breaking news
Nirmal District News
-
ఎన్నికల నిర్వహణలో తప్పులు దొర్లొద్దు
నిర్మల్చైన్గేట్/లక్ష్మణచాంద: రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో, సోన్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడా రు. జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రా రంభించాలని, ప్రతీ రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని తెలిపారు. సిబ్బందికి భోజనం, తాగునీటి సౌకర్యాలను పరిశీలించా రు. ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, అధికారులు పాల్గొన్నారు. -
నేడు మలివిడత పోరు
నిర్మల్: జిల్లాలోని ఏడు మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల సి బ్బంది పంపిణీ కేంద్రాల నుంచి సామగ్రిని తీసుకు ని శనివారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రెండోవిడతనూ విజయవంతంగా పూర్తిచేయాలంటూ క లెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల సూచించారు. ఉన్నతాధికారులతోపాటు ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్ఖానం సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం నుంచి ఫలితాలు..రెండోవిడతలోనూ ఉదయం ఏడునుంచి ఒంటిగంట దాకా పోలింగ్, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తక్కువ వార్డులు, ఓటర్లు ఉన్న పంచాయతీల ఫలితాలు మధ్యాహ్నం 3 గంటల నుంచే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉపసర్పంచ్ల ఎన్నికనూ నిర్వహించి, పంచాయతీల పాలకవర్గాన్ని పోలింగ్ సిబ్బంది ప్రకటించనున్నారు. వార్డులు, ఓటర్లు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో రాత్రివరకూ కౌంటింగ్ కొనసాగనుంది. గెలిచేదెవరో...తొలివిడతతో పోలిస్తే.. రెండోవిడతపై రాజకీయపరంగా మరింత ఆసక్తి నెలకొంది. ఈ విడతలో నిర్మల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ముధోల్లోని రెండు మండలాలు అలాగే రెండు నియోజకవర్గాల్లో పంచాయతీలు ఉన్న నర్సాపూర్(జి)ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటం, కాంగ్రెస్ శాయశక్తుల శ్రమించడంతో గెలుపు ఎవరు బలపర్చిన అభ్యర్థులను వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దిలావర్పూర్, గుండంపల్లి, సారంగపూర్, లోకేశ్వరం, కుంటాల, నర్సాపూర్(జి), సోన్ తదితర మేజర్ పంచాయతీల్లో పోటాపోటీ ఉండటమూ ఈవిడతపై రాజకీయ దృష్టిని పెంచింది. చాలాచోట్ల ఇద్దరు అభ్యర్థుల మధ్యనే పోటీ ఉండటంతో ఎవరు గెలుస్తురనేది ఉత్కంఠగా మారింది. మండలం జీపీలు వార్డులు సర్పంచ్ వార్డు ఏకగ్రీవమైన మొత్తం అభ్యర్థులు అభ్యర్థులు జీపీలు ఓటర్లునిర్మల్రూరల్ 20 170 63 313 01 22,751 సోన్ 14 132 47 219 01 21,801 సారంగపూర్ 32 282 93 365 05 39,516 దిలావర్పూర్ 12 108 39 142 –– 18,744 నర్సాపూర్(జి) 13 120 42 246 –– 20,238 లోకేశ్వరం 25 224 87 182 03 29,359 కుంటాల 15 134 43 239 –– 19,055 మొత్తం 131 1,170 414 1,706 10 1,17,464 -
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,552 మంది విద్యార్థులకు, 1278 మంది(82.3%) హాజరయ్యారు. 274 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల, వాసవీ, విజయ హైస్కూల్, భైంసా పట్టణంలోని అల్పోర్స్, వేదం, వాసవీ పాఠశాలల్లో పరీక్ష నిర్వహించారు. సిర్పూర్ కాగజ్నగర్ నవోదయ విద్యాలయానికి చెందిన అధ్యాపకులు సెంటర్ లెవల్ అబ్జర్వర్లుగా వ్యవహరించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్ తనిఖీ చేశారు. -
నిర్మల్
7తుదిదశకు పత్తి కొనుగోళ్లు! జిల్లాలో పత్తి కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయి. సీసీఐ కేంద్రాలతోపాటు ప్రైవేట్లో రైతులు పత్తి విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 31,576 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేశారు. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతాయి. చలి ప్రభావం కొనసాగుతుంది. చల్ల గాలులు వీస్తాయి. నత్తనడకన ఆధునికీకరణ అమృత్ భారత్ పథకం కింద బాసర రైల్వేస్టేషన్లో చేపట్టిన ఆధునికీకరణ పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. బాసరకు వచ్చే భక్తులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
పట్టాలెక్కనున్న ఆశల రైలు
నిర్మల్: నిర్మల్ప్రాంత ప్రజల ఆశల రైలు ఒక్కో అ డుగు ముందుకేస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ..!? అన్న ప్రజల ఆకాంక్షలను ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ ఒత్తిడి పెంచుతున్నారు. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ ప్రాంతంలో ని దాదాపు ఏడు లక్షల మంది జనాభాతోపాటు, దే శంలోని రెండు మహానగరాలైన హైదరాబాద్, నాగ్పూర్ మధ్య అనుసంధానానికి రైల్వేలైన్ నిర్మాణం వేగవంతం చేయాలంటూ ఇటీవలే రాజ్యసభలో వై ఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి కోరారు. లోక్సభ సమావేశాల్లో రైల్వేలైన్ గురించి చర్చించడంతోపా టు తాజాగా శనివారం రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్ను ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ కలిశారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వేలైన్కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజె క్టు రిపోర్ట్(డీపీఆర్) రైల్వేశాఖకు చేరిందని, దీన్ని త్వరగా ఆమోదించి లైన్నిర్మాణం చేపట్టాలని మరోసారి విన్నవించారు. రూ.4,300 కోట్ల అంచనా..పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ లైన్ వేస్తామంటూ ప్రజలను గందరగోళానికి గురిచేయకుండా, కేవలం ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు లైన్ నిర్మిస్తే సరిపోతుందని ఎంపీ నగేశ్ మరోమారు రైల్వేమంత్రికి వివరించారు. గతంలోనూ ఈమేరకే చేసిన వినతిప్రకారం దక్షిణమధ్య రైల్వే 136.50 కి లోమీటర్ల ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ నిర్మాణానికి రూ.4,300 కోట్ల అంచనాతో డీపీఆర్ పూరి చేసింది. సోన్ వద్ద గోదావరిపై బ్రిడ్జి, ఘాట్రోడ్లలో ఎనిమిది చోట్ల టన్నెళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇప్పటికే రైల్వేశాఖకు చేరిందని, దీన్ని త్వరగా రైల్వేబోర్డు ఆమోదించేలా చూడాలని ఎంపీ నగేశ్ మంత్రిని కోరారు. రైల్వేబోర్డు గ్రీన్సిగ్నల్ ఇస్తే..డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) పూర్తయినా మరో రెండు దశలు పూర్తయితేనే రైల్వేలైన్కు గ్రీన్సిగ్నల్ లభిస్తుంది. ప్రస్తుతం ఒక అడుగు ముందుకు పడింది. ఈ డీపీఆర్ను రైల్వేబోర్డు ఆమోదించి, ఆర్థికశాఖ క్లియరెన్స్ కోసం పంపిస్తే సరిపోతుంది. రైల్వేబోర్డు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఒప్పుకుంటే దాదాపు నిర్మల్ మీదుగా రైల్వేలైన్కు పచ్చజెండా ఊపినట్లే. ఆయా ప్రక్రియలను త్వరగా పూర్తిచేసి, ప్రజల ఆకాంక్ష మేరకు లైన్ నిర్మాణం చేపట్టాలని మరోమారు రైల్వేమంత్రిని కోరినట్లు ఎంపీ నగేశ్ ‘సాక్షి’కి తెలిపారు. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ మ్యాప్రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ను కలిసిన ఎంపీ నగేశ్త్వరగా పనులు ప్రారంభించాలని.. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పూర్తయింది. మిగితా ప్రకియలనూ త్వరగా పూర్తిచేసి లైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ను కోరాం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ప్రతిపాదిత రైల్వేలైన్ వివరాలు.. రైల్వేలైన్ : ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లబ్ధిపొందే డివిజన్లు : ఆర్మూర్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఆదిలాబాద్ లబ్ధిపొందే ప్రజలు : దాదాపు 7లక్షలు లైన్ నిర్మాణ అంచనా : రూ.4,300 కోట్లు లైన్ నిర్మాణ దూరం : 136.50 కిలోమీటర్లు -
ధాన్యం కోతపై అధికారుల నిలదీత
కుంటాల: ఆరుగాలం కష్టపడి పంటల సాగు చేసినా.. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించి నా ధాన్యంలో కోత విధిస్తున్నారని శనివారం అందకూర్ కొనుగోలు కేంద్రానికి వచ్చిన డీసీవో నర్సయ్యను రైతులు నిలదీశారు. కొనుగోలు కేంద్రంలో 40 కిలోల బస్తాకు 3 కిలోల చొప్పున క్వింటాల్కు సుమారు ఏడున్నర కిలోల చొప్పున కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ తేమ శాతం వచ్చిన తర్వాతనే తూకం వేసి రైస్ మిల్కు పంపినా మళ్లీ కోత విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల పెద్దపల్లి రైస్మిల్కు ఏడుగురు రైతులకు చెందిన 802 బస్తాలను పంపగా, 45 బస్తాలు కోత విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో పీఏసీఎస్ తమ సిబ్బంది తప్పిదమేమీ లేదని, మిల్లులో తప్పు జరిగి ఉండవచ్చని, మిల్లర్లతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని డీసీవో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఆయన వెంట సీఈవో నాగభూషణం ఉన్నారు. -
ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన
లోకేశ్వరం/కుంటాల: రెండో విడత పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అన్నారు. లోకేశ్వరంలో ఎన్నికల ఏర్పాట్లను, కుంటాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పోలీంగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉండి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తిచేయాలని కోరారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీపీవో శ్రీనివాస్, నోడ ల్ అధికారి అంబాజీ,జిల్లా ఎన్నికల అదనపు అధి కారి అల్లాడి వనజ, ఎంపీడీవో రమకృష్ణ, ఎంపీవోలు సోలమన్రాజ్, రహీంఖాన్, లోకేశ్వరం మండల పరిషత్ సూపరింటెండెంట్ వెంకటరమేశ్, మాస్టర్ ట్రైనీ దేవేందర్, మురళీధర్, కుంటాల తహసీల్దార్ కమల్సింగ్, ఎంఈవో ఉన్నారు. -
ఓటర్లతో మొరటుగా వ్యవహరించొద్దు
నిర్మల్ టౌన్: పంచాయతీ ఎన్నికల బందోబస్తు సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఓటర్లతో మొరటుగా వ్యవహరించొద్దని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని బుధవార్పేట్ మున్నూరు కాపు సంఘ భవనంలో రెండో విడత ఎన్నికల బందోబస్తుపై శనివారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అత్యంత సున్నిత, సాధారణ, క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించిన ఎన్నికల కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించామని తెలిపారు. ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రత పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. రెండోవిడత ఎన్నికలకు 800 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, సీఐలు ప్రవీణ్కుమార్, కృష్ణ, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
లోకేశ్వరం/కుంటాల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకో వాలని ఏఎస్పీ రాజేశ్మీనా సూచించారు. లోకేశ్వరం, కుంటాల పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులు కేటాయించిన పోలీసులతో సమావేశం నిర్వహించారు. పలు సూచలు చేశారు. ఎన్నికల సిబ్బందికి సహకరించాలన్నారు. గ్రామాల్లో అల్లర్లు జరుకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కేంద్రం వద్ద 200 మీటర్ల దూరం 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించొద్దన్నారు. ముథోల్, భైంసా రూరల్ సీఐలు మల్లేశ్, నైలు, ఎస్సైలు ఆశోక్, శంకర్, కృష్ణారెడ్డి, జుబేర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వీడని మూఢనమ్మకాలు..!
నిర్మల్/కడెం: ఏఐ స్మార్ట్ యుగంలోనూ మూఢనమ్మకాలు ప్రాణాలు తీస్తుండటం ఆందోళన కలిగి స్తోంది. మంత్రాలనెపంతో కడెం మండలం గండిగోపాల్పూర్లో ఓవ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా కర్రలతో కొట్టి చంపి, ఆనవాళ్లు లేకుండా కాల్చివేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. దశాబ్దం క్రితం వరకు ఇలాంటి ఘటనలు తరచూ జరిగేవి. ఇక మంత్రాలు, చేతబడులు, మూఢనమ్మకాల పేరిట హత్యలు తగ్గాయనుకుంటున్న తరుణంలో మళ్లీ తాజా ఘట న చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పల్లెపల్లెన, మూలమూలనా స్మార్ట్ఫోన్లు అడుగుపెట్టినా నమ్మకాల పేరుతో అమాయక ప్రజలను ఆడుకోవ డం, మంత్రాలే తమవాళ్ల ప్రాణాలను బలిగొన్నాయన్న అపనమ్మకాలతో ఎదుటివాళ్ల ప్రాణాలను తీయడం కలవరపెడుతోంది. మంత్రాలు, నమ్మకాల పేరిట చేస్తున్న హత్యలు ఇరువైపుల కుటుంబాలనూ రోడ్డుపాలు చేస్తున్నాయి. మళ్లీ అవే ఘటనలు..పదేళ్లక్రితం జిల్లాకేంద్రంలోనే గుప్తనిధుల కోసం స్థానిక శ్యామ్గఢ్లో ఓ విద్యార్థిని బలిపేరిట హత్య చేశారు. ఇదే గండిగోపాల్పూర్లో గతంలో ఇలాగే ఒకరిని చంపేశారు. జిల్లాలోని చాలా మండలాల్లో చేతబడి చేస్తున్నారని, మంత్రాలతో తమవాళ్ల ప్రా ణాలు తీస్తున్నారని కట్టేసి కొట్టడం, చంపేయడ మూ చేశారు. ఒకప్పుడంటే.. కమ్యూనికేషన్ వ్యవ స్థ, అవగాహన లేకపోవడం, ప్రతీదాన్ని గుడ్డిగా న మ్మడం వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగేవి. కాలక్రమంలో ప్రతీపల్లెలో విద్యావంతులు తయారవ్వడం, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పెరగ డం, పోలీసులు, ఇతర శాఖలు కళాబృందాల ద్వా రా అవగాహన కల్పించడంతో చాలా ఊళ్లు మూఢనమ్మకాలను వదిలించుకున్నాయి. కానీ ఇప్పటికీ.. పల్లెల్లో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనల ఆనవాళ్లు బయటపడుతున్నాయి. రోడ్డుపాలవుతున్న కుటుంబాలు..అపనమ్మకాల కారణంగా చోటుచేసుకుంటున్న ఘ టనలతో ఇరువైపులా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. చనిపోయినవారి కుటుంబంతోపాటు చంపినవారి కుటుంబాలూ తమ ఇళ్లు చూసుకునే పెద్దదిక్కు లేక శిక్షను అనుభవించాల్సి వస్తోంది. ఎవరి పైన అనుమానం ఉంటే.. పోలీసులకు ఫిర్యాదు చే యొచ్చు. కానీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడటం, ప్రాణాలు తీయడం సరికాదు. మూఢనమ్మకాలు వీడాలి.. ప్రజలు వాస్తవాలను తెలుసుకోకుండా మూఢనమ్మకాలను నమ్మవద్దు. ఇలాంటి వాటితో ప్రాణాలు పోవడం, జీవితాలు నాశనం కావడమే కాదు, కుటుంబాలూ జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మూఢనమ్మకాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. –ఉపేంద్రరెడ్డి, ఏఎస్పీ -
పరిమితికి లోబడి ఖర్చు చేయాలి
సారంగపూర్: పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిమితికి లోబడే ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు అయేషా మస్రత్ ఖానం అన్నారు. మండల కేంద్రంలో అభ్యర్థులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు సంబంధిత గ్రామపంచాయతీ జనాభా లెక్కల ఆధారంగా ఎన్నికల కమిషన్ నిర్ణయించిన మేరకే ఖర్చు చేయాలన్నారు. ఎన్నికల వ్యయాలను మండల కేంద్రంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు నిత్యం పరిశీలిస్తారని తెలిపారు. ఎన్నికలు ముసిగిన తర్వాత గెలిచిన వారు, ఓడినవారు లెక్కలు సమర్పించాలని పేర్కొన్నారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ రోజు ఎక్కడా పొరపాట్లు జరగకుండా అన్నిపోలింగ్ కేంద్రాలకు సామగ్రి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, తహసీల్దార్ సంధ్యారాణికి సూచించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసే బ్యాలెట్బాక్సులను పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులను మరోమారు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పోలింగ్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. అక్కడి నుంచి ధని గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎన్నికలు సజావుగా సాగేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీవో అజీజ్ఖాన్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
అత్యధిక, అత్యల్ప మెజారిటీ వీరిదే
లక్ష్మణచాంద: జిల్లాలో జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మణచాంద సర్పంచ్గా ఓస కవిత భారీ మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మండలంలో ఏకై క మేజర్ గ్రామ పంచాయతీ అయిన లక్ష్మణచాంద సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. గ్రామంలో మొత్తం ఓటర్లు 4,354 ఉండగా గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,355 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఓస కవిత ఏకంగా 1,840 ఓట్లు సాధించి తన సమీప అభ్యర్థి సుకన్యపై 1,123 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించిన సర్పంచ్గా చరిత్ర సృష్టించింది. స్వల్ప మెజారిటీతో.. లక్ష్మణచాంద మండలంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. బాబాపూర్ గ్రామంలో మొత్తం 891 ఓటర్లు ఉండగా ఇందులో 708 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో పడిగెల లక్ష్మికి 271 ఓట్లు, గుండాల లలితకు 263 ఓట్లు వచ్చాయి. లక్ష్మి కేవలం 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు. న్యూకంజర్ గ్రామంలో 384 ఓటర్లు ఉన్నారు. 319 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మద్దు మోహన్రెడ్డికి 136 ఓట్లు, లక్ష్మారెడ్డికి 127 ఓట్లు వచ్చాయి. మోహన్రెడ్డి 9 ఓట్లతో విజయం సాధించారు. -
నోటుకు.. రాలవు ఓట్లు..!
నిర్మల్: ‘అరె ఏమన్నా ఇది.. మనూళ్లె మరీ ఘోరంగ ఉన్నరు. ఓటుకు ఇంతని ఇచ్చినా కూడా ముఖం చూడలేదు. ఒక్కో ఇంటికి పెద్దమొత్తమే ఇచ్చినమే. అయినా ఆ గల్లీకెళ్లే నాలుగు ఓట్లు కూడా పడలేదు. పైసలిస్తే.. గెలుస్తమన్న ఆశతోని పంచినా.. లాభం లేకుండా పోయిందే. ఇటు గెలువకపోతిమి, అటు పైసలూ లాస్ అయితిమి పో..’ తొలివిడతలో ఓడి న ఓ అభ్యర్థి ఆవేదన ఇది. రూ.లక్షలు ఖర్చుచేసినా ఓటమి తప్పకపోవడంతో ఇప్పటికే తొలివిడత గ్రామాల్లోని పరాజితులు లెక్కలేసుకుంటున్నారు. ఎన్నిచ్చినా.. చాలాగ్రామాల్లో వార్డు సభ్యులుగా గెలవడానికి కూడా పలువురు అభ్యర్థులు తాయిలాలు ఇవ్వడం శోచనీయం. లక్ష్మణచాంద మండలంలోని ఓ గ్రా మంలో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.2 వేలపైనే ఇచ్చినట్లు ప్రచారమైంది. ఒకరిని మించి ఒకరు డబ్బులు పంచినట్లు చెబుతున్నారు. మామడ మండలంలోనూ ఓ గ్రామంలో ఇదే తరహాలో పంపకా లు సాగాయి. ఇక డబ్బులతోపాటు చికెన్, కూల్డ్రింక్లూ పంచారు. ఇంతచేసినా.. ఓటర్లు ఎటువేయాలో అటే వేశారు. గుణపాఠమయ్యేనా..! తొలివిడత ఎన్నికల్లో ఓటర్లు నేర్పిన పాఠం మిగితా రెండు విడతల అభ్యర్థులకు గుణపాఠం అవుతుందా..! అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకునోటు అనే విధానాన్ని వీడాలని చాలామంది సోషల్మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నా.. గ్రామాల్లో మాత్రం పంపకాల ప్రక్రియ ఆగడం లేదు. రెండోవిడతకు సంబంధించిన పంచాయతీల్లోనూ ప్రలోభాల పర్వం జోరుగానే సాగుతోంది. చాలామంది ఓటర్లూ.. ఓటుకు నోటును ఆశిస్తుండటమూ కనిపిస్తోంది. ‘ఓట్లు వేస్తారా.. లేదా.. తెలియదు కానీ.. పైసలైతే పంచాల్సిందేనే..’ అని అభ్యర్థులే చెబుతుండటం గమనార్హం. -
ముందే ఓటేశారు
లోకేశ్వరం: ఈనెల 14 జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, ఉద్యోగులు శుక్రవారం వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. లోకేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ బ్యాక్స్లో ఓటు వేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైయినీలు దేవేందర్, మురళీధర్ ఉన్నారు. కుంటాలలో.. కుంటాల: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కుంటాల మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 10 నుంచి శుక్రవారం వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ ఓటు వేశారు. బుధవారం 02, గురువారం 01, శుక్రవారం 46 మొత్తం 49 మంది పోస్టల్ ఓట్లు పోలయ్యాయని జిల్లా ఎన్నికల అదనపు అధికారి అల్లాడి వనజ తెలిపారు. -
బాసర ఆలయంలో ‘మహా’ భజన
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీదేవి ఆలయంలో మహారాష్ట్రకు చెందిన భక్తులు శుక్రవారం భజన కార్యక్రమం నిర్వహించారు. పర్బని, బిడ్ జిల్లాల ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీరామ స్మరణతోపాటు సరస్వతి అమ్మవారి శ్లోకాలను భజన చేశారు. కార్యక్రమంలో శివానంద మహారాజ్, అమూల్శాస్త్రి సంతోష్ శాస్త్రి, ఉద్భవిశాస్త్రి భక్తిభజన బృందం సభ్యులు పాల్గొన్నారు. పాపహేశ్వరాలయంలో పూజలు.. బాసర: బాసర శ్రీపాపహేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శివశ్రీ జంగం నాగేశప్ప, భక్తులు పాల్గొన్నారు. -
రెండో విడతకు రెడీ..
నిర్మల్హాకీలో మూడోస్థానం అండర్–14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలి చారు. వనపర్తి వేదికగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచారు. కుష్ఠురహిత జిల్లా లక్ష్యం నిర్మల్చైన్గేట్: జిల్లాను కుష్ఠు రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో లెప్రసీ కేస్ డిటెక్షన్ కార్యక్రమంపై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ లెప్రసీ కేస్ డిటెక్షన్ కార్యక్రమం ఈనెల 18 నుంచి 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్స్ ప్రతీ ఇంటిని సందర్శించి ప్రతీ వ్యక్తిని పరీక్షించడం జరుగుతుందన్నారు. తద్వారా లెప్రసీని గుర్తించి వెంటనే చికిత్స అందించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, వ్యాధిపై ఉన్న అపోహలు తొలగించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 14 ఏళ్ల బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నయానరెడ్డి, డాక్టర్ ప్రత్యూష, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఆకాశ్, ఆశిష్రెడ్డి, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, డీపీఎంవో రాజేశ్వర్, గంగన్న జిల్లాలోని వైద్యాధికారులు, పర్యవేక్ష సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక రెండో విడతలో నిర్మల్రూరల్, సోన్, దిలావర్పూర్, సారంగపూర్, నర్సాపూర్, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో పోలింగ్ జరుగనుంది. ఏడు మండలాల్లో మొత్తం 131గ్రామ పంచాయతీలు, 1,170 వార్డులు ఉన్నాయి. రెండో విడతలో పది జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 121 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను శనివారం చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో జిల్లా అధికారులు పోలింగ్ సామగ్రి పంపిణీ ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది ఎంపిక ప్రక్రియలను పూర్తిచేశారు. పోలింగ్ కేంద్రాలనూ సన్నద్ధం చేసిపెట్టారు. ఆ ఊళ్లల్లో అంతా ఏకగ్రీవం.. రెండో విడతలో పదిగ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. సారంగపూర్ మండలం పెండల్దరి, మహవీర్తండా, రాంసింగ్తండా, సాయినగర్తండా, లోకేశ్వరం మండలంలోని బిలోలి, నర్సింహనగర్తండా, సేవాలాల్తండా, సోన్ మండలం లోకల్వెల్మ ల్ పంచాయతీల్లో సర్పంచ్లతోపాటు అన్నివార్డులూ ఏకగ్రీవం అయ్యాయి. సారంగపూర్ మండలంలోని స్వర్ణ(పొంకూర్), నిర్మల్రూరల్ మండలం తల్వేద గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 1,170 వార్డులకుగానూ 430 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 121 జీపీలు, 740 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మండలాల వివరాలు..మండలం జీపీలు వార్డులు ఓటర్లు నిర్మల్రూరల్ 20 170 22,751 సోన్ 14 132 21,801 సారంగపూర్ 32 282 39,516 దిలావర్పూర్ 12 108 18,744 నర్సాపూర్(జి) 13 120 20,238 లోకేశ్వరం 25 224 29,359 కుంటాల 15 134 19,055 మొత్తం 131 1,170 1,17,464పంపిణీకి సర్వం సిద్ధం.. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండోవిడత ఎన్నికల సిబ్బంది శనివారం ఉదయమే పంపిణీ కేంద్రాలలో రిపోర్టు చేసి, సంబంధిత పోలింగ్ సామగ్రిని వెంట తీసుకుని కేటాయించిన జీపీలకు వెళ్లాల్సి ఉంటుంది. నిర్మల్రూరల్ మండలానికి సంబంధించి ఎన్టీఆర్ మినీస్టేడియంలో, సోన్లో మండలపరిషత్ ఆవరణలో, సారంగపూర్లోని వ్యవసాయ మార్కెట్కమిటీలో, దిలావర్పూర్లో మండలపరిషత్ కార్యాలయంలో, నర్సాపూర్(జి)లో జెడ్పీహెచ్ఎస్లో, లోకేశ్వరంలో రైతువేదికలో, కుంటాలలో మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు శనివారం సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు. సంబంధిత రవాణా ఏర్పాట్లనూ అధికారులు చేశారు. మహిళలదే పైచేయి... రెండోవిడత మండలాల్లోనూ మహిళ ఓటర్లదే పైచేయి. ఈవిడతలో మొత్తం 1,71,464 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 80,144 మంది ఉండగా, మహిళలు 91,316 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే 11,172 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సారంగపూర్ మండలంలో అత్యధికంగా 32 జీపీలు, 282 వార్డులు ఉండగా, దిలావర్పూర్లో కేవలం 12 జీపీలు, 108 వార్డులు ఉన్నాయి. -
నేడు నవోదయ పరీక్ష
నిర్మల్ రూరల్: జిల్లాలో శనివారం నిర్వహించనున్న నవోదయ ప్రవేశ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. ప్రతీ విద్యార్థి హాల్టికెట్, ఆధార్ కార్డు తప్పకుండా తీసుకురావాలని సూచించారు. పరీక్షకు జిల్లాలో మొత్తం 1,552 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. భైంసా ప్రాంత విద్యార్థులకు భైంసా పట్టణంలోని ఆల్ఫోర్స్, వేదం, వాసవి పాఠశాలలు పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. నిర్మల్ ప్రాంత విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల, విజయ హైస్కూల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖానాపూర్ ప్రాంత విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని దివ్యనగర్లోని వాసవి హై స్కూల్ లో ప్రవేశ పరీక్ష జరగనుంది. 24 మంది విద్యార్థులకు ఒక తరగతి గది చొప్పున కేటాయించారు. పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెంట్తోపాటు కాగజ్నగర్లోని నవోదయ విద్యాలయానికి చెందిన లెక్చరర్లు సెంటర్ లేబర్ అబ్జర్వర్లుగా ఉంటారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇన్విజిలేటర్లకు సూచనలు చేశారు. -
సర్పంచుల కుటుంబం
కడెం: సర్పంచ్గా గ్రామానికి వారు చేసిన సేవలతో మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందినవారిని ఎన్నుకుంటున్నారు. 2013–18వరకు నచ్చన్ఎల్లాపూర్ సర్పంచ్గా బొడ్డు రాజవ్వ(రాజు), 2019–2024 వరకు అమె కొడుకు బొడ్డు గంగన్న ఉన్నారు. ప్రస్తుతం అమె కోడలు బొడ్డు రాజేశ్వరి సర్పంచ్గా గెలుపొందారు.బొడ్డు రాజవ్వ బొడ్డు గంగన్న బొడ్డు రాజేశ్వరి -
ధాన్యంలో కోత.. రైతుల ఆందోళన..!
