Nirmal District News
-
మొదటి స్థానంలో నిలవాలి
నిర్మల్టౌన్: ఇప్పటివరకు ఆదిలాబాద్ రీజియ న్లో నిర్మల్ డిపో మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్లో రాష్ట్రంలోనూ మొదటి స్థానంలో నిలువాలని ఆదిలాబాద్ ఇన్చార్జ్ రీజినల్ మేనేజర్ ప్రణీత్ ఆకాంక్షించారు. బుధవారం నిర్మల్ ఆర్టీసీ డిపోను డిప్యూటీ ఆర్ఎం శ్రీహర్షతో కలి సి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదాయ, వ్య యాల గురించి ఆరా తీశారు. కండక్టర్లు, డ్రైవర్ల పనితీరును పరిశీలించారు. పలు ఫైళ్లను తనిఖీ చేశారు. వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులకు అనుగుణంగా బ స్సులను సమయపాలనతో నడపాలని సూ చించారు. డిపో మేనేజర్ పండరి, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ‘భూభారతి’ అమలు
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● కుంటాలలో అధికారులతో సమీక్ష ● ముధోల్లో వ్యవసాయ క్షేత్రం పరిశీలన కుంటాల: భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దా ర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన స మీక్షా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు నోటీసు జారీ చేసి ఇరుపక్షాల సమక్షంలో పారదర్శకంగా విచారణ చేపట్టి స మస్యలు పరిష్కరించాలని సూచించారు. సమా వేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్లు కమల్సింగ్, ఎజాజ్ అహ్మద్ఖాన్, ప్రవీణ్కుమార్, డీటీ నరేశ్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. ‘మహా’జొన్నలు కొనుగోలు చేయొద్దు మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్నలను కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు అన్యాయం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. త్వరలో కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. కొనుగో ళ్లకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, డీసీవో పల్లె పాపారావు, త హసీల్దార్ కమల్సింగ్, పీఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, సీఏవో నాగభూషణం తదితరులున్నారు. పంట మార్పిడితో లాభాలు ముధోల్: మట్టి నమూనా పరీక్షలు చేయించుకుని పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని తరోడ గ్రామంలో రైతు హ ర్షియాబేగం సాగుచేస్తున్న సమీకృత వ్యవసాయ క్షే త్రాన్ని పరిశీలించారు. ఉపాధిహామీతోపాటు ఐకేపీ నుంచి తీసుకున్న రుణంతో వివిధ పంటలు, కూరగాయలు, పశువులు, చేపల పెంపకం చేపట్టడాన్ని అభినందించారు. కంపోస్టు ఎరువులను ఎక్కువగా వాడి తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు పొందాలని సూచించారు. చేపల పెంపకంతో ఉపాధి పొందడంతోపాటు భూగర్భ జలాలను పెంచవచ్చని పేర్కొన్నారు. రెండు గుంటల భూమిలో చేప ల పెంపకంతో ఏడాదికి రూ.4లక్షల ఆదాయం సంపాదించవచ్చని తెలిపారు. సమీకృత క్షేత్రంపై రైతులకు అవగాహన కల్పించారు. డీఆర్డీవో విజయలక్ష్మి, ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో శివకుమార్, ఏపీవో శిరీష, ఏపీఎం గురుచరణ్, ఉపాధిహామీ సిబ్బంది యోగేశ్, భాస్కర్రెడ్డి, సుశీల్, పోశెట్టి, సూర్యకాంత్, వందేమాతరం, వీవోఏ ఓమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో జాప్యంపై రైతుల రాస్తారోకో
● ఆర్డీవో హామీతో ఆందోళన విరమణకుంటాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తుండటంతో బుధవారం మండలంలోని అర్లి(కే) క్రాస్ రోడ్ వద్ద నిర్మల్–భైంసా 61 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. రెండురోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ధాన్యం తడుస్తోందని రైతులు వాపోయా రు. విషయం తెలుసుకున్న భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. రైతులు ఆర్డీవోకు సమస్య వివరించారు. రెండురోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని ఆర్డీవో హామీ ఇవ్వగా వారు శాంతించారు. గంటన్నరపాటు రాస్తారోకో చేయగా రో డ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. భైంసాటౌన్ సీఐ గోపీనాథ్, ఏఎస్సైలు దేవన్న, శంకర్, లింబాద్రి పరిస్థితిని చక్కదిద్దారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్ కొ మ్రే వార్, సోషల్ మీడియా ఇన్చార్జి పెంటవార్ దశరథ్, మండల కన్వీనర్లు పడకంటి దత్తాత్రి, కోర్వ శ్యామ్, అశోక్ రాథోడ్, రాజుర అనిల్, రజనీకాంత్, రావుల పోశెట్టి, అసడే సజన్, వంశీ హుస్సేన్, ఎ ర్రం తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ కేంద్రాల తనిఖీ
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న మండల స్థాయి శిక్షణ కేంద్రాలను బుధవారం జిల్లా విద్యాధికారి రా మారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రాథమిక తరగతులకు బోధించే ఉపాధ్యాయులు తమ బోధన తీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. శిక్షణకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. శిక్షణ కేంద్రాలను రాష్ట్ర బాధ్యుడు రామకృష్ణ పరిశీ లించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశా రు. ఎంఈవో వెంకటేశ్వర్, కోర్సు బాధ్యుడు గజ్జరామ్, డీఆర్పీలు పాల్గొన్నారు. -
భైంసా ఏరియాస్పత్రికి కార్పొరేట్ కళ
భైంసాటౌన్: భైంసా ప్రభుత్వ ఏరియాస్పత్రికి కా ర్పొరేట్ కళ సంతరించుకోనుంది. ఈ మేరకు తెలంగాణ వైద్యవిధాన పరిషత్ బ్రాండింగ్ పథకానికి ఈ ఆస్పత్రిని ఎంపిక చేసింది. తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రిలో మౌలిక వ సతులు, సుందరీకరణ, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్, టీఎస్ఎంఐడీసీ ఇంజినీరింగ్ విభా గం అధికారులు ఏరియాస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, ఆర్ఎంవో కై లాస్పతితో చర్చించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. భైంసా ఏరియాస్పత్రిలో అవసరమైన మౌలిక వసతులు, సుందరీకరణ, పార్కింగ్, ఓపీ, ఐపీ బ్యూటిఫికేషన్, ఫైర్సేఫ్టీ, గార్డెనింగ్ తదితర పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ వి భాగం అధికారులు రూపొందించిన నివేదికను టీవీ వీపీ కమిషనర్కు అందిస్తామన్నారు. ఆపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపడతామని చెప్పారు. -
23న తిరంగా ర్యాలీ
నిర్మల్చైన్గేట్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా మన దేశ సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తిరంగా ర్యాలీ జిల్లా కన్వీనర్ మేడిసమ్మె రాజు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ర్యాలీ అంబేడ్కర్ చౌక్ నుంచి వివేక్ చౌక్కు చేరుకుంటుందని తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాలవారు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాట్లాడుతున్న నాయకులు -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
రాజీవ్గాంధీకి నివాళి మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాతావరణం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముంది. పుష్కరఘాట్లపై మట్టి కుప్పలుబాసరలోని గోదావరి పుష్కరఘాట్లు అపరిశు భ్రంగా మారాయి. వాటిపైనున్న మట్టికుప్పల తో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ● కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వరి ధాన్యం ● కొన్నిచోట్ల కొట్టుకుపోయిన వ డ్లు ● నేలవాలిన వరి, నువ్వు చేన్లు ● అవస్థలకు గురైన అన్నదాతలు గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 20258లోu లోకేశ్వరం/లక్ష్మణచాంద/కుంటాల/భైంసాటౌన్/భైంసారూరల్/మామడ/ఖానాపూర్/పెంబి/ దస్తురాబాద్/తానూరు: జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం రైతుల వరి ధాన్యాన్ని తడిపేసింది. రైతులు రాత్రిపూట ధాన్యం తడ వకుండా ఉండేందుకు నానా తిప్పలు పడ్డారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తూకంలో జాప్యం కారణంగానే ధాన్యం తడిసినట్లు రైతులు ఆరోపించడం గమనార్హం. లోకేశ్వరం మండలం జోహర్ఫూర్, అబ్దుల్లాపూర్, రాయపూర్కాండ్లీ, ధ ర్మోరా, పంచగుడి, పిప్రి, వట్టోలి, గడ్చాంద, రా జూర, అర్లి, గొడిసెరా, నగర్ తదితర గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, మె రుపులతో కురిసిన వర్షానికి వరి, నువ్వు చేన్లు నేలవాలాయి. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. లక్ష్మణచాంద మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి వరి, నువ్వు ధాన్యం తడిసింది. కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. లక్ష్మణచాంద మండలంలో బుధవారం సా యంత్రం కురిసిన కుండపోత వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. కుంటాల మండలంలోనూ బుధవారం వేకువజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. అప్రమత్తమైన రైతులు కల్లాల వద్దకు పరుగులు పెట్టి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పారు. బుధవారం ఉదయం కురిసిన వర్షానికి భైంసా మండలంలోని దేగాం, ఇలేగాం, కామోల్, కుంసర, వానల్పాడ్, మహాగాం తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు అవస్థలు పడ్డారు. వాలేగాం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. భైంసా పట్టణంలోనూ భారీ వర్షం కురిసింది. మామడ మండలం పొన్కల్, మామడ, కొరిటికల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న, రైతులు సంచుల్లో నింపుకొన్న ధాన్యం తడిసింది. తానూరు మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఖానాపూర్ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యం వరదనీటికి కొట్టుకుపోయింది. ఖానాపూర్ పట్టణంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురియగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. శివాజీనగర్, బస్టాండ్ ఏరియాలో వరదనీరు డ్రైనేజీల నుంచి రోడ్లపై వరదలా పారింది. దీంతో పట్టణవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్, తాంశా, కౌట్ల(కే) చించోలి, ముజ్జిగాలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. పెంబి మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి, నువ్వు పంటలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. కొన్ని చోట్ల వడ్లు వరద ఉధృతికి కోట్టుకుపోయాయి. మండలంలోని మందపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవకుండా ఎస్సై హన్మాండ్లు రైతులతో కలిసి కుప్పలపై టార్పాలిన్లు కప్పి సాయపడ్డారు. దస్తురాబాద్ మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా సంబంధిత సిబ్బంది పునరుద్ధరించారు. మొత్తంగా అకా ల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. -
‘ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు సరికాదు’
జైపూర్: జైపూర్ మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతిపై మాదిగ హక్కుల దండోరా నాయకులు చేసిన అసత్యపు, నిరాధారమైన ఆరోపణలు ఖండిస్తున్నామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాన్గెజిటెడ్ ఉద్యోగుల సంఘం మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి సతీశ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై కక్షపూరితంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతి, సభ్యులు రవిచందర్, శ్రీనివాస్, ప్రశాంత్, సత్యనారాయణ, సురేశ్, ఉదేయ్కుమార్, స్వామి, అపర్ణదేవి, రజిత, విజయ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు. -
విత్తనాలు కొంటున్నారా?
● జాగ్రత్తలు తప్పనిసరిచెన్నూర్రూరల్: మరికొద్ది రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభమవుతోంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలులో రైతులు బిజీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమతులు లేని కంపెనీలకు చెందిన విత్తనాలు, కల్తీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని వివరాలు పరిశీలించాకే కొనుగోలు చేయాలి. అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలని చెన్నూర్ ఏవో యామిని సూచించారు. లైసెన్స్ లేని దుకాణాలు, దళారుల వద్ద ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకూడదు. సరుకు, లాట్ నంబర్, తయారీ, తేదీ, రకం ఇలా అన్ని వివరాలు ఉండి సంతకం చేసిన బిల్లును విక్రయదారు (షాపు) నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. సంచులపై సీల్ తీసినట్లు లేదా విప్పదీసి తిరిగి కుట్లు వేసినట్లు కనిపిస్తే తీసుకోకూడదు. వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన డీలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల నుంచి మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలి. క్రిమిసంహారక మందుల డబ్బాలపై కంపెనీ పేరు, తేదీ, కాలపరిమితి, గమనించి రసీదులు తీసుకోవాలి. ఏది ఎంత ధరతో కొన్నా.. డీలర్ లేదా దుకాణాదారు సంతకంతో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి. మీరు తీసుకున్న విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు నకిలీవని అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. అలాగే లాట్ నంబర్, తయారీ తేదీలను తప్పనిసరిగా చూసుకోవాలి. లేదంటే గతేడాది విత్తనాలు, మందులు, ఎరువులు అంటకడతారు. రైతులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి కాలం చెల్లిన మందులు, ఎరువులు, విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. అలాగే మందు డబ్బాలపై ఆకుపచ్చని లేబుల్ ఉందో లేదో గమనించాలి. ఆకుపచ్చ లేబుల్ ఉంటేనే ఆ మందును కొనుగోలు చేయాలి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలు విషయంలో రైతులు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించి నాణ్యమైన దిగుబడులు పొందాలి. -
పుష్కర ఘాట్లపై మట్టికుప్పలు
● బాసరలో భక్తులకు తప్పని అవస్థలుబాసర: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతీ అమ్మవారు కొలువైన బాసర గో దావరిన ది పుష్కరఘాట్ల వద్ద పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి పుష్కర ఘాట్ నుంచి రెండో పుష్కరఘాట్ వరకు గోదావరి నీటి ప్రవాహం తగ్గడంతో పుష్కరఘాట్లపై నల్లమట్టి పెద్దపెద్ద కుప్పలుగా పే రుకుపోయింది. బాసర సరస్వతీ అమ్మవారి సన్ని ధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దక్షిణాది రా ష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ముందుగా పవిత్ర గోదావరినదిలో పుణ్య స్నానం ఆచరించడం పుణ్యఫలంగా భావిస్తారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనంతో గోదావరి ఘాట్ తీరమంతా అస్తవ్యస్తంగా మారింది. బురద, చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. బాసర ప్రధాన స్నానఘాట్ పైభాగంలో గంగమ్మ విగ్రహం, ఘాట్ కిందిభా గం మెట్ల వద్ద శివలింగం ఉంది. ఇక్కడ అనేక ఏళ్లుగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల పారిశుద్ధ్య నిర్వహణ గాలి కొదిలేయడంతో శివలింగం కళ తప్పుతోంది. ఎంట్రన్స్లోనే పుష్కర ఘాట్లు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. కలుషిత నీటిలోనే స్నానాలు మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో పుట్టిన గోదారమ్మ బాసర వద్ద చదువులమపాదాలను తాకి తెలుగురాష్ట్రాల్లోకి అడుగిడుతుంది. ఎగువన భారీ వర్షాలు కురిసినపుడు వచ్చే వరదలతో ఘాట్లు పరిశుభ్రమవుతున్నాయే తప్ప అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. గత పుష్కరాల సమయంలో రూ.10 కోట్లు వెచ్చించి నిర్మించిన ఘాట్లు అధ్వానంగా మారిపోయాయి. ఫలితంగా పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. అంతేకాకుండా గోదావరినదిలో నీళ్లు కూడా కలుషితం అయ్యాయి. ఆలయ అధి కారులు భక్తుల సౌకర్యార్థం షవర్స్ ఏర్పాటు చేసినా కొంతమంది భక్తులు కలుషిత నీటిలోనే స్నా నాలు చేస్తున్నారు. ఇప్పటికై నా దేవాదాయశాఖ అధి కారులు స్పందించి పుష్కరఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు. -
యూత్ కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ
మంచిర్యాలటౌన్: సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా అవమానించడాన్ని నిరసిస్తూ బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వర్గీయులు బూతులు తిడుతూ అడ్డుకున్నారని ఎంపీ వర్గీయులు తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా వినకుండా తమను అడ్డుకోవడం సరికాదని యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, ఆసంపల్లి శ్రీకాంత్ అన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పున్నం, సృజన్, మాయ తిరుపతి, దాసరి సంపత్, శ్రీశైలం, అరుణ్, రాజేశ్, వెంకటేశ్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
జైనథ్ : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద బుధవారం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై గౌతమ్ తెలిపారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్నగర్కాలనీకి చెందిన సాహీల్, ముషీర్ గంజాయి విక్రయిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసి 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేకాడుతున్న 13 మంది..నేరడిగొండ: పేకాడుతున్న 13 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది తో కలిసి వెళ్లి మండల కేంద్రంలోని నీలిమ దా బా వెనకాల దాడులు నిర్వహించి పేకాడుతు న్న 13 మందిని పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి పేక ముక్కలతో పా టు రూ.14,080 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సయ్యద్ జహీర్, గడ్డం రవి చందర్రెడ్డి, గూడూరు లవకుమార్, రాథోడ్ రవీందర్, అల్లూరి శివారెడ్డి, ఉప్పు పోశెట్టి, సోలంకి శ్రీనివాస్, నల్ల అడెల్లు, సోలంకి కరన్ సింగ్, గోతి గులాబ్ సింగ్, మాడ గంగాధర్, అల్లూరి శ్రీనివాస్ రెడ్డి, పవార్ సంతోష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. టపాసులతో ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిపై కేసుఆదిలాబాద్టౌన్: అర్ధరాత్రి టపాసులు పేల్చి జనాలను ఇబ్బందికి గురిచేసిన వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. వడ్డెర కాలనీకి చెందిన చోట ముష్రఫ్ తన జన్మదినం సందర్భంగా ఇంటి ముందు, బిల్డింగ్పై బాణసంచాలు పేల్చాడు. దీంతో చుట్టుపక్కల వారు ఇబ్బందులకు గురయ్యారు. ఓ ఇంటిపై వేసిన ప్లాస్టిక్ కవర్కు నిప్పు అంటుకోవడంతో కొంత భాగం కాలిపోయింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. ఐదుగురిపై.. ఆదిలాబాద్రూరల్: మండలంలోని చాందా (టి) శివారు ప్రాంతం మీదుగా ఎలాంటి డా క్యుమెంట్లు లేకుండా వాహనంలో రెండు ఎ డ్లను తరలిస్తున్న రాథోడ్ నితిన్, షేక్ సాకీర్పై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి ష్ణు వర్ధన్ తెలిపారు. అలాగే వాహనాన్ని అడ్డుకుని బెదిరింపులకు గురి చేసిన చాందా (టి) గ్రామానికి చెందిన ముగ్గురు యువకులపై రాథోడ్ నితిన్, షేక్ సాకీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దాడి చేసిన వ్యక్తులపై.. ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని పండ్ల వాపారిపై దాడికి పాల్పడిన షన్ను, మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో తోపుడు బండ్లపై షేక్ షహెబాజ్ పండ్లు విక్రయిస్తున్నాడు. ఎద్దు వచ్చి పండ్లను తింటుండగా అతను ఎద్దును కొట్టడంతో షన్నుకు తగిలింది. దీంతో ఆయన ద్విచక్ర వాహనం దెబ్బతింది. ఇందుకు రూ.2వేలు ఇవ్వాలని అడిగాడు. తనవద్ద లేవని చెప్పడంతో తన మిత్రులను పిలిచి షహెబాజ్పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
