వరినాట్లు వేయించి ప్రత్యక్ష అనుభూతిని కలిగించారు. ఈ సందర్భంగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రమేశ్గౌడ్, వృత్యంతర వ్యవసాయ ఉపాధ్యాయుడు కాళీదాస్ విద్యార్థులకు సూచనలు చేస్తూ వరి సాగుపై ప్రత్యక్ష అనుభవం కలిగించారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు, ఇన్చార్జి ఎంఈవో రాజు నాయక్, ఉపాధ్యాయుడు రమేశ్గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు. – లక్ష్మణచాంద పొలంలో దిగి.. నాట్లు వేసి.. -
రైతుల యాప్సోపాలు
నిర్మల్కదులుతున్న ‘కాంట్రాక్ట్’ డొంక జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) ప్రక్రియలో అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురికి నోటీసులు వచ్చాయి. పీజీ ఎంట్రెన్స్లో ప్రతిభ నిర్మల్ఖిల్లా: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఎంపీసీ) చదివిన గుగ్లావత్ శేఖర్ ఇటీవల నిర్వహించిన సీపీజీఈటీ(కామన్ పోస్ట్గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్)లో రసాయన శాస్త్రం విభాగంలో రాష్ట్రస్థాయి 5వ ర్యాంక్ సాధించాడు. హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగించిన ఆయన, అందుబాటులో ఉన్న పరిమిత వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలవైపు అడుగులు వేశారు. శేఖర్ను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సుధాకర్ అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు శేఖర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రసాయన శాస్త్ర అధ్యాపకులు అర్చన, డా. సూర్యాసాగర్, రమేశ్రెడ్డి, ఇతర అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్చైన్గేట్: జిల్లాలోని రైతులు ఇకపై యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా ఆన్లైన్ యాప్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ, రైతులకు వారి సాగు విస్తీర్ణం మేరకు అవసరమైన ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఫెర్టిలైజర్ యాఫ్ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అమలవుతున్న ఈ పద్ధతిని మూడో విడతలో ఈ నెల 13 నుంచి జిల్లాలోనూ అమలు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ఏమిటి? ఎఫ్ఎఫ్ఎస్(ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్)అనేది ఎరువుల విక్రయాలు, నిల్వలు, డిమాండ్, సరఫ రాను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ప్రత్యేక డిజిటల్ వ్యవస్థ. రాయితీ ఎరువుల వినియోగాన్ని క్రమబద్ధీకరించి, అవసరం మేరకు నిర్ణయించిన మోతాదులో అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ విధానంలో రైతు సాగు చే స్తున్న పంట, విస్తీర్ణం ఆధారంగా ఎకరానికి నిర్దేశించిన పరిమితిలోనే రాయితీ ఎరువులనుఅందజేస్తారు. డీలర్లకు శిక్షణ.. కొత్త ఎరువుల విధానంపై ఎరువుల డీలర్లకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జూమ్ ద్వారా శిక్షణనిచ్చారు. ఎరువులు ఫర్టిలైజర్ షాప్కు ఎలా వస్తాయి? యాప్లో రైతులు ఎలా బుకింగ్ చేసుకోవాలి? డీలర్లు రైతులకు ఏ విధంగా సరఫరా చేయాలి వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. బుకింగ్ విధానం.. ముందుగా రైతులు తమ స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో తెలుగు భాషను ఎంచుకునే అవకాశం ఉంది. యాప్లో రైతులు తమ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ ఆన్లైన్లో భూమి వివరాలు కనిపించకుంటే, వాటిని స్వయంగా యాప్లో నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత, అవసరమైన ఎరువు రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఏ డీలర్ వద్ద కొనుగోలు చేయాలనుకుంటున్నారో యాప్లోనే ఎంచుకుని బుకింగ్ పూర్తి చేయాలి. రైతులు బుక్ చేసిన వివరాలన్నీ నేరుగా ఆ డీలర్ వద్ద ఉన్న పీవోఎస్ యంత్రంలో కనిపిస్తాయి. వాటి ఆధారంగా డీలర్ రైతులకు రాయితీ ఎరువులు అందజేస్తారు. రైతుల ఆందోళన ఇప్పటికే యూరియా కోసం పడుతున్న కష్టాలు చాలవన్నట్లుగా, కొత్తగా దుక్కి మందులు, కాంప్లెక్స్ ఎరువులకు సైతం యాప్ తీసుకురావడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ఫోన్ లేని రైతులు, చదువురాని రైతులు ఇప్పటికే యూరియా బుకింగ్ కోసం ఇబ్బందులు పడుతుండగా, ఇక కొత్తగా అన్ని ఎరువులకు యాప్ బుకింగ్ పెట్టడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఎరువుల దుకాణాల ద్వారా ఎరువులు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని ఎరువులు యాప్లోనే.. ఇకపై అన్ని ఎరువులు కొత్తగా ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారానే సరఫరా అవుతాయి. యూరియా తరహాలోనే అన్ని ఎరువులు యాప్లోనే రైతులు బుకింగ్ చేసుకుని సంబంధిత ఫర్టిలైజర్ షాప్ నుంచి తీసుకోవాలి. ఇప్పటికే ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన కల్పించాం. రైతులకూ ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. – నాగరాజు, ఏవో -
ప్రయోగాలకు నిధులు
లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అందజేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఇంటర్ కళాశాలల ప్రయోగశాలలకు నిధులు మంజూరు చేశారు. ప్రథమ సంవత్సరం నుంచే ప్రయోగాలు.. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులతోపాటు మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి మొదటి సంవత్సరానికి 15 మార్కులు కేటాయించారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరికరాల కొనుగోలుకు నిధులు.. ఇంటర్ బోర్డు ప్రభుత్వ కళాశాలల ప్రయోగశాలలకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా ప్రయోగశాలలకు అవసరమైన సామగ్రి, సదుపాయాలు, పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేయాలని బోర్డు అధికారులు సూచించారు. ఈ విషయంపై ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు.. జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ సంవత్సరంలో 2,516 మంది, రెండో సంవత్సరంలో 2,338 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 4,854 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గతేడాది ఒక్కో కళాశాలకు రూ.25 వేలు కేటాయించారు. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించారు. 50 మంది లోపు విద్యార్థులు ఉన్న కళాశాలకు రూ.24 వేలు, 100 మందిలోపు ఉంటే రూ.40 వేలు, 200 మంది వరకు ఉంటే రూ.60 వేలు, 350 మంది వరకు ఉంటే రూ.80 వేలు, 350 మందికి పైగా ఉంటే రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశారు. జిల్లాలో ఒక్కో కళాశాలకు రూ.80 వేలు మంజూరయ్యాయి. పరికరాలు కొనుగోలు చేయాలి.. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రయోగశాలల్లో పరికరాలు, రసాయనాలు, అవసరమైనవి సమకూర్చుకోవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధులతో విద్యార్థులకు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేయాలి. నిధులతో విద్యార్థులకు మేలు చేకూరేలా చూడాలి. – పరశురామ్నాయక్, ఇంటర్ నోడల్ ఆఫీసర్ కళాశాలలకు మంజూరైన నిధులు.. కళాశాల పేరు మంజురైన నిధులు జీజేసీ భైంసా రూ.80 వేలు జీజేసీ నిర్మల్(బాలుర) రూ.80 వేలు జీజేసీ నిర్మల్(బాలికలు) రూ.80 వేలు జీజేసీ ఖానాపూర్ రూ.80 వేలు జీజేసీ మామడ రూ.80 వేలు జీజేసీ ముధోల్ రూ.60 వేలు జీజేసీ తానూరు రూ.60 వేలు జీజేసీ దిలావర్పూర్ రూ.60 వేలు జీజేసీ సారంగపూర్ రూ.60 వేలు జీజేసీ కడెం రూ.60 వేలు జీజేసీ లోకేశ్వరం రూ.60 వేలు జీజేసీ కుభీర్ రూ.60 వేలు జీజేసీ కుంటాల రూ.40 వేలు -
శుక్రవారం మండలాల వారీగా కురిసిన వర్షం(మి.మీలలో)
కుభీర్ 3.5 తానూరు 4.8 బాసర 7.2 ముధోల్ 8.6 భైంసా 8.8 కుంటాల 9.0 నర్సాపూర్(జి) 0 లక్ష్మణచాంద 13.7 దిలావర్పూర్ 6.1 నిర్మల్ అర్బన్ 3.3 నిర్మల్ రూరల్ 4.1 సోన్ 4.3 సారంగాపూర్ 3.5 మామడ 2.5 పెంబి 4.9 ఖానాపూర్ 1.6 కడెం పెద్దూర్ 6.3 దస్తురాబాద్ 4.3 -
ఏకరూపం..ఆలస్యం!
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు పాఠశాలలు ప్రా రంభమయ్యే రోజునే పాఠ్యపుస్తకాలు, యూని ఫాం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాఠ్యపుస్తకాలు ప్రారంభ రోజునే అందజేసినప్పటికీ, యూని ఫాం ఇప్పటివరకు అందజేయలేదు. వచ్చిందిన సగం క్లాతే..నూతన విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభమై రెండు నెలలు గడిచినా, విద్యార్థులకు అందజేయాల్సిన యూనిఫాం ఇంకా ఇవ్వలేదు. 1 నుంచి 10వ తరగతి వరకు అబ్బాయిలకు షర్ట్ క్లాత్, 6 నుంచి 12వ తరగతి వరకు బాలికలకు టాప్, బాటమ్ క్లా త్ వచ్చాయని, వాటిని స్వయం సహాయక సంఘా ల మహిళలకు ఇచ్చి కుట్టిస్తున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే 1 నుంచి 12వ తరగతి వరకు అబ్బాయిలకు బాటమ్ క్లాత్, 1 నుంచి 5వ తరగతి వరకు అమ్మాయిలకు టాప్, బాటమ్ క్లాత్ ఇంకా రావాల్సి ఉందని చెబుతున్నారు. కేజీబీవీ విద్యార్థులకు.. జిల్లాలోని 18 కేజీబీవీల్లో మొత్తం 6,400 మంది వి ద్యార్థులున్నారు. వీరిలో ఇప్పటికే 6 వేల మంది బాలికలకు రెండు జతల ఏకరూప దుస్తులు కుట్టించడం పూర్తయింది. మిగిలిన 400 మంది బాలికలకు త్వరలోనే కుట్టించడం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇలా..జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పాఠశాలలు, మోడల్ స్కూల్స్తో కలిపి మొత్తం 746 పాఠశాలలున్నాయి. వీటిలో 48,148 మంది విద్యార్థులు చదువుతున్నారు. కేజీబీవీ పోను.. 42,148 మంది విద్యార్థులకు సరిపడా క్లాత్ సరఫరా కాకపోవడంతో కుట్టించడం పూర్తి కాలేదని అధికారులు వెల్లడించారు. క్లాత్ వచ్చిన వెంటనే కుట్టించి విద్యార్థులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.ఆగస్టు 15 వేడుకలకు పాత బట్టలే..మరో వారం రోజుల్లో స్వాతంత్య్ర దినోత్స వం జరుగనుంది. సాధారణంగా ఆ రోజు వి ద్యార్థులు నూతన ఏకరూప దుస్తులు ధరించి హాజరవుతుంటారు. ఈసారి కేజీబీవీలు, మై నార్టీ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ఎంజేపీ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15లోపు నూతన ఏకరూప దుస్తులు అందజేసేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపడుతున్నారు. మిగిలిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఈసారి పాత దుస్తులతోనే వేడుకలకు హాజరుకానున్నారు. త్వరలో అందించేలా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల కోసం వచ్చిన క్లాత్ ఇది వరకే స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించి స్టిచ్చింగ్ చేయిస్తున్నాం. కేజీబీవీల విద్యార్థుల స్టిచ్చింగ్ పూర్తి కాగా మిగిలిన విద్యార్థులకు సరిపడా క్లాత్ రాలేదు. రాగానే స్టిచ్చింగ్ చేయించి అందిస్తాం. – భోజన్న, డీఈవో -
నిర్మల్
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి నిర్మల్చైన్గేట్: స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంద్రాగస్టు వేడుకల నిర్వహణపై సంబంధిత అధి కారులతో శుక్రవారం సమావేశం నిర్వహించా రు. ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆహ్వా నించాలన్నారు. వేదికను అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులతో సాంస్కతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అంబులెన్సు అందుబాటులో ఉంచడంతోపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో స్వాతంత్య్ర వేడుకలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీవో దేవీదాస్ పాల్గొన్నారు. భైంసా: ఎల్నినో ప్రభావంతో ఎప్పుడూ లేని విధంగా వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్న నిర్మల్ జి ల్లా రైతుల్లో తాజాగా కురుస్తున్న భారీ వర్షాలు ఖరీ ఫ్ ఆశలను చిగురింపజేశాయి. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో వరి సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు. నారుమడులు సిద్ధంగా ఉన్నప్పటికీ నీటి కొరత కారణంగా నాట్లు వేయకుండా వేచి చూశారు. అయితే పది రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రధాన ప్రాజెక్టులు, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఒక్కసారిగా జిల్లాలో వరి రైతుల ఆశలు చిగురించాయి. జిల్లాలో సాగు ఇలా.. జిల్లాలో ఈ ఏడాది సుమారు 4 లక్షల ఎకరాల్లో వివి ధ పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు సుమారు లక్ష ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొనసాగితే మరో వారం రోజుల్లో మరో 20 వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతోపాటే రైతులు సాగు పనులు విస్తరిస్తున్నారు. దీంతో వరి సాగు లక్ష్యానికి చేరువవుతోంది. వరి తర్వాత జిల్లాలో అత్యధికంగా 1.10 లక్షల ఎకరాల్లో సోయాబీన్, 1.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కొనసాగుతోంది. అలాగే 20 వేల ఎకరాల్లో పెసర, 10 వేల ఎకరాల్లో పసుపు, 20 వేల ఎకరాల్లో కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత వర్షాలు అనుకూలంగా ఉండటంతో అన్ని పంటలు మంచి ఎదుగుదల దశలోకి ఉన్నాయని రైతులు చెబుతున్నారు. నిండిన ప్రాజెక్టులు, చెరువులు.. ఎస్సారెస్పీ, గడ్డెన్నవాగు, స్వర్ణ, కడెం ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని ప్రధాన చెరువులు నీటితో నిండిపోవడం రైతులకు ఊరటనిచ్చింది. భూగర్భ జలాలు పెరగడంతో బోరుబావుల కింద సైతం వరి సాగు ఊపందుకుంది. వరి సాగుకు నీటి కొరత ఉండదనే నమ్మకం రైతుల్లో పెరిగింది. గతంలో వర్షాభావంతో ఎదురైన ఇబ్బందులు ఈసారి ఉండవని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్వరం: గొడిసెరాలో వరి నారు తీసున్న మహిళా కూలీలువర్షాలతో సాగు వేగం.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడంతో వరి సాగు కూడా కొంత ఆలస్యమైంది. మరో వారం రోజుల్లో ఎక్కువ భాగం నాట్లు పూర్తవుతాయి. ప్రాజెక్టుల్లోనూ వర్షాలతో నీరు చేరింది. రైతులు అధిక దిగుబడుల కోసం వ్యవసాయ శాఖ సూచించే యాజమాన్య పద్ధతులను పాటించాలి. అవసరమైన ఎరువులు, విత్తనాలు జిల్లాలో తగినంత అందుబాటులో ఉన్నాయి. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో కురిసిన వర్షపాతం (జూన్ 1 నుంచి ఆగస్టు 7 వరకు) సాధారణ వర్షపాతం 545.4 మి.మీలు నమోదైన వర్షపాతం 563.5 మి.మీలు వ్యత్యాసం +3.3 శాతం అధికంవరి నాట్లు ప్రారంభించాం ఈసారి మొదట వర్షాలు లేక చాలా ఆందోళన పడ్డాం. నారుమడులు సిద్ధంగా ఉన్నా నీరు లేక నాట్లు వేయలేకపోయాం. ఇప్పుడు భారీ వర్షాలు కురవడంతో చెరువులు నిండాయి. పొలాల్లో నీరు పుష్కలంగా ఉంది. వేగంగా నాట్లు వేస్తున్నాం. వర్షాలు ఇలాగే కొనసాగితే మంచి దిగుబడి వస్తుంది. – మల్లేశ్, రైతు, భైంసాజోరుగా వరినాట్లు ఖరీఫ్ ప్రారంభంలో వాతావరణ శాఖ తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో పలువురు రైతులు వరి సాగును తగ్గించాలని భావించారు. కొందరు ప్రత్యామ్నాయంగా సోయాబీన్, పత్తి వైపు మొగ్గు చూపారు. అయితే జూలై చివరి వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వ్యవసాయ పరిస్థితులను పూర్తిగా మార్చేశాయి. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరగడంతో వరి సాగుపై రైతులు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. నారుమడులు సిద్ధంగా ఉండడంతో ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, నాట్ల యంత్రాలు, కూలీలతో పొలాలన్నీ సందడిగా మారాయి.అధిక వర్షపాతం నమోదైన మండలాలు: కుభీర్ +38% కడెంపెద్దూర్ +34% నిర్మల్ అర్బన్ +27% మామడ +20% -
సాగునీటిని శాసీ్త్రయంగా వాడాలి
నిర్మల్చైన్గేట్: ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీ టిని అవసరాలకు అనుగుణంగా శాసీ్త్రయంగా విని యోగించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటవీ, పర్యావరణ శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రస్తు త వాతావరణ పరిస్థితులు, వన మహోత్సవం, స్మా ర్ట్ రేషన్ కార్డుల పంపిణీ, వ్యవసాయరంగం, నీటి వినియోగం తదితర అంశాలపై సీఎస్ సంజయ్ జా జుతో కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పంట మార్పిడితో అధిక ఆదాయం.. పంట మార్పిడి విధానాల అమలు ద్వారా రైతులు నష్టాలను నివారించడంతోపాటు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతులకు పంటల వైవిధ్యంపై అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన పంట కుంటల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశం నిర్వహించాలి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగు ప్రణాళికలపై స్పష్టమైన సమాచారం అందించేందుకు గ్రామ స్థాయిలో ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు విస్తతంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. అనంతరం జిల్లాల వారీగా వర్షపాతం, పంటల సాగు, నీటి లభ్యత తదితర అంశాలను సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ భవిశ్ మిశ్రా, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఎస్వో రాజేందర్, డీఈవో భోజన్న, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