కుంటాల: విక్రయించిన ధాన్యంలో కోత విధించడంపై మండలంలోని సన్నాలు సాగుచేసిన వరి రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. మండలంలోని అందకూర్ గ్రామంలో ఇటీవల పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు సన్నరకం ధాన్యాన్ని విక్రయించారు. కొనుగోలు కేంద్రం నుంచి ఐదుగురు రైతులకు చెందిన 802 ధాన్యం బస్తాలను ఈనెల 2న ఓ లారీలో లోడ్ చేసి పెద్దపల్లి రైస్మిల్కు తరలించారు. అక్కడి నిర్వాహకులు 45 బస్తాలు కోత విధించి 757 బస్తాలకు సంబంధించిన ట్రక్షీట్ పంపించారు. పీఏసీఎస్ సిబ్బంది సంబంధిత రైతులకు శుక్రవారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసేందుకు ఓటీపీలను ఫోన్ చేసి అడిగారు. ఈ సందర్భంగా ధాన్యం కోత విషయం తెలుసుకుని రైతులు ఆందోళన చెందారు. ధాన్యం కోత విధించడంపై కొనుగోలు కేంద్రం వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న రైతులు -
పాఠశాలల్లో ఫర్నిచర్ సర్దుబాటు..
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి తక్కువ ఫర్నీచర్ ఉండటం, మరికొన్ని చోట్ల తక్కువ విద్యార్థుల సంఖ్య ఉండి అధిక ఫర్నిచర్ ఉండటం జరుగుతోంది. దీంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నిచర్ లేని పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల మధ్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్, తక్కువ విద్యార్థుల సంఖ్య ఉండి ఎక్కువ ఫర్నిచర్ ఉన్న పాఠశాలల నుంచి విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి తక్కువ ఫర్నిచర్ ఉన్న సమీప పాఠశాలలకు బెంచీలు సర్దుబాటు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. 2024–25 గణాంకాలు.. 2024–25 గణాంకాల ప్రకారం, పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు మించి డ్యూయల్ డెస్క్ బెంచీలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి సరిపడా బెంచీలు లేకపోవడంతో వారు నేలపైనే నిత్యం కూర్చోవలసి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, అధిక ఫర్నీచర్ ఉన్న పాఠశాలల నుంచి అవసరమైన పాఠశాలలకు, ముఖ్యంగా సమీపంలో ఉన్నవి, తరలించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఎంఈవోలకు బాధ్యతలు.. రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి భోజన్న, ఆయా మండలాల ఏంఈవోకు క్షేత్రస్థాయి పర్యటన చేసి పూర్తి వివరాలు అందజేయాలని సూచించారు. ఆయా మండలాల ఎంఈవోలు అందజేసిన నివేదికను కలెక్టర్ అభిలాష అభినవ్ దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ ఆదేశాల మేరకు సర్దుబాటు చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల సమాచారం... జిల్లా పేరు పాఠశాలల విద్యార్థుల సంఖ్య సంఖ్య నిర్మల్ 833 66792 మంచిర్యాల 719 42836 ఆదిలాబాద్ 739 65000 కుమురంభీం 721 43423ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు.. రాష్ట్ర పాఠశాల డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను క్షేత్ర స్థాయిలో సందర్శించి ఎక్కువ ఫర్నిచర్ ఉండి తక్కువ విద్యార్థుల పాఠశాలల వివరాలను జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందజేయాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. ఎంఈవోల నివేదికను కలెక్టర్ అభిలాష అభినవ్కు పంపించి మేడం కలెక్టర్ సూచనల మేరకు ఫర్నిచర్ సర్దుబాటు చేస్తాం. పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – భోజన్న, డీఈవో నిర్మల్ -
తొలి పోరు ముగిసింది
నిర్మల్చైన్గేట్: జిల్లాలో గురువారం నిర్వహించిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దస్తురాబాద్, కడెం, పెంబి, లక్ష్మణ చాంద, మామడ, ఖానాపూర్ మండలాల్లోని 119 సర్పంచ్, 591 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరు మండలాల పరిధిలో పోలింగ్ 80.42 శాతంగా నమోదైంది. అత్యధికంగా పెంబి మండలంలో 83.32 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆరు మండలాల పరిధిలో 1,20,630 మంది ఓటర్లుండగా 97,007 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుష ఓటర్లు 42,564, మహిళా ఓటర్లు 54,442 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళల ఓట్లు 86శాతం పోలయ్యాయి. -
అవగాహన కల్పించాలి
ఈ ఏడాది భూమిలో తేమ ఉండడంతో యాసంగిలో వేసుకున్న శనగ, మొక్కజొన్న, పెద్దజొన్న పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే మరిన్ని దిగుడులు సాధిస్తాం. – అశోక్, రైతు, హిప్నెల్లి అవగాహన కల్పిస్తాంరైతులు యాసంగిలో సాగు చేసిన శనగ, మొక్కజొన్న, పెద్ద జొన్న, కుసుమ, కూరగాయల పంటలను వ్యవసాయాధికారులు పరిశీలిస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ఏఈవోలతో రైతులకు అవగాహన కల్పించేలా చూస్తాం. కొన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో యాసంగి సాగు కాలేదు. కొన్నిచోట్ల మొక్కజొన్న, వరి సాగు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఏఈవో పోస్టులు భర్తీ చేసి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – అంజిప్రసాద్, డీఏవో -
యాసంగి ఆశాజనకం
తానూరు: యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలు కురియడంతో ఖరీఫ్లో పంటలు సాగు చేసిన రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందలేకపోయారు. ఈ వానాకాలంలో రైతులు సాగు చేసిన సోయా భారీ వర్షాలకు వచ్చిన వరద కారణంగా దెబ్బతిని అనుకున్నంత దిగుబడి రాలేదు. పత్తి కూడా సగానికిపైగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు నానా తిప్పలు పడ్డారు. ఎన్నో ఆశలతో యాసంగిలో వివిధ పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పంటలు ఆశాజనకంగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తే.. యాసంగిలో సాగు చేసిన పంటలపై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తే మరింత దిగుబడి పొందవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల వారీగా రైతుల పంటలను పరిశీలించి తెగుళ్ల బారి నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తే అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభపడవచ్చని భావిస్తున్నారు. కొన్ని గ్రామాల్లోని క్లస్టర్లలో సిబ్బంది కొరత కారణంగా అవగాహన కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయాధికారుల పోస్టులు భర్తీ చేసి పంటల సాగుపై సలహాలు ఇస్తే మరింత దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.జిల్లాలో పంటల సాగు ఇలా.. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో రైతులు భూమిలో తేమ ఉండడంతో యాసంగిలో వివిధ పంటలు సాగు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో 50వేల ఎకరాల్లో శనగ, 60వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో పెద్దజొన్న, గోధుమ, కుసుమ పంటలు సాగు చేశారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తే కష్టాలు కొంత మేరకు తొలగిపోతాయని రైతులు చెబుతున్నారు. -
‘అధికారం’వైపే పల్లెలు
నిర్మల్: పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకు న్నా పోటీలో ఉన్న అభ్యర్థులు వివిధ పార్టీలకు చెందినవారే ఉంటారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థులు గా బరిలో దిగుతారు. జిల్లాలో గురువారం ముగిసి న తొలివిడత పంచాయతీ సమరంలో అధికార కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలి చారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం, జిల్లాలో ఇద్ద రు ఎమ్మెల్యేలున్న బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఆ శించిన ఫలితాలు సాధించకున్నా.. పలు మండలా ల్లో సత్తా చాటారు. గత ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఈసా రి కొన్ని పంచాయతీలకు పరిమితమై ‘కారు’ ఉనికి ని చాటారు. పార్టీలకు ఎలాంటి సంబంధం లేకుండా బరిలో నిలిచిన స్వతంత్రులూ బీజేపీ, బీఆర్ఎస్ కంటే అధిక స్థానాల్లో గెలుపొందడం గమనార్హం. ఖానాపూర్లో కాంగ్రెస్.. తొలివిడతలో ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖా నాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలు న్నాయి. ఈ మండలాల్లో మొత్తం 91జీపీలుండగా, 45చోట్ల కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణచాంద, మామడ మండలాల్లో కలిపి 45జీపీలుండగా, 24 చోట్ల హస్తం విజయకేతనం ఎగురవేసింది. తొలివిడతలో ఏకగ్రీవమైన 16స్థానాల్లోనూ 11మంది కాంగ్రెస్ బలపర్చిన స్థానాలే కావడం గమనార్హం. రెండు మండలాల్లో బీజేపీ.. ఖానాపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి కేవలం ఆరు జీపీలకే బీజేపీ బలపర్చిన అభ్యర్థులు పరిమితమయ్యారు. నిర్మల్ నియోజకవర్గ పరిధిలో మాత్రం కమలదళం చెప్పుకోతగ్గ ఫలితాలు సాధించింది. లక్ష్మణచాంద, మామడ మండలాల్లో 8 చొప్పున 16స్థానాల్లో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఉనికి చాటుకున్న బీఆర్ఎస్ గత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు క్లీన్స్వీప్ చేసిన బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత దయనీయస్థితికి చేరింది. ఖానాపూర్ నియోజకవర్గంలో అంతోఇంతో సత్తాచాటుకుంది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ కలుపుకొని 18స్థానాల్లో గెలుపొందింది. మామడలో ఒకరు గెలవగా, లక్ష్మ ణచాందలో ఒక్కరూ గెలువలేదు.మండలాలవారీగా పార్టీల మద్దతు, స్వతంత్రంగా విజేతలైనవారు మండలం జీపీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇతరులుఖానాపూర్ 25 07 02 06 10 కడెం 29 15 01 07 06 పెంబి 24 15 01 03 05 దస్తురాబాద్ 13 08 02 02 01 మామడ 27 17 08 01 01 లక్ష్మణచాంద 18 07 08 00 03 మొత్తం 136 69 22 19 26 -
బస్సు సౌకర్యం కల్పించాలి
బాసర: మండలంలోని కిర్గుల్ (కె)గ్రామానికి రెండుసార్లే బస్సు వస్తుందని.. ఆ తర్వాత రా వడం లేదని మహిళలు వాపోయారు. వివిధ పనులకు బాసరకు వెళ్లేవారు గన్నవరం, అష్ట, ముధోల్ మీదుగా వెళ్తూ ఇబ్బంది పడుతున్నారని, తమ గ్రామం నుంచి అదనపు ట్రిప్పులను నడిపించాలని కోరుతున్నారు. పంచ పరివర్తనతో మెలగాలి భైంసాటౌన్: సమాజంలో విద్యార్థులు పంచ పరివర్తన గుణాలతో నడుచుకోవావాలని శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు నర్లపురి రవీందర్, విభాగ్ శైక్షనిక్ ప్రముఖ్ కలిమహంతి వేణుమాధవ్ అన్నారు. పట్టణంలోని కిసాన్గల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో గురువారం పంచ పరివర్తన్ ప్రబోధన్ కార్యక్రమం నిర్వహించగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దే శం చేశారు. కుటుంబప్రబోధన్, పర్యావరణం, స్వదేశీ, సామాజిక సమరసత, పౌరవిధులు త దితర అంశాలు వివరించారు. కుటుంబంలో రోజురోజుకు నైతిక విలువలు పడిపోతున్నాయని.. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సమ యం వెచ్చించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు రమేశ్ మాశెట్టివార్, ప్రధానాచార్యులు నామాల భోజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిర్మల్
ప్రసవం ప్రాణాంతకం ప్రసవ వేదనతో కొందరు మాతృమూర్తులు మృత్యువాత పడుతున్నారు. రిమ్స్లో ఇలాంటి ఘట నలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోంది.శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025లక్ష్మణచాందలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలుసోయా రైతుల నిరసనకుంటాల: అధికారులు నాణ్యత సాకుతో సో యా కొనుగోళ్లు చేపట్టక పోవడాన్ని నిరసిస్తూ గురువారం మండలంలోని లింబా(కే) గ్రామంలో రైతులు నిరసన తెలిపారు. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రంలో 150 మంది రైతులకు చెందిన రెండువేల సోయా బస్తాలను అధికారులు కొనుగోలు చేశారు. తూకం వేసి 45 రో జులు గడుస్తున్నా ఇప్పటికీ తరలించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లే కుండా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు. -
జిల్లాలో పోలింగ్ ప్రశాంతం
నిర్మల్టౌన్: జిల్లా పరిధిలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాగిందని ఎస్పీ జానకీ షర్మిల ఓ ప్రకటనలో తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో అదనపు పోలీస్ బలగాలను మో హరించామని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతించలేదని పేర్కొన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలు జరిపితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ కడెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ జానకీ షర్మిల సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రాజేశ్మీనా, ఉపేంద్రరెడ్డి, ఎస్సై సాయికిరణ్ ఉన్నారు. దస్తురాబాద్లో ఏఎస్పీ.. దస్తురాబాద్: మండలంలోని పెర్కపల్లి, మున్యా ల, దస్తురాబాద్లోని పోలింగ్ కేంద్రాలను గురువారం ఏఎస్పీ ఉపేందర్రెడ్డి పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల భద్రతను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. ఏఎస్పీ వెంట ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్సై సాయికుమార్ తదితరులున్నారు. -
ఉచిత న్యాయ సహాయం అందిస్తాం
భైంసాటౌన్: మానసిక వికలాంగులకు ఉచిత న్యా య సహాయం అందించేందుకు భరోసా కల్పిస్తామ ని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక తెలిపారు. పట్ట ణంలోని నర్సింహ కల్యాణ మండపంలో బుధవా రం స్నేహ సొసైటీ, దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగులు, మానవ హ క్కుల దినోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ చిన్నారుల నృత్య, గాన ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమానికి రాధిక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులను అ క్కున చేర్చుకుని చదువు చెప్పించి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని అభినందించారు. మానసిక వికలాంగులను తల్లిదండ్రులు పాఠశాలల్లో చే ర్పించి చదివించాలని సూచించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్దయ్య మాట్లాడుతూ.. దేశంలో 21రకాల దివ్యాంగులుంటే ఆరు విభాగాలకే వైద్యులున్నారని, మిగతా విభాగాలకూ డాక్టర్లను నియమించాలని కోరారు. సదరం యూడీఐడీ సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కా ర్యక్రమంలో భైంసా సీడీపీవో రాజశ్రీ, సొసైటీ భైంసా అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్, కార్యదర్శి సిద్ద య్య, అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సి పాల్ జ్యో తి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఐఎంఏ కార్యదర్శి సూర్యకాంత్రెడ్డి, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు సచిన్రెడ్డి, శివ కాశీనాథ్, నాగ్నాథ్ పటేల్, దామోదర్రెడ్డి, రామకృష్ణగౌడ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న జిల్లా జడ్జి రాధిక -
కూలీలకు వసతులు కల్పించాలి
సారంగపూర్: కార్మికులకు కనీస వసతులు కల్పించాలని, పనికి తగిన వేతనం బ్యాంక్ ద్వారా చెల్లించాలని ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల కోరారు. మండలంలోని చించోలి(బీ) సమీపంలోని ఇటుకబట్టీని బుధవా రం సందర్శించారు. ఇటీవల కార్మికురాలు భానుమతి ట్రాక్టర్ పైనుంచి పడి మృతిచెందగా నిజనిర్ధారణ కోసం వచ్చినట్లు చెప్పారు. సదరు మహిళ భర్త జగ్మండ్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడంతోనే ఆమె మృతి చెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. బట్టీలో చాలామంది బాలకార్మికులున్నట్లు గుర్తించి చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారమిచ్చామని పేర్కొన్నారు. కార్మికశాఖ అధికారులు ఇటుకబట్టీల్లో పని చేసే వలసకార్మికులకు కనీస వసతులు కల్పించి వారి హక్కులను పరిరక్షించాలని, మృతి చెందిన మహిళ కుటుంబానికి తక్షణమే పరిహారం అందించేలా చ ర్యలు తీసుకోవాలని కోరారు. ఇటుకబట్టీ యజమానులు శేషాద్రి, వెంకట్రెడ్డి నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. యూని యన్ నాయకుడు సయ్యద్ ఇల్యాస్ ఉన్నారు. -
బొజ్జుకు ప్రతిష్టాత్మకమే..
రెండేళ్ల క్రితం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెడ్మ బొజ్జుపటేల్ తొలిసారి పంచాయతీ పోరు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే డీసీసీ అధ్యక్షుడు కావడంతో తన సొంత ఇలాఖాలో తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవడం మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు బాధ్యత తీసుకుని చెమటోడ్చారు. ఓవైపు నేతలను సమన్వయం చేసుకుంటూ డీసీసీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఎమ్మెల్యేగా ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని పంచాయతీల్లో ప్రచారం చేశారు. అక్కడక్కడా ఇబ్బందులు, ఆరోపణలు ఎదురైనా.. తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలంటూ కోరారు. అధికార పార్టీ అండ ఉంటే పంచాయతీలు అభివృద్ధి చెందుతాయంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. -
పెండింగ్ బిల్లులెలా?
నిర్మల్చైన్గేట్: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రి య మొదలు కావడంతో తాజా మాజీ సర్పంచుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలోని చాలా గ్రా మాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కొత్త పాలకవర్గం వస్తే తమ బిల్లులు చెల్లింపు మరింత జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు రూ.13.60 కోట్లు జిల్లాలో పునర్విభజనకు ముందు 396 గ్రామపంచాయతీలుండగా మేజర్ పంచాయతీల్లో ఎక్కు వ, చిన్న పంచాయతీల్లో తక్కువ పనులు జరిగా యి. జిల్లా వ్యాప్తంగా మాజీ సర్పంచులకు బిల్లు ల బకాయిలు దాదాపు రూ.13.60కోట్ల వరకు ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో వివి ధ రకాల అభివృద్ధి పనులు చేశారు. ఆ బిల్లులను గ్రామపంచాయతీల ద్వారానే చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఇలా పంచాయతీ ని ధులతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లు బ కాయిలు అలాగే ఉండిపోయాయి. బిల్లుల చెల్లింపుల కోసం మాజీ సర్పంచులు అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా బిల్లు బకాయిల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శించినట్లు విమర్శలున్నాయి. చెల్లింపులపై స్పష్టత కరువు ఎన్నికలకు ముందుగానే ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఎంత మొత్తం బకాయిలున్నాయో ప్రభుత్వం అధికారుల ద్వారా వివరాలు సేకరించింది. అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేసి బిల్లులను ట్రెజరీలో అందించారు. కొన్ని పనులకు టోకెన్లు జారీ కాగా మరికొన్ని పనులకు ఇవ్వలేదు. ఎలాంటి నిధులు మంజూరైనా పంచాయతీ ఖాతాల్లోకే చేరుతాయి. ఈ నేపథ్యంలో కొత్త పాలకవర్గాలు వాటిని కొత్త పనుల కోసం వినియోగిస్తే తమ పరిస్థితి ఏమిటని దిగులు చెందుతున్నారు. దీనిపై ఎలాంటి స్పష్టత ఇ వ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలి గతంలో గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా చేసిన పనుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. నిధులు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బిల్లుల బకాయిలు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలి. – వీరేశ్యాదవ్, సర్పంచుల సంఘం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు -
బల నిరూపణలో జాన్సన్
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ జిల్లాలో చాలావరకు ఉనికి కో ల్పోయింది. ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్రమే హస్తం పార్టీ కాస్త బలంగా కనిపిస్తోంది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయకే కార ణం. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈక్రమంలో తొలిసారి ఎదుర్కొంటున్న పంచాయతీ ఎన్నికల్లో శ్రమించారు. గ్రామగ్రామాన, ఇంటింటా తిరిగి, బలనిరూపణకు సిద్ధమయ్యారు. కనీ స స్థానాలైనా తాము బలపర్చిన అభ్యర్థులకు దక్కితే తాము గెలిచినట్లేనని ఆయన చెబుతున్నారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
పెంబి: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూ చించారు. బుధవారం మండల కేంద్రంలోని జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటర్లవా రీగా సిబ్బందికి కేటాయించిన సామగ్రిని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్ని కల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు. గురువారం ఎన్నికలు ముగిసిన అనంతరం సామగ్రిని అ ధికారులకు అప్పగించాలని సూచించా రు. ఏఎస్పీలు రాజేశ్మీనా, ఉపేందర్రె డ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, మండల ప్రత్యేకాధికారి నరసింహారెడ్డి, జిల్లా విద్యాశా ఖ అధికారి భోజన్న, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. ఖానాపూర్ పట్టణంలో.. ఖానాపూర్: పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ (బాలికలు)లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల పరిశీలించారు. కౌంటర్లు, పోలింగ్ సామగ్రిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుపాలని సూచించారు. -
నేడే తొలి సంగ్రామం
నిర్మల్ఇంటి నుంచి ఓటు లేనట్లే.. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నడవలేని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటేసే సౌకర్యం కల్పించారు. గ్రామపంచా యతీ ఎన్నికల్లో దీనిని విస్మరించారు. పోలింగ్ ఏర్పాట్ల పరిశీలన లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బుధవారం పరిశీలించారు. రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి అంబాజీ, ఎంపీడీవో రాధ, తహసీల్దార్ సరిత, డీటీ బాబుసింగ్, ఎంపీవో నసురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రథమ సంగ్రామానికి వేళయింది. తొలివిడత గ్రామాల్లో ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది. జిల్లాలోని ఆరు మండలాల్లో గురువారం ఉదయం నుంచే ఓట్ల పండుగ ప్రారంభమవుతోంది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురా బాద్, మామడ, లక్ష్మణచాంద మండలాల్లో 136 జీపీలుండగా 16 ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్లు వేయని దస్తురాబాద్ మండలం పెర్కపల్లి మినహా మిగతా 119 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ విడతలోని సమస్యాత్మక పంచాయతీలతో పాటు మిగతా జీపీల్లోనూ బుధవారం సాయంత్రంలోపే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పో లింగ్ సిబ్బంది కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. యాపల్గూడ లాంటి కేంద్రాలకు కడెం నది ని తెప్పపై దాటుతూ సిబ్బంది వెళ్లడం గమనార్హం. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్న ఆరు మండలాల్లో బుధవారం సాయంత్రం వరకే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇక గురువారం ఉద యం 7గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. గంట విరామం తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఒంటిగంటలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నవారినే ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే పోలీస్ బందోబస్తు మధ్య లెక్కింపు కొనసాగనుంది. వార్డులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఫలితాలు తేలడానికి సమయం కాస్త అటుఇటుగా పట్టనుంది. సాయంత్రం 4గంటల నుంచి పంచాయతీల భవితవ్యం తేలే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరాలూ ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లే అధికం తొలివిడత ఎన్నికలు నిర్విహిస్తున్న ఆరు మండలా ల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉ న్నారు. ఈ విడతలో 1,27,245 ఓటర్లలో పురుషులు 60,576, మహిళలు 66,667మంది ఉన్నారు. ఈలెక్కన పురుషుల కంటే 6,091మంది మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఆరు మండలాల్లో కలిపి ఇతరు ల కేటగిరీలో ఇద్దరు ఓటర్లున్నారు. కడెం మండలంలో అధికంగా 29,159మంది ఓటర్లుండగా, అత్య ల్పంగా పెంబిలో 10,886మంది ఓటర్లున్నారు. తొలి విడత ఎన్నికల వివరాలు ఎన్నికలు జరిగే మండలాలు 6 మొత్తం ఓటర్లు 1,27,245 మహిళా ఓటర్లు 66,667 పురుష ఓటర్లు 60,576 ఇతరులు 02 మొత్తం పంచాయతీలు 136 ఏకగ్రీవమైన పంచాయతీలు 16 నామినేషన్ వేయని జీపీలు 1 ఎన్నికలు జరిగే జీపీలు 119 పోటీలో ఉన్న అభ్యర్థులు 454 మొత్తం వార్డులు 1,072 ఏకగ్రీవ వార్డులు 474 ఎన్నికలు జరిగే వార్డులు 591 నామినేషన్ వేయని వార్డులు 07 పోటీచేస్తున్న అభ్యర్థులు 1,369 -
తొలివిడత ఆ ముగ్గురికీ కీలకం