సోలార్ ప్లాంట్ పనులపై సమీక్ష
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సింగరేణి నూతనంగా ఏర్పాటు చేస్తున్న 67.5 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ పనులపై ఏరియా జీఎం ఆఫీస్ ఆవరణలోని కాన్ఫ్రెన్స్ హాల్లో సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ బుధవారం ఏరియా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏరియా జీఎం దేవేందర్తో పాటు అధికారులను అడిగి పనుల అభివృద్ధిని తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జీఎం (ఈఅండ్ఎం) సోలార్ ఎనర్జీ జీఎస్ జానకీరామ్, ఎస్వో టూ జీఎం విజ య్ప్రసాద్, ఏరియా ఇంజనీర్ (ఈఅండ్ఎం) వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ శ్యామ్సుందర్, కేకే గ్రూపు ఏజెంట్ రాంబాబు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఐఈడీ రాజన్న పాల్గొన్నారు. -
టోల్ ట్యాక్స్ నిలిపివేయాలని ధర్నా
చెన్నూర్రూరల్: కిష్టంపేట సమీపంలోని వైజంక్షన్ వద్ద టోల్ ట్యాక్స్ నిలిపి వేయాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో టోల్గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ట్యాక్స్ పేరుతో దోపిడీకి గురిచేస్తున్నారన్నారు. అటవీశాఖలో ఎక్కడా ఈ టాక్స్లు వసూలు చేయడం లేదన్నారు. కాళేశ్వరంలో పుష్కరాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ట్యాక్స్ వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తుల సమ్మయ్య, రాపర్తి వెంకటేశ్వర్గౌడ్, బుర్ర రాజశేఖర్గౌడ్, తుమ్మ శ్రీపాల్, తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ఫిల్టర్ చేసే బోట్ సీజ్
జైనథ్: పెన్గంగ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యాపారి అభిలాష్రెడ్డితో పాటు సాంగ్వి గ్రామ వీడీసీ సభ్యులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు పెన్గంగ నది శివారులోని సాంగ్వి గ్రామం వద్ద ఎస్సై గౌతమ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉల్లాస్, సిబ్బందితో కలిసి దాడు లు నిర్వహించినట్లు తెలిపారు. ఇసుకను ఫిల్టర్ చేసే బోట్ను సీజ్ చేసినట్లు పేర్కొ న్నారు. వారిపై ఇసుక దొంగత నం, పీడీపీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. -
విదేశీ పర్యటనకు ఏవో
● మంత్రులు, ఐఏఎస్లతో కలిసి వెళ్లనున్న విశ్వనాథ్ ● బెల్లంపల్లికి చెందిన హార్టికల్చర్ అధికారి కూడా..ఆదిలాబాద్టౌన్: వ్యవసాయ శాఖ ద్వారా విదేశాల్లో అధ్యయనం కోసం ఆ శాఖ మంత్రి, ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాన్ని పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎం.రఘునందన్రావు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కె.సురేంద్ర మోహన్, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏవో గా పనిచేస్తున్న విశ్వనాథ్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఉద్యానవన అధికారి జె. అర్చన ఎంపికయ్యారు. వీరు నెదర్లాండ్, ఫ్రాన్స్లోని ప్యారీస్ లలో పర్యటించనున్నారు. జూ న్ 10 నుంచి 15 వరకు కొనసాగే పర్యటనలో ఆ దేశాల్లో వ్యవసాయం, ఉద్యానవన పంటల సాగు స్థితిగతులు, దిగుబడులు సాధించేందుకు అనుసరి స్తున్న విధానాలు, నూతన వంగడాల సృష్టికి అవలంభిస్తున్న పద్ధతులు వంటి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. మూడు రోజుల చొప్పున ఆయా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్ర బృందంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు ఉండటంతో ఇక్కడి రైతులకు సాగుపరంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇద్దరు యువకుల బైండోవర్
నిర్మల్రూరల్: గంజాయి విక్రయిస్తున్నారన్న అనుమానంతో జిల్లా కేంద్రంలో ఇద్దరు యువకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. గుండంపెళ్లి గ్రామానికి చెందిన సత్యపోలు యోగేష్, భైంసా పట్టణం పురాణ బజార్కు చెందిన షేక్ కై ఫ్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద ఎలాంటి గంజాయి లభించలేదు. కానీ భవిష్యత్లో గంజాయి సేవించడం లేదా విక్రయిస్తారన్న అనుమానంతో వారిద్దరిని రూరల్ తహసీల్దార్ సంతోష్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
భైంసాలో ఘనంగా తిరంగా ర్యాలీ
భైంసాటౌన్: ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా పట్టణంలో పలు కులసంఘా ల ఆధ్వర్యంలో మంగళవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పద్మావతి కాలనీలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ర్యాలీని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుల సంఘాలు, హిందూ సంఘాల నాయకులు, యువకులు, చిన్నారులు జాతీయజెండాలు చేతపట్టి ర్యాలీ లో పాల్గొన్నారు. దారి పొడువునా భారత్మాతాకీజై, సైనిక అమరవీరులకు జై నినాదాలతో హోరెత్తించారు. కుభీర్ చౌరస్తా నుంచి గాంధీగంజ్ మీదుగా, బస్టాండ్ ఎదురుగాగల అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జాతీయగీతాలాపన చేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. భారత త్రివిధ దళాల ధైర్య సాహసాలను స్మరించుకునేలా కుల, మత, రాజకీయాలకు అతీతంగా పాల్గొనడం హర్షణీయమన్నారు. యాత్రలో పట్టణానికి చెందిన వైద్యులు, న్యా యవాదులు, వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికులు, యువకులు, మహిళలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: జిల్లాలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పర్యావరణానికి ప్లాస్టిక్ హానికరంగా మారుతోందని, మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాల సహకారంతో కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. పంచాయతీ స్థాయిలో ప్లాస్టిక్ నిషేధానికి అనుగుణంగా తీర్మానాలు చేయాలన్నారు. కలెక్టరేట్లో ఇప్పటికే స్టీల్ బాటిళ్లు వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు, వ్యాపార లైసెన్సులను రద్దు చేయడం సహా చట్టపరమైన చర్యలకు వెనకాడొద్దని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జూట్, పేపర్ సంచుల తయారీ కేంద్రాలను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాలని, దోమల నియంత్రణకు ఫాగింగ్ యంత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవోలు రత్నాకళ్యాణి, కోమల్రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, రాజేశ్కుమార్, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
గ్రామ పాలనకు కొత్త ఊపిరి
● జీపీవోల నియామక ప్రక్రియ వేగవంతం.. ● ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి ● జిల్లా నుంచి 100 మంది విద్యార్హతల నివేదిక ● ఈనెల 25న రాత పరీక్షకు ఏర్పాట్లు ● త్వరల్లో విధుల్లోకి గ్రామ పాలన అధికారులునిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రా మ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలన అధికారి (జీపీవో) నియామక ప్ర క్రియను వేగవంతం చేసింది. ఈ నెల 25న జీపీవోల ఎంపికకు అర్హత పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఒక పరీక్ష కేంద్రాన్ని గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి జీపీవోలను ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోంది. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలకు ప్రాధాన్యం.. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, జీపీవో పోస్టుల కోసం ఆన్లైన్లో 151 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కొన్నింటిని తిరస్కరించారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారు, ఇంటర్తోపాటు ఐదేళ్ల సర్వీసు ఉన్నవారికి ఆమోదం లభించింది. జిల్లా నుంచి 63 మంది వీఆర్వోలు, 80 మంది వీఆర్ఏలు, 8 మంది ఇతరులు దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు, 430 రెవె న్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతీ రెవెన్యూ గ్రా మానికి ఒక జీపీవోను నియమించనున్నారు. గ్రామీణ భూసమస్యలపై అవగాహన ఉన్న పూ ర్వ వీఆర్వో, వీఆర్ఏలను జీపీవోలుగా ఎంపిక చేస్తున్నారు. వీరు భూభారతి చట్టం అమలు బా ధ్యతలు నిర్వహించడంలో కీలకం కానున్నారు. సర్వీసుపై అస్పష్టత.. 2022లో వీఆర్వో వ్యవస్థను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి వరకు పనిచేస్తున్నవారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. చాలా మంది ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిని స్వస్థల జిల్లాలకు తిరిగి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. గత డిసెంబర్లో ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించగా, గతనెల 26 వరకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించారు. డిగ్రీ, ఇంటర్ అర్హత ఉన్నవారికి స్క్రీనింగ్ పరీక్ష రాయాలని స్పష్టం చేశారు. అయితే, సర్వీసు విషయంలో స్పష్టత లేకపోవడంతో కేవలం 151 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వివరాలు మొత్తం మండలాలు 18 గ్రామపంచాయతీలు 400 జీపీవోలుగా దరఖాస్తు చేసుకున్నవారు 151 ఆమోదం పొందినవి 100 తిరస్కరించినవి 51 వీఆర్వోలు 63 ఆమోదించినవి 51 తిరస్కరించినవి 12 వీఆర్ఏ 80 ఆమోదించినవి 49 తిరస్కరించినవి 31 ఇతరులు 8 ఆమోదించినవి 0 తిరస్కరించినవి 8 -
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
నిర్మల్టౌన్: జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసులు సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివాదాలు రాజీపడే క్రిమినల్ కేసులు, పెండింగ్లో ఉన్న మోటార్ కేసులు, పెట్టి కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు కక్షిదారులందరికీ సమాచారం అందించి రాజీ పడేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఇందులో నిర్మల్ ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్, రాజేశ్మీనా, జిల్లాలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ కనిపిస్తే కాల్ చేయండి జిల్లాలో మత్తు పదార్థాలు ఎవరైనా విక్రయిస్తే పోలీ సులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జానకీషర్మిల మంగళవారం కోరారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసినా, విక్రయించినా 8712659599 నంబర్కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. -
నిలిచిన ధాన్యం తరలింపు
ఖానాపూర్: మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం తరలింపు ప్రక్రియ మూడు రోజులుగా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన లారీలను ఉన్నతాధికారులు రైస్మిల్లులకు ట్యాగ్ చేయకపోవడంతో ధాన్యం తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. వాతా వరణంలో మార్పుల కారణంగా ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా, ఖానాపూర్లో నూ వర్షం కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. హమాలీలు, గన్నీ సంచుల కొరతతో ధాన్యం కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయి. తూకంలో కోతపై ఆందోళన.. ఖానాపూర్: మండలంలోని రాజురా గ్రామంలో ఖానాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు క్వింటాల్కు 10 కిలోలు కోతకు అంగీకరిస్తేనే తూకం వేస్తామని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై రాజురా ఎక్స్రోడ్ వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మామడ పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడించారు. నిరసనలో రాజురా, బావాపూర్(ఆర్), చందునాయక్తండా తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ గెలల కోత షురూ..
లోకేశ్వరం: మండలంలోని పంచగుడి గ్రామంలోని ఆలూర్ శ్రీనివాస్రెడ్డి ఆయిల్పామ్ తో టలో మొదటి గెలల కోతను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయిల్పామ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇద్దరు రైతులకు కొనుగోలు కేంద్రం ఐడీ కార్డులు అందజేశారు. ఆయిల్పాం టన్ను ధర ప్రస్తుతం రూ.21 వేలు ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి రమణ, ప్రియూనిక్ ఇండియా కంపెనీ డీజీఎం మల్లేశ్వర్రావు, భైంసా మార్కెట్ కమిటీ చెర్మన్ ఆనంద్రావు పటేల్, పీఏసీఎస్ చెర్మన్ రత్నకర్రావు, బీజేపీ మండల కన్వీనర్ సాయన్న, ఆయిల్పామ్ ఏరియా మేనేజర్ శేఖర్ పాల్గొన్నారు. కోత ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్ -
‘గిరి’ రైతులకు చేయూత
● పోడు భూముల్లో సాగుకు సర్కారు తోడ్పాటు ● ‘ఇందిర సౌర జల వికాసం’తో ముందడుగు ● ఉమ్మడి జిల్లాలో పలువురికి చేకూరనున్న లబ్ధి ● డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఈ వారంలో ప్రారంభం ఉమ్మడి జిల్లాలో గిరి తెగల జనాభా.. (2011 జనాభా లెక్కల ప్రకారం) గోండు : 2,63,515 లంబాడా : 1,12,793 కొలాం : 38,176 కోయ, ఇతరులు : 30,739 పర్దాన్ : 26,029 మన్నెవార్ : 15,370 నాయక్పోడ్ : 5,206 తోటి : 2,231 ఎరుకల : 1,735 మొత్తం జనాభా : 4,95,794 పోడు భూముల వివరాలు.. విస్తీర్ణం : 2,12,256 ఎకరాలు రైతుల సంఖ్య : 66,839 పట్టాల జారీ సంఖ్య : 66,839 సాక్షి, ఆదిలాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి కుటుంబ ఆదాయం రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఇందిర సౌర గిరి జలవికాసం అనే ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ పథకాన్ని ఈ వారంలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ఈమేరకు లబ్ధి చేకూరనుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక మంది గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం కింద పోడు వ్యవసాయం చేసుకునేందుకు భూ యాజమాన్య హ క్కును కల్పించింది. ఆ భూముల్లో రాబోయే ఐదేళ్లల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రస్తుతం సర్కా రు నిర్ణయించింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. లబ్ధి ఇలా.. పోడు భూముల్లో వంద శాతం సబ్సిడీతో సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. తద్వారా ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చి గిరి రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో బోరుబావుల స్థానంలో చేతిబావులు తవ్వించాలని ఐటీడీఏ నిర్ణయించింది. దీనికి ఇందిర సౌరజల వికాస పథకం ద్వారా సౌర పలకలు బిగించనున్నారు. అర్హులు వీరు.. అటవీ హక్కు చట్టం కింద జారీ చేయబడిన భూ యాజమాన్యం హక్కు కలిగిన ప్రతీ గిరిజన రైతును అర్హులుగా నిర్ణయించారు. సదరు రైతుకు రెండున్న ర ఎకరాలు(హెక్టారు), అంతకంటే ఎక్కువ ఉంటే ఒక యూనిట్గా మాత్రమే మంజూరు చేస్తారు. అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నట్లయితే సరిహద్దులో గల ఇద్దరి నుంచి ఐదుగురిని గ్రూప్గా ఏర్పా టు చేసి యూనిట్గా మంజూరు చేయనున్నారు. అభివృద్ధి పనులు ఇవి.. ● ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు. ● ఉపాధిహామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ● ఈ భూముల్లో భూగర్భ, నీటి సర్వే చేపట్టి రైతుకు లబ్ధి చేకూరేలా చేతిబావులు తవ్విస్తారు. ● 5 హెచ్పీ, 7.5 హెచ్పీ సోలార్ పంపుసెట్లు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. ● వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, యాంత్రీకరణకు సహకారం అందించనున్నారు. ● ఉద్యానవన శాఖ ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయనున్నారు. శాఖల సమన్వయం.. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నారు. డిప్యూటీ సీఎం రానున్నారు.. ఇందిర సౌరజల గిరి వికాస పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఈ వారం ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వేదికను ఖరారు చేస్తున్నాం. జిల్లాలో ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనేది పథకం ప్రారంభించిన తర్వాత స్పష్టం అవుతుంది. – ఖుష్బూ గుప్తా, పీవో, ఉట్నూర్ ఐటీడీఏ -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
● ఆర్జేడీ సత్యనారాయణరెడ్డినిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులలో నమ్మకం పెంచాలని వరంగ ల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. రెండో విడత ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంగళవారం పరిశీలించారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా కాలానికి అనుగుణంగా బోధనా విధానం మార్చుకోవాలని సూచించారు. ప్రతీ ఉపాధ్యాయుడికి శిక్షణ లక్ష్యాలు తెలిసి ఉండాలన్నారు. అకాడమిక్ మానిటరింగ్ అధికారి నరసయ్య, జిల్లా ప్రణాళిక సమన్వయకర్తలు రాజేశ్వర్, లింబాద్రి, డీఆర్పీలు పాల్గొన్నారు. ఆరోగ్య మెలకువలు నేర్పాలి.. వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతీరోజు విద్యార్థులకు ఆరోగ్య మెలకువలు నేర్పాలని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కత్తి కిరణ్ అన్నారు. విజయ హైస్కూల్లో నిర్వహిస్తున్న వ్యాయామ ఉపాధ్యా య శిక్షణ శిబిరంలో మాట్లాడారు. విద్యార్థులతో రోజూ ఆసనాలు వేయించాలన్నారు. సరైన క్రమంలో వ్యాయామం చేయకపోతే జరిగే అనర్థాలను వివరించారు. అధికారులు ప్రవీణ్ కుమార్, శ్రీని వాస్, భూమన్న, జమున, అన్నపూర్ణ పాల్గొన్నారు. -
వన్యప్రాణులను సంరక్షించాలి
● అటవీ శాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్నిర్మల్ టౌన్: వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని అటవీ శాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో వైల్డ్ లైఫ్ ఫండ్ ఎన్జీవో ఆధ్వర్యంలో ‘వన్యప్రాణుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర ’అను అంశంపై సోమవారం శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా శర్వాణన్ మాట్లాడుతూ.. వన్య ప్రాణులను సంరక్షిస్తే ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని కాపాడినవారమవుతామని తెలిపారు. జిల్లా ఆటవీశాఖ అధికారి నాగిని భాను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు హర్షవర్ధన్, రాజు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
అహల్యబాయి హోల్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ నిర్మల్చైన్గేట్: రాణి అహల్యబాయి హోల్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకను పట్టణంలోని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పార్టీ శాఖ ఆదేశాల మేరకు జిల్లా వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ మొఘలుల కాలంలో ధ్వంసమైన హిందూ దేవాలయాలను పరిరక్షణకు రాణి అహల్యబాయి హోల్కర్ కృషి చేశారన్నారు. ఆమె హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి, హిందువులను సంఘటితం చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, కార్యక్రమ జిల్లా కన్వీనర్ అలివేలు మంగ, రాష్ట్ర నాయకురాలు ఆడె లలిత, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వైద్య రజిని, ముధోల్ కన్వీనర్ సీరం సుష్మారెడ్డి, ఖానాపూర్ కన్వీనర్ సత్యవతి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి పాల్గొన్నారు. -
ధరణి తప్పు.. భూభారతి సరిచేసేనా?