నిర్మల్ఖిల్లా: ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్య ల పరిష్కారమే ప్రధాన ద్యేయంగా సంఘం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు చేస్తోందని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్ అన్నా రు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) ఆవిర్భావ వేడుకలను శుక్రవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. సంఘం ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘం నాయకులు, సభ్యులు జెండా ఆవిష్కరించి నినాదాలు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో, స్వర్గీయ స్వామిరెడ్డిసార్ నాయకత్వంలో టీయూటీఎఫ్ ఆవిర్భవించిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం పూర్తిస్థాయిలో అమలు చేయడంతోపాటు, పథకంలో పేర్కొన్న అన్ని ఆస్పత్రుల్లో ఉద్యోగులకు చికిత్స అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షుడు ఏ.లక్ష్మీప్రసాద్రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు వట్టోలి ముత్తన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి వహీద్ఖాన్, కోశాధికారి మేడారపు శ్రీనివాస్, ఖానాపూర్ మండల అధ్యక్షులు పాండురంగాచారి, సారంగాపూర్ మండల అధ్యక్షులు మొయిజుద్దీన్ పాల్గొన్నారు. -
ధరణి ఆపరేటర్లపై తొలగింపు కత్తి
నిర్మల్చైన్గేట్:ధరణి ఆపరేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భూభారతి అమలుతో వారి ఉద్యోగాలపై తొలగింపు కత్తి వేలాడుతోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ బాధ్యతలను జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో ఔట్సోర్సింగ్ విధానంలో ఇప్పటివరకు పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 632 మంది.. గత ప్రభుత్వం 2018లో ధరణి పోర్టల్ను తీసుకువచ్చింది. తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా ఔట్సోర్సింగ్ ద్వారా నియమించింది. సెంట్రిక్ సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లను చేర్చుకున్నారు. వీరిని ఏటా మార్చి, ఏప్రిల్ మధ్యలో రెన్యువల్ చేసేవారు. ముందుగా నెలకు రూ.11 వేల వేతనం ఇచ్చారు. ఆ తర్వాత రూ.13 వేలకు పెంచారు. గత ప్రభుత్వం చివరి దశలో నెలవారీ వేతనాన్ని రూ.21,500కు పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేటర్లను టీజీటీఎస్ కింద తీసుకుని నెలకు రూ.21,500 వేతనం ఇస్తోంది. అయితే దీన్ని నెలవారీగా ఇవ్వకుండా మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. ఆపరేటర్ల ఆందోళన బాట.. భూభారతి ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమిస్తున్నారన్న అనుమానంతో రెండు రోజులుగా ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం రాష్ట్రంలోని ఆపరేటర్లందరూ హైదరాబాద్లోని గాంధీభవన్కు వెళ్లి నిరసన చేపట్టి తమ గోడు వినిపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీహెచ్, జగ్గారెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని విన్నవించారు. పెండింగ్లో 15 నెలల వేతనాలు ఆపరేటర్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగాన్ని ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా తమకు 15 నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనసాగించాలి.. ఎఫ్టీఎఫ్ ఉద్యోగులను రెన్యూవల్ చేసి యథావిధిగా కొనసాగించాలి. ఉద్యోగులను తగ్గించే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలి. ఎన్టీఎస్ ఉద్యోగుల వివరాలు ఐఎఫ్ఎం ఐఎస్ పోర్టల్లో నమోదు చేయాలి. – పోశెట్టి, భూభారతి ఆపరేటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆపరేటర్ల డిమాండ్లు: -
రైతు సంక్షేమానికి కృషి
కడెం: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు రాములునాయక్, కేవీఎన్.రెడ్డి, భవానిరెడ్డి, సునీల్కుమార్, గంగాధర్తో కలిసి గురువారం రాత్రి మండల కేంద్రంలోని బృందావన్ రిసార్ట్స్లో బస చేశారు. శుక్రవారం ఉదయం కడెం ప్రాజెక్టును సందర్శించారు. నీటిమట్టం, ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు. బ్యాక్ వాటర్ను పరిశీలించా రు. కార్యక్రమంలో తహసీల్దార్ ఖాజా మెయినుద్దీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీ తనిఖీ
సారంగపూర్: మండలంలోని జామ్ కస్తూరి బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం తనిఖీ చేశా రు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. వండిన భోజనం పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు జరిగిన సిలబస్ను గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. పెన్నులు బహుమతిగా ఇచ్చారు. అనంతరం పాఠశాలలో సమస్యలను ప్రత్యేకాధికారి అన్నపూర్ణను అడిగి తెలుసుకున్నా రు. సమస్యలపై నివేదిక ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ రవళి, మండల ప్రత్యేకాధికారి బాలిక్అహ్మద్, తహసీల్దార్ విజయ్కాంత్రావు, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, ఎంఈవో మహేందర్ తదితరులు ఉన్నారు. -
ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
నిర్మల్చైన్గేట్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జీవితాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న రాష్ట్రాన్ని అధికారులు సమష్టిగా అభివృద్ధి చేసినప్పుడే ఆయనకి ఘనమైన నివాళి అన్నారు. వేడుకల్లో డీఆర్వో రాథోడ్ రమేశ్, వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డీఈవో భోజన్న, జిల్లా ఖజానా అధికారి సరోజ, ఎల్డీఎం రామ్గోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాసర ఆర్జీయూకేటీలోబాసర: ఆర్జీయూకేటీ బాసరలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. సమావేశమందిరంలో ఆయన చిత్రపటానికి ఇన్చార్జి వీసీ గోవర్ధన్, విశ్వవిద్యాలయ అధికారులు, విద్యార్థులు అధ్యాపకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తికి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజా ఉద్యమంగా మలచడానికి జయశంకర్ సార్ అందించిన దిశానిర్దేశం చిరస్మరణీయమన్నారు. కల్చరల్ కమిటీ కన్వీనర్ కె.రాములు పర్యవేక్షణ, నేతృత్వంలో ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఎస్.విఠల్, శీలం శేఖర్, ప్రొఫెసర్ సాగర్, బి.విజయకుమార్, కె.మధుసూదన్, దేవరాజు, గుజ్జరి శంకర్, ఆర్.కుమార్, అజయ్కుమార్, బద్రి, హరికృష్ణ, రాజు, దస్తగిరి, సతీశ్, శ్రీనివాస్, రజిత, రాయమల్లు, ముత్యం పాల్గొన్నారు. -
మొరం తవ్వితే చర్యలు
ముధోల్: నియోజకవర్గ కేంద్రం ముధోల్లో ని ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తే చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ తిరుమల్రావు తెలిపారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వేచేశారు. ఇటీవల ముధో ల్ గ్రామస్తులు మొరం తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో 425 సర్వే నంబర్లోని భూమిలో మొర్రం తవ్వకాలను అరికట్టాడానికి సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. అక్రమంగా మొరం తరలించకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చోరీలకు ‘చెక్’ పడేనా?
నిర్మల్టౌన్: జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. నిత్యం ఏదో ఒకచోట చోరీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చోరీలు, ఇతర నేరాల నియంత్రణకు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు భద్రత కల్పించడంతోపాటు నేరస్థుల కదలికలను నియంత్రించేందుకు ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు పట్టణంలోని కీలక ప్రాంతాల్లో ఏడు ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వీటిలో 24 గంటలు పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తూ.. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులనూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వాహనాలపై ప్రత్యేక నిఘా.జిల్లాలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు దొంగతనాలకు పాల్పడే ముఠాల కదలికలను ముందుగానే గుర్తించి అడ్డుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేశారు. అవసరమైతే వాహనాల్లోని సామగ్రిని కూడా తనిఖీ చేయనున్నారు. ఏడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు.. గజులపేట్ ఔట్ స్కర్ట్, సెయింట్ థామస్ స్కూల్ ప్రాంతం, సిద్ధాపూర్, సోఫీనగర్ దర్గా, మహాలక్ష్మి ఆలయం ప్రాంతం, వైఎస్సార్ కాలనీ రోడ్, మంజులాపూర్ ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే ప్రధాన మార్గాలన్నింటిపై ప్రత్యేక నిఘా ఉండటంతో దొంగలకు అవకాశం ఉండదని పోలీసులు భావిస్తున్నారు. కూడళ్లలో మూడో కన్ను..ఇక కూడళ్లలో సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగించనున్నారు. పెట్రోలింగ్ బృందాలు, చెక్పోస్టుల సిబ్బంది పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ అనుమానాస్పద కదలికలపై వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు తమ కాలనీలు, గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు, వాహనాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను సమర్థంగా అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. -
సేంద్రియ సాగును ప్రోత్సహించాలి
నిర్మల్చైన్గేట్: రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులతో కలిసి సేంద్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యానవన పంటల సాగు, ప్రభుత్వ ప్రోత్సాహం, రైతుల సంక్షేమం తదితరఅంశాలపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలిఈ సందర్భంగా చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులు సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి పంట మార్పి డి విధానం అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అందుబాటులో ఎరువులు, విత్తనాలు.. కమిషన్ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని, అవసరానికి మించి రసాయనిక ఎరువులు వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పోడు భూముల సమస్యలు, మార్కెటింగ్ సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉద్యానవన సాగుకు ప్రోత్సాహం..కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో పంట మార్పిడి విధానాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని దాదాపు రెండు లక్షల మంది రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, సోయా, కందులు వంటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, పూల సాగు వంటి ఉద్యానవన రంగం వైపు రైతులను మళ్లిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దాదాపు 20 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు జరుగుతుండగా, అందులో 8,300 ఎకరాల్లో ఆయిల్ పామ్, 5 వేల ఎకరాల్లో పసుపు సాగవుతున్నాయన్నారు. ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని అధిగమించామని పేర్కొన్నారు. రెవెన్యూ మ్యాపులు లేని 14 గ్రామాల్లో దాదాపు 30 వేల ఎకరాలకు సర్వే చేపడుతున్నామని, మరో 70 గ్రామాల్లో 62 వేల ఎకరాల భూముల సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. -
తల్లిపాలే శిశువుకు పోషకాహారం
భైంసారూరల్: పుట్టిన శిశువుకు తల్లిపాలే అత్యుత్తమమైన, సంపూర్ణ పోషకాహారమని జిల్లా మ హిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వినూ త్న అన్నారు. భైంసా పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో తల్లిపాల వారోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ వినూత్న మాట్లాడుతూ ప్రతీ తల్లి శిశువు పుట్టిన గంటలోపే పాలు ఇవ్వాలన్నారు. తొలి ఆరు నెలలపాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాల ని సూచించారు. తల్లిపాలు శిశువు రోగనిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడతాయని తెలిపారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, సీడీపీవో అమ్రిన్ ఫరా, భైంసా, కుబీర్, కుంటాల మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. -
సంప్రదాయానికి పట్టం!
నిర్మల్ఖిల్లా: మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చేనేత కళను గౌరవించుకుంటూ ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. భారత్లో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేతే. తరతరాల నైపుణ్యాన్ని వేళ్ల కొనలతో మగ్గంపై ఆవిష్కరించే నేతన్నల శ్రమను స్మరించుకోవడానికి ఈ రోజు ప్రత్యేక సందర్భం. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఏటా ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారికంగా ప్రకటిస్తూ వస్తోంది. యువతలో ఆసక్తి ఒకప్పుడు పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాలకే ప రిమితమైన చేనేత దుస్తులు ఇప్పుడు యువత, ఉ ద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సా మాజిక కార్యకర్తల దైనందిన జీవితంలోనూ చోటు సంపాదిస్తున్నాయి. వేసవిలో చల్లదనం, చలి కాలంలో వెచ్చదనం అందించే సహజ గుణాలు చేనే త వ స్త్రాల ప్రత్యేకత. రాజకీయ నాయకులు, సంఘాల నాయకులు, సీనియర్ సిటిజన్లతో పాటు వివిధ వ ర్గాల వారు కూడా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఖాదీ భండార్కు ఆదరణ టెస్కో(తెలంగాణా హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖాదీ భండార్ చేనేత వస్త్ర దుకాణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేంద్రంగా నిర్మల్ పట్టణంలో కొనసాగుతోంది. చేనేత వస్త్రాలపై మక్కువ ఉన్న వినియోగదారులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఇక్కడ కొనుగోళ్లు చేస్తుండటం గమనార్హం. ఎగ్జిబిషన్లో ఆదరణ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న చేనేత–హస్తకళల ఎగ్జిబిషన్కు విశేష స్పందన లభి స్తోంది. వివిధ రాష్ట్రాల చేనేత కార్మికులు తయారు చేసిన ఖాదీ, చేనేత వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. -
అంగన్వాడీ చిన్నారులకు పోషకాహారం అందాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం అందించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరే ట్ సమావేశ మందిరంలో అంగన్వాడీలు, గిరిజ నాభివృద్ధి సంస్థ విద్యాసంస్థలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల వికాస వివరాలు ఎప్పటికప్పుడు నమో దు చేసుకుంటూ ఉండాలన్నారు. పోషక లోపం కలిగిన పిల్లలను గుర్తించి, వారికి ప్రత్యేక పోషకాహారం అందించాలని తెలిపారు. అంగన్వాడి సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. పిల్లల హాజరు, అందిస్తు న్న ఆహారం, కల్పిస్తున్న వసతులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అభా గుర్తింపు కార్డుల నమోదు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వలస కూలీల పిల్లలను గుర్తించి వారికి తప్పనిసరి గా పోషకాహారం అందించేలా చర్యలు తీసుకో వా లన్నారు. అనుమతులు లభించిన అంగన్వాడీ భవ న నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో విద్యార్థులందరికీ నాణ్యమైన వసతులతో కూడిన విద్య అందించాలన్నారు. ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై చర్చించారు. సమావేశంలో డీటీడీవో నిహారిక, సంక్షేమ అధికారి వినూత్న పాల్గొన్నారు. -
కడెం నిండుగా..
ప్రస్తుతం ప్రాజెక్టు 700 అడుగుల పూర్తి నీటిమట్టంతో 3.495 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ప్రాజెక్టులోకి 4,437 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఒక గేటు ఎత్తి అంతేమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కడెం ప్రాజెక్టు.. ప్రస్తుత నీటిమట్టం 700 అడుగులు (పూర్తి స్థాయి) నీటి నిల్వ 3.495 టీఎంసీలు ఇన్ఫ్లో 4,437 క్యూసెక్కులు ఔట్ఫ్లో 4,278 క్యూసెక్కులు -
ఎస్సారెస్పీలో పెరిగిన నీటిమట్టం..