నిర్మల్: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మొ దటి విడతలో ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి, మామడ, లక్ష్మణచాంద మండలాలున్నాయి. ఇందులో ఖానాపూర్ నియోజకవర్గం అధికార కాంగ్రెస్తోపాటు బీజేపీ, బీఆర్ఎస్కూ కీలకం. ఎందుకంటే.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏకై క కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్ నియోజకవర్గమిది. ఇటీవల నిర్మల్ డీసీసీ పదవి కూడా ఆయనకే దక్కింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్దీ ఇదే నియోజకవర్గం. ఇక జిల్లాలో అంతో.. ఇంతో బీఆర్ఎస్ ఉందీ అంటే అది ఖానాపూర్ నియోజకవర్గంలోనే. ఈనేపథ్యంలో మూడు పార్టీలకూ తొలివిడత పంచాయతీ పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. -
వీడీసీపై చర్యలు తీసుకోవాలి
లక్ష్మణచాంద: పాక్పట్ల వీడీసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఎ స్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబునాయక్ కు బుధవారం జిల్లా ఎస్సీ అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో దళిత సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. వీడీసీ సభ్యులు ఇదే గ్రామానికి చెందిన నాలు గు దళిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ చే శారని తెలిపారు. బహిష్కరణ ఎత్తివేసేలా చొర వ చూపాలని కోరారు. జిల్లా అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు రంజిత్, నాయకులు బోర ము త్యం, బోర చిన్నగంగన్న, బోర శ్రీనివాస్, బోన నడిపి గంగన్న, బోర పుష్ప తదితరులున్నారు. -
నవోదయ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్ రూరల్: ఈనెల 13న నిర్వహించనున్న నవో దయ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఆ ర్సీ భవనంలో నిర్వహించిన పరీక్ష అధికారుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పరీక్షలో ప్రతీ ప్రొఫా ర్మాను కచ్చితమైన సమాచారంతో పూర్తి చేయాలని తెలిపారు. గదికి 24మంది విద్యార్థుల చొప్పున కే టాయించాలని సూచించారు. ఉదయం 11.30నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అ నుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. మెడికల్, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటా రని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించే విధానాన్ని కా గజ్నగర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ కృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
ప్రలోభ పర్వం
నిర్మల్: తొలి విడత పంచాయతీ ఎన్నిల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. రాత్రి ప్రలోభపర్వం మొదలైంది. ఎన్నికలు పూర్తయ్యేదాకా.. ఏ ఒక్క ఓటునూ వదలకుండా పట్టుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే లెక్కలు వేసుకున్నారు. ఎవరికి ఏమివ్వాలి, ఏ కులసంఘాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలన్న ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికకు ఒక్కరోజు ఈ తాయిలాలు సమర్పించుకుని, ఓట్లు తీసుకోవడమే తరువాయి అన్నట్లుగా గ్రామాల్లో అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. ఇంటికే అన్నీ.. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు సాధారణ ఎలక్షన్లను తలపిస్తున్నాయి. డబ్బు, మద్యంతోపాటు రెండుమూడు రోజులపాటు మాంసం అందించే ఏర్పాట్లు చేశారు. ఎన్నికకు ఒకరోజు నోట్లు పంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొన్ని పంచాయతీల్లో తాగేవారికి, తినేవారికి మద్యం, మాంసం ఇంటికే పంపుతున్నారు. సంఘాల వారీగా.. ఫలానా సంఘం వాళ్లకు ఫంక్షన్లు చేసుకోవడానికి వంటసామగ్రి లేదట.. అని తెలియగానే ‘నేనిస్తాగా..’ అంటూ అభ్యర్థులు కొనిచ్చేస్తున్నారు. మరో సంఘానికి ఇంకో తాయిలం. ఇలా.. వ్యక్తిగతంగా ఇవ్వడంతో పాటు కులసంఘాల వారీగానూ అభ్యర్థులు తాయిలాలు ఇస్తూ ఓట్లను రాబట్టుకునే ఎత్తులు వేస్తున్నారు. కొన్నిగ్రామాల్లో ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు తాయిలాలు ఇవ్వడంతోపాటు ఆ కులపెద్దల నుంచి తనకే ఓట్లు వేయాలని మాట తీసుకున్నారు. ఆకట్టుకునేలా హామీలు.. ‘గ్రామంలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా.. రూ.ఐదువేలు ఇస్తా..’ అంటూ ఓ గ్రామంలో అభ్యర్థి ఫ్లెక్సీ పెట్టాడు. మరోచోట..‘ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గ్రామం కోసం కష్టపడతా..’అంటూ మరో అభ్యర్థి ప్రచారం చేశాడు. ఇలా ఆకట్టుకునే హామీలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. జోరుగా ప్రచారం చేసినా.. ఎంతమంచి పేరున్నా ఎంతోకొంత ఇస్తేగానీ తమకు ఓట్లు రావంటూ చాలామంది అభ్యర్థులు ఓట్లకోసం నోట్ల పంపకాన్నే నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్నిరోజుల ప్రచారం ఒకెత్తు.. ఈ రెండ్రోజులు మరోఎత్తు అంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రలోభపర్వంలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. -
నిర్మల్
ధైర్యంగా ఓటు వేయాలికుంటాల: పంచాయతీ ఎన్నికల్లో ధైర్యంగా ఓటు వేయాలని భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా సూచించారు. మండలంలోని ఓలా గ్రామంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక బలగాలతో నిర్వహించిన కవాతులో పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట సీఐ నైలు, ఎస్సై అశోక్, సిబ్బంది ఉన్నారు. నిర్మల్చైన్గేట్: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టం ముగిసింది. జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ నెల 11న దస్తురాబాద్, కడెం, పెంబి, లక్ష్మ ణచందా మామడ మండలాల్లోని 119 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలకు ఒక్క రోజే గడువు ఉండంతో గ్రామాల నుంచి వెళ్లి పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వలస ఓటర్లకు అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు. పోలింగ్ రోజు తప్పకుండా ఊరికి వచ్చి ఓటేయాలని కోరుతున్నారు. అందుకయ్యే ఖర్చులు భరిస్తామంటూ హామీ ఇస్తున్నారు. గ్రామంలో దిగగానే ముట్టజెబుతామంటున్నారు. ఒక్క ఓటు కూడా గెలుపు ఓటమిని నిర్ణయిస్తుంది. దీంతో అంత వరకు రాకుండా ఉండేందుకు అభ్యర్థులు కష్టపడుతున్నారు. అయితే ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లోని 136 పంచాయతీలు ఉండగా, 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 119 గ్రామ పంచాయతీల్లో 454 మంది, 1,415 వార్డుల్లో 1,370 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిబ్బందికి విధులు.. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. ఉన్నతాధికారులు సిబ్బందికి విధులు కేటాయించారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3,368 పోలింగ్ కేంద్రాల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో వార్డుకు ఒక బూత్ చొప్పున ఉండగా.. 3,368 బ్యాలెట్ బ్యాకులను వినియోగించనున్నారు. ఇప్పటికే ఆయా మండలాలకు చేరుకున్నాయి. రెండు దఫాలుగా ఆర్వోలు, ఏఆర్వోలు, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, ఇతర టెక్నికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వీరితోపాటు జోనల్, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, నిఘా బృందాల సభ్యులు సేవలందించనున్నారు. ఉద్యోగి పనిచేసే చోట, సొంత నివాస, మండలాన్ని పరిగణలోకి తీసుకుని వేరే మండలంలో విధులు కేటాయించారు. కొందరికి ఒకే విడతలో, అవసరాన్ని బట్టిమరికొందరికి రెండు విడతల్లోనూ విధులు అప్పగించారు. జిల్లాలోని 400 పంచాయతీల పరిధిలో 3,368 వార్డు స్థానాలు ఉండగా, 2,259 మంది పీవోలు, ఏపీవోలు విధులు నిర్వహించనున్నారు. ఇందులో 20 శాతం అదనపు సిబ్బంది రిజర్వులో ఉంటారు. ఇక బందోబస్తు కోసం 2,144 మందిని వినియోగించనున్నారు. 200 మంది ఓటర్లకు.. పోలింగ్ కేంద్రం పరిధిలో 200 మంది ఓటర్లు ఉంటే ఇద్దరు (1+1) చొప్పున సిబ్బంది ఉంటారు. ఇందులో ఒకరు పీవో, మరొకరు ఏపీవో మాత్రమే విధులు నిర్వర్తిస్తారు. 201 నుంచి 400 మంది వరకు ఓటర్లు ఉంటే ముగ్గురు (1+2) పీవో, ఏపీఓతోపాటు అదనపు పోలింగ్ అధికారి అందుబాటులో ఉంటారు. 401 నుంచి 650 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో నలుగురు (1+3) సిబ్బందిని నియమిస్తారు. వీరితోపాటు ప్రతీ పోలింగ్ కేంద్రంలో అవసరాన్ని బట్టి ఇతర సపోర్టింగ్ స్టాప్ను కూడా నియమిస్తారు. పంచాయతీ ఎన్నికల కోసం మొదటి విడత 1,072 పోలింగ్ కేంద్రాల పరిధిలో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీవో) పోలింగ్లో కీలకంగా వ్యవహరించనున్నారు. ఓటర్ల వివరాలు మండలం పురుషులు మహిళలు మొత్తం కడెం 14,048 15,111 29,159 లక్ష్మణచాంద 11,357 13,219 24,577 ఖానాపూర్ 11,423 12,234 23,657 మామడ 12,223 13,849 26,072 దస్తురాబాద్ 6,240 6,653 12,894 పెంబి 5,285 5,601 10,886నేడు కేంద్రాలకు సిబ్బంది.. 11న మొదటి విడత పోలింగ్ జరగనుంది. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. పోలింగ్ బాక్సులు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. దీంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. విద్యార్థులు దేశభక్తి పెంచుకోవాలి నిర్మల్టౌన్: విద్యార్థులు చిన్నతనంలోనే దేశభక్తి పెంచుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. జిల్లా కేంద్రంలోని వేదం గ్లోబల్ హైస్కూల్లో పౌర హక్కులు, బాధ్యతలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. విద్యార్థులు మన చుట్టూ.. ఉన్న ప్రజలను గౌరవిస్తూ.. ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా కుంగిపోకుండా, పరిష్కారం కోసం ప్రయత్నించే ధైర్యం ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం వార్డు స్థానాలు 1,072 ఏకగ్రీవం అయిన వార్డు స్థానాలు 474 పోటీలో ఉన్న అభ్యర్థులు 1,370మొత్తం సర్పంచ్ స్థానాలు 136 ఏకగ్రీవం అయిన స్థానాలు 16 ఎన్నికల బరిలో ఉన్నవారు 454 -
జిల్లాలో గోదావరి పరిక్రమన యాత్ర
బాసర/భైంసారూరల్/భైంసాటౌన్/నిర్మల్టౌన్/ఖానాపూర్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ గోదావరి నది జన్మస్థలం నుంచి 400 మంది సాధువులు ప్రారంభించిన గోదావరి పరిక్రమన (ప్రదక్షిణ) యాత్ర మంగళవారం జిల్లాకు చేరుకుంది. ముందుగా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి వచ్చిన సాధువులకు ఆలయ వైదిక బృందం, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాసర సరస్వతి అమ్మవారికి, భైంసారూరల్ మండలం మాటేగాం గ్రామంలో కొరడి గణపతికి రాజేంద్రదాస్ మహారాజ్, భాగేశ్వర్థామ్ సర్కార్ మహారాజ్, సద్గురు శివ్లింగ్ మహారాజ్, కేదారేశ్వర పలుగుట్ట రాములు మహారాజ్ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 400 మందిసాధువులు, మహాపీఠాధిపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అమ్మవారి హారతి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గోదావరి నది ఒడ్డున ఉన్న దేవాలయాలు, ప్రకృతి అందాలను దర్శిస్తూ సంపూర్ణమైన ఆధ్యాత్మిక యాత్ర చేపట్టినట్లు రాజేంద్రదాస్ తెలిపారు. అనంతరం భైంసా, నిర్మల్, ఖానాపూర్ పట్టణ మీదుగా 50 వాహనాల్లో సాధువులు యాత్రగా వెళ్లారు. నిర్మల్ ఈద్గాం చౌరస్తా వద్ద పలు పాఠశాలాల విద్యార్థులు, ఆధ్యాత్మిక సంఘాలు , భక్తులు, వ్యాపారులు, కుల, ఉద్యోగ సంఘ నాయకులు స్వాగతం పలికారు. సాధువుల ఆశీర్వచనం పొందారు. బైక్ ర్యాలీతో శోభయాత్రగా కొండాపూర్ వరకు వెళ్లారు. కార్యక్రమాన్ని అరుణ్ శర్మ ముందుకు తీసుకెళ్లారు. -
వణికిస్తున్న చలి
నిర్మల్చైన్గేట్: జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. చాలా ఏరియాల్లో ఉష్ణోగ్రతలు మూడు రోజులుగా గణనీయంగా పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన శీతల గాలులు వీస్తాయని తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. చలి ప్రభావం రోజంతా ఉంటుందని తెలిపారు. ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మంగళవారం జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రత 11 డిగ్రీలుగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో చలిమంటలు వేసుకుంటున్నారు. జంకుతున్న జనం.. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచు అధికంగా కురుస్తుంది. దీంతో తెల్లవారుజామున జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పది రోజులుగా చలి తీవ్రత పెరగడంతో దీర్ఘకాలిక రోగులకు ఇబ్బందికరంగా మారింది. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ, జ్వరం, ఆయాసం కేసులు పెరుగుతున్నాయి. ఆస్తమా, సీవోపీడీ, అలర్జీ, నిమోనియా తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు మరింత ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ మార్పులతో సమస్యలు.. శీతల వాతావరణంతో అలర్జీ ఎక్కువగా ఉన్నవారు బ్రాంకై టిస్ బారినపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ శక్తివంతమవుతుందని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, ఆయాసం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఐదు నుంచి ఆరు రోజుల్లో తగ్గే జబ్బు, అలర్జీ ప్రస్తుతం రెండు వారాలు ఉంటుందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎన్హెచ్ – 44పై పొగ మంచు.. -
రాష్ట్రస్థాయి పోటీల్లో కేజీబీవీ విద్యార్థి ప్రతిభ
దిలావర్పూర్: మండల కేంద్రంలోని కేజీబీవి కళాశాల చెందిన ఎం.అక్షయ రాష్ట్ర స్థాయిలో జరిగిన ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. కళాశాలలో ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్న అక్షయ కిక్ బాక్సింగ్ జిల్లాస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. సంగారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. అక్షయను కేజీబీవీ ఎస్వో అపర్ణ, పీఈటీ జయశ్రీ మంగళవారం అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. -
పంచాయతీ ఎన్నికలు
పకడ్బందీగా నిర్వహించాలి నిర్మల్చైన్గేట్: మొదటి విడత గ్రామపంచాయతీ ఎ న్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, అబ్జర్వర్లతో మంగళవారం వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఏర్పాట్ల వివరాలు అడిగి తెలు సుకున్నారు. సామగ్రి పంపిణీకి పటిష్ట చర్యలు తీ సుకోవాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చే యాలని పేర్కొన్నారు. కేంద్రాలకు 200 మీటర్ల పరి ధిలో ఎవరూ ఉండకుండా చూడాలని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి.. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ఆ రు మండలాల్లో మొదటి దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సరిపడా పోలింగ్ సామగ్రి అందుబాటులో ఉందని, పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానం మాట్లాడుతూ మొదటి విడత పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పటిష్ట బందోబస్తు.. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ, మొదటి దశ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్ పాల్గొన్నారు. -
మనం గెలవాలె తమ్మీ..!
నిర్మల్చైన్గేట్: పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కింది. మొదటి విడత ఎన్నికలకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఈనెల 14న రెండో విడత పోలింగ్, 17న మూడో విడత పోలింగ్ జరుగుతుంది. దీంతో గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడడం లేదు. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు. ఓడిపోవద్దని కొందరు ఏకంగా బాండ్ పేవర్లపై హామీలు రాసి ఇస్తున్నారు. కొందరు గ్రామానికి భూమి ఇస్తామని, మరికొందరు ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఇస్తామని, అంత్యక్రియలకు రూ.5 వేలు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. మరికొందరు ఆలయాల నిర్మాణాలు, గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామని బాండ్ రాస్తున్నారు. ఒకరిని మించి ఒకరు.. ఎంత ఖర్చు అయినా సర్పంచ్గా గెలిచి తీరాలనే పట్టుదలతో అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చుకు వెనుకాడడం లేదు. గ్రామాల్లో నిర్మించే ఆలయాలకు పోటీపడి చందాలు ఇస్తున్నారు. యూత్ కోసం శివాజీ విగ్రహాల ఏర్పాటు, క్రీడాసామగ్రి హామీలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు. -
ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్
లక్ష్మణచాంద: ప్రభుత్వం పాఠశాల విద్య బలోపేతానికి అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు(ఎఫ్ఆర్ఎస్)అమలు చేస్తోంది. తాజాగా సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా సోమవారం నుంచి ఎఫ్ఆర్ఎస్ అమలు ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతోపాటు, మండల విద్యాధికారి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. కార్యాలయ సమగ్ర సమాచార నిర్వహణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, పనితీరు వంటి సమాచార సేకరణ, జోన్స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆ డేటా ప్రతిరోజూ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందిస్తూ సమగ్ర సమాచారాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో 168 మంది.. జిల్లాలో 168 మంది సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సీఆర్పీలు 43 , ఏపీవో 1, సిస్టం అనాలసిస్ట్ 1, టెక్నికల్ పర్సన్ 1, డాటా ఎంట్రీ ఆపరేటర్ 19, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు 13, మెసెంజర్లు 13, ఐఈ ఆర్పీఎస్ లు 24, ఆయాలు 9, పీటీఐఎస్లు 44 మంది ఉన్నారు. పకడ్బందీగా అమలు పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మే రకు జిల్లాలోని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ సోమవారం నుంచి ఎఫ్ఆర్ఎస్ అమలు చే స్తున్నాం. ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా ముఖ గుర్తింపు ద్వారా హాజర నమోదు చేసుకోవాలని ఇదివర కే ఆదేశాలు జారీ చేశాం. – భోజన్న, డీఈవో, నిర్మల్ -
అర్ధ శతాబ్దపు ఆకాంక్ష..
ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ ఇంకెప్పుడు.. నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల దశాబ్దాల కల ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ అంశం మరోమారు ప్రస్తావనకు వచ్చింది. జిల్లావాసి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు సిర్గాపూర్ నిరంజన్రెడ్డి రాజ్యసభలో సోమవారం ప్రస్తావించారు. అర్ధ శతాబ్దాపు ఆకాంక్షను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్న తీరును ఎండగట్టారు. ‘హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ 300కి.మీ. దూరంలో ఉంది. కానీ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు రైళ్లో వెళ్లాలంటే 435కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ప్రజల సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయి. 50 ఏళ్ల నుంచి డిమాండ్గా ఉన్న నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ను నిర్మిస్తే.. దూరభారం తగ్గడంతోపాటు ఈ ప్రాంతంలోని 7 లక్షల మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్కు నిధులు విడుదల చేసి, నిర్మాణం చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నా.. ప్రజల సమస్యను పట్టించుకోరా..!? అని ప్రశ్నించారు. రైల్వేలైన్ నిర్మాణంపై రాజ్యసభలో జిల్లావాసి నిరంజన్రెడ్డి లేవనెత్తడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రైల్వేలైన్ నిర్మాణంపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురిస్తోంది. ఈనెల 6న జిల్లాపై ‘ఎందుకీ వివక్ష’ శీర్షికన తాజా కథనాన్ని ప్రచురించింది. తాజాగా ఎంపీ ప్రస్తావనతో ఇప్పటికై నా జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలన్న వాదన పెరుగుతోంది. సర్వేలు పూర్తయినా.. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు వెంటనే రైల్వే లైన్ను నిర్మించాలని, దీనికి అవసరమైన నిధులను కేంద్ర రైల్వే శాఖ మంజూరు చేయాలని రాజ్యసభలో నిరంజన్రెడ్డి కోరారు. 2010–11 సంవత్సరంలోనే ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు 136 కిలోమీటర్ల రైల్వేలైన్కు సంబంధించిన సర్వే పూర్తయింది. అయినా నిర్మాణం చేపట్టడం లేదు అని పేర్కొన్నారు. ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వేలైన్ లేని కారణంగా ఆదిలాబాద్ ప్రజలు రైలులో హైదరాబాద్ వెళ్లాలంటే నాగపూర్ మీదుగా 435 కి.మీ. మేరకు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలి.. 50 సంవత్సరాల నుంచి నిర్మల్ ప్రాంత ప్రజలు రైల్వేలైన్ కోసం డిమాండ్ చేస్తున్నారని నిరంజన్రెడ్డి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతంలో దాదాపు 7లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఇప్పటివరకూ రైల్వేలైన్ సౌకర్యం లేదన్నారు. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే దేశంలోని రెండు ప్రధాన మహానగరాలైన హైదరాబాద్–నాగపూర్ మధ్య దూరభారం తగ్గుతుందని తెలిపారు. వ్యాపార,వాణిజ్య సంబంధాలు పెరుగుతాయని, ప్రజారవాణా మెరుగుపడుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా రైల్వేలైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. -
సొంతూళ్లకు వస్తున్నారు..
ఖానాపూర్: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామాలకు తిరిగివస్తున్నారు. ఖానాపూర్ మండలం చింతల్పేట్, బీర్నంది, తదితర గ్రామాలకు చెందిన వలస కార్మికులు జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్, ముంబై ప్రాంతాల వలస వెళ్తారు. వీరంతా ఇప్పుడు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రైళ్లు, బస్సుల్లో సొంతూళ్లకు చేరుకుంటున్నారు. గోసంపల్లెకి చెందిన బేడ బుడగజంగం కులానికి చెందిన సుమారు 100 మందికిపైగా గ్రామానికి వచ్చారు. ఈనెల 11న గ్రామంలో పోలింగ్ జరగనుంది. ఓటేసేందుకే వచ్చామని వారు తెలిపారు. -
నిర్భయంగా ఓటు వేయాలి
ముధోల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా సూచించారు. సోమవారం ముధోల్లోని ఐలమ్మ చౌరస్తా నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఫ్లాగ్మార్చ్ ప్రజల్లో నమ్మకం పెంచుతుందని, శాంతి భద్రతలు కాపాడుతుందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ముధోల్, బాసర సీఐలు మల్లేశ్, సాయి, ముధోల్ ఎస్సై బిట్ల పెర్సీస్, రెండో ఎస్సై గంగాధర్, లోకేశ్వరం, తానూర్ ఎస్సైలు అశోక్, నవనీత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి నిర్మల్టౌన్: అర్జిదారుని నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. లక్ష్మణచాంద: ప్రభుత్వాలు మారుతున్నా.. రైతుల తలరాత మారడం లేదు. తమది రైతు ప్రభుత్వమని, రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తామని చెప్పుకునే పాలకులు.. ఆచరణలో మాత్రం చూపడం లేదు. పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. డబ్బులు జమ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ఽమొక్కజొన్న ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటి వరకు డబ్బులు అందలేదు. 30 వేల ఎకరాల్లో సాగు.. జిల్లాలో వానాకాలం 30 వేల ఎకరాల్లో రైతులు మొ క్కజొన్న సాగు చేశారు. ఇందులో కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు మొక్కజొన్న అమ్ముకోగా మిగిలిన రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. మార్క్ఫెడ్ 2,700 రైతుల నుంచి 6,790 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. క్వింటాల్కు కేంద్రం రూ.2,400 మద్దతు ధర నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.16 కోట్లు అందాలి. రెండు నెలలు గడిచినా.. మొక్కజొన్న ధాన్యం విక్రయించి రెండు నెలలు కావొస్తున్నా.. డబ్బులు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటల సాగు ప్రారంభించిన రైతులు.. డబ్బులు రాకపోవడంతో ప్రైవేటుగా అప్పులు చేస్తున్నారు. మరోవైపు యాసంగి పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసాపైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మక్కల డబ్బులు అయినా త్వరగా ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివాహిత దారుణ హత్య..! తనతో సన్నిహితంగా ఉంటూ మరొకరితో ఫోన్లో మాట్లాడుతుందని ఓ యువకుడు వివాహితను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన భైంసాలో జరిగింది. జిల్లా సమాచారం.. మొక్కజొన్న సాగు 30 వేల ఎకరాలు పంట ప్రభుత్వానికి అమ్మిన రైతులు 2,700మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన పంట 6,790 మెట్రిక్ టన్నులు రైతులకు రావాల్సిన డబ్బులు రూ.16 కోట్లువిరక్రయానికి మార్కెట్కు తెచ్చిన మక్కల రాశులు(ఫైల్) -
‘గుర్తు’ంచుకోండి ప్లీజ్..
