Nirmal District News
-
కల్లాలను పరిశీలించిన ఎమ్మెల్యే
దిలావర్పూర్/సారంగపూర్: మండల కేంద్రాల్లోని మొక్కజొన్న, జొన్న, వరి కల్లాలను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి బుధవారం పరిశీలించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అన్నదాతలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్లో ఎక్కడికక్కడ కుప్పలుగా పడి ఉన్న మొక్కజొన్నను చూసి అధికారులను నిలదీశారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొక్కజొన్న పంట పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కాక రైతులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు వరి ధాన్యం కల్లాలకు వస్తుందని, అకాల వర్షాల భయం రైతుల ను వెంటాడుతోందని తెలిపారు. రైతులకు గోనె సంచులు అందుబాటులో ఉంచి, రవాణా సౌకర్యం మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, నాయకులు మంద మల్లేశ్, వీరేష్, శైలేశ్వర్, విక్రమ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
నిర్మల్ రూరల్/నిర్మల్చైన్గేట్: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, జిల్లాలోని దివ్యాంగులకు అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి భరోసానిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బుధవారం ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం సమగ్ర శిక్ష, ఆలింకో సంస్థ ద్వారా ఈ పరికరాలను పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ట్రై సైకిల్, సీపీచైర్, వీల్చైర్, క్రచెస్, హియరింగ్ ఎయిడ్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ స్లేట్, టీఎల్ఎం కిట్లు 189 మంది విద్యార్థులకు అందించారు. డీఈవో భోజన్న మాట్లాడుతూ ఇలాంటి ఉపకరణాలు విద్యార్థుల స్వతంత్ర జీవనానికి విద్యాభ్యాసానికి దోహదపడతాయన్నారు. గత సెప్టెంబర్లో నిర్వహించిన నిర్ధారణ శిబిరానికి హాజరైన 205 మంది దివ్యాంగ విద్యార్థుల్లో 189 మంది అర్హులుగా నిర్ధారించి వారికి 296 ఉపకరణాలు అందజేశామన్నారు. ఇందులో యోగేష్, ప్రతాప్, మహేందర్, కుందన్, సమగ్ర శిక్ష విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ గంజి రాజు, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, నారాయణ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు జింక సూరి, శ్రీరామోజీ నరేష్, అర్జున్, శశాంక్, సాత్విక్ పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపు వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్:మొక్కజొన్న, వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ధాన్యం గోదాములకు తరలింపు ప్రక్రియపై బుధవారం సమీక్ష నిర్వహించారు. టోల్ ప్లాజాలు, చెక్పోస్టుల వద్ద ఖాళీ లారీలను గుర్తించి ధాన్యం తరలింపునకు వినియోగించాలన్నారు. అవసరానికి అనుగుణంగా మరిన్ని లారీలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. లారీలు సమకూర్చే ప్రాంతాలు, అన్లోడింగ్ కేంద్రాల వద్ద రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సిబ్బందిని షిఫ్ట్ల వారీగా నియమించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సంచులు నిల్వ ఉండకూడదని పేర్కొన్నారు. అవసరమైతే స్థానిక కూలీలను హమాలీలుగా నియమించుకోవాలని 25 నుంచి 30 కిలో మీటర్ల పరిధిలో అన్లోడింగ్ పాయింట్లు ఉన్న కేంద్రాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణా చేపట్టాలన్నారు. ప్రభుత్వ గోదాములతోపాటు ప్రైవేట్ గోదాములు, రైతు వేదికలు తదితర ప్రాంతాల్లో కూడా ధాన్యం నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ వరి, మొక్కజొన్న ధాన్యం తరలింపు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేందుకు పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. చెక్పోస్టులు, టోల్ప్లాజాలు, ఇతర తనిఖీ కేంద్రాల్లో తగిన పోలీసు సిబ్బందిని నియమిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఎస్పీ శ్రీని వాస్, డీఎస్వో, మేనేజర్లు రాజేందర్, సుధాకర్, మార్క్ఫెడ్ డీఎం మహేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఏవో అంజిప్రసాద్ పాల్గొన్నారు. అన్లోడింగ్లో జాప్యం వద్దు... లోకేశ్వరం: మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను, రాయపూర్ కాండ్లిలోని రెస్ మిల్లులను కలెక్టర్ భవేశ్మిశ్రా బుధవారం తనిఖీ చేశారు. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. లారీలను 24 గంటల్లో అన్లోడ్ చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్లు చేయొద్దని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, సివిల్ సప్లై అధికారులు రాజేందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన కోఆప్షన్ రగడ..!
భైంసాటౌన్: భైంసాలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనకు ఎట్టకేలకు తెర పడింది. ఈనెల 12న నిర్వహించాలని ఎన్నిక హఠాత్తుగా, నిబంధనలకు విరుద్ధంగా వాయిదా వేశారంటూ కమిషనర్ తీరును నిరసిస్తూ అధికార పక్ష సభ్యులు రెండురోజులుగా మున్సిపల్ కార్యాలయం వద్దే బైఠాయించి ఆందోళన చేశారు. బుధవారం సైతం ఆందోళన కొనసాగించగా, సాయంత్రం మున్సిపల్ కమిషనర్ లింగయ్య, టీపీవో అనురాధ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా, గేటు వద్దే అడ్డుకున్నారు. ఎంఐఎంకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కమిషనర్ ఎన్నిక నిర్వహణలో మూడురోజులుగా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల వాయిదాకు కారణం చెప్పాలని నిలదీశారు. ఎన్నిక వాయిదాలో తన తప్పేమి లేదని కమిషనర్ వారికి బదులిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి కమిషనర్ను కోరగా, అందుకు తనకు అధికారం లేదన్నారు. దీంతో కమిషనర్ తీరుపై పాలకవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ చాంబర్లో కమిషనర్, కౌన్సిలర్ల మధ్య చర్చలు జరిగాయి. కమిషనర్ వివరణకు సంతృప్తి చెందకపోవడంతో, పంచాయితీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లింది. కమిషనర్, కౌన్సిలర్లు ఎమ్మెల్యే రామారావుపటేల్ వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో ఆందోళన విరమిస్తున్నట్లు చైర్మన్ తూమోల్ల దత్తాత్రి తెలిపారు. -
తోడుకున్నోళ్లకు తోడుకున్నంత!
లోకేశ్వరం: జిల్లాలోని దిలావర్పూర్, సముందర్పల్లి, లోకేశ్వరం మండలాల్లోని మొహళ్, గొడిసెరా, పంచగుడి ప్రాంతాల్లో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గిపోయింది. దీంతో నల్లమట్టి అక్రమ తవ్వకాలు ఊపందుకున్నాయి. భారీ జేసీబీలతో మట్టిని తవ్వి, టిప్పర్లలో తరలించుకుపోతున్నారు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంతగా ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి ఒక్క పైసా ఆదాయం రాకుండా అధికారులు, ఆధికార పార్టీ నాయకుల మద్దతుతో ఈ కార్యకలాపాలు సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. రైతుల అవసరాన్ని లాభంగా.. వేసవి కాలంలో నేల చదును చేసుకునేందుకు రైతులు ఎస్సారెస్పీ నల్లమట్టిని ఆశ్రయిస్తారు. ఇది రసాయన ఎరువులను తగ్గించి, భూసారాన్ని పెంచుతుంది. అయితే, వ్యాపారులు ఈ అవసరాన్ని దుర్వినియోగం చేసి, పంచగుడి గోదావరి వంతెన నుంచి నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో ట్రక్కులో 40 టన్నులకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తూ ఫామ్హౌస్లకు సరఫరా చేస్తున్నారు. రోడ్ల ధ్వంసం.. భారీ టిప్పర్ల రద్దీతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పక్షం రోజులుగా అక్రమ తరలింపు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇది అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వ ఆదాయం కోల్పోవడమే కాకుండా ప్రజాధనంతో వేసిన రోడ్లు దెబ్బతింటున్నా అధికారులో పట్టించుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతివేగంగా వాహనాలు ప్రతీరోజు భారీ టిప్పర్లు ఓవర్ లోడుతో పదుల సంఖ్యలో తిరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. ప్రమాదాలు జరిగే అవకశాలు ఉన్నాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. – చిన్నారెడ్డి, ధర్మోర అధికారులు చర్యలు తీసుకోవాలి మట్టి తరలింపును ఎస్సారెస్పీ అధికారులుగానీ మైనింగ్శాఖ వారు గానీ పట్టించుకోవడం లేదు. మా పరిధిలకి రాదు. మండలంలోని గోదావరి నది శివారులో నల్ల మట్టి తరలించేందుకు రెవెన్యూ శాఖ తరఫున ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. – సూర్యరావు, లోకేశ్వరం తహసీల్దార్ -
ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవాలు
బాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవా ల్లో భాగంగా మూడో రోజు బుధవారం వివిధ కా ర్యక్రమాలు నిర్వహించారు. వైస్ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఈ.గోవర్ధన్ క్యాంపస్లోని సివిల్, కెమికల్, మెటలర్జీ, ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలను సందర్శించారు. ప్రయోగశాలలు, విద్యార్థుల పరిశోధనలను పరిశీలించి, ఇంగ్లిష్, తెలుగు, మేనేజ్మెంట్ విభాగాల్లో బోధనా పద్ధతులపై చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తుకు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. సిబ్బంది క్రీడా పోటీలు.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. పురుషులకు క్రికెట్, వాలీబాల్, మహిళలకు బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. వీసీ పోటీలను ప్రారంభించారు. -
ఖానాపూర్లో మోడల్ స్కూల్
ఖానాపూర్: రాష్ట్రప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఖానాపూర్ కేంద్రంగా త్వరలో తెలంగాణ మోడల్ స్కూల్, ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. బుధవారం పట్టణంలోని జీవీఆర్ కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ ప్రజాప్రతినిధుల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపడుతోందన్నారు. సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు విద్యారంగ అభివృద్ధిపై అవగాహన కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఖానాపూర్లో పాలిటెక్నిక్ కళాశాల స్థాపనకు కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు. అవగాహన కార్యక్రమానికి హాజరైన సర్పంచులకు గ్రామాభివృద్ధి కోసం అదనంగా రూ.5 లక్షలు మంజూరు చేసే విషయమై కలెక్టర్తో మాట్లాడనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, ఎంఈవో సంధ్యారాణి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాత మురిసె
నిర్మల్బాసర లడ్డూ ప్రియం బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రసాదం ధరలు పెరిగాయి. 500 గ్రాముల లడ్డూ ధరను రూ.50 పెంచారు. బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి.మద్దతు పెరిగె..మక్కలు కొనాలని ఆందోళన ఖానాపూర్: పట్టణంలోని వ్యవసాయమార్కెట్ యార్డులో ఖానాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచుల కొరత పేరుతో కొనుగోళ్లు నిలిపివేశారని రైతులు ఆందోళన చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలోని ఖానాపూర్–తర్లపాడ్ ప్రధాన రహదారిపై బుధవారం బైఠాయించారు. ఇప్పటికే తూకం వేసిన బస్తాలను కూడా లారీల కొరత పేరుతో తరలించడం లేదని రైతులు తెలిపారు. క్వింటాల్కు రూ.50తోపాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిరసనలో రైతులు చంద్రకళ, శారద, చిన్నయ్య, నర్సయ్య, శేఖర్, మహేష్, పరమేష్, విలాస్, అనిల్, సురేష్, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై పీఏసీఎస్ అధికారులు, సిబ్బంది స్పందిస్తూ బస్తాలకు అదనపు డబ్బులు తాము తీసుకోవడం లేదని, లారీల అన్లోడింగ్ సమయంలో డ్రైవర్లు, ఇతరులు వసూలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు. లక్ష్మణచాంద: పగలనక, రాత్రనక ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరుణంలో అన్నదాతల ఆదాయం పెంచి పంటల ఉత్పత్తులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సీజన్లో రైతులు సాగుచేసే పలు రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినేట్ ఖరీఫ్ పంటలకు మద్ధతు ధర పెంచాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతుల ఆదాయాన్ని బలోపేతం చేసి, ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మద్దతు ధరల పెంపు ఇలా.. గతంతో పోల్చితే ఈసారి కొన్ని పంటలకు మద్దతు ధర పెరిగింది. ఇందులో ప్రధానంగా సన్ ప్లవర్కు గతంలో క్వింటాల్కు రూ.7,721 ఉండగా, ఈసారి 622 రూపాయలు పెంచాలని నిర్ణయించింది. దీంతో క్వింటాల్ ధర రూ.8,343లకు చేరింది. నువ్వులు గతంలో క్వింటాలుకు రూ.9,846 ఉండగా ప్రస్తుతం రూ.500 పెరగడంతో క్వింటాలు ధర రూ.10,346 అయ్యింది. పత్తి మధ్యస్థ రకం రూ.7,710 ఉండగా ప్రస్తుతం రూ.557 పెంచింది. దీంతో క్వింటాల్ ధర రూ.8,267కు పెంచింది. పత్తి పొడవు రకం గతంలో క్వింటాల్కు రూ.8,110 ఉండగా రూ.557 పెంచడంతో రూ.8,667 అయ్యింది. ఆహార పంటల్లో కందులకు గరిష్టంగా రూ.250 పెంచింది. సజ్జలకు కనిష్టంగా రూ.50 పెంచింది. వాణిజ్య పంటల్లో పొద్దు తిరుగుడుకు గరిష్టంగా రూ.622, కనిష్టంగా సోయాబీన్కు రూ.172 పెంచింది. జిల్లాలో 1.20 లక్షల మంది రైతులకు లబ్ధి.. జిల్లాలో మొత్తం 1.20 లక్షల మంది రైతులు 4.20 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. గత వానాకాలంలో పత్తి 1.50 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 1.10 లక్షల ఎకరాల్లో, వరి 1.20 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 30 వేల ఎకరాలలో, కంది 7 వేల ఎకరాల్లో ఇతర పంటలు 3 ఎకరాల్లో సాగు చేశారు. కేంద్రం పంటల మద్దతు ధర పెంచడంతో జిల్లాలో 1.20 లక్షల రైతులకు మేలు చేకూరనుంది. కేంద్రం నిర్ణయం రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఖరీఫ్ పంటల సాగు విస్తరిస్తుంది. సంతోషంగా ఉంది కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచడం సంతోషంగా ఉంది. గతంలో సరైనా మద్దతు ధరలు లేక నష్టపోయాం. కేంద్రం మద్దతు ధరలను పెచడంతో రైతులకు మేలు చేకూరుతుంది. – నర్సారెడ్డి, రైతు లక్ష్మణచాంద రైతులకు లబ్ధి జిల్లాలో 4.20 లక్షల ఎకరాలలో వివిధ పంటలను 1.20 లక్షల రైతులు సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్ధతు ధరలను పెంచడంతో జిల్లాలోని 1.20 లక్షల రైతులకు మేలు కలుగుతుంది. – అంజిప్రసాద్, డీఏవో, నిర్మల్మద్దతు ధరల సమాచారం (రూ.లలో..) పంటల రకం 2025–26 2026–27 పెరిగిన ధర ఆహార పంటలు.. సాధారణ వరి 2,369 2,441 72 ఏ గ్రేడ్ వరి 2,389 2461 72 హైబ్రిడ్ జొన్నలు 3,699 3,769 70 సజ్జలు 2,775 2,825 50 రాగులు 4,886 5,000 114 మొక్కజొన్న 2,400 2,475 75 కందులు 8,000 8,250 250 పెసలు 8,768 8,950 182 మినుములు 7,800 8,000 200 వాణిజ్య పంటలు.. వేరుశనగ 7,263 7,500 237 సోయాబీన్ 5,328 5,500 172 నువ్వులు 9,846 10,346 500 పొద్దు తిరుగుడు 7,721 8,343 622 పత్తి మధ్యస్థ 7,710 8,267 557 పత్తి పొడవు పింజ 8,110 8,667 557 -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ..
నిర్మల్ రూరల్: ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉద యం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియ ర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 1,435 మంది విద్యార్థులకు 1,359 మంది హాజరయ్యారు. 76 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగి రీలో 131 మంది విద్యార్థులకు 118 మంది హాజరవగా, 13 మంది గైర్ హాజరయ్యారు. సెకండియర్లో మొత్తం 345 మంది విద్యార్థులకు 324 మంది హాజరవగా.. 21 మంది గైర్ హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 23 మంది విద్యార్థులకు 18 మంది హాజరయ్యారని డీఐఈవో పరుశురాం తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఐఈవో కుంటాల: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాన్ని డీఐఈవో పరశురాం బుధవారం పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 169 విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 12 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఆయన వెంట సీఎస్ ఎత్రాజ్ రాజు, డీవో నర్సయ్య ఉన్నారు. -
ఇదేం ‘పరీక్ష’!
భవిష్యత్లో డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో నీట్ రాసిన విద్యార్థులపై ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. పరీక్ష రద్దుతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండేళ్లు కష్టపడి పరీక్ష రాస్తే ఒక్కసారిగా రద్దు చేయడం మానసిక వేదనకు గురి చేస్తోందని వాపోయారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – మంచిర్యాలఅర్బన్/నిర్మల్రూరల్రాత్రింబవళ్లు కష్టపడ్డాను రెండేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టపడి చదివాను. తెల్ల కోటు వేసుకోవాలనే ఆశతో నీట్కు సిద్ధమయ్యాను. ఎన్టీఏ పరీక్ష రద్దుతో నిరాశ నెలకొంది. నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పడంతో ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యాను. తల్లిదండ్రులు కూడా ఇబ్బందికి గురయ్యారు. పేపర్ లీక్ అనేది బాధాకరం. మళ్లీ పరీక్ష రాయాలంటే ఎన్నో ఇబ్బందులుంటాయి. అంతా సంతోషంగా ఉంటామని అనుకున్న నేపథ్యంలో పరీక్షలు రద్దుకావడం చాలా బాధాకరం. – నేహ అంజుం, నీట్ విద్యార్థిని, మంచిర్యాలరద్దుతో నిరాశ ఎంబీబీఎస్ సీటు సంపాదించుకోవాలని తల్లిదండ్రులు, నా కల. నేను రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డాను. తీరా చూస్తే నీట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ కావడం అత్యంత బాధాకరం. ఇలాంటి చర్యల వల్ల మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. నీట్ పేపర్ లీకేజీ పునరావృతం కాకుండా చూడాలి. మళ్లీ పరీక్షలు రాయాలంటే కొంత మేర ఇబ్బందిగా చెప్పవచ్చు. – ప్రాణహిత, నీట్ విద్యార్థిని, మంచిర్యాలమానసిక ఒత్తిడి పెరుగుతుంది మళ్లీ నీట్ రాయమనడంతో మాపై మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. రెండేళ్లు కష్టపడి మొన్ననే పరీక్ష బాగా రాశాం. మార్కులు కూడా బాగానే వస్తున్నాయి. కానీ, ఒక్కసారిగా రద్దుచేసి మళ్లీ పరీక్ష రాయమంటే భయమేస్తోంది. హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకున్నాం. మళ్లీ అక్కడికి వెళ్లి చదవాలంటే దూర భారంతోపాటు వ్యయప్రయాసలు పడాల్సిందే. ఒక రాష్ట్రంలో లీకై తే దేశంలోని విద్యార్థులందరినీ బలి చేయడం అన్యాయం. – మంగ్లారపు నక్షత్ర, నిర్మల్ -
● రోడ్డెక్కి నిరసన తెలిపిన రైతులు
కొనుగోళ్లలో జాప్యంపై అన్నదాతల కన్నెర్ర మామడ: లారీల కొరత, తూకం వేయడంలో జాప్యం కారణంగా రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంతో ఆగ్ర హించిన రైతులు న్యూసాంగ్వి క్రాస్రోడ్డు వద్ద మంగళవారం రాస్తారోకో చేశారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తా లు పేరిట బస్తాకు 3నుంచి 4కిలోలు కోత వి ధిస్తున్నారని ఆరోపించారు. రైతులు అరగంటకుపైగా నిర్మల్–ఖానాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించగా ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్రావు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూ ర్తి చేసి గోదాములకు తరలిస్తామని తెలుపగా రైతులు ఆందోళన విరమించారు. -
కొనసాగుతున్న విద్యావారోత్సవాలు
బాసర: బాసర ట్రిపుల్ఐటీలో నిర్వహిస్తున్న విద్యావారోత్సవాలు మంగళవారం రెండోరోజుకు చేరా యి. ఉదయం యోగా శిబిరంలో అధ్యాపకులు, సి బ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి గా హాజరైన వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ.. ఒత్తిడిని అధిగమించి ప్రశాంత జీవనం గడపడానికి ప్రతి ఒ క్కరూ యోగాను నిత్యకృత్యం చేసుకోవాలని సూ చించారు. శిక్షకులు విజయ్కుమార్, నాగలక్ష్మి వివి ధ ఆసనాలపై శిక్షణ ఇచ్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని రామకృష్ణ, శ్యాంబాబు, రవికిరణ్ త దితరులు నిర్వహించారు. మానసిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సాంకేతిక యుగంలో పెరుగుతున్న మానసిక సవాళ్లపై చర్చించారు. వక్త శ్రీలక్ష్మి ఒత్తిడి, ఆందోళనను అధిగమించే మా ర్గాలను విద్యార్థులకు వివరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ మహేశ్ ‘జనరేషన్జెడ్ విద్యార్థులకు బోధన‘ అనే అంశంపై ప్రసంగించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల పెంపుపై నిపుణుడు శ్రీకాంత్ కుట్ల ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించారు. వర్చువల్ ల్యాబ్స్ అనుసంధా నం, ల్యాబ్ మేనేజ్మెంట్ భద్రతా ప్రమాణాలపై సి బ్బందికి మార్గనిర్దేశం చేశారు. మేనేజ్మెంట్ విభా గం నుంచి డాక్టర్ తీర్థాల నాగసాయికుమార్ ‘పరిశోధనలో ప్రశ్నించే తత్వం’, ఇంగ్లిష్ విభాగం నుంచి డాక్టర్ శ్రవణ్ ‘పరిశోధనలో సాహిత్యం పాత్ర’, తెలుగు విభాగం నుంచి డాక్టర్ రమాదేవి ‘గురువు లక్షణాలు’ అనే అంశాలపై ప్రసంగించారు. ఎడ్యుకేషన్ వీక్ కోఆర్డినేటర్ డాక్టర్ దేవరాజు, అసోసియేట్ డీన్లు శేఖర్ శీలం, డాక్టర్ విఠల్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సర్కారు బడికి సలాం
నిర్మల్నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్మల్ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమై ఈ నెల 19వరకు కొనసాగనున్నా యి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంట ల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2నుంచి సా యంత్రం 5గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 12 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,667 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఫస్టియర్లో 2,078 మంది, సెకండియర్లో 589 మంది పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల వద్ద 144 సె క్షన్ ఉంటుందని, ప్రశ్న పత్రాలను ఆయా కేంద్రాలకు సమీప పోలీస్స్టేషన్లలో భద్రపరిచామ ని డీఐఈవో పరశురామ్ తెలిపారు. పరీక్షల కో సం ఒక్కో ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాల ను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షాకేంద్రాలను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలి పారు. వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని పేర్కొన్నారు. విద్యార్థులు కేంద్రాలకు అ రగంట ముందే చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ పీఎంశ్రీ జె డ్పీహెచ్ఎస్కు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఉ త్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపిక కాగా, సోమవా రం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయుడు జాడీ శ్రీనివాస్ అవార్డు అందుకున్నా రు. నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, క్రమశి క్షణ, ప్రత్యేక బోధన విధానాలతో ఈ పాఠశాల ప్రై వేట్ విద్యాసంస్థలకు దీటుగా నిలిచింది. ప్రస్తుతం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో కొనసాగుతున్న ఇందులో 830మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్ర ధానోపాధ్యాయుడు జాడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వి ద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఉపాధ్యాయులు సాయంత్రం, సెలవు దినాల్లో ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా ఘనత పాఠశాలలో విద్యాప్రమాణాలు, క్రమశిక్షణ, వినూ త్న బోధన విధానాలను గుర్తించిన సర్కారు మస్కాపూర్ బడిని రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా ప్రకటించింది. రూ.లక్ష ప్రోత్సాహక చెక్కు అందజేసింది. అలా గే, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికై సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం విశేషం. పాఠశాలలో ప్రవేశాల కోసం పోటీ పాఠశాలలో ఖగోళ శాస్త్ర ప్రయోగశాల, కంప్యూటర్ ల్యాబ్, వర్చువల్ ల్యాబ్, ఆటస్థలం, ఆర్వో వాటర్ ప్లాంట్ తదితర ఆధునిక సౌకర్యాలున్నాయి. దీంతో అడ్మిషన్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. చదువుతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి కూడా ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర తిరోజూ ధ్యానం, యోగా, క్రీడల్లో శిక్షణ ఇస్తూ ప్రో త్సహిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్, యోగా తదితర క్రీడాంశాల్లో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థా యిల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. దీంతో ఖానాపూర్తో పాటు బాసర, జగిత్యాల, మంచిర్యాల తదితర సుదూర ప్రాంతాల నుంచి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను మస్కాపూర్ పాఠశాలలో చేర్పించేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. గ్రామస్తుల సహకారంతో.. ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు గ్రామస్తులు వలంటీర్లను నియమించి స్థానిక నిధులతో వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు 145 మంది ఎన్ఎంఎస్ఎస్కు ఎంపికయ్యారు. ఈసారి పదో తరగతిలోనూ వందశాతం ఉత్తీర్ణత సాధించాం. కార్పొరేట్ కళాశాలలు, మేధా చారిటబుల్ ట్రస్ట్ కళాశాలకు పలువురు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల అంకితభావం, గ్రామస్తుల సహకారం, విద్యార్థుల కృషితో ఈ విజయాలు సాధించాం. పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంలో గ్రామస్తుల ప్రోత్సాహం ఎంతో ఉంది. – జాడి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు -
‘రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు’
నిర్మల్చైన్గేట్: వడ్లు, మక్కల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కొనుగోళ్లపై పలువురు మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కొనుగోళ్లు వేగవంతంగా పూ ర్తి చేయాలని, హమాలీ లు, గన్నీ సంచులు, ధా న్యం తరలింపునకు లా రీలు, ధాన్యం నిల్వ చే యడానికి తగిన స్థలాల కొరత లేకుండా చూడాలని సూచించారు. ధా న్యం సరఫరాకు అవసరమైతే ట్రాక్టర్లను కూ డా వినియోగించుకోవా లని, తరలింపునకు అ లసత్వం వహించే లారీ ల కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు ధా న్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. సాఫీగా కొనుగోలు ప్రక్రియ కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి వీసీ లో కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మక్కలు, వడ్ల కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలని సూచించా రు. కేంద్రాల్లో ధాన్యం సంచులు నిల్వ ఉంచరాదని తెలిపారు. ధాన్యం తూకం, తరలింపునకు రైతుల నుంచి డబ్బులు వసూలు చేయరాదని పేర్కొన్నా రు. వీసీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారి, మేనేజర్ రాజేందర్, సుధాకర్, మార్క్ఫెడ్ డీఎం మహేశ్, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మి తదితరులున్నారు. -
వేసవి శిబిరాలతో పెరగనున్న నైపుణ్యాలు
నిర్మల్చైన్గేట్: వేసవి శిబిరాలతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతాయని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జుమ్మెరా త్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి న వేసవి శిబిరాన్ని సందర్శించారు. పిల్లలతో ము చ్చటించి వారి వివరాలు, జీవిత లక్ష్యాలు తెలుసుకున్నారు. రోజూ క్యాంపునకు రావాలని, ఆటలు, పాటలు, యోగా, డ్యాన్స్లో శిక్షణ ఇస్తారని వివరించారు. అనంతరం పదోతరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని పరి శీలించారు. అధైర్య పడవద్దని, శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులు కావాలని, ఎలాంటి సందేహాలున్నా ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. లారీల సేకరణ ప్రక్రియ పరిశీలన లక్ష్మణచాంద: సోన్ మండలం గంజాల్ టోల్ప్లాజా వద్ద లారీల సేకరణ ప్రక్రియను కలెక్టర్ భవేశ్ మి శ్రా పరిశీలించారు. లారీ డ్రైవర్లు, యజమానులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని వివరించాలని అధికారులకు సూచించారు. కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరగకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం రవాణాలో జాప్యం జరిగితే సహించబోమని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యా ణి, తహసీల్దార్లు సంతోష్, సరిత, శ్రీనివాస్, రెవె న్యూ, రవాణా, పోలీస్ శాఖల అధికారులున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలి మామడ: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు సూచించారు. మండలంలోని న్యూసాంగ్వి క్రాస్రోడ్డు వద్ద రైతులు, అధికారులతో మాట్లాడారు. లారీలు రావడం లేదని, కూలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు కలెక్టర్కు తెలుపగా.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్రావు ఉన్నారు. -
కో ఆప్షన్.. టెన్షన్ టెన్షన్!