ప్రస్తుతం ప్రాజెక్టులో 1075.10 అడుగుల నీటిమట్టంతో 33.137 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. జలాశయంలోకి 7,015 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 914 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి సరస్వతీ కాలువ ద్వారా నిర్మల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లోని 47 కిలోమీటర్ల ప్రధాన కాలువ పరిధిలో 33,622 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఈ కాలువకు 28 డిస్ట్రిబ్యూటర్లు ఉండగా, విడుదల చేసిన నీరు దాదాపు 52 చెరువులకు చేరి వాటి కింద సాగు చేస్తున్న పంటలకు ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా కాలువ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడంతో బోరుబావులపై ఆధారపడే రైతులకు కూడా ఊరట లభించనుంది. దీంతో సరస్వతీ కాలువ ఆయకట్టు రైతుల్లో ఉత్సాహం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.. ప్రస్తుత నీటిమట్టం 1075.10 అడుగులు నీటి నిల్వ 33.137 టీఎంసీలు ఇన్ఫ్లో 7,015 క్యూసెక్కులు ఔట్ఫ్లో 914 క్యూసెక్కులు -
నీటిని పొదుపుగా వాడుకోవాలి
సారంగపూర్: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్వర్ణ ఆయకట్టు రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు మంగళవారం నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా మధ్యకాలువ జౌళినాలా నుంచి 80 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 20 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరిసాగు చేసే రైతులు వరుసతడులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కా ర్యక్రమంలో మండల నాయకులు కాల్వ నరేశ్, స త్యం చంద్రకాంత్, విలాస్ తిరుమలాచారి, సాహెబ్రావు, గంగారెడ్డి, స్థానిక సర్పంచ్ సురేందర్, నాయకులు రాజేశ్వర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
క్లిక్ చేస్తే కష్టాలే
నిర్మల్టౌన్: సెల్ఫోన్లకు వచ్చే మెస్సేజ్ లింక్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మి ల సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూ రో ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతీనెల మొదటి బుధవారం జిల్లాలో సైబర్ జాగృతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఇందులో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవంపురస్కరించుకొని ‘సురక్షా కా తిరంగా–స్టే అలర్ట్ –స్టే అవేర్–స్టే సైబర్ సేఫ్’ అనే సందేశంతో రూపొందించిన అవగాహన పోస్టర్లను మంగళవా రం జిల్లా పోలీస్ కార్యాలయంలో విడుదల చేశారు. నకిలీ యాప్లు, ప్రకటనలతో జాగ్రత్త.. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజ లను మోసం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. నకిలీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ యాప్లు, అధిక లాభాల పేరుతో వచ్చే ప్రకటనలు, ప్రముఖుల ఫొటోలు, మార్ఫింగ్, నకిలీ సంస్థల పేర్లు, లోగోలతో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మవద్దని హెచ్చరించారు. ట్రేడింగ్ యాప్లో భారీ లాభాలు నిజంగా డబ్బు పెరుగుతోందని భావించకూడదన్నారు. పరిశీలన తప్పనిసరి ఏదైనా సంస్థలో పెట్టుబడి పెట్టే ముందు దాని విశ్వసనీయత, అధికారిక వెబ్సైట్, యాప్ డౌన్లోడ్ సోర్స్ను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూ చించారు. ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రముఖుల పేర్లను చూసి తొందరపడి డబ్బులు బదిలీ చేయవద్దన్నారు. ‘అప్రమత్తత+అవగాహన=సైబర్ భద్రత’ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్’తో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. మోసపోతే 1930కు కాల్ చేయాలి.. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ పట్టణ సీఐ సమ్మయ్య, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రమణ, ఆర్ఐ రామ్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాల ఆధార్’కు బాలారిష్టాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పొందే ‘బాల ఆధార్’ సేవల బాలారిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల వరకు ఎలాంటి బయోమెట్రిక్ నమోదు లేకుండానే బాల/శిశు ఆధార్ జారీ చేయాలనే ఉద్దేశంతో యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రత్యేకంగా ఈ వీలు కల్పించింది. మొదట పిల్లలకు పేర్లు పెట్టకముందే బేబీ ఆఫ్తోనే తల్లిదండ్రుల ఆధార్తో కార్డులు జారీ చేశారు. కానీ కొన్ని చోట్ల ఈ సేవను దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించారు. దీంతో మీ సేవ కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రం ఉంటేనే బాల ఆధార్ నమోదు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వాసుపత్రుల్లో ఈ సేవలు అందడం లేదు. మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్నగర్, ఆదిలాబాద్, నిర్మల్ ప్రభుత్వాసుపత్రుల్లో అరకొరగా సేవలు అందుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సేవలు కూడా అందడం లేదు. దీంతో తల్లిదండ్రులు చిన్నారులకు ఆధార్ కోసం తిప్పలు పడుతున్నారు. ఆధార్ చిన్నారుల నివాస రుజువు, తల్లిదండ్రుల ఆధార్తో అనుసంధానం, టీకాలు, ‘అభా’ కార్డు, రేషన్కార్డుతోపాటు ఇతర అనేక చోట్ల తప్పనిసరిగా మారింది. ప్రతీరోజు సాంకేతిక సమస్యలే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసవాలు అధికంగా జరిగే పీహెచ్సీలు, సీహెచ్సీలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో కేసీఆర్ కిట్ నిర్వహణ చూసే సిబ్బందికే బాల ఆధార్ జారీ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 140మంది వరకు సిబ్బందికి ప్రత్యేకంగా ట్యాబ్లు అందజేశారు. ఈ యాప్లో శిశు ఫొటో, తల్లిదండ్రుల వివరాలు నమోదు చేసి, కార్డు జారీ చేయవచ్చు. ఈ సేవలు అవకాశం ఉన్నా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఉచితంగా పొందవచ్చు. చాలా చోట్ల ఈ కార్డు జారీపై అవగాహన లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పొందే సేవలకు దూరం అవుతున్నారు. ఇక ఎవరైన ఆధార్ కోసం వెళ్లినా యాప్ సరిగా పని చేయకపోవడంతో రోజుల తరబడి సేవలు నిలుస్తున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వాట్సాప్ వేదికగా సాంకేతిక సమస్యలు తీర్చాలని ఎప్పటికప్పుడు గ్రూప్లో పోస్టు చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. ఓటీపీలు రాక, సర్వర్ ఎర్రర్, వివరాలు అప్లోడ్ కాక అవస్థలు పడుతున్నారు. సాంకేతిక సమస్యలను హైదరాబాద్ కేంద్రంగా ఈ యాప్లో ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉన్నా పట్టింపు కరువైంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వాసుపత్రుల్లో తల్లి, బిడ్డ ఒకే చోట ఉన్న సమయంలోనే ఉచితంగా సులువుగా పొందే ఆధార్ కార్డు ప్రైవేటు ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. -
నిర్మల్
నిర్మాణాలు ఇలా.. నీరు వెళ్లేదెలా?ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో చాలా చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇంటర్ కళాశాలల్లో క్వాలిటీ ఫుడ్.. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఇంటర్ విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ‘సదర్మాట్’పై లిఫ్ట్ ఏర్పాటు చేయాలి మామడ: సదర్మాట్ బ్యారేజీపై లిఫ్ట్ ఏర్పాటు చేసి వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు కోరారు. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మండల నాయకులతో కలిసి హైదరాబాద్లో మంగళవారం వినతిపత్రం అందించారు. లిఫ్ట్ ఏర్పాటు చేస్తే మండలలోని పొన్కల్, మామడ, దిమ్మదుర్తి, కప్పన్పల్లి, నల్దుర్తి గ్రామాల సాగు భూములకు సాగునీరు అందుతుందని తెలిపారు. నాయకులు గంగారెడ్డి, లింగారెడ్డి, పడాల శ్రీనివాస్ ఉన్నారు. గడ్డెన్నవాగులోనూ.. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో 356.90 మీటర్ల నీటిమట్టంతో 0.918 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. 24 గంటల్లో 231 క్యూసెక్కుల సగటు ఇన్ఫ్లో రాగా, 20 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు మూసివేసి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 13,950 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. భైంసా: ఇటీవల మహారాష్ట్రతోపాటు, జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జిల్లా రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. ఎల్నినో ప్రభావం తగ్గి మంచి వర్షాలు కురవడంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఖరీఫ్సాగుతోపాటు తాగునీటి అవసరాలపై నెలకొన్న ఆందోళన క్రమంగా తొలగిపోతోంది. ఎస్సారెస్పీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కల్పతరువు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద వస్తోంది. నీటిమట్టం పెరుగుతోంది. జోరందుకున్న సాగు.. ఎల్నినోప్రభావంతో ఈ ఖరీఫ్లో పంటల సాగుకు రైతులు ఇంతకాలం వెనుకాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో జలాశయాలు నిండాయి. దీంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. సాగు పనుల జోరు పెంచారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే నాలుగు ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఖరీఫ్ సాగుకు నీటి కొరత ఉండదనే విశ్వాసం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎల్నినో ప్రభావం తగ్గి మంచి వర్షాలు కురవడంతో రైతులు హుషారుగా ఉన్నారు. స్వర్ణ ప్రాజెక్టు.. ప్రస్తుత నీటిమట్టం 1,181 అడుగులు నీటి నిల్వ 0.830 టీఎంసీలు (పూర్తి సామర్థ్యం 1.037 టీఎంసీలు) ఇన్ఫ్లో 100 క్యూసెక్కులు ఔట్ఫ్లో లేదు ఖరీఫ్కు భరోసా.. కొంతకాలంగా వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీరు తగ్గిపోవడంతో సాగుపై ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఎస్సారెస్పీలోకి వరద నీరు చేరుతుండటంతో సరస్వతీ కాలువ ద్వారా నీరు వస్తుందనే నమ్మకం కలిగింది. ఖరీఫ్పై భరోసా దక్కింది. నీరు వదిలితే పంటలతో పాటు బోరుబావులకు కూడా రీచార్జి అవుతాయి. – గోవర్ధన్, రైతు భూగర్భ జలాలు పెరుగుతాయి ఎస్సారెస్పీతోపాటు కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు పెరగడం జిల్లాకు శుభపరిణామం. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగునీటి సమస్య తగ్గి రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తారు. ఇలాగే మరికొన్ని రోజులు వర్షాలు కురిస్తే ఈ ఖరీఫ్ సీజన్కు ఢోకా ఉండదు. – అనిల్ కుమార్, ఇరిగేషన్ ఈఈరేపు జాబ్మేళా నిర్మల్టౌన్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 6న(గురువారం) ఉదయం 11 గంటలకు నిర్మల్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.విజయలక్ష్మి తెలిపారు. సుభగృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అపోలో ఫార్మసీలో మొత్తం 80 ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు న్న ఫ్రెషర్స్ కూడా అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న యువతీ యువకులు రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 7329911657, 8247656356, 9652707401 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 356.90 మీటర్లు నీటి నిల్వ 0.918 టీఎంసీలు (పూర్తి సామర్థ్యం 1.83 టీఎంసీలు) ఇన్ఫ్లో 231 క్యూసెక్కులు ఔట్ఫ్లో 20 క్యూసెక్కులు -
పెండింగ్ బిల్లుల విడుదలకు కృషి
లోకేశ్వరం: ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎప్, టీఏజేఎల్ఐ బిల్లులు ఇప్పించేందుకు పీఆర్టీయూ కృషి చేస్తోందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు తెలిపారు. మండల కేంద్రంలో యూనియన్ మండల సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. మండల అధ్యక్షుడుగా జెడ్ల రాజారాం, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్, ఉపాధ్యక్షుడిగా భోజన్న, మహిళ ఉపాధ్యాక్షులుగా భారతి, అసోసియేట్ అధ్యక్షులుగా మురళీధర్, రాణి, కార్యదర్శులుగా గంగాధర్, నాగన్న, మహిళ కార్యదర్శులుగా కృష్ణవేణి, నవతను ఎన్నుకున్నారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాణారవు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సదానందం, దేవేందర్, నాయకులు సురేశ్రావు, అశోక్రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. -
పారదర్శకతకు ‘టీజీ స్కూల్’
లక్ష్మణచాంద: ప్రభుత్వ బడుల్లో గత సంవత్సరం ఉ న్న తీరు వేరు, ఇప్పటి తీరు వేరు. ఉపాధ్యాయులు పాఠశాలలకు గైర్హాజరైనా, మధ్యాహ్న భోజనంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా, అలాగే పా ఠశాలలో చేపట్టే అభివృద్ధి పనుల్లో ఎటువంటి తేడా వచ్చినా వెంటనే గుర్తు పట్టేస్తుంది టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్. ప్రభుత్వ పాఠశాలల మొత్తం సమాచారాన్ని తెలుసుకునేందుకు తెలంగాణ విద్యాశాఖ ఈ నూతన యాప్ను అభివృద్ధి చేసింది. పారదర్శకంగా సేవలు రాష్ట్ర విద్యాశాఖ నూతనంగా తీసుకొచ్చిన ఈ యా ప్తో పాఠశాలల్లో విద్యా సేవల్లో మరింత పారదర్శకత ఏర్పడనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల అభ్యసన సామర్థ్యాల స్థాయిని తెలుసుకోవచ్చు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు, విద్యార్థులకు అందజేసే ఏకరూప దుస్తుల వివరాలు, పోషకుల సమావేశాల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తెలుసుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పారదర్శకత పెంచడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం. వివరాలనీ డిజిటలైజ్ చేయడానికి ఈ నూతన వాట్సాప్ను ఉపయోగిస్తుండటంతో ఈ యాప్ ద్వారా పాఠశాలల సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. 15 రకాల సేవలు.. ఈ యాప్ ద్వారా విద్యార్థుల ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ(లిప్), బేస్లైన్ అసెస్మెంట్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలిస్తారు. అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం నైపుణ్యాలను అంచనా వేస్తారు. బడిబాట ప్రవేశాలు, విద్యార్థుల ప్రొఫైల్ సృష్టించడం, అప్డేట్ చేయవచ్చు. మండల, జిల్లాస్థాయి అధికారులకు విద్యా ప్రగతి నివేదికలను నేరుగా అందిస్తోంది. విద్యార్థుల మార్కులు, మెమోలు, హాల్టికెట్లు, బోనఫైడ్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు (టీసీ) వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పరీక్షల సమాచారం, ఉపకార వేతనాలు, విద్యా సామగ్రి పంపిణీ వివరాలు మొబైల్కు సమాచారం అందుతుంది. ఉపాధ్యాయుల వృత్తిపరమైన శిక్షణ సమయంలో ఉదయం చెక్–ఇన్, సాయంత్రం చెక్–అవుట్ టైం నమోదు చేస్తోంది. పారదర్శకంగా అమలు తెలంగాణ విద్యాశాఖ అమలు చేస్తున్న టీజీ స్కూల్ యాప్ను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పారదర్శకంగా అమలు చేస్తున్నాం. ఈ యాప్ ద్వారా ప్రతీ పాఠశాల సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. – భోజన్న, డీఈవోజిల్లా సమాచారం... ప్రాథమిక పాఠశాలలు 577 ప్రాథమికోన్నత పాఠశాలలు 89 ఉన్నత పాఠశాలలు 164 మొత్తం విద్యార్థులు 66,790 మొత్తం ఉపాధ్యాయులు 3,288 -
బాసరలో కార్డన్ సెర్చ్
బాసర: బాసరలో సోమవారం ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకుచేపట్టిన ఈ తనిఖీల్లో పోలీసులు ఇంటింటికీ వెళ్లి ధ్రువపత్రాలు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, వాహనాల వివరాలు నమోద చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక లారీతోపాటు నంబర్ ప్లేట్ లేని నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల బాసరలోని మహాకాళి అమ్మవారి ఆలయంలో జరిగిన కిరీటం చోరీ కేసును వేగంగా ఛేదించి నిందితులను పట్టుకున్న పోలీసు బృందాన్ని అభినందించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు వచ్చే వరకు వేచి చూడకుండా వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలిస్తే, ‘గోల్డెన్ అవర్’ పథకం కింద ప్రభుత్వం రూ.5 వేల ప్రోత్సాహకం అందిస్తుందని వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ కాలనీ, ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు నియంత్రించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ముధోల్ సీఐ రవీందర్, బాసర సీఐ దీపక్, ముధోల్ ఎస్సై, బైంసా–ముధోల్–బాసర పోలీస్ సిబ్బంది, బాసర సర్పంచ్ వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ సిలబస్ మారింది
మంచిర్యాలఅర్బన్: ఇంటర్ విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి నూతన కరికులమ్, సవరించిన పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన పద్ధతులు అమలు చేయనుంది. ఇంటర్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఆధారిత విద్యపై అధ్యాపకులకు జిల్లాస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఏఐ బోధన ద్వారా ఇంజినీరింగ్లో చేరే విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం కలుగనుంది. ఉన్నత విద్యతోపాటు భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలకు పునాది పడనుంది. పాఠ్యాంశాల్లో మార్పులు.. ఇంటర్మీడియెట్ తెలుగు పుస్తకాన్ని మొత్తం మార్చేశారు. సబ్జెక్టుల వారీగా అనేక మార్పులు చేశారు. జంతుశాస్త్రంలో ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి తొలగించగా.. ఫస్టియర్లో ప్రాక్టికల్స్కు 15 మార్కులు, భౌతికశాస్త్రంలో ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చేర్చడంతోపాటు ప్రాక్టికల్స్కు 15 మార్కులు, వృక్షశాస్త్రంలో ఆర్థిక వృక్షశాస్త్రం చేర్చి ప్రాక్టికల్స్కు 15 మార్కులు కేటాయించారు. గణితంలో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతం అధ్యాయాలు చేర్చారు. రసాయనశాస్త్రంలో ప దార్థాల స్థితులు, పర్యావరణ రసాయన శాస్త్రం, స్టో యికియోమెట్రీ పాఠంలో మెలారిటీ భావన తొలగించారు. మొదటి సంవత్సరం ప్రాక్టీకల్ పరీక్షల కోసం క్వాలిటేటివ్ అనాలసిస్ నుంచి 15 లవణాలు కొత్తగా చేర్చారు. హిస్టరీలో యూనిట్–6లో దక్షిణ భారతదేశం, దక్కన్రాజ్యాలు, యూనిట్–8లో ప్రాంతీయ రాజ్యాలు కొత్తగా చేర్చగా మరాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుదల తొలగించారు. సుల్తానేట్ రాజవంశీయుల అంశం యూనిట్–7లో కలిపారు. యూరోపియన్ల రాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు, జాతీయోద్యమం (తొలిదశ, మలిదశ) యూనిట్లు విలీనం చేశారు. ఎకనామిక్స్లో పాజిటివ్ ఎకనామిక్స్, నార్రేటివ్, నార్మేటివ్ ఎకనామిక్స్ చేర్చారు. స్టాటిస్టిక్స్ సూచీ సంఖ్యలు కొత్తగా చేర్చారు. తెలుగులో పాఠ్యాంశాలు మార్పులు చేశారు. శిక్షణ అనంతరం.. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు జిల్లాల వారీగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. మారిన సిలబస్లో కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో తీసివేసిన, కొత్తగా చేర్చిన పాఠ్యాంశాలను సులభంగా ఎలా బోధించాలో అవగాహన కల్పించనున్నారు. క్లాస్రూమ్లలో టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాధనాలు, డిజిటల్ పద్ధతులను ఉపయోగించి పాఠాలను ఆకర్షణీయంగా ఎలా చెప్పాలో శిక్షణ ఇస్తారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే నూతన అసెస్మెంట్, పరీక్షల ప్యాట్రన్పై స్పష్టతనిస్తారు. కేవలం సబ్జెక్టు బోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా గైడెన్స్ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇలా.. నూతన విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు హైదరాబాద్లో పలు వేదికలపై జూలై 31 నుంచి ఆగస్టు 5వరకు మూడు విడుతల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్లు, డిస్ట్రిక్ రిసోర్స్ పర్సన్లకు (డీఆర్పీ) రెండు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 సబ్జెక్టుల్లో ఇంగ్లిష్ మినహాయిస్తే సబ్జెక్టుకు ఒక్కరి చొప్పున 10 మంది అంటే దాదాపు 40 మంది అధ్యాపకులను డీఆర్పీలుగా ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. డీఆర్పీలు జూనియర్ లెక్చరర్లకు ఇదే తరహాలో రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాథమికాంశాలైన ఏఐ నిర్వచనం, చరిత్ర, రోజువారీ జీవితంలో దాని అప్లికేషన్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిప్ లెర్నింగ్ మధ్య తేడాలు, గణిత శాస్త్రానికి ఏఐ, ప్రోగ్రామింగ్ పునాదులు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. పూర్తిగా మారిన తెలుగు పుస్తకం ఉమ్మడి జిల్లాలో ఇంటర్ కళాశాలలు, విద్యార్థుల వివరాలు జిల్లా కళాశాలలు విద్యార్థులు మంచిర్యాల 10 4,320 నిర్మల్ 13 4,844 ఆదిలాబాద్ 13 6,606 కుమురంభీం 11 4,180 -
సింహాచలంలో నృత్య ప్రదర్శన
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన స్వరూపిణి నృత్య కళాకేత్రం మరోసారి తన కళా ప్రతిభను చాటుకుంది. సంస్థ వ్యవస్థాపకురాలు నవ్య వినయ్ ఆధ్వర్యంలోని 55 మంది చిన్నారులతో కూడిన బృదం విశాఖపట్నంలోని ప్రసిద్ధ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకుంది. సంప్రదాయ కూచిపూడి నృత్యరీతిలో భక్తి, భారతీయ సంస్కృతి, శాసీ్త్రయ నృత్య వైభవాన్ని ప్రతిబింబించేలా చిన్నారులు తమ ప్రతిభ కనబరిచారు. ప్రశంసాపత్రాలతో కళాకారులు, గురువు నవ్యవినయ్ -
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
నిర్మల్టౌన్ : పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయడంతోపాటు నాణ్యతతో కూడిన దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. నిర్మల్ పట్టణ పోలీస్స్టేషన్ను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రికార్డు రూంను పరిశీలించారు. వివిధ రికార్డులు, రిజిస్టర్లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు. స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణకు పెట్రోలింగ్ పటిష్టం చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రజామిత్ర పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్య, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
ఉద్యాన పంటలతో ‘సాగు’దాం