నిర్మల్చైన్గేట్: పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 చిహ్నాలు కేటాయించారు. గ్రామీణ ఓటర్లకు సుపరిచితమైనవి అయినప్పటికీ, పోలికలు, అస్పష్టతలు ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పేరు మొదటి అక్షరాల ఆధారంగా చిహ్నాలు కేటాయించారు. సర్పంచి బ్యాలెట్ గులాబీ రంగులో, వార్డు సభ్యులది తెలుపు రంగులో ఉంటుంది. ఇష్టం లేని అభ్యర్థికి ’నోటా’ ఎంపిక లభిస్తుంది. సులభంగా గుర్తించే చిహ్నాలు సర్పంచి పోటీదారులకు ఉంగరం, కత్తెర, ఫుట్బాల్, టీవీ రిమోట్, డైమండ్, బ్యాటరీ లైట్ వంటివి ప్రచారానికి అనుకూలం.ఈ గుర్తులు ఓటర్లకు తక్షణ అర్థమవుతాయి. చెత్తడబ్బా–బకెట్, బ్లాక్బోర్డు–మంచం, బ్యాట్–స్టంప్స్, గ్యాస్ సిలిండర్–స్టౌ, ఐస్క్రీమ్–గాజుగ్లాస్ వంటి దగ్గరి రూపాలు ఓటర్లను గందరగోళం చేస్తాయి. బెండకాయ, టీ జల్లెడ్, చెప్పులు, గరాట వంటివి ప్రచారానికి కష్టం. ఈ నేపథ్యంలో ఇంటింటా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు నిరక్షరాస్యులకు గుర్తును దగ్గరుండి మరీ మోడల్ బ్యాలెట్ పేపర్లో చూపిస్తున్నారు. క్రమ సంఖ్య ఆధారంగా గుర్తుంచుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. అయినా.. పోలింగ్ నాటికి ఏం చేస్తారో అన్న టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. కేటాయించిన గుర్తులు ఇవీ.. సర్పంచి చిహ్నాలు వార్డు సభ్యుల చిహ్నాలు లేడీ పర్స్, పడవ, వేణువు గౌను, ఈల, కుండ కొబ్బరి తోట, చేతికర్ర డిష్ యాంటెన్నా, మూకుడు డోర్ హ్యాండిల్, బ్రష్ పోస్టు డబ్బా, హాకీ కర్ర బిస్కెట్, గాలిబుడగ బంతి, నెట్, కేటిల్ -
ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి
భైంసాటౌన్: భైంసా ఏరియా ఆస్పత్రిలో రోగులకు అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ తెలిపారు. రూ.25 లక్షలతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వాషింగ్ మెషీన్ను సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిని మరింత ఆధునికీకరించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. భైంసాలో ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, ఇందుకు ఐదెకరాల స్థలం సేకరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ సురేశ్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, వైద్యులు అనిల్, విజయానంద్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి బేస్, సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి అండర్–14, 17 బేస్బాల్, సాఫ్ట్బాల్ సబ్ జూనియర్స్ బాల, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పోటీలను ప్రారంభించారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి, సెక్రెటరీ అన్నపూర్ణ, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు అంబాజీ, భూమన్న, సత్తయ్య, సీనియర్ పీడీ శ్రీనివాస్, పీఈటీలు సాయిరాజ్, ముఖేష్, హనుమాండ్లు, సంజీవ్, గిరి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల ఉపాధి
నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడు దశల్లో జరుగనున్నాయి. పంచాయతీ ఎన్నికలో ఆశావహుల్లో ఉత్సాహం తీసుకురాగా, వివిధ రంగాల వారికి ఉపాధి కూడా తెచ్చాయి. ప్రింటింగ్ ప్రెస్లకు గిరాకీ పెరిగింది. మేనిఫెస్టోలు, పాంప్లెంట్లు, డోర్ స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతోపాటు కండువాలు, టోపీలకు బరిలో ఉన్నవారు బల్క్ ఆర్డర్ ఇస్తున్నారు. ఇప్పటికే గుర్తులు ఫైనల్ అయిన వారు సింబల్స్తో పాంప్లెంట్లు, వాల్, డోర్ స్టిక్కర్లను ముద్రించుకుంటున్నారు. గిరాకీ పెరగడంతో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు తమ షాపులను 24 గంటలు నడిపిస్తున్నారు. అసెంబ్లీస్థాయి మేనిఫెస్టోలు సర్పంచ్ పోటీదారులు గ్రామాభివృద్ధి హామీలు, ప్రణాళికలతో కూడిన అధికారిక పత్రాలు రూపొందిస్తున్నారు. వందల సంఖ్యలో మేనిఫెస్టో కరపత్రాలు ముద్రించి ఇంటి డోర్లు అంటిసుతన్నారు. గ్రామస్తులకు, ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. అంతటా ఒకే రేటు.. కరోనా తర్వాత ప్రింటింగ్ ప్రెస్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఫ్లెక్సీలు రావడంతో కరపత్రాల ప్రింటింగ్ తగ్గిపోయింది. ఎలక్షన్ల సమయంలో మాత్రమే గిరాకీ ఉంటుంది. దీంతో ఆఫ్సెట్ ప్రెస్ అసోసియేషన్ నిర్ణయం మేరకు అన్ని ప్రింటింగ్ ప్రెస్లు కరపత్రాలకు, పోస్టర్లకు ఒకే రేటు వసూలు చేస్తున్నారు. 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. -
పల్లె పోరుకు పకడ్బందీ ఏర్పాట్లు
నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించే అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో సమావేశంలో పాల్గొన్న తహసీల్దార్లు, ఎంపీడీవోలకు మరొకసారి ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై సూచనలు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది, సామగ్రి తరలింపునకు సరిపడా వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాల ని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారె డ్డి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న పాల్గొన్నారు. -
ఎన్నికల ఖర్చు లెక్క చెప్పాలి
కుంటాల: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అడ్డగోలుగా ఖర్చులు చేయవద్దని జిల్లా ఎన్నికల ఖర్చుల అధికారి కేబీ.మనోహర్రాజు సూచించారు. కుంటాల రైతు వేదికలో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల ఖర్చుపై ఆదివారం అవగాహన కల్పించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ఖర్చు పెడితే అభ్యర్థిపై వేటుపడే అవకాశం ఉందని తెలిపారు. ప్రతీరోజు ఖర్చు పెట్టిన వివరాలు తమకు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎన్నికల అదనపు అధికారి అల్లాడి వనజ, ఎంపీవో ఎంఏ.రహీంఖాన్, సహాయ పరిశీలకులు లలిత, కృష్ణయ్య, వినోద్కుమార్ పాల్గొన్నారు. -
మీ పల్లెను మాట్లాడుతున్న..
నిర్మల్: నేను మీ పల్లెను మాట్లాడుతున్న.. సంగ్రామంలో తలపడుతున్న సర్పంచ్ అభ్యర్థులకు నాదో విన్నపం.. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి చూస్తున్న మీ తీరుని. పుట్టినప్పటి నుంచి చూస్తున్న ఈ పంచాయతీ పోరుని. అప్పట్లో అంతోఇంతో ఊరికోసం పనిచేయాలన్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. కొన్నేళ్లుగా అలాంటి వాళ్ల సంఖ్య తగ్గుతుంటే బాధేస్తోంది. పార్టీల పేరుతో ఒక్క ఊరిలోనే వర్గాలుగా చీలిపోతున్నారు. ఊరి బాగుకంటే.. పదవిపై మోజుతోనే చాలామంది ముందుకు వస్తున్నారు. కుర్చీ కోసం ఏమైనా చేస్తున్నారు. ఇంతమంది పోటీపడేది కేవలం పదవి కోసమేనా..!? సర్పంచ్గా గెలువడానికి ఏదైనా చేయాలా..!? అభ్యర్థుల చేతుల్లో ఓటరు లిస్టు ఉంటే చాలా..!? వారిని సంతృప్తి పరిస్తే సరిపోతుందా..!? గ్రామ సమస్యల జాబితా అవసరం లేదా..!? అసలు ఈ ఊరికేం కావాలో ఆలోచించరా..!? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. ఒక్క ఆశ ఏంటంటే. ఒకప్పటి తరం కాదిది. ఇప్పుడున్నది ‘స్మార్ట్’గా ఆలోచించే జెన్జీ రోజులు. ఇప్పుడొచ్చే.. యువతరమైనా ఊరు ఏం కోరుతుందో తెలుసుకోవాలి, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే నా తాపత్రయం. పదవిపైనే మోజు.. ‘సర్పంచ్సాబ్..’ అని అనిపించుకోవాలన్న మోజులోనే మస్తుమంది ఎన్నికల్లో పోటీకి దిగుతుండ్రు. పల్లె రాజకీయాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సొసైటీల డైరెక్టర్లు, చైర్మన్ల కన్నా సర్పంచ్ పదవికి అధికారాలు, నిధులు ఎక్కువగా ఉండటమూ ఇందుకు ఓ కారణమే. ఊరుఊరంతా సర్పంచ్కు గౌరవ మర్యాదలిస్తుంది. ప్రతీదానికీ తననే ముందు నిలుపుతుంది. అది.. ఆ పదవిలో ఉన్న మనిషికి కాదు, ఆ కుర్చీకి ఉన్న గౌరవమే. ఆ పదవిని పద్ధతిగా సద్వినియోగం చేసుకుని, ఊరిని బాగుపర్చిన సర్పంచ్ల పేర్లు తరాలు గడిచిపోయినా ఊళ్లో నానుతూనే ఉన్నాయి. వాళ్లు చేయించిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ.. పదవిని అడ్డుపెట్టుకుని సంపాదించాలన్న దురాలోచన, అవసరంలేని రాజకీయాలతో చాలామంది సర్పంచ్లు ఉన్న పేరునూ ఖరాబ్ చేసుకున్నారు. అందుకే అభ్యర్థులూ.. పదవిపై మోజుతో పోటీచేస్తున్నారా..! అయితే.. గెలిస్తే మీ పేరు ఈ ఐదేళ్లకే పరిమితం. ఓటర్లిస్ట్ కాదు.. ‘ఊళ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఎంతమంది మనోళ్లు ఉన్నారు. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి. ఏయే సంఘానికి ఏమేం కొనివ్వాలి..!’ ఇవి కాదు మీ చేతుల్లో ఉండాల్సింది. అసలు.. ఊరికి ఏం కావాలో గుర్తించండి. ఓటరు లిస్టు కంటే ముందు, గ్రామ సమస్యల జాబితాను చూడండి. మీరు చేయగలిగే పనులనే చేస్తామని చెప్పండి. తీర్చలేని హామీలను ఇచ్చి అభాసుపాలు కావొద్దు. ఏళ్లుగా ఊరిని పట్టి పీడిస్తున్న కష్టాలు గుర్తించి, వాటి పరిష్కారానికి ఏం చేస్తారో, ఎలా చేస్తారో గ్రామస్తులకు వివరించాలి. ఓటరూ ఆలోచించు.. ఓట్ల కోసం ఊరిని వ్యసనాలకు బానిస చేయొద్దు. ఎన్నికలప్పుడే కదా.. ఈ వారం రోజులే కదా.. అని గ్రామస్తులను ప్రధానంగా యువతను మద్యానికి బానిస చేయొద్దు. చాలామంది అఽభ్యర్థులు ఓటు కావాలంటే నోటు, క్వార్టరు ఇస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉన్నారు. ఇలా వీటితో గెలిచి సర్పంచ్ అయితే.. నీ నుంచి ఊరు ఏం ఆశిస్తుందోనన్న ఆలోచనా చేయాలి. ఈ సర్పంచ్ పదవి అనేది ప్రజలు గౌరవం ఇస్తేనే బాగుంటుంది. లేదంటే.. పేరుకే పరిమితమవుతుంది. ఊరు బాగుంటే.. అందరూ బాగుంటారు. -
అనుబంధం.. చాలా దూరం!
కడెం: జిల్లా కేంద్రాలకు మండలాలు.. మండల కేంద్రాలకు గ్రామాలు దూరంగా ఉండడం సాధారణ మే. గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామాలు మహా అయితే మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటాయి. జిల్లాలో కొన్ని అనుబంధ గ్రామాలకు జీపీలు 3 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. 32 కిలోమీటర్ల దూరం.. కడెం మండలం ఉండుంపూర్ పంచాయతీకి రాంపూర్, మైసంపేట్ అనుబంధ గ్రామాలుగా ఉన్నా యి. ఈ గ్రామాలో కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఉండడంతో ఏడాది క్రితం ధర్మాజీపేట్ సమీపంలోకి తరలించారు. దీంతో గ్రామ పంచాయతీకి 32 కి.మీ దూరం వెళ్లాయి. ఈ గ్రామంలో సుమారు 94 ఇళ్లు, 350 ఓటర్లు, 400 జనాభా ఉంది. కడెం కట్ట దాటాలి కడెం మండలం డ్యాంగూడ గ్రామం కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. డ్యాంగూడ గ్రామస్తులు గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే కడెం ప్రాజెక్టు దాటాలి. లేదంటే పాండ్వపూర్ మీదుగా ఐదు కిలోమీటర్లు వెళ్లాలి. ఇక్కడ సుమారు 13 కుటుంబాలు, 50 మంది జనాభా ఉంటుంది. జీపీకి దూరంగానే అటవీ గ్రామాలు కడెం మండలంలోని గండిగోపాల్పూర్, మిద్దెచింత గ్రామాలు ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోకి వస్తాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీకి రావాలంటే సుమారు 5 కిలోమీటర్లు వెళ్లాలి. ఖానాపూర్ మండలం కోలాంగూడ జీపీ పరిధిలోని కుసుంపూర్ గ్రామస్తులు పంచాయతీకి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు వెళ్లాలి. దస్తురాబాద్ మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం గొండుగూడ వాసులు గ్రామ పంచాయతీ వెళ్లాలంటే 18 కిలోమీటర్లు ప్రయాణించాలి. -
పారదర్శకంగా బిల్లులు చెల్లించాలి
ఖానాపూర్: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు పారదర్శకంగా చెల్లించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్ అన్నారు. మండలంలో పాతఎల్లాపూర్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు వడ్లూరి సుదర్శన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గజేందర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీవో 190 ప్రకారం ఇంటర్ లోకల్ డిప్యూటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.భూమన్నయాదవ్, జె.లక్ష్మణ్, గోవింద్నాయక్, రవికాంత్, వాహిద్ఖాన్, జాదవ్ వెంకట్రావు, ఇర్ఫాన్షేక్, రాజేశ్నాయక్, వెంకటేశ్వరరావు, రమాదేవి, శ్రీనివాస్, బాలాజి, గంగాధర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
అడెల్లిలో తగ్గిన భక్తుల రద్దీ
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజమాబాద్, కరీంనగర్, హైదరబాద్, వరంగల్ తదితర ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గతవారంతో పోలిస్తే భక్తుల రద్దీ తగ్గిందని ఈవో భూమయ్య తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. అమ్మవారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ జయరామ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
1.. 2.. 3.. ప్రచారం స్పీడ్!
నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారంతో మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొదటి విడత ఆరు మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 11న పోలింగ్ ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం(డిసెంబర్ 5న) ముగిసింది. గుర్తులు కూడా కేటాయించారు. దీంతో అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. మూడో విడత ఉపసంహరణ గడువు ఈనెల 9న ముగియనుంది. మొదటి విడత బరిలో 454 మంది.. మొదటి, రెండో విడత ఎన్నికలు జరిగే చోట్ల అభ్యర్థుల సంఖ్య తేలింది. మొదటి విడతగా దస్తురా బాద్, కడెం, పెంబి, లక్ష్మణచాంద, మామడ మండలాల్లోని 136 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానా లకు 813, 1072 వార్డుస్థానాలకు 2,087 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 3న ఉపసంహరణ గడువు ముగియగా ఏకగ్రీవాలు మినహా 119 సర్పంచ్ స్థానాల్లో 454 మంది బరిలో మిగిలారు. 107 వార్డులకు ఏడు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 191 ఏకగ్రీవమయ్యాయి. 1,415 వార్డులకు 1,370 మంది పోటీలో ఉన్నారు. రెండో విడతలో షురూ.. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్మల్ రూరల్, సోన్, సారంగాపూర్, దిలావర్పూర్, నర్సాపూర్ జి, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో ఈనెల 14న జరగనుంది. ఆయా మండలాల్లోని 131 సర్పంచ్ స్థానాలకు 730 మంది, 1179 వార్డులకు 2,280 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 6న ఉపసంహరణ గడువు ముగియగా ఏకగ్రీవాలు మినహా 121 సర్పంచ్ స్థానాల్లో 414 మంది బరిలో మిగిలారు. ఇక 1,170 వార్డులకు ఐదు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా 115 ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోగా 735 వార్డుల్లో 1,706 మంది పోటీలో ఉన్నారు. బరిలో ఉన్నవారికి గుర్తులు కేటాయించారు. దీంతో అదేరోజు రాత్రి నుంచి అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాల్లో పార్టీ నేతల సూచనలతో వ్యూహాలకు పదును పెడుతూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. 9న మూడో విడత ఉప సంహరణ.. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. 133 సర్పంచ్ స్థానాలకు 714, 1126 వార్డుసభ్యుల స్థానాలకు 2,269 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం పరిశీలన పూర్తయింది. ఆదివారం అభ్యంతరాలు స్వీకరించారు. సోమవారం అభ్యంతరాలు పరిశీలిస్తారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప సంహరణకు అవకాశం ఉంది. తర్వాత బరిలో ఉన్నవారికి గుర్తులు కేటాయిస్తారు. దీంతో మూడో విడత నామినేషన్లు వేసినవారు పోటీలో ఉన్నవారిని తప్పించేందుకు బేరసారాలు సాగిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లు.. పల్లెల నుంచి పట్టణాలకు వలసవెళ్లిన వారు, ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సర్పంచ్ అభ్యర్థులు ఫోన్లు చేసి పోలింగ్కు రావాలని కోరుతున్నారు. ఇందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటు వేసేందుకు వస్తే ఓటుకు రూ.500 నుంచి రూ.1000 ఇవ్వడమే కాకుండా రవాణా ఖర్చులు భరిస్తామని చెబుతున్నారు. జిల్లా నుంచి సుమారు 5 వేలకుపైగా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. 10 మంది ఓటర్లు ఒకే ప్రాంతంలో ఉంటే ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. -
సర్పంచే సుప్రీం!
నిర్మల్కొత్త ప్రోగ్రెస్ కార్డులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే సాధారణ ప్రోగ్రెస్ కార్డుల విధానానికి ఇక స్వస్తి పలకనుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ప్రవేశపెట్టనుంది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి లక్ష్మణచాంద: పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ ఎన్నికల పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అన్నారు. మండలంలో ఎన్నికల ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద ఓటర్లకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో రాధ, ఎంపీవో నసీరుద్దీన్ ఉన్నారు. నిర్మల్చైన్గేట్: గ్రామానికి సంబంధించిన సర్వాధికారాలు పంచాయతీవే. గ్రామపంచాయతీలో స ర్పంచే సుప్రీం. గ్రామసభల తీర్మానాలే శాసనాలు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామపంచాయతీలకు విశాలమైన అధికారాలు కల్పించాయి. ప్రభుత్వాలు. దీంతో స్వయం పాలన మరింత దగ్గరైంది. అభివృద్ధి వేదికగా గ్రామపంచాయతీ రోడ్లు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధిదీపాలు వంటి సేవల సమన్వయం గ్రామపంచాయతీ సమావేశాల్లో జరుగుతుంది. సర్పంచ్ అధ్యక్షతన తీసుకునే నిర్ణయాలు గ్రామ చట్టాలుగా అమలవుతాయి. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చులు, ఆదాయ వ్యయాలు గ్రామసభలో తెలియజేస్తారు. అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు.. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా వచ్చిన సర్పంచ్పై సభ్యులకు అవిశ్వాసం ప్రకటించే హక్కు ఉండదు. ఇది వారి పదవికి నిర్దిష్ట రక్షణ ఇస్తుంది. అయితే తప్పుడు నిర్వహణ, ఆడిట్ లోపాలు, నిధుల అనవసర వినియోగం, అధికార దుర్వినియోగం పరిస్థితుల్లో కలెక్టర్లకు తొలగించే అధికారం ఉంటుంది. సర్పంచ్ రాజీనామా చేస్తే, జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించాలి. సర్పంచ్ స్థానం ఖాళీ అయితే.. సర్పంచ్ పదవి ఖాళీ అయితే 120 రోజుల్లో తిరిగి ఎన్నిక నిర్వహించి కొత్త సర్పంచ్ను ఎన్నుకోవాలి. అప్పటి వరకు ఉపసర్పంచ్ తాత్కాలిక బాధ్యతలను నిర్వహిస్తాడు.సర్పంచ్ బాధ్యతలు -
హోంగార్డుల సంక్షేమానికి కృషి
నిర్మల్టౌన్: హోంగార్డుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి పోలీస్ శాఖ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎస్పీ జానకీషర్మిల అన్నా రు. జిల్లా కేంద్రంలోని సాయుధ దళ పోలీస్ కార్యాలయంలో 63వ హోంగార్డుల రైజింగ్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. మొదట పరేడ్తో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా హోంగా ర్డులు ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, లాఅండ్ఆర్డర్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, విపత్తు స్పందన, అత్యవసర సేవల్లో నిబద్ధతతో పనిచేసే ప్రతీ హోంగార్డ్లను అభినందించారు. ప్ర జా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అనేక కీలక రంగాల్లో హోంగార్డులు పోలీస్ శాఖకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా హోంగార్డులు తమ సమస్యలపై ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. హోం గార్డుల పిల్లలకు ఆర్థికసాయం.. హోంగార్డు కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన 20 మంది విద్యార్థులకు, అలాగే సేవలో ఉండగానే మరణించిన హోంగార్డుల పిల్లలకు దాతల సహకారంతో ఒక్కొక్కరికి రూ.10 వేల సాయం చేశారు. హోం గార్డులకు రెయిన్ కోట్లు, జర్కిన్లు పంపిణీ చేశారు. హోంగార్డుల కోసం రూ.3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం ప్రవేశపెట్టారు. గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు హోంగార్డ్ కుటుంబాలకు రూ.38 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ కై ్లమ్ అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరట్టు వేడుక
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో శనివారం ఆరట్టు వేడుక ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ–మురళీధర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి జలాలతో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలకు అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని పలు వీధులగుండా యాత్ర సాగింది. అయ్యప్ప దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. భక్తి పాటలకు అయ్యప్ప దీక్షాపరులు నృత్యాలు చేశారు. -
కాంగ్రెస్ గూటికి ఏకగ్రీవ సర్పంచులు
● ఆహ్వానించిన శ్రీహరిరావు నిర్మల్చైన్గేట్: సారంగాపూర్ మండలం స్వర్ణ(పొన్కుర్) గ్రామ సర్పంచ్గా కొత్తింటి మల్లేశ్, మామడ మండలం కప్పన్పల్లి సర్పంచ్గా చుంచు బాపు లింగన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీహరిరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు. ఇందులో నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్రెడ్డి, అబ్దుల్ హదిల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ రాజ్మొహమ్మద్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కొంకూరు స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. -
గెలిపిస్తే భూమి ఇస్తా..