● బల్దియా ఆఫీస్ ఎదుటే బైఠాయింపుభైంసా: భైంసా మున్సిపల్ ‘కో ఆప్షన్’ ఎన్నికల టెన్షన్ తగ్గడం లేదు. చైర్మన్ తుమోళ్ల దత్తాత్రి, వైస్ చైర్మన్ బీబీ కుతిజ సిద్దిఖి, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన మంగళవారం రెండోరోజుకు చేరింది. ఎట్టి పరిస్థితుల్లో కో ఆప్షన్ ఎన్నిక నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక గత నెలలో నిర్వహించగా గందరగోళ పరిస్థితి నెలకొంది. నలుగురు స భ్యులకు గాను ఒక ఎంఐఎం అభ్యర్థి ఎన్నికయ్యారు. మిగతా మూడు స్థానాలకు మంగళవారం ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈనెల 7న పాలకవర్గం కో ఆప్షన్ ఎన్నిక నిర్వహించాలని సిద్ధమైంది. కాగా, సోమవారం రాత్రి 10గంటలకు ఎన్నిక నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ లింగయ్య ఆదేశాలిచ్చారు. ఎన్నిక వాయిదాపై ఎమ్మెల్యే ఆగ్రహం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా వేయడంపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆ గ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిప ల్ కార్యాలయానికి వెళ్లి అక్కడే గేటు వద్ద బైఠాయించిన పాలకవర్గ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం మున్సిపల్ కో ఆప్షన్ ఎ న్నిక నిర్వహించాల్సి ఉండగా సోమవారం రాత్రి 10గంటలకు కమిషనర్ ఆకస్మాత్తుగా వాట్సప్ సందేశం పంపడమేమిటని ప్రశ్నించారు. కో ఆ ప్షన్ ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో కమిషన ర్ చెప్పాలన్నారు. అధికారులు ఎంఐఎంకు అ నుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. కో ఆప్షన్ ఎన్నిక నిర్వహించే వరకు మున్సి పల్ చైర్మన్, కౌన్సిలర్లు బైఠాయిస్తారని, వారికి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. భైంసా బంద్ కో ఆప్షన్ ఎన్నిక వాయిదా వేయడంపై మంగళవారం భైంసా బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భైంసా పోలీసులు మున్సిపల్ కా ర్యాలయంతోపాటు గోల్డ్ మార్కెట్, కుభీర్ చౌర స్తా సమీపంలో బలగాలను మోహరించారు. పాలకవర్గం కొనసాగిస్తున్న నిరసన శిబిరం వద్ద అధికసంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో నిర్వహించారు. సోషల్ మీడియాలో వైరల్ మరోవైపు మంగళవారం మున్సిపల్ చైర్మన్ తుమోళ్ల దత్తాత్రి ఫోన్లో కమిషనర్ లింగయ్యతో మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కో ఆప్షన్ ఎన్నిక ఎందుకు వాయిదా వేశారని, వాయిదా వేయాలని ఎవరు చెప్పారని చైర్మన్ అడగగా.. ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని కమిషనర్ చెప్పారు. తనను హైదరాబాద్లో సీడీఎంఏ అధికారులు పిలిపించడంతో అక్కడికి వెళ్తున్నానని కమిషనర్ తెలిపారు. దీంతో వెంటనే చైర్మన్ సీడీఎంఏ అధికారులతో మాట్లాడగా తాము కమిషనర్ను రమ్మని చెప్పలేదని పేర్కొనంతోపాటు పలు సంభాషణలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పాలకవర్గ సభ్యులను ఇరకాటంలో పెట్టేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయంటూ పట్టణ ప్రజలు బాహాటంగానే చర్చిస్తున్నారు. కో ఆప్షన్ ఎన్నిక జరపాలని ఈనెల 7న నిర్ణయించగా 11న రాత్రి 10గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం వెనుక ఎవరున్నారన్నది పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొంత మంది కౌన్సిలర్లు కో ఆప్షన్ ఎన్నిక వాయిదా వేసిన విషయంపై నిర్మల్కు వెళ్లి కలెక్టర్ను కలిశారు. ఎన్నిక వాయిదా తదనంతరం జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. -
జిల్లా కవులకు సత్కారం
నిర్మల్ఖిల్లా: భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం కవి సమ్మేళ నం నిర్వహించింది. తెలంగాణ రచయితల వే దిక జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హన్మంతు, కవియా త్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కారం శంకర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, కవి, రచయిత మడిపల్లి రాజ్కుమార్ కవితాగానంతో ఆకట్టుకున్నారు. పర్యాటక, సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏపూరి నర్సింహ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి వీరిని శాలువాలతో సత్కరించి ప్ర శంసాపత్రాలు అందజేశారు. వీరికి జిల్లాకు చెందిన సాహితీవేత్తలు శివప్రసాద్, జగదీశ్వర్, భీమేశ్ తదితరులు అభినందనలు తెలిపారు. -
శరీరం గొప్పతనం తెలుసుకున్నా..
మానవ శరీర అవయవాల పనితీరు గురించి మేక ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీసుకువచ్చి ప్రత్యక్షంగా చూపించారు. మానవుని అవయవాలు ఈవిధంగా ఉంటాయని తెలుసుకున్నాం. గుండెలో ఉండే గదులు, రక్తం పంపింగ్ చేసే విధానాన్ని ఉపాధ్యాయుడు నాగవర్మ చూపించారు. మూత్రం ఫిల్టర్ ఎలా అవుతుందో తెలిసి పోయింది. మానవ శరీరం గొప్పతనం తెలుసుకున్నాం. – ఎం.అనీష్, పదోతరగతి, మంచిర్యాల కిరణ చిత్రాలు గీయించారు ముందు తరగతుల్లో సై న్స్ నేర్చుకునేలా తర్ఫీదు ఇచ్చారు. సమతల దర్ప ణం, గోళాకార దర్పణా లను ఉపయోగించి కాంతి ధర్మాలైన పరావర్తనా న్ని వక్రీభవనాన్ని వివరించారు. మాతో కిరణ చిత్రాలు గీయించారు. ప్రతిబింబాలు ఎలా ఏర్పడుతాయో ప్రయోగపూర్వకంగా చూశాం. వక్రీభవన గుణకం వల్ల కొన్ని వస్తువులు ఒకదాంట్లో మరొకటి ముంచినప్పుడు కనిపించక పోవటానికి కారణం తెలుసుకున్నా. – యోగేశ్వర్, దోనబండ జెడ్పీహెచ్ఎస్ -
15న మెగా జాబ్మేళా
కైలాస్నగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 15న ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా భారీ మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంఽధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ పీవో సహకారంతో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేళాలో టెక్ మహీంద్రా, హెటెరో, అపోలో ఫార్మసీ, ముత్తూట్ ఫైనా న్స్, స్టార్టెక్ వంటి సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫార్మసీ విభాగాల్లో వందలాది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులని, ఆసక్తి గలవారు 15న ఉదయం 10 గంటలకు విద్యార్హత ధ్రు వీకరణ పత్రాలతో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9989717139, 9494559027, 9553141962 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
మొక్కజొన్న తరలించాలని ఆందోళన
ముధోల్: మండలంలోని కారేగాం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేశారు. అయితే విక్రయించిన మొక్కజొన్న సంచులను అధికారులు గోదాములకు తరలించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో అకాల వర్షాలకు తడిసిపోతున్నాయి. దీంతో మొక్కజొన్న తరలించాలని భైంసా–బాసర రహదారిపై సోమవారం గంటపాటు రైతులు రాస్తారోకో చేశారు. ఎస్సై బిట్లా పెర్సిస్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. తమకు అధికారులు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పీఏసీఎస్ సీఈవో భూమయ్య, మార్క్ఫెడ్ డీఎంతో ఫోన్లో మాట్లాడించినా ఆందోళన విరమించలేదు. తహసీల్దార్ శ్రీలత వచ్చి లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోలో సర్పంచ్ మోత్రే నారాయణ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేత కై రి సాయి మోహన్ పాల్గొన్నారు. -
పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి
బెల్లంపల్లి: పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష కోసం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్, బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్ సోమవారం సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, గంట ముందుగానే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు. నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వివరాలు బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బజారు ఏరియా బ్రాంచ్ హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,171 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 619 మంది బాలురు, 552 మంది బాలికలు ఉన్నారు. మంచిర్యాలలో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జెడ్పీ హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సాయికుంట), జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గర్మిళ్ల), శ్రీ చైతన్య హైస్కూల్, అల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ కేంద్రాల్లో 2,364 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో బాలురు 1,257 మంది, బాలికలు 1,107 మంది ఉన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల (బెండారా)ఆసిఫాబాద్, మాతృశ్రీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,064 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. -
సమ్మర్ సెలవులు.. సృజనకు నెలవు
పీఎంశ్రీ బడుల్లో సమ్మర్ క్యాంపు షురూమంచిర్యాలఅర్బన్: జిల్లాలోని పీఎంశ్రీ సర్కారు పాఠశాలల్లో సోమవారం నుంచి సమ్మర్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుని వివిధ కార్యక్రమాల్లో రాణించేలా శిబిరంలో శిక్షణ ఇస్తారు. జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకత, కళలు, క్రీడలు, జీవన నైపుణ్యాలు నేర్పిస్తారు. ఒక్కో పాఠశాలకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు రవాణా భత్యం ఇవ్వనున్నారు. ఆర్ట్ అండ్ క్రాప్ట్, యోగా, ధ్యానం, చెస్, డ్యాన్స్, ఇండోర్ గేమ్స్, గణితం, స్పోకెన్ ఇంగ్లిష్, సైన్స్ ప్రయోగాలతో పాటు పలు అంశాలపై తర్ఫీదు ఇవ్వనున్నారు. అట్టహాసంగా ప్రారంభం జిల్లా కేంద్రంలోని టీజీఎంఎస్లో సోమవారం సమ్మర్ క్యాంపు అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంఈవో మాలవీదేవి శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగాతో పాటు కంప్యూటర్ బేసిక్ అంశాలపై ఇచ్చే శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ సత్తయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ బుచ్చన్న, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సైన్స్ సెంటర్లో 15 రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. విభిన్న రకాల్లో ఎక్స్పర్మెంట్స్ చేసి సైన్స్ విజ్ఞానంపై ప్రత్యేకమైన ఆసక్తి పెంచుకున్నారు. ఉపాధ్యాయులు, ట్రైనర్లు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించారు. సమ్మర్ క్యాంపులో కొత్త స్నేహితులను కలుసుకున్నారు. జట్టు భావన పెరిగింది. భవిష్యత్లో నూతన ఆవిష్కరణలు చేసి మంచి శాస్త్రవేత్తగా ఎదుగుతామన్న నమ్మకం వారిలో కలిగింది. సమ్మర్ సైన్స్ క్యాంపు ముగిసిన నేపథ్యంలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలు వారి మాటల్లోనే.. – మంచిర్యాలఅర్బన్ -
మస్కాపూర్ పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ పాఠశాల కు రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. రాష్ట్ర ఉత్తమ పీ ఎంశ్రీ పాఠశాలగా ప్రకటించగా, పాఠశాల ప్రధానో పాధ్యాయులు జాడి శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. హైదరాబాద్ రవీంద్రబారతిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల హెచ్ఎం శ్రీనివాస్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. జాడి శ్రీనివాస్ సారథ్యంలో పాఠశాలలో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబర్చారు. బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో మస్కాపూర్ పాఠశాల విద్యార్థులకు సీట్లు దక్కాయి. గణిత ఒలింపియాడ్లో విద్యార్థులను రాష్ట్రస్థాయిలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. -
ఆర్జీయూకేటీలో డిజిటల్ విప్లవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ సోమవారం డిజిటల్ తరగతి గదులు ప్రారంభించారు. స్మార్ట్ బోధనా వనరులు, హైక్వాలిటీ ఆడియో విజువల్ వ్యవస్థ, సమగ్ర డిజిటల్ మౌలిక వసతులతో తరగతి గదులను రూపొందించారు. ఒకేసారి సుమారు 300 మంది విద్యార్థులు లైవ్ తరగతుల్లో పాల్గొనే విధంగా వీటిని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా బోధనా విధానాల్లో మార్పులు తీసుకురావడం అత్యవసరమన్నారు. కార్యక్రమంలో భాగంగా బోధన, బోధనేతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధి, సాంకేతిక ఆధారిత విద్యా విధానాల అమలు, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతుల కల్పన దిశగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
ఆశ వర్కర్ల ధర్నా
నిర్మల్టౌన్: ఆశ వర్కర్లు తమకు మార్చి, ఏప్రిల్ నెలల పారితోషికాలు ఇవ్వాలని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ భవేశ్మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు ప్రతినెలా ఒకటో తేదీన పారితోషికాలు చెల్లించాలని కోరారు. రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1,500 పారితోషికాలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధ)జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, సుగుణ, జిల్లా సహాయ కార్యదర్శి రామలక్ష్మి, కమిటీ సభ్యులు అనసూర్య, భాగ్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి
ముధోల్: ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. సరదాకు చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లిన ఇద్ద రు బాలురు నీటమునిగి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపిన వివరాల ప్రకారం... తానూర్ మండలం కోలూర్ గ్రామానికి చెందిన నిఖిల్ (15), మ హారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన స్వరాజ్ (15) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన విఠోలి గ్రామానికి వచ్చారు. సోమవారం ఉదయం ఇద్దరూ కలిసి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. గమనించిన గ్రామస్తులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రా మస్తుల సహాయంతో మృతదేహాలను బయటకు తీ యించారు. పంచనామా అనంతరం భైంసా ఏరి యా ఆస్పత్రికి తరలించారు. నిఖిల్ తల్లి ఇచ్చిన ఫి ర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేకే 5 గనిలో కేబుల్ చోరీ మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిలో విలువైన కేబుల్ చోరీకి గురైనట్లు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ నగునూరి రవి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఏడుగురు దొంగలు గని ఆవరణలో ఉన్న 10 మీటర్ల కేబుల్ను ఎత్తుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించగా సీసీ పుటేజీ పరిశీలించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంభీమిని: మండలంలోని పెద్దపేటలో సోమవారం అరికిల విజయకు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు సోమవారం విజయ బంధువుల ఇంటికి వెళ్లగా ఆమె కుమారులు శ్రీకాంత్, శ్రీనాథ్ బెల్లంపల్లికి వెళ్లారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో షార్ట్సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో ఇంటి నిర్మాణం కోసం చేను అమ్మగా వచ్చిన రూ.12 లక్షల నగదు, తులం బంగారం, స్టడీ సర్టిఫికెట్లు, నిత్యావసరాలు, సా మగ్రి దగ్ధమయ్యాయి. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. స్వరాజ్ మృతదేహం నిఖిల్ మృతదేహం -
శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
మామడ: వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని డీఈవో భోజన్న అన్నారు. మండలంలోని కొరిటికల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. శిక్షణ శిబిరంలో యోగా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, నా యకత్వ లక్షణాలు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోతే రాజ్వేర్, హెచ్ఎం వెంకటరమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జుమ్మేరాత్ పాఠశాలలో.. నిర్మల్ రూరల్: సమ్మర్ క్యాంపులను విద్యార్థులు వినియోగించుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని జుమ్మేరాత్పేట్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సంబర్ క్యాంప్ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 10 పీఎంశ్రీ పాఠశాలల్లో సోమవారం శిబిరాలు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలను వివరించారు. క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందని తెలిపారు. -
ఆదివాసీ పల్లెలు మారేనా!
ఇంద్రవెల్లి: ఏళ్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆదివాసీ పల్లెల గతి మారనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మౌలిక వసతులు, రవాణా, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డ ఆదివాసీల సమస్యలు త్వరలో పరిష్కారం కానున్నాయి. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి త్వరలో సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. ఈనెల 20 తర్వాత పర్యటించనున్నారు. ఆయన రాకతో హీరాపూర్ జీపీ పరిధిలోని ఏడు గ్రామాల అభివృద్ధి రూపురేఖలు మారుతాయని, వడగామ్ ప్రాజెక్టు మంజూరు చేస్తారని ఆదివాసీలు, ప్రజలు, రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, చే లల్లో సోలార్ పంపు సెట్లు, గ్రామాలకు రోడ్లు, హీరపూర్లో ఆరోగ్య సబ్ సెంటర్, పశు వైద్యశాఖ మంజూరవుతాయని ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శాఖలవారీగా అధికారులు సర్వే చేపట్టారు. రైతులు, కుటుంబాలు, జనాభా, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. అభివృద్ధి పనులు పూర్తిచేసి ముఖ్యమంత్రితో ప్రారంభించనున్నారు. వడగామ్ ప్రాజెక్టుపై గంపెడాశలు వడగామ్ ప్రాజెక్టు మంజూరుపై ఆదివాసీలు, ప్రజలు, రైతులు ఆశలు పెట్టుకున్నారు. 2005లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్టుపై అధికారులతో ఏరియల్ సర్వే చేయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, స్వయంగా సీఎం రేవంత్రెడ్డి రానుండడంతో వడగామ్ ప్రాజెక్టు మంజూరు చేస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు. అధికారంలో రాగానే వస్తానని.. రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉన్న సమయంలో 2021 ఏప్రిల్ 20న హీరాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీలతో ప్రత్యేకంగా సమావేశమై వారితో భోజనం చేశారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం హోదాలో మరోసారి హీరాపూర్ గ్రామానికి వస్తానని వారికి మాటిచ్చారు. ఆ ప్రకారం ఏప్రిల్ 6న జిల్లా పర్యటనలో భాగంగా పిప్పిరి గ్రామంలో పర్యటించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్, మాజీ ఎంపీ సోయం బాపురావ్, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా అధికారులను పిలిచి..తాను మే నెలలో పర్యటిస్తానని చెప్పారు. అక్కడి సమస్యలపై గ్రామస్తులతో చర్చించి తనకు నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఖానాపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ.. హీరాపూర్లో ఆదివాసీలతో సమావేశమయ్యారు. ఇటీవల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. ఐటీడీఏ పీవోతో హాజరై ఆదివాసీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 6న టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఈ గ్రామాన్ని సందర్శించి సోలార్ విద్యుత్ సరఫరాపై అధికారులతో చర్చించారు. ఐటీడీఏ ద్వారా రైతుల చేలల్లో వందశాతం సోలార్ పంపు సెట్లు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హీరాపూర్ ఆవాస ఏడు గ్రామాల్లో రూపురేఖలు మారనున్నాయి. -
జనగణనలో భాగస్వాములవ్వాలి
నిర్మల్టౌన్: జనగణన ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జనగణన ప్రచార వాహనాన్ని సోమవారం జెండాఊపి ప్రారంభించారు. ప్రచార వాహనం ద్వారా జిల్లాలో ప్రజలకు జనగణన ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆదివారంతో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ముగిసిందని, జిల్లాలో సుమారు 20 వేల మంది స్వయంగా వివరాలు ఆన్లైన్లో నమో దు చేశారని వివరించారు. ప్రజలంతా అధికారులకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. వివరాలన్నీ పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గణన గడువులోగా పూర్తిచేయాలి.. నిర్మల్రూరల్: జన గణన ప్రక్రియలో భాగమైన హౌస్ లిస్టింగ్ నిర్ణీత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ మండలం తల్వేద గ్రామంలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ తీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియలో ఇళ్ల గణన అత్యంత కీలకమన్నారు. నిర్ణీత గడువులోగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని వివరించారు. నిబంధనల ప్రకారం జనగణనకు సంబంధించి ఇంటి నంబర్లను కేటాయించాలని పేర్కొన్నారు. ఎండలు అధికంగా ఉన్నాయని, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హౌస్ లిస్టింగ్ చేపట్టాలన్నారు. సీపీవో జీవరత్నం, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీవో శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ లక్ష్మి పాల్గొన్నారు. ఓటరు మ్యాపింగ్ పూర్తి చేయాలి నిర్మల్టౌన్: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు ప్రోజెని మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్న్స్లో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
నిర్మల్
అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరిచేరని రోజులివీ. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిది. కానీ, ఏ సంబంధం లేకపోయినా.. ఆస్పత్రిలో అచేతన స్థితిలో ఉన్నవారికి సపర్యలు చేస్తారు. అవసాన దశలో ఉన్నా మేమున్నామని.. మీకేం కాదని భరోసా ఇస్తారు. చిరునవ్వుతో దేవదూతల్లా ధైర్యం చెబుతారు. నేడు నర్సింగ్ డే సందర్భంగా కథనం. – నిర్మల్చైన్గేట్అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి నిర్మల్టౌన్: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా అనారోగ్యం బారినపడి ఆస్పత్రుల్లో చేరిన వారిని అమ్మ కన్నా మిన్నగా నర్సులు చూసుకుంటున్నారు. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ, చిరునవ్వులు చిందిస్తూ వారు అందించే సేవలు నిరుపమానం. రోగి అవసరం ఏదైనా చిటికెలో తీర్చడమో, తీర్చేందుకు ప్రయత్నించడమో చేస్తూ పేషెంట్లకు భరోసా కల్పిస్తారు. రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు నర్సులు. కుటుంబసభ్యులు చేయలేని సేవలు.. రోగంతో బాధపడుతూ, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రుల్లో చేరిన వారికి మేమున్నామని ఆదరణ, ఆప్యాయతతో ధైర్యం చెప్పే వారే నర్సులు. కుటుంబసభ్యులు కూడా చేయలేని సేవలను ఆస్పత్రుల్లో రోగులకు నర్సులు చేస్తున్నారు. అపస్మారక స్థితిలో వైద్యం అందుకుంటున్న వారిని కూడా నర్సులు ప్రేమగా చూసుకుంటున్నారు. జిల్లాలో ఏళ్లుగా నర్సింగ్ వృత్తిలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న కొందరి నర్సుల అభిప్రాయాలు వారి మాటల్లో.. -
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ఉట్నూర్రూరల్: గ్రీవెన్స్లో ప్రజల నుంచి వ చ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధి కారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వి విధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నార్నూర్ మండలం జాండా గ్రామానికి చెందిన మడావి హ ను ఆ ర్థికసాయం మంజూరు చేయాలని, ఇంద్రవెల్లి మండలం వాల్గొండకు చెందిన కనక చందు వ్య వసాయ క్షేత్రానికి బోర్వెల్ మంజూరు చేయాలని, ఇచ్చోడ మండలం నర్సాపూర్కు చెందిన శ్రీదేవి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చే యాలని, తిర్యాణి మండలం మార్కగూడకు చెందిన గోదావరి ఉపాధి కల్పించాలని అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. -
అర్జీల పరిష్కారంలో ఆలస్యం వద్దు
నిర్మల్టౌన్: ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారంలో ఆలస్యం చేయవద్దని కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వస్తున్నారని, వారి వినతులపై అధికారులు సానుకూల దృక్పథంతో స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లావ్యాప్తంగా విద్యా వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మండల ప్రత్యేక అధికారులు చురుకుగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 15న నిర్వహించనున్న ‘లైబ్రరీ డే’ సందర్భంగా అధికారులు పెద్ద ఎత్తున పుస్తకాలను వితరణ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాది భైంసా మండలం సుంకుల్లి గ్రామం. 20 ఏళ్ల క్రితం ఎస్పారెస్పీ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయాం. అప్పటి అధికారులు మా సొంత గ్రామమైన లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీలో సర్వే నంబర్ 396/5లో ఐదు ఎకరాలు డీవన్ పట్టాగా మాకు ఇచ్చారు. కానీ ఇప్పటికీ పట్టా పాస్బుక్ ఇవ్వలేదు. దీంతో ఆ భూమి సాగుచేసుకోకుండా స్థానికులు అడ్డుకుంటున్నారు. పట్టా పాస్ పుస్తకం 20 ఏళ్లుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న. నా వయసు 80 ఏళ్లు.. నేను చనిపోయే లోపైనా పట్టా పాస్బుక్ ఇప్పించండి – బూరుగుపల్లి సాయన్న, కొడుకు మురళి -
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించవద్దు
నిర్మల్టౌన్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించవద్దని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేసే విత్తనాలు నాణ్యమైనవన్నారు. ధర తక్కువగా ఉండడంతో పాటు దిగుబడి కూడా అధికంగా ఉంటుందన్నారు. అనుమతులు లేని ప్రైవేట్ విత్తన కంపెనీలు రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్నాయన్నారు. సహకార, మహిళా సంఘాలు విత్తన సంస్థ యొక్క విత్తనాలు రైతులకు అందించాలని సూచించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ విత్తనాభివృద్ధి సంస్థ తయారుచేసే విత్తనాలు నాణ్యత పరీక్షల తర్వాత విపణిలోకి వస్తాయన్నారు. ఈ విత్తనాలు సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందుతారన్నారు. రైతులు ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు వినియోగించేలా డీలర్లు ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు అంజిప్రసాద్, శ్రీధర్, డీఆర్డీవో విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్లు భీమ్రెడ్డి, అబ్దుల్ హాది, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, ఇతర అధికారులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు. -
ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం
మూఢ నమ్మకాల వెనుక ఉన్న నిజాలను సైన్స్ ద్వారా తెలుసుకున్నా. వాటిని నమ్మకుండా శాసీ్త్రయ దృక్పధంతో ఆలోచించడం అవసరమని తెలుసుకున్నా. బ్యాటరీ తీగను ఉపయోగించి మాతో మోటర్ తయారు చేయించారు. అది తిరిగినప్పుడు మా ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. బల్పులను శ్రేణిలో సమాంతరంగా ఎలా కలుపుతారో నేర్పించారు.– కె.స్రవంతి, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్, మంచిర్యాల సైన్స్ సూత్రం తెలుసుకున్నా.. ఫన్ ఆక్టివిటీస్తో పాటు రసాయన చర్యల రకాలు వివరించారు. ఆమ్లాలు, క్షారాలు ఏవిధంగా గుర్తించాలో నేర్చుకున్నా. సాంద్రత అనేది వస్తువు నీటిలో మునగటానికి కారణమని గుర్తించా. ఫన్ ఆక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆనందం వేసింది. స్వాములు, బాబాలు చేసే మ్యాజిక్ వెనుక ఉన్న సైన్స్ సూత్రం తెలుసుకున్నా. అవి మంత్రాలు, తంత్రాలు కాదని, వాటిని నమ్మకూడదని సైన్స్ శిబిరం ద్వారా తెలుసుకున్నా. –మణికార్తీక, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్, మంచిర్యాల -
బయట ఎండలు.. ఇంట్లోనే ఆటలు
భలే భలే.. బొమ్మ ట్రాక్టర్ బొమ్మట్రాక్టర్తో ఆడుతున్న బాలుడు బండాట ఆడుతున్న చిన్నారులుదండేపల్లి: వేసవిలో ఎండను సైతం లెక్కచేయకుండా చిన్నారులు ఆటలు ఆడుతుంటారు. పెద్దలు ఇళ్లల్లో చేసే పనులను అనుకరించి ఆటలు ఆడుతుంటారు. వంటింట్లో చేసే పనులను పిల్లలు దండేపల్లి ఇంటి ఆవరణలో అన్నం, కూర ఆట ఆడుతుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. చెన్నూర్: వేసవికాలం వచ్చిందంటే చాలు చిన్నారులు ఆటల్లో నిమగ్నమవుతారు. నలుగురు పిల్లలు ఒకేచోట చేరితే వారికి నచ్చిన ఆటలు ఆడుతూ ఆనందిస్తుంటారు. చిన్న మట్టికుండ ఆకారం ఉండే గురిగేలో మట్టి పోసి మరో డబ్బాతో మట్టి కొలిచే ఆట ఆడుతున్నారు. దీన్నే మట్టిలో గురిగే అంటారు. చెన్నూర్లోని బట్టిగూడెం కాలనీలో చిన్నారులు ఈ ఆట ఆడుతూ కనిపించారు. బండాటమట్టిలో గురిగే ఆటలుచెన్నూర్రూరల్: వేసవి సెలవుల్లో చిన్నారులు ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. మరికొందరు చెట్లనీడన, ఇంటి పట్టున బండాట ఆడుతున్నారు. చెన్నూర్ మండలం శివలింగాపూర్ వద్ద ఇద్దరు చిన్నారులు ఒక పెట్టెకు తాడు కట్టి ఒకరు అందులో కూర్చోగా మరొకరు తాడుతో లాగుతూ ఆడుకుంటున్నారు.దండేపల్లి: వేసవి వచ్చిందంటే చాలు..పిల్లల లోకమే వేరు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇంటి ఆవరణలే వా రికి ఆటస్థలాలు. దండేపల్లిలోని ఓ వీధిలో బాలుడు బొ మ్మ ట్రాక్టర్కు తాడు కట్టి అటు, ఇటు నడిపిస్తూ ఆడుకుంటూ కనిపించాడు. పెద్ద ట్రాక్టర్లతో చేసే పనులను పి ల్లలు తమ ఆటల్లో అనుకరిస్తూ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.అన్నం, కూర ఆట.. ఎండలు మండిపోతుండటంతో మైదానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలు నీడపట్టున ఉండి ఆటలు ఆడుతున్నారు. ఇంట్లో ఆడుకునే క్యారం, చెస్, అష్టాచెమ్మా తదితర ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఎండ సమయంలో ఇంట్లోనే ఆడుతూ, ఇంటినే ఒక స్టేడియంలా మార్చేస్తున్నారు. సెల్ ఫోన్లకు దూరంగా, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుతున్న ఈ ఆటలు చిన్నారుల మేధస్సుకు పదును పెట్టడమే కాకుండా, ఎండలో తిరగకుండా వారిని నివారిస్తున్నాయి. – దండేపల్లి -
గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్
నార్నూర్: మండలంలోని మల్లంగి ఎస్సీగూడ గ్రా మంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్సై ఎస్. శ్రీసాయి తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చలక్క ర్ జయరాం తన ఇంటి పెరట్లో గంజాయి సా గు చేస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో 5 గంజాయి మొక్కలతో పాటు 700 గ్రాముల ఎండిన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 50 గంజాయి కేసులు నమోదు చేసినట్లు పో లీసులు వెల్లడించారు. 15 కిలోల ఎండు గంజా యి, 638 గంజాయి మొక్కలను స్వాధీనం చే సుకున్నామని, 103 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.67 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. -
దాబాలు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు
భైంసా: పట్టణ పరిధిలోని దాబాలు, లాడ్జీల్లో ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించా రు. దాబాలు, లాడ్జీలకు వచ్చేవారి వివరాలు స రిగా నమోదు చేస్తున్నారా? లేదా? అని తెలు సుకున్నారు. లాడ్జీలు, దాబాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన అధి కారులు సీసీ కెమెరాలు సరిగా ఏర్పాటు చేశారా? అవి పనిచేస్తున్నాయా? అనే విషయాలపై ఆరా తీశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపి స్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజల భద్రత ను దృష్టిలో ఉంచుకుని దాబా, లాడ్జిలో నాణ్య మైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏఎస్పీ సాయికిరణ్ సూచించారు. తనిఖీల్లో సీఐ సాయికుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
బాసర క్షేత్రానికి కొత్త శోభ
బాసర: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. రూ.225 కోట్లతో రూపొందించిన మాస్టర్ప్లాన్ అమలుపై రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు ఆదివారం క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ భవేశ్ మిశ్రా ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మీ ఆలయం, వ్యాసగుహ, భక్తుల వసతి సముదాయాలను పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ప్రపంచస్థాయి సదుపాయాలు, పార్కింగ్, క్యూలైన్లు, తాగునీరు, వసతి తదితర వసతులు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. వారి వెంట సబ్ కలెక్టర్ సంకేత్కుమార్, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, బాసర ఎస్హెచ్వో, సీఐ కిరణ్, ఇంజినీరింగ్ అధికారులున్నారు. -
బ్రహ్మేశ్వరాలయానికి వ్యాసుడు వచ్చేదట..!
మీకు తెలుసా..? లోకేశ్వరం: ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా పేరొందింది బ్రహ్మేశ్వరాలయం. పవిత్ర గో దావరి నది ఒడ్డున వెలసిన ఈ ఆలయం మండలంలోని కన్కపూర్ గ్రామ సమీపంలో ఉంది. క్రీస్తు పూర్వం వేదవ్యాసుడు ఈ ఆలయానికి వచ్చి వెళ్లేవాడని పూర్వీకులు చెబుతుంటారు. దాదాపు 1900 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని ని ర్మించారని, కాకతీయుల కాలంలో రాణి రు ద్రమ దేవి వివాహం ఇక్కడే జరిగినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. ఆలయ సమీపంలో గో దావరి నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుండటంతో ఇక్కడ స్నానాలు ఆచరిస్తే సకల రోగాలు న యమవుతాయని ప్రతీతి. ఏడాదిలో కొన్ని రో జుల పాటు సూర్యకిరణాలు ఆలయంలోని శివలింగాన్ని తాకుతాయి. ఇక్కడ ఐదు వృక్షాలు ఒకే కాండం సమూహంగా పెరగడంతో ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. ఇక్కడ శివలింగంతో పా టు నాగ దేవత, గణపతి, ఆంజనేయ, నవగ్రహ విగ్రహాలు ప్రతిష్టించారు. ఆలయ చరిత్ర ఒక శిలపై దేవనాగ లిపిలో చెక్కి ఉండడం గమనా ర్హం. ప్రతీ ఏడాది శివరాత్రి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. -
బాల్యానికి మూడు‘ముళ్లు’!