లక్ష్మణచాంంద: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2020 అక్టోబరు 24న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టింది. అయితే, ఈ పోర్టల్ అమలుతో లక్ష్మణచాంద మండలంలోని న్యూకంజర్, పొట్టపల్లి (బి), పొట్టపల్లి (కే) గ్రామాల రైతుల భూములు అసైన్డ్ భూములుగా పోర్టల్లో నమోదు చేశారు. ఈ మూడు గ్రామాల రైతులకు జారీ చేసిన పట్టా పాస్బుక్లలో భూములు అసైన్డ్గా నమోద అయ్యాయి. దీంతో ఐదేళ్లుగా ఈ మూడు గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమస్య రైతులను ఆర్థిక, మానసిక ఒత్తిడిలోకి నెట్టింది. భూ భారతితో రైతుల్లో ఆశలు.. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ధరణి పోర్టల్ను రద్దు చేసి భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ నూతన పోర్టల్తో రైతుల భూమి సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశలు మూడు గ్రామాల రైతుల్లో చిగురించాయి. రైతులు తమ భూముల క్రయవిక్రయాలకు వెసులుబాటు వస్తుందని ఆశిస్తున్నారు. పరిష్కారానికి మంత్రి హామీ.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈనెల 17న కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు వచ్చారు. దీంతో న్యూకంజర్ రైతుల సమస్యను డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ను ఆదేశించారు. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. పట్టా భూములను అసైన్డ్గా నమోదు.. ఐదేళ్లుగా క్రయ విక్రయాలు జరగని వైనం.. అవసరానికి అమ్ముకోలేక అన్నదాత అవస్థలు.. కొత్త చట్టంలో మూడు గ్రామాల రైతుల్లో చిగురిస్తున్న ఆశలుఐదేళ్లుగా ఇబ్బంది.. ధరణి పోర్టల్ చేసిన తప్పుకు ఐదేళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. మా ఊరి భూములన్నీ ధరణిలో అసైన్డ్గా నమోదయ్యాయి. అసైన్డ్ భూములు విక్రయించే అవకాశం లేకపోవడంతో భూమి ఉన్నా.. అత్యసర పరిస్థితిలో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నాం. సమస్య పరిష్కారం కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం. భూభారతి చట్టం రాకతో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. – ముద్దం మోహన్ రెడ్డి, న్యూ కంజర్ రైతు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు మండలంలోని న్యూకంజర్, పొట్టపల్లి(బి), పొట్టపల్లి(కె) గ్రామాలకు చెందిన 628 సర్వే నంబర్ల భూ సమస్యను గతంలోనే ఉన్నతాధికారులకు, కలెక్టర్కు సీసీఎల్ఏ కమిషనర్కు నివేదించాం. అయితే సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – జానకి, తహసీల్దార్, లక్ష్మణచాందఈ రైతు పేరు మాస్తా సాయన్న. లక్ష్మణచాంద మండలం న్యూ కంజర్ గ్రామానికి చెందిన ఈ యువరైతుకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2020లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో సాయన్న పట్టాభూమి మొత్తం అసైన్డ్ భూమిగా నమోదు అయింది. అప్పటి నుండి తన భూమిని అవసరానికి అమ్మలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్య ఈ ఒక్క రైతుదే కాదు న్యూకంజర్ గ్రామంలోని రైతులదీ ఇదే పరిస్థితి.ఓ రైతు పహణీలో అసైన్డ్గా నమోదు(వృత్తంలో..)ఐదేళ్లుగా నిరీక్షణ.. ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన 2020 నుంచి ఈ మూడు గ్రామాల రైతులు సమస్య పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామస్థాయి అధికారుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు, ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నతాధికారుల వరకు రైతులు తమ ఆవేదన చెప్పుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మండలంలో న్యూకంజర్కు చెందిన 465, పొట్టపల్లి (బి)కి 123, పొట్టపల్లి(కె)కు 40 సర్వే నంబర్లు మొత్తం 628 సర్వే నంబర్ల భూముల అసైన్డ్ గానే నమోదయ్యాయి. దీంతో క్రయవిక్రయాలు ఆగిపోయాయి. కొందరు రైతులు పిల్లల పెళ్లిళ్ల కోసం భూములు అమ్మగా, రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కొనుగోలుదారులకు ఇచ్చిన డబ్బులను అప్పుగా పత్రాలు రాయించుకున్నారు. -
ప్రజల‘వాణి’ విని.. భరోసా కల్పించి..
● గ్రీవెన్స్ కు 71 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్ అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు అందించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రైతు రుణమాఫీ, వైద్యం, విద్య, వ్యవసాయం, భూ వివాదాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించి మొత్తం 71 దరఖాస్తులు అందాయి. ఇక టెలిఫోన్ ప్రజావాణికి విశేష స్పందన లభించింది. ఫోన్ ద్వారా వచ్చిన అర్జీలను నమోదు చేసి, వాట్సాప్లో రశీదు పంపించారు. అనంతరం కలెక్టర్ శాఖలవారీగా సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయడంతోపాటు, ఫైళ్లలో స్పష్టమైన రిమార్కులు నమోదు చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని, మండల ప్రత్యేకాధికారులు మండలస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతుల పరిశీలన, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరిక పెంచే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతుల ఆవేదన.. కౌట్ల గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ మందగించిందని, ఇప్పటివరకు కేవలం ఐదు లారీల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని గ్రామ రైతులు కలెక్టర్కు విన్నవించారు. తూకంలో ఆలస్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నామని తెలిపారు. డీసీఎంఎస్ ద్వారా మరో కేంద్రం ఏర్పాటు చేసి, కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం.. నర్సాపూర్(జి) మండలంలో మూడేళ్ల క్రితం నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇళ్లు పర్యవేక్షణ లోపంతో శిథిలమవుతున్నాయని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అక్రమ పట్టా రద్దు చేయాలి.. నిర్మల్లోని శాస్త్రినగర్లో 541 సర్వే నంబర్లో 6.21 భూమి కలదు. 541/3 సర్వే నంబర్ లో నా భార్య పాకాల స్వప్న పేరుమీద ఎకరం భూమి ఉంది. ఒక వ్యక్తి 541/4/హెచ్ సర్వే నంబర్ పేరుతో మూడు ఎకరాలు అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. ఇదే విషయం ఆర్డీవో, తహసీల్దార్కు 20 సార్లు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమ పట్టా రద్దు చేయాలి. – పాకాల చంద్రశేఖర్, నిర్మల్ నిధులు దుర్వినియోగంపై చర్య తీసుకోవాలి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు తమ కుటుంబ సభ్యుల పేరిట వాహనాలు కొని వాటిని అద్దెకు తీసుకుని నెలకు రూ.33 వేలు ప్రభుత్వం నుంచి పొందుతున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం.వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడమే కాకుండా, అవినీతికి కూడా తావిస్తోంది. ఇలాంటివారిపై చర్య తీసుకోవాలి. – హైదర్, ఆమ్ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు -
మా భూమి మాకే కేటాయించాలి..
మేము కుంటాల మండలం పెంచికల్పాడు గ్రామస్తులం. 2019లో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్లకు దరఖాస్తు చేసుకుంటే సొంత భూమి ఉంటేనే నిర్మాణ పనులు చేపడతామని చెప్పడంతో మా సొంత ఖర్చులతో సర్వే నంబర్ 269/అ 1 లో 2196/2019 రిజిస్ట్రేషన్ ప్రకారం 0.29 గుంటల భూమి కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇచ్చాం. అప్పుడు ప్రభుత్వం అందరికీ భూమి కేటాయించి 20 ఇండ్లు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. కాంట్రాక్టర్ పిల్లర్ల దశ వరకు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సొమ్ము కాంట్రాక్టర్ కు గిట్టుబాటు కాదు అని మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. భూమి కోసం ఒక్కొక్కరం రూ.3 లక్షలు ఇచ్చాం. భూమిని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేశాం. ఆ భూమి కొన్నది మేమే కాబట్టి మాకే కేటాయించాలి. పట్టాలు ఇవ్వాలి. – డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు, పెంచికల్పడ్ -
‘తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలపై కఠిన చర్యలు’
నిర్మల్చైన్గేట్: తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. పథకాల లబ్ధి కోసం కొందరు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటిని అరికట్టేందుకు రెవెన్యూ, పోలీసు శాఖలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామ, వార్డు స్థాయిలో తనిఖీలు చేపట్టి పత్రాలు జారీ చేసిన అధికారులు, వాటిని వినియోగించి లబ్ధి పొందినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాక్సింగ్లో ప్రతిభ నిర్మల్టౌన్: ఉమ్మడి జిల్లా బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. మంచిర్యాలలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 12 బాలుర విభాగంలో ఆరవ్, నిహాల్, బాలి కల విభాగంలో సహస్ర గోల్డ్ మెడల్ సాధించారు. జ్యోత్స్న కాంస్య పతకం సాధించింది. అండర్–14 బాలుర విభాగంలో ధృవ బంగా రు, దినేష్ వెండి పతకాలు సాధించగా, అండర్–17 బాలికల విభాగంలో నిఖిత, శ్రావణి గోల్డ్, అక్షిత సిల్వ ర్, కీర్తన, అభినయ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వీరు ఈనెల 24 నుంచి 26 వరకు మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులను జిల్లా బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి అభినందించారు. పోడు సమస్య పరిష్కరించండి కడెం: పట్టాలు లేని పోడు భూముల సమస్య పరిష్కరించాలని మండలంలోని పాండ్వపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు కోరారు. కలెక్టర్ అభిలాష అభినవ్కు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుకు సోమవారం వినతిపత్రాలు అందించారు. పోడు రైతులకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ కలెక్టరేట్లో మాట్లాడారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను స్వాధీనం చేసుకుంటామని అటవీశాఖ ప్రకటించడం సరికాదన్నారు. వెంటనే ఈ ప్రక్రియ నిలిపివేయాలని కోరారు. ఇందులో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దావనపల్లి శేఖర్, తుమ్మల ప్రతాప్, బండి లచ్చన్న, కోండ్ర ఆనంద్, పిన్నం గోపి, కానుగంటి మల్లేశ్, మహేశ్, సురేశ్, లచ్చన్న పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి ఆత్మ కమిటీలు
నిర్మల్చైన్గేట్: రైతుల సంక్షేమం కోసం ఆత్మ కమిటీలు పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్గా రామ్రెడ్డి, 27 మంది డైరెక్టర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా శ్రీహరిరావు హాజరై మాట్లాడారు. రైతులకు ఆధునిక పద్ధతుల గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆత్మ కమిటీపై ఉందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మద్దతు ధరపై రూ.500 బోనస్ వంటి పథకాలు రైతుల జీవితాలను మెరుగుపరుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పార్టీని బలోపేతం చేయాలి
బూత్స్థాయి నుంచి నిర్మల్చైన్గేట్: కాంగ్రెస్ పార్టీని బూత్స్థాయి నుంచి బలోపేతం చేయాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భవాని అన్నారు. జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు అలకలాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ జిల్లాలోని 90,026 బూత్లలో కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. మారుమూల గ్రామల్లో సైతం కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నిర్మల్, కడెం, ఖానాపూర్ తదితర మండలాల్లో బూత్ కమిటీలు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో మిగతా కమిటీలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ను నిర్మాణం చేస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అపర్ణ, కార్యదర్శి మౌనిక, జిల్లా నాయకులు సుశీల, వసంత, సంగీత, నుస్రత్ బేగం పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భవాని -
చలో.. చెన్నూర్!
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయం. అగస్త్య మహాముని నడయాడిన నేల. కోటి లింగాలకు నెలవు.● ఇప్పటికీ పాతనేస్తాలకు ప్రాధాన్యం.. ● రేడియో, టేప్ రికార్డర్, బ్లాక్అండ్వైట్ టీవీల వినియోగం ● ఆహ్లాదంగా ఆత్మీయంగా బంధాన్ని కొనసాగిస్తూ.. ● అభిరుచిని ఆస్వాదిస్తున్న పలువురు జిల్లావాసులు..రేడియోతో ఐదు దశాబ్దాల బంధం.. కుంటాల మండలానికి చెందిన వృద్ధ దంపతులు అరిగెల లక్ష్మీబాయి–గజ్జరాం 50 ఏళ్లుగా రేడియోతో తమ రోజువారీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. దుబాయ్ నుంచి బంధువులు తెచ్చిన ఈ రేడియోలో ఇప్పటికీ వార్తలు, భక్తి గీతాలు, కథలు వింటారు. వ్యవసాయ కూలీలైన వీరు ఆధునిక గాడ్జెట్లకు దూరంగా ఉంటారు. -
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్రూరల్:ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను శనివారం పరిశీలించి మాట్లాడారు. ప్రతీ ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు విజేతలుగా మారుతారని తెలిపారు. బోధనా నైపుణ్యాలు మెరుగుపడితే పఠన, లెక్కింపు, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాలు విద్యార్థుల్లో పెరుగుతాయని పేర్కొన్నారు. పాఠశాల దశ నుండే విద్యార్థుల్లో లక్ష్య నిర్ధారణ అలవాటు చేయాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన బోధన పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలన్నారు. శిక్షణ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో రామారావు, అధికారులు వి.నర్సయ్య, లింబాద్రి, డీఆర్పీలు, జిల్లా ఉపాధ్యాయ శిక్షణ నిపుణులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి కూడా శిక్షణ తరగతులను పరిశీలించారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన డీఆర్పీలను సన్మానించారు. -
నిర్మల్
1990 దశకంలో రేడియో, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, టేప్ రికార్డర్లతో కూడిన ఆహ్లాదకరమైన సాయంత్రాలు ప్రతీ ఇంటిని ఆనందంతో నింపాయి. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వినోదాన్ని వ్యక్తిగతం చేశాయి. అయితే ఈ స్మార్ట్ కాలంలోనూ జిల్లాకు చెందిన కొందరు ఈ పాత అలవాట్లను, సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రేడియోలో పల్లె సీమ, జానపద గీతాలు, టేప్ రికార్డర్లోపాటలు, సంప్రదాయ వేషధారణలతో వారు గత కాలపు మధుర స్మృతులను సజీవంగా ఉంచుతున్నారు. – నిర్మల్ఖిల్లాఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలినిర్మల్చైన్గేట్:తరతరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలను ఆ భూముల నుంచి వెళ్లగొట్టకుండా భూములకు హక్కు పత్రాలు అందించాలని సీసీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. సీసీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అల్లంపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి, ఏవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తరతరాలుగా ఆదివాసులు, గిరిజనులు, ఇతర పేదలు అడవుల్లో జీవిస్తూ అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. 2006 అటవీ హక్కుల చట్టం వచ్చి, భూములు సర్వే జరిగినా, ఇప్పటికీ హక్కు పత్రాలు అందలేదన్నారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని పేర్కొన్నారు. రుణాలు, రుణమాఫీలు, బ్యాంకు లోన్లు, లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు ఖానాపూర్, కడెం మండలాల పరిధిలోని పేదలను బెదిరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కె.సర్దార్, ఎం.హరిత, అల్లంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. న్యూస్రీల్ -
ఆత్మీయత చాటుకున్న అదనపు కలెక్టర్
నిర్మల్ఖిల్లా:సాధారణంగా ఐఏఎస్ అధికారి అంటేనే ఉన్నత ఉద్యోగం. తన వద్ద పనిచేసే ఓ చిరుద్యోగి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటే ఆ చిరుద్యోగికి కలిగే ఆనందమే వేరు. సరిగ్గా అలాంటి ఆనందమే అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తన వద్ద డ్రైవర్గా పనిచేసే మహమ్మద్ ఆరిఫ్కు అందించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మహమ్మద్ ఆరిఫ్–యాస్మిన్ పర్వీన్ దంపతులకు శనివారం ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ఫైజాన్ అహ్మద్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి ఆరిఫ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లీబిడ్డల యోగక్షేమాలు తెలుసుకున్నారు. శిశువును కాసేపు ఎత్తుకున్నారు. దీంతో ఆ డ్రైవర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. -
పుస్తకాల గోదాంను పరిశీలించిన ఆర్జేడీ..
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాంను ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి శని వారం పరిశీలించారు. జిల్లాకు వచ్చిన పుస్తకా ల సంఖ్య రావాల్సిన సంఖ్య, ఇప్పటివరకు పంపిణీ చేసిన పుస్తకాల వివరాలు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ షెడ్యూల్ ప్రకారం ఆయా పాఠశాలలకు పుస్తకాలను సక్రమంగా అందజేయాలని సూచించారు. ఆయన వెంట డీఈవో రామారావు గోదాం మేనేజర్ భానుమూర్తి, ఉపాధ్యాయులు ఉన్నారు. కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలకు డీఈవో రామారావు పాఠ్యపుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, సోన్, కుబీర్ మండలాల ఎస్ఓలకు అందజేశారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను అందజేశారు. మిగతా కేజీబీవీలకు మరో రెండు రోజుల్లో పుస్తకాలు అందజేస్తామని డీఈవో తెలిపారు. పొట్టపెల్లి(కె)లో ముగిసిన ధాన్య కొనుగోళ్లులక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కె) గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. గ్రామంలో మొదటిసారి యాసంగిలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. శనివారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయని సెంటర్ నిర్వాహకురాలు మమత తెలిపారు. 128 మంది రైతుల నుంచి 12,151 బస్తాల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ ధాన్యాన్ని 16 లారీలలో మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. రైతుల సహకారంతో ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు పూర్తి చేశామని తెలిపారు. రైతుల వివరాలు ఆన్లైన్ చేస్తున్నామని, చెల్లింపులు కూడా రెండు రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. -
‘కడెం’ ముంపు నివారణకు చర్యలు
● ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ అర్వింద్కుమార్ ● ప్రాజెక్టును సందర్శించిన అధికారుల బృందంకడెం:నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా పటిష్ట చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం కడెం ప్రాజెక్టును అధికారులతో కలిసి సందర్శించారు. గేట్ల పనితీరు, వరద నియంత్రణ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ దామోదర్సింగ్, కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ప్రాజెక్టు వద్ద జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. గతంలో రెండుసార్లు వర్షకాల సీజన్లో వరద గేట్లు మొరాయించడంతో ప్రాజెక్ట్ డేంజర్జోన్లో వెళ్లిన పరిస్థితిని కలెక్టర్ సీఎస్కు వివరించారు. దీనిపై స్పందించిన అర్వింద్కుమార్ అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కడెం, దస్తురాబాద్ మండలాల్లో వరద ముంపునకు గురయ్యే 10 నుంచి 12 గ్రామాల్లో మెరుగైన అలారం వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్షాలు అధికంగా కురిసినప్పుడు వరద నీటిని సమర్ధవంతంగా నియంత్రించేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వహణ తీరును పరిశీలించి ఇరిగేషన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎస్ఈ రవీందర్, ఈఈ విఠల్, డీఈ నవీన్, తహసీల్దార్లు ప్రభాకర్, సర్ఫరాజ్, ఎంపీడీవో అరుణ తదితరులు ఉన్నారు. వరదల నివారణకు శాశ్వత చర్యలు నిర్మల్చైన్గేట్:ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, విపత్తు నిర్వహణ విభాగం డిప్యూటీ కమాండెంట్ దామోదర్సింగ్తో కలిసి శనివారం కాలనీలో పర్యటించారు. కాలనీవాసులతో ముఖాముఖిగా మాట్లాడి వరదలతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. అధిక వర్షపాతం కారణంగా వరద ముప్పు తలెత్తుతుందని, పరీవాహక ప్రాంతాల్లో నిర్మించిన చెక్డ్యామ్ వల్ల నీటి ప్రవాహం వరదనీరు కాలనీలోకి చేరుతుందని కలెక్టర్ తెలిపారు. చెక్డ్యామ్ ఎత్తు తగ్గించేందుకు అనుమతులు లభించాయని, తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గతంలో సంభవించిన వరదల తీవ్రతను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా అధికారులకు వివరించారు. అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి స్థానిక ఫారెస్ట్ గెస్ట్హౌస్లో కలెక్టర్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ రాజు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సృజనాత్మకతకు పదును..
కస్తూరిబా పాఠశాలల విద్యార్థినుల్లో సృజనాత్మకత పెంచే లక్ష్యంతో ఈసారి ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నారాయణ హోటల్లో రేడియో రాగాలు.. 9లోu లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి గ్రామంలో నాగుల నారాయణ నడిపే హోటల్లో 25 ఏళ్లుగా రేడియో కార్యక్రమాలు శ్రోతలను ఆకర్షిస్తున్నాయి. టీ తాగడానికి వచ్చే గ్రామస్తులకు వార్తలు, జానపద గీతాలు వినిపిస్తూ, ఈ అలవాటును వారిలోనూ పెంపొందిస్తున్నాడు. -
‘చెర’ విడిపించండి అమాత్యా..!