ఖానాపూర్: తనను సర్పంచ్గా గెలిపిస్తే తన అత్త, మామల స్మారకర్థం గ్రామ అభివృద్ధికి రెండు గుంటల భూమిని ఇస్తానని ఖానాపూర్ మండలంలోని నూతన పంచాయతీ రంగపేట సర్పంచ్ అభ్యర్థి పురంశెట్టి హరితభూమేశ్ తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా గ్రామం పంచాయతీగా ఏర్పడిందని పేర్కొన్నారు. గ్రామంలో ప్రభుత్వ భవనాల కోసం సొంత స్థలాన్ని కేటాయిస్తానని వెల్లడించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తమ కుటుంబం పాల్గొందని, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో తమకు పోటీ చేసే అవకాశం వచ్చిందని వివరించారు. గ్రామస్తులు ఆదరించాలని కోరారు. -
పంచాయతీ ఎన్నికల్లో పొరపాట్లు జరగొద్దు
నిర్మల్చైన్గేట్: గ్రామపంచాయతీ ఎన్నికలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. నామినేషన్ల అప్పీల్, మూడు దశల్లో కలిపి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైనన్ని బ్యాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సమాచారం అందివ్వడంలో తోడ్పాటు అందించాలన్నారు. ఎన్నికల కేంద్రాలకు చేరుకోవడానికి అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులు గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బంది సమర్ధవంతంగా పనిచేయాలి మామడ: గ్రామపంచాయితీ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, తహసీల్దర్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో సుశీల్రెడ్డి పాల్గొన్నారు. -
పొరపాట్లు దొర్లకుండా చూడాలి
భైంసారూరల్/తానూరు/ముధోల్: నామినేషన్లు పకడ్బందీగా పరిశీలించాలని, పొరపాట్లు దొర్లకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు అయేషా మస్రత్ ఖానం అన్నారు. భైంసా రూరల్ మండలం దేగాం పంచాయతీ ఎన్నికల క్లస్టర్ కేంద్రాన్ని, తానూరు మండలం బెల్తరోడా నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని, ముధోల్ మండలం తరోడ నామినేషన్ కేంద్రాన్ని ఆమె శనివారం తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులతో మాట్లాడి నామినేషన్ల వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్లను నిశితంగా పరిశీలించాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. అనంతరం తరోడా నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకం వివరాలు ఎంపీడీవో లవకుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంపీడీవోలు నీరజ్కుమార్, శ్రీధర్, ఎంపీవో శివకుమార్, సూపరింటెండెంట్ అశోక్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు -
నిర్మల్
అంబేడ్కర్ అందరివాడు నిర్మల్చైన్గేట్: అంబేడ్కర్ అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేశారని, ఈమేరకు రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు అనుబంధ పల్లెలు, తండా వాసులుగా ఉన్న అక్కడి ప్రజలు ఇప్పుడు తమ పల్లెల్లో తమ రాజ్యం వచ్చిందని సంతోషపడుతున్నారు. నాలుగు నూతన పంచాయతీలు.. జిల్లా వ్యాప్తంగా కొత్తగా న్యూధర్మాజీపేట, రంగపేట, కళ్యాణి, రంజని తాండల్లో తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ జీపీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే మగ్గాయి. తమ గ్రామంలోని వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకునే అవకాశం వారికి ఈసారి దక్కుతుంది. స్వయంపాలన దిశగా ఈ గ్రామాలు అడుగులు వేయనున్నాయి. ఎవరైనా మొదటి సర్పంచే.. నూతన గ్రామపంచాయతీలైన న్యూధర్మాజీపేట, రంగపేట, కళ్యాణి, రంజని తండాలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఆయా గ్రామాల వ్యక్తులే సర్పంచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటిసారి ఎన్నికలు కావడంతో యువత పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఎవరు గెలిచినా మొదటి సర్పంచ్గా చరిత్రలో నిలిచిపోతారు. ఒకే నామినేషన్.. తానూరు మండలం జవ్లా(కే) గ్రామపంచాయతీ నుంచి కళ్యాణి గ్రామపంచాయతీ హోదా పొందింది. ఇక్కడ ప్రస్తుతం 900 జనాభా ఉంది. 633 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం సర్పంచ్, 8 వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే వేశారు. శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం కానుంది. రంగపేట గ్రామపంచాయతీ భవనంఖానాపూర్ మండలం రంగపేట ఇన్నాళ్లు బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. ఇప్పుడు కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామంలో దాదాపు 950 వరకు జనాభా ఉండగా, 573 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి వీరే తమ గ్రామానికి సంబంధించిన వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకోనున్నారు. మండలం గ్రామపంచాయతీ జనాభా ఓటర్లు సర్పంచ్కు దాఖలైన నామినేషన్లు ఖానాపూర్ రంగపేట 900 573 5 కడెం న్యూధర్మాజీపేట 737 575 2 తానూర్ కళ్యాణి 653 445 1 కుభీర్ రంజనితండా 900 633 4 -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
● ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ గోవర్ధన్ బాసర: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆయన సాధనకు ప్రతీ పౌరుడు కృషి చేయాలని ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ అన్నారు. వర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఇన్చార్జి వీసీతోపాటు హెచ్వోడీలు, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోవర్ధన్ మాట్లాడుతూ అంబేడ్కర్ బహుజను పక్షపాతి అన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కృషి చేశారని తెలిపారు. ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ వర్ణ వివక్షతో బలహీనపడిన భారతీయ సమాజంలో అంబేడ్కర్ తీసుకొచ్చిన మార్పులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రేవల్లి అజయ్కుమార్, కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ బి.ఉపేందర్, అసోసియేట్ డీన్లు ఎస్.విఠల్, కె.మహేశ్, ఎస్.శేఖర్, డీఈఎస్ రాజేశ్వర్, అన్ని విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో సత్వర న్యాయం
నిర్మల్టౌన్: తెలిసో తెలియకో తప్పులు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారికి లోక్ అదాలత్ ద్వారా సత్వరం న్యాయం అందుతుందని, రాజీ మార్గంలో పరిష్కారం అవుతుందని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. ఈనెల 21న నిర్మల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్పై ప్రధాన కోర్టులో శనివారం సమీక్ష నిర్వహించారు. కోర్టు డ్యూటీ అధికారులకు పలు సూచనలు చేశారు. లోక్ అదాలత్ కోసం కేసుల జాబితాలు సిద్ధం చేయాలన్నారు. సంబంధిత పక్షాలతో ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించి, పోలీసు, న్యాయ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి లోక్అదాలత్పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ రాధిక, ఎస్పీ జానకీషర్మిల, పోలీసు అధికారులు, జ్యుడీషియల్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. -
సం‘గ్రామం’లో యువతరం
లక్ష్మణచాంద: గ్రామాలే దేశ అభివృద్ధి పట్టుకొమ్మలు..అన్నారు మహాత్మ గాంధీ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు స్వామి వివేకానంద. ఒకప్పుడు రాజకీయాలు అంటే అమ్మో అనే యువత క్రమంగా ఇప్పుడు రాజకీయలవైపు చూస్తోంది. మారుతున్న పరిస్థితులు, నిరుద్యోగం, గ్రామాల్లో సమస్యలు తదితర కారణాలతో రాజకీయాల్లోకి వస్తోంది. తమ తర్వాతి తరాలకు మెరుగైన గ్రామాన్ని ఇచ్చేందుకు సంకల్పంతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో యువత బరిలో దిగింది. 18 మండలాల్లో 400 పంచాయతీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో ఎన్నికల బరిలో 550 మందికిపైగా యువత పోటీలో ఉంది. వీరిలో సగానికిపైగా తొలిసారి పోటీ చేస్తున్నవారే. మీ ఇంటి ఆడ బిడ్డగా అవకాశం ఇవ్వండి.. మీ ఇంటి ఆడ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. నన్ను ఆదరించంచాలని కోరుతున్నారు సోన్ మండల కేంద్రం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన యువతి సుప్రియ(25). యువతీ, యువకు ల కో సం ఒక వేదిక ఏర్పాటు చేయడం, మెరుగైన విద్య, వైద్యం అందేలా చూడడమే తన తొలి ప్రాధాన్యమని పేర్కొంటున్నారు. పాఠశాల అభివృద్ధి, గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు. 30 ఏళ్లుగా గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని, తనను మీ ఆడ బిడ్డగా ఆదరిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొంటున్నారు. అందివచ్చిన అవకాశం లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి(కె) సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వు అయింది. గ్రామానికి చెందిన చింతకింది ముఖేష్(23) సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు. గ్రామ ఓటర్లు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాల అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపట్టి గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అంటున్నాడు. -
తుది అంకం ముగిసింది
నిర్మల్చైన్గేట్: గ్రామపంచాయతీ ఎన్నికల తుది విడత నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. చివరి రోజు సర్పంచ్, వార్డు స్థానాల కోసం అభ్యర్థులు భారీగా తరలిరావడంతో అర్ధరాత్రి వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. సాయంత్రం 5 గంటల్లోపు కేంద్రంలోకి వచ్చిన వారికి క్యూలైన్ టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి..నామినేషన్ల పర్వం చివరి రోజు కావడం.. అప్పటికే బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 316 మంది నామపత్రాలు అందజేయగా, వార్డు స్థానాలకు 860 మాత్రమే దాఖలు చేశారు. చివరి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు కేంద్రాలకు తరలివచ్చారు. అధికారులు సైతం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నా.. తలకు మించిన భారమైంది. నేడు పరిశీలన..గ్రామపంచాయతీ ఎన్నికల తుది విడత నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. శనివారం పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 9న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 17న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. -
మొన్నటి ఉప సర్పంచులు.. నేడు సర్పంచ్ బరిలో
కడెం: మండలంలోని పలు గ్రామల్లో గత ఉప సర్పంచులే నేడు సర్పంచ్ బరిలో నిలిచారు. కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన ముడికె మల్లేశ్యాదవ్, కొండుకూర్ గ్రామానికి చెందిన మామిడిపెల్లి భీమేశ్, లింగాపూర్కు చెందిన కుమ్మరి రంజిత్, దస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన వర్ధెల్లి గోపాల్.. గత పాలకవర్గంలో ఉప సర్పంచులుగా ఉన్నారు. ప్రస్తుతం సర్పంచులుగా ఆయా గ్రామాల్లో నామినేషన్లు వేశారు. బరిలో నిలిచి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి వీరిలో సర్పంచ్గిరీ ఎవరిని వరిస్తుందో చూడాలి. -
శాంతిభద్రతల విషయంలో రాజీ వద్దు
భైంసాటౌన్: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దని ఏఎస్పీ రాజేశ్మీనా సూచించారు. భైంసా నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం పట్టణంలోని పలు కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించి, అక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు. విధి నిర్వహణపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు చేశారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా సేవలందించాలన్నారు. అనంతరం పట్టణంలోని కోతిదేవుని ఆలయం, పంజేషా మసీదు, జుల్ఫికార్ మసీదును సందర్శించి, అక్కడి భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన చోట మరింత బలగాల మోహరింపు, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలపై సూచనలు చేశారు. అలాగే ఎస్డీపీవో కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట సీఐ నైలు, ఎస్సైలు జుబేర్, సుప్రియ ఉన్నారు. -
తొలి దశ అధికారుల ర్యాండమైజేషన్
నిర్మల్చైన్గేట్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల తొలి దశ ర్యాండమైజేషన్ శుక్రవారం పూర్తిచేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో చేపట్టారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల విధులకు సరిపడా పీవో, ఓపీవోలను నియమించినట్లు తెలిపారు. అవసరానికన్నా 20 శాతం అదనంగా అధికారులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, అధికారులు పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగొద్దుభైంసారూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వీకరిస్తున్న నామినేషన్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మండలంలోని మాటేగాం నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్ పత్రాలలో వివరాలు సరిచూసుకోవాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట సబ్కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్, ఎంపీడీవో నీరజ్కుమార్, ఎంపీవో ప్రదీప్ తదితరులు ఉన్నారు. -
జిల్లాస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అండర్–14 బాలుర జిల్లాస్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఇందులో హషిర్ ఓవైస్, సిద్ధార్థ సంజయ్, స్వేదన్, ధ్రువన్, అభిజిత్, షేక్ గులాం, అర్హన్ ప్రతిభ కనబర్చి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వీరు త్వరలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించే ఉమ్మడి ఆది లాబాద్ జట్టు ఎంపిక పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్ గౌడ్, వ్యాయమ ఉపాధ్యాయులు సత్తయ్య, సుమలత, చందుల స్వామి, వెంకటరమణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన సాంస్కృతిక సమ్మేళనం
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక సమ్మేళనం శుక్రవారం ముగిసింది. ఇందులో యోగా, సంగీతం, నృత్యం, కథన కళ, చిత్రకళ, జానపద సంప్రదాయాలు, శిల్పకళ వంటి అనేక అంశాలు ప్రదర్శించారు. ఒకేవేదికపై వివిధ కళారూపాలను ప్రదర్శించడం విద్యార్థులకు కొత్త అనుభవాన్ని అందించింది. జర్నా మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా, కుమార్ మార్దూర్, మాండా సుధా రాణి మార్గదర్శకత్వంలో జరిగిన నాదయోగం విద్యార్థుల్లో ప్రశాంతత, ఆధ్యాత్మిక అభిరుచిని పెంపొందించాయి. చివరి రోజున నిర్వహించిన ప్రదర్శనలు యోగా, సంగీతం, నృత్యం, కథనకళ, ఫైన్ ఆర్ట్స్ నైపుణ్యాలను ఆవిష్కరించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల శ్రద్ధ, వలంటీర్ల సేవా భావం, గురువుల అంకితభావాన్ని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అలాగే భారత ప్రభుత్వ విద్య, సాంస్కృతిక, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహించిన ఈ సమ్మేళనం ప్రతీ విద్యారిలో జ్ఞానం, అనుభవం, సాంస్కృతిక అవగాహన పెంపొందించాయన్నారు. నాట్యమండలి వారితో మాట్లాడుతున్న ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ఒగ్గుడోలు ప్రదర్శనలో కళాకారులు మహిళా కళాకారిణి నృత్య రూపకం.. -
నిబంధనల ప్రకారం నామినేషన్లు స్వీకరించాలి
భైంసారూరల్: నిబంధన ప్రకారం నామినేషన్లు స్వీ కరించాలని భైంసా ఏఎస్పీ రాజేశ్మీనా అన్నారు. మండలంలోని మిర్జాపూర్లో నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. భైంసారూరల్ ఠాణా తనిఖీ...అనంతరం భైంసారూరల్ పోలీస్ స్టేషన్ను రాజేశ్ మీనా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతు న్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించాలని సూచించా రు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి సమస్యలు తెలుసుకోవాలన్నా రు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో గ్రామాల్లో ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏఎస్పీ వెంట సీఐ నైలు, ఎస్సై శంకర్ ఉన్నారు. -
పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన నామినేషన్ల ప్రక్రియ, ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలు జిల్లాల వారీగా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పారదర్శంగా జరపాలన్నారు. ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ పూర్తి చేయాలని తెలిపారు. వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి..అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏ ర్పాట్లు చేసినట్లు తెలిపారు. తొలి విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాల పరిధిలో 16 సర్పంచ్ స్థానా లు ఏకగ్రీవం కాగా, 474 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంక్షేమ శాఖకు సంబంధించి, అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, డీఈవో భోజన్న, డీఆర్డీవో విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను అరికట్టాలి
నిర్మల్టౌన్: బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీపీవో మురళి, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మిషన్శక్తి ఆధ్వర్యంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడపిల్లలకు చదువు వారి ఉజ్వల భవిష్యత్కు దోహదపడుతుందన్నారు. చిన్న పిల్లలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుకోనివ్వాలని సూచించారు. చిన్న వయసులో బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆడపిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజు, సీడబ్ల్యూసీ అనిల్, గురువంత్రావు, జోషి, ప్రవీణ్, డీసీపీవో మురళి, సీడీపీవో సరిత, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
ప్రభుత్వం రూ. లక్ష ల కోట్ల అప్పులు న్నా.. ప్రతీ నెలా రూ. కోట్ల రూపేనా వడ్డీలు చెల్లిస్తున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ, అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులు ఖర్చులేకుండా కార్పొరేట్స్థాయిలో విద్యనభ్యసించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశాం. రెండేళ్లలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించేలా ప్రతిపాదనలు స్వీకరించాం. త్వరలోనే ఆ మొత్తాన్ని అందజేస్తాం. జిల్లాను పర్యాటకపరంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. – జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి అన్నివర్గాల ప్రజలకు న్యాయం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తుంది. జిల్లాలోని రైతులకు మేలు చేకూర్చేలా రూ.2,500 కోట్ల రుణమాఫీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించాం. అర్హులైన పేదలందరికీ రేషన్కార్డులిచ్చాం. పేదలు దొడ్డుబియ్యం తినకుండా అమ్ముకుంటున్నారని గుర్తించి వారి కడుపునింపేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ప్రజాపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలి. – పి.సుదర్శన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిసభకు హాజరైన జనంఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ సక్సెస్ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన సభకు జనం భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాక గంటన్నర ఆలస్యమైనా ప్రజలు ఓపిగ్గా ఎదురుచూశారు. జిల్లాలో రూ.260 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి సభాప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణతో సభను ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, జి.వినోద్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే అభిమానం..: సీఎం ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, పీసీసీ అధ్యక్షుడినయ్యాక ఇక్కడి నుంచే కార్యక్రమాలను ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు. జిల్లాను దత్తత తీసుకున్నానని త్వరలోనే అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న జిల్లాకు ఏడాదిలోనే ఎయిర్బస్సు వచ్చేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీ మంజూరు చేయనున్నట్లుగా హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కేంద్రంగా నాగోబా సన్నిధిలో కుమురంభీం పేరిట ఉంటే బాగుంటుందని, ఇది తన సూచనగా పేర్కొన్నారు. అలాగే మూతపడ్డ సీసీఐని ప్రైవేట్ సెక్టార్లో పునః ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. కొరటా–చనాఖ ప్రాజెక్ట్ను త్వరలోనే ప్రారంభించి జాతికి అంకితం చేస్తామన్నారు. అలాగే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై ప్రాజెక్ట్ నిర్మించి ఉమ్మడి జిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేలా జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసినట్లుగా వివరించారు. భారీ బందోబస్తు సీఎం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులను పోలీసులు వేకువజామునే ముందస్తు అరెస్ట్లు చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకను సభ ప్రాంగణంలో ఉన్న ప్రజలకు తెలియజేసేలా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. అంతకు ముందు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నాయకులు, ట్రెయినీ కలెక్టర్ సలోనిచాబ్రా హెలీప్యాడ్ వద్దకు చేరుకుని సీఎంకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు అహంకార, అవినీతి కారణంగానే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రూ.500లకు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో అమలు కాని అనేక పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా యువతలో నైపుణ్యాలు మెరుగుపర్చేలా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేశాం. – గడ్డం వివేక్, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి -
మెరుగైన వైద్యం అందించాలి
మామడ: వైద్యసిబ్బంది ప్రజలకు అందుబా టులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నా రు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలు, రోజువారీ రో గుల సంఖ్య, అందిస్తున్న సేవలు తెలుసుకున్నారు. పీహెచ్సీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల రక్తనమూనాలను సేకరించి వ్యాధి నిర్దారణ చేయాలన్నారు. పీవోఎం సౌమ్య, వైద్యాధికారి స్వాతి, హెల్త్ ఎడ్యుకేటర్ రవీందర్, సూపర్వైజర్ నరేందర్, సిబ్బంది ఉన్నారు. -
ఘనంగా దత్త జయంతి
నిర్మల్టౌన్: దత్త జయంతి వేడుకలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణ శివారులోని గండి రామన్న క్షేత్రం ఆవరణలోని సాయిబాబా, దత్తాత్రే య ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. వందల మంది భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. 48 గంటలుగా కొనసాగిన సాయినామ సంకీర్తన మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. మధ్యాహ్న హారతి అనంతరం మహా అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక దత్తాత్రేయనగర్లోని దత్తాత్రేయ ఆలయంలో, మంజులాపూర్ సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భూమయ్య, చైర్మన్ బురాజ్, సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్రెడ్డి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
భూ సేకరణకు నిధులివ్వండి
కొరటా– చనాఖా ప్రాజెక్ట్ నిర్మాణం 97శాతం పూర్తయింది. పెండింగ్లో ఉన్న ఆయకట్టు భూసేకరణ నిధులు త్వరగా విడుదల చేసి సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు భూ సేకరణ జీవో జారీ చేశారు. అలాగే పంటచేలకు రోడ్లు వేసేలా పొలంబాటకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యేక ప్రేమ చూపుతూ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ -
పోలీసింగ్లో ఆదర్శంగా నిలవాలి
నిర్మల్టౌన్: నిర్మల్ పోలీసింగ్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని, శాతిభద్రతల పరిరక్షణకు మరింత నిబ ద్ధతతో పని చేయాలని డీజీపీ శివధర్రెడ్డి సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఎల్లపల్లి వద్ద పోలీస్ అధికా రులు, సిబ్బంది కోసం నిర్మించిన భవనాలను స్థాని క ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డితో కలిసి గురువా రం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ క్యాంప్ కా ర్యాలయ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన ఈ ఆధునిక భవనాలు పోలీ స్ సిబ్బందికి మెరుగైన పనిస్థలం, నివాస వాతావరణం అందిస్తాయన్నారు. పోలీసులు కూడా సేవల నాణ్యతను పెంచేందుకు దోహదపడతాయని తెలి పారు. కార్యక్రమంలో ఐజీపీ(పీఅండ్ఎల్)ఎండీ రమేశ్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మి ల, అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ , అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, పోలీస్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏరియాస్పత్రిలో కార్మికుల ఆందోళన
భైంసాటౌన్: పట్టణంలోని ఏరియాస్పత్రిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు గురువారం ఆందోళన చేపట్టారు. కేఎస్ ఎంటర్ ప్రైజెస్ అనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న దాదాపు 50 మంది కార్మికులకు ప్రతినెలా వేతనాల్లో కోత విధిస్తున్నారని వా రు ఆరోపించారు. నెలకు రూ.15,500 వేత నం చెల్లించాల్సి ఉండగా, పీఎఫ్ పోను రూ.10,500 చెల్లించాలన్నారు. కానీ, ఇటీవల మూడునెలల వేతనం రూ.26 వేలు మాత్రమే జమ చేశారని, రూ.10,500 చొప్పున రూ.31,500 జమ కావాల్సి ఉండగా, కోత పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. -
మాజీ సీఎం రోశయ్యకు నివాళి
నిర్మల్చైన్గేట్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అధికారికంగా నిర్వహించారు. అదనపు కలెక్ట ర్ కిశోర్కుమార్, అధికారులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడు తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గా, మంత్రిగా ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్టీ, మై నారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, అంబాజీ, మోహన్సింగ్, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహా రెడ్డి, హార్టికల్చర్ అధికారి రమణ, ఎల్డీఎం. రామ్గోపాల్, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు సూర్యారావు తదతరులు పాల్గొన్నారు. -
సమస్యలపై సమీక్ష నిర్వహించాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సాగునీటి చెరువులు, కెనాల్స్, రోడ్లు, పాఠశాలల పరిస్థితులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం సీఎం అధ్యక్షతన నిర్వహించాలి. ఉట్నూర్ ఐటీడీఏకు ఆరేళ్లుగా పాలకవర్గం నియమించకపోవడంతో పీఎంకేఎస్వై, పోడు భూములు వంటి ఆదివాసీల సమస్యలపై చర్చించే అవకాశం లేదు. ఐటీడీఏ పాలకవర్గాన్ని నియమించాలి. ఎయిర్పోర్టు భూ సేకరణకు జీవో జారీ, ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
జాబిలమ్మ.. చెంతకు చేరెనమ్మ
జిల్లాలో ఆకాశంలో అరుదైన దృశ్యం గురువారం ఆవిష్కృతమైంది. నింగిలో జాబిలమ్మ.. జిల్లావాసులను కనువిందు చేసింది. 2025 చివరి పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6:55 గంటల ప్రాంతంలో చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా వచ్చాడు. సాధారణ పౌర్ణమి చంద్రునితో పోలిస్తే 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా, సుమారు 14 శాతం పెద్దగా కనిపించినట్లు ఖగోళనిపుణులు తెలిపారు. చెంతకు వచ్చిన చందమామను.. జిల్లావాసులు ఇళ్ల డాబాలు ఎక్కి వీక్షించారు. సెల్ఫోన్లలో బంధించారు. జాబిలమ్మను అందుకుంటున్నట్లు సెల్ఫీలు, ఫొటోలు దిగారు. – నిర్మల్ఖిల్లా -
నిర్మల్
ఎన్నికల సామగ్రి పరిశీలన ఖానాపూర్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం జెడ్పీ సీఈవో శంకర్ సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో రత్నాకర్రావు, సిబ్బంది జెడ్పీ సీఈవోను శాలువాతో సన్మానించారు. నిర్మల్: సర్పంచ్.. ఊరు చిన్నదైనా ఈ పదవి పెద్ద ది. గ్రామానికి దిశానిర్దేశం చేసే పదవి మాత్రమే కాదు. నేతగా ఉన్నతస్థాయికి అంచెలంచెలుగా ఎదగడానికి ఓ రకమైన రాజకీయ అరంగేట్రమిది. పల్లె పాలనతో ఓనమాలు నేర్చి ఢిల్లీ దాకా ఎదిగిన నేతలెందరో ఉన్నారు. పంచాయతీలో ఎదురైన అనుభవాలతో తమ రాజకీయ జీవితాన్ని విజయవంతంగా నిర్మించుకున్న పాలకులూ జిల్లాలో ఉన్నారు. జి ల్లాలోనూ ఇలాంటివారు చాలామందే ఉన్నారు. అ ప్పటి నేతల పనితీరే.. వారిని పంచాయతీ నుంచి పైస్థాయికి తీసుకెళ్లిందనడంలో అతిశయోక్తి లేదు. ఆదర్శం నర్సన్నబాపు పొద్దుటూరి నర్సారెడ్డి అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి తెలియదు. అదే.. నర్సన్నబాపు అనగానే టక్కున ‘అరె.. బాపు గురించి తెలియకపోవడమేంది..’ అని గొప్పగా చెబుతారు. సారంగపూర్ మండలం మలక్చించోలికి చెందిన నర్సన్నబాపు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇందులో ఒకసారి ఏకగ్రీవంగా గెలు పొందడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా కూడా వ్యవహరించా రు. రాష్ట్ర భారీ నీటిపారుదల, రెవెన్యూ శాఖల మంత్రిగా పని చేశారు. 1989లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఈస్థాయికి ఎదిగిన నర్సన్నబాపు రాజకీయ జీవితానికి తొలి పునాది మలక్చించోలి గ్రామ సర్పంచ్ పదవే కావడం విశేషం. అంత ఎదిగినా.. నర్సన్నబాపు తన వారసులనూ రాజకీయరంగంలోకి తీసుకురాకపోవడం గమనార్హం. గడ్డెన్నకాకా కుటుంబంలో ముగ్గురు.. కాకా.. అంటూ ముధోల్ నియోజకవర్గ ప్రజలు ప్రేమగా పిలుచుకునే నేత గడ్డెన్న. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఏ స్థాయికి ఎదిగినా పల్లెనేతగానే ఆయన పేరొందారు. భైంసా మండలం దేగాం సర్పంచ్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తండ్రి అడుగుజాడల్లోనే మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సర్పంచ్ పదవి నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టా రు. రెండుసార్లు మార్కెట్ కమి టీ చైర్మన్గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గడ్డెన్న మరో కుమారుడు గోపాల్రెడ్డి కూడా దేగాం సర్పంచ్గా పనిచేయడం విశేషం. డిప్యూటీ స్పీకర్గా భీంరెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించిన ఘనత అయిండ్ల భీంరెడ్డికే దక్కుతుంది. లక్ష్మణచాంద మండలం మునిపెల్లి, మల్లాపూర్, మాచాపూర్లు కలిపి ఉన్న పంచాయతీకి భీంరెడ్డి సర్పంచ్గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1983లో ఎమ్మెల్యేగా గెలిచి స్వల్ప కాలమే పదవిలో ఉన్నా.. డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చారు. ఆయన కుమార్తె డాక్టర్ స్వర్ణారెడ్డి 2018లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. ఇలా జిల్లాకు చెందిన ఎందరో నేతలు సర్పంచ్గా ప్రస్థానం ప్రారంభించి ఉన్నత పదవులు అధిరోహించారు. నర్సారెడ్డి మాజీ మంత్రి రాజేశ్వర్రావు సమితి మాజీ అధ్యక్షుడుగడ్డెన్న మాజీ మంత్రి నారాయణరెడ్డి సమితి మాజీ అధ్యక్షుడువిఠల్రెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్ మాజీ ఎంపీపీ భీంరెడ్డి మాజీ డిప్యూటీ స్పీకర్ జిల్లాలో చాలామంది కొత్త, పాత నేతలు సర్పంచ్ పదవి నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఉన్నతంగా ఎదిగారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో పదవులను విజయవంతంగా నిర్వర్తించారు. ఇలా మరి కొందరు.. కామాంధులకు ఉరే సరి..! చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడుతున్నవారికి ఉరిశిక్ష వేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే ఘటనలు ఆగుతాయని భావిస్తున్నాయి. -
సీఎం సారూ.. మీపైనే ఆశలు
కై లాస్నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భా గంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజ రుకానున్నారు. అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘకాలంగా పరి ష్కారానికి నోచుకోని సమస్యలు అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, మౌలిక వసతుల పరంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతవాసులు సీఎం కల్పించే భరోసాపై గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం ఆ దిశగా ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పర్యటన సాగుతుందిలా... సీఎం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్లో బయలుదేరి 2గంటలకు ఆదిలాబాద్లోని ఎరోడ్రమ్కు చేరుకుంటారు. 2.10 గంటలకు కాన్వాయ్ ద్వారా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3.45గంటలకు స్టేడియం నుంచి హెలిప్యాడ్కు చేరుకుని హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. -
బకాయిలు విడుదల చేయాలి
నిర్మల్చైన్గేట్: పీఏసీఎస్, ఎఫ్ఏసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన మొక్కజొ న్న బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిని నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు కోరారు. బుధవారం ఆయనను కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని రై తుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించి రూ.20కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. స్పందించిన సుదర్శన్రెడ్డి సీఎం పేషీలో మాట్లాడి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
ఖానాపూర్లో ఐదు చోట్ల..