ప్రేమ పేరిటే అధికంనిర్మల్: బడికి వెళ్లాల్సిన బాలిక పెళ్లి పీటలెక్కుతోంది. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని వయస్సులో ఆలిగా, తల్లిగా బాధ్యతలు మోస్తోంది. సంసారం అంటే తెలియని వయస్సులోనే కష్టాల కాపురం చేస్తోంది. ఇలాంటి బాలికా వధువులను కాపాడటానికి, బాల్యవివాహాలను అడ్డుకో వడానికి జిల్లా అధి కార యంత్రాంగం శా యశక్తులా ప్రయత్ని స్తోంది. అయినా.. ఇ ప్పటికీ జిల్లాలో బాల్య వివాహాలు కొనసాగుతుండటం కలవరానికి గురి చేస్తోంది. కారణాలనేకం.. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహనలోపం, ఆడపిల్లలు ఎక్కువగా ఉండి భారం దించుకోవాలని తల్లిదండ్రులు భావించడం ఇలాంటివన్నీ మైనర్ల పెళ్లిళ్లకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రేమ వివాహాలపై మోజుతోనూ ఇటీవల చాలామంది బాల,బాలికలు తప్పుదారి పడుతున్నారు. మరోవైపు తమ పిల్లలు ప్రేమవివాహాలు చేసుకోవద్దన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు విషయం తెలియగానే వారి వయస్సు గురించి ఆలోచించకుండా ఇతరులతో పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ప్రస్తుతం జి ల్లాలో ఇలాంటి బాల్యవివాహాలే ఎక్కువగా జరుగు తుండడం గమనార్హం. అందరిపైనా కేసులు.. రెండేళ్ల జైలు బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చట్టాలు చెబుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు కఠిన నిబంధనలున్నాయి. 18ఏళ్లు నిండని బాలిక, లేదంటే 21 ఏళ్లు నిండక ముందే యువకుడు పెళ్లి చేసుకోవడానికి వీలులేదు. ఇలాంటి వివాహాలు జీవో ఎంఎస్ 13.2012 ప్రకారం నేరం. చట్టాన్ని అతిక్రమించి బాల్య వివాహాలు చేస్తే బాధ్యులైన వారికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా, ప్రత్యేక సందర్భాల్లో ఈ రెండింటినీ ఒకేసారి విధించే అవకాశముంది. ఇక బాల్యవివాహం జరిపినా, నిర్వహణలో భాగమైనా, చివరకు ప్రోత్సహించినా శిక్ష విధించే వీలుంది. దీనిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. బాల్యవివాహాలు చేసే ఫంక్షన్హాళ్లు, మతపెద్దలు, చివరకు క్యాటరింగ్ చేసేవారిపైనా కేసులు పెట్టే అవకాశముంది. తెలిస్తే 1098కు ఫిర్యాదు చేయొచ్చు బాల్యవివాహాలను అడ్డుకునేందుకు గ్రామాలు, ప ట్టణాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానికంగా జరిగే వివాహాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ఈ కమిటీల్లో గ్రామాల్లో సర్పంచ్, ప ట్టణాల్లో కౌన్సిలర్, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యక ర్త, పోలీస్, ఏఎన్ఎం సభ్యులుగా ఉంటారు. బాల్య వివాహం జరిగినట్లు సమాచారం వస్తే వెంటనే వారు ఉన్నతాధికారులకు తెలిపి వారి ద్వారా అవగాహన కల్పించి అడ్డుకుంటున్నారు. ఇక ఎవరైనా, ఎక్కడైనా మైనర్లకు వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే.. 1098 (చైల్డ్ హెల్ప్ లైన్) టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం బాల్యవివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టప్రకారం నేరం. మైనర్లకు పెళ్లి చేస్తే వారి ఆరోగ్యంతోపాటు జీవితంపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇలాంటివి సమాజంలో ప్రతిఒక్కరూ అడ్డుకోవాలి. – వినూత్న, జిల్లా సంక్షేమాధికారి అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. సమాచారం అందిన వెంటనే వెళ్లి మైనర్ల పెళ్లిళ్లను నిలిపివేస్తున్నాం. వారితో ఒప్పంద పత్రాన్నీ రాయిస్తున్నాం. చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేయిస్తున్నాం. – మురళి, జిల్లా బాలల సంక్షేమాధికారి సమన్వయంతో అడ్డుకట్ట జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతతో వ్యవహరించి 2025లో 12, 2026లో ఇప్పటివరకు 9 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వీటిలో కొన్ని కేసులు నమోదు కాగా.. మరికొన్ని విచారణలో ఉన్నాయి. ముందస్తుగా ప్రత్యేక దృష్టి సారించడం, సమర్థంగా సక్రమమైన సమాచారం సేకరించడం, ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించడం తదితర ప్రధాన అంశాలతోపాటు యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించడంతోనే బాల్యవివాహాల నిలిపివేత సాధ్యమవుతోందని జిల్లా అధికారులు చెబుతున్నారు.బాల్య వివాహాల్లో తల్లిదండ్రుల తప్పిదాలు ప్రధాన కారణమై తే.. ఇటీవల ప్రేమ అనే ఆకర్షణకు లోనవుతూ తమంతట తామే చాలామంది మైనర్లు అనర్థాలు కొనితెచ్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులను ఏమార్చి పెళ్లి పీటలెక్కుతున్నారు. ఆ తర్వాత తప్పిదాలు తెలుసుకుంటున్నా.. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. జిల్లాలోని ఓ గ్రామంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులను కాదని తాను ఇష్టపడ్డ వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకుంది. పరీక్షలూ పాసైంది. కానీ, ఆమె పైచదువు కొనసాగించడానికి భర్త అడ్డుచెప్పాడు. దీంతో చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇలా తెలిసీతెలియని వయస్సులో పలువురు మైనర్లు నిండు జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. -
ఘనంగా ప్రతిష్ఠాపనోత్సవాలు
ఖానాపూర్: మండలంలోని గోడలపంపు గ్రామ ఎస్సీ కాలనీలో పోచమ్మ విగ్రహ ప్రతి ష్ఠాపనోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు సదరు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. బోనా లు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, సంప్రదాయ ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భైంసా మండలంలో పేండ్పెల్లిలో.. భైంసారూరల్: మండలంలోని పేండ్పెల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే విఠల్రె డ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ స్వా మి విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. దారి పొడవునా జై శ్రీరామ్, జైహనుమాన్ నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో హనుమా న్ దీక్షాపరులు భక్తి గీతాలు ఆలపించారు. సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దరోడ్లు.. పెంచేదెప్పుడో!
నిర్మల్బాసర క్షేత్రానికి కొత్తశోభ బాసర సరస్వతీ ఆలయం అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. రూ.225 కోట్లతో మాస్టర్ప్లాన్ అమలుకు అధికారులు క్షేత్రాన్ని పరిశీలించారు. గజ్జలమ్మా.. దీవించమ్మా.. కుంటాల: కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అ ర్చకుడు శ్రీకాంత్ రామానుజదాస్ ఆధ్వర్యంలో గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవా ర్లకు అలంకరణ, అభిషేకం, అర్చన, హారతి, పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు అమ్మవార్ల కు బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. సమయం.. సగం తగ్గుతుందినిర్మల్: జిల్లా నుంచి ఎటు వెళ్లాలన్నా.. రోడ్డు మార్గ మే దిక్కు. దశాబ్దాలు గడిచిపోతున్నా రైలు మనవైపు రావడం లేదు. ఇప్పట్లో వస్తుందన్న ఆశలూ జిల్లావాసుల్లో లేవు. ఇక ఉన్న జాతీయ రహదారులనైనా విస్తరిస్తే.. కాస్తయినా దూరభారం, సమయం తగ్గుతుందని ఎప్పటి నుంచో జిల్లావాసులు అడుగుతున్నారు. కానీ.. ఈ దిశగా దృష్టిపెట్టి, జిల్లావాసుల కష్టాలను తీర్చాలన్న పట్టింపు స్థానిక నేతల్లో కని పించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆది వారం తన పర్యటనలో పలు అభివృద్ధి పనుల కో సం రూ.9,377కోట్లు కేటాయించారు. ఇందులో జి ల్లా వైపు ఒక్కరూపాయి కూడా రాలేదు. రైల్వేలైన్తో పాటు నేషనల్ హైవేల విస్తరణ కూడా పెండింగ్లోనే పెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఈ దిశగా దృష్టి పెట్టకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకపోవడంతోనే అభివృద్ధి ‘ఆలస్యం’ అవుతోందన్న భావన జిల్లావాసుల్లో నెలకొంది. దేశంలోనే పెద్ద రోడ్డు ఎన్హెచ్ 44.. ఇది దేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,112 కిలో మీటర్ల పొడవుతో దేశం ఆ చివర, ఈ చివరను కలుపుతోంది. ఇలాంటి ప్రతిష్టాత్మక జాతీయరహదారి జిల్లా మీదుగా వెళ్తోంది. సోన్ మండలకేంద్రం నుంచి మామడ మండలంలోని తాండ్ర గ్రామం వరకు దాదాపు 30కిలోమీటర్ల పొడవునా జిల్లా మీదుగా సాగుతోంది. దశాబ్దం క్రితం ఫోర్లేన్గా మారిన ఈ రోడ్డు పైనుంచి నిత్యం వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతూనే ఉంది. దేశంలోనే చాలా హైవేలను ఆరులేన్లు, ఎనిమిదిలేన్లుగా మా ర్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ జాతీయ రహదారిని మాత్రం ఇప్పటికీ విస్తరించడం లేదు. దీంతో చాలాచోట్ల తరచూ రోడ్డు ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాల ర ద్దీ కారణంగా ప్రయాణికులు గమ్యానికి చేరుకో వాలంటే అధిక సమయం పడుతోంది. పెండింగ్లో ఎన్హెచ్ 61 విస్తరణ జిల్లా మీదుగా వెళ్తున్న మరో హైవే 61జాతీయ రహదారి. మొదట మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి నిర్మల్ వరకు ఉన్న ఈ మార్గాన్ని జగిత్యాల వరకు పొడిగించారు. మహారాష్ట్ర–తెలంగాణ మధ్య వాణిజ్య, బంధుత్వాలకు ప్రధాన మార్గమిది. జిల్లాలో తానూరు మండలం బెల్తరోడ నుంచి ఖానాపూర్ మండలం వరకు బాదన్కుర్తి వరకు దాదాపు 90కిలో మీటర్లు సాగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రెండులేన్లుగానే ఉంది. ఇటీవలే నిర్మల్–ఖానాపూర్ మధ్యలో రోడ్డును అభివృద్ధి చేశారు. ఇదే క్రమంలో ఈ రోడ్డు మొత్తం కనీసం ఫోర్లేన్గా మార్చాల్సిందని జిల్లావాసులు పేర్కొంటున్నారు. సర్వే కోసం సమాయత్తం జిల్లా మీదుగా వెళ్తున్న 61వ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన సర్వే నిర్వహణ కు కన్సల్టెన్సీలను ఎంపిక చేసేందుకు త్వరలోనే టెండర్ పూర్తికానుంది. – సుభాష్, డీఈఈమహోర్ వరకు పొడిగించాలని.. జిల్లాలో ఈ మధ్యకాలంలో కొత్తగా అడుగుపెట్టిన హైవే 161బీబీ. మహారాష్ట్ర సరిహద్దు గుండా మద్నూర్–బోధన్–బాసర మీదుగా భైంసా వరకు సాగుతుంది. ఈ హైవేను కూడా మొత్తం ఫోర్లేన్గా మార్చాలని ఇటీవల ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ కేంద్రమంత్రి నితిన్గడ్కరీని కలిసి కోరారు. అలాగే, ఈ హైవేను భైంసా నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధక్షేత్రం మహోర్ వరకు పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ పొడిగింపుతో బాసర–మహోర్ ఆధ్యాత్మిక కారిడార్ అవుతుందని స్థానికుల భావన.నాగ్పూర్–ముంబై మధ్య బాలాసాహెబ్ థాక్రే సమృద్ధి మహామార్గ్ పేరిట 701కిలో మీటర్ల పొడవైన ఎనిమిదిలేన్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మించారు. ఈ హైవే నిర్మాణంతో ఇంత దూరాన్ని 8గంటల్లోనే పూర్తిచేస్తున్నారు. అదే నిర్మల్ నుంచి హైదరాబాద్కు 217కిలో మీటర్లు మాత్రమే. కానీ, ఎన్హెచ్ 44 ఫోర్లేన్ కావడం, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ దూరాన్ని పూర్తిచేయడానికి దాదాపు నాలుగున్నర గంటలు పడుతోంది. అదే ఎనిమిది లేన్ల మార్గమైతే.. రెండున్నర గంటల్లోనే నిర్మల్ నుంచి హైదరాబాద్కు చేరుకోవచ్చు. -
మహిళలు భయం వీడాలి..
ఆదిమ తెగల్లోని మహిళలకు భయం ఎక్కువ. భయాన్ని వీడినప్పుడే అభివృద్ధి చెందగలం. మహిళల్లో ఎదిరించే ధైర్యం, తన కాళ్లపై తాను నిలబడే తత్వం కలిగి ఉండాలి. కష్టపడి ఆటల్లో నైపుణ్యం సాధించాలి. – సిడాం కన్నిబాయి, భీమన్గోంది యువత ముందుకు రావాలి సాహస కృత్యాల్లో పాల్గొనేందుకు యువత ముందుకు రావాలి. జలపాతాలను రక్షించడం మా ముఖ్య ఉద్దేశం. వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ పోటీలను ప్రోత్సహిస్తాం. ఇందుకు యువత సిద్ధం కావాలి. – రంగారావు, డబ్ల్యూఆర్డబ్ల్యూవోసీ తెలంగాణ డైరెక్టర్ -
నేటి నుంచి విద్యా వారోత్సవాలు
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యావారోత్సవాలు నిర్వహించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల 11నుంచి 17వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు, ఉ న్నతాధికారుల సూచన మేరకు ఇప్పటికే అన్ని మండలాల మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు కార్యక్రమాల నిర్వహణపై సూచనలు చేసినట్లు జిల్లా విద్యాధికారి భోజన్న తెలిపారు. సమన్వయంతో జిల్లాలో విద్యావారోత్సవాలను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాల వివరాలు ఈ నెల 11న పీఎం శ్రీపాఠశాలలు, కేజీబీవీల్లో వేస వి శిబిరాలు ప్రారంభించాలి. ఇప్పటివరకు మంజూరైన నిధులతో పనులు ప్రారంభించాలి. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, యువతను భాగస్వాములను చేయాలి. ఈ నెల 12న పదోతరగతిలో వెనుకబడిన విద్యార్థుల కోసం శిబిరాలు నిర్వహించి అనుబంధ పరీక్షలు ప్రారంభమయ్యేదాకా తరగతులు కొనసాగించాలి. ఈ నెల 13న గ్రామ ప్రజాప్రతినిధులతో జి ల్లా స్థాయిలో కార్యశాల నిర్వహించాలి. విద్యా కార్య క్రమాలపై చర్చించాలి. ఈ నెల 14న ఆచార్య జయశంకర్ బడిబాటలో భాగంగా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. ఈ నెల 15న విద్యాలయాల్లో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించి, ప్రతీ పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలి. ఈ నెల 16న ఆర్ట్ అండ్ క్రాప్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి. ఈ నెల 17న జవహర్ బాలభవన్ దినోత్సవాన్ని నిర్వహించాలి. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. -
నూతన నియామకం
నిర్మల్టౌన్: లంబాడా హక్కుల పోరాట సమి తి విద్యార్థి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా భూక్యా రమేశ్ ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఐబీ భవనంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ అశోక్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సమాజ హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల కోసం నిరంతరం పని చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జాగేందర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో దూకి యువకుడు..
బాసర: తాగుడుకు బానిసై న యువకుడు ఆది వారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘ టన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మైలాపూర్ గ్రామానికి చెందిన సంగం రాజు (18) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది, గ్రామ సమీపంలోని చె రువులో దూకి బలవన్మరణా నికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ కిరణ్ వెంటనే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమి త్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి సంగం పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
ఆటో బోల్తా.. ఒకరు మృతి
కడెం: మండలంలోని ఉడుంపూ ర్ సమీపంలో జరిగి న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై సాయికిరణ్ తెలిపి న కథనం ప్రకారం.. లక్సెట్టిపేట్కు చెందిన హన్మండ్ల కొమురయ్య (68) కడెంలో తన కూతురు ఇంటికి వెళ్లి, శనివారం ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి సిరికొండ మండలం వాయిపేట్ మహంకాళీ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఉడుంపూర్ సమీపంలో గండి పోచమ్మ ఆలయం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కొమురయ్యను లక్సెట్టిపేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆటోలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారులున్నారు. కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుండెపోటుతో ఒకరు.. కడెం: మండలంలోని పెద్దూర్కు చెందిన తెలంగా ణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేష న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట్ల క్రాంతికుమార్ యాదవ్ (42) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. బావిలో పడి ఒకరు..దస్తురాబాద్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఒక రు మృతి చెంది న సంఘటన మండలంలోని గోడిసీర్యాల గ్రా మంలో చోటు చేసుకుంది. మృతుడి భార్య అంజలి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోడిసీర్యాల గ్రామానికి చెందిన పోడెటి మహేందర్ (31)కు కొద్ది రోజుల నుంచి మతి స్థిమితం సరిగా లేదు. ఈ నెల 9న ఇంటి నుంచి బయలు దేరి వెళ్లిన ఆయన రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఓ వ్యవసాయ బావిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య బోథ్: ఘన్పూర్ గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బోథ్ ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. సిసింద్ అలియాస్ సుశీల్ (31) మద్యానికి బానిసై ఆదివారం డబ్బులు కావాలని భార్య సురేఖతో గొడవ పడ్డాడు. అనంతరం చేనుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. -
సాహస కృత్యాల్లో అడవి బిడ్డ
చిన్నప్పటి నుంచి ఆటల్లో ఉన్న మక్కువ అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. వివిధ రకాల పతకాలు సాధించడంతో పాటు అడ్వెంచర్ క్లబ్ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది. వాటర్ ర్యాప్లింగ్ పోటీల్లో తనదైన ముద్రవేసి ఆదివాసీ మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కెరమెరి మండలం భీమన్గోంది గ్రామానికి చెందిన కన్నిబాయి. నేడు వాటర్ ర్యాప్లింగ్ దినోత్సవం సందర్భంగా కథనం.. – కెరమెరి కెరమెరి మండలంలోని భీమన్గోంది గ్రామానికి చెందిన మడావి భీంబాయి –జైతుల కూతురు కన్నిబాయి 1 నుంచి 10వ తరగతి వరకు ఆసిఫాబాద్లోని ఎస్టీ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించింది. వాటర్ ర్యాప్లింగ్ పోటీల్లో పాల్గొంటూ ఎన్నో ఘనతలు సాధించింది. దీంతో ఆమెను అడ్వెంచర్ బ్రాండ్ అంబాసిడర్గా డబ్ల్యూఆర్డబ్ల్యూవోసీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ రంగారావు నియమించారు. కన్నిబాయి సాధించిన ఘనతలు.. జలపాతాలను రక్షిస్తూ.. వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ వరల్డ్కప్ ఆర్గనైజింగ్ కమిటీ (డబ్ల్యూఆర్డబ్ల్యూవోసీ) ప్రపంచంలో గల జలపాతాలను రక్షిస్తూ సాహస కృత్యాలకు అనుకూలంగా వాటిని మార్చే చర్యలు చేపడుతోంది. జలపాతాలను సర్వే చేయడం, జలపాతాల ఆవశ్యకత, ప్రాధాన్యతలను విద్యార్థులకు, యువతకు వివరించడం, జలపాతాలను ధ్రువీకరించడం, ట్రయల్ రన్ నిర్వహించడం, బ్రాండింగ్ చేయడం, జలపాతాల్లో ర్యాప్లింగ్ పోటీలు నిర్వహించడం వంటి పనులు చేస్తుంది. ఇప్పటి వరకు 100 జలపాతాలు సర్వే చేయగా అందులో 60 వరకు జలపాతాలు వాటర్ ర్యాప్లింగ్కు అనుకూలంగా ఉన్నాయని డబ్ల్యూఆర్డబ్ల్యూవోసీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ రంగారావు తెలిపారు. -
ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
ఆదిలాబాద్: ప్రేమకు దూరంతో పనిలేదు. ఎన్ని వేల మైళ్ల దూరంలో ఉన్నా మనసులు కలిస్తే చాలు మనుషులు జంటవుతారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడి వివాహం లండన్ నగరానికి చెందిన యువతితో జరగడం ప్రేమకు హద్దులు లేవన్న విషయాన్ని చాటింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయిచరణ్, ఇంగ్లాండ్ రాజధాని లండన్ నగరానికి చెందిన మియా మే అనే యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. అక్కడ వీరి మధ్య చిగురించిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం ఇంట్లో పెద్దలను వారి పెళ్లికి ఒప్పించారు. ఆదివారం ఆదిలాబాద్లోనీ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. విదేశీ యువతి అయినా మియా మే తెలుగు సంప్రదాయంపై ఎంతో ఆసక్తితో చీర ధరించింది. ఈ వినూత్న ప్రేమ వివాహం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్శించింది. ఖండాంతరాలు దాటిన ఈ జంట బంధాన్ని చూసి కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిని ఆశీర్వదించారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం వైవిధ్యంగా మేఘావృతమవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది. అకాల వర్షం.. తడిసిన ధాన్యంఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు మండలంలోని తర్లపాడ్, సత్తెనపల్లి, మస్కాపూర్, బాదన్కుర్తి, మేడంపల్లి తదితర గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం అకాల వర్షానికి స్వల్పంగా తడిసింది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరిట అధికారులు కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యాన్ని తూకం చేసి లారీల్లో మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. బస్సు పునఃప్రారంభించాలి కడెం: కడెం–హైదరాబాద్ ఉదయం బస్సు ను పునఃప్రారంభించాలని ప్లబిక్ ప్రిఫర్ పీస్ కో–ఆర్డినేటర్, న్యాయవాది నేదూరి లలితకుమారి, అడ్వైజర్ నేదూరి జాకబ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం నిర్మల్ బస్టాండ్లో ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కడెం–హైదరాబాద్ బస్సుతో కడెం ప్రాంతవాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. వుల్లెంగుల రమేశ్ తదితరులున్నారు. -
ఆలయాల హుండీ దొంగలు అరెస్ట్
లోకేశ్వరం: ముధోల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో హుండీలను పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి ఆదివారం లోకేశ్వరం పోలీస్స్టేషన్లో భైంసా ఏఎస్సీ సాయికిరణ్ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ భైంసా మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన కొబ్బూల మారుతి, పిల్లోల్ల రాజు అనే ఇద్దరు యువకులు ఈనెల 8న తెల్లవారుజామున లోకేశ్వరం శివాలయంలో గడ్డపారతో హుండీని పగలగొట్టేందుకు యత్నించారు. ఒక్కసారిగా అలారం మోగడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకునే లోగా బైక్ను వదిలి పారిపోయారు. బైక్ నంబర్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. తాగుడికి బానిసైన ఇద్దరు లోకేశ్వరం శివాలయం, భాగాపూర్ గ్రామంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో రెండుసార్లు, బాగాపూర్లో జగన్మోహన్రెడ్డి గెస్ట్ హౌస్లో, ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలోని మల్లన్న దేవాలయంలో, మాచ్కల్లోని పోచమ్మ ఆలయంలో, రాంటెక్ గ్రామంలోని మహాదేవ్ ఆలయంలో, భైంసా మండలంలోని ఈలేగాం మార్కండేయ ఆలయంలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6వేల నగదు స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ముథోల్ సీఐ రవీందర్, లోకేశ్వరం ఎస్సై అశోక్లు ఉన్నారు. -
అకాల నష్టం
భైంసా/కుంటాల/లోకేశ్వరం: భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో, కుంటాల మండలం కల్లూరు, అందకూర్, పెంచికల్పాడ్, వెంకూర్, అంబకంటి, ఓల, కుంటాల గ్రామాల్లో , లోకేశ్వరం మండలం పుస్పూర్, రాయాపూర్కాండ్లీ, సాథ్గాం, హథ్గాం, హవర్గ, ధర్మోర, పంచగుడి తదిరత గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. వెంకూర్ – అందకూర్ గ్రామాల మధ్య రోడ్డుపై సుమారు 20 చెట్లకు పైగా విరిగి పడ్డాయి. ఎస్సై అశోక్ యువకుల సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కాండాలు, కొమ్మలను తొలగించారు. ఆకస్మికంగా కురిసిన వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటికే కోతలు, రవాణా, కూలీల ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం మరింత నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో గ్రామాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. -
హమాలీలకు డిమాండ్
లక్ష్మణచాంద: జిల్లాలో యాసంగి పంటలు చేతికి వచ్చాయి. కోసిన మొక్కజొన్న, వరి పంటలు ఒకేసారి చేతికొచ్చిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. హమాలీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తూకం, బస్తాల లోడింగ్, గోదాములకు తరలింపు అన్నీ ఆలస్యమవుతున్నాయి. ఒకేసారి వచ్చిన పంటలుజిల్లాలో ఈ సీజన్లో మొక్కజొన్న, వరి దిగుబడులు ఒకేసారి రావడం సమస్యకు మూలకారణంగా మారింది. సాధారణంగా విడివిడిగా జరిగే పనులు ఒకే సమయంలో రావడంతో కొనుగోలు కేంద్రాల నిర్వహణపై భారమైంది. ఇలాంటి పరిస్థితుల్లో పని వనరులు తక్కువగా ఉండడంతో ధాన్యం రవాణా ప్రక్రియ నెమ్మదించింది. కొనుగోలు కేంద్రాల్లో జాప్యంకేంద్రాల్లో సరిపడా హమాలీలు లేకపోవడంతో రైతులు గంటల తరబడి, కొన్ని చోట్ల రోజుల తరబడి కూడా వేచి ఉండాల్సి వస్తోంది. బస్తాలు నింపినా తూకం వేయకుండా నిలిపివేయడంతో ధాన్యం నిల్వ, లోడింగ్ వ్యవస్థ గందరగోళంగా మారుతోంది. దీని ప్రభావం నేరుగా రైతులపై పడుతోంది. పంట అమ్మకం ఆలస్యమవుతే నగదు చెల్లింపులు ఆలస్యమవుతాయి. గ్రామీణ పనుల్లో కార్మిక కొరతవరి నాట్లు, కోతలు, పసుపు తవ్వకం, పసుపు ఉడకబెట్టడం వంటి పనులకు కూడా స్థానికులు ముందుకు రాకపోవడం మరో ప్రధాన సమస్య. ఈ పనులన్నింటికీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలపై ఆధారపడాల్సి వస్తుండటంతో గ్రామీణ కార్మిక మార్కెట్పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా హమాలీ పనులకు కూడా కావలసినంత మంది దొరకడం లేదు. పెరుగుతున్న ఖర్చుగతంలో ప్రభుత్వం హమాలీ ఖర్చును క్వింటాలుకు రూ.3 నుంచి రూ.5 వరకు నిర్వహకుల ద్వారా రైతులకు చెల్లించాలని సూచించింది. కానీ అనేక చోట్ల అది సక్రమంగా అమలు కాకపోవడంతో ఆ మద్దతు తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో క్వింటాలుకు రూ.30 నుంచి రూ.40 వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.బిహార్ కూలీలే ఆధారం..ఈ పరిస్థితిలో బీహార్ నుంచి వచ్చిన కూలీలకు డిమాండ్ బాగా పెరిగింది. తూకం వేయడం నుంచి లారీ లోడింగ్ వరకు అన్ని పనులకు వీరిపైనే ఆధారపడాల్సి రావడంతో వారు అధిక వేతనం కోరుతున్నారు. కొన్ని చోట్ల ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నా పనికి రాకపోవడం వల్ల కూడా నిర్వహకులు ఇబ్బంది పడుతున్నారు. -
విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక‘ లో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించే విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతం చేయాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక, విద్యా వారోత్సవాలు, వరి ధాన్యం కొనుగోళ్లు, జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్, ఫార్మర్ రిజి స్ట్రీ, తదితర అంశాలపై, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం వీ డియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో పనుల శంకుస్థాపనలు, పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఉత్తీర్ణత కోసం ప్రత్యేక విద్య శిబిరాల నిర్వహణ, వర్క్షాప్ల ఏర్పాటు, జయశంకర్ బడిబాట కార్యక్రమం, పోషకులతో సమావేశాలు, విద్యా వేడుకల కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ, జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్ వేగవంతం చేయాలన్నా రు. వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఆదేశించారు. తగినన్ని గన్నీ సంచులు, లారీలు, హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించా రు. వీసీలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో భోజ న్న, డీఏవో అంజిప్రసాద్, పౌర సరఫరాల అధికా రి, మేనేజర్లు రాజేందర్, సుధాకర్ పాల్గొన్నారు. -
పోలియో కుమారుడిని పసి పిల్లాడిలా..
కుంటాల : కుంటాలకు చెందిన సరస్వతి కుమారుడు సతీశ్కుమార్ పోలియోతో బాధపడుతున్నాడు. నడవలేడు. లేచి నిలబడలేడు. ప్రస్తుతం అతని వయసు 35 ఏళ్లు. అయినా సతీశ్కుమార్కు పసి పిల్లాడిలా సేవలు చేస్తోంది. తండ్రి మరణం తర్వాత ఒంటరిగా చూసుకుంటోంది. ఇప్పటికీ స్నానం చేయించడం, భోజనం తినిపించడం వరకు అన్నీ తాను చేస్తూ ’సేవ అదృష్టం’ అని భావిస్తోంది. ఆమె అపార మాతృప్రేమ సమాజానికి స్ఫూర్తిదాయకం. కుమారుడు సతీశ్కు తల దువ్వుతున్న తల్లి సరస్వతి -
నిర్మల్
పీఏసీఎస్ గోదాం పరిశీలన లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని పీఏసీఎ స్ గోదాంను నిర్మల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్ పరిశీలించారు. కొన్నేళ్లుగా వృథాగా ఉంటున్న గోదాముల్లో ధాన్యం నిల్వ చేసేందుకు శనివారం పరిశీలించి శుభ్రం చేయించారు. కొన్నిచోట్ల పైకప్పుకు రంధ్రాలు పడటంతో వెంటనే మరమ్మత్తులు చేయిస్తామని తెలిపారు. ఆయన వెంట పీఏసీఎస్ సీఈవో వజీర్ ఉన్నారు. అంధ కుమారులను విజయవంతులుగా.. దివ్యాంగ కుమార్తెకు సపర్యలు.. -
డ్యూటీ చేస్తూ.. గైడెన్స్ ఇస్తూ..