ముధోల్: ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సంప్రదాయ పంటలు కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు డ్రిప్ ఇరిగేషన్తోపాటు వివిధ రాయితీలు ప్రకటించింది. ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. డ్రిప్, ఆయిల్పామ్ సబ్సిడీ ఆయిల్పామ్ సాగుచేసే రైతులకు ఎన్ని ఎకరాలు సాగు చేసినా రాయితీ వర్తిస్తుంది. డ్రిప్ ఇరిగేషన్కు ఎకరానికి రూ. 22,518 సబ్సిడీ అందుతుంది. ఎకరం మొక్కలకు రూ.11,600 సబ్సిడీ లభిస్తుంది. పండ్ల తోటలకు.. పండ్ల తోటల విస్తరణ పథకం కింద బొప్పాయి, అవకాడో, మామిడి, నిమ్మ, జామ, దానిమ్మ పంటలు సాగు చేసే రైతులకు 40 శాతం రాయితీ ఇస్తారు. బంతి, చామంతి, గులాబీ వంటి పూల మొక్కలకు 80 శాతం రాయితీ వర్తిస్తుంది. సాగు వివరాలు ముధోల్ నియోజకవర్గంలోని ముధోల్, కుంటాల, లోకేశ్వరం, కుభీర్, బాసర, భైంసా, తానూర్ ప్రాంతాల్లో 3,171 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. ఇక్కడ మామిడి, నిమ్మ, దానిమ్మ, పూలు, పసుపు, కూరగాయలు సాగవుతున్నాయి. పండ్ల తోటలు 150 ఎకరాలు, పూల తోటలు 40 ఎకరాలు, పసుపు 1,800 ఎకరాలు, కూరగాయలు 2,000 ఎకరాలు సాగులో ఉన్నాయి. కూరగాయల పందిర్లు, నారు.. కూరగాయలు సాగు చేసే రైతులు పందిర్లు వేసుకోవడానికి 50 శాతం రాయితీ ఉంది. జిల్లా కోటాగా 20 యూనిట్లు కేటాయించారు. వివిధ రకాల కూరగాయల నారును 207 ఎకరాల వరకు ఉచితంగా అందిస్తున్నారు. బిందు సేద్యం పరికరాలకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం రాయితీ వర్తిస్తుంది. కూరగాయల పంటలకు అవసరమైన మల్చింగ్ పేపర్ను 50 శాతం సబ్సిడీపై ఇస్తారు. దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.. ఉద్యనవన శాఖ ప్రకటించిన పథకాలకు అర్హులైన రైతులు ఆయా మండల ఉధ్యాన శాఖ అధికారులకు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. కోటా మేరకు సబ్సిడీలు వర్తిస్తాయి. వరి పంట కాకుండా రైతులు కూరగాయలు, పండ్లు, పూల సాగు చేసి మంచి ఆదాయం పొందాలి. -
నిర్మల్
సర్ డిజిటలైజేషన్ త్వరగా పూర్తి చేయాలి నిర్మల్చైన్గేట్: సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాదు నుంచి సోమవారం సమీక్ష నిర్వహించారు.డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా డిజిటలైజేషన్ చేపట్టాలన్నారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఉంటే, వారిని ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వీసీలో కలెక్టర్ భవేశ్మిశ్రా, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.నిర్మల్: ఎప్పుడు వస్తున్నారో.. ఎలా వస్తున్నారో తెలియడం లేదు. జిల్లాలో దొంగతనాలు చేస్తూ.. అందినకాడికి దోచుకుంటూ.. సరిహద్దు దాటి పారిపోతున్నారు. జిల్లాలో ఇటీవల వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒక కేసు ఛేదించేలోపే మరో దొంగతనం చేస్తున్నారు. ప్రధానంగా భద్రత లేని ఆలయాలను, చోరీ చేసి పారిపోవడానికి సులువుగా ఉండే ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. బాసర ఆలయం నుంచి జిల్లాకేంద్రంలోని మల్ల న్నగుట్ట హరిహరక్షేత్రం వరకు చిన్నపెద్ద అనే తేడా లేకుండా గుడుల్లో దోపిడీలకు తెగబడుతున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆలయాల భద్రతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుస చోరీల వెనుక మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలు ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. సరిహద్దు ఆసరాగా.. జిల్లా మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉండటంతో అక్కడి నుంచి వచ్చే దొంగల ముఠాలు రాత్రివేళల్లో జిల్లాలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడి, తెల్లవారే సరికి మహారాష్ట్రలోని దూరప్రాంతాలకు పారిపోతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో నమోదైన కొన్ని కేసుల తీరు, సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించిన అనుమానితుల కదలికలను పరిశీలిస్తూ ఈ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లా సరిహద్దు మార్గాలపైనా నిఘా పెంచారు. అనుమానితుల కదలికలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాలే లక్ష్యంగా.. ఇటీవల జిల్లాలోని పలు ఆలయాల్లో హుండీలు పగులగొట్టి నగదు అపహరించిన ఘటనలు పెరుగుతున్నాయి. ఇందులో ఒక కేసు గుట్టు విప్పేలోపే మరోచోట దొంగతనం జరగడంతో పోలీసులపైనా ఒత్తిడి పెరుగుతోంది. బాసర ఆలయంలో చోరీ కేసులో దొంగలను పట్టుకోగానే.. వేరే ముఠాలు మరో రెండు ఆలయాల్లో దొంగతనాలకు పాల్ప డ్డాయి. తాజాగా జిల్లాకేంద్రంలోని మల్లన్నగుట్ట ఆలయాల్లోనూ దోపిడీ చేయడం భక్తులను కలవరపెడుతోంది. రాత్రివేళల్లో జనసంచారం తక్కువగా ఉండే సమయాలను ఎంచుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్టలో ఫింగర్ప్రింట్స్ పరిశీలిస్తున్న పోలీసు సిబ్బంది జిల్లాలో వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. వీటిని ఎస్పీ జానకీషర్మిల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి సీసీటీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ సిగ్నళ్లు, అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నారు. చోరీలు జరిగిన వెంటవెంటనే ఆ కేసులను పరిష్కరించేలా, సంబంధిత దొంగలను పట్టుకునేలా టీమ్లు ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది ఆరు నెలల్లోనే జిల్లాలో 230 చోరీ జరగడం గమనార్హం. వీటిలో 143 కేసులను ఛేదించారు. చోరీలను అరికట్టేలా చర్యలు.. జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులను ఏర్పాటు చేశాం. రాత్రిళ్లు పెట్రోలింగ్ మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశాం. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి. –జానకీషర్మిల, ఎస్పీ -
భైంసాలో ఉచిత పోలీస్ కోచింగ్
భైంసా : తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో పట్టణంలోని మోహన్రావు పాటిల్ స్టడీ సర్కిల్లో మోహన్రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కోచింగ్ను ప్రారంభించారు. ట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పాటిల్, ఆర్ఎస్ఎస్ నిర్మల్ జిల్లా సహ సంఘ్ చాలక్ కృష్ణదాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్రావు పాటిల్ మాట్లాడుతూ అభ్యర్థులు క్రమశిక్షణతో సిద్ధమై ఉద్యోగాలు సాధించాలని, అవసరమైతే ట్రస్ట్ తరఫున ఆర్థిక సహకారం కూడా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్య విభాగ్ ప్రముఖులు దిగంబర్, జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్, గోపాల్ దాస్ ఆకుల, సుభాష్ జాదవ్, మనోజ్ పాపిన్వార్ తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన లోపం.. కార్మికులకు శాపం
నిర్మల్చైన్గేట్: జిల్లాలో కార్మికులకు తమ హక్కుల గురించి తగిన అవగాహన లేకపోవడంతో లేబర్ కార్డులకు దూరంగా ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, కార్మికులు ఇప్పుడిప్పుడే కార్డులు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం త రఫున కూడా తగిన అవగాహన కల్పించడంలో విఫ లమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రా మీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కార్మికులు లేబర్ కార్డుల గురించి సమాచారం పొందడం చాలా కష్టంగా మారుతోంది. అందువల్ల ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఏడు లక్షలకుపైగా జనాభా ఉండగా, వీరిలో దాదాపు రెండు లక్షల మంది వివిధ రంగాల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. అయితే వీరిలో కేవలం 22,864 మంది మాత్రమే లేబర్ కార్డులు పొందారు. ఈ గణాంకాల ప్రకారం కార్మికుల్లో పది శాతం కంటే తక్కువ మంది మాత్రమే లేబర్ కార్డులు పొందారు. లేబర్ కార్డుతో ప్రయోజనాలు.. లేబర్ కార్డు ఉన్న కార్మికులకు అనేక ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. కూతుళ్ల పెళ్లికి రూ.30 వేలు, ప్రసవానికి రూ.30 వేలు(ఇద్దరు కూతుళ్లకు మాత్రమే) సాయం అందుతుంది. ఈ ప్రయోజనాలు ఒక సంవత్సరం ముందు బోర్డులో కార్మికుడు లేదా కార్మికురాలుగా నమోదైనవారికే వర్తిస్తాయి. ప్రమాదంలో మరణించినప్పుడు బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు, సాధారణ మరణానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. దహన సంస్కార ఖర్చుల కోసం రూ.30 వేలు అందజేస్తారు. ప్రమాదవశాత్తు అంగవైకల్యం కలిగినవారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం ఇస్తారు. తాత్కాలిక వైద్య ఖర్చుల కింద నెలకు రూ.4,500 చొప్పున గరిష్టంగా రూ.13,500 సహాయం అందుతుంది. అదనంగా సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల పిల్లల చదువులకు ఉపకార వేతనాలు కూడా అందిస్తారు. 2018 నుంచి ఇప్పటివరకు క్లెయిమ్ల వివరాలు నిర్మల్ డివిజన్లో.. మొత్తం లేబర్ కార్డులు 11,258 ప్రసూతి క్లెయిమ్లు 585 చెల్లించిన డబ్బులు రూ.1,75,58,758 పెళ్లి గిఫ్ట్ 204 చెల్లించిన డబ్బులు 61,26,708 సాధారణ మరణం 99 చెల్లించిన డబ్బులు 1,26,63,019 యాక్సిడెంట్లు మరణం 4 చెల్లించిన డబ్బులు 25,20,152 భైంసా డివిజన్లో.. మొత్తం లేబర్ కార్డులు 11,606 ప్రసూతి క్లెయిమ్లు 913 చెల్లించిన డబ్బులు 2,74,21,476 పెళ్లి గిఫ్ట్ 283 చెల్లించిన డబ్బులు 88,00,195 సాధారణ మరణం 65 చెల్లించిన డబ్బులు 85,71,802 యాక్సిడెంట్లు మరణం 6 చెల్లించిన డబ్బులు రూ.41,50,189 నిరంతరం అందజేస్తున్నాం లేబర్ కార్డు పొందేందుకు నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదు. కార్మికులుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరి దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ లేబర్ కార్డులు అందజేయడం జరుగుతుంది. జిల్లాలో 23 వేల మంది ఇప్పటి వరకు కార్డులు కలిగి ఉన్నారు. వచ్చేనెల 5వ తారీఖున కార్మికులకు అవగాహన కల్పించి మరింత మంది కార్డులు పొందేలా ప్రోత్సహిస్తాం. – రాజలింగం, లేబర్ ఆఫీసర్, నిర్మల్ -
ఆస్పత్రుల్లో సేవల విస్తరణ
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి రోజూ వేలాదిమంది, పండుగలు, సెలవు దినాల్లో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. పక్కనే వేలాదిమంది చదువుకునే ట్రిపుల్ఐటీ కూడా ఉంది. భక్తులు, విద్యార్థులు, స్థానికులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా బాసర ప్రాంతంలో సేవలను మరింత విస్తరించాలని ప్రస్తావించారు. ఖానాపూర్లో ఏరియాస్పత్రి ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో ప్రతిపాదించారు. ఖానాపూర్, పరిసర మండలాల ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం నిర్మల్, ఆదిలాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ ఏరియాస్పత్రి ఏర్పాటు చేస్తే వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కాగా, జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేలా ప్రజాప్రతినిధులు అందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో జిల్లా వాసులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందనే ఆశలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.భైంసా: జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలు, ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరకు వచ్చే భక్తులు, ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అవసరాల దృష్ట్యా వైద్యసేవలు మరింత విస్తరించాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, అత్యవసర వైద్యసేవలపై సమగ్రంగా చర్చించారు. మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్, డయేరియా లాంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు జిల్లా కావడంతోనే.. జిల్లా మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉండటంతో భైంసా, కుభీర్, బాసర, తానూర్ తదితర ప్రాంతాల ఆస్పత్రులకు రెండు రాష్ట్రాల ప్రజలు వైద్యసేవల కోసం వస్తుంటారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రోగుల రద్దీ పెరుగుతుండడంతో ప్రస్తుతమున్న సదుపాయాలు సరిపోవడం లేదు. ఆస్పత్రులను విస్తరించాలని, సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలని, ఆధునిక పరికరాలు సమకూర్చాలని, అంబులెన్స్ల సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేలు మంత్రిని కోరారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా ఏరియాస్పత్రిని 100 పడకల నుంచి 150 పడకలకు అప్గ్రేడ్ చేయాలని, మెటర్నిటీ విభాగం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని 10 పడకలకు విస్తరించాలని, కుభీర్ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాలని, అసంపూర్తిగా ఉన్న ముధోల్ ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర పోస్టులను భర్తీ చేయాలని, కుభీర్, బాసర మండలాలకు ఒక్కొక్కటి, భైంసాకు అదనంగా మరో అంబులెన్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సేవలు మరింత విస్తరించాలని.. -
బోనమెత్తిన నిర్మల్
ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా నిర్మల్ బోనమెత్తింది. పట్టణంలోని వివిధ కాలనీల మహిళలు ఉదయం నుంచే అమ్మవార్ల ఆలయాలకు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా బయల్దేరారు. బోనాల ఊరేగింపులతో వీధుల్లో పండుగ వాతావరణం కనిపించింది. కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని బోనం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బంగల్పేట్ మహాలక్ష్మి, బుధవార్పేట్ పోచమ్మ, ప్రియదర్శినినగర్ కట్ట పోచమ్మ, ధ్యాగవాడ సారాగమ్మ, మంచిర్యాల రోడ్డు మారెమ్మ, డిగ్రీ కళాశాల అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి సతీమణి కవిత మహాలక్ష్మి అమ్మవారికి, నందిగుండం దుర్గామాతకు బోనం సమర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజు నరేష్, శశాంక్, సూరజ్నాయక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్రెడ్డి తదితరులు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంజులాపూర్లో గంగపుత్ర కులసంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. – నిర్మల్టౌన్/నిర్మల్చైన్గేట్/నిర్మల్ఖిల్లా -
గజ్జలమ్మా.. దీవించు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు శ్రీకాంత్ రామానుజదాస్, నగేశ్ ఆధ్వర్యంలో గజ్జలమ్మకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకిసేవ నిర్వహించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అడెల్లిలో భక్తుల సందడి సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. జిల్లా నలుమూలలతోపాటు పొరుగు జిల్లాలు, పొరుగు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఈవో భూమయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేవారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు -
గోరింటాకు పండుగ
ఖానాపూర్: ఆషాఢ మాసం పురస్కరించుకుని పట్టణంలోని శ్రీవీరాంజనేయ శివసాయి సమాజ్ ఆధ్వర్యంలో జంగల్ హనుమాన్ ఆలయంలో ఆదివారం గోరింటా పండుగ నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి గోరింటాకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రవీందర్రావు సతీమణి ఉమాదేవి, 10వ వార్డు కౌన్సిలర్ బండిపెల్లి సిందూజ ప్ర త్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆ లయ కమిటీ అధ్యక్షుడు కొక్కుల ప్రదీప్, కమి టీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. -
● ఖాకీ కొలువులకు కఠోర సాధన ● తెల్లవారుజామున మైదానాల్లో కసరత్తు.. ● పగలు, రాత్రి పుస్తకాలతో కుస్తీ
నిర్మల్టౌన్: ఖాకీ యూనిఫాం ధరించి ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో నిరుద్యోగ యువత కఠోర శ్రమకు సిద్ధమైంది. కొన్ని నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే ప్రచారంతో జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మైదానాల్లో శరీర దారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్లతోపాటు అగ్నిమాపక, జైలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని యువతలో ఉత్సాహం నెలకొంది. జిల్లా కేంద్రంలోని వివిధ పోలీస్ కోచింగ్ అకాడమీలు, స్టడీ సెంటర్లు అభ్యర్థులతో సందడిగా మారాయి. అకాడమీల్లో సందడి పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లాలోని పోలీస్ శిక్షణ అకాడమీల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో యువత శిక్షణ అకాడమీలకు చేరుకుంటున్నారు. రాత పరీక్షతోపాటు ఫిజికల్ ఈవెంట్లలో ప్ర తిభ చూపేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగమే లక్ష్యంగా పోలీస్ కొలువు సాధించాలన్న పట్టుదలతో అభ్యర్థులు కఠోరంగా శ్రమించడం మొదలుపెట్టారు. వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులను పక్కనపెట్టి ఉద్యోగ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, రైతు కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత ప్రభుత్వ ఉద్యోగంపై ఆశలు పెట్టుకున్నారు. పోలీస్ ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవడంతోపాటు తల్లిదండ్రుల కల నెరవేర్చాలన్న సంకల్పంతో శిక్షణలో నిమగ్నమవుతున్నారు. పోటీ అధికం.. పోలీస్ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండటంతో ఒక్కో మార్కు కూడా కీలకమేనన్న భావన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించడంతోపాటు రాత పరీక్షలో మెరుగైన మార్కులు సాధించేందుకు అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతున్నారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ రోజువారీగా టార్గెట్లు పెట్టుకుని చదువుతున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి చదువుపైనే దృష్టి సారిస్తున్నామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. మైదానాల్లో కసరత్తు.. రాత పరీక్షపై ప్రత్యేక దృష్టి ఫిజికల్ ట్రైనింగ్తోపాటు రాత పరీక్షకు కూడా అభ్యర్థులు సమయం కేటాయిస్తున్నారు. ఉదయం ఫిజికల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గణితం, అరిథ్మెటిక్, రీజనింగ్, తెలంగాణ చరిత్ర, భారత రాజ్యాంగం, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. కోచింగ్ సెంటర్లలో ప్రతిరోజూ మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగుపడేలా అధ్యాపకులు సూచనలు చేస్తున్నారు.జిల్లాలో ఖాళీలు ఇవీ.. జిల్లా స్థాయిలో పోలీస్ సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 105, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 40, ఫైర్ శాఖలో 11 ఖాళీలు భర్తీ చేయనున్నారు. మొత్తం 156 పోస్టులు ఉన్నాయి. బాసర జోన్ పరిధిలో 39 ఎస్సై పోస్టులు ఉన్నాయి. జిల్లా వివరాలు.. పోలీస్ కోచింగ్ సెంటర్లు 10శిక్షణ పొందుతున్న అభ్యర్థులు 2,300పురుషులు 1560మహిళలు 740పోలీస్ ఉద్యోగాలకు ఫిజికల్ ఈవెంట్లు కీలకం కావడంతో అభ్యర్థులు తెల్లవారుజామునే మైదానాలకు చేరుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచే రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్ తదితర ఈవెంట్లలో శిక్షణ పొందుతున్నారు. అనుభవజ్ఞులైన ఫిజికల్ ట్రైనర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు తమ శారీరక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కఠినంగా సాధన చేస్తున్నారు. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి మైదానానికి చేరుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం, శారీరక దారుఢ్యం పెంచుకోవడం వారి దినచర్యగా మారింది. -
గోదావరి పుష్కరాలకు రూ.27 కోట్లు
భైంసా: వచ్చే ఏడాది జూన్లో నిర్వహించే గోదావరి పుష్కరాల కోసం ముధోల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.27 కోట్లు మంజూరు చేసిందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. భైంసాలోని తన నివాసంలో ఆదివారం వివరాలు వెల్లడించారు. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఓని–బాసర రహదారి మరమ్మత్తులకు రూ.2.55 కోట్లు, గన్నోరా–ఓని రోడ్డుకు రూ.2 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్ నుంచి మహంకాళి ఆలయ రహదారికి రూ.1.20 కోట్లు, కిర్గుల్(బి)–బాసర రోడ్డు కనెక్టివిటీకి రూ.2.80 కోట్లు, బాసర రైల్వే స్టేషన్ నుంచి నావేగావ్ రోడ్డుకు రూ.1.35 కోట్లు, మల్కాపూర్ మీదుగా బాసరకు రూ.2.70 కోట్లు, ట్రిపుల్ ఐటీ నుంచి బాలాపూర్ రోడ్డుకు రూ.45 లక్షలు, పెట్రోల్ బంక్ నుంచి శాంకరి స్కూల్ వరకు రూ.45 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో బాసర అబాదీ నాలుగు లేన్ల రహదారిని పుష్కర ఘాట్ వరకు విస్తరించేందుకు రూ.8.50 కోట్లు, బిద్రెల్లి–ధర్మాబాద్ రెండు లేన్ల రహదారి విస్తరణకు రూ.4.65 కోట్లు, బాసర బస్స్టాండ్ రహదారి మరమ్మతులకు రూ.85 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ పనులను త్వరలోనే ప్రారంభించి, పుష్కరాల నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. -
ప్రాజెక్టుల పటిష్టతే కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనం
కడెం: కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుకు రాష్ట్రంలోని ప్రాజెక్టుల పటిష్టతే నిదర్శనమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి కడెం ప్రాజెక్టును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ, 1949లో కట్టిన కడెం ప్రాజెక్టు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్డ్డి హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరలేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రారంభించిన మూడేళ్లకే కూలిపోయాయని విమర్శించారు. నీటి నిర్వహణపై సూచనలు భవిష్యత్ తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల్లో నీటిని ప్రణాళికాబద్ధంగా నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరపై అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్ఆర్ఎల్), ప్రస్తుత ఇన్ఫ్లో, ఔట్ఫ్లో, గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటి పరిమాణం వంటి వివరాలు అందించారు. ఎల్నినో ప్రభావం, భవిష్యత్ నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని శాసీ్త్రయ విధానాన్ని అనుసరించాలని మంత్రులు సూచించారు. ప్రాజెక్టుల నీటిమట్టాలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తుందని తెలిపారు. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటిమట్టం, నిల్వ సామర్థ్యం, సిల్టేషన్ సమస్యలు, నీటి పారుదల నిర్వహణపై వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి వినియోగాన్ని శాసీ్త్రయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సిల్ట్ సమస్యపై ఆగ్రహం ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోయిందని ఇరిగేషన్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 7.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో దాదాపు 50 శాతం వరకు పూడిక పేరుకుపోయినట్లు తెలిపారు. దీంతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎందుకు పనులు చేయడం లేదని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. పనులు చేపట్టకపోతే టెండర్ రద్దు చేయాలని ఆదేశించారు. నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నీటిమట్టం 674–675 మీటర్లకు చేరినప్పుడు ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. పూడికను దశలవారీగా తగ్గించి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక చర్యలు చేపడుతున్నామన్నారు.ఈ సందర్భంగా సదర్మట్ ఆయకట్టు రైతులు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని కలిసి బ్యారేజ్ నుంచి ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
నాలుగు దశాబ్దాల స్నేహం..