● శిఖంలో పంటలు సాగు.. ● పట్టణాల్లో ‘రియల్’ ప్లాట్లు.. ● చెరువుల సమీపంలోనే ఇటుక బట్టీలు.. ● నేడు జిల్లాకు రెవెన్యూ మంత్రి ‘పొంగులేటి’ రాక భైంసా: నిర్మల్ జిల్లాకు చెరువుల జిల్లాగా గుర్తింపు ఉంది. అయితే ఇటీవల ఆక్రమణలు, నిర్వహణ లోపంతో ఈ చెరువులు కనుమరుగవుతున్నాయి. జిల్లాలోని 803 చెరువులు 47,000 ఎకరాలకు సాగునీరు అందించగా, అక్రమ ఆక్రమణలు, పూడిక పెరుగుదల వల్ల వీటి విస్తీర్ణం తగ్గుతోంది. భూ భారతి చట్టం అమలులో ఉన్నప్పటికీ, సర్వేలు, జీపీఎస్ అనుసంధానం లేకపోవడంతో ఆక్రమణలు అడ్డుకట్టలేకపోతున్నాయి. సిరాల ప్రాజెక్టు దుస్థితి1901లో నైజాం కాలంలో భైంసా మండలంలో సిరాల వద్ద 320.19 ఎకరాల్లో నిర్మితమైన సిరాల ప్రాజెక్టు, 7 గ్రామాల్లో 4 వేల ఎకరాలకు సాగునీ రు అందించేది. 2004 వరకు ముధోల్ నియోజకవర్గంలో ఇది ప్రధాన ప్రాజెక్టుగా ఉండేది. గతరెండేళ్లలో భారీ వర్షాలతో ఈ చెరువు తెగిపోయింది. 54 ఎకరాల శిఖం భూములు కబ్జా చేయబడి, అక్రమంగా పట్టాలతో పంటలు సాగవుతున్నాయి. ఇతర చెరువుల ఆక్రమణ1994లో మాంజ్రి సమీపంలో 70 ఎకరాల్లో, 2014 లో సిరాల శివారులో 73 ఎకరాల్లో నిర్మించిన చెరువులు ఆక్రమణలతో కనుమరుగయ్యాయి. కామోల్లోని పోచమ్మ చెరువు (82.30 ఎకరాలు), 180 ఎకరాల పెద్ద చెరువు, సుంక్లిలో 30 ఎకరాల చెరువులో 20 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. రియాల్టర్లు, నాయకులు, అధికారుల కుమ్మక్కుతో నిర్మల్, భైంసా పట్టణాల్లో చెరువులు, బఫర్ జోన్లు ప్లాట్లుగా మారుతున్నాయి. ఇలా చెబుతూ పోతే జిల్లా వ్యాప్తంగా చెరువులన్ని కబ్జాలకు గురవుతున్నాయి. ఈ చెరువులను ఎవరు పట్టించుకోవడంలేదు. జిల్లా కేంద్రమైన నిర్మల్లోనూ రియాల్టర్లు, నాయకులు, అధికారులు కుమ్మకై ్క చెరువులు, కుంటలను సైతం ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. భైంసా – బాసర, భైంసా – నిర్మల్, నిర్మల్ – సోన్, సారంగాపూర్, నర్సాపూర్, కుంటాల, లోకేశ్వరం, ముధోల్, తానూరు ఇలా అన్ని మండల కేంద్రాల్లోనూ చెరువులు, శిఖం భూములు, బఫర్జోన్లు ఆక్రమించి ప్లాట్లుగా మార్చి నిర్మాణాలుచేపడుతున్నారు. ఈ పరిస్థితిని ఎవరు నిలువరించడం లేదు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో చెరువులను కాపాడేందుకు జీపీఎస్తో సర్వేలు నిర్వహించి, హద్దులు గుర్తించాలి. ఆక్రమణలను అరికట్టడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది జరిగితే భూగర్భ జలాలు పెరిగి, సాగునీటి ఇబ్బందులు తీరుతాయని రైతులు కోరుతున్నారు. -
పార్టీని బలోపేతం చేయాలి
నిర్మల్చైన్గేట్: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్గౌడ్ సూచించారు. నిర్మల్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అధ్యక్షతన స్థానిక రాజరాజేశ్వర గార్డెన్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్గౌడ్ మా ట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు. పనిచేసే వారికే పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. పార్టీ పరంగా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావా లని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ పర్యవేక్షకులు అవేజ్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు, కార్యక్తలు పాల్గొన్నారు. -
కల్లాల్లోనే వడ్లు!
ఈ రైతుపేరు చిన్నయ్య. లక్ష్మణచాంద మండలానికి చెందిన ఈ రైతు పది రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాడు. మాయిశ్చర్ వచ్చినా తూకం వేయకపోవడంతో కేంద్రంలోనే నిరీక్షిస్తున్నాడు. అధికారులు త్వరగా ధాన్యం తూకం వేయాలని వేడుకుంటున్నాడు. ఈ రైతుపేరు సంతోష్. ఖానాపూర్ మండలం ఎర్వచింతల్కు చెందిన సంతోష్ ధాన్యం తూకంలో నిర్వాహకులు దోపిడీకి పాల్పడ్డారు. 40 కిలోల బస్తాకు 43 కిలో లు తూకం వేశారు. దీంతో స్థానిక రైతులతో కలిసి ఆందోళనకు దిగాడు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. 15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేస్తాం.. జిల్లాలో యాసంగిలో ధాన్య కొనుగోలు లక్ష్యం1,62,414 మెట్రిక్ టన్నులు. ఇప్పటి వరకు 68,392.400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 2,625 మంది రైతులకు రూ.37.37 లక్షలు చెల్లించాం. కొనుగోలు కేంద్రాల్లో సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. జిల్లాలో రానున్న 15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – సుధాకర్, పౌర సరఫరాలశాఖ, నిర్మల్లక్ష్మణచాంద: జిల్లాలో యాసంగి సీజన్లో వరి ధా న్యం కొనుగోళ్లు నత్తనడకన జరుగుతున్నాయి. కొ నుగోళ్లు ప్రారంభమై 20 రోజులు గడిచినా సగం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. కొనుగోళ్లు వే గవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 24 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయినా ఇప్పటికీ కల్లాల్లోనే ధాన్యంపు రాశులు ద ర్శనమిస్తున్నాయి. కొనుగోళ్ల తీరుపై జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో కొనుగోలు ప్రక్రియలో లోపాలు, రైతుల ఆవేదనలు వెల్లడయ్యాయి. 318 కొనుగోలు కేంద్రాలు..ఈ యాసంగి సీజన్లో 1,62,414 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 318 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 209 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి, మిగిలిన 109 కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు. గడిచిన 20 రోజుల్లో కేవలం 68,392.400 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 94,022.00 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు.. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో గమనించిన సమస్యలు ఇలా ఉన్నాయి.. ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామంలోని ఖానాపూర్ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో అధికారులు తూకంలో మూడు కిలోలు అదనంగా కోత విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తూ, సిబ్బంది ని, సీఈవోను గదిలో బందించి నిరసన తెలిపారు. లోకేశ్వరం: మండలం ఒక సంచికి (40 కేజీలు) అదనంగా 3 కేజీలు తూకం వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మణచాంద: మండలంలో సరిపడా కూలీలు లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నర్సాపూర్ (జి): రైస్ మిల్లులకు అలాట్మెంట్ సకాలంలో జరగకపోవడంతో ధాన్యం తరలింపు నెమ్మదిగా సాగుతోంది. కుంటాల: మండలంలో 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా సోమవారం నుంచే తూకం మొదలు పెట్టారు. సోన్ : మండలంలో గన్నీ సంచులు సకాలంలో అందించకపోవడం, తూకం వేయడంలో ఆలస్యం కావడంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. కడెం: మండలంలో 15 రోజుల క్రితం కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ మూడు రోజుల నుంచి మాత్రమే తూకం వేయడం జరుగుతోంది. మామడ: మండలంలో లారీల కొరతతో ధాన్యం తరలింపు వేగంగా జరగడం లేదు. సారంగాపూర్ : మండలంలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ తూకం ప్రక్రియ మొదలు కాలేదు. దిలావార్పూర్ : మండలంలో వరి కోతలు, కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమై, నెమ్మదిగా సాగుతున్నాయి. అకాల వర్షాల భయం..కొన్ని రోజులుగా జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతం అయితే చాలు, ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. వర్షం వస్తే నష్టం చేతికి వచ్చిన ధాన్యం నోటికి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్ల వేగం పెంచాలి..కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. తగిన చర్యలు చేపట్టి, లారీల కొర త, కూలీల కొరత, గన్నీ సంచుల సమస్యలను పరి ష్కరించాలంటున్నారు. వర్షం వల్ల నష్టం జరగకుండా కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. జిల్లా వివరాలు.. నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు.. ఆందోళన చెందుతున్న అన్నదాతలు వర్షం వస్తే ఆగమవుతామంటున్న రైతులుఈ ఫొటోలోని రైతుపేరు అయిటి మల్లేశ్. నర్సాపూర్(జి) మండలానికి చెందిన మల్లేశ్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. నిర్వాహకులు మాయిశ్చర్ వచ్చాక తూకం వేశారు. అయితే మిల్లు అలాట్ చేయకపోవడంతో ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. దీంతో తూకం వేసినా ధాన్యానికి రక్షణగా ఉంటున్నాడు. -
బాసరలో కేంద్రీయ విద్యాలయం
● తాత్కాలిక భవనంలో ఏర్పాట్లు.. ● భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్ బాసర: జ్ఞానసర్వసతీ దేవి కొలువై ఉన్న బాసరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కల నెరవేరబోతోంది. ఇప్పటికే కేందద్రీయ విద్యాలయం మంజూరైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్ భవన నిర్మాణం కోసం స్థలంతోపాటు, ప్రస్తుతం విద్యాలయం ప్రారంభం కోసం తాత్కాలిక భవనాన్ని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్తో కలిసి పరిశీలించారు. ట్రిబుల్ ఐటీ సమీపంలో తాత్కాలిక భవనంతోపాటు, గోదావరి నదికి వెళ్లే దారిలో మరో భవనాన్ని పరిశీలించారు. అధికారులు పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు సౌకర్యంగా ఉండే తాత్కాలిక భవనం, అనువైన స్థలం కావాలని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అనంతరం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందరి సహకారంతో త్వరలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్తోపాటు అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో రామారావు, తహసీల్దార్ పవన్చంద్ర తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన కేంద్ర బృందంనిర్మల్చైన్గేట్: జిల్లాలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ దక్షిణ భారత విభాగం డిప్యూటీ కమిషనర్ మంజునాథం, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, కలెక్టర్ అభిలాషా అభినవ్ను కలెక్టరేట్లో గురువారం కలిశారు. బాసరలో కేంద్రీయ విద్యాలయ స్థాపనకు అవసరమైన స్థలాలను పరిశీలించిన విషయాన్ని కలెక్టర్కు బృందం వివరించింది. వసతి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని గుర్తించేందుకు భౌగోళిక పరిస్థితులు, కమ్యూనికేషన్ సదుపాయాలు, భవిష్యత్ అవసరాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి పాల్గొన్నారు. -
మత్తెక్కిస్తున్నరు..!
● మద్యం.. గంజాయిని దాటి.. ‘ఇంజక్షన్ల’ దందా.. ● ఈజీమనీ కోసం ‘టెక్నీషియన్లు’ పెడదోవ.. ● జిల్లా యువతపై కొత్త ముప్పునిర్మల్టౌన్: జిల్లాలో మద్యం, గంజాయి మత్తులో మునిగిన యువత ఇప్పుడు ప్రాణాంతకమైన మిడాజోలం ఇంజెక్షన్ల బారిన పడుతోంది. శస్త్రచికిత్సల్లో అనస్థీషియాకు ఉపయోగించే ఈ మత్తు ఇంజెక్షన్లను యువతకు అలవాటు చేస్తూ కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్లు ఈ దందా నడుపుతున్నారు. ఇటీవల పట్టుకున్న గంజాయి విక్రేతల విచారణలో పోలీసులు మత్తు ఇంజెక్షన్ల విషయం తెలుసుకున్నారు. విక్రేతలపై నిఘా పెట్టి ముఠాను పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకీ శర్మిల, ఏఎస్పీలు రాజేశ్ మీనా, ఉపేంద్రారెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్ వివరాలను గురువారం వెల్లడించారు. టెక్నీషియన్లే సూత్రధారులుజిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేస్తున్న షేక్ ఫర్దీన్, మిడాజోలం ఇంజెక్షన్ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దందాను ప్రారంభించాడు. అతనితో కలిసి ల్యాబ్ టెక్నీషియన్లు అబ్దుల్ డానీష్, చవాన్ గోవింద్, స్నేహితుడు మహమ్మద్ పర్వేజ్ ఈ అక్రమ వ్యాపారంలో భాగమయ్యారు. ఆస్పత్రుల నుంచి మిగిలిన ఇంజెక్షన్లను సేకరించడంతోపాటు, కొన్నిచోట్ల దొంగతనాలకు కూడా పాల్పడ్డారు. గంజాయికి అలవా టు పడిన యువతను లక్ష్యంగా చేసుకుని పర్వేజ్ శివారు, నిర్మాణుష్యమైన ప్రాంతాలకు కస్టమర్లను పిలిపించి, వారికి సిరంజీతో మత్తు ఇంజక్షన్ ఇచ్చేవాడు. ఒక్కో మిడాజోలం ఇంజక్షన్ బుడ్డిలో 5.10 ఎంఎల్ లిక్విడ్ ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్ వద్ద రూ.500 తీసుకొని, ఒక ఎంఎల్ ఇచ్చేవారు. అలా వచ్చిన డబ్బును నలుగురు పంచుకునేవారు. యువత జీవితాలపై ముప్పుమత్తు కోసం దారి తప్పుతూ..మత్తు కోసం జిల్లా యువత దారితప్పుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు మద్యం, సిగరెట్కే పరిమితమైనవాళ్లు ఇప్పుడు గంజాయి, డ్రగ్స్, వైట్నర్, ఇంజక్షన్లు ఇలా.. ఎటో వెళ్లిపోతున్నారు. మత్తులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా రు. కుటుంబాలనూ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇప్పటికే గంజాయి మత్తులో నిండమునిగిన యువత ఇప్పుడు ఇలా.. ప్రాణాలకే ప్రమాదమైన మత్తు ఇంజక్షన్లనూ తీసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మిడాజోలం ఇంజెక్షన్లు శస్త్రచికిత్సల్లో అనస్థీషియాకు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన మందు. దీనిని నియంత్రణ లేకుండా తీసుకోవడం ప్రాణాంతకం. పోలీసులు ఈ దందాను అరికట్టినప్పటికీ, యువతలో అవగాహన కల్పించడం, ఆస్పత్రుల్లో మందుల నియంత్రణను కఠినం చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.మత్తుపై యుద్ధం.. జిల్లాలో మత్తు పదార్థాలపై జరిపే యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. మత్తు ఇంజక్షన్లను మెడికల్ షాప్లలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరాదు. హాస్పిటల్ యాజమాన్యం కూడా మిగిలిపోయిన మత్తు ఇంజక్షన్ సీసాలను డిస్పోస్ చేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా తేడా కనిపిస్తే డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించాలి. మత్తు పదార్థాలకు సంబంధించి ఏసమాచారం తెలిసినా వెంటనే 8712659599 ఫోన్నంబర్కు సమాచారం ఇవ్వాలి. – జానకీషర్మిల, ఎస్పీప్రాణాలకే ప్రమాదం... ఎలాంటి మత్తుమందులైనా ఏకాస్త మోతాదు మించినా ప్రాణాలకే ప్రమాదమవుతాయి. మిడాజోలం అనేది శస్త్రచికిత్సల సమయంలో పేషెంట్లకు అన్నిపరీక్షలు చేసిన తర్వాత తగు మోతాదులో ఇస్తుంటాం. ఎక్కువ మోతాదులో తీసుకుంటే శ్వాస ఆగిపోవడం, బ్రెయిన్ డ్యామేజీలతో ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. – డాక్టర్ అశ్వీర్రెడ్డి, అనస్థీషియా వైద్యుడుగంజాయి వేటలో బయటపడిన దందాజిల్లాలో గంజాయి వ్యాప్తిపై పోలీసులు ముమ్మర దాడులు చేస్తున్న క్రమంలో, అనుమానాస్పద కేసులో పర్వేజ్ను అదుపులోకి తీసుకున్న నిర్మల్ టౌన్ పోలీసులు మిడాజోలం దందాను బయటపెట్టారు. బైల్ బజార్లో జరిపిన తనిఖీల్లో షేక్ ఫర్దీన్, అబ్దుల్ డానీష్, చవాన్ గోవింద్ను అరెస్టు చేసి, 26 ఇంజెక్షన్లు, 10 సిరంజీలు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయంపై ఎస్పీ జానకీ షర్మిల పోలీసు బృందాన్ని అభినందించారు. -
నైపుణ్యాలు మెరుగుపరిచేందుకే శిక్షణ
● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్నిర్మల్ రూరల్: ఉపాధ్యాయుల నైపుణ్యాలు మెరుగుపరిచేందుకే ప్రభుత్వం శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో జరుగుతున్న శిక్షణ తరగతులను డీఈవో రామారావుతో కలిసి గురువారం పరిశీలించారు. శిక్షణలో డీఆర్పీలు చెప్పే బోధనా మెలకువలు, డిజిటల్ బోధనా పద్ధతులు, అభ్యసన ఫలితాల సాధన, జీవన నైపుణ్యాల పెంపు, కృత్యాధార బోధన మొదలగు అంశాలను అవగాహన చేసుకోవాలని సూచించారు. ఇవి తరగతి గదుల్లో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కరికులం అంశాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని డీఆర్పీలకు సూచించారు. ఇందులో ఎఫ్ఏవో రమణారెడ్డి, ఏఎంవో నరసయ్య, కోర్సు ఇన్చార్జీలు, డీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోక్సో చట్టంపై అవగాహన ఉండాలిఉపాధ్యాయులు పోక్సో చట్టంపై తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జి రాధిక పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని చాణక్య పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతులను గురువారం పరిశీలించి మాట్లాడారు. పోక్సో చట్టం గురించి వివరించారు. మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలన్నారు. ఇందులో సీఎంవో ప్రవీణ్కుమార్, కోర్సు ఇన్చార్జి విద్యాసాగర్, డీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థి కావాలి ఉపాధ్యాయులు నిత్య విద్యార్థి కావాలని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలని సాంఘికశాస్త్ర నిపుణులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కటకం మురళి పేర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో మాట్లాడారు. సాంఘికశాస్త్ర, భౌగోళిక, చారిత్రక అంశాలను చార్టులు వేసి వివరించారు. ఒక క్రమానుసారం అన్నీగుర్తుండేలా విద్యార్థులకు తరగతి గదిలో నేర్పించాలన్నారు. సాంఘిక శాస్త్ర విషయాలు ఏవిధంగా బోధించాలో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. -
గాంధీనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్
సోన్: మండలంలోని గాంధీనగర్లో బుధవా రం కమ్యునిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 102 బైక్లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని ధ్రువపత్రాలు చూపించి తీసుకువెళ్లాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడవద్దని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించవద్దని, వ్యక్తిగత సమాచారం చెప్పవద్దని సూచించారు. సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి, ఎస్సైలు గోపి, సుప్రియ, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
గిరి‘జనులకు’ రైలు కూత!