సమాజంలో, విధుల్లో ఏ స్థాయిలో ఉన్నా.. ఇంట్లో పిల్లలకు మాత్రం అమ్మగా ఉండటమే అన్నింటికంటే బాధ్యతాయుతమైనది. పోలీసుశాఖలో ఓవైపు డ్యూటీ చేస్తూనే మా ఇద్దరు బాబుల చదువు, కెరీర్లో గైడెన్స్ ఇస్తున్నాను. పెద్దబాబు ధీరజ్ గ్రూప్–1 సెలక్ట్ అయి, ప్రస్తుతం డీఎస్పీగా విధులు నిర్వరిస్తున్నాడు. చిన్నబాబు ప్రీతమ్ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసర్చ్(నల్సార్)లో లా చదువుతున్నాడు. విధినిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా అమ్మగా చేసే డ్యూటీ చాలా గొప్పది. అమ్మలందరికీ.. హ్యాపీ మదర్స్ డే. –డా.జానకీషర్మిల, ఎస్పీ -
మోదీ సభను విజయవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఆదివా రం నిర్వహించే భారీ బహిరంగ సభను విజ యవంతం చేయాలని సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మాట్లాడారు. ఈ సభకు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సమరశంఖం పూరిస్తారని వివరించారు. మోదీ వస్తున్నాడు–భరోసా ఇస్తున్నాడు అనే నినాదంతో ఈ భారీ బహిరంగను చేపడుతున్నట్లు తెలిపారు. -
కొడుకులను ప్రయోజకులను చేసి..
మామడ : నిర్మల్లోని గాయిత్రీ టౌన్షిప్కు చెందిన విజయలక్ష్మి–గోపాల్ దంపతులు ఖానాపూర్లో వ్యవసాయం చేస్తూ కుమారులు సాయికృష్ణ, హరికృష్ణను ఉన్నత చదువులు చదివించారు. సాయికృష్ణ వైద్యుడిగా ఏరియా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నాడు, హరికృష్ణ టీఎస్పీఎస్సీలో ప్రతిభ చూపి మామడ మండల పరిషత్ అధికారిగా పనిచేస్తున్నాడు. తల్లి ప్రోత్సాహంతోనే ఈ విజయాలు సాధించామని కుమారులు పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన హరికృష్ణకు స్వీటు తినిపిస్తున్న తల్లి విజయలక్ష్మి -
ఇప్పటికీ చిన్న పిల్లలే ...
గంగారాం, శ్రీనివాస్కు అన్నం తినిపిస్తున్న తల్లి లక్ష్మి లోకేశ్వరం: మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన కుతాడి లక్ష్మి–గంగారాం దంపతులకు నలుగురు కుమారులు కాగా అందులో శ్రీనివాస్(31), గంగన్న(28) పుట్టినప్పటి నుంచి శారీరక, మానసిక దివ్యాంగులు. కనీ సం నడవలేరు. వీళ్లు బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రులు మోయాల్సిందే. వారికి ఆకలి తెలియదు. బాధ తెలియదు. అవసరాలన్ని అమ్మే తెలుసుకోవాలి. భార్య భర్తలు కూలీ చేసేవారు. 30 ఏళ్లుగా లక్ష్మి నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కుమారులకు చంటి పిల్లల్లా సపర్యలు చేస్తూనే ఉంటుంది. -
అమ్మగా ఆలన.. పుర‘పాలన’..
ముందునుంచీ మాది రాజకీయ కుటుంబమే. అందులోనూ మా ముగ్గురు కుటుంబసభ్యులు నిర్మల్ మున్సిపల్ చైర్మన్లుగా చేశారు. కానీ.. ఇప్పుడు నేను చైర్పర్సన్ అయ్యాను. పుర‘పాలన’కు సంబంధించిన పనులు చూసుకుంటూనే ఇంట్లో పిల్లలు శౌర్యచక్రవర్తి, ఆద్యల ఆలన కూడా చూసుకోవాలి. ఆడవాళ్లు ఏ పనిలో ఉన్నా.. ఏ స్థాయికి ఎదిగినా.. అమ్మ స్థానాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతీ తల్లి తనకంటే తన పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. నేను అంతే. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – అప్పాల కావ్య గణేశ్చక్రవర్తి, మున్సిపల్చైర్పర్సన్, నిర్మల్ -
కొడుకును దేశ రక్షకుడిని చేసి..
తానూరు: మండలంలోని భోసి గ్రామానికి చెందిన నాగుల చంద్రబాయి–దేవన్న దంపతుల కు ముగ్గురు సంతానం పెద్ద కుమారుడైన లక్ష్మణ్ 2016లో ఆర్మీలో ఉద్యోగం సాధించి ప్రస్తుతం గుజరాత్లో విధులు నిర్వహిస్తున్నాడు. కుమార్తె లక్ష్మికి పెళ్లి చేశా రు. మరో కొడుకు పండరి హైదరాబాద్లో ప్రైవే టు ఉద్యోగం చేస్తున్నారు. తన కొడుకునే సైనికుడిని చేయాలని చంద్రబాయి లక్ష్యంగా పెట్టుకుంది. చిన్నతనం నుంచే కొడుకును ఆ దిశగా ప్రోత్సహించింది. 2016లో ఆర్మీ ఉద్యోగం సాధించి తల్లికలను నేరవేర్చాడు. నాగుల చంద్రబాయితో కుమారుడు లక్ష్మణ్ -
‘ప్రాణహిత’ కట్టి తీరుతాం..!
కౌటాల: తెలంగాణలో సాగునీటి రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రాణహిత ప్రాజెక్టును పక్కాగా కట్టి తీరుతామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఎకై ్స జ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని శుక్రవారం రాష్ట్ర మైనింగ్, కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాల్వాయి హరీశ్బాబుతో కలిసి పరిశీలించారు. బరాజ్ ఎత్తు, సామర్థ్యం, గతంలో చేపట్టిన కాలువల పనులు, మహారాష్ట్రలోని శివిని గ్రామ పరిధిలోని ముంపు పరిధి, అటవీ, పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు శిలాఫలకాన్ని పరిశీలించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక బుద్ధ మందిర్లో పూజలు చేశారు. ప్రాణహిత నదికి శాస్త్రోక్తంగా పూజలు చేసి జలహారతి ఇచ్చారు. గ్రావిటీ ద్వారా ‘ఎల్లంపల్లి’కి నీరు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారని గుర్తు చేశారు. అప్పట్లోనే 106 కిలోమీటర్ల మేర కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి 71.5 కి.మీ.ల భూసేకరణ పూర్తి చేశారని తెలిపారు. 46 కి.మీ.ల మేర పనులు కూడా పూర్తయ్యాయని వెల్ల డించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు ఖర్చు చేసిందని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తే ఒక్క యూనిట్ విద్యుత్ ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించవచ్చని తెలిపారు. ఈ నెల 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బరాజ్ విషయాన్ని బీజేపీ నేతలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. తెలంగాణ రైతుల పక్షాన నిలబడి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లా రైతాంగానికి అన్యాయం ప్రాణహిత ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమీషన్ల కోసమే తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం చేశారని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్గా ఉన్న మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచ స్థాయి కాంట్రాక్టర్గా ఎదిగారని ఎద్దేవా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎస్పీ వహీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం జానకీరావు, శ్యామ్నాయక్, మండల అధ్యక్షుడు నికాడే గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
మన బంగారం.. భద్రమేనా?జిల్లాలో ఇటీవలి ఘటనలు పాఠశాలల్లో వసతులు కల్పించాలి నిర్మల్ రూరల్: వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేశ్నాయక్ కోరారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడా రు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 100 శాతం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయాలన్నారు. టై, బెల్టులు, స్కూల్ బ్యాగులతోపాటు నోటుబుక్కులు కూడా అందించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూ ర్తి చేసి వెంటనే బిల్లును చెల్లించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సాంకేతిక విద్య బోధించేందుకు ప్రతీ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందించి వాటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. పాఠశాలల అభివృద్ధిలో సర్పంచుల భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతీ గ్రా మంలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. నిర్మల్టౌన్: నాలుగైదేళ్లుగా బంగారం ధరలు పెరుగుతూనే పోతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.1.50 లక్షల పలుకుతోంది. భవిష్యత్ అంతా బంగారం, వెండిదే అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దొంగలు రూట్ మార్చారు. గతంలో ఇళ్లలో చోరీలు చేసేవారు ఇప్పుడు జువెల్లరీ షాపులను టార్గెట్ చేస్తున్నారు. భయం లేకుండా బరితెగిస్తూ, పగటిపూట జ్యువెలరీ షాపులు, మహిళల మెడల్లోని ఆభరణాలు లక్ష్యం చేసుకుంటున్నారు. ఇటీవల కరీంనగర్లో పట్టపగలే జువెల్లరీ షాపు భారీ చోరీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన సృష్టించింది. దొంగతనాలు విరివిగా పగలు రెక్కీ నిర్వహస్తున్న దొంగలు రాత్రి కన్నాలు వేస్తున్నారు. తాజాగా కరీంనగర్లో పగలే కస్టమర్లలా వచ్చిన దొంగలు షాపులోని ఉద్యోగులపై కాల్పులు జరిపారు. నగలు బ్యాగుల్లో నింపుకుని పారిపోయారు. సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా జాత్త్రలు పడుతున్నారు. జువెల్లరీ షాపుల నుంచి చిన్న దుకాణాలను కూడా దొంగలు టార్గెట్ చేస్తున్నారు. వ్యాపారుల్లో ఆందోళన కరీంనగర్ ఘటనలో జ్యువెలరీ, ఇతర దుకాణ యజమానుల్లో భయం పెరిగింది. రాత్రి వేళల్లో నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లే ఘటనలు జరుగుతున్నాయి. కరీంనగర్ నగల షాపులో చోరీ చేసిన దొంగలు మహారాష్ట్ర పారిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా సరిహద్దులో మహారాష్ట్ర ఉండడం, దొంగల ముఠా మహారాష్ట్రకు చెందినదే అని భావిస్తున్నారు. పోలీసులు మహారాష్ట్ర సరిహద్దు, బాసర్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో నిఘా పెంచాలి. అనుమానాస్పద వ్యక్తులను విచారించాలి. దుకాణాల్లో సీసీటీవీలు, అలారం సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి పహారా, అదనపు గార్డులు నియమించాలి. ప్రజల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాపారులు కస్టమర్లపై నిరంతర నిఘా ఉంచాలి.సీసీ కెమెరాలు అమర్చుకోవాలి బంగారు షాపులతోపాటు ఇతర షాపుల యజమానులు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. షాపుల్లో సైరన్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో దుండగులు లోనికి చొరబడినప్పుడు అలారం మోగడంతో చుట్టుపక్కల వారు, పోలీసులు అక్కడికి చేరుకుంటారు. అంతేకాకుండా ఏటీఎంలో, బ్యాంకులు, బంగారు దుకాణాల యజమానులు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. సెంట్రల్ లాకింగ్ అమర్చుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలి. – జానకీషర్మిల, ఎస్పీ -
దేశ ప్రగతికి జనగణన కీలకం
నిర్మల్చైన్గేట్: దేశ ప్రగతి, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి జనగణన అత్యంత కీలకమని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జనగణన ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో మారథాన్ నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన ఈ మారథాన్ను కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించడంతోపాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక చేపడుతుందన్నారు. జనగణన–2027లో భాగంగా ప్రతీపౌరుడు ‘‘స్వీయ గణన’’ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతీ కుటుంబం తమ వివరాలను ఆన్లైన్లో స్వయంగా నమోదు చేసుకోవాలని, అవగాహన లేని వారికి ఇతరులు సహకరించాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, డీఈవో భోజన్న, ఎల్డీఎం రామ్గోపాల్, డీపీవో శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ పీజీ.రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపులో జాప్యంపై రైతుల నిరసన
కుంటాల: తూకం వేసిన మక్కల తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ.. లోకేశ్వరం మండలం రా జురా గ్రామ రైతులు కుంటాల మండలం అర్లి(కె) వద్ద 61వ జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో చేశారు. లోకేశ్వరం మండలం రాజు రా గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 20 రోజుల క్రితం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖ అధికారులు 10 వేల బస్తాల మక్కలు కొనుగోలు చేశారు. ఇప్పటి వర కు వాటిని తరలించక పోవడంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న లోకేశ్వరం, నర్సాపూర్(జి) తహసీల్దార్లు సూర్యారావు, శ్రీకాంత్, ఏవో గిరిరాజ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల్లో పది లారీలు పంపించి మక్కలు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించా రు. రెండున్నర గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, సి.అశోక్, జి.అశోక్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా భైంసా–నిర్మల్ వెళ్లే వారిని కుంటాల, అంబకంటి, నర్సాపూర్ (జి), గ్రామా ల మీదుగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కాళ్లు మొక్కుతం సారూ.. నిబంధనలు విధించకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రాజురా సర్పంచ్ సుందరగిరి శ్యామల భర్త మాజీ సర్పంచ్ ముత్తాగౌడ్ తహసీల్దార్ సూర్యారావు కాళ్లు మొక్కుతూ రైతుల తరఫున విన్నవించారు. -
లేబర్ కార్డులపై అవగాహన
ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలోని వడ్డెరవాడలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో లేబర్ కార్డులు, వాటి ప్రయోజనాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ము త్యంరెడ్డి, నిర్మల్ అసిస్టెంట్ కమిషనర్ జి.రాజలింగు, జిల్లా ఉపాధి అధికారి జి.విజయలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి.వినయ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి.నవీన్ కుమా ర్ పాల్గొన్నారు. లేబర్ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలు, ఆర్థిక సా యాలు, ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు ల భిస్తాయని వివరించారు. కార్మికులు తప్పనిసరి గా లేబర్ కార్డులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏలేటి ప్రశాంత్రెడ్డి, ఉ పసర్పంచ్ పెద్దిరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. -
మందకొడిగా మక్కల కొనుగోళ్లు
● బస్తాల తరలింపులో జాప్యం లోకేశ్వరం : ఆరుగాలాల శ్రమతో పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకోవడానికి అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. మందకొడిగా సాగుతున్న కొనుగోళ్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. భైంసా డివిజన్లో ఈ సీజన్లో తూకం వేసిన ధాన్యం వారం నుంచి పది రోజులపాటు కేంద్రాల్లోనే ఉండిపోతోంది. లారీలు రాకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 1.25 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లాలో ఈ యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అకాలవర్షాల వల్ల 40 శాతం మంది రైతులు మద్దతు ధర కంటే రూ.600 తక్కువగా ప్రైవేటు వ్యాపారులకు అమ్మారు. మిగిలిన 60 శాతం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 24 కేంద్రాలకు మక్కలు తరలించారు. కొనుగోళ్లు ఆలస్యం 24 కేంద్రాల్లో ఇప్పటివరకు కేవలం 5 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. లారీలు రాకపోవడంతో తూకం వేసిన బస్తాలు కుప్పలుగా పడిపోతున్నాయి. అకాల వర్షాలకు మక్కలు తడిసిపోతే ఎండబెట్టి మార్పిడి చేయాల్సి వస్తోంది. గన్నీ బ్యాగుల కొరతతో రైతులు గన్నీ సంచులు కొనుగోలు చేస్తున్నారు. లారీలు పంపిస్తాం గోదాముల్లో అన్లోడింగ్ కొంత ఆలస్యమవుతోంది.మక్కలు,ధాన్యం ఒకే సారి రావడంతో లారీల సమస్య ఏర్పడుతోంది.లారీల సంఖ్యను పెంచి సమస్యను పరిష్కరిస్తున్నాం.రెండు రోజుల్లో తూకం వేసిన బస్తాలను తరలిస్తాం. – మహేశ్కుమార్, డీఏం, నిర్మల్ మార్క్ఫెడ్ -
గణన.. ఫటాఫట్
నిర్మల్చైన్గేట్:ప్రభుత్వం చేపట్టిన స్వీయగణన కార్యక్రమం సమయాన్ని కుదించి, కచ్చితమైన జ నాభా సమాచారాన్ని సేకరించడంలో విజయవంతమవుతోంది. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన విస్తృత ప్రచారంతో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనాభా గణన అవసరం 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 7,09,418 మంది, 1,65,763 గృహాలు ఉన్నాయి. 2021 గణన కోవిడ్ కారణంగా ఆలస్యమై, 2026లో ప్రక్రియ ప్రారంభమైంది. అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఈ డేటా మూలస్తంభంగా ఉంటుంది. ఈమేరకు జిల్లాలో 26 మంది ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. స్వీయగణనకు స్పందన గత నెల 26 నుంచి మొదలైన స్వీయ గణన కార్యక్రమం ఈ నెల 10 వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖుల ఇంటి వెళ్లి స్వయంగా గణన చేయించుతున్నారు. 33 అంశాలతో మొబైల్ యాప్లో ప్రాథమిక వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 12,897 కుటుంబాలు పాల్గొన్నాయి. 2027లో ఫలితాలు.. స్వీయగణన ఇంటింటి సర్వే పూర్తి అయిన తర్వాత 2027 ఫిబ్రవరి, మార్చిలో జనగణన చేపడుతారు. ఆ ఏడాది మే నెలలో జనాభా లెక్క తేలుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తుంది. దీనిపైనే పథకాల అమలు, ఇతర అన్ని ఆధారపడి ఉంటాయి. ఈసారి డిజిటల్ విధానంలో గణన చేయనున్నారు. ఈనెల 11 నుంచి ఇంటింటి సర్వే.. ఎన్యుమరేటర్లు ఈనెల 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే చేస్తారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో ఇంటి నంబర్లు వేసుకుంటారు. ఈ సర్వేలో కేవలం కుటుంబ యాజమాని పేరు, ఇల్లు, మరుగుదొడ్డి ఇతర వివరాలతో 33 కాలమ్లు ఉంటాయి. ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. ఇళ్ల సర్వే మాత్రమే పూర్తి చేయనున్నారు. జిల్లా వివరాలు: 2027 జిల్లా జనాభా సుమారు 8,20,000 గృహాలు 2,05,000మాస్టర్ ట్రైనర్ 01ఫీల్డ్ ట్రైనర్లు 26 ఎన్యుమరేటర్లు 1,337సూపర్వైజర్లు 230 -
ఫాస్టాగ్ ప్రారంభం
కడెం: మండలంలోని పాండ్వపూర్ గ్రామంలోని అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ శుక్రవారం ప్రారంభించారు. పాండ్వపూర్, ఉట్నూర్, ఇంధన్పల్లి, తపాల్పూర్ చెక్పోస్ట్ల్లో స్థానికులకు ఫాస్టాగ్ చార్జ్ మినహయింపు ఉంటుందన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఆయన వెంట డీఎఫ్వో సుశాంత్సుఖ్దేవ్, ఎఫ్డీవో శివకుమార్, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవో సునీత, ఎఫ్ఆర్వో గీతా రాణి, ఎంపీవో శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్పంచ్ విజయ, దీకొండ విజయ్కుమార్, భీమేశ్, ఆశ్విత, తేజస్విని, రమేశ్, డీఆర్వోలు సిద్దార్ద, ప్రకాశ్, నాయకులు రాజశేఖర్, ప్రతాప్, మల్లయ్య, నారయణ తదితరులు ఉన్నారు. సమన్వయంతో పనిచేయాలి ఖానాపూర్: కలెక్టర్ భవేశ్ మిశ్రాను డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్తో చర్చించారు. -
రోడ్డెక్కిన మక్క రైతు
భైంసారూరల్/తానూరు: మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని మక్కరైతులు గురువారం రోడ్డెక్కారు. కొనుగోళ్లలో జాప్యం, తేమ శాతం పేరుతో అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసా మండలం మాటేగాంలో జాతీయ రహదారిపై, తానూరులో బెల్తరోడా–తానూరు రహదారిపై ఆందోళన చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సుప్రియ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరి పారు. అకాల వర్షాల కురుస్తున్నాయని, వెంటనే కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు. మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలకు తెచ్చి వారం రోజులు గడుస్తున్న అధికారులు గన్నీ సంచులు ఇవ్వడం లేదని, లారీలు రావడం లేదని కొనుగోలు చేయడం లేదన్నారు. ఆందోళన కారణంగా గంటపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. తహసీల్దార్లు శశిభూషణ్, మహేంద్రనాథ్ రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కొనుగోళ్లు చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
జిల్లా కవికి అరుదైన గౌరవం
నిర్మల్ఖిల్లా: భాష సాంస్కృతిక శాఖ తెలంగా ణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల సాంస్కతిక కళారూపాల ప్రదర్శనలో భాగంగా రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. కవిత గానంలో మొదటి కవిగా నిర్మల్కు చెందిన సీనియర్ కవి, తాత్విక రచయిత మునిమడుగుల రాజారావుకు అవకాశం దక్కింది. తన కవితాగానంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఏ.వాణీప్రసాద్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రత్యేక సత్కారం పొందారు. -
నిర్మల్
7కాంగ్రెస్ ఎస్సీ సెల్ పరిశీలకులుగా సుదర్శన్నిర్మల్టౌన్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా పరిశీలకులుగా సమత సుదర్శన్ ను నియమిస్తూ.. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు గురువారం నియామక పత్రాన్ని అందించారు. ఉమ్మడి జిల్లాలో సమస్యలు తెలుసుకుని టీపీసీసీకి పంపించాలని ఆదేశించారు. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కూడా కాస్త తగ్గుతుంది. అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది.నిఘా నేత్రం ఏది?బాసర మండల కేంద్రంలోని రద్దీ ప్రాంతాలు, ముఖ్యకూడళ్లు, మూలమలుపుల వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేయలేదు. దొంగలను గుర్తించడం కష్టంగా మారుతోంది. -
కల్లాల్లో కన్నీళ్లు
భైంసా: జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. నిన్నటి వరకు అగ్నిప్రమాదాలతో మొక్కజొన్న, జొన్న చేలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో చేతికి వచ్చిన పంట నోటికి అందకుండా పోయింది. ఇక తాజాగా వరుణుడు పగబట్టాడు. అకాల వర్షాలతో అన్నదాత మరింత నష్టపోయే పరిస్థితి నెలకొంది. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మార్కెట్యార్డులు, కొనుగోలు కేంద్రాలు, గోదాముల వద్ద మొక్కజొన్న, వరి ధాన్యం భారీగా పేరుకుపోయాయి. ఈ సమయంలో అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతులను మరింత నష్టపరుస్తున్నాయి. ఈదురుగాలులు.. వర్షంగురువారం మధ్యాహ్నం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. రైతులకు కన్నీళ్లు తెప్పించింది. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆరబెట్టిన వరి ధాన్యం, మొక్కజొన్న కుప్పలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. వేగవంతం చేస్తేనే...జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరిధాన్యం పంటలు ఒకేసారి వచ్చాయి. ఈ సమయంలో గోదాముల్లో నిల్వసామర్థ్యం తక్కువగా ఉండడం, కొనుగోలు ప్రక్రియ వేగవంతం లేకపోవడం రైతులను ఇబ్బందులపాలుచేస్తుంది. కల్లాలపై ఉన్న మొక్కజొన్న తరలించేందుకు రవాణా సమస్యలు ఎదురవుతున్నాయి. గత పది రోజులుగా చేతికి వచ్చిన పంటను విక్రయించుకునేందుకు జిల్లా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టి సారించి రైతుల ఇబ్బందులను తీర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్క్ఫెడ్, సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో కల్లాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. రైతులు నష్టపోకముందే ప్రభుత్వం స్పందించాలని విన్నవిస్తున్నారు. 16 రోజులైంది నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట కోసి కల్లం మీదకు తీసుకువచ్చి 16 రోజులైంది. కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలి. గు రువారం వర్షం కురవడంతో కుటుంబమంతా కల్లం దగ్గరికే వెళ్లాం. ఇంట్లో ఉన్న టర్పాలిన్లు కప్పి వర్షంలో తడవకుండా పంటను కాపాడుకున్నాం. ప్రభుత్వం కల్లాల వద్ద టా ర్పాలిన్లు కూడా అందుబాటులో ఉంచాలి. – ఖలీలుద్దీన్, రైతు ముధోల్ -
‘ఉల్లాస్’.. ఉత్సాహం ఆవిరి!