ఖానాపూర్: ‘మా ఇద్దరిని విధి కలిపింది.. స్నేహం జీవితానికి దారి చూపింది’ అని తన చిరకాల మిత్రుడు, ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోయం మారుతితో ఉన్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గుర్తు చేసుకున్నారు. స్నేహం అనేది రక్త సంబంధం కాకపోయినా జీవితాంతం నిలిచిపోయే అమూల్యమైన బంధమని తెలిపారు. ఉట్నూరు మండలం కల్లూరుగూడకు చెందిన బొజ్జు పటేల్, గాదిగూడ మండలం పూనగూడకు చెందిన సోయం మారుతి మధ్య స్నేహబంధం విద్యార్థి దశలోనే ప్రారంభమైంది. మాన్కాపూర్, గాదిగూడ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదో, పదో తరగతులు చదివిన రోజుల్లో ఏర్పడిన పరిచయం, ఆదిలాబాద్లో ఇంటర్, డిగ్రీ విద్యను అభ్యసించే సమయంలో మరింత బలపడింది. చదువుతోపాటు జీవన పోరాటంలోనూ ఇద్దరూ కలిసి నడిచారు. పేపర్ బాయ్స్గా పనిచేయడం నుంచి దారం మిల్, దాల్ మిల్లో ఉపాధి పొందడం వరకు, సెంట్రల్ పీపుల్స్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే, హౌస్ హోల్డింగ్ సర్వే, రేషన్ కార్డుల సర్వే, ఉపాధి హామీ పథకం పనులు, అటవీ ప్రాంతాల్లో సేవలు, ఆదివాసీ విద్యార్థి ఉద్యమాలు, నల్గొండ జిల్లా చిట్యాల బత్తాయి తోటల్లో ఉపాధి పనులు వంటి అనేక రంగాల్లో కలిసి పనిచేశారు. అనంతరం ఐటీడీఏలో పీస్ కోఆర్డినేటర్గా బొజ్జు పటేల్, మొబిలైజర్గా సోయం మారుతి కలిసి సేవలందించారు. ఈ ప్రయాణం తమ జీవితంలో మరపురాని జ్ఞాపకాలుగా నిలిచిందంటారు బొజ్జు ‘స్నేహాన్ని మించింది మరొకటి లేదు. చిన్న చిన్న అపోహలు, ఇతరులు చెప్పిన మాటలు విని స్నేహితులకు దూరం కావొద్దు. ఏ విషయమైనా స్వయంగాా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. నిజమైన స్నేహం కాలంతో మరింత బలపడుతుంది’ అని తెలిపారు. -
బాలల రక్షణలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర
● పోక్సో, బాలల హక్కులు, సైబర్ భద్రతపై అవగాహన అవసరం ● జిల్లా జడ్జి శ్రీవాణి నిర్మల్టౌన్: బాలల రక్షణ, భద్రతలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయసేవ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాలల రక్షణ చట్టాలు, బాలల స్నేహపూర్వక న్యాయ సేవాపథకం తదితర అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ.. బాలలపై జరిగే అఘాయిత్యాలపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోక్సో చట్టం, బాలల హక్కులు, రక్షణ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ భద్రత, ఇంటర్నెట్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్న్లైన్ మోసాలు, దోపిడీ వంటి ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పిల్లలను శిక్షించే విధానానికి బదులుగా సంస్కరణాత్మక, సహాయక వాతావరణంలో తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. బాలల హక్కులను కాపాడుతూ వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయడంలో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరణ్, డీఈవో భోజన్న, జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్నేహం ప్రాణం తీస్తోంది
నిర్మల్టౌన్: స్నేహం అంటే సంతోషంలో పంచుకునే చిరునవ్వు మాత్రమే కాదు.. కష్టాల్లో కన్నీటిని తుడిచే నమ్మకం. మనసుకు తోడుగా నిలిచే ఆ బంధాన్ని కాపాడుకోవడం నిజమైన స్నేహితుడి బాధ్యత. ఆపదలో అండగా నిలిచి, కన్నీటిలో ఓదార్పునిచ్చే బంధమే స్నేహం. నేడు అదే నమ్మకం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతోంది. నిన్నటి వరకు భుజం భుజం కలిపి తిరిగిన మిత్రులే చిన్నపాటి వివాదాలు, క్షణికావేశాలు, ఆర్థిక లావాదేవీలతో బద్ధ శత్రువులుగా మారుతున్నారు. నమ్మిన స్నేహమే నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలు.. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం రాంపూర్కు చెందిన పంచగూడ సాయితేజ(26)ను అతని స్నేహితుడు రాయరం రాజశేఖర్ ఈనెల 16న హత్య చేశాడు. సాయితేజను వెంట తీసుకెళ్లిన రాజశేఖర్ మార్గమధ్యలో మద్యం సేవించారు. మార్గం మధ్యలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయితేజకు గాయాలయ్యాయి. తర్వాత చికిత్స కోసం నిజాబాబాద్కు తీసుకెళ్తున్న క్రమంలో ప్రమాదం గురించి పోలీసులకు చెప్తానని సాయితేజ అనడంతో భయపడిన రాజశేఖర్ అతనిని హత్య చేసి మృతదేహాన్ని వదిలి పరారయ్యాడు. జూన్ 28న బైంసాకు చెందిన షేక్ సోహెబ్(19)ను అతని స్నేహితులైన అనగందుల సాగర్, గుండెన విజయ్ కలిసి హత్య చేశారు. సోహెబ్ గతంలో సాగర్ వద్ద రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు, చేతి గడియారం విషయంలో విభేదాలు తలెత్తడంతో వారు సోహెబ్పై దాడి చేసి హత్య చేశారు. నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేశారు. ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు కలిసి మరో స్నేహితుడిని హతమార్చడం కలకలం రేపింది. -
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
ఖానాపూర్: జిల్లా విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్నాయక్ కోరారు. ఖానాపూర్ పట్టణంలోని మండల విద్యావనరుల కేంద్రంలో శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశంలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయుల సర్దుబాటును వెంటనే చేయాలన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల పర్యవేక్షణ కమిటీలు తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయని, వెంటనే చేయాలని సూచించారు. అక్రమంగా సెక్రటేరియట్ బదిలీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తిరిగి సొంత పాఠశాలలకు పంపించాలన్నారు. పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, మండల అధ్యక్షుడు బేర చిన్నయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బాలకార్మికులకు విముక్తి
లక్ష్మణచాంద: జిల్లాలో బాలల సంరక్షణ కోసం పోలీసు శాఖ, బాలల సంరక్షణ కమిటీ, చైల్డ్లైన్ అధికారులతోపాటు అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడీడు పిల్లలు బడికి దూరంగా ఉండటమే కాకుండా బాల కార్మికులుగా పని చేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి, పనుల నుంచి విముక్తి కల్పించి, సమీప పాఠశాలలో చేర్పించేందుకు ప్రభుత్వం ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట నెల రోజులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 65 మంది గుర్తింపు.. జూలై 1 నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ముగిసింది. కార్యక్రమంలో భాగంగా 65 మందిని గుర్తించినట్లు డీసీపీవో దేవి మురళి తెలిపారు. వీరిలో ఉత్తరప్రదేశ్కు చెందిన బాలలు ఇద్దరు, మహారాష్ట్రకు చెందినవారు ఒకరు, బీహార్కు చెందినవారు ఇద్దరు, రాజస్థాన్కు చెందినవారు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఇద్దరు ఉన్నారు. మిగిలిన 56 మంది జిల్లావాసులని వెల్లడించారు. గుర్తించిన పిల్లల్లో పాఠశాల వయసు ఉన్న 21 మందిని సమీప పాఠశాలలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. 51 కేసులు నమోదు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలతో జూలై 1 నుంచి 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ బృంద సభ్యులు జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, వివిధ రకాల దుకాణాలు, ఇటుక బట్టీలు వంటి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. బాల కార్మికులను పనుల్లో పెట్టుకున్న వారిని గుర్తించి విముక్తి కల్పించారు. చట్టవ్యతిరేకంగా బాల కార్మి కులను నియమించిన 51 మంది యజమానులపై కేసులు నమోదు చే సినట్లు డీసీపీవో మురళి తెలిపారు. ప్రత్యేక కమిటీలు బాలల సంరక్షణ కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. ఇందులో స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఏఎస్సై, కానిస్టేబుళ్లు, కార్మిక, రెవెన్యూ శాఖ అధికారులు స భ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు తప్పిపోయిన పిల్ల లను గుర్తించి 24 గంటల్లోగా చైల్డ్లైన్ 1098కు అప్పగిస్తారు. తగిన ఆధారాలు ఉంటే తల్లిదండ్రులకు అప్పగిస్తారు. సరైన చిరునామా లేని పిల్లలను బాలల వసతి గృహాలకు అప్పగిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఒక బాలల సదనం ఉంది. ఆపరేషన్ ముస్కాన్ సమాచారం... గుర్తించిన బాలలు 65 బాలురు 65 బాలికలు 00 బాల కార్మికులు 15 అడల్ట్ కార్మికులు 49 డ్రాఫౌట్స్ 01 -
సోయగం.. పరవశం
తెలంగాణ కాశ్మీర్గా గుర్తింపు పొందిన నిర్మల్–ఆదిలాబాద్ మార్గంలోని సహ్యాద్రి పర్వతాల్లోని మహబూబ్ ఘాట్ ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తోంది. పర్వతాలను తాకుతున్న మేఘాలు మనసును దోచుకుంటున్నాయి. పచ్చని అడవులు, కొండలు, మబ్బులు ప్రయాణికులను మైమరిపిస్తున్నాయి. హైదరాబాద్–నాగ్పూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్–44) మార్గంలో ఉన్న ఈ ఘాట్ రోడ్డుపై ప్రయాణం ఆద్యంతం సుందరమైన దృశ్యాలను, ఆహ్లాదకరమైన వాతావరణం మదినిస్తుంది. వ్యూ పాయింట్ల నుంచి చూస్తే చుట్టూ పరుచుకున్న ఎత్తైన కొండల మధ్య బాహుబలి జలపాతం నుంచి జాలువారే పాలవంటి జల ప్రవాహంలో ప్రకృతి ప్రేమికులు తడిసి మురిసిపోతున్నారు. మహబూబ్ ఘాట్ వద్ద ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
విజయవంతంగా పూర్తి చేశాం
రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఆదేశాలతో జిల్లాలో జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశాం. ఇందులో భాగంగా జిల్లాలో 65 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించాం. 21 మంది పిల్లలను సమీప పాఠశాలల్లో చేర్పించాం. – వినూత్న, డీడబ్ల్యూవో 51 మంది యజమానులపై కేసు.. కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలతో, డీడబ్ల్యూవో వినూత్న మేడమ్ సూచనల మేరకు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టి ఇటీవలనే పూర్తి చేశాం. ఇందులో భాగంగా మొత్తం 65 బాలలను గుర్తించాం. బాల కార్మికులను పనుల్లో పెట్టుకున్న 51 మంది యజమానులపై కేసులు నమోదు చేశాం. – దేవి మురళీ, డీసీపీవో -
జలపాతాల వద్దకు వెళ్లొద్దు
సారంగపూర్: మండలంలోని మహబూబ్ఘాట్స్పై వాచ్టవర్ వెనుకవైపు ప్రమాదకర జలపాతం వద్దకు ఎవరూ వెళ్లొద్దని జిల్లా అటవీశాఖధికారి సుషాంత్ పుఖ్దేవ్ బోబడే అన్నారు. శనివావరం జలపాతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం పడిన ప్రతీసారి ఈజలపాతం వద్దకు పర్యాటకుల భారీగా వస్తున్నారన్నారు. ఇక్కడికి చేరుకునేందుకు సరైన మార్గం లేదని తెలిపారు. ఈప్రదేశం మొత్తం భారీ వర్షాల కారణంగా అత్యంత ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. వర్షం పడిన సమయంలో ప్రవాహం పెరిగి ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయన వెంట డీఆర్ఏ నజీర్ఖాన్, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. -
సాగులో సమతుల్యత పాటించాలి
నిర్మల్చైన్గేట్: సాగులో సమతుల్యత పాటించాలని, పంట మార్పిడి విధానంపై వ్యవసాయ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రాజెక్టుల పరిస్థితి, పంటల సాగు, ఎల్నినో ప్రభావం తదితర అంశాలపై నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇన్ఫ్లో, ఔట్ఫ్లో వివరాలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి.. ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులకు పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరికి బదులుగా ఆయిల్పామ్, కంది, నువ్వులు, పత్తి తదితర ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు. కొత్త పంటల సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నిండుగా ప్రాజెక్టులు, చెరువులు.. నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ మూడు రోజులు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులు వేగంగా చేపడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా తాగునీటి సమస్య ఉండదన్నారు. రైతులు పంట మార్పిడి విధానాలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తరిస్తోందని తెలిపారు. తగ్గిన లోటువర్షపాతం... ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, గతంలో జిల్లాలో 38 శాతం లోటు వర్షపాతం ఉండగా, ప్రస్తుతం అది 6 శాతానికి తగ్గిందని తెలిపారు. జిల్లాలోని 17 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసిందని తెలిపారు. ఇంద్రవెల్లి, భోరజ్, సిరికొండ, బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాలు ప్రస్తుతం సాధారణ పరిస్థితికి చేరుకున్నాయన్నారు. ఈ ఏడాది జిల్లాలో 5,93,670 ఎకరాల్లో పంటలు సాగయ్యాయని తెలిపారు. 4,37,698 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం 56,751 ఎకరాలు పెరిగిందన్నారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు వ్యవసాయంతోపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయన్నారు. సమావేశంలో నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల, నిర్మల్, ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైతులు అప్రమత్తంగా ఉండాలి
తానూరు: రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సెక్షన్ అధికారి రవికుమార్ సూచించారు. తానూరుకు చెందిన రైతు పోతన్న శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ధర్మాబాద్ రోడ్డు సమీపంలో ఉన్న తన చేనులోకి వెళ్తుండగా చిరుతపులి పరుగులు తీస్తూ కనిపించింది. వెంటనే పోతన్న గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో సెక్షన్ అధికారి రవికుమార్, బీట్ అధికారి కృష్ణ, సిబ్బంది తానూరుకు చేరుకున్నారు. చేనులో పాదముద్రలను పరిశీలించి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచారంతో తానూరు, జౌలా(బి), తొండాల గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
కడెం/ఖానాపూర్: భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కడెం ప్రాజెక్టును, ఖానాపూర్ పట్టణంలోని వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారిని శుక్రవారం సందర్శించారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం, ప్రస్తుత నీటి నిల్వ, ఇన్ఫ్లో, ఔట్ఫ్లో వివరాలు ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల గ్రామాల ప్రజలకు నీటి విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందించి అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాజెక్టు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ నీటి మట్టం, ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లు, నీటి ప్రవాహ ప్రాంతాలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఖానాపూర్లో వసతి గృహ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిత్యావసర వస్తువులు, అవసరమైన సామగ్రిని నిరంతరం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర వెంట సీఈ జగదీశ్, ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్కుమార్, డీఈ వీరన్న, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్ ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, ఎంపీడీవో రాధ రాథోడ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
తల్లిపాలే అమృతం
● పోతపాలతో అనారోగ్య సమస్యలు జిల్లాలో పాలిచ్చే తల్లులు 3,198 గర్భిణుల 5,355నిర్మల్చైన్గేట్: మాతృత్వం మహిళ కు ఓ వరం. బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మ లాంటింది. అయితే ఉరుకుల పరుగుల జీవితం, అందం తగ్గిపోతుందన్న అపోహతో నేడు బిడ్డలకు పాలు ఇవ్వడానికి తల్లులు వెనుకాడుతున్నారు. కొందరైతే సరోగసి విధానంలో పిల్లల్ని కంటున్నారు. కానీ తల్లిపాలు బిడ్డకు అమృతమని వైద్యులు సూచిస్తున్నారు. ఏటా ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. బిడ్డ పుట్టిన గంటలోపు పాలు అందేలా తల్లికి సహాయం చేయడమే వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. తల్లిపాలు నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. వీటిలోని వివిధ రకాల పోషకాలు పెరుగుదలకు తోడ్పడతాయి. ముర్రుపాలతో ఆరోగ్యం.. పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు ఇస్తే సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే వీటిని అమృతంతో పోలుస్తారు. లేత పసుపుపచ్చ రంగు పాలు మెదడు చురుకుగా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి సహాయపడతాయి. గుండె, చర్మ సంబంధిత సమస్యలు, ఉబ్బసం, ఆస్తమా, రక్తపోటు, మధుమేహం వంటివి రాకుండా కాపాడతాయి. మొదటి ఆరు నెలలు రోజుకు 12 సార్లు పాలు తాగించాలి. ఇలా పెరిగిన పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశం తక్కువ. శనివారం నుంచి 8వ తేదీ వరకు జిల్లా కేంద్రంతోపాటు మండలాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తల్లిపాలతో ప్రయోజనాలు... తల్లిపాలతో శిశువుకు ప్రో టీన్లు అందుతాయి. దీనివల్ల మెదడు వికసిస్తుంది. సమతుల్య ఆహారం లభిస్తుంది. అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. లాక్టోజ్ ఉండటంతో కాల్షియం నిల్వలు పెరిగి రక్తహీనత నుంచి రక్షణ కలుగుతుంది. తొలి దశలో అంటువ్యాధుల నుంచి కాపాడటమే కాకుండా మానసిక వికాసానికి తోడ్పడతాయి. న్యుమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి, అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు, చెవి సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. ఆస్తమా, అలెర్జీ, మధుమేహం వంటివి దరిచేరవు. పోషకాహార లోపం తగ్గి శిశు మరణాలు కూడా తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వారోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యత వివరిస్తారు. పిల్లల ఎదుగుదలపై అవగాహన కల్పిస్తారు. ఏడు నుంచి తొమ్మిది నెలల గర్భిణుల ఇళ్లకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. బాలింతలు, గర్భిణులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివరాలు నమోదు చేస్తారు. ఆరు నెలల లోపు చిన్నారులకు తల్లిపాలు అందుతున్నాయా అని తని ఖీ చేస్తారు. అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఏడు నుంచి 24 నెలల పిల్లలకు తల్లిపాలతోపాటు అదనపు ఆహారం ఇవ్వాలని సూచిస్తారు. సమతుల్య ఆహార తయారీపై అవగాహన కల్పిస్తారు. -
కిట్టు.. బోధన మెరుగయ్యేట్టు