● మంచిర్యాల–ఉట్నూరు–ఆదిలాబాద్కు ముందడుగు ● నిజామాబాద్–నిర్మల్, పటాన్చెరు–ఆదిలాబాద్ దాక ● కొత్త లైన్లకు ఇంజినీరింగ్, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ప్రతిపాదనలు ● పింక్బుక్ 2025–26లో నిధులు అంచనా వేసిన రైల్వే శాఖ ● పట్టాలెక్కితే ఏజెన్సీ ప్రాంత వాసులకు రైలు యోగంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజన ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ముందడుగు పడింది. తొలిసారిగా ఉమ్మడి జిల్లా గిరిజన, అడవుల వెంట రైలు మార్గాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. ఈ మేరకు 2025–26 ఆర్థిక సంవత్సర రైల్వే బడ్జెట్ కేటాయింపులు తెలిపే కీలక పింక్బుక్లో వెల్లడించింది. గత ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తాజాగా రైల్వేశాఖ ఈ బుక్లో ఉమ్మడి జిల్లాకు పలు కొత్త మార్గాలు, ట్రాఫిక్ సర్వేల కోసం నిధుల ప్రతిపాదనలు ఉన్నాయి. భవిష్యత్లో కాజీ పేట–బల్లార్షా 234కి.మీ. నాలుగో లైన్ సర్వేకు రూ.4.68కోట్లు, వన్యప్రాణులకు ప్రాణనష్టం జరగకండా బలార్షా, ఆసిఫాబాద్ రోడ్ వరకు రైల్వే పట్టాల ఫెన్సింగ్కు నిధులు ప్రతిపాదించారు. మంచిర్యాల టు ఆదిలాబాద్ వయా ఉట్నూరు మంచిర్యాల నుంచి వయా ఉట్నూరు ఆదిలాబాద్ దాక ప్రతిపాదిత కొత్త మార్గం 186కి.మీ నిడివి. ఇందుకు రూ.వంద కోట్లు అంచనా ప్రతిపాదించారు. ఈ లైను ఏర్పాటు కోసం భూమి, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ఈ నిధులు వెచ్చించనున్నారు. కొత్తగా నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ మధ్య మార్గం 125కి.మీ. కోసం ఇంజినీరింగ్, ట్రాఫిక్ స ర్వే కోసం రూ.31లక్షలు, మరో కొత్త మార్గమైన పటాన్చెరు (నాగలపల్లి) వయా బోధన్ ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు ఫైనల్ లొకేషన్ సర్వే 317కి.మీ కోసం రూ.7.92కోట్లు, ముత్కేడ్–ఆది లాబాద్–పింపల్కుటి 183కి.మీ ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.3.66కోట్లు, ఆదిలాబాద్ –గడ్చాందూర్ 70కి.మీ సర్వే కోసం రూ.1.75కోట్లు, యావత్మాల్–ఆదిలాబాద్– వయా గంటిజి, పందర్కావందన్, చానఖా వరకు 100కి.మీ సర్వే కోసం రూ.25లక్షలు, సికింద్రాబాద్–ముత్కేడ్– ఆదిలా బాద్ 420కి.మీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ ప్రాథమిక డబ్లింగ్ సర్వేకు రూ.1.64కోట్లు ప్రతిపాదించారు. ఆర్వోబీలు, స్టేషన్ల ఆధునికీకరణ ఆర్వోబీలు, వంతెనలకు ఆర్ఆర్ఎస్కే (రాష్ట్రీయ రేల్ సంరక్ష కోశ్), ఆర్ఎస్ నిధులు(రైల్వే సేఫ్టీ ఫండ్) కేటాయిస్తుంది. ఆదిలాబాద్ యార్డు–రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) లెవల్ క్రాసింగ్కు రూ.5.69 కోట్లు, ముత్కేడ్ ఆదిలాబాద్ పింపల్కుట్టి 68కి.మీ. రూ.4.71కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ 8.16కి.మీ. రూ.1.04కోట్లు, ఆర్ఆర్ఎస్కే రూ.1.93కోట్లు, ఆర్ఎస్ఎఫ్ రూ.9.73కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ ఘాట్ సెక్షన్లో ఆర్ఆర్ఎస్కే నుంచి రూ.6.40 కోట్లు, ఆదిలాబాద్ పిట్ లైన్ నిర్మాణం కోసం మూ లధన నిధులు రూ.22.28కోట్లు, మంచిర్యాల–పె ద్దంపేట మధ్య మూడో లైనుకు 4.37కి.మీ, మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచ్నీ, రేపల్లెవాడ మధ్య రోడ్ కొత్తగా అండర్ బ్రిడ్జికి రూ.7.64 కోట్లు, ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో భవనాలు, మరుగుదొడ్లు, విస్తరణ అభివృద్ధి కోసం రూ.4.44కోట్లు, ‘అమృత్’ స్కీం కింద ఆదిలాబాద్ స్టేషన్లో ఎఫ్ వోబీ (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం, దివ్యాంగుల ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లకు ఎంపిక చేశారు. స్టేషన్లో లెస్ ట్రా క్, క్విక్ వాటరింగ్ కోసం రూ.14.95కోట్లు, ప్లాట్ ఫాంలపైన కవర్ నిర్మించేందుకు రూ.4.61కోట్లు ప్రతిపాదించారు. మంచిర్యాల రైల్వేస్టేషన్కు అమృత్ స్కీం కింద నిధులు ప్రతిపాదించారు. కార్యరూపం దాల్చితేనే.. నిధుల ప్రతిపాదనలతో సరిపెట్టకుండా ఆ మేరకు మంజూరు చేసి కార్యరూపం దాల్చితేనే కొత్త మార్గాల్లో రైలు ప్రయాణ యోగం కలుగనుంది. గత కొన్నేళ్లుగా రైల్వేలో ఫైనల్ లొకేషన్ సర్వే జరిగిన పనులు సైతం ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు. తాజా ప్రతిపాదిత రైలు మార్గాలు అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలతోపాటు అనేక గిరిజన ప్రాంతాల నుంచి వెళ్లనుంది. దీంతో భూ సేకరణ, అటవీ అనుమతులు, పరిహరం రూ.వందల కోట్లలోనే ఉండనుంది. ఈ నేపథ్యంలో కేవలం పింక్బుక్లో కాగితాలపైనే సరిపెడితే మారుమూల ప్రాంతాలకు రైలు కూత అందని ద్రాక్షగానే మారనుంది. -
‘పనిచేసే వారికే పదవులు’
ఖానాపూర్: పార్టీ కోసం పనిచేసిన వారికే పార్టీ సంస్థాగత, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ఉమ్మడి జిల్లా పరిశీలకులు చంద్రశేఖర్గౌడ్, అవేజ్ఖాన్ పేర్కొన్నారు. పట్టణంలోని జేకే ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృత స మావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఎస్సీ రిజ ర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన ఘన త కాంగ్రెస్దేనని చెప్పారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి మరోసారి సీఎం అయ్యేలా పార్టీ కోసం ప్రభుత్వంలో పని చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ స మావేశానికి గైర్హాజరయిన మండల బాధ్యులపై చ ర్యలు తీసుకోవాలని జిల్లా పరిశీలకులను కోరారు. ఉమ్మడి జిల్లాకు నామినేటెడ్ పదవులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొందరు కోవర్టులతో పార్టీ అబాసు పాలవుతోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపుని చ్చారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, ప్రజాప్రతినిదులు, నాయకులు అడ్డి భోజారెడ్డి, తహర్బిన్ అ హ్మద్, అజ్మీరా శ్యాంనాయక్, భూమన్న, ముకాడే, విశ్వనాథ్, లక్ష్మీనారాయణ, చంద్రయ్య, ఇక్బాల్, మాజిద్, తరి శంకర్, దుర్గా భవాని, చిన్నం సత్యం, ఏ రాజెందర్, పీ సతీశ్రెడ్డి, ఇసాక్, దయానంద్, స్వప్నిల్రెడ్డి, నిమ్మల రమేశ్, షబ్బీర్పాషా, సలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పని చేయాలి
నిర్మల్చైన్గేట్: అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం పాటించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. జిల్లాలో ఆర్ఎఫ్ఆర్ (రైట్ఫుల్ ఫారెస్ట్ రూల్స్) అమలుపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, విద్యుత్, ఆర్అండ్బీ, పంచా యతీరాజ్శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బ్రిడ్జిలు, విద్యుత్ తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు అటవీశాఖకు సరైన విధంగా ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ప్రతీ శాఖ తమ ప్రపోజల్స్ను అటవీశాఖతో సమన్వ యం చేసుకుని ముందుగా ఆమోదం పొందాలని సూచించారు. చేపట్టనున్న అభివద్ధి ప్రాజెక్టులను త్వరగా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. శాఖల మధ్య సమన్వయంతో అభివద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తిచేయాలని, అ టవీశాఖ అవసరమైన మార్గదర్శకాలకు సంబంధి త శాఖలకు త్వరగా పంపించాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ తదితరులున్నారు.భూసమస్యలు పరిష్కరించాలికుంటాల: భూభారతి పథకానికి కుంటాల మండలాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం భూభారతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల దరఖాస్తులు, ఆన్లైన్ ప్రక్రియ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్లు కమల్సింగ్, శ్రీకాంత్, ఎజాజ్ అహ్మద్ ఖాన్, ప్రవీణ్కుమార్, డీటీ నరేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బంద్ సక్సెస్ చేయాలి
లక్ష్మణచాంద: గ్రామీణ బంద్ సక్సెస్ చేయాలని తె లంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు పేర్కొన్నారు. బుధవా రం మండలంలోని కనకాపూర్ గ్రామంలో కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి ఆయ న హాజరై మాట్లాడారు. మే 20న కార్మిక వర్గం నిర్వహిస్తున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో ఎస్కేయం ప్రజాసంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఉ పాధిహామీ పని దినాలను సగానికి తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూలీలు ఐక్యంగా గ్రామీ ణ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యా ప్త సమ్మె, గ్రామీణ బంద్లో పాల్గొని జయప్రదం చే యాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, పంటలకు గిట్టుబాటు ధర క ల్పించాలని తెలిపారు. వీటిలో పార్లమెంట్లో చ ట్టం చేసి వ్యవసాయ కూలీలకు ఉపాధిహామీలో రో జు కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రా ష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ లంక రాఘవులు, పద్మ, జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ తిరుపతి, ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్కుమార్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి అశోక్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి నరసింహ, నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి ౖమురళీమోహన్, మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకులు బుచ్చ య్య, నిర్మల్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగారం, జాదవ్ కిషన్ పాల్గొన్నారు. కనకాపూర్లో మాట్లాడుతున్న వెంకట్రాములు -
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
భైంసాటౌన్: అర్జీదారులు తమ సమస్యలను నిర్భయంగా తన దృష్టికి తేవాలని ఎస్పీ జీ జానకీషర్మిల పేర్కొన్నారు. బుధవారం పట్ట ణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా వాణి నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు పరిష్కరించాలని సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్లో సూచించారు. భరోసా కేంద్రంలో షీ టీం సిబ్బందితో కుటుంబ కలహాల కేసుల్లో ఇరు పార్టీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. భైంసాలో భరోసా కేంద్రం ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు గోపీనా థ్, నైలు, షీ టీమ్ ఇన్చార్జి పెర్సిస్, సిబ్బంది, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ పాల్గొన్నారు. -
ఫీజుల నియంత్రణపై ఫోకస్
నిర్మల్దసలిపట్టుతో వస్త్రం దసలి పట్టుకాయ దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న చెన్నూర్ పట్టుపరిశ్రమ మరో అడుగు ముందుకేసింది. పట్టు దారం, వస్త్రోత్పత్తికి కూడా సన్నద్ధమవుతోంది. ● భారమవుతున్న ‘ప్రైవేట్’ చదువులు ● రోజురోజుకూ పెరుగుతున్న ఫీజులు ● నియంత్రణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ● మంత్రి శ్రీధర్బాబు ప్రకటనపై హర్షంఎర్త్ రాడ్లతో ముప్పు విద్యుత్ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్త్ కోసం ఏర్పాటు చేసిన ఇనుపరాడ్లు ప్రమాదకరంగా మారాయి. గమనించకుంటే పశువులతోపాటు మనుషులూ బలవుతున్నారు. గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 20258లోu హెలిప్యాడ్ పరిశీలన భైంసాటౌన్: పట్టణంలోని పార్డి(బీ) బైపాస్రోడ్ లో గల హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల బుధవారం పరిశీలించారు. కుంటాలలో భూభారతి పైలెట్ ప్రాజెక్ట్ నేపథ్యంలో ఈనెల 16న రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భైంసాలో హెలీప్యాడ్ స్థలం పరిశీలించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఏఎస్పీ అవినాష్కుమార్, ఆర్డీవో కోమల్రెడ్డి, ఆర్అండ్బీ డీఈఈ సునీల్ ఉన్నారు. రేపు కుంట్రాలకు ‘పొంగులేటి‘ కుంటాల: భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శుక్రవారం కుంటాలకు రానున్నారు. స్థానిక ము న్నూరు కాపుసంఘ భవనంలో బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. వారి వెంట ఏఎస్పీలు రాజేశ్ మీనా, అవినాష్కుమార్, భైంసా రూరల్ సీఐ నైలు, ఎస్సై అశోక్ ఉన్నారు. నిర్మల్ఖిల్లా: ‘ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాల అభిప్రాయాలు సేకరించాం. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం. ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది’ ఇవి.. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈనెల 12న ‘విద్యా రంగంలో సంస్కరణ లు’ అంశంపై మంత్రివర్గ సబ్కమిటీ, విద్యాశాఖ ఉ న్నతాధికారులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. తల్లిదండ్రుల ఆ శలను అ వకాశంగా మ లుచుకున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు వివిధ పేర్లతో బురిడీ కొట్టిస్తున్నాయి. దీంతో అ త్యాశకు పోతున్న త ల్లిదండ్రులు లక్షలు కుమ్మరిస్తూ భారం భ రిస్తున్నారు. టాలెంట్, టె క్నో, ఈ–టెక్నో, డీజీ, ఒలింపియాడ్, మోడల్ స్కూల్, ఐఐటీ, జేఈ ఈ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులను ఊహాలోకంలోకి తీసుకెళ్లేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్ 665 గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. నిర్మల్ జిల్లాలో 194, ఆదిలాబాద్లో 151, మంచిర్యాలలో 218, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 102 ప్రైవేట్ బడులున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా 1నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య సు మారు 5లక్షల వరకు ఉండగా, ఇందులో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారు 2లక్షలకు పై గా ఉన్నారు. ప్లే, టెక్నో, ఇంటర్నేషనల్, ఈ–టెక్నో, ఒలింపియాడ్ తదితర పేర్లతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎల్కేజీ చదువుకే వేలల్లో ఫీజు వసూలు చేస్తున్నాయి. దాదాపు 50 శాతానికంటే ఎక్కువే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సర్కారు ఫీజుల నియంత్రణకు పూనుకోగా తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రూ.లక్షల్లో చెల్లిస్తున్నాం ఏటా రూ.లక్షా 50 వేల కు పైగా మా పిల్లల ఫీ జులు చెల్లిస్తున్న. ఏటేటా ఫీజులు పెంచేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రా ష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది. – ఆకుల భూమేశ్, ఈద్గాం, నిర్మల్ సంపాదనలో సగం చదువులకే.. ప్రైవేట్గా ఉపాధి పొందుతూ సంపాదిస్తున్న అరకొర వేతనాల నుంచి 50 శాతానికిపైగా డబ్బు పిల్లల ఫీజుల కోసమే ఖర్చు చేస్తున్నాను. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ఇష్టారీతిన పెంచకుండా ప్రభుత్వం నియంత్రించాలి. – మార్గం శ్రీనివాస్, నిర్మల్ కఠినంగా వ్యవహరించాలి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు పుస్తకాలు, యూని ఫామ్, అడ్మిషన్ ఫీజుల పేరిట తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపుతున్నారు. విద్యను వ్యాపారం చేస్తున్న ‘ప్రైవేట్’ యాజమాన్యాలపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలి. – కై రి శశి, ఏబీవీపీ నేత, నిర్మల్ న్యూస్రీల్ఏటా పెంచేస్తున్నారుప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజులతో సామాన్యులకు ‘బడి’ భారమవుతోంది. ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతుండగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం అమలు చేయాల్సి ఉండగా అధికారుల అలసత్వంతో ఫీజుల పెంపునకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వాల ఉదాసీన వైఖరి కారణంగా ఏటా ప్రైవేట్ పాఠశాలల్లో 10–30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారు. నిర్మల్: 194 ఆదిలాబాద్: 151కు.ఆసిఫాబాద్: 102 మంచిర్యాల: 218ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తాం ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల్లో ని ఫీజుల నియంత్రణపై చర్చ జరిగింది. విద్యాశా ఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫీజుల నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తాం. రానున్న విద్యాసంవత్సరం నుంచి నిర్ణీత ఫీజుల క న్నా ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. – పీ రామారావు, డీఈవో -
పాలిసెట్కు 95 శాతం హాజరు
నిర్మల్ రూరల్: పాలిసెట్ పరీక్ష జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని 8 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,422 మంది దరఖాస్తు చేసుకోగా, 2,305 మంది(95%)పరీక్షకు హాజరయ్యారు. 117 మంది గైర్హాజరయ్యారు. 1,121 మంది బాలురకు 1,059 మంది, 1,301 మంది బాలికలకు 1,246 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల సమన్వయకర్త, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రమేశ్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. -
‘రెవెన్యూ’ నిర్లక్ష్యంతో బోరిగాంలో చిచ్చు?
ముధోల్ : మండలంలోని బోరిగాం గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో సోమవారం బుద్ధ విగ్రహం ప్రతిష్ఠాపన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భూమి విషయంలో గ్రామంలోని రెండు గ్రూపుల మధ్య కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. గతంలో ఈ సమస్య రెవెన్యూ శాఖ వరకు చేరగా, తాహసీల్దార్ నుంచి ఆర్డీవో వరకు చర్చలు జరిపారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించారు. అయినా రెవెన్యూ శాఖ ఈ భూమిని ఆధీనంలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేసింది.గ్రూపుల మధ్య ఘర్షణఈ నేపథ్యంలో, ఒక గ్రూపు బుద్ధ విగ్రహం ప్రతిష్టాపనకు సిద్ధమైంది. దీనికి మరో గ్రూపు అభ్యంతరం తెలపడంతో, రాళ్లతో దాడులు జరిగే స్థాయికి వివాదం చేరింది. ఎస్పీ జానకీ షర్మిల, భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ జోక్యంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, భారీ బందోబస్తుతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు పికెట్, బందోబస్తు కొనసాగుతోంది.రెవెన్యూ శాఖపై విమర్శలురెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడుతున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొంటున్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ, అనుమతి లేకుండా నిర్మాణాలు చేయవద్దని గతంలో సూచించినట్లు తెలిపారు. భూమి రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.శాంతి కోసం పోలీసు చర్యలుఎస్పీ జానకీషర్మిల ఆదేశాలతో మంగళవారం ఉదయం ముధోల్ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ముధోల్ ఎస్సై సంజీవ్, ఆయా మండలాల ఎస్సైలు, పోలీసులు, శివంగి టీం పోలీసులు పాల్గొన్నారు. -
పుట్టుక.. చావులో వైవిధ్యం!