లక్ష్మణచాంద: పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితా లపై ఉత్కంఠ ఉంటుంది. బాగా రాసినవారు ఉత్సాహంగా కనిపిస్తారు. సరిగా రాయనివారు టెన్షన్ పడతారు. నిరక్షరాస్యత నిర్మూలతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఉల్లాస్’(అమ్మకు అక్షరమాల). గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అక్షర జ్ఞానాన్ని అందించడానికి వంద రోజులు ప్రత్యేక రాత్రి బడులను నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్చుకున్న మహిళల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు మార్చి 29న రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించారు. 38 రోజులు గడుస్తున్నా ఫలితాలు విడుదల చేయలేదు. దీంతో ఉల్లాస్ అభ్యర్థుల్లో ఉత్సాహం ఆవిరవుతోంది. మూల్యాంకనం పూర్తి..నిర్మల్ జిల్లాలో ఈ పరీక్ష కోసం మొత్తం 18,339 మంది మహిళలు నమోదు చేసుకోగా, అందులో 17,824 మంది హాజరయ్యారు. జిల్లాలోని మండలాల వారీగా సెర్ఫ్ అధికారులు, ఉపాధ్యాయులు మరియు సీఆర్పీల పర్యవేక్షణలో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ పత్రాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపగా, అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, తదనంతరం రాష్ట్ర, కేంద్ర విద్యాశాఖలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాల కోసం నిరీక్షణ.. అక్షరాలు నేర్చుకుని పరీక్ష రాసిన మహిళల్లో తమ ఫ లితాల కోసం ఉత్సాహంగా చూస్తున్నారు. అయితే, పరీక్ష ముగిసిన నెల రోజులకు పైగా సమయం గడిచినా ఫలితాల కోసం వేచిచూడాల్సి రావడం విద్యాశాఖ పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేంద్రస్థాయి నుంచి ఫలితాలు వెలువడాల్సి ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అభ్యర్థులు మాత్రం తమ శ్రమకు తగ్గ గుర్తింపు ఎప్పుడు లభిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. సాక్షరత దిశగా అడుగులు వేసిన ఈ మహిళల్లో ఉత్సాహాన్ని కాపాడాలంటే, ప్రభుత్వం త్వరగా ఫలితాలను విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. -
వరదల సమయంలో సమన్వయం అవసరం
నిర్మల్చైన్గేట్: వరదల సమయంలో అన్ని శాఖల సమన్వయం అవసరమని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదల నివారణ, విపత్తు నిర్వహణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం గురువారం నిర్వహించింది. ఈ సమావేశంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు. జిల్లాలో వర్షాకాలానికి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు, వరదల సమయంలో తక్షణ స్పందన, ప్రజల రక్షణ, సహాయక చర్యలు, అత్యవసర సేవల సమన్వయంపై సమీక్షించారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలు, చెరువులు, వాగులు, కాలువలు, రహదారుల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాల సన్నద్ధతలో భాగంగా నిర్మల్ జిల్లాలో జిల్లాస్థాయి ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిద్వారా వరదల సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను ప్రాయోగికంగా అమలు చేసి శాఖల మధ్య సమన్వయాన్ని పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ పరిపాలన, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా శాఖలతోపాటు ఇతర అత్యవసర సేవల విభాగాలు పాల్గొంటాయన్నారు. ప్రజ ల తరలింపు ప్రక్రియ, సహాయక శిబిరాల ఏర్పా టు, రక్షణ చర్యలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. విపత్తుల స మయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమై న యంత్రాంగం, సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, సబ్ కలెక్టర్ సంకేత్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వేగంగా డిజిటల్ జనగణననిర్మల్చైన్గేట్: జిల్లాలో డిజిటల్ జనగణన–2027 ప్రక్రియ పకడ్బందీగా సాగుతోందని కలెక్టర్ భవేశ్ మిశ్రా వెల్లడించారు. హైదరా బాద్ నుంచి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళ్లికేరి జనగణన – 2027 విధివిధానాలు, సంబంధిత అంశాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో గురువారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా నివేదికను వివరిస్తూ, జిల్లాలో ఇప్పటివరకు 93.844 శాతం స్వ యం గణన పూర్తయిందని, 12,897 మంది నమోదువిజయవంతంగా ముగిశాయని వివ రించారు. జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బంది శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లావ్యాప్తంగా ఏర్పా టు చేసిన 44 శిక్షణ బ్యాచ్లు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయన్నారు. క్షేత్రస్థాయి నిర్వహణకు కీలకమైన 1551 హౌస్ లిస్టింగ్ బ్లాక్ డీమార్కేషన్ ప్రక్రియను ఆన్లైన్ పోర్టల్లో వంద శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు అవసరమై న కిట్ల పంపిణీ వేగంగా జరుగుతోందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, సీపీవో జీవరత్నం, అధికారులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడాలి
కుంటాల: డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ )విధానంలో మార్పు చేయకపోతే డ్రాప్స్ పెరిగే ప్రమాదం ఉందని కాకతీయ యూనివర్సిటీ ప్రైవేట్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ఆర్గనైజర్ రాష్ట్ర సెక్రెటరీ బోయ సాయిలు పేర్కొన్నారు. మండలంలోని కల్లూరు వాసవీ కళాశాలలో గురువారం మాట్లాడారు. విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ఈ విధానం ద్వారా భవిష్యత్తులో విద్యాసంస్థలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి సూచించా రు. డీబీటీ విధానంలో మార్పు చేసి విద్యా వ్య వస్థ స్థిరత్వాన్ని కాపాడాలని, పెండింగ్ బకా యిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గట్టుపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
రక్తదాన శిబిరం
నిర్మల్చైన్గేట్: ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి పురస్కరించుకొని తెలంగాణ నర్సింగ్ ఆఫీస ర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జనరల్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కొందరు నర్సింగ్ ఆఫీసర్లు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ గోపాల్సింగ్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–1 వనజ, గ్రేడ్–2 విజయలక్ష్మి, పారిజాతం, ధనలక్ష్మి, ఆఫీస్ సూపరింటెండెంట్ నవీన్కుమార్, హెడ్నర్స్ అపర్ణ యేసుమణి, జయలక్ష్మి, పుష్పలత, అసోసియేషన్ అధ్యక్షుడు బాణాల రమేష్, నర్సింగ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
ప్లాస్టిక్ అంతం.. ● స్టీల్ బ్యాంక్ల ఏర్పాటుకు శ్రీకారం గోల్ కొట్టేద్దాం! వేసవి శిక్షణ శిబిరాలతో జిల్లాలోని క్రీడామైదానాలన్నీ కళకళలాడుతున్నాయి. చిన్నారులకు వివిధ క్రీడాంశాల్లో కోచ్లు శిక్షణ ఇస్తుండగా అధికసంఖ్యలో హాజరవుతున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్చైన్గేట్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీవాణిని కోర్టు కార్యాలయంలో బుధవారం కలెక్టర్ భవేశ్ మిశ్రా మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్క అందించారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు. నిర్మల్: సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధానికి పల్లెలు క దులుతున్నాయి. ఊరూరా స్టీల్బ్యాంక్లు ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సాధారణంగా ఊళ్లో ఎవరింట్లో ఫంక్షన్ చేసినా కనీసం 6–8కిలోల ప్లాస్టిక్ వ్యర్థం వస్తోంది. పేపర్ప్లేట్లు, వాటర్గ్లాసులు, చాయ్కప్పులు, స్వీట్, ఐస్క్రీమ్ కప్పులు, వా టిల్లోకి చెంచాలు, వాటర్ బాటిళ్లు ఇలా.. అన్నీ సింగిల్యూస్ ప్లాస్టికే. ఒక్క పెళ్లి చేస్తేనే ఇలా కిలోల కొద్దీ ప్లాస్టిక్ జమవుతోందంటే.. జిల్లా మొత్తంలో ఎన్ని టన్నుల్లో ఈ ప్రమాదకరమైన వ్యర్థం పెరుగుతుందో తెలుసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్తో ప్రయోజ నం తాత్కాలికమే కానీ.. నష్టం మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుందన్నది వాస్తవం. దీన్ని అర్థం చేసుకున్న చాలా గ్రామాలు ఏంచేయాలో ఆచరణలో చూపెడుతున్నాయి. ప్లాస్టిక్ రహిత పల్లె దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ‘స్టీల్బ్యాంకు’ల ఏర్పా టు జిల్లాలో ఊరూరా ఉద్యమంలా సాగుతోంది. పెరుగుతున్న క్యాన్సర్ బాధితుల సంఖ్య ఒకప్పుడు పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే టెంట్హౌస్లు, సంఘాల్లో నుంచి స్టీల్ప్లేట్లు, గ్లాసులు తీసుకొచ్చేవారు. కానీ, ఇప్పుడంతా రెడీమేడ్, సింగిల్ యూస్. అలా తినడం, తాగడం.. ఇలా పడేయడం. అంతే.. కడగడం, పెట్టడం అంటూ ప్రత్యేకంగా ఏ పనీ ఉండదు. ఏళ్లుగా సాగుతున్న ఈ తంతు కొంతకాలంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. కొత్తరకం క్యాన్సర్లు, రోగాలను తీసుకొస్తోంది. మాధ్యమాల ద్వారా చాలామంది వైద్యులు కొంతకాలంగా ఈ తరహా సింగిల్యూస్ ప్లాస్టిక్ను వాడటంతో జరిగే అనర్థాలను వివరిస్తున్నారు. చాలా ఊళ్లల్లో కళ్లెదుటే క్యాన్సర్ తదితర రోగాలబారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతున్న తీరూ కదిలిస్తోంది. స్టీల్బ్యాంక్లతో పెనుమార్పు పర్యావరణానికి, మన ఆరోగ్యానికీ పెనుముప్పుగా మారుతున్న సింగిల్యూస్ ప్లాస్టిక్ను అరికట్టాలన్న ఆలోచన ఈమధ్య ఆచరణరూపంలోకి వస్తుండటం శుభసూచకం. ఏళ్లుగా అధికారులు చెబుతున్నా.. వి న్నవాళ్లు చాలా తక్కువ. కానీ.. ‘స్మార్ట్’జమానాలో అన్నీ కళ్లెదుటే కనిపిస్తుండటంతో ఇక మారాల్సిందేనంటున్నారు. ఈ మార్పులో పల్లెలు ముందుండటం గొప్పవిషయం. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా గ్రామగ్రామా న ‘స్టీల్ బ్యాంకులు’ ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్లేట్లు, గ్లాసులు మొదలు ప్రతీదీ స్టీల్ వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. వివాహాలు, శుభకార్యాలు, పండుగల వేళ ప్లాస్టిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇవి ఉపయోగపడుతున్నాయి. ప్రయోజనాలెన్నో.. స్టీల్బ్యాంకులతో గ్రామాల్లో మార్పు మొదలైంది. వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం గణనీయంగా తగ్గుతోంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతోంది. ప్లేట్లు, గ్లాస్లుల కొనుగోలు ఖర్చు తగ్గుతోంది. స్టీల్బ్యాంక్ల నిర్వహణకు కమిటీ వేసి, నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఊరూరా ఉద్యమంలా సాగుతున్న ‘స్టీల్బ్యాంకు’ల ఏర్పాటుతో ప్లాస్టిక్ రహిత జిల్లా కావాలని అధికారులు ఆశిస్తున్నారు. కడెం మండలం లింగాపూర్లో స్టీల్బ్యాంక్ను ప్రారంభిస్తున్న గ్రామస్తులు ఏంటీ.. స్టీల్బ్యాంక్..? స్టీల్బ్యాంక్ అనేది గ్రామపంచాయతీ లేదా స్థానిక వీడీసీ, యువజన, కుల, కాలనీ సంఘాలలో నిర్వహించే కేంద్రం. ఇక్కడ స్టీల్ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్, చెంచాలు ఇలా ఫంక్షన్లు, అన్నదానాలకు సంబంధించిన పూర్తి వంటసామగ్రిని నిల్వ ఉంచుతారు. ఊరి మీద నిర్వహించే అన్నదానాలు, సప్తాహాలు, పండుగలప్పుడు వీటినే ఉపయోగిస్తారు. వ్యక్తిగతంగా ఇళ్లల్లో ఏవైనా కార్యక్రమాలుంటే స్టీల్బ్యాంక్ నుంచి ఇస్తారు. కార్యక్రమం పూర్తయ్యాక వాటిని తిరిగి అందించాల్సి ఉంటుంది. చాలా గ్రామాల్లో వీటిని ఉచితంగానే ఇస్తున్నారు. పలువురు దాతలు స్టీల్బ్యాంకులకు ఈ వస్తువులను విరాళంగా అందిస్తున్నారు. -
రోడ్డెక్కిన అన్నదాతలు
నర్సాపూర్ (జి): పంటల కొనుగోళ్లలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు ఆందోళనకు దిగారు. నర్సాపూర్ (జి), దిలావర్పూర్ మండలాల్లోని రాంపూర్, టెంబుర్ని, గుండంపల్లి గ్రామాల రైతులు మొక్కజొన్న, జొన్న పంటలు కొ నుగోలు చేయాలని బుధవారం గుండంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద 61వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, లారీ ల కొరత, అధికారుల నిర్లక్ష్యంతో కొద్దిరోజులుగా కొనుగోళ్లు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులు, అకాల వర్షాలతో తమ పంట ఏ మవుతుందోనని ఆందోళనకు గురవుతున్నట్లు చె ప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. సుమారు 5గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల మేర ని లిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ వచ్చేదాకా ఆందోళన విరమింపబోమని రైతులు భీష్మించారు. పోలీస్, రెవె న్యూ, వ్యవసాయశాఖల అధికారులు వచ్చి వారిని సముదాయించినా ససేమిరా అన్నారు. ఆర్డీవో రత్నకల్యాణి వచ్చి రైతులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. చివరకు నర్సాపూర్ (జి) తహసీల్దార్ శ్రీకాంత్ కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ఫోన్ చేసి రైతు రమణారెడ్డితో మాట్లాడించారు. రెండు, మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఆర్డీవో రత్నకల్యాణి, డీఏవో అంజిప్రసాద్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి, నర్సాపూర్ (జి), దిలావర్పూర్ ఎస్సైలు గణేశ్, రవీందర్, నర్సాపూర్ (జి), దిలావర్పూర్ తహసీల్దార్లు శ్రీకాంత్, ఎజాజ్ అహ్మద్, ఏవో రాంచందర్నాయక్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. అంబులెన్స్కు దారి ఇచ్చిన రైతులు తమ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని గుండంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రాస్తారోకో చేస్తున్న అన్నదాతలు అంబులెన్స్కు దారి ఇచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గర్భిణులు, చంటి పిల్లలతో వెళ్తున్న వాహనదారులకూ దారి ఇచ్చారు. -
పీఏసీఎస్లకు పాత పాలకవర్గాలు
లక్ష్మణచాంద: హైకోర్టు ఆదేశాల మేరకు పీఏసీఎస్ లలో బుధవారం పాత పాలకవర్గాలు కొలువుదీరా యి. నిన్నటివరకు వీటికి నామినేటెడ్ పద్ధతిలో నూ తన పాలకవర్గాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో చాలామంది ఆశావహులు పదవుల కోసం ఎదురుచూశారు. గతంలో ప్ర భుత్వం సిట్టింగ్ పాలకవర్గాలను అర్ధంతరంగా తొ లగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పద్ధతిలో నూతన చైర్మన్లు వస్తారని ఆశిస్తున్న తరుణంలో పాత పాలకవర్గాలనే కొనసాగించాలంటూ హై కోర్టు ఆదేశాలిచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఓటింగ్ పద్ధతిలో పీఏసీఎస్ పాలకవర్గాలు ఏర్పాటయ్యా యి. 2025 ఫిబ్రవరి 13నాటికి పదవీకాలం ముగి యగా ప్రభుత్వం మరో ఆర్నెళ్లు పొడిగించింది. 2025 ఆగస్టు 14తో ఈ గడువు కూడా ముగియగా మళ్లీ వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 డిసెంబర్ 19న పాలకవర్గాలను ఆకస్మికంగా తొలగించింది. ఆ తర్వాత పీఏసీఎస్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ జీవో 597ను విడుదల చే సింది. దీంతో పలువురు పీఏసీఎస్ చైర్మన్లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. నూతన పాలకవర్గాలను ఎన్నుకునేదాకా తమనే కొనసాగించాలని కో రారు. దీంతో గత డిసెంబర్ 23న హైకోర్టు పాత పాలకవర్గాలను కొనసాగించాలని ఆదేశించినా ప్ర భుత్వం స్పందించలేదు. ఈసారి మళ్లీ వారు హైకో ర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ కేసు వేయగా ప్ర భుత్వం దిగివచ్చింది. ఈ మేరకు జీవో 597ను ఉపసంహరించుకుంటూ పాత చైర్మన్లకు బాధ్యతలు అ ప్పగించాలని రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు వచ్చిన ట్లు జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 77 సంఘాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 పీఏసీఎస్లుండగా వీటిలో నిర్మల్ జిల్లాలో 17, ఆదిలాబాద్లో 28, మంచిర్యాలలో 20, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 12 ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు బుధవారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్ ఇన్చార్జి చైర్మన్లుగా పాతవారే మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. -
బోనమెత్తిన రాచాపూర్
లక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్ బోనమెత్తింది. బుధవారం గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ ఐదోవార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికో బోనం చొప్పున సిద్ధం చేశారు. అనంతరం మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ముందుగా మహాలక్ష్మి, అనంతరం పెద్దమ్మతల్లి అమ్మవార్లకు బోనాలు సమర్పించి పూజలు చేశారు. పిల్లాపాపలతో చల్లగా చూడాలని మొక్కుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన తొమ్మిదిమంది బైండ్ల పూజారులు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. సర్పంచ్ మహేశ్, గ్రామస్తులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. -
‘అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’
ఖానాపూర్: గ్రామాలాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మండలంలోని సత్తెనపల్లి గ్రామంలో రూ.12లక్షలతో చేపట్టిన అంగన్వాడీ భవనం, రూ.7.50 లక్షలతో చేపట్టిన పాఠశాల ప్ర హరీ, రూ.7లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాల కు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రా ధాన్యత ఇస్తూ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. అంతకుముందు గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్ర మంలో సర్పంచ్ సీర్ల విజయానంద్, నాయకులు నేతుల లక్ష్మణ్, గుమ్ముల రమేశ్, గోపీనాయక్, గంగారెడ్డి, పోశెట్టి, అధికారులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి నిర్మల్చైన్గేట్: కాంగ్రెస్ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పెన్షనర్ సంఘ భవనంలో కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి బూత్ లెవల్ ఏజెంట్లు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. టీపీసీసీ కార్యదర్శి ఏంబడి రాజేశ్వర్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, నాయకులు సాధ సుదర్శన్, అప్పాల గణేశ్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ దస్తురాబాద్: మండల కేంద్రంలోని తహసీల్దార్ కా ర్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జు 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పీఏసీఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ, డైరెక్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ యాదవరావ్, ఆర్ఐ సంతోష్, మాజీ ఎంపీపీ సింగరి కిషన్, సర్పంచులు గోపాల్, నరేశ్రెడ్డి, నరేశ్, గంగన్న, సురేందర్ తదితరులున్నారు. -
మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి
● గోదాముల నిల్వ సామర్థ్యం పరిశీలనసారంగపూర్: మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అంతకుముందే వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలోని గోదా ములను తనిఖీ చేశారు. యాసంగి ధాన్యం నిల్వ ఉంచేందుకు ఎంత మేర గోదాముల అవసరముందో సివిల్ సప్లయ్ అధికారులతో మాట్లాడారు. అ నంతరం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీ లించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు గన్నీబ్యాగుల కొరతతో పాటు లారీల సమస్య ఉందని కలెక్టర్కు వివరించారు. వెంటనే గన్నీ బ్యాగులు తెప్పించాలని, లారీ ల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పక్కనే ఉన్న జొన్నల కొ నుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కొనుగో లు కేంద్రం ప్రారంభమైనా ఇంతవరకూ గన్నీబ్యాగులు ఇవ్వలేదని కలెక్టర్కు రైతులు తెలిపారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ వెంటనే గన్నీ బ్యాగులు తెప్పించి రైతుల ఇబ్బందులు తీర్చాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, తహసీల్దార్ విజయ్కాంత్రావు, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఎంపీవో అజీజ్ఖాన్, ఏఎంసీ కార్యదర్శి ధూమ్డానాయక్, కోఆపరేటివ్ సొసైటీల ఇన్చార్జి భూమన్న, సీఈవో మల్లేశ్ తదితరులున్నారు. ధాన్యపు సంచులను భద్రంగా నిల్వ చేయాలి నిర్మల్చైన్గేట్: ధాన్యపు సంచులను భద్రంగా నిల్వ చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యా ర్డు గోదాములో ధాన్యం డంపింగ్ తీరును పరిశీలించారు. ఇప్పటివరకు నిల్వ చేసిన ధాన్యపు సంచుల వివరాలు, అన్లోడింగ్కు వరుసలో ఉన్న లారీల వి వరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లారీల్లో వచ్చిన దాన్యపు సంచుల ను ఎప్పటికప్పుడు భద్రంగా నిల్వ చేయాలని సూ చించారు. ఎక్కువమంది హమాలీలను నియమించుకుని వెంటవెంటనే ధాన్యపు సంచుల డంపింగ్ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. అనంతరం సమీ పంలోని వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లే కుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సూ చించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ (రెవె న్యూ) కిశోర్కుమార్, పౌరసరఫరాల అధికారి, మే నేజర్ రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ రాజు, ఏఎంసీ చైర్మన్ భీమ్రెడ్డి, అధికారులున్నారు. -
అభిలాష అభినవ్కు వీడ్కోలు
నిర్మల్చైన్గేట్: నిర్మల్ కలెక్టర్గా విశేష సేవలందించి బదిలీపై వెళ్తున్న అభిలాష అభినవ్కు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. కలెక్టర్గా అభిలాష అభినవ్ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన నుంచి పరిపాలనలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ప్ర జాసమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నా రు. విపత్తుల సమయంలో సమర్థవంతమైన చర్యలు చేపట్టడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, శాఖల మధ్య సమన్వయం సాధించడం ద్వారా జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిపారని అధికారులు గుర్తు చేసుకున్నారు. అనంతరం అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లాలో పనిచేయడం తనకు ఒక మధురమైన అనుభవమని ఆమె తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రతీ అధికారి, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. టీమ్వర్క్తోనే లక్ష్యాలను సాధించగలిగామని తెలిపా రు. నిర్మల్ జిల్లా ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ గుర్తుంటాయని పేర్కొన్నారు. పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అధికారులు ఆమెను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, సబ్ కలెక్టర్ సంకేత్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
గోదాములకు చేరుతున్న ధాన్యం నిల్వలు
భైంసాటౌన్: పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రబీ ధాన్యం సేకరణ ప్రారంభమైంది. ఈ మేర కు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదా ములకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని మిర్చియార్డులోగల 2,500 మెట్రి క్ టన్నుల సామర్థ్యమున్న గోదాముకు ధాన్యం సంచులను లారీల్లో తరలించారు. హమాలీల సహాయంతో ధాన్యం సంచులు అన్లోడ్ చేసి గోదాములో నిల్వ చేస్తున్నారు. ఈ మేరకు బుఽ దవారం సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్ గోదాముకు చేరుకుని తనిఖీ చేశారు. ధాన్యం నిల్వ తదితర వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ శశిభూషణ్ తదితరులున్నారు. -
స్పందించి.. తక్షణమే వైద్యం అందించి..
భైంసాటౌన్: తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకున్న రెండు నెలల గర్భిణికి తక్షణ వైద్యసేవలు అందించి ఆమె ప్రాణం నిలిపిన ఘ టన భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పపత్రిలో జరి గింది. వివరాలు.. ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రా మానికి చెందిన లలిత రెండు నెలల గర్భిణి. ఈ క్ర మంలో బుధవారం తీవ్ర రక్తస్రావంతోపాటు బీపీ పడిపోయి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కు టుంబీకులు వెంటనే భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తీసుకురాగా, సూపరింటెండెంట్ కాశీనాథ్ నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే స్పందించా రు. ముందుగా ఆమెకు అవసరమైన వైద్య చికిత్స అందజేసి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటంతో ర క్తం అవసరమైంది. అప్పటికప్పుడు రక్తదాతలను సంప్రదించి ఆమెకు రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. కొద్ది సేపటికి ఆమె స్పృహలోకి వచ్చింది. ఆ మె పూర్తిగా కోలుకున్న తర్వాత 108 అంబులెన్స్లో తిరిగి ఇంటికి పంపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లలితకు సత్వర వైద్యం అందించి, ప్రాణాలు కాపాడడంతో ఆమె కుటుంబీకులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గర్భిణికి వైద్యం అందించిన వైద్యులు రోజా, పవన్, సరోజ, కై లాస్, సుమను డాక్టర్ కాశీనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. -
సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: సీఎంఆర్ డెలివరీని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. డెలివరీలో వెనుకబడిన మిల్లర్లు, ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. మిల్లులకు సంబంధించిన అన్ని రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సీఎంఆర్ ప్రక్రియలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల ద్వారా తరలించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, రైస్ మిల్ల ర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
లక్ష్మణచాంద: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బాలల సంరక్షణ అధికారి వోస శ్రీనివాస్ అన్నారు. మండల జరగాల్సిన ఓ బాల్య వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకున్నారు. 15 ఏళ్ల బాలికకు నిశ్చితార్థం చేశారని సమాచారం అందుకు న్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలిక ఇంటికి చేరుకు ని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలల ఆయన మాట్లాడుతూ బాల్య వివా హ నిరోధక చట్టం–2006’ ప్రకారం18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకి వివాహం చేయడం నేరమన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. పిల్లల భవిష్యత్తు కోసం వారి విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098కు సమాచారం ఇ వ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై శ్రావణి, డి ప్యూటీ తహసీల్దార్ బాబుసింగ్, సర్పంచ్ వోస కవి త, సూపర్వైజర్ ప్రసున్నకుమారి, చైల్డ్ హెల్ప్లైన్ జిల్లా సమన్వయకర్త నల్ల గంగాధర్, కౌన్సిలర్ సు ప్రియ, కేస్ వర్కర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
దిక్కులేక.. బిక్కుబిక్కుమంటూ..
భైంసారూరల్: భైంసా మండలం గుండేగాం గ్రామస్తులు ప్రతీ వర్షాకాలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన దుస్థితి. పల్సికర్ రంగారావు ప్రా జెక్టు నిర్మాణంతో గ్రామం కొన్నేళ్లుగా వర్షాకాలంలో బ్యాక్ వాటర్ ముంపు ముప్పు ఎదుర్కొంటోంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులు ఊరిలో కి నీళ్లు రావని హామీ ఇచ్చినా.. తొమ్మిదేళ్లుగా వర్షాకాలంలో గ్రామం పూర్తిగా నీటమునుగుతోంది. పునరావాసం ఉత్తమాటే.. గ్రామం నీటమునిగిన ప్రతిసారీ ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించి పునరావాసం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. కానీ అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికే అనేక ఇళ్లు శిథిలావస్థకు చేరుకుని నేలమట్టమయ్యాయి. కమలాపూర్ గుట్ట వద్ద కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న బాధితుల్లో చాలామంది ఇప్పటికే పట్టణాలకు వలస వెళ్లారు. వ్యవసాయంపై ఆధారపడిన కొన్ని కుటుంబాలు మాత్రం దిక్కులేక బిక్కుబిక్కుమంటూ అక్కడే నివసిస్తున్నాయి. వానాకాలమొస్తే టెన్షన్.. ప్రస్తుతం తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో, కమలాపూర్ గుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గుండేగాం వాసులు తలదాచుకుంటున్నారు. 131 కుటుంబాలతోపాటు మిగిలిన గ్రామస్తులు శాశ్వత పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో, మళ్లీ పాత కథ పునరావృతమవుతుందన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది. వేసవికాలం ముగిసేలోపు ప్రభుత్వం స్పందించి, పునరావాసం కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. గుండేగాం గ్రామ ప్రజల కష్టం ఎప్పటికి తీరుతుందో అన్న ప్రశ్న మళ్లీ ముందుకొచ్చింది. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుండగా గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ప్రతి ఏడాది వానాకాలం వస్తుందంటే గుండేగాం ప్రజలకు భయం మొదలవుతుంది. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్వాటర్ కారణంగా గ్రామం పూర్తిగా నీటమునుగుతోంది. నాయకుల సందర్శనలు.. గతంలో మంత్రులు జోగు రామన్న, అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు. అప్పటి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినప్పటికీ పునరావాసం అమలు కాలేదు. తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే... తొమ్మిదేళ్లుగా వర్షాకాలంలో బాధితులకు రెవెన్యూ అధికారులు పట్టణంలో తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ప్రస్తుతం కమలాపూర్ గుట్ట సమీపంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లలో 131 కుటుంబాలు తాత్కాలికంగా నివసిస్తున్నాయి. మిగతా కుటుంబాలు కూడా ఎప్పటికై నా శాశ్వత నివాసం లభిస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నాయి. వేసవి దాటితే మళ్లీ అదే కథ... ప్రస్తుతం వేసవికాలం కావడంతో పునరావాస చర్యలు చేపట్టేందుకువీలుంది. లేని పక్షంలో జూన్లో మొదలయ్యే వానలకు మళ్లీ గ్రామం నీటమునిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గుండేగాం గ్రామానికి శాశ్వత పునరావాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వం వద్ద పెండింగ్.. గుండేగాంకు పునరావాసంకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. అక్కడ పెండింగ్లో ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాక తదుపరి చర్యలు చేపడుతాం. – అనిల్, డీఈఈ ఇరిగేషన్ గుండేగాం గ్రామం గ్రామానికి రంగారావు ప్రాజెక్టు ముంపు ముప్పు ప్రధాన సమస్య ఇదే... పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణంతో తొమ్మిదేళ్లుగా ప్రతి వర్షాకాలంలో బ్యాక్వాటర్ గ్రామంలోకి చేరుతోంది. భారీ వర్షాలు కురిస్తే ఇళ్లు పూర్తిగా నీటమునుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గ్రామస్తులు తమ ఊరిలోకి నీళ్లు వస్తాయని అధికారులకు చెప్పగా వారు ఊరిలోకి నీళ్లు రావని హామీ ఇచ్చారు. ముందుచూపు లేక అధికారులు వేసిన అంచనాలు, ప్రణాళికలో డొల్లాతనాన్ని బ్యాక్ వాటర్ బహిర్గతం చేస్తోంది. గ్రామ వివరాలు: గ్రామం : గుండేగాం కుటుంబాలు : 162రేషన్ కార్డులు : 236 జనాభా : 694 పునరావాసం మాటల్లోనే... గుండేగాంలోకి నీరు ప్రవేశించిన ప్రతి సారి ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామానికి చేరుకుని బాధితులకు పునరావాసం కల్పిస్తామని హామి ఇస్తున్నారు. కానీ అమలులో చూపడం లేదు. దీంతో ప్రతి వర్షాకాలం ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. పునరావాసం కల్పిస్తామని ఏళ్లు గడుస్తున్న ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో బాధితుల ఇండ్లన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్ని నేలమట్టమయ్యాయి. దీంతో నిల్వ నీడలేక ఎంతో మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వ్యవసాయ ఆధారంపై కాలం వెళ్లదీస్తున్న కొన్ని కుటుంబాలు బిక్కుబిక్కుంటు అక్కడే ఉంటున్నారు. భైంసా సమీపంలోని కమలాపూర్ గుట్ట వద్ద కొత్త గ్రామం ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారినా గుండేగాం ప్రజల పరిస్థితి మాత్రం మారలేదు. -
మొక్కజొన్న కొనుగోళ్లకు బ్రేక్
తానూరు: మండల కేంద్రం తానూరు, బెల్తరోడా గ్రామాల్లో మొక్క జొన్న కొనుగోళ్లు తాత్కాలికంగా నిలివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవల కొనుగోలు చేసిన మొక్కజొన్న గోదాంలలో భారీమత్తంలో నిల్వలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తానూరులో ఇప్పటివరకు 14 వేల క్వింటాళ్లు, బెల్తరోడాలో 6 వేల క్విటాళ్లు కొనుగోలు చేశారు. తానూరులో 28 వేల బ్యాగులకు 17 వేల బ్యాగులు తీసుకువెళ్లగా 11 వేల బ్యాగులు కేంద్రంలో ఉన్నాయి. బెల్తరోడా కేంద్రంలో 12 వేల బ్యాగులకు 6 వేల బ్యాగులు తీసుకువెళ్లగా మరో 6 వేల బ్యాగులు అక్కడే ఉన్నాయి. గన్నీ సంచుల కొరత.. మొక్కజొన్న బస్తాలు తరలించేందుకు సకాలంలో లారీలు రాక, గన్నీ సంచులు లేక అధికారులు కొనుగోళ్లు తాత్కలికంగా నిలివేశారు. సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు. తక్కవ ధరకు ప్రైవేటుకు.. ఈ ఏడాది మండలంలో మొత్తం 6,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. నీటి వసతి ఉండడంతో మంచి దిగుబడి వచ్చింది. అయితే పంట అమ్ముకోవడంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ కింటాల్కు రూ.2400 చెల్లిస్తుండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.1,700 వందలకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. -
ఎర్లీబర్డ్.. అంతంతే!