లక్ష్మణచాంద: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన, గణితం, సైన్స్ పాఠ్యాంశాలపై మరింత పట్టు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకం కింద గణితం, సైన్స్ పరికరాల కొనుగోలుకు పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు గణితం కిట్లకు రూ.5 వేలు, సైన్స్ కిట్లకు రూ.5 వేల చొప్పున ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు విద్యాశాఖ మంజూరు చేసింది. పరికరాల కొనుగోలుకు కమిటీ ప్రతీ పాఠశాలలో గణిత, సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, గణితం, సైన్స్ ఉపాధ్యాయులు, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు ఉంటారు. పాఠశాలకు మంజూరైన నిధులతో కమిటీ అభిప్రాయం మేరకు గణితానికి రూ.5 వేలు, సైన్స్కు రూ.5 వేలు వెచ్చించి అవసరమైన కిట్లను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ప్రయోజనం గణిత, సైన్స్ పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ప్రయోగాత్మక బోధన జరిగి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. విద్యార్థులలో సృజనాత్మక, శాసీ్త్రయ దృక్పథాలు పెంచడంలో కిట్లు కీలకంగా మారతాయి. ఈ నిధులతో పీఎంశ్రీ పాఠశాలల్లో గణిత, సైన్స్ క్లబ్లను మరింత బలోపేతం చేసి, ప్రాజెక్టు ఆధారిత విద్యను అమలు చేస్తారు. ప్రత్యక్ష బోధన సైన్స్, గణితం పాఠ్యాంశాలను ప్రత్యక్షంగా తరగతి గదిలో విద్యార్థులకు చూపిస్తూ ఉపాధ్యాయుడు బోధన చేయడంతో ఆ పాఠ్యాంశాలను విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అయితే పాఠశాలలకు వచ్చిన డిజిటల్ ప్యానెల్ బోర్డులతో ప్రతీ పాఠ్యాంశాన్ని వీడియోలు, చిత్రాలు, పటాలు చూపిస్తూ బోధించడానికే ఉపాధ్యాయులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యక్షంగా బోధన పరికరాలు, ప్రయోగ పరికరాలు ఉపయోగిస్తూ బోధన చేయడంతో విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుంది. గణిత, సైన్స్ కిట్లను వినియోగిస్తూ ప్రయోగాత్మక, ప్రత్యక్ష బోధనను ఉపాధ్యాయులు చేస్తే ప్రభుత్వం కిట్లను అందించిన లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు, మంజూరైన నిధులు.. జిల్లా పాఠశాలలు మంజూరైన నిధులు మంచిర్యాల 22 రూ.2.20 లక్షలు ఆదిలాబాద్ 21 రూ.2.10 లక్షలు నిర్మల్ 19 రూ.1.90 లక్షలు కుమురంభీం 16 రూ.1.60 లక్షలు -
నిర్మల్
‘కడెం’కు తగ్గిన వరద కడెం: కడెం ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టుకు 43,788 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో ఆరు గేట్లు ఎత్తి 59,741 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మధ్యాహ్నం వరకు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టడంతో వరద గేట్లను మూసివేశారు. ప్రాజెక్ట్కు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.425 అడుగులు ఉంది. సాయంత్రానికి ఇన్ఫ్లో 7,805 క్యూసెక్కులకు పడిపోయిందని అధికారులు తెలిపారు. నేడు కడెంకు మంత్రుల రాకకడెం: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శనివారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ భవేశ్మిశ్రా, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్ తెలిపా రు. మంత్రులు మధ్యాహ్నం 12:45 గంటలకు హెలికాప్టర్లో కలెక్టరేట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కడెం ప్రాజెక్టుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:35 గంటలకు కడెం ప్రాజెక్టును సందర్శించి, ప్రా జెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వలు, వరద ని ర్వహణ, భద్రతా చర్యలు, అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. భైంసా: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజ న్ ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేశాయి. జి ల్లాలో వరి, పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు వే సిన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేసిన రైతుల్లో నీటి కొరతతో పంటలు ఎండిపోతాయేమోనన్న ఆ ందోళన నెలకొంది. ఈ తరుణంలో అల్పపీడనం ప్ర భావంతో ఎగువ మహారాష్ట్రతోపాటు జిల్లాలో మూ డు రోజులు విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు ప్రాణం వచ్చింది. మరోవైపు వర్షాలకు గోదావరికి వరద రైతుల్లో కొత్త ఆశలు నింపింది. వరి సాగు ప్రధానం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరిసాగు ప్రధానంగా గోదావరి ఆధారిత ఎత్తిపోతల పథకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో సాగు పనులు నెమ్మదించినా, ప్రస్తుతం గోదావరిలో ప్రవాహం పెరగడం వ్యవసాయానికి కొత్త ఊపును తీసుకొచ్చింది. కాలువల్లో నీరు పారుతుండటంతో రైతులు ఎరువుల వినియోగం, కలుపు నివారణ వంటి పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ నెలలోనూ కురిస్తే ఆగస్టు నెలలో కూడా వర్షాలు కురిసి గోదావరిలో ప్రవాహం కొనసాగితే జిల్లాలో ఖరీఫ్ పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యవసాయాధికారులు, రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన ఎత్తిపోతల పథకాలు వేలాది ఎకరాలకు ప్రాణాధారంగా మారాయి. ఎండిపోతాయనుకున్న పంటలు ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడతాయని రైతులు ఉషారుగా పొలాల బాట పడుతున్నారు. పెరిగిన నీటి మట్టం.. గోదావరి నీటి మట్టం పెరగడంతో జిల్లాలోని ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల మోటార్లను ఆన్ చేశారు. దీంతో నీరు చెరువులకు చేరుతోంది. బాసర, కన్కపూర్, కౌట, పంచగుడి, ఆష్టా, రాజూర, గడ్చాంద్, సిద్ధులకుంట తదితర ప్రాంతాల్లో సాగునీటి సరఫరా ప్రారంభమైంది. దీంతో ఇప్పటికే నాట్లు వేసిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని రోజులు గోదావరిలో ప్రవాహం కొనసాగితే పంటలు పూర్తిగా గట్టెక్కుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో ఎత్తిపోతల పథకాలు, ఆయకట్టు వివరాలు(ఎకరాల్లో..)బాసర 2,500 ఆష్టా 1,500 పంచగుడి 1,500 కన్కపూర్ 3,500 రాజూర 1,000 గడ్చాంద 1,500 మన్మద్ 900 పోట్పల్లి 500 కౌట 2,000 పార్పల్లి 365 సిద్ధులకుంట 1,000 అలూరు 450 బిరవెల్లి 370 డోంగుర్గాం 530 -
పుష్కరాల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
నిర్మల్టౌన్: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరా ల సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ కార్యాలయం నుంచి ఏడీజీపీ(లాఅండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ జిల్లాల పోలీస్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ జానకీషర్మిల పాల్గొన్నారు. పుష్కర ఘాట్ల వద్ద వాచ్ టవర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, సీసీటీవీ నిఘా వ్యవస్థలు, డ్రోన్ సర్వైలెన్స్, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర స్పందన బృందాలు తదితర భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఏడీజీపీ ఆదేశించారు. నిర్మల్ జిల్లా బాసర, సోన్, సావర్గాం ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎస్పీ శ్రీనివాస్, ఏవో యూనస్ అలీ, సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్చైన్గేట్: భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదలపై రాష్ట్ర డీజీపీ సీవీ.ఆనంద్, ఇతర ఉ న్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో గురువారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా కు రిసిన వర్షాలు, డ్యాంలలో చేరిన నీరు, దెబ్బతిన్న, రోడ్లు వంతెనలు, చేపట్టిన సహాయక చర్యల వివరా లు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, వరదలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులంతా వారివారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు 24 గంటలు పని చేయాలన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నా రు. ప్రజలకు ఇబ్బందులు కలిగినట్లు సమాచారం అందితే తక్షణమే స్పందించాలని తెలిపారు. గ్రామీ ణ ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు టామ్ టామ్ వేయించాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని, వైద్యారో గ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నా రు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నదుల పరిసర ప్రాంతాల్లోకి పశువుల కాపరులు, మత్స్యకారులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. డీజీపీ ఆనంద్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తుందన్నారు. పోలీసు శాఖ తరఫున అవసరమైన సహకారం ఉంటుందని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, సీపీవో గంగారెడ్డి, డీఎంహెచ్వో రాజేందర్, డీపీవో శ్రీనివాస్, డీఏవో అంజిప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వ్యాయామ విద్యతో సంపూర్ణ వికాసం
నిర్మల్ రూరల్: విద్యార్థుల సంపూర్ణ వికాసం వ్యాయమ విద్యతోనే సాధ్యమని వృత్యంతర వ్యాయామ విద్య శిక్షణ తరగతుల కోర్సు డైరెక్టర్ వి.సాయికృష్ణ అన్నారు. మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని నారాయణ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 80 మంది వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు శిక్షణను అందించామన్నారు. మారుతున్న నిబంధనలు, వ్యా యామ విద్య అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, క్రీడారంగంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులను అత్యున్నత స్థాయికి చేర్చడానికి అవసరమైన ప్రణా ళికలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. డీఈ వో భోజన్న వ్యాయామ విద్యపై పలు సూచనలు చేశారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు ఎం.శ్రీనివాస్, వి.భూమన్న, అన్నపూర్ణ, జమున, ఉపాధ్యాయుల కు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ వ్యామ ఉపాధ్యాయులు భోజన్న, రమణారావు, అంబాజీ, డేవిడ్, సత్తన్న, వెంకటరమణ, బుచ్చి రామారావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో అధిక వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ సూచించారు. గురువారం ఆయన జూమ్ మీటింగ్ ద్వారా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అధిక వర్షాలతో ప్రజలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులో ఉండాలన్నారు. రోడ్డు మార్గం తెగిపోయే గ్రామాల్లో గర్భిణులను బర్త్ వెయిటింగ్ రూమ్స్కు తరలించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి రాపిడ్ రెస్పాన్స్ బృందాన్ని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిద్ధంగా ఉంచాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధికారులు రాకేశ్, సౌమ్య, పవన్, రమేశ్, ఆకాశ్ వైద్యాధికారులు పాల్గొన్నారు. -
● పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం ● ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వ నిర్ణయం
లక్ష్మణచాంద: గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు త్వరలోనే తీరనున్నాయి. గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. పంచాయతీల ఆర్థిక కష్టాలు తీర్చేలా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70(3)ను సవరించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనితో నిధులను నేరుగా ఖర్చు చేసే అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకు ఆంక్షలు..గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులను నేరుగా ఖర్చు చేసుకోవడానికి ఇప్పటి వరకు అనేక నిబంధనలు అడ్డుగా ఉండేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం పంచాయతీల సొంత ఆదాయ వనరులను నేరుగా ఖర్చు చేసుకునే అవకాశం కల్పించనుంది. జిల్లాలో ఇలా..జిల్లా వ్యాప్తంగా 400 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. ఏటా పన్నుల రూపంలో జిల్లాకు సుమారు రూ.10 కోట్లు వసూలవుతున్నాయి. వీటితోపాటు నూతన భవనాల అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, సంతలు, వారసంతలు, తైబజార్ వంటి ఇతర వనరుల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతోంది. ఈ మొత్తాన్ని పంచాయతీ పాలకవర్గం ట్రెజరీలో జమ చేస్తోంది. దీంతో వీధి దీపాల మరమ్మతులు, తాగునీటి పైప్లైన్ల లీకేజీలు, స్టేషనరీ కొనుగోలు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ వంటి ఖర్చులను ముందుగా పాలకవర్గాలే భరించాల్సి వస్తోంది. ఈ మొత్తం తర్వాత చెక్కు రూపంలో ట్రెజరీ కార్యాలయం నుంచి పంచాయతీ ఖాతాలో జమ అవుతోంది. బిల్లులు జమ కావడానికి ఒక్కోసారి నెలలు నుంచి సంవత్సరాల సమయం పడుతోంది. దీంతో చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల అత్యవసర పనుల కోసం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త విధానం ఇలా..గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులను నేరుగా ఖర్చు చేసుకునే కొత్త విధానం త్వరలోనే అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. రానున్న శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఈ నూతన విధానం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే పంచాయతీల ఆర్థిక కష్టాలు తీరనున్నాయి. గ్రామాల్లో వసూలయ్యే ఆదాయాన్ని స్థానిక బ్యాంకులో తెరిచిన ఖాతాలో జమ చేస్తారు. ప్రజల అవసరాల కోసం ఆ డబ్బుల నుంచి అవసరం మేరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పంచాయతీల నిధులను సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చు. ఈ నూతన విధానాన్ని త్వరగా అమలులోకి తేవాలని జిల్లా సర్పంచులు కోరుతున్నారు. నూతన విధానం అమలులోకి వస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. -
వాన జోరు.. వరద హోరు
నిర్మల్: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షం గురువారం వరదనూ తీసుకొచ్చింది. జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లోకి వరద పొటెత్తింది. లక్షన్నర క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో ఈ సీజన్లో తొలిసారి కడెం ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి దిగువకు అదేస్థాయిలో నీటిని వదులుతున్నారు. సదర్మట్ బ్యారేజీకి 20,838 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో ఐదుగేట్లను ఎత్తి అంతేమొత్తంలో దిగువకు నీటిని వదులుతున్నారు. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకీ వరద కొనసాగుతోంది. పలు మండలాల్లో వాగులు ఉప్పొంగుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ ప్రాజెక్టులు, వాగులు పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సూచించారు. పాఠశాలలకు గురువారం అత్యవసర సెలవు ప్రకటించారు. సగటున 54.3 మిల్లీ మీటర్ల వర్షం..జిల్లావ్యాప్తంగా గురువారం కూడా వర్షాలు విస్తారంగా కురిశాయి. జిల్లా సగటున 54.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా కురవాల్సిన 10.4 మి.మీ.తో పోలిస్తే 422 శాతం అధికంగా వర్షం కురిసింది. అత్యధికంగా కడెం మండలంలో 122 మి.మీలు, పెంబి మండలంలో 105 మి.మీ. వర్షం నమోదైంది. ఖానాపూర్లో 93.4, దస్తూరాబాద్లో 88, మామడలో 63.4, నిర్మల్ పట్టణంలో 59.8, లక్ష్మణచందలో 52.6 మి.మీల, వర్షపాతం నమోదైంది. మరోవైపు సారంగాపూర్లో 47.6, సోన్లో 46.9, ముధోల్లో 44.6, దిలావర్పూర్లో 41.2, భైంసాలో 38.7, నర్సాపూర్(జి)లో 36.3, బాసరలో 33.1, కుంటాలలో 31.2, కుభీర్లో 27.5, తానూరులో 26, లోకేశ్వరం25.7 మి.మీల వర్షం కురిసింది. ఆ మండలాల్లో ఇంకా తక్కువే..ఈనెల 30 నాటికి జిల్లా సగటు వర్షపాతం 450.5 మి.మీ. నమోదుకాగా, సాధారణ వర్షపాతం 469.7 మి.మీతో పోలిస్తే 4 శాతం లోటు ఉంది. దీంతో జిల్లా మొత్తం సాధారణ వర్షపాతం కేటగిరీలో కొనసాగుతోంది. పెంబి, కడెం మండలాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ముధోల్, భైంసా, కుంటాల, నర్సాపూర్(జి), లోకేశ్వరం, దిలావర్పూర్, సారంగాపూర్, నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచంద, మామడ, ఖానాపూర్, దస్తూరాబాద్ మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. కుభీర్, తానూరు, బాసర మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. -
‘కడెం’ను సందర్శించిన ఎస్పీ, ఎమ్మెల్యే
కడెం: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కడెం ప్రాజెక్టును ఎస్పీ జానకీ షర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ గురువారం సందర్శించారు. ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. కడెం నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లొద్దని సమీప గ్రామాల ప్రజలకు సూచించారు. వారివెంట డీఆర్డీవో విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ భూషణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఉన్నారు. రెంకోన వాగును పరిశీలించిన ఎస్పీఖానాపూర్: భారీ వర్షాల నేపథ్యంలో ఖానాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని రెంకోన వాగును ఎస్పీ జానకీషర్మిల గురువారం పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు, వాహనదారులు వాగు వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ఖానాపూర్ పోలీసు స్టేషన్ను సందర్శించిన ఎస్పీ, భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని వేగంగా స్పందించాలని ఆదేశించారు. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీవెంట నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై రాహుల్ ఉన్నారు. -
ప్రతీ ఓటరు సీరియస్గా తీసుకోవాలి
కుంటాల: ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతీ ఓటరు సీ రియస్గా తీసుకోవాలని సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సూచించారు. బుధవారం కుంటాల తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్నవారు సకాలంలో బీఎల్వోలకు అందించాలని, లేని పక్షంలో ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ లక్ష్యాన్ని పూర్తిచేసి జిల్లాలో ఫస్ట్, స్టేట్లో సెకండ్ స్థానంలో నిలి చేందుకు కృషి చేసిన తహసీల్దార్ కమల్ సింగ్ ను అభినందించారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో ఉత్తమ పనితీరు కనబర్చిన ఆర్ఐ రాజేశ్వర్, అందకూర్ బీఎల్వో విమలను సన్మానించారు. సమావేశంలో డీటీ కార్తీక్రెడ్డి, ఆర్ఐలు రాజేశ్వర్, అడెల్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్తసాయి ఆలయంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమారెడ్డి, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు గురు పౌర్ణమి గొప్పతనం, గురువు ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవ సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవి కిషన్, ఆలయ ఈవో భూమయ్య, సాయి దీక్ష సేవా సమితి సభ్యులు మూర్తి మాస్టర్, ఆమెడ శ్రీధర్, రేణుకా దాస్, ఉప్పుల నందు, నారాయణరెడ్డి, లింగారెడ్డి, జిందన్ గోవర్ధన్, కోల శంకర్, శ్రీనివాస్, సతీష్, రేఖ, మాధవి, భక్తులు పాల్గొన్నారు. -
వన మహోత్సవం లక్ష్యం చేరుకోవాలి
నిర్మల్చైన్గేట్: వన మహోత్సవం లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వన మహోత్సవం, జలసిరి ఫామ్ పాండ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలసిరి ఫామ్పాండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిజమైన అర్హుల పేర్లు ఎల్3 జాబితాలో ఉంటే అధికారులు ధృవీకరించి వారికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అప్రమత్తంగా ఉండాలి సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందు వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల సమీపంలోకి పశు కాపరులు, మత్స్యకారులు, ఇతరులెవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వర్షపాతం వివరాలు ఖచ్చితత్వంతో నమోదు చేయాలి నిర్మల్చైన్గేట్: జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలను ఎప్పటికప్పుడు ఖచ్చితత్వంతో నమోదు చేసి సంబంధిత శాఖలకు సకాలంలో అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూగర్భ జలాల కొలతల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ నమోదు శాసీ్త్రయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీవో గంగారెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, ఆర్అండ్బి ఈఈ సుభాష్, హైడ్రో జియాలజిస్ట్ వంశీకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రాణాలు కొట్టుకుపోవాల్సిందేనా?