● ‘ఆడ’ కంటే ‘మగ’ జననమే అధికం ● అధిక మరణాలు కూడా పురుషులవే.. ● ఆగని గర్భస్త, నవజాత శిశు మరణాలు ● ‘సీఆర్ఎస్– 2021’ నివేదికలో వెల్లడిసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుట్టుక, చావు మానవ జీవనంలో కీలక ఘట్టాలు. దేశ వ్యాప్తంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే కేంద్ర హోంశాఖ పరిధి రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్ఎస్)–2021 నివేదిక ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదికలో ఉమ్మడి జిల్లాలో జననాలు, మరణాలతో పాటు ఏడాదిలోపు శిశువులు, గర్భంలోనే చనిపోతున్న శిశువుల వివరాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీ్త్ర, పురుష నిష్పత్తిలో ఏర్పడిన అసమానతలు, జనన, మరణాల్లో నమోదవుతున్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తున్నాయి.కన్నుమూస్తే మరణం..ఉమ్మడి ఆదిలాబాద్లో నిర్మల్ జిల్లాలో మరణాలు అధికంగా నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832 మంది మరణించారు.మగ శిశువుల జననమే అధికం ఉమ్మడి ఆదిలాబాద్లోని నిర్మల్ జిల్లాలో అధికంగా జననాలు నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్లో తక్కువగా ఉంది. ఇందులో మగ శిశువుల జననాలే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లింగనిష్పత్తి తగ్గుతుండగా ఈ నివేదికలోనూ ఇదే తీరువెల్లడైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 26,576 మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25,124 మంది జన్మించారు.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జననాలు.. జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 2,073 1,865 2,710 2,729 4,783 4,594 9,377 నిర్మల్ 4,490 4,218 7,002 6,599 11,492 10,817 22,309 మంచిర్యాల 333 320 5,377 5,065 5,710 5,385 11,095 కు.ఆసిఫాబాద్ 3,458 3,240 1,132 1,088 4,590 4,328 8,918ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలుశిశు మరణాలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి మొదటి పుట్టిన రోజు కూడా జరుపుకోకుండానే ఎంతోమంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పుట్టిన సమయంలోనే అనేక సమస్యలుండగా, కొందరు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య కారణాలతో మృత్యువాత పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో 84మంది, మంచిర్యాలలో గ్రామీణ ప్రాంతంలో ఒక్కరూ చనిపోనప్పటికీ.. పట్టణ ప్రాంతంలో 11మంది, ఆదిలాబాద్లో 61, కుమురంభీం ఆసిఫాబాద్లో అధికంగా 77మంది నవజాత శిశు మరణాలు నమోదయ్యాయి. స్టిల్ బర్త్ మరణాలూ అధికమే..20 వారాలు దాటిన పిండం నుంచి ప్రసవ దశ శిశువు వరకు గర్భంలోనే మరణించే స్థితిని స్టిల్ బర్త్గా పేర్కొంటారు. ఈ పరిస్థితిని చాలామంది గర్భిణులు ఎదుర్కొంటున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఈ జిల్లాలో 178 మృతశిశువుల జననాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో గ్రామీణ పరిధిలో నమోదు లేనప్పటికీ పట్టణాల్లోనే 174 నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్లో 61, నిర్మల్లో 26 నమోదయ్యాయి. గర్భందాల్చి పిండ వృద్ధి దశలో ఎదురవుతున్న పలు సమస్యలతో గర్భంలోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.శిశుమరణాలు ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 27 18 10 06 37 24 61 నిర్మల్ 36 42 3 3 39 45 84 మంచిర్యాల 0 0 06 05 6 5 11 కు.ఆసిఫాబాద్ 43 29 02 03 45 32 77 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 1,367 1,206 890 842 2,257 2,048 4,305 నిర్మల్ 2,400 1,850 1,356 1,054 3,756 2,904 6,660 మంచిర్యాల 653 574 1,636 1,003 2,289 1,577 3,866 కు.ఆసిఫాబాద్ 1,890 1,172 263 131 2,153 1,303 3,456 గర్భస్రావాలు (స్టిల్ బర్త్) ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 21 20 14 06 35 26 61 నిర్మల్ 12 14 0 0 12 14 26 మంచిర్యాల 0 0 94 80 94 80 174 కు.ఆసిఫాబాద్ 98 74 04 02 102 76 178 -
దోపిడీపై తిరగబడ్డ రైతులు
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ గ్రామంలోని ఖానాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు 40 కిలోల వరి ధాన్యం బస్తాకు మూడు కిలోలు అదనంగా తూకం వేస్తూ రైతులను బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. తాలు, తప్ప పేరుతో బస్తాకు మూడు కిలోల చొప్పున అదనంగా తూకం వేయడంతో రైతులు మండిపడ్డారు. మండలంలో ఎక్కడా లేని విధంగా ఎర్వచింతల్లో రైతులు క్వింటాల్కు 7 కిలోల పైచిలుకు ధాన్యాన్ని అదనంగా తూకం చేయడంపై తిరగబడ్డారు. కేంద్రానికి వచ్చిన పీఏసీఎస్ సీఈవో ఆశన్నతోపాటు సిబ్బంది రాజేశ్వర్, శ్రీకాంత్ను కొనుగోలు కేంద్రం ఆవరణలోని పాఠశాల గదిలో నిర్బంధించారు. ఎక్కడా లేని విధంగా తమ వద్ద కోతలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు వచ్చే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఈవో పొరపాటు జరిగిందని మరోసారి కోతలు విధించబోమని ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోళ్లు చేపడతామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం అక్కడికి వచ్చిన డీసీవో పాపయ్యను సైతం రైతులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే కేంద్రాల నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగుతోందని మండిపడ్డారు. కోతలు విధించిన ధాన్యంలో నుంచి కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు కమీషన్లు అందడంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు డీసీవో పూర్తిస్థాయి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొడారి గోపాల్, రైతులు బాదావత్ రవి, రంజిత్, సంతోష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ పీఏసీఎస్ సీఈవోతోపాటు సిబ్బందిని నిర్బంధించి నిరసన అక్కడికి వచ్చిన డీసీవో పాపయ్యను నిలదీసిన అన్నదాతలు -
‘ఆదర్శ’ ఫలితాలు విడుదల
కుంటాల: స్థానిక ఆదర్శ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి ఇటీవల 6వ తరగతి నుంచి పదో తరగతి ఖాళీల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు సోమవారం రాత్రి విడుదల చేసినట్లు కుంటాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ న వీన్కుమార్ తెలిపారు. విద్యార్థుల మార్కులు, ర్యాంకుల వివరాలు telanganams. cgg. gov. in/ TGMS WEB/20# వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. సీటు వచ్చిన విద్యార్థుల జాబితాను త్వరలో పాఠశాలల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. లోక్అదాలత్లో కేసులు పరిష్కరించాలి భైంసాటౌన్: పట్టణంలోని కోర్టు ఆవరణలో ఈనెల 16న జాతీయలోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి దేవేంద్రబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కోర్టులో పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్స్టేషన్లలో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ లోక్అదాలత్ నేపథ్యంలో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేలా చూడాలని సూచించారు. సమావేశంలో ఏపీపీ అరుణ, సీఐలు గోపీనాథ్, నైలు, ఎకై ్సజ్ సీఐ నజీర్హుస్సేన్, ఎస్సైలు పాల్గొన్నారు.ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం డీఏవో అంజి ప్రసాద్ కుంటాల: రాబోయే ఖరీఫ్ సాగుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఏవో అంజి ప్రసాద్ తెలిపారు. కుంటాలలో మార్క్ఫెడ్ సౌజన్యంతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. మోతాదుకు మించి ఎరువులు వాడడంతో కలిగే అనర్థాలను వివరించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్నలు కొనుగోలు చేయవద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏవో విక్రమ్, సీఈవో మురళీ కృష్ణ, ఏఈవోలు గణేశ్, శ్రీనివాస్, రైతులు ఉన్నారు. -
ఉపాధ్యాయులు బోధన మెరుగుపర్చుకోవాలి
● డీఈవో రామారావునిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు తమ బోధనా విధానాన్ని మెరుగుపర్చుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈవో రామారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు నిర్వహించే శిక్షణను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయుల చేతుల్లోనే భావిభారత ప్రగతి ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఐదు రోజుల శిక్షణ తరగతులను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. డీఆర్పీలు హైదరాబాద్లో శిక్షణ పొందారన్నారు. ఈ శిక్షణలో ఉపాధ్యాయుల అభ్యసన ఫలితాలు విభిన్న బోధనా మెలకువలు, డిజిటల్ బోధన, కృత్రిమ మేధ ఉపయోగించి అభ్యాసాలు కల్పించడం, జీవన నైపుణ్యాలు అందించడం, పనితీరు మెరుగుపరుచుకోవడం, నూత న సాంకేతికలు అలవర్చుకోవడం వంటి అంశాల గురించి వివరాలు అందిస్తారన్నారు. వీటన్నింటినీ ఉపాధ్యాయులు అవగాహన చేసుకుని తమ తరగ తి బోధనలో వినియోగించుకోవాలని సూచించా రు. ఐదు రోజుల శిక్షణను నారాయణ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ,గణితం, ఎస్జీటీ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు చాణ క్య పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్, ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు సమయానికి హాజరై, సమయపాలన పాటించి షెడ్యూల్ ప్రకారం శిక్షణలో పాల్గొనా లని సూచించారు. ఎంఈవో రమణారెడ్డి, అకడమి క్ మానిటరింగ్ అధికారి నర్సయ్య, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ప్రవీణ్కుమార్, ఆయా సబ్జెక్టుల ఇన్చార్జీలు పాల్గొన్నారు. -
ఫోన్ పోతే ఆందోళన వద్దు
● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా మీ సేవ ద్వారా ఫిర్యాదు చెయ్యాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. https://www.ceir. gov.in/ వెబ్ పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 52 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి, స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఎస్పీ జానకీషర్మిల ప్రధాన పోలీస్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మార్కెట్లో చౌకగా వస్తుందని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసుకోవాలని తెలిపారు. సీఈఐఆర్ వైబ్సెట్ ద్వారా ఇప్పటి వరకు పోయిన 1,309 ఫోన్లు రికవరీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఐటీ కోర్, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. -
బాదనకుర్తిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి
ఖానాపూర్: బుద్ధుడి శిష్యుడు విడిది చేసిన ఖానాపూర్ మండలం బాదనకుర్తిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని పలువురు వక్తలు కోరారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా బాదనకుర్తిలోని బుద్ధుని విగ్రహం వద్ద సోమవారం వేడుకలు నిర్వహించారు. బుద్ధుని శిష్యుడు బాదనకుర్తి గ్రామంలో విడిది చేస్తూ తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు బౌద్ధం విస్తరింపజేశారని తెలిపారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని బౌద్ధ క్షేత్రంగా మారుస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో సత్యపరిశోదక్ సమాజ్, బామ్ సేఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ రక్షక, మాజీ సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, బుద్దిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ జిల్లా అధ్యక్షుడు మాదారపు రాములు, నాయకులు రా ము, గంగన్న, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఎకరం స్థలం కేటాయించాలన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నిర్మల్ సీఏసీఎస్ చైర్మన్ సోమా భీమ్రెడ్డి, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నందెడపు చిన్ను, మండల అధ్యక్షులు భుజంగా శ్రీనివాస్రెడ్డి, ఓడ్నాల రాజేశ్వర్, గడ్డం ఇంద్రకరణ్రెడ్డి, బొల్లోజి నర్సయ్య, ఏనుగు లింగారెడ్డి, కొర్వ నవీన్, ఈటల శ్రీనివాస్, కొండ శ్రీనివాస్, గాజుల రవి కుమార్ ఉన్నారు. -
కుంటాలను ఆదర్శంగా నిలుపుదాం
● కలెక్టర్ అభిలాష అభినవ్ కుంటాల: రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమలు కోసం 28 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని, ఇందులో కుంటాల మండలాన్ని భూసమస్యలు లేని మండలంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుదామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మండలంలోని అంబుగామ గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవిన్యూ సదస్సులో మాట్లాడారు. భూభారతి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ప్రతీ రైతుకు రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో దరఖాస్తు చేసుకోని రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. వాటిని సుమోటోగా తీసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులతోపాటు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ద్వారా ఇప్పటి వరకు 431 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఈనెల 13 నుంచి 30 వరకు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సమస్యలు పరిష్కరిస్తాయని తెలిపారు. అనంతరం గ్రామస్తులు గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిని రేపటిలోగా నియమించాలని ఆదేశించారు. అనంతరం కుంటాల తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి కార్యక్రమంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్లు కమల్సింగ్, ఎజాజ్ అహ్మద్ఖాన్, ప్రవీణ్కుమార్, శ్రీకాంత్, లింగమూర్తి, డీటీ నరేశ్గౌడ్, ఆర్ఐలు అడెల్లు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నేలపై కూర్చుని.. ఓపికగా సమస్యలు విని..కుంటాల: భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మండలంలోని అంబుగామ గ్రామానికి వచ్చారు. గిరిజన మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ ఆహ్వానించారు. అనంతరం సదస్సుల్లో కలెక్టర్ నేలపై కూర్చొని ప్రజలతో మమేకమై సమస్యలను ఓపికగా విన్నారు. దరఖాస్తులు స్వీకరించారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
సేవకు ప్రతీక ఫ్లోరెన్స్ నైటింగేల్
● జీజీహెచ్లో ఘనంగా నర్సుల దినోత్సవం నిర్మల్చైన్గేట్: సేవకు ప్రతీక ఫ్లోరెన్స్ నైటింగేల్ అని జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్సింగ్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని సోమవారం ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సేవాతపనతో నర్సులు పని చేస్తున్నారని తెలిపారు. రోగుల ప్రాణాలను కాపాడడంలో వారే కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సునీల్ కుమార్ రాథోడ్, విశ్వనాథ్, గణేశ్, నర్సింగ్ సూపరింటెండెంట్ వనజ, విజయలక్ష్మి, అపర్ణ, కమలమ్మ ఆస్పత్రి సిబ్బంది, రక్త నిధి సిబ్బంది రాకేశ్ పాల్గొన్నారు. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో.. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నర్సింగ్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించడంలో నర్సుల సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విద్యుల్లత, నర్సింగ్ పర్యవేక్షకులు ధనలక్ష్మి , విజయలక్ష్మి, వైద్యులు, నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్లో పెట్టొద్దు
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణ నిర్మల్చైన్గేట్: ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని, ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, భూసమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితర అంశాలపై ప్రజల నుంచి 83 ఆర్జీలు వచ్చాయి. సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను శాఖల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక టెలీ ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 5 ఫోన్కాల్ అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. దూర ప్రాంతాల ప్రజలు 91005 77132 నంబరును సంప్రదించి వాట్సాప్ ద్వారా సమస్యలు పంపవచ్చని తెలిపారు. పకడ్బందీగా ప్రభుత్వ పథకాల అమలు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం మాట్లాడుతూ త్వరగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం గ్రామపంచాయతీలలో లబ్ధిదారుల లిస్టు వుంచి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను మండల స్థాయిలో త్వరితంగా పరిశీలించి బ్యాంకులకు పంపాలన్నారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉపాధి హామీ పనుల్లో తాగునీరు, టెంట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇటీవల రుణాల మంజూరులో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
కమనీయం.. శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలి ● సీనియర్ సివిల్ జడ్జి రాధిక నిర్మల్టౌన్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్ 14న నిర్వహించే లోక్అదా లత్లో కేసులు పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి జి.రాధిక సూచించారు. జిల్లా కేంద్రంలోని సివిల్ కోర్టులో సోమవారం మీడియాతో మాట్లాడారు. లోక్అదాలత్లో రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో క్రిమినల్, సివిల్, భూతగాదాలు, రోడ్డు ప్రమాదం, వివాహ, కుటుంబ తగాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని వివరించారు. న్యూస్రీల్ -
భారత సేనలకు శక్తినివ్వాలి
భైంసాటౌన్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై జరుగుతున్న పోరులో భారత సేనకు అనంత శక్తిని వ్వాలని కోరుతూ బీజేపీ నాయకులు ఆదివారం స్థానిక గట్టు మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రమూకలపై భీకర దాడులతో భారతశక్తిని ప్రపంచానికి చాటామని చెప్పారు. భారత దాడులకు బెంబేలెత్తిన పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని తెలిపా రు. కానీ, అంతలోనే తన వక్రబుద్ధిని చూపిందని పేర్కొన్నారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పేలా భారత సేనకు మరింత శక్తినివ్వాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రావుల రాము, నాయకులు వడ్నప్ శ్రీనివాస్, తోట లింగురాం, రావుల పోశెట్టి, తుమోల్ల దత్తాత్రి, గాలి రాజు, దిలీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కళాశాలలుగా కేజీబీవీలు