భైంసాటౌన్: పట్టణాల్లో ఆస్తిపన్నుల ముందస్తు వసూలు కోసం పురపాలక శాఖ చేపట్టిన ఎర్లీబర్డ్ స్కీంకు జిల్లాలో అంతంత మాత్రంగానే స్పందన లభించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను ముందుగా చెల్లించినవారికి అంటే ఏప్రిల్ 30 వరకు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ అవకాశం కల్పించింది. అయితే జిల్లాలోని ఆయా బల్దియాల్లో 10–15 శాతం ప్రజలు మాత్రమే ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించారు. తాజాగా ఈనెల 7 వరక గడువు పొడిగించినట్లు పురపాలక అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వసూలు ఇలా.. ఎర్లీబర్డ్లో భాగంగా జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లో 5 శాతం రాయితీపై ఆస్తిపన్ను వసూలు పరిశీలిస్తే.. నిర్మల్లో రూ.2.01 కోట్లు(15శాతం), భైంసాలో రూ.55 లక్షలు(8.16శాతం), ఖానాపూర్లో రూ.35.10 లక్షలు (12.60శాతం) వసూలయ్యాయి. ఈ లెక్కన నిర్మల్ మున్సిపాలిటీలో ప్రజలు ఈ అవకాశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. భైంసా చివరిస్థానంలో ఉంది. అవగాహన లేక.. ఎర్లీబర్డ్ స్కీంకు సంబంధించి మున్సిపల్ అధికారులు అంతగా ప్రచారం చేపట్టలేదు. దీంతో ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తేప్రయోజనం ఉంటుంది. అయితే, అధికారులు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నారు. దీంతో పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసినవారు, ఈ స్కీం గురించి తెలిసినవారు మాత్రమే ముందస్తుగా చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆస్తిపన్ను బకాయిలు ఉన్నవారు ఈ స్కీంకు అర్హులు కారు. సద్వినియోగం చేసుకోవాలి.. ఆస్తిపన్ను ముందుగా చెల్లించేవారిని ప్రోత్సహించేందుకు పురపాలక శాఖ ఏటా ఎర్లీబర్డ్ పథకం చేపడుతోంది. ఇందులో భాగంగా ఈసారి (2026–27 ఆర్థిక సంవత్సరం)సైతం ఆస్తి పన్నును ఏప్రిల్ 30 వరకు చెల్లించినవారికి 5 శాతం రాయితీ అవకాశం కల్పించాం. చాలామంది సద్వినియోగం చేసుకోలేదు. ఈనెల 7వ తేదీ వరకు గడువు ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – లింగయ్య, మున్సిపల్ కమిషనర్, భైంసా -
గన్నీ బ్యాగుల లొల్లి
లోకేశ్వరం: మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి మక్కల గన్నీ బ్యాగులు మంగళవారం వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా కార్యాలయానికి చేరుకున్నారు. బ్యాగులు తీసుకునే విషయంలో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. సోమవారం 15 వేల బ్యాగులు రాగా, మంగళవారం 26 వేల బ్యాగుఉల వచ్చాయి. కొందరు రైతులు బ్యాగులను వాహనాల్లో తీసుకెళ్లారు. దీంతో అందరి రైతుల్లో నిరాశ నెలకొంది. ఈ విషయమై పీఏసీఎస్ సీఈవో భూషణ్ను వివరణ కోరగా రైతులు ఒక్కసారిగా వచ్చి తమ సిబ్బందిని తోసేసి గన్నీ బ్యాగులు లాక్కెళ్లారని తెలిపారు. -
సంప్రదాయానికే పెద్దపీట
నిర్మల్ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలోని లంబాడా(బంజారా) గిరిజనుల జీవన విధానం అత్యంత సరళంగా ఉన్నప్పటికీ, వారి ఆచారాలు, సంప్రదాయాలు మాత్రం లోతైన అర్థం కలిగి ఉంటాయి. ఈ సంప్రదాయాలు వారి పండుగల్లో, ముఖ్యంగా వివాహ వేడుకల్లో అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. తాజాగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) శాంతినగర్ తండాలో జరిగిన వివాహ వేడుక, లంబాడా సంస్కృతిలోని ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది. వివాహానికి ముందు రోజు నిర్వహించే ’టీలా’ వేడుకలో వరుడి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక వీరుడిలా ముస్తాబైన వరుడు, కుడిచేతిలో కటారిని, దాని చివరన లంబాడా సంస్కృతిని ప్రతిబింబించే బట్టతో చేసిన తొడుగు, నిమ్మకాయను పట్టుకుంటాడు. మరో చేతిలో కత్తిని ధరించి, సంప్రదాయ దుస్తుల్లో వరుడు కనిపించడం వారి పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప వారసత్వానికి నిదర్శనం. ఆధునిక కాలంలో జీవనశైలి మారుతున్నప్పటికీ, తమ మూలాలను, ఆచారాలను నేటికీ అత్యంత భక్తిశ్రద్ధలతో కాపాడుకుంటున్నామని గిరిజన నాయకులు సీతారాంనాయక్, రాథోడ్ సాధుసింగ్ గర్వంగా తెలిపారు. -
ఆయిల్పామ్ సాగువిస్తీర్ణం పెంచాలి
ఖానాపూర్: రైతులు సంప్రదాయ పంటలతోపాటు ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలపై దృష్టి సారించి ఆదాయం పెంచుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రుణాలను వినియోగించుకుని ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా రైతులు మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. అవగాహన లేని రైతులకు అధికారులు మార్గదర్శకత్వం ఇవ్వాలని, రైతులకు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు రమణ, స్పందన, రాధ, నాయకులు గాడ్పు సత్యం, చిన్నం సత్యం, గుగ్లావత్ రాజేందర్నాయక్, యూసుఫ్ఖాన్, పోలంపల్లి రమేశ్, గొర్రె గంగాధర్, మదిరె సత్యనారాయణ, ద్యావతి రాజేశ్వర్, పోలంపెల్లి సచిన్, ఆత్రం అర్జున్, అంకుశ్రావు, శేషాద్రి, దాసరి రాజన్న, గోల్కొండ ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్ బెడ్రూమ్’లో అక్రమాలపై ఫిర్యాదు
ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీమ్ చౌరస్తాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, అనర్హులను తొలగించి అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్ భవేశ్ మిశ్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ కన్వీనర్ తోట రాధ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో గతంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈవిషయమై ఆందోళనలు చేసినా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 400 ఇళ్లపై పూర్తి స్థాయిలో రీసర్వే నిర్వహించి, లబ్ధిదారుల నుంచి సెల్ఫ్ అఫిడవిట్లు తీసుకుని అర్హులను గుర్తించాలని సూచించారు. సమగ్ర విచారణతో వాస్తవాలు బయటపడతాయన్నారు. విచారణ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారంలో ఆలస్యం కొనసాగితే అర్హులతో కలిసి ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటవార్పులు చేస్తూ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పేదల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జరీనా, లక్ష్మి, లావణ్య, రుక్మా, మజీద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్చైన్గేట్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణకుమార్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి, కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్టంలో అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాలలో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులకు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. కలెక్టర్ భవేశ్మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిర్ణీత సమయానికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. -
పూడిక.. తీసేదిలేదా ఇక!
● ఆయకట్టు రైతులకు తప్పని తిప్పలు కడెం: నిర్మల్, మంచిర్యాల జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు కడెం. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టు. అయితే ఇందులో పేరుకుపోయిన పూడిక, రైతుల పాలిట శాపంగా మారింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం సగానికి తగ్గిపోయింది. దీంతో పూడిక తొలగించి సాగునీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు 2024లోనే రాష్ట్ర ప్రభుత్వం పూడికతీత పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లు కావొస్తున్నా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదు. ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినా, క్షేత్రస్థాయిలో పురోగతి లేకపోవడంతో పూడికతీతపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. పూడికతీత పనులను దక్కించుకున్న రాజస్థాన్కు చెందిన ’ఈథర్’ కంపెనీ, హైడ్రాలజీ సర్వే నిర్వహించినా పనులను ప్రారంభించలేదు. డంపింగ్ యార్డ్ కోసం భూమి గుర్తింపులో జాప్యం, అగ్రిమెంట్లో లోపాలు తదితర కారణాలతో సదరు సంస్థ వెనకడుగు వేస్తోందని సమాచారం. దీనిపై ఇరిగేషన్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఫలితం లేదు. తాజాగా కలెక్టర్ భవేశ్మిశ్రా ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపి, ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేసి, కొత్త వారికి పనులు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యాసంగిలో ఆయకట్టుకు నీటి ఎద్దడి.. కడెం ప్రాజెక్టుపై ఆరు మండలాల పరిధిలోని సుమారు 68,150 వేల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ప్రాజెక్టులో పూడిక పెరిగి నీటి నిల్వ తగ్గడం వల్ల యాసంగిలో పంటలకు సరిపడా నీరు అందడం లేదు. సాగు 25 వేల ఎకరాలకు తగ్గిపోయింది. ఈ పంటలకు కూడా వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నా, అది రైతులకు ఏమాత్రం సరిపోక పంటలు ఎండిపోతున్నాయని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపడితేనే, వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. నోటీసులు ఇచ్చాం.. కడెం ప్రాజెక్టులో పూడికతీత పనులు ప్రారంభించని కాంట్రాక్ట్ కంపనీకి పలుమార్లు నోటీసులు జారీ చేశాం. పూడితకతీత కోసం హైడ్రాలజీ సర్వే నిర్వహించిన కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. ఈ విషయం ఇటీవలే ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. – ప్రవీణ్, ఈఈ కడెం ప్రాజెక్టుపూడికతో నిండిన కడెం ప్రాజెక్ట్ 4 టీఎంసీల పూడిక.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. అందులో సగానికి పైగా పూడిక పేరుకుపోయినట్లు అంచనా. 2013 నాటి సర్వే ప్రకారం సుమారు 2.7 టీఎంసీల మేర పూడిక ఉందని గుర్తించగా, ప్రస్తుతం అది 4 టీఎంసీలకు చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో వరదతోపాటు వచ్చే మట్టి, ఇసుక బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టు గర్భం నిండుతోంది. నిర్మాణం నాటి సిల్ట్ గేట్లు నిర్వహణ లేక పేరుకుపోయింది. నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తోంది. -
వినతులు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి..
భైంసాటౌన్: పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించారు. సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భైంసా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 10 వినతులు రాగా, పరిశీలన కోసం సంబంధిత అధికారులకు ప్రతిపాదించారు. అన్ని ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేస్తామని, ఫిర్యాదుల పరిష్కారానికి 30 రోజుల గడువు ఉంటుందన్నారు. ● పాంగ్ర గ్రామ పంచాయతీలోని బాకోట్ గ్రామంలో శ్మశానవాటిక లేకపోవడంతో అంత్యక్రియలకు ఇబ్బంది ఏర్పడుతోందని గ్రామస్తులు పలువురు విన్నవించారు. ● తన తండ్రి మరణానంతరం ఆయన పేరుపై ఉన్న 0.21 గుంటల భూమిని తనపేరు మీద విరాసత్ చేయాలని భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన సిద్దార్థ్ వినతిపత్రం అందజేశారు. ● విద్యుదాఘాతంతో పంట నష్టపోయిన తమకు పరిహారం ఇప్పించాలని కుంటాల మండలం పెంచికల్పాడ్ గ్రామానికి చెందిన జాదవ్ అరుణబాయి కోరారు. ● పెంచికల్పాడ్ నుంచి అందకూరు మార్గంలో ఏడాది కిందట రోడ్డు వేశారని, అయితే, గ్రామంలోని వాగుపై ఉన్న వంతెన పక్కన రెండువైపులా బీటీ వేయకపోవడంతో కంకర తేలి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గ్రామానికి చెందిన కిష్టయ్య కోరారు. -
కొత్త కలెక్టర్పై కోటి ఆశలతో..
నిర్మల్చైన్గేట్: కొత్త కలెక్టర్పై కోటి ఆశలతో జిల్లా వాసులు సోమవారం ప్రజావాణికి తరలివచ్చారు. ఇటీవలే భవేశ్మిశ్రా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. గత వారం సీఎంతో మీటింగ్ ఉండడంతో ప్రజావాణికి రాలేదు. ఈ వారం స్వయంగా ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యలను ఓపికగా విన్నారు. పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు. ఇక డివిజన్ల వారీగా ప్రజావాణి సోమవారం ప్రారంభమైంది. నిర్మల్ ఆర్డీవో, భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ ప్రజావాణి నిర్వహించారు. జన గణనలో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫ్ ఎన్యుమరేషన్ వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాకు కుంటాల మండలం సూర్యాపూర్ గ్రామంలో 1/ఆ సర్వే నంబర్ లో 3 గుంటల భూమి ఉంది. రెండేళ్ల క్రితం మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఈ స్థలంలో రేకుల షెడ్డు వేసి ఆక్రమించుకున్నారు. స్థానిక ఎమ్మార్వో కు ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదు. – తానూరు పోసాని -
చల్లగా శిక్షణ
జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. మండే ఎండల మధ్య కూడా ప్రభుత్వ జనగణన ప్రక్రియ కోసం ఎంపిక చేసిన ఎన్యుమరేటర్లకు తుదివిడత శిక్షణ నిర్వహిస్తోంది. నిర్మల్ రూరల్, సోన్, మామడ, నర్సాపూర్(జి), ఖానాపూర్ మండలాల్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది. మండే ఎండలు, ఉక్కపోత కారణంగా శిక్షణకు హాజరవుతున్న సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో మండలాల సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లు శిక్షణా కేంద్రాల్లో ఇలా కూలర్లు ఏర్పాటు చేయించారు. బుధవారం వరకు శిక్షణ కొనసాగుతుంది. ఈనెల 11 నుంచి జూన్ 9 వరకు గృహజాబితా తయారీ, సమాచార సేకరణ నిర్వహిస్తారు. – నిర్మల్ఖిల్లా -
మళ్లీ ఎల్ఆర్ఎస్
నిర్మల్పొల్లుగూడలో పెర్సపేన్ ఉత్సవాలు ఇంద్రవెల్లి మండలం పొల్లుగూడలో జుగ్నాక్ వంశీయుల పెర్సపేన్కు పూజలు చేశారు. జుగ్నాక్ వంశంలోని కోడళ్లకు భేటింగ్ నిర్వహించారు. నిర్మల్ ఎస్డీపీవోగా శ్రీనివాస్ నిర్మల్టౌన్: నిర్మల్ సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా పి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకీషర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. శాంతి భద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ సూచించారు. అలాగే నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. నిర్మల్చైన్గేట్: ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లు క్రమబద్ధీకరణ చేసుకునే వారికి మరోమారు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. 2020లో ఎల్ఆర్ఎస్ (లే ఆవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రాష్ట్ర పురపాలక శాఖ ప్రారంభించింది. 2020లో చేసిన దరఖాస్తు దారుల్లో పలువురు ఇంటి నిర్మాణం, మరికొందరు ప్లాట్లను విక్రయించారు. గతంలో ప్రభుత్వం రాయితీ ప్రకటిస్తే అంతంతమాత్రంగానే ముందుకు వచ్చారు. మరోసారి ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ చెల్లించేవారికి 25 శాతం రాయితీ ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని నోటీసులు జారీచేసిన వారిలో 29,872 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఫోన్లకు సమాచారం.. జిల్లా వ్యాప్తంగా 44,602 మంది దరఖాస్తు చేయగా 37,939 ప్లాట్లకు ఆటోమెటిక్ ఫీజు చెల్లింపు సమాచారం వారి ఫోన్లకు పంపించారు. ఇప్పటి వరకు 10,027 దరఖాస్తు దారులు మాత్రమే డబ్బు చెల్లించారు. గతేడాది ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31వ తే దీ వరకు ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోమారు మే 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చె ల్లించిన వారికి రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఆశించింది రూ.16 కోట్లు ఎల్ఆర్ఎస్ ఫీజు రూపేణా నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీకి రూ.13 నుంచి రూ.14 కోట్లు, జిల్లాలోని 18 మండలాల పరిధిలో గ్రా మాల నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికార యంత్రాంగం ఆశించింది. అయితే ప్లాట్ల యజ మానుల నుంచి సరైన స్పందన లేని కారణంగా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్లాట్ల యజ మానుల చెల్లింపుతో రూ.11.50 కోట్లు మాత్రమే వచ్చాయి. హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం నిర్మల్టౌన్: బాసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ వెంకటరమణ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి యాక్సిడెంట్ బెనిఫిట్ స్కీం కింద మంజూరైన రూ.30 లక్షల చెక్కును ఎస్పీ జానకీషర్మిల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం వెంకటరమణ కుటుంబ సభ్యులకు అందించారు. మున్సిపాలిటీల వారీగా దరఖాస్తుల వివరాలు మున్సిపాలిటీ దరఖాస్తులు అనుమతి ఫీజు చెల్లించినవి చెల్లించాల్సినవి పొందినవి నిర్మల్ 15,550 12,987 3,565 9,422 భైంసా 9,058 7,345 1,062 6,283 ఖానాపూర్ 1,928 1,518 210 1,308 పదేపదే గడువు పెంచినా.. ఎల్ఆర్ఎస్కు 25 శాతం ఫీజు రాయితీ ప్రకటించిన ప్రభుత్వం తొలుత గతేడాది మార్చి 31వ తేదీ వరకు గడువు విధించగా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మరోసారి ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించింది. అయినా నామమాత్రంగానే స్పందన వచ్చింది. దీంతో మే 3వ తేదీ వరకు మళ్లీ గడువు పెంచినా ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మే నెల 31వ తేదీ వరకు చెల్లింపు గడువు పెంచుతూ మే 12న ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు అధికంగా ఉందని కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంతో ఇంకొందరు, లేదా ఫీజు ఇప్పుడెందుకు, తర్వాత చూద్దాంలే అని మరికొందరు అర్జీదారులు ముందుకు రాకపోవడం ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వివరాలు.. మొత్తం దరఖాస్తులు 44,602 నగదు చెల్లింపుకు అర్హులు 37,939 నగదు చెల్లించిన వారు 10,027 ఇంకా చెల్లించాల్సిన వారు 29,872 అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి నిర్మల్టౌన్: సమస్యలతో అర్జీ చేతపట్టుకుని ఠాణాకు వచ్చేవారి సమస్యలు పరిష్కరించాలని, సామాన్యులకు అండగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించాలని సూచించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మండలాల వారీగా.. మండలం దరఖాస్తులు అనుమతి ఫీజు చెల్లించినవి చెల్లించాల్సినవి పొందినవి బాసర 2,607 2,384 547 1,837 భైంసా 1,581 1,415 227 1,188 దస్తురాబాద్ 06 06 06 0 దిలావర్పూర్ 174 148 19 129 కడెం 77 66 09 57 ఖానాపూర్ 1,650 1,574 278 1,296 కుభీర్ 622 302 20 281 కుంటాల 388 350 74 276 లక్ష్మణచాంద 269 253 28 225 లోకేశ్వరం 346 294 50 244 మామడ 59 58 05 53 ముధోల్ 650 559 79 480 నర్సాపూర్(జి) 218 190 53 137 నిర్మల్ రూరల్ 5,607 5,128 1,158 3,970 పెంబి 65 40 04 36 సారంగాపూర్ 1,991 1,889 385 1,504 సోన్ 1,588 1,299 270 1,029 తానూర్ 167 135 24 111 -
కొనుగోలుకు కొర్రీలు!
భైంసాటౌన్: జిల్లాలో రబీ సీజన్ ధాన్యం సేకరణకు కొర్రీలు పెడుతున్నారు. నిబంధనలు అడ్డంకిగా మారాయి. గతంలో తప్పతాలు తీయకుండానే ధాన్యం సేకరించారని, ఈసారి మాత్రం కొనుగోలుకు కొర్రీలు పెడుతూ జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇది వరకు 40 కిలోల సంచికి రైతులు 41.5 నుంచి 42 కిలోల వరకు ఇచ్చేవారు. కానీ, ఈసారి జల్లెడ పట్టి ఇవ్వాలంటున్నారు. దీంతో అది సాధ్యం కాదని రైతులు వాపోతున్నారు. తప్పతాలు పేరుతో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై మండిపడుతున్నారు. అకాల వర్షాలు పడితే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఫాల్ట్తోనే తంటాలు.. జిల్లాలో ఈ రబీ సీజన్లో 1.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈసారి సేకరించిన ధాన్యం పూర్తిస్థాయిలో రైస్మిల్లులకు కేటాయించే పరిస్థితి లేదు. గత సీజన్లలో అధికారులు రైస్మిల్లర్లతో లాలూచి పడి ఇష్టారీతిన ధాన్యం కేటాయించారు. సీఎంఆర్ పూర్తి చేయకపోవడం, కొందరు రైస్మిల్లర్లు ధాన్యం పక్కదారి పట్టించడంతో సీఎంఆర్ ప్రక్రియలో రాష్ట్రంలోనే జిల్లా పేరు అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇటీవల బాసరకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి జిల్లాలో సీఎంఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈసారి డీఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం కేటాయించొద్దని నిర్ణయించినట్లు సమాచారం. మిగిలిన మిల్లులు సైతం బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో సేకరించిన ధాన్యం ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేయడం, లేదా ఇతర జిల్లాలకు తరలించడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ధాన్యం కొనాలని రైతుల ధర్నా నిబంధనల మేరకే సేకరణ.. జిల్లాలో రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రారంభించాం. జిల్లావ్యాప్తంగా 295 కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులు తప్పతాలు తీసిన ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. ఽ1.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశాం. డీఫాల్ట్ రైస్మిల్లర్లకు ధాన్యం కేటాయించేది లేదు. బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినవారికే ధాన్యం కేటాయిస్తాం. సేకరించిన ధాన్యం నిల్వ చేసేందుకు 33 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు గుర్తించాం. మిగిలిన ధాన్యం పెద్దపల్లి జిల్లాకు కేటాయిస్తాం. – రాజేందర్, డీసీఎస్వో మామడ: వరిధాన్యం కొనుగోలు చేయాలని కమల్కోట్, ఆదర్శనగర్, టెంబుర్ని గ్రామాల రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఽఆదివారం ధర్నా చేశారు. ధాన్యం చేతికివచ్చి 20 రోజులైనా కొనుగోళ్లు ప్రారంభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పతాలు పేరుతో యంత్రంతో శుద్ధి చేయాలని కొనుగోలు చేసేవారు ఇ బ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వి షయం తెలుసకున్న అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్రావు, సీఐ గోవర్ద న్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యలు లేకుండా ధాన్యం కొ నుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని తె లుపడంతో రైతులు ఆందోళన విమరించారు. -
రైతులకు అండగా ప్రభుత్వం
కడెం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్ అన్నారు. ఆదివారం మండలంలోని కొండుకూర్లో గ్రామ సర్పంచ్ మామిడిపెల్లి భీమేశ్తో కలిసి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మల్లేశ్, ఉపసర్పంచ్ పొద్దుటూరి సంపత్రెడ్డి, ఏపీఎం గంగాధర్, కళ్లెం తిరుపతిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికె మల్లేశ్యాదవ్, సీసీ మల్యాల స్వామి, రైతులు మొండేశ్, భూమన్న, బానయ్య తదితరులున్నారు. -
‘కేవీ’కి మోక్షం కలిగేనా?
భైంసా: జ్ఞాన సరస్వతీ అమ్మవారి నిలయమైన బాసరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థను నెలకొల్పేందుకు గతేడాది మే నెలలో కేంద్రీయ విద్యాలయ దక్షిణాది విభాగం అధికారులు బాసరకు వచ్చి అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బాసర ట్రిపుల్ఐటీ సమీపంలో గోదావరి నది మార్గంలో ఉన్న పలు ప్రాంతాలను వారు తనిఖీ చేశారు. తాత్కాలిక భవనాలను సైతం పరిశీలించారు. బాసర ట్రిపుల్ఐటీ సమీపంలో ఒక భవనం, గోదావరి నదికి వెళ్లే దారిలో మరో భవనాన్ని పరిశీలించారు. విద్యార్థుల వసతి, రవాణా సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేయడంపై చర్చలు జరిపారు. స్థలం కేటాయింపు.. రెవెన్యూ అధికారులు బాసరలోని సర్వే నంబర్ 4లో ఉన్న సుమారు 28 ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుండగా, అదే ప్రాంగణంలో శాశ్వత భవనాన్ని నిర్మించాలని జిల్లా యంత్రాంగం నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి ప్రతిపాదనలు అందడంతో, తుది అనుమతుల కోసం ఫైల్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలనలో ఉంది. దేశవ్యాప్తంగా మంజూరైన 47 కేంద్రీయ విద్యాలయాల జాబితాలో భాగంగా, బాసరలో కూడా ఈ విద్యాసంవత్సరం నుండే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య.. బాసరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైతే గ్రామీణ విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే కాకుండా, స్థానిక విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యాబోధన లభించనుంది. దీనివల్ల బాసర ప్రాంతం ఒక విద్యా కేంద్రంగా రూపాంతరం చెందుతుంది. ముఖ్యంగా యూపీఎస్సీ, ఎస్సెస్సీ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన పునాదిని ప్రాథమిక స్థాయి నుంచే నిర్మించుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఒకే రకమైన పాఠ్యప్రణాళిక అమలు కావడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు కొత్త విద్యా విధానం, డిజిటల్ విద్యకు పెద్దపీట వేస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, మారుమూల ప్రాంతాల్లోనూ విద్యా సదుపాయాలను విస్తరిస్తోంది. స్థానికంగా కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి రావడం వల్ల, ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. సరస్వతీ క్షేత్రమైన బాసరకు ఈ సంస్థ రాకతో, స్థానిక మౌలిక వసతులు మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయంగా ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. కేంద్రం కరుణిస్తేనే ... కేంద్రీయ విద్యాలయం... -
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
నియోజకవర్గంలో విద్య, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి సారించాను. ఎమ్మెల్యేగా గెలుపొందాక మన ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. వెనువెంటనే కేంద్రంతో చర్చించి బాసరలో స్థలాన్ని పరిశీలించాం. గత ఏడాది కేంద్రీయ విద్యాలయం కమిషనర్ డా.ముంజునాథం బాసర వచ్చారు. అప్పటి కలెక్టర్, రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వచ్చే ఏడాది తరగతులు ప్రారంభించేలా చూస్తాం. – పవార్ రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే -
ఇటర్న్షిప్ ఎంచుకో.. నైపుణ్యం పెంచుకో..
● రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే రూ.6 వేలు నిర్మల్చైన్గేట్: నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంచేందుకు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు బంగారు భవిష్యత్ ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తుంది. అనేక కంపెనీలు పీఎం ఇంటర్న్షిప్లో అందుబాటులో ఉంటాయి. నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత 6 నుంచి 9 నెలల్లో ఆయా కంపెనీలు నిరుద్యోగులకు ఇటర్న్షిప్కు అవకాశం కల్పిస్తాయి. గతనెల 1 నుంచి ప్రారంభమైన ఈ స్కీంలో వేలాది మంది నిరుద్యోగులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 10 నుంచి పీజీ వరకు.. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన వారు పీఎం ఇంటర్న్షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా కంపెనీలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల అర్హతను బట్టి ఆయా కంపెనీలు ఆఫర్ ఇస్తాయి. ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత మంచి ప్రదర్శన కనబరిస్తే, అదే కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. 18 నుంచి 25 ఏళ్లలోపు.. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, వార్షిక ఆదా యం రూ.12 లక్షల కంటే ఎక్కువ ఉంటే అనర్హులు. కంపెనీలు పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇటర్న్షిప్ సమయంలో ప్రమాద బీమా కూడా ఉంటుంది. కొన్ని కంపెనీలు టీఏ, డీఏలు అదనంగా చెల్లిస్తాయి. 50 శాతం హాజరుంటే సర్టిఫికెట్ కూడా ఇస్తాయి. ఆ సర్టిఫికెట్స్తో, ఇతర కంపెనీలో అవకాశం పొందవచ్చు. -
రైతు వారం.. సాగుకు సన్నద్ధం
లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించేందుకు ’రైతు వారోత్సవాలు’ నిర్వహిస్తోంది. మే 4 నుంచి 9 వరకు జరిగే ఈ కార్యక్రమం ఖరీఫ్ పంటల సాగు, నేల ఆరోగ్యం, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తుంది. ఇప్పటికే రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా జిల్లాలోని 79 క్లస్టర్లలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. వానాకాలం సాగుపై అవగాహన.. రైతు వారంలో భాగంగా ఖరీఫ్ పంటలపై దృష్టి పెట్టి, ఉద్యానవన, ఆయిల్ పామ్ సాగు విస్తరణను ప్రోత్సహిస్తారు. కార్యక్రమం రైతుల చైతన్యాన్ని పెంచి, ఆదాయ విస్తరణకు మార్గం సుగమం చేస్తుంది. ఇందులో నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువులు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగు, సన్న వరి సాగులో ఆధునిక పద్ధతులు తెలియజేస్తారు. బ్యాంకు రుణాలు, పీఏసీఎస్, ఎఫ్పీవో సేవలు తెలియజేస్తారు. మార్కెటింగ్, సౌర యాంత్రీకరణ, డ్రోన్లు, పీఎం కుసుమ్ పథకంపై అవగాహన కల్పిస్తారు. గతంలో సేకరించిన మట్టి నమూనాల ఫలితాల కార్డులను రైతులకు అందచేసి వాటి ఆధారంగా పంటల సాగులో ఎరువుల వినియోగంపై సూచనలు చేస్తారు. మట్టి పరీక్షలు మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతీ రెవెన్యూ గ్రామం నుంచి 10 మట్టి నమూనాలు చొప్పున 4 వేల నమూనాలు సేకరించారు. ఫలితాల కార్డులు రైతులకు అందజేసి, ఎరువుల వాడకాన్ని మార్చుతారు. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువుల వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటారు. మత్స్యశాఖ ఆద్వర్యంలో చెరువుల్లో కలుపు మొక్కల తొలగింపు, చేపలు, పశువుల వ్యాధుల నియంత్రణపై సూచనలు చేస్తారు. రైతులను సన్నద్ధం చేస్తాం.. రానున్న ఖరీఫ్ సాగుకు అన్నదాతను ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నాం.ఇందులో భాగంగా వారం రోజులు రైతు వారోత్సవాలను నిర్వహిస్తాం. ముఖ్యంగా మట్టి నమూనాలు తీసుకునే పద్ధతి, వాటి ఫలితాల ఆధారంగా వివిధ పంటల సాగు వంటి అంశాలపై రైతు వేదికల్లో అవగాహన కల్పిస్తాం. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – అంజిప్రసాద్, డీఏవో, నిర్మల్ జిల్లా సమాచారం... మొత్తం జీపీలు 400 వ్యవసాయ క్లస్టర్లు 79 గతంలో సేకరించిన మట్టి నమూనాలు 6 వేలు ఈ సారి సేకరించిన మట్టి నమూనాలు 4 వేలు -
నేటి నుంచి డివిజన్స్థాయిలో ‘ప్రజావాణి’
నిర్మల్చైన్గేట్: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. సోమవారం నుంచి నిర్మల్ ఆర్డీఓ, భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజావాణితోపాటు, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డివిజన్స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని వివరించారు. జిల్లా కేంద్రానికి రాలేని మారుమూల గ్రామాల ప్రజలు తమ సమస్యలను స్థానికంగానే విన్నవించుకునే అవకాశం కల్పించామన్నారు. అందిన ప్రతీ అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
14 ఏళ్ల నుంచి...
వేసవిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతుంటారు. వారి దాహార్తి తీర్చేందుకు 14 ఏళ్ల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి గ్రామస్తులు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. విద్యార్థులు కూడా సేవ చేస్తూ సేవాభావం పెంచుకుంటున్నారు. – లోలం గజానంద్, ప్రిన్సిపాల్, ఓల సేవే ధ్యేయం.. పాతకాలంలో వేసవిలో అంబలి తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడేది. ప్రజలు ఆ అలవాటును మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. 10 ఏళ్లుగా అంబలి అందిస్తున్నాను. దీంతో రైతులకు కూడా జొన్నల కొనుగోలు ద్వారా లాభం చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాను. – పల్లికొండ జనార్దన్, ఖానాపూర్. -
క్రమశిక్షణ, ఫిట్నెస్ కీలకం
● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: క్రమశిక్షణ, ఫిట్నెస్ ప్రతీ పోలీసుకు కీలకమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని సివిల్ ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్డ్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ను పరిశీలించారు. వీక్లీ పరేడ్ ఫిజికల్ ఫిట్నెస్తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాకు, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఏఆర్ ఇన్స్పెక్టర్లు రామ్నిరంజన్, శేఖర్, రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వీక్లీ పరేడ్లో సెల్యూట్ చేస్తున్న ఎస్పీ జానకీషర్మిల -
బాసర ట్రిపుల్ఐటీకి అంతర్జాతీయస్థాయి గుర్తింపు
● యూఎస్ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు బాసర: బాసర ట్రిపుల్ఐటీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. గతేడాది డిసెంబర్ 22 నుంచి 2026 మార్చి 13 వరకు ఆర్జీయూకేటీయేతర విద్యాసంస్థలకు చెందిన 4,966 మంది విద్యార్థులు క్యాంపస్ను సందర్శించారు. స్వల్ప కాల వ్యవధిలో సందర్శించినందుకు గాను యూఎస్ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. విద్యార్థుల మధ్య సత్సంబంధాలు పెంచడం, క్యాంపస్ వాతావరణంపై అవగాహన కల్పించడం, జ్ఞాన మా ర్పిడిని ప్రోత్సహించినందుకు సంస్థ ప్రతినిధులు.. ట్రిపుల్ఐటీకి ధ్రువపత్రం, స్వర్ణ పతకం, ట్రోఫీని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్కు అందజేశారు. ఇందులో కీలకపాత్ర వహించిన డా.విట్టల్ బృందాన్ని, క్యాంపస్ను సందర్శించిన విద్యార్థులతోపాటు అధ్యాపకులను శనివారం ఇన్చార్జి వీసీ అభినందించారు. -
పేదల ఉన్నతికి ప్రభుత్వం పెద్దపీట
నిర్మల్చైన్గేట్: పేదల ఉన్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు తదితర అన్ని అంశాల్లో పేదల ఉన్నతికి పాటుపడుతోందని తెలిపారు. త్వరలోనే మరిన్ని కొత్త పథకాలు ప్రారంభిస్తుందన్నారు. వచ్చే వారం నుంచి రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ సందర్శించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పథకాల అమలులో ముందంజ
ఖానాపూర్: సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ ప ట్టణంలో శనివారం నిర్వహించిన ‘‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’’ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు.99 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వా రా ప్రజలతో ప్రభుత్వం మరింత దగ్గరవుతోందని పేర్కొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గానికి 6,155 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, 53 వేల కు టుంబాలకు 200 యూనిట్ల సబ్సిడీ విద్యుత్ అంది స్తున్నామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రోడ్లు, వంతెనల పనులు అసంపూర్తిగా ఉండటానికి సంబంధిత అధికారులు, ఏజెన్సీలు వివరాలు ఆన్లైన్లో అప్లో డ్ చేయకపోవడమే కారణమని తెలిపారు. అటవీ గ్రామాల్లో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల పనుల వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కడెం మండలం గంగాపూర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలన్నారు. పెంబి మండలం పసుపుల వద్ద వంతెన నిర్మిస్తామని తెలిపారు. సదర్మాట్ ప్రత్యేక కాలువ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేరవేయడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని కలెక్టర్ భవేశ్ మిశ్రా అ న్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పెండింగ్ ఫైల్స్ పరి ష్కారం, విద్య, వైద్యం, అరైవ్ అలైవ్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ స్థా యికి విస్తరించి ప్రజల సమస్యలను నిర్దిష్ట గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులను సన్మానించారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ది వ్యాంగులకు రూ.95 వేల విలువగల 8 స్కూటీలు, 4 ల్యాప్టాప్లు పూర్తిస్థాయి సబ్సిడీతో అందజేశా రు. అనంతరం వివిధ శాఖల స్టాళ్లను ఎమ్మెల్యేతో క లిసి సందర్శించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్లు పడిగెల భూషణ్, లక్ష్మీనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా -
కిడ్నీ బాధితులకు భరోసా
నిర్మల్చైన్గేట్: కిడ్నీ సంబంధిత వ్యాధి బాధితులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న డయాలెసిస్ కేంద్రాలలో పడకల సంఖ్య పెంచింది. నర్సాపూర్(జి) సామాజిక ఆరోగ్య కేంద్రానికి డయాలసిస్ సెంటర్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న సేవలు సరిపోక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నవారికి ఇది ఊరటనివ్వనున్నాయి. 25 కిలోమీటర్లకు ఒక కేంద్రం.. ప్రతీ 25 కిలోమీటర్ల దూరానికి ఒక డయాలెసిస్ కేంద్రం ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్ర ణాళికలో భాగంగా జిల్లాకు నూతన కేంద్రం మంజూరైంది. నర్సాపూర్(జి) ఆసుపత్రిలో ఐదు పడకలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనునాన రు. మరో మూడు నెలల్లో సేవలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆస్సత్రిలో గది కేటాయించి, అందులో ఐదు యంత్రాలతో ఐదు పడకల కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం దగ్గర నీటిశుద్ధి ప్లాంటు, ఫ్రిజ్లు, వైద్య నిపుణులతోపాటు ఇద్దరు సాంకేతిక నిపుణులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ఐదు పడకలు ఉన్నచోట నిత్యం 20 మందికి రక్తం శుద్ధి. చేయనున్నారు. పీపీపీ విధానంలో ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్న కొత్త డయాలసిస్ కేంద్రాల్లో రక్తశుద్ధి కోసం ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి, భైంసా ఏరి యా ఆసుపత్రుల్లో ఉన్న పడకల సంఖ్య కూడా పెంచి మరింత మందికి అవకాశం కల్పించనున్నారు. జిల్లాలో 140 మందికి సేవలు ప్రస్తుతం జిల్లాలో మూడు ప్రభుత్వ డయాలెసిస్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా జనరల్ ఆస్పత్రిలో 10 మిషన్లు, ఖానాపూర్ ఆస్పత్రిలో 5, బైంసా ఏరియా ఆసుపత్రిలో 5 మిషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా రోజుకు 140 మంది కిడ్నీ బాధితులకు డయాలెసిస్ సేవలు అందిస్తున్నాయి. కొత్త కేంద్రాలు ప్రారంభమైతే ఈ సంఖ్య గణనీయంగా పెరిగి, ప్రయాణ సమయం, ఖర్చు తగ్గి, మరింత మందికి సేవలు ఉచితంగా అందుతాయి. నిర్మల్ జనరల్ ఆస్పత్రి సెంటర్ ప్రారంభం 2018 పడకలు 10 షిఫ్ట్లు 04 ప్రతీరోజు షెషన్లు 30–35 మొత్తం పేషెంట్లు 78 ఖానాపూర్.. సెంటర్ ప్రారంభం 2023 షిఫ్టులు 03 పడకలు 05 ప్రతీరోజు షెషన్లు 8–10 మొత్తం పేషెంట్లు 24 భైంసా.. షిఫ్టులు 03 పడకలు 05 ప్రతీరోజు షెషన్లు 12–15 మొత్తం పేషెంట్లు 38ప్రభుత్వానికి నివేదిక.. జిల్లాకు కొత్తగా డయాలసిస్ కేంద్రంతోపాటు జనరల్ ఆస్పత్రికి, బైంసా ఏరియా ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొత్తగా నర్సాపూర్(జి) ఆస్పత్రిలో సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆనువైన స్థలం, విద్యుత్, నీటి వసతులను పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ కాశీనాథ్, డీసీహెచ్ఎస్ -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి
భైంసాటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పి రామారావు పటేల్ తెలిపారు. పట్టణంలో శనివా రం నియోజకవర్గస్థాయి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం వివిధ పథకాల కింద నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, బాసర ఆలయ అభివృద్ధి, సమీకృత పాఠశాల మంజూరు, అభివృద్ధి పనులకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పట్టణాలు, పల్లెల్లో విచ్చలవిడి జరుగుతున్న గంజాయి విక్రయాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. షార్ట్ సర్క్యూట్తో పంటలు దగ్ధం కావడంపై విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. సబ్ కలెక్టర్ సంకేత్కుమార్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ చేతులమీదుగా మహిళా సంఘాలకు రూ.9 కోట్ల రుణాల చెక్కు అందించారు. తర్వాత శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి, ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావ్పటేల్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. -
అధికార పార్టీకే కో‘ఆప్షన్’
నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపాలిటీ కోఆప్షన్ పదవుల ఎంపిక పూర్తయింది. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 42 వార్డుల్లో 24 స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకుంది. 13 వార్డుల్లో బీజేపీ, మూడింటిలో ఎంఐఎం, రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఉండడంతో కోఆప్షన్ పదవులన్నీ ఆ పార్టీకి చెందినవారికే దక్కాయి. బరిలో 42 మంది నిర్మల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. జనరల్ పురుషుల విభాగంలో 11 మంది, మహిళలు ఏడుగురు బరిలో ఉండగా, మైనార్టీ పురుషుల విభాగంలో 16 మంది, మహిళల విభాగంలో 8 మంది పోటీలో నిలిచారు. ఎవరి ప్రయత్నాలు వారే చేసుకున్నారు. ఉత్కంఠకు తెర పోటీ ఎక్కువగా ఉండడంతో సభ్యుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ మద్దతుతో బీసీ వర్గం నుంచి మేడారం అపర్ణ, మైనార్టీవర్గం నుంచి ఆస్మాబేగం, నోమన్ అలీ, జనరల్ విభాగం నుంచి గాజుల రవికుమార్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న సభ్యుల కు మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, డీఈ హరిభువన్, మేనేజర్ మారుతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మేడారం అపర్ణ ఆస్మా బేగం గాజుల రవికుమార్ నోమన్ అలీ -
కోఆప్షన్ సభ్యురాలికి ధ్రువపత్రం
భైంసాటౌన్: భైంసా మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలిగా ఎంఐఎంకు చెందిన హుమెరాబేగం ఎన్నికైనట్లు మున్సిపల్ కమిషనర్ నవీన్ తెలి పారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో ధ్రువపత్రం అందజేశారు. మిగిలిన ముగ్గురి కి ఎన్నిక నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. కోర్టుకు వెళతాం భైంసా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిబంధనల మేరకు జరగలేదని చైర్మన్ తూమోల్ల దత్తాత్రి తెలిపారు. ఎంఐఎం అభ్యర్థికి కోఆప్షన్ సభ్యురాలిగా ధ్రువపత్రం ఇవ్వడంపై మున్సిపల్ కమిషనర్ నవీన్ను నిలదీశారు. దీనిపై కోర్టుకు వెళతామని వెల్లడించారు. -
పంటల నమోదుకు అవకాశం
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న విక్రయించిన రైతుల వివరాలు ఆన్లైన్ పోర్టల్లో కనిపించకపోవడంతో ఇక్కడి రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈనేపథ్యంలో ‘తప్పెవరిది?’ శీర్శికన శనివారం ‘సాక్షి’ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్ సమస్యను వ్యవసాయ శాఖ స్టేట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఎడిట్ ఆప్షన్ ఇచ్చి మళ్లీ ఆన్లైన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈమేరు శనివారం ఏఈవో అరుణ్ వద్ద తమ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. -
14 ఏళ్లుగా చలివేంద్రం..
కుంటాల : మండలంలోని ఓల గ్రామంలో బస్టాండ్ వద్ద ప్రతీ వేసవిలో శ్రీవాసర సరస్వతీ శిశు మందిర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా పాదయాత్రికులు, గ్రామీణ ప్రజలు, ప్రయాణికులు దాహం తీర్చుకుంటున్నారు. మండు టెండల తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నారు. ప్రతీ సీజన్లో నీటి సరఫరా ఏర్పాటు, కేంద్ర పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు స్థానిక విద్యార్థులు, గ్రామస్తులు స్వయంగా ముందుకొస్తున్నారు. ఈ సంప్రదాయం ఓల ప్రజల్లో సేవాభావాన్ని చాటుతుంది. అందరూ తమవంతు సహాయం చేస్తూ.. సేవాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. -
‘పల్లికొండ’ ఆదర్శం
ఖానాపూర్: పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పల్లికొండ జనార్దన్ చేస్తున్న సేవ ప్రత్యేకమైనది. పదేళ్లుగా ప్రతీ వేసవిలో మూడునెలలపాటు ప్రతీరోజు వెయ్యికి పైగా మందికి ఉచితంగా అంబలి పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన సబ్–రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేఖరిగా పనిచేసే జనార్దన్, తన సంపాదనలో కొంత భాగాన్ని ఈ సేవలకే వినియోగిస్తున్నారు. అదనంగా సుమారు రూ.50 వేలు వెచ్చించి ఏర్పాటుచేసిన కూల్వాటర్ ఫ్రీజర్ ద్వారా రోజంతా చల్లని శుద్ధ నీరు అందిస్తున్నారు. బస్టాండ్ వద్ద రద్దీ పెరిగినా, ఆయన సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రజలు అక్కడికి తరలివచ్చి అంబలి తాగి, అవసరమైతే బాటిళ్లలో ఇంటికి తీసుకెళ్తున్నారు. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన సురేశ్ ద్వారా స్థానిక రైతుల నుంచి మంచి నాణ్యత జొన్నలు కొనుగోలు చేసి రుచికరమైన అంబలి తయారు చేసి అందిస్తున్నారు. -
మండుటెండలో చల్లని సేవ
హ్యాట్సాప్ గంగన్న ఈ వేసవి హడలెత్తిస్తోంది. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 10 దాటితే బయటకు వెళ్లడానికి జనం జంకుతున్నారు. కానీ రోజువారీ పనులు చేసుకునేవారు, కూలీలు, ఉద్యోగులు బయటకు వెళ్లక తప్పదు. మండుటెండలో బతుకు పోరాటం చేస్తున్నవారికి..చల్లని సేవ చేస్తున్నారు. జిల్లాకు చెందిన కొందరు దాతలు. వేసవి నేపథ్యంలో చలివేంద్రం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. కొందరు అంబలి, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేస్తూ.. మానవ సేవే మాధవ సేవగా తరిస్తున్నారు.కడెం: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ మాజీ సర్పంచ్, స్పందన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బొడ్డు గంగన్న అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజల దాహార్తిని తీర్చుతున్నాడు. ఏడేళ్లుగా వేసవిలో నచ్చన్ఎల్లాపూర్ బస్టాప్ వద్ద, మండల కేంద్రంలో వీటిని ఏర్పాటు చేసి సామాజిక సేవలో ముందుకుసాగుతున్నాడు. ఇందుకు గంగన్న సొంత ఖర్చులు వెచ్చిస్తుండడం గమనార్హం. కాగా, గంగన్న బుధవారం మండల కేంద్రంలో అంబలి కేంద్రం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగన్నను ఎమ్మెల్యే అభినందించారు. అంబలి పంపిణీ చేస్తున్న పాకాల రాంచందర్ పదేళ్లుగా అంబలి పంపిణీ.. -
నిర్మల్ మున్సిపల్ కమిషనర్గా రవిబాబు
నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపల్ కమిషనర్గా రవిబాబు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ కమిషనర్గా పని చేసిన జగదీశ్వర్గౌడ్ ఆదిలాబాద్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిజామాబాద్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ పనిచేసిన రవిబాబు బదిలీపై నిర్మల్ వచ్చారు. గతంలో కూడా రవిబాబు ఇక్కడ పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ ఉ ద్యోగులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలి పారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. -
బుద్ధుని బోధనలు అనుసరించాలి
తానూరు: ప్రతి ఒక్కరూ బుద్ధుని బోధనలు అనుసరించాలని పూజ్యభంతే నగ్వజ్రే అన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మండలంలోని ఝరి(బి) గ్రామంలో నూతనంగా నిర్మించిన బుద్ధవిహార్ను శుక్రవారం ప్రారంభించారు. బుద్ధుని చరిత్ర వివరించారు. బీఆర్ అంబేడ్కర్ సూచించిన 22 ప్రతిజ్ఞను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత చదవులు చదవి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. నిత్యం బుద్ధవిహార్లో బుద్ధవందన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో భారతీయ బౌద్ధమహాసభ కేంద్రియ శిక్షక్లు అబారావ్, అనితతాయి, నారయాణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావ్ పటేల్, నాయకులు శంకర్, బౌద్ధ దీక్షాపరులు పాల్గొన్నారు. -
ఎంఐఎంపై కలెక్టర్కు ఫిర్యాదు
నిర్మల్చైన్గేట్: బైంసా పట్టణంలో గురువారం జరిగిన కోఆప్షన్ ఎన్నిక సమయంలో బీజేపీ కౌన్సిలర్ అల్లం లక్ష్మిని బెదిరించి ఎంఐఎం కౌన్సిలర్లు గందరగోళానికి గురిచేశారని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తత్రి, వైస్ చైర్మన్ బీబీ కూతిజా సిద్దిఖి, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు కలెక్టర్ భవేశ్మిశ్రాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణలో జరిగిన అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కోఆప్షన్ ఎన్నిక జరిగిన తీరును వివరించారు. కోఆప్షన్ ఎన్నిక మరల నిర్వహించాలని తెలిపారు. -
సెల్లార్లలో ఆస్పత్రులు నిర్వహించొద్దు
నిర్మల్చైన్గేట్: సెల్లార్లలో ఆస్పత్రులు నిర్వహించొద్దని, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, పొల్యూషన్ బోర్డ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లాలోని పలు ఆస్పత్రులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం నిబంధనలు పాటించాలన్నారు. ఆస్పత్రుల్లో అర్హత కలిగిన వైద్యులు, సిబ్బంది మాత్రమే పనిచేయాలని తెలిపారు. ప్రతీ ఆస్పత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సర్వీస్ చార్జీల బోర్డును డిస్ప్లే చేయాలని, రోగులకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించాలని వివరించారు. కార్యక్రమలో అధికారులు వెంకట్రామ్రెడ్డి, సునీల్రాజ్, అనిల్ కుమార్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్ పాల్గొన్నారు. -
పంటల్లో.. మంటలు!
నిర్మల్: జిల్లాలో పంటలకు అంటుకుంటున్న మంటలు రైతన్నలను కంగారు పెడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే బుగ్గిపాలవుతుంటే కన్నీరుమున్నీరవుతున్నారు. పంటలు కాలిపోవడానికి వేలాడుతున్న లూజ్వైర్లే కారణమని చాలామంది రైతులు చెబుతుండగా, అధికారులు మాత్రం అదొక్కటే కారణం కాదని, రకరకాల కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. నిర్లక్ష్యం నిప్పులా..పంట చివరిదశలో పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. చిన్న నిప్పురవ్వ తగిలినా మంటలు అంటుకుంటా యి. పంటభూముల్లో గాలికి వేగంగా వ్యాపిస్తాయి. తాగిన తర్వాత పూర్తిగా ఆర్పకుండా పంటభూముల సమీపంలో పడేసిన బీడీ, సిగరెట్లు కూడా కష్టపడి పండించిన పంటలను కాల్చేస్తున్నాయి. అలాగే సమీపంలోనే వంట చేసుకున్న తర్వాత పూర్తిగా ఆర్పేయని నిప్పురవ్వలూ ప్రమాదమే. పంటవ్యర్థాలకు పెట్టే మంటలు..సీజన్ చివరి దశలో ఇప్పటికీ చాలామంది పంట పూర్తయిన రైతులు భూముల్లో మిగిలిన కొయ్యలు, వ్యర్థాలకు అక్కడే నిప్పు పెడుతున్నారు. ఈ మంటలు గాలికి వేగంగా వ్యాపిస్తాయి. పక్క చేళ్లలోని పంటలనూ బుగ్గిచేస్తాయి. మూడేళ్ల క్రితం సారంగపూర్ మండలంలో ఇలాగే వ్యర్థాలకు పెట్టిన నిప్పు వ్యాపించి దాదాపు ఇరవై ఎకరాల్లో పంటలు కాలిపోయాయి. ఇందులో డ్రిప్ ఇరిగేషన్ పైపులు, మోటార్లు సైతం బుగ్గిపాలయ్యాయి. మండుతున్న ఎండలూ...గతంలో ఎప్పుడూ లేనంతగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈమధ్య కాలంలో 44 డిగ్రీ సెల్సియస్ పైనే ఉంటున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలూ అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని సారంగపూర్, దిలావర్పూర్, మామడ అడవుల్లో నిప్పు అంటుకుంది. పంటభూముల్లోనూ మంటలకు మండుతున్న ఎండలూ కారణం కావొచ్చన్న వాదనలు ఉన్నాయి.వేలాడుతున్న వైర్లు..జిల్లాలోని కుభీర్, తానూరు, పెంబి, దిలావర్పూర్, నర్సాపూర్(జి), కుంటాల, భైంసా మండలాల్లో ఈమధ్యకాలంలో వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. దాదాపు అన్నిచోట్లా చేతికొచ్చిన లేదా కోసి కుప్పలుగా పోసిన మొక్కజొన్న పంటనే దగ్ధమైంది. ఈ ప్రమాదాలు చోటుచేసుకున్న వాటిలో చాలామంది బాధిత రైతులు వేలాడుతున్న విద్యుత్తీగలు గాలికి ఒకదానికొక్కటి రాపిడి కావడం వల్ల నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నట్లు చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర మంటలు రావడంతో కూడా పంటలకు అంటుకున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఇదొక్కటే కారణం కాదని అధికారులు చెబుతున్నారు. నల్లరేగడి భూములు కావడంతో చాలాచోట్ల కరెంటు స్తంభాలు వంగిపోవడం, కూరుకుపోవడం జరుగుతుంటాయి. వీటివల్ల వైర్లు లూజ్ అవుతాయి. అలాగే స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద వేసిన సపోర్టు వైర్లనూ కొంతమంది రైతులు కట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కూడా వైర్లు వదులుగా మారి, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కరెంటే కారణం కాదు.. జిల్లాలో పంటభూముల్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలకు విద్యుత్వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు ప్రధాన కారణం కాదు. వివిధ కారణాలతోనూ ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ జిల్లాలో ఎక్కడైనా లూజ్వైర్లు, లైన్లు ఉంటే వెంటనే తమ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. అవసరమైనచోట అదనపు స్తంభాలు ఉచితంగా వేయిస్తాం. – జాదవ్ సుభాష్, ఎస్ఈ, విద్యుత్శాఖ -
కల్యాణం.. కమనీయం
కల్యాణ మండపంలో లక్ష్మీనృరసింహస్వామి ఉత్సవమూర్తులుదిలావర్పూర్ మండలం కాల్వ గ్రామ శివారులో కొలువుదీరిన శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను రథంలో, పల్లకిలో మంటపంలోకి తీసుకువచ్చారు. వేదపండితులు వాసుదేవాచార్యులు, చక్రపాణి నరసింహమూర్తి కల్యాణం జరిపించారు. కల్యాణ వేడుక తిలకించేందుకు సుమారు 15 వేల మంది భక్తులు హాజరయ్యారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ అంగూరి మహేందర్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. నిర్మల్ సీఐ కృష్ణ, దిలావర్పూర్ ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్/దిలావర్పూర్ -
కార్మికులు అభివృద్ధి చోదకులు
నిర్మల్చైన్గేట్: ప్రపంచ అభివృద్ధికి కార్మికులే చోదకశక్తి అని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కార్మికులు తమ వృత్తులకు సంబంధించి నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ఉన్నతి సాధించాలన్నారు. ప్రతి ఒక్కరూ కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మికులకు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కార్మిక శాఖ ‘అచీవ్మెంట్స్, యాక్టివిటీస్‘ బుక్లెట్ ఆవిష్కరించారు. ప్ర వాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్లకు ప్రతిష్టాత్మక శ్రమశక్తి పురస్కారం ప్రదానం చేశారు. పలువురు కార్మికులను సన్మానించారు. లేబర్ కార్డులు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ముత్యంరెడ్డి, కార్మిక శాఖ అధికారి రాజలింగు, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, కోటిరెడ్డి, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. చిన్నారుల వికాసానికి బాల భరోసాశారీరక ఎదుగుదల లోపం ఉన్న చిన్నారుల అనా రోగ్య సమస్యల పరిష్కారానికి బాల భరోసా కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలో బాల భరోసాలో కలెక్టర్ పాల్గొన్నారు. అంగన్వాడీల్లో విద్యార్థుల్లో ఎదుగుదల లోపాలు గుర్తించిన వారిని బాల భరోసా కేంద్రాల్లో చేర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాజేందర్, సంక్షేమ అధికారి వినూత్న, ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్సింగ్, ఆర్ఎంవో రమేశ్, వైద్యులు పాల్గొన్నారు. తాగునీటి ఇబ్బందులు రావొద్దు..జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికా రులను ఆదేశించారు. తాగునీటి సరఫరాపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే, అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు. పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. -
భర్తీ ఎప్పుడో..