ఖానాపూర్: ‘గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం.. మౌలిక వసతులు కల్పిస్తున్నాం..’ అని ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడంలేదు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికీ వాగులు దాటితేనే తమ గ్రామాలకు చేరుకునే పరిస్థితి. ఏటా వర్షాకాలం వారికి జీవన పోరాటమే. ఖానాపూర్, పెంబి మండలాల్లోని యాపల్గూడ, పస్పుల, తులసీపేట్, దయ్యాలమద్ది, అర్చన్తండా, గుమ్మెన, ఎంగ్లాపూర్, కుసుంపూర్, చామన్పల్లి గూడెం, పంగిడిగూడెం వంటి గ్రామాలకు వెళ్లాలంటే కడెం, దొత్తి, బల్లి వాగులు, ఒర్రెలను దాటాల్సిందే. వర్షం పడితే ఈ వాగులు ఉప్పొంగి గ్రామాలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి వాగులు దాటక తప్పని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోనే ఐటీడీఏ కార్యాలయం ఉన్నప్పటికీ దశాబ్దాలుగా వంతెనలు, రహదారులు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో ఆయా గిరిజన గ్రామాల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 2018లో ఎర్వచింతల్ వద్ద వాగు దాటుతుండగా కుసుంపూర్ గ్రామానికి చెందిన ఓ గిరిజన యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. తాజాగా బుధవారం చామన్పల్లిగూడకు చెందిన పారుబాయి ఎర్వచింతల్కు వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా వాగులో గల్లంతై మృతి చెందింది. ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోతే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరో ప్రాణం బలికాకముందే గిరిజన గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
ఏకధాటిగా వాన..
ముగిసిన వ్యాస పౌర్ణమి.. బాసర ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన వ్యాస పౌర్ణమి (గురుపూజ) ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి.ప్రాజెక్టుల్లోకి వరద జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.నిర్మల్: జిల్లాలో రెండు మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండురోజులూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి ఏకధాటిగా కురిసిన వానకు జిల్లాలోని కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులు, సదర్మట్ బ్యారేజీలోకి క్రమంగా వరద చేరుతోంది. వాగులు, చెరువులకు జలకళ వస్తోంది. భారీ వర్షాలు కురిసిన చోట వాగులు పొంగుతున్నాయి. పలుచోట్ల వరదనీరు రోడ్లను దెబ్బతీసింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. మరోవైపు ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ పరిధిలో ఉప్పొంగిన బల్లివాగు పార్వతీబాయి(48)ని బలిగొంది. చామన్పల్లి గూడేన్ని విషాదంలో ముంచింది. నిర్మల్, కడెంలో భారీగా వాన.. జిల్లాలో ఈ సీజన్లో మంగళవారం ఒక్కరోజే భారీ వర్షం కురిసింది. సగటున 82.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో నిర్మల్అర్బన్ (132.3 మి.మీ.), కడెం(131.2 మి.మీ.), సోన్ (130.3 మి.మీ.), మామడ (115.8 మి.మీ.), నిర్మల్ రూరల్ (110.6 మి.మీ.), ఖానాపూర్ (108.4 మి.మీ.) మండలాల్లో భారీ వర్షం కురిసింది. రెండురోజులుగా ముసురు పెట్టినట్లున్న వాన ఒక్కసారిగా జోరందుకుంది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు, కడెంలోని రహదారులు జలమయం అయ్యాయి. పలుచోట్ల గుడిసెలు కూలిపోయి పశువులకు గాయాలయ్యాయి. లక్ష్మణచాంద మండలంలోని ధర్మారం–సోన్ రహదారి వరదకు కొట్టుకుపోయింది. ఇంకా సాధారణమే.. జూన్ 1 నుంచి జూలై 29 వరకు నమోదైన సమీకృత వర్షపాతం సాధారణ స్థాయిలోనే ఉంది. పలు మండలాల్లో ఇంకా లోటు కొనసాగుతోంది. జిల్లా సాధారణ వర్షపాతం 459.3 మిల్లీమీటర్లు కాగా, ఈనెల 29 వరకు వాస్తవంగా 396.2 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణంతో పోలిస్తే 13.7 శాతం లోటు నమోదైంది. జిల్లాలో మొత్తం ఐదు మండలాలు లోటు వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి. కుభీర్ (–37శాతం), తానూర్ (–35శాతం), బాసర (–31శాతం), ముధోల్ (–23శాతం), సారంగాపూర్(–21శాతం)మండలాల్లో సాధారణంతో పోలిస్తే గణనీయమైన వర్షాభావం ఉంది. భైంసా, కుంటాల, నర్సాపూర్(జి), లోకేశ్వరం, దిలావర్పూర్, నిర్మల్అర్బన్, నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, పెంబి, ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పెంబి (+10శాతం), కడెం(+7శాతం), నిర్మల్అర్బన్(+6శాతం) మండలాలు సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం ఉంది. వర్షంతో రైతన్న హర్షం.. ఈ సీజన్లో ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుందని పంటలకు ఇబ్బందికరంగా ఉంటుందని అధికారులు చెప్పడంతో రైతులు ఢీలాపడ్డారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే నాలుగైదు రోజులు కురిస్తే.. వానాకాలం పంట వెళ్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉండవని, పంటకుంటలు తవ్వించుకుని నీటిని కాపాడుకోవాలని, ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాలని సూచిస్తున్నారు.ఖానాపూర్ వద్ద సదర్మట్ పాత ఆనకట్టపై నుంచి గోదావరి పరవళ్లుజలాశయాలకు జలకళ.. నేడు, రేపు భారీ వర్షసూచన జిల్లాలో గురు, శుక్రవారాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లావాసులు, ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు
కై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈవోగా చండా విశ్వేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పని చేసిన శ్రీధర్రెడ్డి గతేడాది సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలువురు ఇన్చార్జీలతో పాలన సా గింది. రెగ్యులర్ నియామకం కోసం ఇటీవల ప్రక్రి య నిర్వహించగా ఆరుగురు అధికారులు హాజరయ్యారు. వారిలో మెదక్ జిల్లా సహకార బ్యాంక్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న విశ్వేశ్వర్ను నియమిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్చార్జి సీఈవో రవి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని మహేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, నాయకులు సాదం అరవింద్, జంగం వీరేష్ , జమాల్, జుట్టు దినేష్, ఇర్ల విజయ్, శ్రీకాంత్రెడ్డి, కందుల హరీష్, భరత్, కౌన్సిలర్లు రాజు, నరేష్, శశాంక్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించాలి
భైంసారూరల్: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. బుధవారం భైంసాలోని తన నివాసంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, తదితర మౌలిక వసతులు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి లత, వివిధ వసతి గృహాల వార్డెన్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ -
ఫిట్నెస్లేని బస్సులు నడిపితే చర్యలు
ఖానాపూర్: ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) రాణాశ్రీ హెచ్చరించారు. బుధవారం ఖానాపూర్లో రవాణాశాఖ అధికారులు పాఠశాలల బస్సుల భద్రతా ప్రమాణాలు, అవసరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సును గుర్తించి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించరాదన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సుల ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. -
కడెం ప్రాజెక్ట్ను సందర్శించిన ఎస్ఈ
కడెం: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం విద్యుత్ శాఖ ఎస్ఈ సుభాష్ కడెం ప్రాజెక్ట్ను సందర్శించారు. విద్యుత్ సరఫరా, పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్ లైన్లను పరిశీ లించారు. వరదల దృష్ట్యా ప్రాజెక్ట్కు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీ సుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించా రు. ఆయన వెంట ఎస్సై సాయికిరణ్, ఏఈఈ రాంసింగ్, ప్రాజెక్ట్ అధికారులు ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలికడెం: ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందువల్ల కడెం, దస్తురాబాద్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఖాజా మొయినొద్దీన్, ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ మన్మోహన్ యాదవ్ పిలుపునిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం కడెం ప్రాజెక్ట్, పరిసరాల ప్రాంతాల్లో పర్యటించారు. వారి వెంట ఎస్సై సాయికిరణ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నవీన్, లింగమూర్తి, సందీప్, తదితరులు ఉన్నారు. -
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈదురుగాలులు వీస్తాయి. జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కొట్టుకుపోయిన ధర్మారం–సోన్ రోడ్డు లక్ష్మణచాంద: మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ధర్మారం నుండి సోన్కు వెళ్లే రోడ్డుమార్గంలో పీచర సమీపంలో లోలెవల్ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ధర్మారం, పీచర గ్రామాల మీదుగా సోన్ మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఏటా భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోవడం, అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేయడం జరుగుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత చర్యలు చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు. నిలిచిన రాకపోకలు ఖానాపూర్: పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో రెంకొని వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చందు నాయక్ తండా శివారులో పల్కేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు గ్రామాల్లో వరద నీరు పంట పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
స్వచ్ఛంద సేవకు సభ్యత్వం
నిర్మల్: విపత్తుల వేళ ‘మేమున్నాం..’ అంటూ అండగా నిలవాలనే సంకల్పం ఉన్నవారికి ఓ వేదిక ‘రెడ్క్రాస్ సొసైటీ’. ఇందులో సభ్యత్వం ఎన్నో సామాజిక సేవలు చేసేందుకు ఓ మంచి అవకాశం. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, అగ్నిప్రమాదాలు లాంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సాయం అందించడంలో రెడ్క్రాస్ కీలకపాత్ర పోషిస్తోంది. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ప్రథమ చికిత్స శిక్షణ ఇవ్వడం, పేదలకు వైద్య సహాయం అందించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సొసైటీ ఇప్పుడు జిల్లాలోనూ సభ్యత్వ సేకరణ చేపడుతోంది. సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్న ప్రతిఒక్కరూ ఈ సేవామార్గంలో భాగస్వాములు కావాలని పిలుస్తోంది. కలెక్టర్ అధ్యక్షతన.. సమాజంలో 18ఏళ్లు నిండిన యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు.. ఇలా ఎవరైనా రెడ్క్రాస్లో సభ్యత్వం తీసుకుని స్వచ్ఛంద సేవకులుగా ముందుకురావచ్చు. ప్రపంచవ్యాప్తంగా కో ట్లాదిమంది జీవితాల్లో వెలుగునింపిన ఈ సంస్థ ప్రస్తుతం జిల్లాలోనూ సభ్యులను చేర్చుకుంటోంది. జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో గవర్నర్ అధ్యక్షతన ఈ సొసైటీ కార్యకలాపాలు సాగిస్తుంది. రక్తదాన శిబిరాల నిర్వహణ, బ్లడ్బ్యాంకుల ఏర్పాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారం, దుస్తులు, మందుల పంపిణీ, పేదలకు వైద్య సహాయం, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) శిక్షణలు, అంబులెన్స్ సేవలు, దివ్యాంగులకు వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, సహాయక పరికరాల పంపిణీ, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యు వతలో సేవాభావాన్ని పెంపొందించే జూనియర్, యూత్ రెడ్క్రాస్ కార్యక్రమాలనూ చేపడుతోంది. సభ్యులుగా చేరిన రిటైర్డ్ ఉద్యోగులు జిల్లాలో ప్రస్తుతం రెడ్క్రాస్ సొసైటీ సభ్యత సేకరణ కొనసాగుతోంది. ఈ సొసైటీకి నోడల్ అధికారిగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి విజయలక్ష్మిని కలెక్టర్ భవేశ్మిశ్రా నియమించారు. జిల్లాకేంద్రంలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నుంచి అధ్యక్షుడు ఎంసీ లింగన్న ఆధ్వర్యంలో ఇప్పటికే 60మంది సొసైటీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. మిగతా సంఘాలు, యువకులూ ముందుకు వస్తున్నారు. -
‘బాలలను పనిలో పెట్టుకోవద్దు’
భైంసారూరల్: 6–14 ఏళ్లలోపు బాలలను పని లో పెట్టుకుంటే చర్యలు తప్పవని కార్మికశాఖ చైల్డ్ వెల్ఫేర్ న్యాయ సలహాదారు నరేందర్ హె చ్చరించారు. మంగళవారం మండలంలోని తి మ్మాపూర్ గ్రామంలో ఇద్దరు బాల కార్మికులను గుర్తించిన ఆయన గ్రామ సర్పంచ్ సంజీవ్రావు సమక్షంలో వారిని ప్రభుత్వోన్నత పాఠశాలలో చేర్పించారు. చదువుకునే వయస్సు పిల్లలను పనులకు పంపించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్సై దయాల్సింగ్, సిబ్బంది ఉన్నారు. -
‘వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం’
లక్ష్మణచాంద: వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసి, రైతులకు లాభదాయకంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రైతు వేదికలో అధికారులు, రైతులు వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూ చించారు. ఆరుతడి, ఉద్యానవన పంటలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పంట మార్పిడి విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా విజయాలు సాధించిన ఆదర్శ రైతులను సన్మానించారు. సోన్ రైతువేదిక నుంచి కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొని మాట్లాడారు. రైతు నేస్తం కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని శాసీ్త్రయ పద్ధతులు పాటించాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన రైతులు, వ్యవసాయ అధికారులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి బీవీ రమణ, తహసీల్దార్ సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నిర్మల్ రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. నిర్మల్ మండలంలోని కౌట్ల (కె) గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించా రు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారు మూ డ నాగవ్వ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా రు. అధికారులతో కలిసి ఇంటిని పరిశీలించారు. ఆ యన మాట్లాడుతూ.. గుడిసెలు లేని రాష్ట్రంగా తె లంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పే ర్కొన్నారు. అంతకుముందు గ్రామ శివారులోని డ బుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందేలా చర్యలు తీ సుకుంటామని వివరించారు. సొంత స్థలాలున్న ఇ ళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్పాండ్ను పరిశీలించారు. రైతులంతా ఫామ్పాండ్ల నిర్మాణాలకు ముందుకురావాలని సూచించారు. అ దనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ శ్రీని వాస్రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఎంపీడీవో సుధాకర్, సర్పంచ్ దు మాల రాజు, ఉపసర్పంచ్ రఘు తదితరులున్నారు. -
కొత్త ఆశలు!