● జిల్లాలో 18 కస్తూర్బా పాఠశాలలు ● ఇప్పటికే 12 చోట్ల ఇంటర్ బోధన ● తాజాగా మరో నాలుగింటిలోనూ.. ● అందుబాటులోకి మరో 240 సీట్లు ● హర్షం వ్యక్తంజేస్తున్న విద్యార్థినులు లక్ష్మణచాంద: పేద, మధ్యతరగతికి బాలికల చదు వు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పా టు చేసింది. కార్పొరేట్కు దీటుగా బాలికలకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తోంది. కేజీబీవీలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం కొన్ని పా ఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చే స్తూ వస్తోంది. బాలికలకు ఇంటర్ విద్యను కూడా కస్తూరిబా విద్యాలయాల్లో బోధిస్తోంది. ఈసారి కూడా జిల్లాలోని నాలుగు కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. అందుబాటులోకి మరో 240 సీట్లు జిల్లాలో 18 కేజీబీవీలున్నాయి. ఇందులో ప్రతీ సంవత్సరం కొన్ని జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ అవుతూ వచ్చాయి. ఇప్పటికే జిల్లాలోని 14 విద్యాలయాలు అప్గ్రేడ్ అయ్యాయి. 2025–26 విద్యాసంవత్సరం కూడా నాలుగు కేజీబీవీలు జూనియర్ కళాశాలలుగా అప్గేడ్ర్ అయినట్లు జిల్లా సెక్టోరియ ల్ అధికారి సలోమి కరుణ తెలిపారు. ఇందులో సో న్, నిర్మల్ రూరల్, కుభీర్, లోకేశ్వరం కేజీబీవీలు న్నాయి. సోన్ కేజీబీవీలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు, నిర్మల్ రూరల్ కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, కుభీర్, లోకేశ్వరం కేజీబీవీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. నాలుగు కేజీబీవీలు జూనియర్ కళా శాలలుగా అప్గ్రేడ్ కావడంతో జిల్లాలో మరో 240 ఇంటర్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. సోన్ కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ లో 40సీట్లు, ఎంపీహెచ్డబ్ల్యూలో 40, నిర్మల్ రూరల్ కేజీబీవీలో ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కుభీర్, లోకేశ్వరం కేజీబీవీల్లో కంప్యూటర్ సైన్స్లో 40 సీట్ల చొప్పున అందుబాటులోకి వస్తున్నాయి. సంతోషంగా ఉంది న్యూవెల్మల్ కేజీబీవీ జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ కావడం సంతోషంగా ఉంది. కేజీబీవీలో పదో తరగతి పూర్తి చేసిన నేను తిరిగి ఇదే విద్యాలయంలో ఇంటర్ చదివేందుకు దరఖాస్తు చేసుకుంటాను. మాలాంటి పేద విద్యార్థినులకు ఇది ఒక మంచి అవకాశం. – వెన్నెల, విద్యార్థి, న్యూవెల్మల్ జిల్లా సమాచారం జిల్లాలోని కేజీబీవీలు: 18 ఇప్పటికే అప్గ్రేడ్ అయినవి: 12 తాజాగా అప్గ్రేడ్ అయినవి: 4 అందుబాటులోకి రానున్న సీట్లు : 240 -
విస్తరణపై ఆశలు
మహోర్ వరకు విస్తరిస్తే..భైంసా: జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఎన్హెచ్–161బీబీ, జిల్లాలో పొడవైన ఎన్హెచ్–61 రహదారుల విస్తరణపై ఆశలు చిగురిస్తున్నాయి. వీటి విస్తరణతోపాటు భైంసా–బాసర రహదారిని ఫోర్లేన్గా అభివృద్ధి చేస్తూ సుందరీకరించాలని ముధో ల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ ఇటీవల కాగజ్నగర్కు వచ్చిన కేంద్రమంత్రి నితిన్గడ్కరీని కోరారు. జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ఏడాదిలోనే రోడ్డు ప్రమాదాల్లో 28మంది మృతిచెందగా, మరో 67మంది తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. జిల్లాలో రెండు ప్రధాన రహదారులను విస్తరిస్తేనే ప్రమాదాలు నివారించవచ్చని, ఇందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని గతంలోనూ ఢిల్లీలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్తోనూ చర్చించారు. అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ఇందుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తంచేయడంతో జాతీయ రహదారుల విస్తరణపై ఆశలు చిగురిస్తున్నాయి. ఫోర్లేన్.. సెంట్రల్ లైటింగ్ హైదరాబాద్నుంచి వయా బోధన్–బాసర మీదుగా భైంసా వరకు 161బీబీ జాతీయ రహదారి పనులు కొనసాగుతుండగా పలు మార్పులు చేయాలనే డిమాండ్ ఉంది. బాసర నుంచి ట్రిపుల్ఐటీ వరకు, భైంసా నుంచి దేగాం గ్రామం వరకు రోడ్డును మరింత వెడల్పు చేయాలని, ఫోర్లేన్గా మార్చు తూ డివైడర్, సెంట్రల్ లైటింగ్ లాంటి సుందరీకరణ పనులు చేపట్టాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. అలాగే, బాసర నుంచి భైంసా మీదుగా మహోర్ వరకు ఈ జాతీయ రహదారిని అనుసంధానం చేసి ఆధ్యాత్మిక మార్గంగా అభివృద్ధి చేయాలని అడుగుతున్నారు. ఇక ఎన్హెచ్–61పై తానూరు మండలం బెల్తరోడ నుంచి నిర్మల్ వరకు ప్రతీ గ్రామం వద్ద రెండు వైపులా మీటర్ మేరకు విస్తరించాలని, డివైడర్ను నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రమాదాలకు అడ్డుకట్ట ఇలా.. జిల్లాలో భైంసా–బాసర ప్రధాన రహదారిపై తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 30 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్న ఈ రహదారి నిర్మాణ పనులు రెండేళ్లుగా కొనసాగుతుండగా 80శాతం పనులే పూర్తయ్యాయి. నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. భైంసా–నిర్మల్ జాతీయ రహదారి 41కిలోమీటర్లు మేర ఉంది. జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన బాసరకు.. మరో క్షేత్రమైన అడెల్లికి వెళ్లేందుకు ఈ మార్గంలోనే వేలాది మంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తారు. జిల్లాకేంద్రానికీ ఇదే ప్రధానమార్గం. ఇలాంటి ఈరోడ్డు రెండు వరుసలకే పరిమితం కావడం, పలుచోట్ల ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రెండు ప్రధాన రోడ్లు విస్తరిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశముంటుంది. విస్తరిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట ప్రధాన రహదారులు విస్తరిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. భైంసా మీదుగా రెండు హైవేలున్నా యి. పలు గ్రామాల్లో ఇరుకుగా ఉన్న ఈ రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్లను విస్తరించాలని కేంద్రమంత్రి నితిన్గడ్కరీని రెండుసార్లు కలిశాను. వినతిపత్రాలు అందజేశాను. ఈమేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. – రామారావుపటేల్, ముధోల్ ఎమ్మెల్యే వానల్పాడ్ వద్ద బాసర–భైంసా రహదారి చదువులమ్మ కొలువైన బాసర నుంచి భైంసా మీదుగా మహారాష్ట్రలో రేణుకామాత కొలువుదీరిన మహోర్ వరకు హైవేను విస్తరించాలని ఈ ప్రాంతవాసులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ మార్గాన్ని పొడిగిస్తే తెలంగాణతో పాటు మహారాష్ట్రకు చెందిన వేలాదిమంది యాత్రికుల కు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కారిడార్గా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇదివరకే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి దృష్టిని కోరారు. అత్యధికంగా జిల్లావాసులు మహోర్ యాత్రకు ఈ రోడ్డు గుండా వాహనాల్లో వెళ్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ఎలాగైనా కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి రహదారిని విస్తరించాలని వినతిపత్రం అందించారు. -
కొనుగోళ్లు సజావుగా సాగాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వొద్దని పేర్కొన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలన్నారు. నిర్లక్ష్యం చేసినవారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలుంటే రైతులు 91829 58858 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీసీవో రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. -
అడ్మిషన్ల కోసం ‘సర్కారు’ ప్రచారం
ఖానాపూర్: ప్రైవేటుకు దీటుగా సర్కారు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించాలని ఉపాధ్యాయులు గ్రా మాల్లో ప్రచారం చేస్తున్నారు. మండలంలోని మ స్కాపూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులను చేర్పించా లని మస్కాపూర్, ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్రచారం చే శారు. మస్కాపూర్ పాఠశాలలో 129 మంది విద్యార్థులకు పది పరీక్షల్లో 128 మంది ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం నరేందర్రావు ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 50మందికి పై గా 500కు పైగా, 20 మంది 540కి పైగా మార్కులు సాధించారని అవగాహన కల్పించారు. -
నిర్మల్
దారి కాచిన మృత్యువు! నిర్మల్ బైపాస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని కారు డ్రైవర్ వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 20258లోu గజ్జలమ్మ దేవికి పూజలు కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లను ఆదివా రం భక్తులు దర్శించుకున్నారు. జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, బోకర్, ధర్మాబాద్, ఇస్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవా ర్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. దేగాం వద్ద భైంసా–బాసర రహదారి ఇలా.. కొండుకూర్లో ఘనంగా పోచమ్మ బోనాలు కడెం: మండలంలోని కొండుకూర్ గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకున్నారు. మట్టికుండల్లో బోనం వండి మోదుగ ఆకుల్లో పోచమ్మకు నైవేద్యంగా సమర్పించారు. ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.న్యూస్రీల్ -
‘ఉపాధి’ అక్రమాలపై ‘వీఎంసీ’
వివరాలు.. జిల్లాలోని మొత్తం మండలాలు 18 మొత్తం గ్రామపంచాయతీలు 400 జిల్లాలోని మొత్తం జాబ్ కార్డులు 1.77 లక్షలు కూలీల సంఖ్య 3.33 లక్షలు యాక్టివ్ జాబ్ కార్డులు 1.30 లక్షలు యాక్టివ్ కూలీల సంఖ్య 2.28 లక్షలు నిర్మల్చైన్గేట్: ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిఘా వ్యవస్థను ప్రవేశపెడుతోంది. గ్రామస్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల (వీఎంసీ) ఏర్పాటుతో అక్రమాలు, నిధుల దుర్వినియోగం, గోస్ట్ వర్కర్లను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ ట్రాకింగ్, రియల్–టైమ్ రిపోర్టింగ్ ద్వారా పథకం బలోపేతం కానుంది. వీఎంసీల ఏర్పాటు విధానం ప్రతీ గ్రామ పంచాయతీలో ఐదుగురు సభ్యులతో వీఎంసీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలతోపాటు సగం మంది మహిళలు ఉండేలా కమిటీలను రూపొందిస్తున్నారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘ సభ్యులు, సివిల్ క్లబ్ సభ్యులు ఈ కమిటీల్లో ఉంటారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాదించి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా కలెక్టర్కు, తద్వారా రాష్ట్ర అధికారులకు నివేదికలు పంపుతారు. ఈ కమిటీలు ఆరు నెలలపాటు పనిచేస్తాయి. జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు, 1.77 లక్షల జాబ్ కార్డులు, 3.33 లక్షల కూలీలు ఉన్నారు, వీరిలో 1.30 లక్షల జాబ్ కార్డులు, 2.28 లక్షల కూలీలు యాక్టివ్గా ఉన్నారు. కమిటీల పర్యవేక్షణ విధులు వీఎంసీలు వారానికి ఒకసారి పనులను పరిశీలిస్తాయి. ప్రతి నెల మూడో శుక్రవారం కూలీలు, సిబ్బందితో సమావేశమై పనుల నాణ్యత, వ్యయం, రికార్డులను తనిఖీ చేస్తాయి. సోషల్ ఆడిట్ సమయంలో నివేదికలు సమర్పించి, అధికారులు చర్యలు తీసుకునేలా చేస్తాయి. ఈ వ్యవస్థతో పథకం మరింత పారదర్శకంగా అమలవుతుందని అధికారులు ఆశిస్తున్నారు. వీఎంసీలు ఏర్పాటు చేస్తున్నాం.. గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనుల పారదర్శకత కోసం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ(వీఎంసీ)లను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన సర్క్యూలర్ను పంచాయతీ కార్యదర్శులకు అందజేశాం. నిబంధనల మేరకు వారు కమిటీలో సభ్యులను ఎంపిక చేసి ఒకటి రెండు రోజుల్లో నివేదిక అందజేస్తారు. కమిటీలను కలెక్టర్కు నివేదిస్తాం. రాష్ట్ర అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత వీఎంసీలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. – రాధ, ఎంపీడీవో, లక్ష్మణచాంద ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ప్రతీనెల మొదటి వారంలో తనిఖీలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
పేపర్ మిల్లును సందర్శించిన రైతులు
దస్తురాబాద్: మండల కేంద్రానికి చెందిన రైతులు శనివారం సిర్పూర్ పేపర్ మిల్లును సందర్శించారు. పేపర్ తయారు విధానాన్ని, పేపర్ తయారీకి వినియోగించే నీలగిరి, సరుగుడు మొక్కల నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నర్సరీ నిర్వాహకులు మాట్లాడారు. పేపర్కు అవసరమైన నీలగిరి, సరుగుడు మొక్కలు రైతులకు అందిస్తామని తెలిపారు. నీలగిరిలో 25 రకాల మొక్కల పెంపకం చేసి రైతుల భూమిని పరిశీలించి మొక్కలు అందిస్తామని పేర్కొన్నారు. మూడేళ్లకు పంట చేతికి వస్తుందని తెలిపారు. రాజీవ్ యువవికాస్ దరఖాస్తులు అందించాలి నిర్మల్టౌన్: రాజీవ్ యువ వికాస్ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 11 సాయంత్రం 5:30 గంటల వరకు వాటిని మున్సిపల్ కార్యాలయం కౌంటర్లో అందజేయాలని కమిషనర్ జగదీశ్వర్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫారంతోపాటు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, పాన్ కార్డు జిరాక్స్ సమర్పించాలని సూచించారు. -
ఒక్క కొడుకూ ఆర్మీలోనే..
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన రాంలలిత భర్త మల్లేశ్ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ దంపతులకు ఇద్దరు బిడ్డలు, ఒక కుమారుడు. రెక్కలకష్టంతో ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేశారు. ఒక్కగానొక్క కుమారుడినీ దేశసేవ కోసం పంపించారు. లలిత, మల్లేశ్ దంపతుల కుమారుడు కార్తీక్ ప్రసుతం ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. కొడుకు తనవద్ద లేకున్నా.. కోట్లాదిమంది రక్షణలో భాగస్వామిగా ఉన్నాడని లలిత గర్వంగా చెబుతోంది. తల్లిగా కాస్త బాధ ఉన్నా.. ఎంతోమంది తల్లుల కోసం తాను పనిచేస్తున్నాడన్నది సంతోషాన్నిస్తోందంటున్నారు. -
ఉద్యాన రైతులకు ఊతం..!
● పండ్ల తోటలు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం ● ఉద్యానశాఖ ప్రణాళిక సిద్ధంమామడ: పండ్ల తోటలు, కూరగాయలు, ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు 2025–26 కోసం ఉద్యాన శాఖ ద్వారా సమగ్ర ప్రణాళికను రూపొందించింది. సమీకృత అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్, జాతీయ వెదురు మిషన్ నిధులతో జిల్లాలో 250 ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు అధికారులు రైతులకు అవగాహ న కల్పిస్తున్నారు. రాయితీలు, పరికరాల సబ్సి డీలతో రైతుల ఆర్థిక భారం తగ్గించి, ఉద్యాన రంగంలో ఉత్పాదకతను పెంచడమే లక్ష్యం. పండ్ల తోటలకు సబ్సిడీ.. సమీకృత అభివృద్ధి మిషన్ ద్వారా మామిడి, నిమ్మ, జామ, బత్తాయి తోటల సాగుకు హెక్టారుకు రూ.48 వేలు నాలుగేళ్లలో అందిస్తారు. డ్రాగన్ ఫ్రూట్, అరటి, బొప్పాయి సాగుకు ఎకరానికి రూ.7,200 సబ్సిడీ ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్, నీటి కుంటలు, వర్మీ కంపోస్ట్ యూనిట్లకు 50% రాయితీ, 70 కిలోల సామర్థ్యం గల సోలార్ క్రాప్ డ్రైయర్(రూ.2.50 లక్షలు)కు 40% రాయితీతో రూ.లక్షకు అందుబాటులో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 55% రాయితీ అందిస్తారు. కూరగాయల సాగుకు ప్రోత్సాహం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద దొండ, కా కర, బీర, సొరకాయ వంటి తీగజాతి కూరగా యల సాగుకు పందిళ్ల నిర్మాణానికి ఎకరానికి రూ.లక్ష సబ్సిడీ ఇస్తారు. బిందు, తుంపర సేద్య పరికరాలకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100%, సన్నకారు రైతులకు 90%, 5 ఎకరాలకు పైగా భూ మి ఉన్నవారికి 80% రాయితీ ఉంటుంది. వెదు రు సాగుకు ఎకరానికి రూ.24,000 అందిస్తారు. ఆయిల్పామ్ సాగుకు.. ఆయిల్పామ్ సాగుకు 90% సబ్సిడీతోపాటు, తోటల సంరక్షణ, అంతర పంటల సాగుకు ఎకరానికి రూ.2,100 చొప్పున నాలుగేళ్లపాటు అందిస్తారు. ఈ చర్యలు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు, ఉద్యాన రంగంలో స్థిరత్వాన్ని సాధిస్తాయి. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. పండ్ల తోటలు, కూరగాయలు, ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సాగు కు ముందుకు వచ్చే రైతులకు ప్రొత్సాహకాలు అందిస్తున్నారు. ఈ యేడాది జిల్లాలో ఉద్యానసాగును పెంచేందుకు రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – బీవీ.రమణ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి -
ఉత్తమ ఉద్యోగులకు ప్రగతిచక్రం అవార్డులు
భైంసాటౌన్: పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో శనివారం ప్రగతిచక్రం అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు ఉద్యోగులకు డీఎం హరిప్రసాద్ అవార్డులు అందజేశారు. కండక్టర్లు భూమేశ్, కవిత, ఎల్ఎస్.గౌడ్, డ్రైవర్లు సంజీవ్, రఫీక్ఉద్దీన్, మల్లికార్జున్తోపాటు మెకానిక్ సెక్షన్లో పనిచేసే నర్సయ్య, శివరాజ్, శంకర్, నరేందర్, రవీందర్ అవార్డులు అందుకున్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ భగవంత్రావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మైనర్లకు వాహనాలు ఇస్తే.. ఓనర్లపై కేసు
● నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా నిర్మల్టౌన్: మైనర్లకు వాహనాలు ఇస్తే ఓనర్లపై కేసు నమోదు చేస్తామని నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. జిల్లా కేంద్రంలో మైనర్ డ్రైవింగ్పై శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 10 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. దానికి పూర్తి బాధ్యత యజమానులు వహించాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ఉండడంతో తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై చట్టప్రకారం కేసును నమోదు చేయడం జరుగుతుందన్నారు. కొద్దిరోజులుగా మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ.. పోలీస్ తనిఖీల్లో పట్టుబడుతున్నారని తెలిపారు. పట్టుబడిన వారికి జరిమానాలు విధిస్తూ.. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం వలన ఆ జాగ్రత్తగా అతివేగంతో వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలకు కారణం అవుతారని తెలిపారు. ఏఎస్పీ వెంట పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొడుకులు..