ఖానాపూర్: ఒక్కో నామినేషన్ రావడంతో మండలంలోని మేడంపల్లి, పాత తర్లపాడ్, దాసునాయక్తండా, కోలాంగూడ, అడవిసారంగాపూర్ గ్రామాల సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మేడంపల్లి సర్పంచ్గా గుగ్లావత్ రాజేందర్నాయక్, పాత తర్లపాడ్ సర్పంచ్గా పడిగెల మల్లారెడ్డి, దాసునాయక్తండా సర్పంచ్గా లావుడ్య తరుణ్బాయి, కోలాంగూడ సర్పంచ్గా ఆత్రం అర్జున్, అడవిసారంగాపూర్ సర్పంచ్గా మాడావి అంకుశ్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 25 గ్రామపంచాయతీలుండగా సర్పంచ్ పదవికి 192 నామినేషన్లు వచ్చాయి. బుధవారం 53 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కేజీబీవీలకు బంకర్బెడ్లు
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో మెరుగైన సదుపాయాల కల్ప నపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం విద్యార్థినులు గదుల్లోని చాపలపై నిద్రించాల్సి వ స్తోంది. విద్యార్థినుల ఇబ్బందులను గుర్తించిన ప్ర భుత్వం బంకర్ బెడ్లు అందించేందుకు నిర్ణయించింది. ఈ తరహా బెడ్లతో స్థలం వృథా కాకుండా ఉంటుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థి నుల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని అవసరమో వి ద్యాలయాల వారీగా లెక్కలు తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు ఆర్డర్లు పొందగా నెలాఖరు వరకు ఆయా కేజీబీవీలకు సరఫరా చేసేందుకు చర్యలు వే గవంతం చేశారు. మొదటి దఫాలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని 45కేజీబీవీలకు 6,860 బంకర్బెడ్లు సరఫరా చేయనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ బెడ్లు ఎన్ని అవసరమో ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా ఆయా కేజీబీవీలకు దశలవారీగా బంకర్ బెడ్లు సరఫరా చేయనున్నారు. మరోవైపు నాబార్డు నిధులతో మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యార్థినుల అవసరాల మేరకు అదనపు తరగతి గదులు, శుద్ధ జల ట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీ టిసంపులు, బోర్వెల్లు, ప్రహరీల నిర్మాణం, సో లార్ ఫెన్సింగ్, డార్మెటరీ, భోజనశాలలు, దోమలు రాకుండా మెష్ల ఏర్పాటు, భవన మరమ్మతు, విద్యుత్ ఉపకరణాల మరమ్మతు చేపట్టనున్నారు. మొదటి దశలో జిల్లాల వారీగా వివరాలు జిల్లా విద్యాలయాలు పడకలు ఆదిలాబాద్ 13 2,103 ఆసిఫాబాద్ 12 1,749 నిర్మల్ 10 1,553 మంచిర్యాల 10 1,455 45 6,860 -
లెక్క తేలింది
ఇప్పచెట్లపై వేటు ఇప్పచెట్లు ప్రజలకు వరమని చెప్పుకోవచ్చు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లేక క్రమంగా అనేక ప్రయోజనాలున్న చెట్లు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. వాతావరణం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. చలి పెరుగుతుంది. రాత్రి వేళ మంచు కురుస్తుంది. నిర్మల్ చైన్గేట్: జిల్లాలో మొదటివిడత పంచా యతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లె క్క తేలింది. బుధవారం నామినేషన్ల ఉ పసంహరణ ప్రక్రియ ముగిసింది. ప లువురు 174 సర్పంచ్, 197 వార్డు స్థానాలకు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ త ర్వాత సర్పంచ్ స్థానాలకు 624 మంది, వార్డు స్థానాలకు 1,883 మంది బరిలో ఉన్నారు. జిల్లాలోని 136 సర్పంచ్ స్థానాలకు, 1,072 వార్డు స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. -
మామాడలో ఐదుచోట్ల ఏకగ్రీవం
మామడ: మండలంలోని వాస్తాపూర్, కప్పన్పల్లి, ఆరేపల్లి, లింగాపూర్, బూరుగుపల్లి పంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మండలంలో 27 గ్రామపంచాయతీలుండగా ఐదు చోట్ల ఏకగ్రీవం కాగా, మిగతా 22 చోట్ల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆరేపల్లి సర్పంచ్గా జంగిలి రాజవ్వ, బూరుగుపల్లి సర్పంచ్గా నాగుల భూమన్న, లింగాపూర్ సర్పంచ్గా గుగ్లావత్ గంగారాధ, కప్పన్పల్లి సర్పంచ్గా సుంచుబాపు లింగన్న, వాస్తాపూర్ సర్పంచ్గా ఆడేం భూంబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవులకు 116 నామినేషన్లు రాగా, బుధవారం 34 మంది పోటీ నుంచి తప్పుకోగా 82 మంది బరిలో ఉన్నా రు. వార్డు మెంబర్ స్థానాల కోసం 416 మంది నామినేషన్లు వేయగా 30 మంది ఉపసంహరించుకున్నారు. 386 మంది బరిలో నిలిచారు. జామ్గాం సర్పంచ్గా వనిత! కుభీర్: మండలంలోని జామ్గాం గ్రామస్తులంతా బుధవారం సమావేశమయ్యారు. సర్పంచ్గా మాన్కూర్ వనిత, ఉపసర్పంచ్గా మహాగాం రాజేశ్వర్ ను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించారు. గత ఎన్నికల్లోనూ సర్పంచ్గా గ్రామానికి చెందిన ముజాహిత్ఖాన్ను ఎన్నుకోగా ఆయన ఐదేళ్లు ప నిచేశారు. గ్రామాల్లో గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు. దస్తురాబాద్లో ఒక చోట.. దస్తురాబాద్: మండలంలోని భూత్కూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామానికి చెందిన సింగరి విజయ, రేగుంట లావణ్య సర్పంచ్గా నామినేషన్లు వేశారు. బుధవారం రేగుంట లావణ్య నామినేషన్ ఉపసంహరించుకోవడంతో సింగరి విజయ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామానికి చెందిన విజయ సర్పంచ్గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. -
దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు
నిర్మల్చైన్గేట్: దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. రాయితీ రుణాలు పొంది వ్యాపారాల్లో రాణించాలని సూచించారు. జిల్లాలో 10భవిత కేంద్రాలను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని కేంద్రాలు ఆధునికీకరించడంతోపాటు ఫిజియోథెరపిస్ట్లను అందుబా టులోకి తీసుకువస్తామని తెలిపారు. అర్హులైన ది వ్యాంగులకు యూడీఐడీ కార్డులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు న్యాయ నిపుణులు, ఎన్జీవోలతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తామని చెప్పారు. ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, దివ్యాంగులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలిజిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని బస్టాండ్, అంబేడ్కర్ చౌక్ సమీపంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులను పరిశీ లించి మాట్లాడారు. మినీ ట్యాంక్ బండ్ నుంచి ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఫుట్పాత్కు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలో నిరంతరం పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటా లని సూచించారు. ఆటో స్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఇటీవల నిర్మాణం పూర్తయిన మినీ ట్యాంక్ బండ్ పార్కును పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, టౌన్ ప్లానింగ్ అధికారి హరిభువన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెరువులో చేపపిల్లల విడుదలనిర్మల్ రూరల్: నిర్మల్ మండలం డ్యాంగాపూర్ చెరువులో కలెక్టర్ అభిలాష అభినవ్ చేప పిల్లలు విడుదల చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య, తహసీల్దార్ ప్రభాకర్ తదితరులున్నారు. -
తుదివిడత నామినేషన్ల ప్రక్రియ షురూ..
నిర్మల్ చైన్గేట్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తుది దశలో ఐదు మండలాల పరిధిలోని 133 సర్పంచ్ స్థానాలకు గాను తొలిరోజు బుధవారం 121 నామినేషన్లు దాఖలయ్యాయి. 1,126 వార్డు స్థానాలకు 204 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ‘సర్పంచ్’కు దాఖలైన నామినేషన్లు ఇలా.. మండలం సర్పంచ్ దాఖలైన స్థానాలు నామినేషన్లు బాసర 10 2 భైంసా 30 31 కుభీర్ 42 42 ముధోల్ 19 11 తానూర్ 32 35 మొత్తం 133 121 ‘వార్డు’లకు దాఖలైన నామినేషన్లు ఇలా.. మండలం వార్డు దాఖలైన స్థానాలు నామినేషన్లు బాసర 90 0 భైంసా 258 55 కుభీర్ 344 51 ముధోల్ 166 22 తానూర్ 268 76 మొత్తం 1,126 204 -
‘సీఎం క్షమాపణ చెప్పాలి’
నిర్మల్చైన్గేట్: సీఎం రేవంత్రెడ్డి హిందూ దేవుళ్లను అవమానపరిచారని, హిందూ సమాజాన్ని కించపరిచారని ఆరోపిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజే పీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే క్రమంలో ఏఎస్పీ ఉపేందర్రెడ్డి, పలువు రు సిబ్బంది బూట్లకు మంటలు అంటుకోవడంతో వారు పరుగులు తీయడం గమనార్హం. కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, ఆకుల కార్తిక్, సుంకరి సాయి, ఒడిసెల అర్జున్, భాస్కర్, నరేశ్, రాజు, నారాయణగౌడ్, సుధాకర్, సత్యనారాయణ, రాజేందర్, శ్రావణ్, విజయ్, ప్రసాద్, రాజు, రంజిత్, దిలీప్, సాత్విక్, రాము, మహేశ్, రవి, లింగం, బంటి తదితరులు పాల్గొన్నారు. -
జత కలిసేనని..!
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో పులి తోడు కోసం సంచరిస్తోందా..? ఆడ పులి కోసం అన్వేషణ సాగిస్తోందా..? జత కలిసేందుకు అనువైన సమయమిదేనా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొన్ని రోజులుగా జన్నారం అడవుల్లో పులి మకాం వేసింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ఎప్పటికప్పుడు కదలికలను గుర్తిస్తున్నారు. జన్నారం డివిజన్లో పర్యటిస్తున్నది మగపులిగా గుర్తించారు. ఆడపులి జత కోసం అన్వేషిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడే మకాం వేస్తుందా..? 2012 ఏప్రిల్లో కవ్వాల్ అభయారణ్యాన్ని కవ్వాల్ టైగర్ జోన్గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పులుల రాకపోకలే తప్ప ఇక్కడ ఆవాసం ఉన్న దాఖలాలు లేవు. ఒకట్రెండు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలో సంచరించి తిరిగి వెళ్లేవి. కానీ గత నెల 26న జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఆవుపై దాడి చేసి చంపింది. పరిశీలించిన అటవీశాఖ అధికారులు పులి దాడిగా గుర్తించి ట్రాక్ చేశారు. సీసీ కెమెరాలు అమర్చగా వాటిలో పులి చిక్కినట్లు తెలిసింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు. టైగర్జోన్లో టైగర్ తిరగడం అంత ప్రత్యేకత కాకున్నా సంవత్సర కాలంగా పులి రాక కోసం ఎదురు చూస్తున్న అటవీ అధికారులకు మాత్రం ఈ పులి ఆరు రోజులుగా ఇక్కడే మకాం వేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆవాసం ఏర్పాటు చేసుకుంటే.. జన్నారం అటవీ డివిజన్ పులి ఆవాసాలకు అనువుగా ఉంది. గడ్డి మైదానాలతో వన్యప్రాణుల సంఖ్య పెరగడం, నీటిసౌకర్యం, దట్టమైన అడవులు పులికి ఆవాస యోగ్యంగా ఉంటాయి. ఆరు రోజులుగా మకాం వేసిన పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. ఆడపులి తోడయితే కొన్ని రోజుల్లో పులి పిల్లలను కనే అవకాశం ఉంది. అనువైన ప్రదేశం ఉన్నందున ఇక్కడే మకాం వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లోకి పశువులు, మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అలజడి తగ్గిస్తే పులి ఆవాసం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటుందని అంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆరు రోజులు పులి మకాం వేయడం ఇదే మొదటిసారి. తోడు కోసమా.. మరెందుకనే విషయంపై స్పష్టంగా చెప్పలేం. ఇక్కడ ఉన్నది మాత్రం మగ పులి అని ఆనవాళ్ల ఆధారంగా చెప్పవచ్చు. పులి ఉన్న చోటు శబ్దం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. పశువుల కాపరులు, ఇతరులు అడవుల్లోకి వెళ్లవద్దు. – రామ్మోహన్, ఎఫ్డీవోటైగర్ ట్రాకింగ్పై శిక్షణ జన్నారం అటవీ సిబ్బందికి టైగర్ ట్రాకింగ్పై శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగజ్నగర్కు చెందిన టైగర్ ట్రాకర్లతో నాలుగు రోజులు శిక్షణ ఇప్పించారు. పులి అడుగులు గుర్తించడం, ప్రత్యక్షంగా చూసే విధానం, కెమెరాలు ఏర్పాటు చేయడం, పులి మానిటరింగ్లో మెలకువలు నేర్పించారు. పులి జాడ ఎలా కనుగొనడం, జాగ్రత్తలు వివరించారు. పది రోజుల తర్వాత మరో నాలుగు రోజులు సైతం శిక్షణ ఇప్పించనున్నారు. -
భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలి
నిర్మల్టౌన్: భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డీజీపీ శివధర్రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి, శాంతి భద్రతలు, పరిపాలన సామర్థ్యంపెంపు, స్మార్ట్ గవర్నెన్స్ లాంటి ముఖ్యంశాలపై అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో జిల్లా ఎస్పీ జానకీషర్మిల, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా పాల్గొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న మంచి పద్ధతులు, భద్రతాచర్యలు, ప్రజాసేవల విస్తరణకు చేపడుతున్న వినూత్న విధానాలు ఎస్పీ వివరించారు. తెలంగాణను గ్లోబల్ లీడర్గా నిలబెట్టే దిశగా పోలీస్శాఖ పాత్ర నూతన వ్యూహాలు సాంకేతిక ఆధారిత సేవల విస్తరణ వంటి అంశాలపైనా చర్చించారు. ఏఎస్పీకి వీడ్కోలు నిర్మల్టౌన్: భైంసా ఏఎస్పీగా విధులు నిర్వర్తించి కొత్తగూడెంకు బదిలీ అయిన అవినాష్ కుమార్కు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలమాల శాలువాతో సత్కరించారు. భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్ సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
సారంగపూర్: మండలంలోని చించోలి(బి), ధని, జామ్ గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సోమవారం పరిశీలించారు. దాఖలైన నామినేషన్ల వివరాలను, జారీ చేసిన నామినేషన్ పత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హెల్ప్డెస్క్ పనితీరును పరిశీలించారు. అభ్యర్థుల సమస్యలు నివృత్తి చేయడంతోపాటు వా రికి అవసరమైన వివరాలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. అక్కడి నుంచి సారంగాపూర్ రైతుకేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ వివరాల ఆన్లైన్ కౌంటర్ను పరిశీలించారు. నమోదు చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, తహశీల్దార్ సంధ్యారాణి, ఎంపీవో అజీజ్ఖాన్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
పల్లెల్లో పార్టీల ఫైట్
నిర్మల్పల్లె పాలనకు 61 ఏళ్లు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి 61 ఏళ్లు అవుతుంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది.సమస్యలు పరిష్కరించేలా అభివృద్ధి పనులు భైంసాటౌన్: పట్టణంలో సమస్యలు ఉన్నచోట అభివృద్ధి పనులు చేపట్టాలని భైంసా సబ్ కలెక్టర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ అజ్మీర సంకేత్కుమార్ మున్సిపల్ అధికారులను సూచించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. పంజేషాచౌక్ నుంచి వినాయక నిమజ్జనం రూట్లో సమస్యలు పరిశీలించారు. శోభాయాత్ర మార్గంలో ఇరుకు మార్గాల్లో డ్రెయినేజీలపై స్లాబ్ నిర్మించాలని సూచించారు. స్థానిక కమల థియేటర్ నుంచి వివేకానంద చౌక్ వరకు, ఇతర ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయినేజీలు పరిశీలించారు. రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, సూచనల మేరకు పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఆయన వెంట డీఈఈ సంతోష్, టీపీవో అనురాధ, సిబ్బంది ఉన్నారు.నిర్మల్: సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేకున్నా.. పార్టీ లకు పల్లెపోరు ప్రతిష్టాత్మకంగానే మారింది. తాము బలపర్చే అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ సీరియస్గా పనిచేస్తున్నాయి. డీసీసీ పదవి చేపట్టిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని పంచాయతీలోనూ గెలిపించుకుందామంటూ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ చేరికలను ప్రోత్సహిస్తూ పల్లెల్లో పట్టుపెంచుకునే పనిలో పడింది. ఇక గత ఎన్నికల్లో మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న బీఆర్ఎస్ ఈసారి అంతగా ప్రభావం చూపడం లేదు. ఇది గుర్తింపు పోరాటం.. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు. కానీ.. అభ్యర్థులు దాదాపు ఏదో ఒకపార్టీకి చెందినవారే ఉంటారు. ఇక పార్టీలు తమ గుర్తులు లేకున్నా.. గుర్తింపు కోసం పల్లెపోరులో ఫైట్ చేస్తున్నాయి. గ్రామీణ ఓటుబ్యాంకు ఎక్కువగా ఉంటుంది. ఏ ఎన్నికల్లోనైనా ఈ ఓట్లే కీలకం. సర్పంచులు చాలావరకు గ్రామాలను ప్రభావితం చేయగలుగుతారు. పార్టీని క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్తారు. ఈనేపథ్యంలోనే పార్టీలు పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ తాము బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్–బీజేపీ ఫైట్.. కారు సైలెంట్.. జిల్లాలో 400 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సత్తా చాటింది. మూడొంతుల పంచాయతీల్లో తాము బలపర్చినవారినే సర్పంచులుగా గెలిపించుకుంది. కానీ.. ఇప్పుడు సీన్మారింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం, జిల్లాలో పెద్దనేతలందరూ పార్టీలు మారడంతో ప్రస్తుతం నామమాత్రంగా బరిలో దిగుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లు బలపర్చిన అభ్యర్థుల మధ్య పోటీ కనిపిస్తోంది. జిల్లాలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటం, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో ఆపార్టీ పల్లెల్లో విస్తరిస్తోంది. చేరికలను ప్రోత్సహిస్తోంది. ఇక అధికారంలో కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవలే కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి పొందిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్కు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. ‘విజయం’వైపు పయనం.. ఓవైపు పార్టీలు తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తుంటే, చాలామంది అభ్యర్థులు మాత్రం తాము ఎక్కడుంటే గెలుస్తామన్నట్లుగా ఆలోచిస్తున్నారు. తమ గ్రామాల్లో పరిస్థితులు, పార్టీల ప్రభావాలను లెక్కేసుకుంటున్నారు. గెలిచిన తర్వాత ఎటైతే అటు కానీ.. ముందైతే గెలువాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. -
పాఠశాలను సందర్శించిన ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్
మామడ: మండలంలోని కొరిటికల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ట్రెయినీ డిప్యూ టీ కలెక్టర్ రాకేశ్ సోమవారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులు అందిస్తున్న మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలని సూచించారు. పాఠశాలలో అమలవుతున్న బాలశక్తి, ఎఫ్ఆర్ఎస్ హాజరు, ఎఫ్ఎల్ఎన్ బేస్లైన్, మిడ్లైన్ పరీక్షల రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటరమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన ఉండాలి
నిర్మల్చైన్గేట్: ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగేలా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో నిర్ధారణ, కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ప్రసూతి మరణాల తగ్గింపులో కిందిస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారులు చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు. ప్రసూతి మరణాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా మరింత పట్టుదలతో పనిచేయాలన్నారు. ర్యాలీ సందర్భంగా కళాజాత బృందాలు డప్పు పాటలతో ప్రజలకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఎంహెచ్వో రాజేందర్, డీఎల్ఎస్ఏ సెక్రెటరీ రాధిక, డీఈవో భోజన్న, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయంతో ‘పంచాయతీ’ గెలుద్దాం
నిర్మల్/సారంగాపూర్: జిల్లాలో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని, సమన్వయంతో పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ నేతలను సర్పంచులుగా గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి ముఖ్యనేతలతో కలిసి జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కులమతాలకు అతీతంగా, ఎలాంటి వైషమ్యాలు లేకుండా ముందుకు పోతుందన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా కృషిచేద్దామని అన్నారు. బీసీలకు ప్రాధాన్యత.. జనరల్ స్థానాల్లో జనాభాను బట్టి బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారని బొజ్జు పేర్కొన్నారు. జిల్లాలోనూ అలాంటి స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేలా నియోజకవర్గ ఇన్చార్జీలు చూడాలని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేసేందుకు ఈనెల 4న సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్కు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని జిల్లా నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జిల్లాకేంద్రంలో కార్యాల యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈసందర్భంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు బొజ్జుపటేల్ను సన్మానించారు. సమావేశంలో గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ అర్జుమంద్అలీ, ఏఎంసీ చైర్మన్ భీంరెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, పీసీసీ ప్రధానకార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, సీనియర్ నేతలు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, నాందేడపు చిన్ను, జునైద్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
నర్సాపూర్ (జి): గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని సీనియర్ సివిల్ జడ్జి, డిస్టిక్ర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ జి.రాధిక అన్నారు. మండల కేంద్రంలోని శ్రీరామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని సోమవారం ప్రారంభించారు. యువత సద్వినియోగం చేసుకుని విజ్ఞానం పెంచుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆలయ ఆవరణలో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో రామాలయ ట్రస్ట్ అధ్యక్షుడు గోపిడి గంగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి దర్శనం సుధాకర్, కోశాధి కారి మంత్రి చంద్రశేఖర్, సలహాసభ్యులు దామోదర్, రాంనాథ్, నారాయణ, గంగారాం, సుదర్శన్రెడ్డి, సుభాష్, గంగాధర్, నవీన్ పాల్గొన్నారు. -
సామర్థ్యాలను పరిశీలించి.. విద్యార్థులను అభినందించి..
నిర్మల్ఖిల్లా: జిల్లాకేంద్రంలోని శాంతినగర్ ప్రాథమిక పాఠశాల, కస్బా ఉన్నత పాఠశాలను వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) సత్యనారాయణరెడ్డి సోమవారం సందర్శించారు. శాంతినగర్ పాఠశాలలో విద్యార్థుల తొలిమెట్ట సామర్థ్యాలను పరిశీలించారు. త్వరలో జరిగే ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) గురించి వివరించి, అందుకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలు పరీక్షించి ప్రశంసించారు. కస్బా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న విద్య కార్యక్రమాల గురించి ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. -
గురువుల బోధనకు ప్రత్యామ్నాయం లేదు
నిర్మల్ఖిల్లా: గురువులు భవిష్యత్ సమాజ నిర్మాతలని, ఏ కాలంలోనైనా గురువుకు ప్రత్యామ్నాయంలేదని డీఈవో భోజన్న అన్నారు. నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. రిటైర్ అయిన సాంఘికశాస్త్ర స్కూల్ అసిస్టెంట్ మాసూద్, తెలుగు స్కూల్ అసిస్టెంట్ వడ్లూరి సుదర్శన్, జూనియర్ అసిస్టెంట్ ప్రహ్లాద్ను డీఈవో కార్యాలయంలోవారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ సంఘం నేతలు, విద్యా శాఖ సిబ్బంది సమక్షంలో సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో విద్యాశాఖ పర్యవేక్షకులు, విద్యాశాఖ సమన్వయకర్తలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. -
టెట్పై ఆందోళన వద్దు
బాసర: టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) తప్పనిసరిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. బాసర సరస్వతీ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయనను మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి, పదోన్నతులు ఇప్పిస్తామని తెలిపారు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్.భూమన్న యాదవ్, ఎ.బాజారెడ్డి, పల్సీకర్ శ్రీనివాస్, జిల్లా పూర్వ అధ్యక్షుడు డి.రామారావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి బి.వెంకటేశ్వర్ రావు, బాసర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేందర్రావు, రవీందర్, నాయకులు గణపతి, గంగాధర్, శ్రీనివాస్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి శ్రీమహాపోచమ్మ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నామినేషన్ కేంద్రాల తనిఖీ
లక్ష్మణచాంద/పెంబి: పంచాయతీ నామినేషన్లు పకడ్బందీగా స్వీకరించాలని గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అధికారులను ఆదేశించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భాగంగా సోన్ మండలంలోని కడ్తాల్, సోన్, పెంబి, మందపల్లిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆదివారం తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం నామినేషన్ పత్రాలు, ధృవీకరణ, అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి నామినేషన్లు వేయడానికి వచ్చే వారికి సహాయం చేయాలని సూచించారు. ఆమె వెంట కడ్తాల్ జీపీవో గంగాధర్, ఎంపీడీవోలు సుధాకర్, రమేష్, ఎంపీవో అనిల్ కుమార్ ఉన్నారు. -
దొడ్డిదారిన నల్లబంగారం..!
భైంసాటౌన్: జిల్లాలోని పలు ఇటుక బట్టీలకు నల్ల బంగారం(నేల బొగ్గు) అక్రమంగా రవాణా అవుతోంది. ఎలాంటి బిల్లులు లేకుండా మహారాష్ట్రలోని వని, చంద్రపూర్, ఛత్తీస్గడ్లోని విలాస్పూర్ నుంచి లారీల్లో జిల్లాలోని ఇటుకబట్టీలకు తరలుతోంది. దీంతో అటు ప్రభుత్వరంగ సంస్థ అయిన కోలిండియా, ఇటు సింగరేణి పన్ను రూపంలో ఆదాయం నష్టపోతున్నాయి. జిల్లాలోనూ వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి పడుతోంది. మన రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉండడం, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో బొగ్గు ధర తక్కువగా ఉండడంతోపాటు జీరోలో వస్తుండడంతో జిల్లాలోని కొందరు ఇటుకబట్టీల యజమానులు అక్రమంగా బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. 50కిపైగా ఇటుక బట్టీలు.. జిల్లాలో దాదాపు 50–60 వరకు ఇటుక బట్టీలు ఉంటాయి. భైంసా డివిజన్లోని ముధోల్, తరోడ, పిప్రి, సరస్వతి నగర్, వానల్పాడ్, నిర్మల్ డివిజన్లోని బీరవెల్లి, సిద్దులకుంట తదితర ప్రాంతాల్లో ఇటుకబట్టీలు ఉన్నాయి. చాలావరకు బట్టీల్లో నేలబొగ్గును వినియోగిస్తుంటారు. ఒక్కో బట్టికి నెలకు 10–20 టన్నుల చొప్పున జిల్లాలో దాదాపు నెలకు వెయ్యి టన్నుల వరకు నేలబొగ్గు వినియోగం ఉంటుంది. మహారాష్ట్రలో టన్నుకు రూ.6,500 వరకు ఉండగా, మన సింగరేణి బొగ్గు రూ.8,500 వరకు ఉంది. దీంతో జిల్లాలోని కొందరు ఇటుక బట్టీల యజమానులు అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. అయితే, అక్కడ లారీల్లో నుంచి దొడ్డిదారిలో సేకరించిన నేలబొగ్గును పోగు చేసి కొందరు అక్కడి హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తుంటారని, అలా పోగయిన బొగ్గును ఎలాంటి బిల్లులు లేకుండా జిల్లాకు తరలిస్తున్నట్లు సమాచారం. తనిఖీలు చేస్తే ప్రయోజనం...ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులను ఎత్తివేసింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా ఉండడం లేదు. జిల్లా మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో అక్కడి నుంచి నేలబొగ్గు జిల్లాలోకి జీరోలో రవాణా అవుతోంది. 20 టన్నుల బొగ్గు లోడ్కు దాదాపు రూ.20–25 వేల వరకు పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. అయితే, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తరచూ తనిఖీలు జరిపి, జిల్లాలోకి అక్రమంగా నేలబొగ్గు రవాణాను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.తనిఖీలు చేపడతాం..ఎలాంటి వే బిల్లులు లేకుండా వాణిజ్య సరుకులు రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి నేలబొగ్గు అక్రమంగా రవాణా చేస్తే ఫిర్యాదు చేయాలి. తనిఖీలు జరిపి చర్యలు తీసుకుంటాం. – ఈశ్వర్, సీటీవో, నిర్మల్ -
కంచరోని చెరువు ఖాళీ
చేపలు పట్టాలంటే.. మత్స్యకారులు వలలు వేసి.. పడతారు. పడవలో వెళ్లి వేట సాగిస్తారు. కానీ నిర్మల్లో మత్స్యకారులు మాత్రం విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. చెరువులో చేపలు పట్టుకునేందుకు చెరువునే ఖాళీ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రం చుట్టూ 12 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల కారణంగానే నిర్మల్ పట్టణానికి ఇప్పటి వరకు నీటి సమస్య రాలేదు. తాజాగా కంచరోని చెరువు నీరులేక వెలవెలబోతోంది. స్థానిక మత్స్యకారులు ఈచెరువును ఖాళీ చేశారు. నవంబర్ 8న చెరువులో మత్స్యకారులు చేపలు పట్టారు. మరోమారు చేపలు పట్టాలన్న ఉద్దేశంతో మరుసటి రోజు చెరువులోని నీటిని తూము ద్వారా వదిలేశారు. దీంతో 20 రోజుల్లో చెరువు మొత్తం ఖాళీ అయింది. దీంతో చెరువులోని చేపలు, జలచరాలు చనిపోతున్నాయి. చెరువు ఖాళీ కావడంపై నీటిపారుదల శాఖ అధికారులను వివరణ కోరగా, మత్స్యకారులే నీటిని వదిలేశారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
● ఎస్పీ జానకీషర్మిల
స్వేచ్ఛగా ఓటు వేయాలినిర్మల్టౌన్: పంచాయతీ ఎన్నికల్లో నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎ స్పీ జానకీషర్మిల సూచించారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. చెక్పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణ, సున్నితమైన ప్రాంతాల గుర్తింపు, మొబైల్ వాహనాల మానిటరింగ్ వంటి అంశాలపై చర్చించారు. అనుమానాస్పదంగా కనిపించి నా, కోడ్ ఉల్లంఘించినా వెంటనే పోలీసులకు తెలి యజేయాలని సూచించారు. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఏం కొనేటట్టు లేదు..