నిర్మల్చైన్గేట్: నవ సమాజానికి పునాది వేసే కేంద్రాలు అంగన్వాడీ సెంటర్లు. కానీ మూడేళ్లుగా సి బ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. ఫలితంగా చిన్నారులకు సమయానికి పోషకాహారం అంద క, గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కారణంగా కేంద్రాలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలు కాగితా లకే పరిమితమవుతున్నాయి. టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నచోట ఆయాలే కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మ రోవైపు 60 ఏళ్లు నిండిన వారు ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీలు పెరుగుతున్నాయి. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చాలా పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆయా పోస్టులు కూడా ఖాళీ అవుతున్నాయి. ప్రాజెక్టుల వారీగా ఇలా....జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 926 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. భైంసా, ఖానాపూర్, ము ధోల్, నిర్మల్ ప్రాజెక్టుల పరిధిలో కలిపి 82 టీచర్ పోస్టులు, 440 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో టీచర్లు, ఆయాలు లేక గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. సెంటర్లలో సిబ్బంది కొరత ఏర్పడిన తర్వాత ఇన్చార్జీలతో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, సరైన రీతిలో నడవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 931 అంగన్వాడీ కేంద్రాలు..జిల్లాలోని 18 మండలాలు, నాలుగు మున్సిపాలిటీ ల పరిధిలో 4 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వాటి పరిధిలో 932 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో ప్రస్తుతం గర్భిణులు 56,854 మంది, బాలింతలు 4,073 మంది ఉన్నారు. 6 నెలలలోపు చిన్నారులు 4,265 మంది, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 30,560 మంది, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 27,919 మంది ఉన్నారు. టీచర్లు, హెల్పర్లే కీలకం..అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు హెల్పర్లదే కీలకపాత్ర. టీచర్కు నెలకు రూ.13,650. ఆయాకు రూ.7,800 గౌరవ వేతనంగా అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి ఈ వేతనాలు కొంత మేరకు ఊరటనిచ్చే విధంగా ఉన్నప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లో సరిపోవడం లేదంటున్నారు. ఆంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ పాలు, కోడిగుడ్డుతోపాటు ఆకుకూరలు, ఇతర కూరలతో పౌష్టికాహారం సక్రమంగా అందుతుంది. ఆరోగ్య సర్వేలు, ఇతర సర్వేల బాధ్యతలను ఎక్కువగా టీచర్లకే అప్పగిస్తుంటారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్కన ఉండే కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం పడుతుంది. ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల్లో టీచర్లే ఆ భారాన్ని మోస్తున్నారు. వాళ్లకు సర్వే బాధ్యతలు అప్పగించినప్పుడు కేంద్రాలు త్వరగా మూత పడుతున్నాయి. శుక్రవారం నుంచి అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు మొదలవుతున్నాయి. జూన్ 1న పునఃప్రారంభమవుతాయి. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీ చేయాలని మహిళలు కోరుతున్నారు.ఇన్చార్జీలను నియమించాం.. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయాపోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల స్థానంలో ఇన్చార్జీ లను నియమించాం. పో స్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. మంజూరు అయిన వెంటనే భర్తీ చేస్తాం. – వినూత్న, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
‘బిల్లులు వీగిపోవడం దురదృష్టకరం’
నిర్మల్చైన్గేట్: పునర్విభజన చట్టం, మహిళా రిజ ర్వేషన్ చట్టంలో సవరణలు పార్లమెంట్లో వీగిపోవడం దురదృష్టకరమని బీజేపీ జిల్లా ఇన్చార్జి గోపి డి శ్రవంతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మహేశ్వర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మహిళా ఆక్రోష్ పేరిట పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, స్టేట్ మీడియా ప్యానలిస్ట్ బొమ్మరాగోని రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మా ట్లాడారు. బిల్లులను అడ్డుకోవడం కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు చేసిన చారిత్రక తప్పిదమని ఆరోపించారు. వారు మహిళాద్రోహులుగా చరిత్రలో నిలిచి పోతారని విమర్శించారు. ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్కు ఇది మొదటిసారి కాదని, మొత్తంగా ఏడుసార్లు ఈ బిల్లును కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక, కౌన్సిలర్లు రావుల రమ్య, బొబ్బరపు సత్యవతి, సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, నాయకురాలు తిరుమల, కల్పనాగౌడ్ పాల్గొన్నారు. -
న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకోవాలి
ఖానాపూర్: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన న్యాయవాది గంగుల సత్యార్థప్రకాశ్పై జరిగిన దాడి ఘటనపై ఖానాపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు స్పందించారు. బుధవారం బాధిత న్యాయవాది వద్దకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదుల భద్రత కు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. అసోసియేషన్ అధ్యక్షుడు మట్టేరి రాజశేఖర్, ఖానాపూర్ ఏజీపీ ఆసిఫ్ అలీ, సీనియర్ న్యాయవాది వెంకట్ మహేంద్ర, జాయింట్ సెక్రటరీ బాశెట్టి శివ తదితరులున్నారు. -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
నిర్మల్చైన్గేట్: ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థా యిలో అరికట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని స మావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణాతోపా టు పలు రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే ఇసు క అమ్మకాలు జరగాలని, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణపై అలసత్వం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని సూచించా రు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరి ష్కరించాలని తెలిపారు. ఎస్ఐఆర్కు సంబంధించి ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఆక్విజిషన్ జలకుమారి, సీపీవో జీవరత్నం, ఏడీ మైన్స్ హరిప్రసాద్, ఏడీ ల్యాండ్ సర్వేయర్ నరసింహమూర్తి, త హసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగమేళా పోస్టర్ ఆవిష్కరణ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భా గంగా నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 6న ఆదిలాబాద్లో నిర్వహించనున్న జాబ్మేళాలో అర్హులైన నిరుద్యోగ యువత పాల్గొనవచ్చని తెలిపారు. పోస్టర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదా https:// satg. telangana. gov. in/ prajapalana ౖెసట్ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, యువజన క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, ఉపాధి కల్పనాధికారి విజయలక్ష్మి ఉన్నారు. కడెం ప్రాజెక్ట్ సందర్శన కడెం: కడెం ప్రాజెక్ట్ను కలెక్టర్ భవేశ్ మిశ్రా సందర్శించారు. గతంలో వచ్చిన భారీ వరద ల గురించి, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో, సామర్థ్యం, ప్రస్తుత నీటిమట్టం తదితర వివరాలను ఇరిగేషన్ అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రాజెక్ట్లో పూడికతీత పనుల గురించి అడిగి, రానున్న వానాకాలంలోపు ప్రాజెక్ట్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి వచ్చినందున భవేశ్ మిశ్రాను స్థానిక సర్పంచ్ దీకొండ విజయ్కుమార్ శాలువాతో సన్మానించారు. ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డీఈ వీరన్న, తహసీల్దార్ ఖాజా మొయినొద్దీన్, ఎంపీడీవో సునీత, ఏఈఈలు మురళీకృష్ణ, నితిన్, చైతన్య, ప్రాజెక్ట్ సిబ్బంది తదితరులున్నారు. -
నిర్మల్
గిరిజనుల కల్పతరువు ‘ఇప్ప’ ప్రకృతి ప్రసాదించిన ఇప్పపువ్వు గిరిజనులకు కల్పతరువుగా నిలుస్తోంది. అటవీ ప్రాంతాల్లో నివసించే గోండి, కొలాం గిరిజనులకు ఇప్పపువ్వు సేకరణతో ఉపాధి లభిస్తోంది.బాధితులకు న్యాయం చేయాలి భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో బు ధవారం నిర్వహించిన ప్రజావాణికి హాజరై భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీ లు స్వీకరించారు. అప్పటికప్పుడు సంబంధిత ఎస్హెచ్వోలతో ఫోన్లో మాట్లాడి బాధితుల కు చట్టపరంగా అవసరమైన సహాయం అందించాలని సూచించారు. అనంతరం గత ప్ర జావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కార స్థితిపై సంబంధిత అధికారులను అడిగి తెలు సుకున్నారు. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు.నిర్మల్ రూరల్: చదువులతల్లి జ్ఞానసరస్వతీ కొలు వైన జిల్లాలో పదోతరగతి విద్యార్థులు సత్తా చాటా రు. బుధవారం విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో 98.96శాతం ఉత్తీర్ణతతో జిల్లాను రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిపారు. గతేడాది 96.70శాతంతో 15వ స్థానంలో నిలువగా, ఈసారి 12 స్థానాలు పైకి ఎగిసి మూడో స్థానంలో నిలవడం విశేషం. ఈసారి కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించా రు. జిల్లాలో 9,743 మంది విద్యార్థులకు గాను 9,642 మంది ఉత్తీర్ణులు కాగా, 101 మంది ఫెయిలయ్యారు. ఇందులో 4,779 మంది బాలురకు 4,711 (98.5శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 68 మంది ఫెయిలయ్యారు. 4,964 మంది బాలికలకు 4,931 (99.34శాతం) పాసవగా 33మంది అనుత్తీర్ణులయ్యారు. సర్కారు బడులు మంచి మార్కులతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా నిలిచాయి. జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాలు సత్తా చాటాయి. ప్రణాళికతో ముందుకెళ్లడంతోనే.. పదోతరగతి ఫలితాల్లో జిల్లా 2022–23, 2023–24 విద్యాసంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది 96.70శాతంతో 15వ స్థానానికి పడిపోయింది. ఈసారి 98.96శాతంతో మూడోస్థానంలో నిలిచి సత్తా చాటింది. గతేడాది కంటే ఈసారి మెరుగైన స్థానం సాధించడం విశేషం. వి ద్యార్థులు, విద్యాశాఖ అధికారులు ప్రణాళిక ప్రకా రం ముందుకెళ్లారు. గత కలెక్టర్ అభిలాష అభినవ్, సెప్టెంబర్లో బాధ్యతలు చేపట్టిన డీఈవో భోజన్న మెరుగైన ఫలితాల సాధనకు మరింత దృష్టి కేంద్రీకరించారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు, దా తలు, వీడీసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహా రం అందించి ప్రోత్సహించారు. డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తి చేసి కఠిన అంశాలపై పునఃశ్చరణ త రగతులు నిర్వహించారు. విద్యార్థులకు సరైన సమయంలో రెండుసార్లు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి అందులో వెనుకబడినవారిని ప్రత్యేక తరగతులతో ప్రోత్సహించారు. ఒక్కో పరీక్షకు దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధి ఇవ్వడం కూడా కలిసివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సమష్టి కృషితోనే మెరుగైన స్థానం పదోతరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో సమష్టి కృషితోనే మెరుగైన స్థానం సాధించాం. ఉన్నతాధికారుల దిశానిర్దేశం మేరకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చాలా కష్టపడ్డారు. రెండుసార్లు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. గ్రాండ్ టెస్టులు, స్పెషల్ టెస్టులు నిర్వహించి విద్యార్థుల్లో పరీక్షలంటే భయం పోగొట్టాం. ఫెయిలైన విద్యార్థులు అధైర్య పడకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రిపేర్ కావాలి. ఉత్తీర్ణులయ్యేలా కష్టపడాలి. – భోజన్న, జిల్లా విద్యాధికారి జూన్ 5నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పదోతరగతిలో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 5నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 5నుంచి 12వరకు ప్రతిరోజూ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 30నుంచి సంబంధిత ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించాలి. విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 30నుంచి మే 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్ట్కు రీకౌంటింగ్ ఫీజు రూ.500 కాగా, రీ వెరిఫికేషన్ ఫీజు రూ.వెయ్యిగా నిర్ణయించారు. -
మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి
లోకేశ్వరం: మాదక ద్రవ్యాలను ప్రతి ఒక్కరూ ని ర్మూలించాలని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ సూచించారు. బుధవారం మండలంలోని ధర్మోర గ్రామంలో గాంజా గస్తీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గాంజా వినియోగం, అక్రమ రవాణాపై కఠినచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువత గాంజాకు అలవాటు పడకుండా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు గమనించా లని సూచించారు. ప్రజలు సహకరించి.. ఎక్కడైనా గాంజా విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ముథోల్ సీఐ రవీందర్, లోకేశ్వరం ఎస్సై అశోక్, సర్పంచ్ సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ మంద గణేశ్, పంచగుడి ఉపసర్పంచ్ గంగాధర్, రాజూర మాజీ సర్పంచ్ ముత్తగౌడ్ ఉన్నారు. -
సత్తా చాటిన మేధా మోరల్ స్కూల్
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని మంజులా పూర్లోగల మేధా మోరల్ స్కూల్ విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో సత్తా చాటారు. పాఠశాల విద్యార్థిని కె.అక్షయరెడ్డి 590 మా ర్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. సోన్ మండలం పాక్పట్లకు చెందిన రైతు రా జశేఖర్రెడ్డి కూతురు అక్షయరెడ్డి టాపర్గా ని లవడంతో కరస్పాండెంట్ కె.సిద్ధార్థరెడ్డి, ప్రి న్సిపాల్ శారద, డైరెక్టర్ అంజికుమార్రెడ్డి అ భినందించారు. పాఠశాలలో 60మంది వి ద్యార్థులు పరీక్షలు రాయగా 100శాతం ఉత్తీ ర్ణులయ్యారు. ఎస్.హర్షిత 583, సుంకరి వే ద, తేజస్వి 581 మార్కులతో సత్తా చాటారు. -
పేదలకు అండగా ప్రభుత్వం
ఖానాపూర్: పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నా రు. మండలంలోని తర్లపాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను బుధవారం ప్రారంభించి లబ్ధిదారులకు శు భాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులు ఎ మ్మెల్యేను శాలువాతో సన్మానించారు. నియోజకవ ర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ స మస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పాత తర్లపాడ్ సర్పంచ్ పడిగెల మల్లారెడ్డి, ఉపసర్పంచ్ సాయిరాం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఖానాపూర్ పట్టణంలోని పోలీస్స్టేషన్ సమీపంలోని వారసంతలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు చిన్నం సత్యం, గుగ్లావత్ రాజేందర్నాయక్, నిమ్మల రమేశ్, పోలంపెల్లి సచిన్, సార్ల నర్సయ్య, జంగిల్ శంకర్, గుడాల రాజన్న, మదిరె సత్యం, జమాల్ ఖురేషి, నేత శ్యామ్, రెడ్డి నరేందర్, మాజిద్, రమేశ్, గంగాధర్, శంకర్, షబ్బీర్ పాషా, అమానుల్లాఖాన్, శేషాద్రి, శ్యామ్, చరణ్ తదితరులున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం కడెం: మండలంలోని పెద్దూర్తండా వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. అనంతరం కొండుకూర్ గ్రామంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్ భూషణ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మల్లేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, సర్పంచులు విజయ్కుమార్, జడ లావణ్యకృష్ణ, భీమేశ్, శిరీషాసత్యం, లతానరేశ్, తేజస్వినీశ్రీనివాస్, లక్ష్మీభూమన్న, డీసీసీ మెంబర్ వెంకటేశ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులున్నారు. అంబలి కేంద్రం ప్రారంభం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ మాజీ సర్పంచ్, స్పందన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బొడ్డు గంగన్న మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. వేసవిలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజల దాహార్తిని తీర్చుతున్న బొడ్డు గంగన్న సేవలు అభినందనీయమని కొనియాడారు. -
నేడు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
భైంసాటౌన్: జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉండగా, నిర్మల్, భైంసాలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భైంసాలో గురువారం, నిర్మల్లో మే 2న ఎన్నిక నిర్వహించనున్నారు. రెండు బల్దియాల్లో నలుగురు చొప్పున కో ఆప్షన్ సభ్యులకు పాలకవర్గంలో చోటు దక్కనుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం బరిలో ఉన్న ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు చోట్ల పోటీ ఉన్న దృష్ట్యా మెజారిటీ సభ్యులు ఎవరికి మద్దతిస్తే వారికే పదవులు దక్కనున్నాయి. భైంసాలో పోటీ తీవ్రం భైంసా మున్సిపాలిటీలో కో ఆప్షన్ పదవుల కోసం పోటీ తీవ్రంగానే ఉంది. మొత్తం 26 దరఖాస్తులు రాగా, 10 తిరస్కరణ, ఉపసంహరణకు గురయ్యా యి. 16 మంది బరిలో ఉన్నారు. స్పెషల్ నాలెడ్జ్ పురుషుల విభాగంలో ఒకరి దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో అతడు తన దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇస్తే బరిలో 17 మంది ఉంటారు. స్పెషల్ నాలెడ్జ్ పురుషుల విభాగంలో ముగ్గురు, మహిళల విభాగంలో ఏడుగురు బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరికి మాత్రమే కో ఆప్షన్ పదవి దక్కనుంది. ఇక, మైనారిటీ పురుషుల విభాగంలో ఇద్దరు, మహిళల విభాగంలో నలుగురు పోటీ పడుతున్నారు. ఇక్కడి పాలకవర్గంలో మొత్తం 26మంది సభ్యులుండగా, స్థానిక ఎమ్మెల్యే ఓటు కూడా పరిగణనలోకి రానుంది. అయితే, ఇటీవల కాంగ్రెస్ నుంచి గెలిచిన 26వ వార్డు కౌన్సిలర్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు బుధవారం ప్రకటించారు. చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక సమయంలో స్వతంత్రులకు మద్దతు ఇవ్వగా, ప్రస్తుతం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో ఎవరికి మద్దతిస్తారన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా ఎవరికి ఎక్కువ మంది సభ్యులు చేతులెత్తి మద్దతిస్తే వారికే కో ఆప్షన్ పదవి దక్కనుంది. నిర్మల్ బరిలో 42 మంది.. నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఇక్కడ 42 మంది కౌన్సిల్ సభ్యులున్నారు. ఇక, కో ఆప్షన్ పదవుల కోసం కూడా 42 మంది బరిలో ఉండడం గమనార్హం. జనరల్ పురుషుల విభాగంలో 11 మంది, మహిళలు ఏడుగురు బరిలో ఉండగా, మైనారిటీ పురుషుల విభాగంలో 16 మంది, మహిళల విభాగంలో ఎనిమిది మంది పోటీలో ఉన్నారు. మే 2వ తేదీన ఎన్నిక జరగనుండగా, మెజారిటీ సభ్యుల మద్దతుతో కో ఆప్షన్ పదవులు దక్కనున్నాయి. -
గన్నీ సంచుల కోసం ఆందోళన
లక్ష్మణచాంద: గన్నీ సంచులు పంపాలని సోన్ మండలం పాక్పట్ల కొనుగోలు కేంద్రం వద్ద మొక్కజొన్న రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పాక్పట్ల, జాఫ్రాపూర్, సోన్ గ్రామాల్లో సుమారు 500 నుంచి 600 ఎకరాలలో మొక్కజొన్న పంట వేశామన్నారు. పాక్పట్లలో మంజులాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో, సిద్దులకుంటలో ఎఫ్ఎస్సీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అయితే గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో రైతులు నిరసనకు దిగారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని, త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. గన్నీ సంచులు ఇవ్వాలని కోరారు. -
బోధనేతర సిబ్బందికీ ఎఫ్ఆర్ఎస్
నిర్మల్ఖిల్లా: జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) హాజరు పద్ధతిని విద్యాశాఖ మరింత విస్తరించింది. ఇప్పటివరకు బోధన సిబ్బందికి అమలు చేస్తుంది. ఇప్పుడు బోధనేతర సిబ్బందికి కూడా తప్పనిసరి చేస్తూ జిల్లా విద్యాశాఖ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన విద్యాశాఖ కార్యాలయం మాత్రమే కాకుండా, అన్ని మండలాల్లోని ఎమ్మార్సీలలో పనిచేసే సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. వేసవి సెలవుల్లో కూడా హాజరు తప్పనిసరి.. పాఠశాలలకు వేసవి సెలవుల్లో ఉన్నా, జిల్లా, మండల స్థాయిలలోని విద్యాశాఖ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నిర్ణీత సమయానికి ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేయడం తప్పనిసరిగా చేశారు. జిల్లా, మండల స్థాయిల్లోని కార్యాలయాల పనితీరును సమీక్షించడంతోపాటు, హాజరు వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. హాజరులో నిర్లక్ష్యం.. ఇటీవల జరిగిన పరిశీలనల్లో కొంతమంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు నమోదు చేయకపోవడం, సరైన కారణాలు లేకుండా ఆన్డ్యూటీ దరఖాస్తులు సమర్పించడం వంటి వ్యవహారాలు బయటపడ్డాయి. ఈ కారణంగా హాజరు శాతం తగ్గడంతో పాటు, కార్యాలయాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నియమాలు మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు. అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మండల విద్యాధికారులు, జిల్లా శాఖ కార్యాలయ సూపరింటెండెంట్లు తమ పరిధిలోని సిబ్బంది హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ ఉద్యోగి రోజువారీగా నిర్ణీత సమయానికి ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేయడం తప్పనిసరి అని, ఆన్డ్యూటీ సదుపాయం కేవలం అత్యవసర పరిస్థితుల్లో, సహేతుక కారణాలతోనే ఉపయోగించాలని స్పష్టం చేశారు. అలాంటి సందర్భాల్లో ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కూడా సూచించారు. క్లస్టర్, సెంటర్ సిబ్బందికి బాధ్యత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీలు), ఐఈఆర్పీలు, ఎంఐఎస్, కంప్యూటర్ ఆపరేటర్లు వంటి విద్యాధికార సిబ్బంది తమ హాజరును సంబంధిత ఎమ్మార్సీ కేంద్రాల్లో ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయాలి. మండల స్థాయిలో ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ వ్యవస్థపై పర్యవేక్షణ చేపట్టాలి. ఆలస్యాలు, నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. అలసత్వానికి తావులేకుండా... హాజరు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం కేవీ తీసుకోకూడదని స్పష్టం చేస్తూ, ఈ విధానాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో పేర్కొంటున్నారు. జిల్లాలోని బోధన, బోధనేతర సిబ్బంది అందరూ విధుల్లో క్రమశిక్షణతో వ్యవహరించడం అత్యంత కీలకమని, ఎఫ్ఆర్ఎస్ ద్వారా నిర్దేశిత సమయానికి హాజరు నమోదు చేయడంలో ఎలాంటి అలసత్వానికి తావు లేదని సూచిస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో హాజరు వ్యవస్థపై పటిష్టమైన పర్యవేక్షణ, మానిటరింగ్ ఉంటుందని డీఈవో భోజన్న తెలిపారు. ఉల్లంఘిచేవారిపై చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. -
పుస్తకాలొచ్చినయ్
● జూన్ 12న విద్యార్థులకు పంపిణీ..లక్ష్మణచాంద: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమైన వారం రోజులకే.. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తిరిగి పాఠశాలలు తెరుచుకున్న రోజునే పుస్తకాలు అందించేలా విద్యాశాఖ ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 81 శాతం పాఠ్య పుస్తకాలు జిల్లా గోదాములకు చేరినట్లి అధికారులు తెలిపారు. పార్ట్ 1, పార్ట్ 2గా విభజన.. కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాలను రెండు భాగాలుగా పార్ట్ 1, పార్ట్ 2గా విభజించి విద్యార్థులకు అందిస్తున్నారు. పార్ట్–1లో కొన్ని అధ్యాయాలు, పార్ట్–2లో మిగిలిన అధ్యాయాలు ముద్రిస్తున్నారు. జిల్లాకు పార్ట్ 1 పుస్తకాలు మొత్తం 3,35,880 అవసరం కాగా, మంగళవారం వరకు 2,73,830 పుస్తకాలు చేరాయి. అంటే 81 శాతం పుస్తకాలు జిల్లాకు వచ్చాయని, మిగిలిన 62,050 పుస్తకాలు కూడా త్వరలోనే చేరుతాయని అధికారులు తెలిపారు. జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య.. జిల్లాలో 577 ప్రభుత్వ పాఠశాలలు, 89 ప్రాథమికోన్నత పాఠశాలలు, 164 ఉన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు కలిపి మొత్తం 848 పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పాఠశాలల్లో 71,390 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పాఠశాల ప్రారంభం రోజు పంపిణీ నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలలో 81 శాతం జిల్లాకు చేరాయి. మిగిలినవి కూడా త్వరలోనే చేరుతాయి. పాఠశాలల ప్రారంభం రోజు ప్రతీ విద్యార్థికి పుస్తకాలు అందచేయాలని ఎంఈవోలకు, ప్రధానో పాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. – భోజన్న, డీఈవోజిల్లా సమాచారం ప్రాథమిక పాఠశాలలు 577 ప్రాథమికోన్నత పాఠశాలలు 89 ఉన్నత పాఠశాలలు 164 కేజీబీవీలు 18 మొత్తం పాఠశాలలు 848 మొత్తం విద్యార్థులు 71390 అవసరమైన పార్ట్–1 పుస్తకాలు 3,35,880 ఇప్పటి వరకు వచ్చినవి 2,73,830ఎమ్మార్సీలకు పుస్తకాలు.. జిల్లా కేంద్రానికి చేరిన పాఠ్య పుస్తకాలను మే 10 నుంచి అన్ని మండలాల ఎమ్మార్సీలకు సరఫరా చేయాలని జిల్లా విద్యాధికారి భోజన్న ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మార్సీల నుంచి ఆ మండలానికి చెందిన అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పుస్తకాలు అందించడం జరుగుతుంది. పాఠశాలలు తెరుచుకున్న రోజున ప్రతి విద్యార్థికీ తగిన పుస్తకాలు అందించేందుకు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేస్తున్నారు. -
నిర్మల్
జన గణన జాబితాలో నమోదు చేసుకోవాలి‘నెట్టింట్లో’ కథలు సెలవుల్లో విద్యార్థులు ఇంటివద్ద మొబైల్ ఫోన్లలో పనికిరాని గేమ్స్, సినిమాలతో సమయం వృథా చేస్తారు. అయితే ఆన్లైన్లో విజ్ఞానం పెంచే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శికి వినతి లోకేశ్వరం: ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా నియమితులైన అభిలాష అభినవ్ను నిర్మల్ జిల్లా 711 సంఘం అధ్యక్షుడు కర్గం వినోద్కుమార్ మంగళవారం మద్యాపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని కార్యాలయంలో కలిసి ఇంటర్ విద్యావ్యవస్థలో నెల కొన్న సమస్యలను వారి దృషికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారి వెంట సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్, ఉపాధ్యక్షుడు పురుషోత్తం ఉన్నారు. భైంసా: జిల్లాల పునర్విభజనతో నిర్మల్ జిల్లాగా ఏర్పడింది. దీంతో పాలన చేరువవుతుందని, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, పరిశ్రమలు వస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. జిల్లా ఏర్పడి దశాబ్దం అయినా కొత్తగా కలెక్టరేట్ మినహా జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని జిల్లా వాసుల్లో నైరాశ్యం నెలకొంది. గత ప్రభుత్వం పారిశ్రామిక సామర్థ్యాన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఇక్కడ సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు, సూక్ష్మ, మధ్యస్త పరిశ్రమల పెంపుదల వంటి ప్రణాళికలు రూపొందించింది. కానీ నేటికీ అవి ప్రణాళిక దాటలేదు. బాసర మండలంలో సుమారు 800 ఎకరాలకు పైగా ప్రభుత్వానికి చెందిన భూములు గుర్తించి, పెద్ద పరిశ్రమల కోసం వాటిని ఇస్తున్నట్లు రెవెన్యూ శాఖ సూచించింది. 2020లో జిల్లా యంత్రాంగం, పరిశ్రమల శాఖ స్వీయంగా సర్వే నిర్వహించి బాసరలో సెజ్ ఏర్పాటు అవకాశాలపై చర్చలు జరిపినా, దానికి అనుగుణంగా ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. ఈ విషయంలో గత ప్రభుత్వంలో అనేకసార్లు సమావేశాలు, ప్రకటనలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలో పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు ముందడుగు పడలేదు. సోలార్ ప్లాంట్లు... జిల్లా ఏర్పడ్డాక మూడు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. గత ప్రభుత్వం నిర్మల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో తేనెశుద్ధి కార్మాగారం ఏర్పాటు చేసింది. డెయిరీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పాలశీతలీకరణ కేంద్రం ఉంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సూక్ష్మ చిన్నతరహా ఇలా అన్ని కలిపి సుమారు 260 పరిశ్రమలు ఉన్నాయి. కానీ పెద్ద పరిశ్రమలు మాత్రం కనిపించడంలేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. పరిశ్రమలు ఏర్పడితే జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇక్కడ రైతులు పండించిన పంటలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అత్యధికంగా సోయా, శెనగ, మొక్కజొన్న పంటలు పండుతాయి. ఈ పంటల ఆధారంగా పరిశ్రమల ఏర్పాటు జరిగితే రైతులకు మేలు జరుగుతుంది. ఈ విషయం మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. – పవార్ రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యేఒకప్పటి పత్తి దిగ్గజాల కథ సౌకర్యాలు ఉన్నా..జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహజ వనరులు (భూమి, నీరు, ఖనిజాలు), రోడ్డు–రైలు మార్గాలు ఉన్నాయి. గోదావరి నది పక్కన బాసర, అక్కడికి అనుసంధానించిన జాతీయ రహదారి, రైలుమార్గం వంటివి పారిశ్రామిక అభివృద్ధికి సహాయపడుతాయి. అయినా నిర్మల్, ఖానాపూర్, బాసర వంటి ప్రాంతాల్లో నడుస్తున్నవి సూక్ష్మ, చిన్నస్థాయి పరిశ్రమలు మాత్రమే. ఒక్క పెద్ద రీజినల్ పరిశ్రమ కూడా జిల్లా పరిధిలో లేక అభివృద్ధిలో వెనుకబడుతోంది. గోదావరి దాటిన తర్వాత నిర్మల్ సరిహద్దు ప్రారంభమవుతుంది, కానీ ఆ దశలో హైదరాబాద్–నాగ్పూర్ జాతీయ రహదారి పక్కన ఉండే ఇతర జిల్లాల్లో పరిశ్రమలు కనిపిస్తాయి. నిర్మల్ ప్రాంతంలో మాత్రం కొత్త పరిశ్రమలు ఎక్కడా కనిపించవు. భైంసా పట్టణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పారిశ్రామిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు 33కు పైగా పత్తి జిన్నింగు ఫ్యాక్టరీలు నడుస్తుండేవి. పత్తి సీజన్లో ఏటా సుమారు 20 వేల మంది కూలీలకు ఇక్కడ ఉపాధి లభించేది. కానీ పత్తి పంట విస్తీర్ణం తగ్గడం, గులాబీరంగు పురుగు వంటి సమస్యలతో రైతులు పంట సాగును తగ్గించడంతో జిన్నింగు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ప్రస్తుతం 18 ఫ్యాక్టరీలు కూడా ఆపరేషన్లో లేవు. అనేక ఫ్యాక్టరీలను యజమానులు విక్రయించారు. స్థలాలను ప్లాట్లుగా చేసి విక్రయించారు. దీంతో భైంసా పారిశ్రామిక చైతన్యం గణనీయంగా తగ్గిపోయింది. -
డెంటల్ విభాగం ఉందా..!
ఇక్కడ డెంటల్ విభాగం వైద్యురాలు తరచూ సెలవులో ఉంటున్నారు. అసలు ఆస్పత్రిలో డెంటల్ సేవలందిస్తున్న విషయం చాలామంది రోగులకు తెలియదు. ఈనెలలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు మాత్రమే ఓపీ నమోదైందంటేనే తెలిసిపోతుంది. దీంతో అప్పుడప్పుడు జనరల్ రోగులకు కూడా సేవలందిస్తున్నారు. అయితే, కొన్నిసార్లు విధులకు రాకున్నా హాజరు వేసుకుంటున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉదయం సకాలంలో హాజరు కాకపోవడంతో ఆలస్యంగా వస్తున్నట్లు సిబ్బంది ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించారు. అయితే, ఈరోజు ఆమె విధులకే రాలేదని తెలిసింది. -
నేడు ఖానాపూర్ మున్సిపల్ సమావేశం
ఖానాపూర్: ఏడాది కాలంగా పాలకవర్గం లేకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన ఖానాపూర్ మున్సిపాలిటీలో ఇటీవల ఎన్నికైన పాలకవర్గం సాధారణ సమావేశం బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరుగనుంది. పట్టణంలోని పలు సమస్యలు పరిష్కారంపై తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారా అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. చైర్పర్సన్ మౌనిక ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. సభ్యులు సకాలంలో రావాలని కోరారు. ఈ సమావేశంలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు వంటి ప్రాధాన్య సమస్యలపై తీర్మానాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు సమావేశమయ్యే కార్యాలయ గది శిథిలావస్థలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గది పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో తొలి సమావేశంలోనే కార్యాలయ భవనం మరమ్మతులు లేదా కొత్త భవనం నిర్మాణంపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. -
నామినేటెడ్కు సహకారం
నిర్మల్కలెక్టరేట్లో వాసవీమాత జయంతి వేడుకలు నిర్మల్చైన్గేట్: వాసవీమాత జయంతి వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుగా ఆయన పలువురు అధికారులు, సంఘాల నాయకులతో కలిసి వాసవీమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. వేడుకల్లో డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలనలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఎన్నికల ద్వారా నియమితులయ్యే పాలకవర్గాల స్థానంలో, ఇకపై నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. నామినేటెడ్ వెనుక వ్యూహం.. గతంలో జరిగిన ఎన్నికల విధానం స్థానంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిని అమలు చేయడం ద్వారా అధికార పార్టీ తన క్షేత్రస్థాయి శ్రేణులను సంతృప్తి పరచాలని యోచిస్తోంది. సహకార చట్టం ప్రకారం, ప్రతీ పీఏసీఎస్ పాలకవర్గంలో చైర్మన్, వైస్చైర్మన్తో పాటు మొత్తం 13 మంది సభ్యులు ఉండాలి. అయితే, ప్రస్తుత నియామకాల్లో ఒక్కో సంఘానికి ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన పాలకమండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల నిబంధనలను పాటిస్తూనే, పార్టీకి విధేయులుగా ఉన్న వారికి ఈ పదవులను కేటాయించేందుకు ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు కసరత్తు ప్రారంభించారు. సహకార వ్యవస్థలో మార్పులు గతంలో రైతు ఓటు ద్వారా ఎన్నికై న డైరెక్టర్లు తమ చైర్మన్ను ఎన్నుకునే విధానం ఉండేది. ఇది గ్రామీణ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఒక బలమైన అనుబంధాన్ని ఏర్పరిచేది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో, ఈ ఎన్నికల ప్రక్రియకు స్వస్తి పలికి నేరుగా పదవులను భర్తీ చేయడం వల్ల పాలనాపరంగా ఎలాంటి మార్పులు వస్తాయనేది వేచి చూడాలి. ఏదేమైనా, ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ అధికార పార్టీలో నెలకొన్న నిరాశను తొలగించి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందు కు ప్రభుత్వం వేస్తున్న ముందడుగుగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాల్లో పదవులు దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తీవ్ర పోటీ పడుతున్నారు. మే నెలాఖరుకల్లా నియామకాలను పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో, పదవుల కోసం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో లాబీయింగ్ మొదలు పెట్టారు. ఈ నియామకాలు కేవలం పీఏసీఎస్లకే పరిమితం కాకుండా, డీసీసీబీ, డీసీఎంఎస్ స్థాయిల్లో కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో జిల్లా నేతల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని పీఏసీఎస్ చైర్మన్ల రూపంలోనే 17 మందికి అవకాశం దక్కనుంది. -
బాధ్యతలు స్వీకరించిన భవేశ్మిశ్రా
నిర్మల్చైన్గేట్: నిర్మల్ నూతన కలెక్టర్గా భవేశ్ మిశ్రా ఆదివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్న భవేశ్మిశ్రాకు అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్కు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు జీవరత్నం, డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, శ్రీనివాస్, నరసింహారెడ్డి, దయానంద్, డీఈవో భోజన్న, సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, రమణ, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రిని కలిసిన మున్సిపల్ చైర్పర్సన్
ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక మహేందర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిని హైదరాబాద్లో ఆదివారం కలిశారు. జిల్లా అధ్యక్షుడు రితేష్రాథోడ్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఖానాపూర్ మున్సిపల్ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో నూతన పురపాలక సంఘ భవన నిర్మాణం, ఆధునిక గ్రంథాలయ భవనం ఏర్పాటు, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల స్థాపన, 100 పడకల ఆస్పత్రి నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విన్నవించారు. అనంతరం సోమాజీగూడలో ఆదివారం పీఎం నరేంద్రమోదీ 133వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రితేష్ రాథోడ్ రాష్ట్ర నాయకులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు బొప్పారపు సత్యవతి, గుమ్ముల ఆనంద్, ప్రకాశ్గౌడ్ పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంపు ప్రారంభం
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని వాణి పబ్లిక్ స్కూల్లో వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును ఆదివారం నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి ప్రారంభించారు. పిల్ల లకు చదువుతోపాటు డ్యాన్స్ ఆటలు, పాటల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొంది చురుకుగా తయారవుతారన్నారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ్ర రాంరెడ్డి, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు డాన్స్ మాస్టర్ ధనరాజ్, జానపద కళాకారుల బృంద సభ్యులు బిరుకుల సురేశ్, సాయి కృప, కావ్య, స్వామి వాణి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గంగాధర్ పాల్గొన్నారు. -
బాసరలో కలెక్టర్ దంపతుల పూజలు
బాసర: నిర్మల్ కలెక్టర్ భవేశ్మిశ్రా, తన సతీమణి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆదివారం బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా అతిథి గృహానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు బాసర ఎంపీడీవో దేవేందర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రకాశ్జాదవ్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆర్ఐ అభిమన్యు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగ్రో డీలర్ల సమ్మెబాట..!
భైంసాటౌన్: జిల్లాలో ఆగ్రో డీలర్లు సమ్మెబాట పట్టనున్నారు. ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ డిమాండ్ల సాధనకు ఈనెల 27న(సోమవారం) ఒకరోజు బంద్ పాటించనున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా డీలర్ల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులకు శనివారం సమ్మె నోటీసు అందజేశారు. విత్తన, ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈబంద్ తలపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రధాన డిమాండ్లు.. సమ్మె జయప్రదం చేయాలి.. తెలంగాణ రాష్ట్ర ఎరువులు, పురుగుమందులు – విత్తనాల డీలర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు ఈనెల 27న ఒకరోజు సమ్మె పాటిస్తున్నాం. ఈ మేరకు వ్యవసాయాధికారులకు నోటీసు అందించాం. రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఒకరోజు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాం. డీలర్లు బంద్కు సహకరించాలి. – సంజీవ్రెడ్డి, డీలర్ల సంఘం అధ్యక్షుడు, భైంసా