నిర్మల్చైన్గేట్: నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కో సం ఎదురుచూస్తున్న అర్హులైన దరఖాస్తుదారు ల కల ఎట్టకేలకు ఫలించనుంది. వచ్చే పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా ప్రభుత్వం కసరత్తు చే స్తోంది. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1,44,773 మంది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 చొప్పున బ్యాంక్లు, పోస్టాఫీస్ల ద్వారా పింఛన్ ఇస్తున్నారు. ఇక నుంచి పింఛన్లు బ్యాంక్ ఖాతాల ద్వారానే అందజేయాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ఇటీవలే పోస్టాఫీస్ల్లో తీసుకునే వారికీ బ్యాంక్ల ద్వారా ఇచ్చేలా ఖా తాలు తెరిపించారు. వారంతా ప్రతీ మూడు నె లలకోసారి బ్యాంక్కు వెళ్లి ఎఫ్ఆర్ఎస్ ద్వారా అప్డేట్ చేసుకోవాలనే నిబంధన విధించారు. అనర్హుల ఏరివేత పింఛన్ లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో భర్త లేదా భార్యకు రెండున్నరేళ్లుగా పింఛన్ ఇస్తూ వస్తున్నారు. దీంతో అర్హులైన కొత్తవారు నిత్యం పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేశా రు. జిల్లాలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని జాబితా నుంచి తొలగించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్ర యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి లైవ్ అథెంటికేషన్ ద్వారా లబ్ధిదారుడి ఫొటో క్యాప్చర్ చేసి వివరాలు నమోదు చేశారు. ఇలా జిల్లాలో అక్రమంగా పెన్షన్ పొందుతున్న 323 మందిని గుర్తించి జాబితా నుంచి తొలగించారు. పెండింగ్లో 3,320 దరఖాస్తులు జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 3,320 మందికి పైగా వివిధ కేటగిరీల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా అధికారులు ద్వారా అర్హులుగా గుర్తించబడి ప్రభుత్వానికి సిఫార్సు చేయబడినవారే. వీరే కాకుండా పరిశీలన పూర్తి కాకుండా పెండింగ్ దరఖాస్తులు జిల్లా, మండల స్థాయిలో కోకొల్లలుగా ఉన్నాయి. కాగా, ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నవారికి ఎప్పుడు పింఛన్లు వస్తాయనే సమాచారం తమ వద్ద లేదని అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు రాలేదు కొత్త పింఛన్లు మంజూరైనట్లు ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే నిబంధనల ప్రకారం కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. – గంగన్న, డీపీఎం పంద్రాగస్టు రోజు పంపిణీకి కసరత్తు మండలం లబ్ధిదారులసంఖ్య బాసర 2,851 భైంసా 8,039 భైంసా (బల్దియా) 7,794 దస్తురాబాద్ 3,601 దిలావర్పూర్ 5,990 కడెం 7,243 ఖానాపూర్ 6,761 ఖానాపూర్(బల్దియా) 3,904 కుభీర్ 9,251 కుంటాల 5,610 లక్ష్మణచాంద 7,906 లోకేశ్వరం 9,448 మామడ 6,511 ముధోల్ 6,181 నర్సాపూర్ (జి) 5,814 నిర్మల్ రూరల్ 7,017 నిర్మల్ (బల్దియా) 14,847 పెంబి 1,794 సారంగపూర్ 11,587 సోన్ 7,022 తానూరు 5,602 జిల్లాలో పెన్షన్లు ఇలా.. మొత్తం పెన్షన్లు 1,44,773 వద్ధాప్య.. 33,890 వితంతు.. 35,664 వికలాంగ.. 9,822 గీత కార్మికులు 266 పైలేరియా రోగులు 221 డయాలసిస్ పేషెంట్లు 110 ఒంటరి మహిళలు 2,093 బీడీ కార్మికులు 61,933 -
పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
మామడ: మండలంలోని దిమ్మదుర్తి తుర్కం చె రువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని దిమ్మదుర్తి అటవీ క్షేత్రం పరిధి లోని తుర్కం చెరువును సందర్శించారు. చెరు వు పరిసరాల్లో అభివృద్ధి చేయాల్సిన స్థలాలను అధికారులకు సూచించారు. ఈ ప్రాంతం ఆహ్లా దకరంగా ఉందని పేర్కొన్నారు. సీఎఫ్ అర్ఫణ, జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుకుదే వ్ బొబ్డ, ఫారెస్ట్ డివిజన్ అధికారి నాగిని భా ను, ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు ఉన్నారు. -
ఓవర్ టు పైలట్
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టుతో పాటు ఇండియన్ ఎయిర్పోర్స్కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్ పైలట్ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్ఓ (నిర్వహణ), రిపేర్ (మరమ్మతు), ఓవర్హాల్ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతో పాటు ఎంఆర్వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు గాను రూ.2278 కోట్ల నిధుల మంజూరు చేస్తూ ఈనెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం ఈ నిధులు వెచ్చింనున్నారు. ప్రైవేట్ అకాడమీల దృష్టి.. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివిధ ప్రైవేట్ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు. అకాడమీలు ఇలా.. పైలెట్ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్ లైసెన్సులు, రేటింగ్ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. మారుమూల నుంచి కూడా పైలట్లు.. మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ నుంచి కూడా పైలట్ శిక్షణ పొందేందుకు ఇలాంటి అకాడమీలు ఉపయుక్తంగా ఉంటాయి. ప్రైవేట్ శిక్షణ కేంద్రాలను సంప్రదించి వాటి ఏర్పాటు విషయంలో రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకునేలా చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఆదిలాబాద్లో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్దితో పాటు శిక్షణ సంస్థలు కూడా ఏర్పాటు కానున్నాయి. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే ఆదిలాబాద్ దరఖాస్తు చేసుకున్న సంస్థలు.. ఎఫ్టీవో (పైలట్ శిక్షణ సంస్థలు) 2. వింగ్ ఏవియేషన్ అకాడమీ 1. ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీఎంఆర్ఓ కేంద్రాలు.. 1. జెట్ సెట్ గో 2. డెక్కన్ 3. గోల్డన్ ఈగల్ ఏవియేషన్ 4. స్టార్ ఎయిర్ 5. యథి ఏవియేషన్ 6. థంబై ఏవియేషన్ -
ఉపసర్పంచులకు గౌరవవేతనం ఇవ్వాలి
నిర్మల్చైన్గేట్: ఉపసర్పంచులకు గౌరవవేతనం ఇ వ్వాలని ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పొ ద్దుటూరి సంపత్రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉపసర్పంచులు నిరసన తెలిపారు. అనంతరం సంపత్రెడ్డి మాట్లాడుతూ.. ఉపసర్పంచులకు గౌరవ వే తనం నెలకు రూ.5వేలు, వార్డు మెంబర్లకు రూ.3 వేల చొప్పున ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రా మపంచాయతీ తీర్మాన పత్రాలపై ఉపసర్పంచుల కు కూడా సంతకం చేసే హక్కు కల్పించాలని కోరా రు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకా లపై ఉపసర్పంచుల పేర్లు ముద్రించాలని, మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఉపసర్పంచులను ఆహ్వానించాలని, గ్రామపంచాయతీ స్టాండింగ్ కమిటీల్లో సర్పంచ్ చైర్మన్గా ఉంటే, ఉపసర్పంచ్ను వైస్చైర్మన్గా గుర్తించాలని కోరారు. -
నిర్మల్
ఆధ్యాత్మికతకు ప్రతీక బాసర క్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం విశిష్టమైందనివేద పండితుడు శశికాంత్ జోషి పేర్కొన్నారు. గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు క్షేత్ర వైభవంపై ప్రవచనం చేశారు.జలిసిరితో అదనపు ఆదాయం దస్తురాబాద్: జలసిరితో రైతన్నలు అదనపు ఆ దాయం పొందవచ్చని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. మంగళవారం మండలంలోని భూత్కూర్ పంచాయతీ పరిధి రాంపూర్ గ్రా మంలో రైతు నిర్మించుకున్న ఫామ్పాండ్లో చే పపిల్లలు విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ ఇంకుడుగుంత, ప్ర తీ గ్రామానికి ఊరకుంట, ప్రతీ రైతు పొలంలో నీటికుంట నిర్మించుకున్నప్పుడే భూగర్భ జలా ల పెంపు సాధ్యమవుతుందన్నారు. ఎంపీడీవో సయ్యద్ జావేద్ అలీ, ఎంపీవో రమేశ్రెడ్డి, ఏపీవో రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి అనిల్, ఫీల్డ్అసిస్టెంట్ అంజలి, కిషన్ పాల్గొన్నారు.నిర్మల్: జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ సమస్యకు క్రమంగా ఊరట లభిస్తోంది. ‘సాక్షి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించి అధికా రుల దృష్టికి సమస్య తీసుకువచ్చింది. ఇప్పటికే ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ప్ర త్యేకంగా దృష్టిపె ట్టారు. ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో సమస్య లే కుండా చేశారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ను అదుపు చేసేందుకు ప్ర త్యేకంగా పోలీస్ బృందాల ను నియమించాలని డీజీపీ సీవీ ఆనంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అతిత్వరలో ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా పోలీసులను కేటాయిస్తామని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాలు జిల్లాకేంద్రం జాతీయ రహదారులైన 44, 61కి కూ డలిగా ఉంది. పైగా, ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ప్రధానకేంద్రంగా మారింది. రోజూ వేలాది కార్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పట్టణ జనాభాతోపాటు వాహనాల సంఖ్య అధికమవుతుండగా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది. ప్రధానంగా పాత బస్టాండ్, వివేక్చౌ క్, శివాజీచౌక్, ఈద్గాం లాంటి ప్రాంతాల్లో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారులపై అక్ర మ పార్కింగ్లు, ఫుట్పాత్ల ఆక్రమణలు సమస్య ను తీవ్రతరం చేస్తున్నాయి. పండుగలు, మార్కెట్ రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వీటిపై సంబంధిత శాఖల అధికారుల స్పందన లేక గతంలోనూ కొందరు కోర్టుల వరకూ వెళ్లిన సందర్భాలున్నాయి. మున్సిపల్ కూడా స్పందిస్తే.. జిల్లాకేంద్రంలో ప్రధానంగా రహదారులు, ఫుట్పాత్లపై ఆక్రమణలు, దుకాణాలు, షాపింగ్మాల్స్ ఎదుట టేలాలను మున్సిపల్ అధికారులు తొలగించాల్సి ఉంది. కూరగాయలు, పండ్లు విక్రయించడానికి ప్రత్యేకంగా వేర్వేరు మార్కెట్లు ఏర్పాటు చే యాలి. ప్రధానంగా ఎడమవైపు వాహనాలు వెళ్లడానికి ‘ఫ్రీ లెఫ్ట్’ కోసం చౌరస్తాల విస్తరణ పనులూ చే పట్టాలి. ఇదే విషయాన్ని ఇటీవల మున్సిపల్ సమావేశంలోనూ పలువురు కౌన్సిలర్లు లేవనెత్తారు. ఈద్గాం, శివాజీచౌక్, జయశంకర్సార్ సర్కిల్, వివేక్చౌక్, అంబేడ్కర్చౌక్లో ఆక్రమణలు తొలగించి, నలువైపులా చౌరస్తాలను విస్తరించాలి. అప్పుడే ఫ్రీ లెఫ్ట్, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చర్యలు చేపడుతున్నాం జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీస్శాఖ తరఫున బాధ్యతాయుతంగా చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలన్న డీజీపీ ఆదేశాల మేరకు త్వరలోనే సిబ్బందిని నియమిస్తాం. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రజలూ సహకరించాలి. – డాక్టర్ జానకీషర్మిల, ఎస్పీ నిర్మల్ బస్టాండ్ వద్ద ప్రశాంతంగా వాహనాల రాకపోకలు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో నిధుల కొరతతో కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాల మరమ్మతులు చేయించడానికి నెలలపాటు సమయం తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో సమస్యలపై విమర్శలు తీవ్రం కాగా పోలీస్శాఖ తరఫున ఎస్పీ జానకీషర్మిల చొరవ తీసుకున్నారు. ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో సీఐ, ఎస్సైలు, సిబ్బందితో రోజంతా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లు రోడ్డుపైకి తీసుకువచ్చి, రాకపోకలకు ఇబ్బంది కలిగించవద్దని ఎస్పీ స్వయంగా వచ్చి చెప్పారు. దాదాపు 20రోజులుగా బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య క్లియర్ కావడంతో పట్టణ వాసులూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. ట్రాఫిక్ ఠాణా ఇప్పట్లో లేనట్లే! ప్రత్యేక ట్రాఫిక్ బృందం ఏర్పాటు కానున్న నేపథ్యంలో నిర్మల్లో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటు ఇప్పట్లో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలోనే ట్రాఫిక్ విభాగం పనిచేసే అవకాశముంది. జిల్లా నుంచి ఠాణా కోసం ప్రతిపాదనలు పంపించినా.. ప్రస్తుతానికి ప్రత్యేక పోలీసులతో సరిపెట్టారు. భవిష్యత్లో అవసరాలను బట్టి పూర్తిస్థాయి ట్రాఫిక్ ఠాణా ఏర్పాటు చేస్తారని అధికారులు చెబుతున్నారు. -
పట్టణవాసి.. ఎందుకీ లేజీ..!
నిర్మల్స్వయం ఉపాధిలో అతివ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరిన మహిళలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.బాసరలో వ్యాసపౌర్ణమి ఉత్సవాలు బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వ్యాస పౌర్ణమి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. మెరుగైన వైద్యసేవలు అందించాలి భైంసాటౌన్: ముధోల్ నియోజకవర్గ ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కోరారు. హైదరాబాద్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రికి విన్నవించారు. భైంసా ఏరియా ఆస్పత్రిని 150 పడకలకు పెంచాలని, డయాలసిస్ పడకలు పెంచాలని, వంద పడకలతో మెటర్నటీ ఆస్పత్రి నిర్మించాలని, కుభీర్ ఆస్పత్రిని 30 పడకలకు పెంచాలని, ముధోల్ ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి చేయాలని విన్నవించారు. అన్ని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్స్, ఇతర పోస్టులు భర్తీ చేయాలన్నారు. కుభీర్, బాసరతో పాటు భైంసాకు అదనంగా అంబులెన్స్ కేటాయించాలని కోరారు. నిర్మల్: పట్టణ ప్రాంత ప్రజలు ప్రతీ విషయంలో ముందుంటారనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ.. చాలా విషయాల్లో అది తప్పవుతోంది. ప్రధానంగా ఓటు వేయడం, ఓట్లను కాపాడుకోవడం వంటి ముఖ్యమైన విషయాల్లోనూ ఇదే పరిస్థితి. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) విషయంలో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల ప్రజలు వెనుకంజలో ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియడానికి మరో వారమే గడువు ఉండగా, జిల్లాలోని నిర్మల్, భైంసా మున్సిపాలిటీలలో కలిపి ఇప్పటికీ వేలసంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్వోలకు తిరిగి చేరకపోవడం గమనార్హం. వెనుకంజలో నిర్మల్, భైంసా.. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో గణనీయ సంఖ్యలో ఓటర్లు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదు. ఖానాపూర్ 98 శాతంతో కొంతమేర ఫర్వాలేదు. కానీ.. నిర్మల్అర్బన్లో ఈనెల 27 ఉదయం వరకు 81.15 శాతం పూర్తయింది. ఇంకా 17,495 మంది డిజిటలైజేషన్ పెండింగ్ ఉంది. భైంసా అర్బన్లో 90.34 శాతం పూర్తయింది. ఇంకా 8,292 మంది డిజిటలైజేషన్ పూర్తి చేసుకోవడానికి ఫారాలు ఇవ్వలేదు. పల్లెలు భేష్.. జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా, ఉన్నతాధికారులు ముందునుంచీ చెబుతున్న విషయాలన్నింటినీ పల్లెప్రజలు తు.చా.తప్పకుండా పాటిస్తున్నారు. బీఎల్వోలు వచ్చిఇచ్చిన వెంటనే అవసరమైన పత్రాలతో ఎన్యూమరేషన్ ఫారాలు నింపి అప్పగించారు. గడువుకంటే పదిరోజుల ముందే జిల్లాలోని దస్తురాబాద్, కడెం, పెంబి, మామడ, దిలావర్పూర్, లక్ష్మణచాంద, నర్సాపూర్(జి), నిర్మల్రూరల్, సారంగపూర్, సోన్, బాసర, కుభీర్, కుంటాల, ముధోల్ మండలాల్లో వందశాతం సర్ ప్రక్రియను సిబ్బంది పూర్తి చేశారు. లోకేశ్వరం 99.90, తానూరు 99.98 శాతంతో మొత్తం ప్రక్రియ పూర్తికి అతిసమీపంలో ఉన్నాయి. వారమే గడువు.. ఎస్ఐఆర్ ఆగస్టు 3తో ముగియనుంది. ఆలోపే తమ ఓటును కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మున్ముందూ ఓటుహక్కు పొందడంలో ఇబ్బందులూ ఏర్పడవచ్చు. ఇప్పటికై నా పట్టణ ప్రాంత ఓటర్లు సోమరితనం, నిర్లక్ష్యం వీడి అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. అద్దె ‘ఓనర్ల’ గోస!లక్షకు పైగా ఓట్లు పోయినట్లే..! ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పూర్తయిన తర్వాత దాదాపు లక్షకు పైగా ఓట్లు జాబి తాలో నుంచి పోనున్నాయి. ప్రస్తుత జాబి తా ప్రకారం జిల్లాలో 925 పోలింగ్ కేంద్రా ల పరిధిలో 7,55,344 మంది ఓటర్లు ఉ న్నారు. ఇందులో ఇప్పటి వరకు 7,27,503 మంది ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇక వందశాతం డిజిటలైజేషన్ పూర్తయిన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఏఎస్డీ జాబితాలను కూడా పూర్తిచేశారు. ఏఎస్డీ అంటే.. అబ్సెంట్(ఫారాలు ఇవ్వనివారు), ఫిఫ్టెడ్(తరలివెళ్లినవారు), డెత్(చనిపోయినవారు) అలాగే డబుల్ఓట్ (రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు) అని అర్థం. ఈ జాబితా ఈ కేటగిరీల వారికి సంబంధించిన వివరాలన్నీ నమోదు చేస్తారు. వీటితో పాటు ఆ ఓటు ఎందుకు తిరస్కరణకు గురైందనే కారణాన్నీ అందులో నోట్ చేస్తారు. సదరు జాబితాపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, చివరకు కలెక్టర్ సంతకాలు తీసుకుని ఫైనల్ చేస్తారు. ఈనెల 27 వరకు ఏఎస్డీ జాబితాల్లో మొత్తం 91,484 మంది ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. అంటే వీరందరి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోనున్నాయి. వచ్చేనెల 3న గడువు ముగిసే వరకు జిల్లాలో లక్షకు పైగా ఓటర్ల పేర్లు పోనున్నట్లు అంచనా వేస్తున్నారు.ఈనెల 27వరకు ఎస్ఐఆర్ వివరాలు.. మొత్తం పోలింగ్ స్టేషన్లు 925 మొత్తం ఓటర్లు 7,55,344 పంపిణీ చేసిన ఎన్యూరేషన్ ఫారాలు 7,55,344 ఆఫ్లైన్లో డిజిటలైజ్ చేసినవి 6,36,019 ఆన్లైన్లో డిజిటలైజ్ చేసినవి 91,484 మొత్తం డిజిటలైజ్ చేసినవి 7,27,503 డిజిటలైజేషన్ శాతం 96.31 డిజిటలైజేషన్ చేయాల్సిన ఫారాలు 27,841 డిజిటలైజేషన్ పూర్తయిన పోలింగ్ స్టేషన్లు 742 సిద్ధం చేసిన ఏఎస్డీ జాబితాలు 925 ఏఎస్డీ జాబితాలో ఉన్న ఓటర్లు 91,484 పట్టణాల్లో స్పందనేదీ..!? గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లిన బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఎక్కువశాతం ఫారాలను సేకరించగా పట్టణాల్లో మాత్రం స్పందన ఆశించిన స్థాయిలో లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కారణంగా కొంతమంది ఇవ్వడం లేదు. కొందరు రేపోమాపో ఇద్దామంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లో ఫారాలను తిరిగి ఇచ్చేవారు లేకపోవడం, మరికొందరు చివరి రోజుల్లో ఇస్తామని వాయిదా వేయడం, తదితర కారణాలతో అర్బన్ ప్రాంతాల్లో సర్ నెమ్మదించింది. ఎన్నికల సమయాల్లోనూ అర్బన్ ఓటర్లు సోమరితనం ప్రదర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు 88 శాతం పోలింగ్ నమోదు చేయగా, మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్మల్లో పట్టణ ఓటర్లు 65.60 శాతమే నమోదు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఓటర్లు ఓటేసేందుకు ముందుకు రాలేదు. ఏ ఒక్కరూ మిస్ కావొద్దు.. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అనేది చాలా ప్రధానమైనది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకున్నవారు వెంటనే నింపి బీఎల్వోలకు తిరిగి ఇచ్చేయాలి. నిర్మల్, భైంసాలో కొంత వెనుకంజలో ఉన్నాం. మిగితా మండలాల్లో ప్రక్రియను వందశాతం పూర్తి చేశాం. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఏఎస్డీ జాబితాలనూ పూర్తి చేశాం. – భవేశ్మిశ్రా, కలెక్టర్ -
అటవీశాఖ చీఫ్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే
ఖానాపూర్: నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం సచివాలయంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అటవీ శాఖ అధికారుల వేధింపులు, అనవసర ఆంక్షలను అరిక ట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని మండలాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్జెడ్) అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ల నిర్వహణకు అటవీ శాఖ నుంచి అనవసర అడ్డంకులు కల్పించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. -
ఇళ్లలోకి పురుగులు వస్తున్నాయని ఆందోళన
లక్ష్మణచాంద: గోదాంల నుంచి తమ ఇళ్లలోకివస్తున్న లక్కపురుగులతో ఇబ్బందిగా ఉందని సోమవారం బోరిగాం తండావాసులు గోదాంల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోరిగాంలో 20వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కల్గి న గోదాములలో బియ్యం నిల్వ చేశారన్నా రు. ఇటీవల గోదాంల నుంచి పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నా మన్నారు. ఎంపీడీవో నసీరుద్దీన్ సంఘటన స్థలానికి వెళ్లి వేర్హౌస్ గోదాం మేనేజర్ శివరామకృష్ణతో ఫోనన్లో మాట్లాడి.. గ్రామస్తులతోనూ మాట్లాడించారు. పురుగులు రాకుండా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అర్జీల పరిష్కారంలో ఆలస్యం వద్దు
నిర్మల్చైన్గేట్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయవద్దని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి 96 దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