లక్ష్మణచాంద:ప్రస్తుతం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులను కష్టాల్లోకి తోసేస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారానికి కూరగాయలు తప్పనిసరి. ఇప్పుడు రెండు కిలోల కూరగాయలు కొనాలన్నా రూ.200 దాటిపోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్పై ఇది గట్టి దెబ్బ. ఇప్పటికే జిల్లాలో కూరగాయల సాగు అంతంత మాత్రంగా ఉంది. అక్టోబర్ చివరి వారంలో మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆ పంటలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో వ్యాపారులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. కార్తిక మాసం, అయ్యప్ప దీక్షలు.. మరోవైపు కార్తిక మాసంలో మాంసాహారం తినేవారు తక్కువ. కూరగాయలే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇక ఇదే మాసంలో అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యాయి. మండల దీక్షలతో దీక్షస్వాములు, వారి కుటుంబ సభ్యులు కూడా కూరగాయల భోజనం చేస్తారు. దీంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. ధరలు పెరిగాయి. ఇక షష్టి వారాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం కూడా కూరగాయల ధరలపై పడింది. ధరల పెరుగుదలకు కారణాలు.. మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా... కూరగాయలు ధర కిలోకు.. టమాటా రూ.50– 60 వంకాయలు రూ.80–100 చిక్కుడు రూ.100 బెండ రూ.100 బీర రూ.100 పచ్చిమిర్చి రూ.80 క్యాబేజీ రూ.80 కాలీఫ్లవర్ రూ.80 ఆలుగడ్డలు రూ. 40 తోటకూర రూ.50 -
రెండో విడతలో జోరు..
నిర్మల్: జిల్లాలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ విడతలో నిర్మల్రూరల్, సోన్, సారంగపూర్, దిలావర్పూర్, నర్సాపూర్(జి), కుంటాల, లోకేశ్వరం మండలాల్లో 131 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. తొలిరోజు సర్పంచ్ స్థానానికి 119 నామినేషన్లు వచ్చాయి. 1,170 వార్డులు ఉండగా 122 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా సారంగపూర్ మండలంలో 36 నామినేషన్లు దాఖలయ్యాయి. సారంగపూర్ మండలంలో ఆదివారం అడెల్లి పోచమ్మ ఆశీస్సులు తీసుకుని నామినేషన్లు వేశారు. సర్పంచ్ స్థానాలకు వచ్చిన నామినేషన్లు మండలం పంచాయతీలు వచ్చిన నామినేషన్లు నిర్మల్రూరల్ 20 25 సోన్ 14 7 సారంగపూర్ 32 36 దిలావర్పూర్ 12 7 నర్సాపూర్(జి) 13 9 లోకేశ్వరం 25 12 కుంటాల 15 12 మొత్తం 131 119వార్డులు సభ్యులకు వచ్చిన నామినేషన్లు.. మండలం మొత్తం వచ్చిన వార్డులు నామినేషన్లు నిర్మల్రూరల్ 170 40 సోన్ 132 14 సారంగపూర్ 282 31 దిలావర్పూర్ 108 9 నర్సాపూర్(జి) 120 16 లోకేశ్వరం 224 4 కుంటాల 134 8 మొత్తం 1,170 122 -
పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
దస్తురాబాద్/కడెం: పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకురాలు అయేషామస్రత్ ఖానం సూచించారు. దస్తురబాద్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని, కడెం మండలం కొండుకూర్లోని నామినేషన్ కేంద్రానిన శనివారం పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు అమలు చేస్తూ పొరపాట్లు జరగకుండా చూడలన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఎంపీడీవోలు అరుణ, సునీత, తహసీల్దార్లు విశ్వంబర్, ప్రభాకర్ ఎంపీవోలు రమేశ్రెడ్డి, శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. -
ముగిసిన మొదటి విడత నామినేషన్లు
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. మొదటి విడతలో 136 గ్రామ పంచాయతీలకు, 1072 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన ఉంటుందని, అదే రోజు చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. సోమవారం అప్పీల్ స్వీకరణ, డిసెంబర్ 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు. వచ్చేనెల 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతాయని అధికారులు తెలిపారు. -
బాసరలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి మాధవిదేవి శనివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో జడ్జికి స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి కుంకుమార్చన చేయించారు. తర్వాత జడ్జిని ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వాటివెంట నిర్మల్, నిజామాబాద్ జిల్లాల జడ్జీలు, భైంసా జడ్జి, ఆలయ ఈవో అంజనీదేవి, తహసీల్దార్ పవన్చంద్ర ఉన్నారు. అడెల్లి పోచమ్మకు ఉప కమిషనర్ పూజలు సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మను దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరిండెంట్, ఉప కమిషనర్ గౌరీశంకర్, దేవాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్గౌడ్ శనివారం దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఈవో భూమయ్య అతిథులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, సిబ్బంది రమణారావు ఉన్నారు. -
భీమన్నగుట్ట పరిరక్షణకు చర్యలు
నిర్మల్చైన్గేట్: పట్టణంలోని భీమన్నగుట్ట భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్మల్ ముదిరాజ్ సంఘ బృందం సభ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. భీమన్న గుట్ట భూముల ఆక్రమణపై ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీవో కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనలు విరమించాలని కోరారు. సమావేశంలో ముదిరాజ్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటకారి సాయన్న, జిల్లా అధ్యక్షుడు గణేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి, యువజన సంఘ అధ్యక్షుడు రాజేశ్, ప్రధాన కార్యదర్శి చరణ్, ఉపాధ్యక్షులు అర్జున్ రాజ్ పాల్గొన్నారు. దీక్ష విరమణ... కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు, భీమన్నగుట్ట సమస్య పరిష్కారానికి ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న వారికి ఆర్డీవో రత్నకళ్యాణి, నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. తమ ఆందోళనలను అర్థం చేసుకుని, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
దివ్యాంగులను ప్రోత్సహించాలి
నిర్మల్చైన్గేట్: దివ్యాంగులను అన్నిరంగాల్లో ప్రోత్సాహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నా రు. పట్టణంలోని అంతర్జాతీయ దివ్యాంగుల దినో త్సవం పురస్కరించుకుని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో దివ్యాంగులకు శనివారం జిల్లాస్థాయి క్రీడా పో టీలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజ రై పోటీలను ప్రారంభించారు. గతంలో ఎంతో మంది దివ్యాంగులు పట్టుదలతో శ్రమించి వివిధరంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని గుర్తుచేశారు. ఇటీవల అంధుల క్రికెట్ ప్రపంచకప్ను భార త జట్టు గెలుచుకుందని తెలిపారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే వైకల్యం అడ్డు కాదన్నారు. దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. తప్పకుండా డీఆర్సీ సమావేశాలు నిర్వహించి, సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపడతామని వివరించారు. పోటీల్లో పాల్గొన్న వారిని అభినందించారు. దివ్యాంగులతో కలిసి చెస్, క్యారం బోర్డు ఆడారు. కార్యక్రమంలో డీఈవో భోజన్న, డీవైఎస్ఓ శ్రీకాంత్రెడ్డి, డీపీఆర్వో విష్ణువర్ధన్, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. -
అన్నింటా దూసుకెళ్తూ...
అన్నింటా దూసుకెళ్తూ...గడ్చాందగడ్చాంద ప్రాథమిక పాఠశాలలో 2016లో కేవలం 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. మిగతావారంతా ప్రైవేటు పాఠశాలకు వెళ్లేవారు. అయితే ఫీజుల భారం పెరుగుతండడంతో తల్లిదండ్రుల ఓ నిర్ణయానికి వచ్చారు. 2018లో గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని తీర్మానం చేసుకున్నారు. ఇప్పటికీ దానికే కట్టుబడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా, డిప్యూటేషన్పై మరో ఇద్దరిని కేటాయించారు. ఆరుగురు విద్యావలంటీర్లను గ్రామస్తులు నియమించారు. పాఠశాలలో మొత్తం 190 మంది విద్యార్థులు ఉన్నారు. -
ఘనంగా దీక్షా దివస్
నిర్మల్టౌన్: తెలంగాణ కోసం తన ప్రాణా లను పణంగా పెట్టి గొప్ప వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల సమన్వయకర్తలు రాంకిషన్రెడ్డి, భూక్యా జాన్స న్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం దీక్షా దివస్ నిర్వహించారు. ముధోల్, నిర్మల్, ఖానాపూర్ ని యోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ తెలంగాణ కో సం చేసిన త్యాగ్యాలు ఎప్పటికీ మరువలేవన్నా రు. అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమాదేవి, మరుగొండ రాము, లోలం శ్యాంసుందర్, భూషణ్రెడ్డి, లక్ష్మణ చారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మంచిగా చదువుతుండ్రు..
సేవాలాల్తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మంచిగా చదువు చెప్పుతుండ్రు. పిల్లలు కూడా మంచిగా చదువుతుండ్రు. పక్కనున్న బాలాజీ నగర్ తండా, దుర్గాదాస్ నగర్ తండాలు 4 కిలో మిటర్ల దూరం నుంచి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నాం. – సుభాష్, బాలాజీ నగర్ తండా సౌకర్యాలు సమకూర్చుకున్నాంమా పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుతోపాటు అన్ని సౌకర్యాలు మేమే సమకూర్చుకున్నాం. ఉపాధ్యాయులు లేకున్నా గ్రామం నుంచి ఏడుగురు విద్యావలంటీర్లును నియమించాం. విద్యార్థులు చదువుబాగా చెబుతున్నారు. ఊళ్లో పిల్లలను ప్రైవేటుకు కాకుండా సర్కారు బడికే పంపుతున్నారు. – శ్రీనివాస్, రాజూరక్రమశిక్షణతో ఉంటున్నారుప్రతీరోజు మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నాం. మా పిల్లలు క్రమ శిక్షణతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు నేర్చుకుంటున్నారు. చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన చేస్తున్నారు. – ద్యావత్ శ్రీనివాస్, బామ్ని(కే)అందరి సహకారంతోనే..పాఠశాల అభివృద్ధికి పోషకులు, గ్రామ అభివృద్ధి కమిటీ, యువజన సంఘా సభ్యులు సహకారం అందిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేశారు. ఆటలతోపాటు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. – ఎల్మల ప్రవీణ్కుమార్, ప్రధానోపాధ్యాయుడు, సేవాలాల్తండా పాఠశాల -
మూడు పంచాయతీలు ఏకగ్రీవం?
ఖానాపూర్: మండలంలోని దాసునాయక్తండా, అడవిసారంగాపూర్, కోలాంగూడ గ్రా మాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా పంచాయతీలు స్క్రూటినీ అనంతరం ఏకగ్రీవం కానున్నాయి. దాసునాయక్తండాలో సర్పంచ్ అభ్యర్థిగా లావుడ్య తరణ్బాయిబాపురావు, అడవిసారంగాపూర్లో సర్పంచ్ అభ్యర్థిగా అంకుశ్రావుపటేల్, కోలాంగూడ సర్పంచ్ అభ్యర్థిగా ఆత్రం అర్జున్ నామినేషన్ వేశారు. ఆయా గ్రామాల్లో వార్డు స్థానాలకు సైతం ఒక్కో నామినేషన్ దాఖలైంది. వార్డు మెంబర్లకు దాఖలైన నామినేషన్లు.. మండలం మొత్తం వార్డులు శనివారం దాఖలైన మొత్తం నామినేషన్లుదస్తురాబాద్ 102 175 203 కడెం 242 385 476 ఖానాపూర్ 192 368 401 పెంబి 152 183 213 మామడ 222 355 423 లక్ష్మణచాంద 162 312 364 -
ఆటపాటలతో అభ్యసనం సాగించాలి
నిర్మల్ రూరల్: విద్యార్థులు ఆటపాటలతో అభ్యసనం సాగించాలని డీఈఓ భోజన్న అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఈద్గాం ప్రాథమిక పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ప్రాథమిక విద్యాభ్యాసం విద్యార్థుల జీవితానికి పునాది అన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలను, శ్రద్ధగా వింటూ సృజనాత్మకంగా ఆలోచించి, సాధన చేయాల ని సూచించారు. అభ్యసన ఫలితాల ఆధారంగా విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు సాధన చేయాలని తెలిపారు. ప్రాథమిక విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించి, అభ్యసన ఫలితాల్లో మెరుగైన సామర్థ్యాలు పెంపొందించేలా చూడాలన్నారు. మూడో తరగతి విద్యార్థులు ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు. డీఈవో వెంట ఎంఈవో నాగేశ్వరరావు, ఉన్నత పాఠశాల హెచ్ఎం నీరజారాణి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రోహిదాస్ ఉన్నారు. -
తల్లడిల్లుతున్న పల్లెలు
నిర్మల్యోగాసన పోటీల్లో ప్రతిభ నిర్మల్టౌన్: ఇటీవల రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహించిన ఖేలో ఇండియా యోగాసన పోటీల్లో నిర్మల్ జిల్లా తానూర్ మండలం హిప్నల్లి గ్రామానికి చెందిన వార్లే ప్రదీప్ కాంస్య పతాకం సాధించాడు. ఈ సందర్భంగా యోగా గురువు మల్లేశ్, యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపూర్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం నుంచి ఖేలో ఇండియాలో మొట్టమొదటిసారిగా జిల్లాకు చెందిన విద్యార్థి పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు. సమస్యల్లో భైంసా.. భైంసా పట్టణంలోని పలు వార్డుల్లో సమస్యలు తిష్టవేశాయి. ముఖ్యంగా సీసీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. డ్రెయినేజీల్లో పూడిక పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి సారంగపూర్: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సభ్యుడు, ప్రముఖ ఇంపాక్ట్ ట్రైనర్ కొట్టూరి శ్రీకాంత్ అన్నారు. మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై శుక్రవారం అవగాహ న కల్పించారు. అసలు డ్రగ్స్ అంటే ఏమిటి.. వాటితో కలిగే అనర్థాలు ఏమిటి అనే అంశాలు వివరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి వారితో స్నేహం చేయాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్ఎం మునీందర్ రాజు, ఉపాధ్యాయులు సునీత, అన్నపూర్ణ, మహేశ్వర్, రవిరాజు తదితరులు ఉన్నారు. కాలినడకన వస్తున్న వీళ్లు అడవికి వెళ్లి, తిరిగి వస్తున్నట్లు అనిపిస్తుంది కదూ. కానీ.. వాళ్లు కడెంలో సరుకులు కొనుక్కుని తమ ఊళ్లోకి వెళ్తున్నారు. కడెం మండలం ఉడుంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మిద్దెచింతవాసులు. మండలకేంద్రం నుంచే దాదాపు 35–36కి.మీ. దూరం ఈ అడవిపల్లె. ఇక అభివృద్ధికి అందనంత దూరంగా ఉన్నారు. తరాలు గడిచిపోతున్నా.. ఇప్పటికీ ఉడుంపూర్ నుంచి మిద్దెచింతకు 5కి.మీ.లు అడవిలో నడిచి వెళ్లాల్సిందే. నిర్మల్/భైంసా/భైంసారూరల్: పంచాయతీల్లో పాలకవర్గాలు మారుతున్నాయే తప్పా.. పల్లెల్లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ఎక్కడున్న ఊళ్లు.. అక్కడే ఉన్నాయి. ఇప్పటికీ కనీస సౌకర్యాలూ లేకపోవడం శోచనీయం. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తోంది. ప్రస్తుతం నిధులు రాక కార్మికులకు జీతా లు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, డీజిల్ బిల్లులు చెల్లించలేక తల్లడిల్లుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు నగారా మోగింది. ఈసారైనా తమ ఊళ్లను మార్చేవాళ్లు రావాలని, తమ గ్రామాల భవిత మారాలని పల్లెజనం కోరుకుంటున్నారు. కనీస సౌకర్యాల లేక.. కుభీర్, సారంగాపూర్, మామడ, ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో అనేక గ్రామాలకు సరైన రోడ్లు లేకపోవడం, చాకిరేవు, మిద్దెచింతలో విద్యుత్ సరఫరా లేకుండా చీకటి బతుకులు కొనసాగుతున్నాయి. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాలు వంటి ప్రాథమిక వసతుల్లో చాలా పంచాయతీలు విఫలమవుతున్నాయి. మురుగునీరు రోడ్లపై పారడం, డ్రైనేజీల అస్తవ్యస్తత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. దాహం తీర్చని మిషన్ భగీరథ.. మిషన్ భగీరథ అమలైనా తాగునీరు సరఫరాలో లోపాలు కొనసాగుతున్నాయి. రంగుమారినీరు, అసమర్థ పైప్లైన్లు గ్రామాల్లో సమస్యలుగా మారాయి. కడెం మండలం బాబానాయక్తండా, ఇస్లాంపూర్లో మట్టిరోడ్లతో అత్యవసర సమయాల్లో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కొత్త కాలనీల సవాళ్లు.. పల్లెల్లో కుటుంబాలు పెరగడంతో కొత్త ఆబాదీలు ఏర్పడుతున్నాయి, కానీ డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు లేకుండా అభివృద్ధి ఆగిపోతోంది. పాత ఇళ్లలో ఇరుకు మార్గాలు, వేలాడే తీగలు కనిపించడం కొత్త నిర్మాణాలకు ముందస్తు చర్యల అవసరాన్ని తెలియజేస్తోంది. ఐదేళ్లలో మారాలి.. పంచాయతీ పాలకుల పదవీకాలం ముగిసి రెండేళ్లు దాటినా ప్రత్యేకాధికారుల పాలనలో పనులు నిలిచిపోయాయి. రానున్న ఎన్నికల్లో అవినీతి దూరం, గ్రామాభివృద్ధి ప్రాధాన్యతలు చూసే నాయకులు, యువకులు రావాలని పల్లె ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పారిశుద్ధ్యం, రవాణా, ఉపాధి అవకాశాలు, మినీ పరిశ్రమలు కల్పించేలా కృషి చేయాలని కోరుకుంటున్నారు పేండ్పల్లిలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రాదకరంగా ఉన్నాయి. దీంతో గ్రామస్తులు భయపడుతున్నారు. 4న ఆదిలాబాద్కు సీఎం రేవంత్రెడ్డికైలాస్నగర్: సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఖరారైంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భం పురస్కరించుకుని డిసెంబర్ 1నుంచి 9వరకు ప్రజాపాలన వారోత్సవాలు చేపట్టాలని ఇటీవల నిర్వహించిన కేబినేట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు సీఎం జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 4న ఆదిలాబాద్కు రానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేయనున్నారు. అలాగే పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి రానున్నందున బల్దియా అధికారులు స్థానిక ఎరోడ్రమ్ మైదానం వద్ద ఏర్పాట్ల పనులు షురూ చేశారు. -
మిర్చి సాగు.. సంక్షోభం!
తానూరు: మిర్చి పంటకు గతంలో లాభాలు దక్కకపోవడం, సమీప మార్కెట్ల లోపం, దళారుల చేతిలో తక్కువ ధరలు వంటివి జిల్లా రైతులను పత్తి, సోయాబీన్, మొక్కజొన్న వైపు మళ్లించాయి. అధికారుల సలహాలు, సాంకేతిక మార్గదర్శకత్వం లేకపోవడం సమస్యను తీవ్రతరం చేసింది. ఈ ఏడాది భారీ వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో పెట్టుబడులు కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపడం లేదు. జిల్లా వివరాలు.. జిల్లాలో ఈ ఏడాది 500 ఎకరాల్లో పచ్చిమిర్చి, 200 ఎకరాల్లో ఎండుమిర్చి సాగు చేస్తున్నారు. తానూరు, ముధోల్, కుభీర్, సారంగాపూర్, కుంటాల, లోకేశ్వ రం, సోన్, లక్ష్మణ్చాంద, భైంసా మండలాల్లో ఒక్కో రైతు 1–2 ఎకరాల్లో మాత్రమే పంట వేశారు. గతేడాది ఎకరానికి 6–8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి ఎకరాకు 5–6 క్వింటాళ్లు కూడా రాకపోవచ్చని అంచనా. వాతావరణ ప్రభావం.. వానాకాలం ప్రారంభం నుంచి కురిసిన అధిక వర్షాలు తెగుళ్లను పెంచి, పంటలు ఎండిపోయేలా చేశా యి. మందులు పనిచేయకపోవడంతో రైతులు నిరాశలో మునిగారు. ఈ పరిస్థితి పెట్టుబడులను వృథా చేస్తోంది. మార్కెట్, రవాణా ఇబ్బందులు భైంసా మార్కెట్ కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతులు మహారాష్ట్ర (ధర్మాబాద్, పర్భణి, పుణే, నాగపూర్), తెలంగాణ (ఖమ్మం) వరకు పంట తీసుకెళ్తున్నారు. క్వింటాల్కు రూ.1500 వరకు రవాణా, హమాలీ ఖర్చులు అవుతాయి. స్థానిక కొనుగోళ్లు, మార్కెట్ల ఏర్పాటు లేకపోవడం కూడా సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వం భైంసా, నిర్మల్ మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభించి, గిట్టుబాటు ధర కల్పించాలని, అధికారుల సలహాలు ఇస్తే మిర్చి సాగు మళ్లీ పుంజుకుంటుందని రైతులు పేర్కొంటున్నారు. -
ఇప్పటికీ కాలినడకనే..
మండల కేంద్రమైన కడెం నుంచి మా ఊరికి వెళ్లాలంటే ఉడుంపూర్ దాకా నడవాల్సిందే. అక్కడి నుంచి ఇంధన్పల్లిదాకా ఆటోలో వెళ్లి, మళ్లీ బస్సులేదా, ఆటోల కడెం వెళ్తాం. వర్షాకాలం అడవిలో నుంచి నడుస్తూ రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనీసం మా ఊరిదాకా రోడ్డయినా వేయాలని కోరుతున్నాం. –ఆత్రం మాణిక్రావు, మిద్దెచింత, మం.కడెం అభివృద్ధి చేసేవాళ్లు రావాలి.. సర్పంచ్గా ఎవరైనా పోటీచేయొచ్చు. కానీ.. గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్నవాళ్లే పాలకులు కావాలన్నది మా ఆకాంక్ష. ఊళ్లల్లో పెద్దగా చేయడానికి ఏం ఉండవు. కనీస సౌకర్యాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్పిస్తే సరిపోతుంది. – గీజ భోజన్న, ధర్మోరా, మం.లోకేశ్వరం సేవాదృక్పథంతో ఉండాలి.. గ్రామానికి సేవచేసే నాయకుడు సర్పంచ్గా ఉండాలి. ఊరికి ఏ సమస్య వచ్చినా నిలిచేవాడు కావాలి. ఎన్నికల్లో ఎవరు సర్పంచ్గా గెలిచినా ఏ సమస్యా లేకుండా మా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే మా కోరిక. – బొమ్మెన మధు, చామన్పెల్లి, మం.లక్ష్మణచాంద -
నిరవధిక దీక్ష విరమించిన రైతు
కుంటాల: సోయా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ కుంటాలకు చెందిన రైతు పడకంటి దత్తాద్రి చేపట్టిన నిరవధిక దీక్షను శుక్రవారం విమరించాడు. మూడు రోజులపాటు దీక్ష చేశారు. శుక్రవారం వైద్యురాలు శృతిరెడ్డి పరీక్షించగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని తహసీల్దార్ కమల్కు సూచించారు. దీక్ష విరమించాలని అధికారులు కోరినా స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విరమించేది లేదని దత్తాత్రి, రైతులు భీష్మించారు. దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సందర్శించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సోయా కొనుగోళ్లు జరిపేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, తహసీల్దార్ కమల్ సింగ్ దత్తాత్రికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అఖిలపక్ష నాయకులు కొత్తపల్లి బుచ్చన్న, సవ్వి అశోక్రెడ్డి, జుట్టు మహేందర్, ప్రవీణ్ కుమార్, మల్లేశ్, చంద్రకాంత్, వెంకటేశ్, జక్కుల గజేందర్, దిగంబర్ పటేల్, కిష్టయ్య, మగ్గిడి దిగంబర్, సబ్బిడి రాకేశ్, బోగ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆమరణ దీక్ష చేపట్టిన రైతు దత్తాత్రికి శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, పడకంటి రమాదేవి, రామ్ కిషన్రెడ్డి, దాసరి కిషన్, వంశీ, సుధాన్, తదితరులు సంఘీభావం తెలిపారు. -
జిల్లాస్థాయి చెకుముకి పరీక్ష
నిర్మల్ రూరల్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జేవీఎన్ఆర్ పాఠశాలలో జిల్లాస్థాయి చెకుముకి పరీక్ష శుక్రవారం నిర్వహించారు. పరీక్ష పత్రాలను జిల్లా సైన్స్ అధికారి వినోద్కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ మణికుమారి విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎస్వో మాట్లాడుతూ... ఇలాంటి పరీక్షలు భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలను ఎదుర్కోవడంలో సహాయపడతాయన్నారు. తార్కిక, హేతుబద్ధమైన అవగాహన పెరుగుతుందని తెలిపారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు నరసయ్య మాట్లాడుతూ.. సైన్స్ అనేది సత్యం అని సైన్స్ను సైన్స్ లాగానే చదివి అర్థం చేసుకోవాలన్నారు. పరీక్షలో మొత్తం 42 టీంలు పాల్గొన్నాయి. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఇందులో గౌరవ అధ్యక్షుడు ఆకుల సుదర్శన్, జిల్లా కన్వీనర్ నారాయణవర్మ, ఉపాధ్యాయులు వందన, నాగరాజు, నభి తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. చల్లగాలు లు వీస్తాయి. చలి ప్రభావం పెరుగుతుంది. తొలి విడత నామినేషన్లకు నేడే ఆఖరునిర్మల్చైన్గేట్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రెండోరోజు శుక్రవారం ఆరు మండలాల పరిధిలోని 1072 వార్డు స్థానాలకు, 136 సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 276 మంది వార్డు సభ్యులుగా, 188 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. శనివారం తొలి విడత నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. -
ఎన్నికల పరిశీలకురాలిని కలిసిన కలెక్టర్
నిర్మల్చైన్గేట్: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు పరిశీలకులుగా నియమి తులైన ఆయేషా మస్రత్ ఖానమ్ గురువారం జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ అటవీ శాఖ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందించారు. అనంతరం ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు చర్చించారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఉన్నారు. కలెక్టర్ను కలిసిన జిల్లా వ్యయ పరిశీలకుడు నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు వ్యయ పరిశీలకులుగా నియమితులైన సయ్యద్ సలావుద్దీన్ కలెక్టర్ అభిలాష అభినవ్ను గురువారం కలిశారు. పూల మొక్కను అందజేశారు. అనంతరం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఫిర్యాదులు ఉంటే నేరుగా సంప్రదించాలి దశల్లో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే ప్రజలు తమను నేరుగా సంప్రదించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని అటవీ శాఖ అతిథి గృహంలో తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఎన్నికలపై ఫిర్యాదులను ఇవ్వాలనుకున్నవారు నేరుగా లేదా 9959284786 నంబర్కు ఫోన్ చేసి అఇనా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. bservergpnirmal@gmail.com మెయిల్కు అయినా ఫిర్యాదులు పంపాలని సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
● సర్పంచ్కు 89, వార్డు మెంబర్కు 26 నామినేషన్లు దాఖలు ● ఈనెల 29న ముగియనున్న మొదటి విడత నామినేషన్ల స్వీకరణ
నిర్మల్చైన్గేట్: పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టమైన మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని ఆరు మండలాలలో మొదటి విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా తొలిరోజు 155 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ అభ్యర్థిత్వానికి 89, వార్డు మెంబర్లు కు 136 నామినేషన్లు వేశారు. ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరణ, 30 వరకు పరిశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు. 2న పరిష్కారం, 3న ఉపసంహరణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. మూడు పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానం మామడ/పెంబి: తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 115 నామినేషన్లు దాఖలాయ్యాయి. ఇక జిల్లాలోని మూడు పంచాయతీల్లో ఏకగ్రీవానికి తీర్మానం చేశారు. మామడ మండలం వాస్తపూర్, ఆరేపల్లి, పెంబి మండలం రాంనగర్ పంచాయతీల సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. వాస్తపూర్ సర్పంచ్గా రాంపూర్ గ్రామానికి చెందిన ఆడేం భూమబాయి, ఉపసర్పంచ్గా వాస్తపూర్ గ్రామానికి చెందిన పెందుర్ సంతోష్, 8 వార్డులను, ఆరేపల్లి సర్పంచ్గా జంగిలి మల్లయ్యను ఎన్నుకునేందుకు నిర్ణయించినట్లు గ్రామస్తులు తెలిపారు. పెంబి మండలం రాంనగర్ గ్రామానికి చెందిన ఆత్రం లింగు సర్పంచ్గా, భూక్య జ్యోతిరాంను ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుకోవాలని నిర్ణయించారు. వార్డు సభ్యుల స్థానాలకు వచ్చిన నామినేషన్లు.. మండలం దాఖలైన నామినేషన్లు దస్తురాబాద్ 3 కడెం 9 ఖానాపూర్ 7 పెంబి 0 మామడ 6 లక్ష్మణచాంద 1 -
కేజీబీవీల్లో ఉన్నత విద్యకు బాటలు
లక్ష్మణచాంద: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సుస్థిర విద్యను అందించే కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు బాలికలకు విద్యాబోధన చేస్తున్నారు. ఈ విద్యాసంస్థలు విద్యార్థులకు ఉండే వసతుల పరంగా ఆకర్షణీయంగా మారుతూ, ఉత్తమ విద్యా ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో బాలికల ఉన్నత చదువులకు ఇక్కడే బాటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని మూడు కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో నీట్, ఐఐటీ, క్లాట్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లాలో మూడు కేజీబీవీ కళాశాలలను ఎంపిక చేసింది. లక్ష్మణచాంద కేజీబీవీలో నీట్, దిలావార్పూర్ కేజీబీవీలో ఐఐటీ, నిర్మల్ రూరల్ కేజీబీవీలో క్లాట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. జూమ్ ఆధారిత శిక్షణ.. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జూమ్ ద్వారా నిత్యం ఆ శిక్షణ తరగతులు వినేందుకు సదుపాయాలు కల్పించారు. ఇది ఈ ప్రాతినిధ్య ప్రదేశంలో విద్యార్థులకి ఆధునిక విద్యను సులభంగా అందించేందుకు దోహదపడుతోంది. ప్రవేశ పరీక్షల కోసం నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ తరగతులు ఉంటాయని సెక్టోరియల్ అధికారి నవీన జ్యోతి వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో సమన్వయం జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న నిర్వహించిన సమావేశంలో నిపుణుల సహకారంతో తరగతులు ప్రారంభించే విషయాలను చర్చించడం జరిగింది. త్వరలో మరింత కార్యాచరణ చేపట్టి బహుముఖ అభివృద్ధికి దోహదపడనున్నారు. -
పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ
ఖానాపూర్/లక్ష్మణచాంద: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అధికారులను ఆదేశించారు. అధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఖానాపూర్, లక్ష్మణచాంద మండలాల్లోని సత్తనపల్లి, మస్కాపూర్, సుర్జాపూర్, వడ్యాల్ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలన్నారు. నిర్దేశించిన రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. హెల్ప్ డెస్క్లో సిబ్బంది అందుబాటులో ఉంటూ, అభ్యర్థులకు సమాచారం ఇవ్వడంలో సహాయపడాలన్నారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల 29వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు. వారివెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీపీవో శ్రీనివాస్, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధ ఉన్నారు. అధికారుల ఆకస్మిక తనిఖీలు.. ఖానాపూర్ మండలంలోని గోసంపల్లె, పాత ఎల్లాపూర్ నామినేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తనిఖీ చేశారు. జెడ్పీ సీఈవో గోవింద్ సత్తన్పల్లి నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మస్కాపూర్లో నామినేషన్ల ప్రక్రియను మండల ప్రత్యేక అధికారి జీవరత్నం తనిఖీ చేశారు. వారి వెంట తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీఓ రత్నాకర్ ఉన్నారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన కడెం: మండల కేంద్రంతోపాటు, కొండుకూర్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గురువారం పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బందికి సూచనలు చేశారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 22, వార్డు సభ్యుడి స్థానాలకు 8 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సునీత, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో జయదేవ్ ఉన్నారు. -
దొడ్డు వడ్ల సాగు
నిర్మల్‘నోటా’కు చోటు.. పల్లెపోరు హడావుడి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గుర్తులతోపాటు ‘నోటా’(నన్ ఆఫ్ ఎబో) ను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజింగ్ కమిషనర్గా ప్రశాంత్ నిర్మల్ఖిల్లా: ‘ది స్కౌట్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్’ జిల్లా కమిషనర్గా రాచకొండ ప్రశాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర స్కౌట్ అండ్ గైడ్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ అశోక్రాజ్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రశాంత్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన వారు. విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొదిస్తూ నే సామాజిక సేవపై అభిరుచి పెంచేందుకు ప్రయత్నిస్తానని ప్రశాంత్ తెలిపారు. భైంసా: జిల్లాలో ఈ యాసంగిలో వరి రైతులు దొడ్డు వడ్ల సాగుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో స న్నరకం వడ్లు క్వింటాల్కు ప్రభుత్వం రూ.500 బో నస్ ప్రకటించింది. అయితే ఈ బోనస్ గత యాసంగిలో సన్న వడ్లు విక్రయించిన రైతులకు రాలేదు. జిల్లావ్యాప్తంగా రూ. 12 కోట్ల మేర బోనస్ రావాల్సి ఉంది. యాసంగిలో వరి ధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాలుకు గ్రేడ్– ఏ రకానికి రూ.2,320, గ్రేడ్– బీ రకానికి రూ.2,300 ధర ఇచ్చారు. వానాకాలం వడ్లకు బోనస్.. ఈ వర్షాకాలం సాగుచేసిన వరి కోతలు మొదలయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.69 మద్దతు ధర పెంచింది. దీంతో ఈసీజన్లో క్వింటాలు వడ్లకు గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, గ్రేడ్–బీ రకానికి రూ.2,369 ధర ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్లో సన్నాలు విక్రయించిన రైతులకు వెనువెంటనే బోనస్ డబ్బులు క్వింటాల్కు రూ.500 చొప్పున జమవుతున్నాయి. యాసంగి వడ్లకు లేనట్లే.. వర్షాకాలం కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాల్లో రైతులంతా వరిధాన్యం విక్రయిస్తున్నారు. యాసంగి పంటలకు మడులు సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో రైతులంతా దొడ్డురకం సాగుచేయాలన్న ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వదని భావిస్తున్నారు. అందుకే సన్నాలు సాగు చేయడం కన్నా దొడ్డు వడ్లు వేస్తే తూకం బరువు వస్తాయని భావిస్తున్నారు. దిగుబడి తగ్గుతోంది... సన్నరకం ధాన్యం సాగుతో దిగుబడి తగ్గిపోతుంది. ఎకరానికి 16 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుంది. భారీ వర్షాలతో వరి రైతులు కూడా నష్టపోయారు. అదే దొడ్డురకం సాగు చేస్తే 25 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దొడ్డురకం వరి పంటను చీడపీడలు ఆశించవు. పంట కాలం తక్కువే. దీంతో రైతులంతా మళ్లీ దొడ్డురకమే సాగుచేయాలని ఆలోచనలో పడ్డారు. తొలిరోజు 115 నామినేషన్లుఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా ఖానాపూర్: ఎస్టీయూ(రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం)తోపాటు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పదవికి సిలివేరి లక్ష్మీనర్సయ్య రాజీనామా చేశారు. జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేసినా ముఖ్య నాయకులు, సభ్యులను సంప్రదించడం లేదన్నారు. ఇటీవల జిల్లా ఎన్నికలను సైతం అదే తరహాలో నిర్వహించారని పేర్కొన్నారు. జిల్లా బాధ్యులు సంఘాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలతో మనస్తాపం చెందిన సంఘం ప్రాథమిక సభ్యత్వంతోపాటు పదవికి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. -
ఇంగ్లిష్ ఒలింపియాడ్తో భాషపై పట్టు
నిర్మల్ రూరల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంగ్లిష్ ఒలింపియాడ్ ఎడ్యుకేట్ టాక్ పోటీలు భాషపై పట్టును మరింత పెంపొందిస్తాయని ఎల్టా అధ్యక్షుడు కొప్పుల వేణుగోపాలరావు, కార్యదర్శి అల్లూరి రామ్మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎల్టా ఆధ్వర్యంలో గురువారం మండలస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్ ఎడ్యుకెస్ట్ కాంపిటీషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇంగ్లిష్ భాషలో మరింత ప్రావీణ్యం సంపాదించేందుకు కోసం ఎల్టా కార్యక్రమాలను చేపడుతుందన్నారు. భాషపై భయాన్ని తొలగించడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహకురాలు ఫహమిదా ఖాతుమ్, రతన్ కులకర్ణి, ఇర్ఫాన్ షేక్, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. పోటీల విజేతలు వీరే.. సీనియర్ ఎడ్యుకేస్ట్ విభాగంలో ఎం.మధుప్రియ(జుమెరాత్పేట్ హైస్కూల్), జూనియర్ ఎడ్యుకేస్ట్ విభాగంలో అర్ఫియా అంజుమ్(సోమవార్పేట్ బాలికల పాఠశాల), సీనియర్ ఒలింపియాడ్లో జాఫ్రిన్ సనోబర్ (సోమవార్పేట్ బాలికల పాఠశాల), జూనియర్ ఒలింపియాడ్లో అయిట్ల నవ్య (జుమ్మెరాత్పేట్ హైస్కూల్) విజేతలుగా నిలిచారు. -
కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి
నిర్మల్చైన్గేట్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో నిర్మల్ జిల్లాస్థాయి సమీక్ష గురువా రం నిర్వహించారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు. గ్రామీణ రోడ్లు, పీఎం కిసాన్ నిధులు, మరుగుదొడ్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీధి దీపాలు, శ్మశాన వాటికల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు కేంద్రం నిధులతోనే కొనసాగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేస్తారన్నారు. నాయకులు రావుల రాంనాథ్, యాతలం చిన్నారెడ్డి, కరిపే విలాస్కుమార్, నల్లా రవీందర్రెడ్డి, ఉపాధ్యక్షులు రమేశ్, జిల్లా కార్యదర్శులు మాదిరే శ్రీనివాస్, పుష్పూర్ నర్సిరెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
కోడ్ అతిక్రమిస్తే కొరడా!
నిర్మల్టౌన్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో జిల్లాలో కోడ్ అమలులోకి వచ్చింది. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, 24 గంటలు వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 8 ఇంటర్ స్టేట్, 4 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు సరైన ఆధారాలు లేకుండా తీసుకెళ్లకూడదు. డిసెంబర్ 17 వరకు కోడ్ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా పర్యవేక్షణ మరోవైపు, సోషల్ మీడియా వైరల్ అయ్యే తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే వార్తలపై జిల్లా పోలీసు ఎజెన్సీలు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అవమానపరిచే, మార్పు రేపే ప్రచారాలకు కేసులు పెట్టేలా చర్యలు ఉంటాయి. అభ్యర్థులు నియమాలు పాటించాలి అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలు మాత్రమే ఉపయోగించాలి. ఊరేగింపులు, ర్యాలీలు కుల, మత ప్రాంతా వర్గ బేధాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు. లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలి. ప్రతీ వాహనానికి రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్ ఒరిజినల్ కాపీ ఉండాలి. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థి ఊరేగింపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధి వరకే ఉంటుంది. కార్యాలయంలోకి ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు అర్హులైన సహాయకులను మాత్రమే తీసుకెళ్లాలి. అభ్యర్థులు, పార్టీలు సహకరించాలి అభ్యర్థులు, పార్టీలు చట్టపరమైన నియమాలు పాటించి పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యటనలు, రాత్రి గస్తీలు పెంచాం. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు పోలీసులకు సహకరించాలి. ఏవైనా అనుమనాదస్పద కదలికలు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలి. –జానకీ షర్మిల, ఎస్పీ ఇంటర్ డిస్ట్రిక్ చెక్ పోస్టులు బాసర గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ ఖానాపూర్ బాదనకుర్తి చెక్ పోస్ట్ కడెం పాండవపూర్ చెక్ పోస్ట్ సోన్ గంజాల్ టోల్ ప్లాజా చెక్ పోస్ట్ జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు.. ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్లు సారంగాపూర్ రామ్సింగ్ తండా చెక్ పోస్ట్ కుభీర్ సిరిపెల్లి హెచ్, సేవాలాల్ తండా, డోడర్న తాండ చెక్ పోస్టులు కుంటాల దౌనెల్లి తండా చెక్ పోస్ట్ తానూర్ బెల్ తరోడ, జవుల– బి చెక్ పోస్ట్ బాసర బిద్రెల్లి చెక్ పోస్టు -
నానో యూరియానే మేలు
లక్ష్మణచాంద: నానో యూరియాను వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ సూచించారు. బుధవారం మండలంలోని పార్పెల్లి గ్రామంలో నానో యూరియాపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. ఎకరం మొక్కజొన్నకు నాలుగు బస్తాల యూరియాకు బదులు లీటర్ నానో యూరి యా వినియోగిస్తే సరిపోతుందని తెలిపారు. నానో యూరియాతో నేలలో కర్బనం పెరిగి సా రవంతంగా మారుతుందని పేర్కొన్నారు. సా గు ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందని తెలి పారు. ఏవో వసంత్రావు, ఏఈవోలు మౌనిక, పవిత్ర, సుష్మిత, రైతులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రతిష్ట పెంచేలా సహకరిస్తాం
● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్టౌన్: జిల్లా ప్రతిష్టను మరింత పెంచేందుకు పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జలసంచాయ్–జన భాగీదారీ అవార్డును కలెక్టర్ అభిలాష అభినవ్ ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో ఎస్పీ జానకీ షర్మిల కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించారు. జిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిశోర్కుమార్, ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్కు దూరంగా ఉండాలి
నిర్మల్టౌన్: ర్యాగింగ్కు పాల్పడి విద్యార్థులు బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ను నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. సీనియర్లు, జూనియర్లు అని కాకుండా సీనియర్లు జూనియర్లకు గైడ్లా వ్యవహరించాలని తెలిపారు. జూనియర్లకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సంజీవ్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్కు గిరిజనుల షాక్
కడెం: పులిమనుగడ కోసం ఉన్న ఊళ్లను ఖాళీ చేసిన రాంపూర్, మైసంసేట్ వాసుల పునరావాస కష్టాలు తీరడం లేదు. నేటికి సాగు భూమి పట్టాలు, సాగునీటి వసతి, భూమి చదును పనులు చేయలేదు. దీంతో పంటలు సాగు చేయడం లేదు. మరోవైపు పునరావాస ప్యాకేజీలో భాగంగా అందాల్సిన పరిహారం కోసం అధికారుల చూట్టూ తిరుగుతూనే ఉన్నారు. తమను పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర్మానం ఇవ్వం.. రాంపూర్, మైసంపేట్ వాసులను కవ్వాల్ టైగర్జోన్ కోర్ ఏరియా నుంచి గతేడాది తరలించారు. వీరికి కడెం మండలం కొత్తమద్దిపడగ సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేసి 94 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఈ ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్ రెండేళ్లపాటు నిర్వహణ చూడాలి, ఆ తర్వాతే కాంట్రాక్టర్కు పూర్తి బిల్లు విడుదల అవుతుంది. ఇళ్లు నాసిరకంగా నిర్మించారని మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్నా తమను పట్టించుకోకుండా మంగళవారం కాంట్రాక్టర్ తీర్మానం కోసం రావడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. సదరు కాంట్రాక్టర్కు రూ.కోటి బిల్లు పెండింగ్ ఉంది. పునరావాసకాలనీ కమిటీకి చెందిన 14 మంది సభ్యులు తీర్మానం ఇస్తే బిల్లు విడుదల అవుతుందని అధికారులు తెలిపారు. -
ఇంగ్లిష్ అభివృద్ధికి కృషి
నిర్మల్ రూరల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో ఇంగ్లిష్ భాష అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు కడార్ల రవీంద్ర, అధ్యక్షుడు కొప్పుల వేణుగోపాల్రావు, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సోమవారపేట్ బాలి కల ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన ఇంగ్లిష్ కాంప్లెక్స్ సమావేశంలో ఎల్టా నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ నైపుణ్యాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాంప్లెక్స్ సమావేశాల్లో భాషా నైపుణ్యాలపై ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్రావు, కోశాధికారి రతన్కుమార్, కాంప్లెక్స్ ఆర్పీలు ఇర్ఫాన్ షేక్, హరిహరనాథరావు, ప్రతాప్, సంజయ్, కాంప్లెక్స్ ఇన్చార్జి హెడ్ మాస్టర్ జాఫర్ మోహియొద్దీన్, శైలజ, ముత్తన్న పాల్గొన్నారు. -
భీమన్న గుట్టను కాపాడాలి
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో అన్యాక్రాంతం అవుతున్న భీమన్నగుట్టను అధికారులు కాపాడాలని ముదిరాజ్ కోర్ కమిటీ నాయకులు కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా భీమన్న గుట్టపై పండ్ల మొక్కలు పెంచుతూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. భీమన్న గుట్ట ముదిరాజుల ఆరాధ్య దైవమన్నారు. అలాంటి గుట్ట ఆక్రమణకు గురవుతోందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తక్షణమే అక్కడ జరుగుతున్న పనులు ఆపి, న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు యాటకారి సాయన్న, శైలేంద్ర శివయ్య, దినేశ్, హరీశ్, సైదు, జిల్లా ముదిరాజ్ కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి నామినేషన్లు..
నిర్మల్చైన్గేట్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. జిల్లాలోని 400 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ విడుదల.. జిల్లాలోని 18 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తిస్థాయి షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. గ్రామపంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా జరుగనున్నాయి. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. విడతలవారీగా షెడ్యూల్ ఇలా.. ఫేజ్–1లో ఎన్నికలు జరిగే మండలాలు... మండలం గ్రామాలు వార్డులు మొత్తం ఓటర్లు దస్తురాబాద్ 13 102 12,894 కడెం 29 242 29,159 ఖానాపూర్ 25 192 23,657 పెంబి 24 152 10,886 మామడ 27 222 26,072 లక్ష్మణచాంద 18 162 24,577 ఫేజ్–2లో ఎన్నికలు జరిగే మండలాలు... నిర్మల్ రూరల్ 20 170 22,751 సారంగాపూర్ 32 282 39,516 సోన్ 14 132 21,801 దిలావర్పూర్ 12 108 18,744 నర్సాపూర్(జి) 13 120 20,238 లోకేశ్వరం 25 224 29,359 కుంటాల 15 134 19,055 ఫేజ్–3లో ఎన్నికలు జరిగే మండలాలు... భైంసా 30 258 33,970 ముధోల్ 19 166 28,754 తానూర్ 32 268 31,516 బాసర 10 90 15,728 కుభీర్ 42 344 40,625షెడ్యూల్ ఇలా.. మొదటి దఫా.. నోటిఫికేషన్ నవంబర్ 27 నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27–29 వడపోత నవంబర్ 30 అభ్యంతరాలు డిసెంబర్ 1 నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 3 వ్యాల్యూడ్ నామినేషన్లు డిసెంబర్ 3 పోలింగ్ డిసెంబర్ 11 రెండో దఫా.. నోటిఫికేషన్ నవంబర్ 30 నామినేషన్ల స్వీకరణ నవంబర్ 30–డిసెంబర్ 2 వడపోత డిసెంబర్ 3 అభ్యంతరాలు డిసెంబర్ 4 నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 6 వ్యాల్యూడ్ నామినేషన్లు డిసెంబర్ 6 పోలింగ్ డిసెంబర్ 14 మూడో దఫా.. నోటిఫికేషన్ డిసెంబర్ 3 నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 3–5 వడపోత డిసెంబర్ 6 అభ్యంతరాలు డిసెంబర్ 7 నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 9 వ్యాల్యూడ్ నామినేషన్లు డిసెంబర్ 9 పోలింగ్ డిసెంబర్ 17 -
పీఎంశ్రీ పాఠశాలల్లో చెలిమి
లక్ష్మణచాంద: నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు సంకుచిత మనస్తత్వంతో ఉంటున్నారు. కంప్యూటర్తో పోటీపడుతున్న నేటి యుగంలో విద్యార్థులు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటున్నారు. చిన్నచిన్న విషయాలకు అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు దుఃఖం మిగుల్చుతున్నారు. సోషల్ మీడియా ప్రభావం, పాఠశాలల్లో విద్యాపరమైన ఒత్తిళ్లు, తల్లిదండ్రులకు ఒకరు ఇద్దరు పిల్లలు కావడంతో వారు అఽతి గారాబం చేయడం వంటి కారణాలతో పిల్లలు సున్నిత మనస్కులుగా మారుతున్నారు. ఇలాంటివారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర విద్యా శాఖ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా (పీఎంశ్రీ) పాఠశాలల్లో చెలిమి (సోషియో ఎమోషనల్ వెల్ బీయింగ్ ప్రోగాంకు శ్రీకారం చుడుతోంది. ప్రతీ పాఠశాల ఉపాధ్యాయుడుకి శిక్షణ.... జిల్లాలోని 20 పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రతీ పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని నోడల్ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేస్తున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 20 మంది ఉపాధ్యాయులను నోడల్ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తారు. వీరికి వచ్చే నెల(డిసెంబర్) 10–12 వరకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో విద్యార్థుల మనస్తత్వం, ప్రవర్తన, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో నేర్చుకున్న వివిధ అంశాలపై ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లిన తర్వాత మిగిలిన ఉపాధ్యాయులకు నేర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఉపాధ్యాయ బృందం అంతా కలిసి విద్యార్థుల్లో భావోద్వేగాల నియంత్రణకు చర్యలు చేపడతారు. విద్యార్థుల్లో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని అర్థం చేసుకుని విద్యార్థుల మనసుకు బాధ కలగకుండా సమస్యలు పరిష్కరించి ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించేలా విద్యార్థులను తయారు చేయనున్నారు. ప్రయోజనాలు ఇవీ.. విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో వారి మానసిక పరివర్తన ప్రధానమైనది. ప్రతీ రోజు జరుగుతున్న వివిధ రకాల సంఘటనలతో కేంద్ర విద్యాశాఖ చెలిమి అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలుచేకూరుతుంది. కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యారంగ నిపుణులు మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. విడతల వారీగా శిక్షణ... పీఎంశ్రీ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు డిసెంబర్ 10–12 వరకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ)లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 20 పీఎంశ్రీ పాఠశాలలకు దీనిపై సమాచారం అందించారు. శిక్షణకు పంపే ఒక్కో ఉపాధ్యాయుడి వివరాలు పంపాలని సూచించినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. -
కొంటారా.. కొనరా..?
కుంటాల: నైరుతిలో రుతుపవనాలు మురిపించడంతో జిల్లాలో సోయా రైతులు విత్తనాలు వేశారు. ఆపైన వర్షాల జాడ లేకపోవడంతో రెండోసారి విత్తారు. పూత, కాత దశకు చేరుకోగానే అధిక వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. ప్రస్తుతం చేతికి వచ్చిన పంట అమ్ముకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 1.05 లక్షల ఎకరాల్లో రైతులు సోయా సాగు చేశారు. నాణ్యత లేదని వాపస్.. జిల్లాలో రైతులు పండించిన పంట కొనేందుకు నాఫెడ్ , మార్క్ ఫేడ్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. చన్నీ ప ట్టి, నాణ్యతను పరిశీలించి అధికారులు తూకం వేశారు. వీటిని నిజామాబాద్ జిల్లాలోని బోధన్ సీడబ్ల్యూసీ గోదాంకు తరలించారు. అక్కడ అధికారులు నాణ్యతలేమి పేరుతో లోకేశ్వరం మండలానికి చెందిన 195, కుంటాల మండలానికి చెందిన 2 వేలు, ముధోల్ మండలానికి చెందిన 850, తానూరు మండలానికి చెందిన 700 సోయా బస్తాలను తిప్పి పంపించారు. ప్రైవేటు వ్యాపారులకు అమ్మకం.. జిల్లా వ్యాప్తంగా 8,42,653 క్వింటాళ్ల సోయా దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు ఇప్పటివరకు 60 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. బోధన్ నుంచి బస్తాలు తిరిగి రావడంతో పది రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ కు రూ.5,328 మద్దత ధర కల్పించగా, ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్ కు రూ.4,500 విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో క్వింటాల్కు సుమారు రూ.వెయ్యి నష్టపోతున్నారు. మంచి దిగుబడి వచ్చింది.. పది ఎకరాల్లో సోయా సాగు చేశా. 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోళ్లను నిలిపివేయడంతో ప్రైవేట్గా అమ్ముకున్న. క్వింటాల్ కు రూ.800 చొప్పున రూ.48 వేలు నష్టపోయా. – బల్లి హరీశ్, రైతు రెండు నెలలుగా నిరీక్షణ.. వర్షాలతో పంట దిగుబడి తగ్గింది. తోటి రైతుల తూకం వేసిన బస్తాలు తిరిగివచ్చాయి. అప్పటి నుంచి కొనుగోళ్లు లేవు. పంట చేతికి వచ్చి రెండు నెలలైంది. ఇప్పటికీ అమ్ముకోవడానికి నిరీక్షిస్తున్నాం. – సీపతి ముత్యం, రైతు త్వరలో కొనుగోళ్లు.. రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుంది. నాణ్యత పరిశీలించేందుకు ఇటీవల సర్వేయర్లు వచ్చారు. వారి నిర్ణయం తర్వాత రెండు, మూడు రోజుల్లో సోయా కొనుగోళ్లను చేపడతాం. – మహేశ్కుమార్, మార్క్ఫెడ్ డీఎం