సారంగపూర్ మండలం తాండ్రకు చెందిన సుగంధి, సుశీల, చంద్రకళ, రాజమణి అక్కాచెల్లెళ్లు. ఇందులో సుశీల చిన్నకుమారుడు సంతోష్, చంద్రకళ పెద్ద కొడుకు ప్రవీణ్, రాజమణి పెద్దకుమారుడు శ్రీకాంత్ సైన్యంలో ఉన్నారు. ఈ గ్రామం నుంచి పలువురు సైన్యంలో పనిచేస్తున్నా.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల కుమారులు ముగ్గురూ దేశరక్షణలో ఉండటం విశేషం. కశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతంలోనే విధులు నిర్వర్తించడం గమనార్హం. తమ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు సైన్యంలో చేరారని, వారు దేశం కోసం పనిచేయడం తమకు గర్వంగా ఉందని ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్, యుద్ధవాతావరణ నేపథ్యంలో ఎప్పుడు వీలుంటే అప్పుడు తమ బిడ్డలతో మాట్లాడుతున్నామంటున్నారు. -
గల్ఫ్ మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
● ఎన్ఆర్ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పర్కిపండ్ల నిర్మల్ఖిల్లా/సారంగపూర్: ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన సారంగాపూర్ మండలం మలక్చించోలి గ్రామానికి చెందిన కుర్మే దేవన్న(51)గత గురువారం అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని అతను పనిచేసే కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది. దేవన్న మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి తెప్పించే ఏర్పాట్లు చేస్తామని ఎన్ఆర్ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పర్కిపండ్ల తెలిపారు. ఈ మేరకు శనివారం మృతుడి కుటుంబీకులు జిల్లాకేంద్రంలో స్వదేశ్ను కలిసి దేవన్న వివరాలు అందించారు. తక్షణమే దుబాయ్ ఎంబసీకి సమాచార మందించి ఇండియాకు మృతదేహం తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
● జానకి షర్మిల నిర్మల్టౌన్: పోలీసులు సమయపాలన పాటిస్తూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బందితో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది డ్యూటీలపై రివ్యూ చేశారు. పోలీసులు క్రమశిక్షణతో అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ.. తమ కు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. విధుల పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నీతి నిజాయితీతో పనిచేసే వారికి పోలీస్ శాఖలో ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించా రు. ప్రజలు, గ్రామ పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకుని గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలా పాల సమాచారం సేకరించాలని తెలిపారు. ఇందులో ఏఎస్పీలు అవినాష్కుమార్, రాజేశ్మీనా, అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యువ వికాసానికి సిబిల్ అడ్డంకి
● రుణాల మంజూరుకు ఆర్బీఐ నిబంధన ● మార్గదర్శకాలు పాటిస్తామంటున్న బ్యాంకర్లు ● ఆందోళనలో దరఖాస్తుదారులు నిర్మల్చైన్గేట్: నిరుద్యోగులకు స్వయం ఉపాధివైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద స్వయం ఉపాధి పొందేలా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు రూ.6 వేల కోట్లు కేటాయించింది. దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా అర్హులను ఎంపిక చేసి రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే రూ.50 వేలకు మించి రుణాలకు ఆర్బీఐ సిబిల్ స్కోర్ నిబంధన అడ్డంకిగా మారింది. దీంతో రుణాల మంజూరులో అనిశ్చితి నెలకొంది. పెద్ద ఎత్తున దరఖాస్తులు ఈ పథకం కోసం జిల్లా యువత నుంచి 35,177 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల నుంచి వచ్చిన ఈ దరఖాస్తులను ఎంపీడీవోలు ఆన్లైన్లో పరిశీలించి, అర్హుల దరఖాస్తులను బ్యాంకులకు పంపారు. బ్యాంకులు సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తాయి. రుణాల మంజూరు విధానం పథకం కింద రూ.2 నుంచి రూ.4 లక్షల వ్యయం ఉన్న యూనిట్లకు 30%, రూ.1 నుంచి రూ.2 లక్షల యూనిట్లకు 20%, రూ.50 వేల నుంచి రూ.లక్ష వ్యయం ఉన్న యూనిట్లకు 10% రాయితీ ఇస్తారు. రూ.50 వేల లోపు అయితే రుణం పూర్తిగా రాయితీ ఉంటుంది. అయితే రూ.50 వేలకుపైగా మంజూరు చేసే రుణాలకు సిబిల్ స్కోర్ తప్పనిసరని బ్యాంకర్లు తెలిపారు. మారిన ఆర్బీఐ నిబంధనలు గతంలో పేదలకు రుణాలు సులభంగా అందేవి. ప్రస్తుతం రూ.50 వేలు దాటితే పాన్ కార్డ్, సిబిల్ స్కోర్ తప్పనిసరి. దీంతో యువతలో రుణాలపై అనుమానాలు చోటు చేసుకున్నాయి. కార్పొరేషన్ దరఖాస్తులు మంజూరైన రాయితీ నిధులు యూనిట్లు కోట్లలో ఎస్సీ 7,350 2,894 39 96 ఎస్టీ 3,627 2,325 25 35 బీసీ 17,286 3,876 41 00 ఏంబీసీ/ఈబీసీ 923 842 8.90 మైనార్టీ 5,926 1,045 17 41 క్రిస్టియన్ 65 27 0 42 రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారమే.. వివిధ రకాల రుణ మంజూరులో బ్యాంకులు తప్పనిసరిగా రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పాటించాల్సి ఉంటుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇచ్చే రుణాలకు సంబంధించి సిబిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకోవద్దనే గైడ్లైన్స్ ఏమీ మాకు రాలేదు. అర్హులందరికీ నిబంధనల మేరకు రుణాలు మంజూరు చేస్తాం. – బి.రాంగోపాల్, లీడ్ బ్యాంకు మేనేజర్ -
నిర్మల్
జీవన రేఖ.. వివక్షకు ప్రతీక నిర్మల్ జిల్లాకు బాసర–లక్సెట్టిపేట రహదారి జీవన రేఖగా ఉంది. తూర్పు, పశ్చిమ జిల్లాలను కలుపుతూ 175 కిలో మీటర్ల మేర ఈ రహదారి వ్యాపించి ఉంది. శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 202510లోu నిర్మల్చైన్గేట్: ఇంటర్నెట్, సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్లు, టెలివిజన్ వంటి సాంకేతిక సాధనాలు జిల్లా ప్రజల జీవనశైలిని మార్చేస్తున్నాయి. రాత్రి 9 గంటలకే నిద్రించే వారు ఇప్పుడు అర్థరాత్రి దాటినా ఫోన్లతో కాలం గడుపుతున్నారు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా జిల్లాలో 1,00,052 మంది కంటిచూపు సమస్యలతో, 30% మంది నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఇటీవలి వైద్య నివేదికలు వెల్లడించాయి. ఈ సమస్యలు మానసిక ఆందోళన, ఏకాగ్రత లోపం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు, యువత దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆధునిక జీవనశైలి.. గతంలో రాత్రి 8 గంటలకే నిద్రపోయే గ్రామీణ, పట్టణ ప్రజలు ఇప్పుడు పని ఒత్తిడి, మానసిక ఆందోళనలతో అర్ధరాత్రి దాటినా నిద్రపోవడం లేదు. యువత పార్టీలు, బార్లలో రాత్రి వేళల్లో మద్యం, జంక్ ఫుడ్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. జీర్ణం కాకముందే నిద్రించడం వల్ల శ్వాసనాళాలపై ఒత్తిడి పెరిగి, గురక, నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు స్లీపింగ్ టాబ్లెట్స్, మత్తు పదార్థాలపై ఆధారపడుతూ ఒక సమస్య నుంచి మరో సమస్యలో చిక్కుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటిచూపుపై సెల్ఫోన్ ప్రభావం.. పిల్లలకు భోజనం తినిపించేందుకు తల్లిదండ్రులు రెండేళ్ల వయసు నుంచే సెల్ఫోన్ ఇస్తున్నారు. విద్యార్థులు హోంవర్క్, ప్రాజెక్టుల కోసం ఇంటర్నెట్పై ఆధారపడుతూ గంటల తరబడి స్క్రీన్లను చూస్తున్నారు. దీనివల్ల కళ్లలో నీరు కారడం, దురద, చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కంటి వైద్యులు తెలిపారు. పిల్లల స్క్రీన్ టైమ్ను తగ్గించాలని, తల్లిదండ్రులు సొంత ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. న్యూస్రీల్ అర్ధరాత్రి దాటినా ఫోన్లో ఆటలు ఫేస్బుక్, వాట్సాప్ టెక్నాలజీ ప్రభావం రోజుకు 8 గంటల నిద్ర ఆరోగ్యమంటున్న వైద్యులుజిల్లాలో ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి పరీక్షలు.. పరీక్షలు నిర్వహించిన మొత్తం విద్యార్థులు 46,453బాలురు 21,807, బాలికలు 24,646దృష్టి లోపం గుర్తించిన విద్యార్థులు 1,578బాలురు 853, బాలికలు 7256 నుంచి 14 ఏళ్లలోపు దూరపు చూపు తక్కువ ఉన్నవారు 1,7356 నుంచి 14 ఏళ్లలోపు కంటి సమస్యలతో బాధపడుతున్నవారు 2515 నుంచి 40 ఏళ్లలోపు దూరపు చూపు తక్కువ ఉన్నవారు 49,51240 ఏళ్లు పైబడి దగ్గర చూపు తక్కువ ఉన్నవారు 48,811కంటి మోతి బిందు ఉన్నవారు 7,523 మోతి బిందు ఆపరేషన్ చేయించుకున్న వారు6,242 నిద్ర సమయం ఇలా.. వైద్యుల సిఫార్సు ప్రకారం, రోజుల వయసు శిశువులకు 18 గంటలు, ఏడాది లోపు చిన్నారులకు 14–18 గంటలు, 1–3 ఏళ్ల వారికి 12–15 గంటలు, 3–5 ఏళ్ల వారికి 11–13 గంటలు, 5–12 ఏళ్ల వారికి 9–11 గంటలు, 12–19 ఏళ్ల వారికి 9–10 గంటలు, 21 ఏళ్ల పైబడిన వారికి 7–8 గంటలు, 50 ఏళ్ల పైబడిన వారికి 5–7 గంటల నిద్ర అవసరం. ఈ సమయాన్ని పాటించడం ఆరోగ్యానికి కీలకం. సాంకేతికత, మారిన జీవనశైలి వల్ల నిద్రలేమి, కంటిసమస్యలు పెరుగుతున్నాయి. యువత, పిల్లలు స్క్రీన్ టైమ్ను తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర అలవాట్లను అలవర్చుకోవాలి. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అవగాహన కల్పించి, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించాలి. ఈ సమస్యలను అధిగమించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
ఏపీ పోలీసుల తీరుపై జర్నలిస్టుల నిరసన
నిర్మల్: నిజాలను నిక్కచ్చిగా, వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా ప్రచురిస్తున్న వార్తాపత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో సోదాలు జరపడంపై అన్ని జర్నలిస్టు సంఘాలు, నిర్మల్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో నిరసన తెలిపారు. విశ్రాంతి భవనం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కలెక్టర్ అభిలాష అభినవ్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యలను జర్నలిస్టులపై చేపట్టడం దారుణమన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వాలే ఇలా పోలీసులతో కక్ష సాధింపులు చర్యలకు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. తమ నిరసనను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడేలా చూడాలని కలెక్టర్ అభిలాష అభినవ్ను కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వంతోపాటు సమాచార పౌరసంబంధాలశాఖ దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ తెలిపారు. నిరసనలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐజేయూ), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(143), తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్, మున్నూరు కాపు జర్నలిస్టు యూనియన్, తెలుగు ప్రింట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్, నిర్మల్ ప్రెస్క్లబ్, తదితర సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్కు మెమోరాండం -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కూడా తక్కువగా ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది. భూసమస్యల పరిష్కారానికి భూభారతి కుంటాల: భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందని భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి తెలిపారు. మండలంలోని పెంచికల్పాడ్, దౌనెల్లి, అందాకూర్లో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మాట్లాడారు. గ్రామాల్లోని రైతుల సమస్యలు ఉంటే పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో 72 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ కమల్సింగ్ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కమల్ సింగ్, ఎజాజ్ అహ్మద్ఖాన్, ప్రవీణ్కుమార్, లింగమూర్తి, శ్రీకాంత్, డీటీ నరేశ్గౌడ్, ఆర్ఐలు అడెల్లు, రాజేశ్వర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
మందులు అందుబాటులో ఉంచాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా డ్రగ్ స్టోర్లో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్సింగ్ సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్ను శుక్రవారం పరిశీలించారు. అవసరమైన మందులను ఉమ్మడి జిల్లా మెయిన్ డ్రగ్ స్టోర్ నుంచి లేదా రాష్ట్రం నుంచి ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని సూచించారు. వారివెంట నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డాక్టర్ సునీల్ సిబ్బంది పాల్గొన్నారు. పాలీసెట్కు ఏర్పాట్లు నిర్మల్ఖిల్లా: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష పాలిసెట్– 2025కు జిల్లాలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.రమేశ్ తెలిపారు. ఈనెల 13న జిల్లా కేంద్రంలోని 8 పరీక్ష కేంద్రాల్లో 2,422 మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సోఫీ నగర్ గురుకుల కళాశాల, వశిష్ఠ డిగ్రీ కాలేజ్, వశిష్ఠ జూనియర్ కాలేజ్, దీక్ష డిగ్రీ కాలేజ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్తోపాటు హెచ్బీ పెన్సిల్, బాల్పాయింట్ పెన్తో సకాలంలో హాజరు కావాలని సూచించారు. ఉదయం 11 నుంచి 1:30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. -
రైతులకు దొంగల బెడద
కుంటాల: మండల శివారులోని రైతుల పంట పొలాల వద్ద ఉన్న బోరుబావి స్టార్టర్లు, విద్యుత్ మోటార్ల చోరీలు ఆగడం లేదు. వరుస దొంగతనాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది నుంచి ఈ దొంగతనాలు కొనసాగుతున్నప్పటికీ, అధికారులు, పోలీసుల నుంచి చర్యలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో చివరి నీటి తడుల కోసం రైతులు బోర్లు, బావులపైనే ఆధారపడతారు. దొంగలు ఇదే అదనుగా చోరీలకు పాల్పడుతున్నారు. సునాయాసంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు స్థానికులే చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దొంగతనాలతో ఆర్థిక, భద్రతా సమస్యలు మండల శివారులో ఏడాదిగా సుమారు 30 రైతులకు చెందిన స్టార్టర్లు చోరీ అయ్యాయి. ఒక్కో స్టార్టర్ ధర రూ.2 వేల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. దొంగలు అర్ధరాత్రి సమయంలో విద్యుత్ తీగలను కత్తిరించి స్టార్టర్లను ఎత్తుకెళ్తున్నారు. ఈ ప్రక్రియలో కత్తిరించిన తీగలకు విద్యుత్ సరఫరా కొనసాగడంతో రైతులు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల ఒకే రోజు ఐదు స్టార్టర్లు చోరీ అయ్యాయి. పంచాయతీ నర్సరీకి చెందిన సింగిల్ ఫేజ్ మోటార్, ఆరు స్టార్టర్ల దొంగతనంతో రూ.25 వేల నష్టం వాటిల్లిందని పంచాయతీ కార్యదర్శి రాజబాపు తెలిపారు. కఠిన చర్యలకు రైతుల డిమాండ్.. రైతులు వ్యయప్రయాసలకు ఓర్చి పంటలు సాగు చేస్తుండగా, ఈ దొంగతనాలు ఆర్థిక భారంగా మారుతున్నాయి. రాత్రిపూట పొలాల వద్ద లేని సమయాన్ని దొంగలు ఉపయోగించుకుంటున్నారు. బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదు. అధికారులు తక్షణం స్పందించి దొంగలను పట్టుకొని, న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. స్టార్టర్లు, మోటార్లు ఎత్తుకెళ్తున్నవైనం.. వరుస ఘటనలతో అన్నదాత ఆందోళన పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆగని చోరీలు పొట్టపెల్లిలో మూడు విద్యుత్ మోటార్ల చోరీ లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కె) గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు విద్యుత్ మోటార్లు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన రైతులు చించోలి సాయన్న, పోతుగంటి శ్రీధర్, పీచర గ్రామానికి చెందిన బెడద నరేశ్ పొట్టపెల్లి గ్రామ సమీపంలోని డీ–16 కాలువ వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని పంటలకు మళ్లిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు రైతులకు చెందిన మోటార్లను, విద్యుత్ కేబుల్తో సహా ఎత్తుకెళ్లారు. శుక్రవారం పొలాల వద్దకు వెళ్లిన రైతులు గమనించి బాధిత రైతులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు వెళ్లిన రైతులు మోటార్లను చూసి ఆవేదన చెందారు. మళ్లీ కొనుగోలు చేయాలంటే రూ.25 వేలు అవుతుందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్సై సుప్రియ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కంటి పరీక్షలు చేస్తాం..
చిన్న వయసులో కంటి సమస్యలు గుర్తించాలి. సమస్యలు ఉండే విద్యార్థులు చదువుతోపాటు, ఇతర ఏ అంశంపై ఏకాగ్రత పెట్టలేరు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి, చికిత్స అందిస్తే వారికి మేలు జరుగుతుంది. ప్రధానంగా పాఠశాల వయస్సులో ఆటలు ఆడించడం వల్ల కంటి సమస్యలను కొంత నివారించవచ్చు. – డాక్టర్ శ్రీనివాస్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం జిల్లా అధికారి8 గంటల నిద్ర తప్పనిసరి.. ప్రతీ పది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధ పడుతున్నారు. వ్యక్తికి కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. ఆరు, అంతకన్నా తక్కువ గంటలు నిద్రపోతే ఏకాగ్రత లోపిస్తుంది. జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో కేన్సర్తో పోరాడే శక్తి 70 శాతం తక్కువ ఉంటుంది. నిద్రలేమితో మానసిక, శారీరక ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్స్ తగ్గుతాయి. సెక్స్వల్ హార్మోన్స్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. – డాక్టర్ సురేశ్, సీనియర్ కంటి వైద్యనిపుణుడు సుఖ నిద్ర కోసం జాగ్రత్తలు.. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు, ఇతరత్రా డిజిటల్ స్క్రీన్లు చూడొద్దు. అవి నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాఫీ తాగితే బాగా నిద్ర పడుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. మెదడు చుట్టూ ప్రవహించే కెఫిన్ గాఢనిద్రను దూరం చేస్తుంది. మద్యం సహజసిద్ధమైన నిద్రను దూరం చేస్తుంది. గాఢ నిద్రను అడ్డుకుంటుంది. రాత్రి 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. వ్యాయామం, యోగాసనాలు సుఖనిద్రకు దోహదపడతాయి. – డాక్టర్ రత్నాకర్, ఫిజీషియన్ -
‘పర్యాటకం’పై కదలిక..!
● బంగల్చెరువు, మొసళ్లపార్కుపై అభివృద్ధి కోసం.. ● టూరిజం మంత్రి, చైర్మన్ దృష్టికి.. ● వినతిపత్రాలు ఇచ్చిన గ్రంథాలయ చైర్మన్ ● సంబంధిత అధికారులతో కలెక్టర్ భేటీ ● అవశ్యకతపై ‘సాక్షి’ వరుస కథనాలునిర్మల్: ప్రశ్నార్థకంగా మారిన జిల్లా పర్యాటక అభివృద్ధిపై ‘సాక్షి’ వరుస కథనాలతో కొంత కదలిక కని పిస్తోంది. జిల్లా కేంద్రంలోని బంగల్చెరువు(వినా యకసాగర్), సోన్ మండలంలోని మొసళ్ల మ డుగును టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేయాల న్న డిమాండ్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కా ర్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి దృష్టికి వెళ్లింది. గతనెలలో కార్పొరేషన్ చైర్మన్ స్వయంగా ఈ రెండు ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. తాజాగా ఈ ప్రాంతాల పరిస్థితి, అభివృద్ధి పనులు, సంబంధిత భూముల విషయంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం కావడం పర్యాటక అభివృద్ధిపై ఆశలు బలపరుస్తున్నాయి. మంత్రిని కలిసిన గ్రంథాలయ చైర్మన్.. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నా.. కనీసం పట్టించుకునేవారు లేరన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇదే విషయంపై తరచూ ‘సాక్షి’ కథనాలనూ ప్రచురిస్తోంది. ఈక్రమంలోనే ఇటీవల జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. గతనెల 20న పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డిని జిల్లాకు రప్పించారు. ఇక్కడి ప్రాంతాలను చూపించారు. మళ్లీ ఈనెల 7న హైదరాబాద్ వెళ్లి చైర్మన్ను కలిసి అభివృద్ధి కోసం పనులు చేపట్టాలని గుర్తుచేశారు. అదేరోజు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ద్వారా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాయించారు. తాజాగా శుక్రవారం హైదరాబాద్లో మంత్రి జూపల్లిని స్వయంగా కలిసి జిల్లాలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అధికారులతో కలెక్టర్ భేటీ.. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి జిల్లా అధికారులూ చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పారెస్పీ, అటవీశాఖ, రెవెన్యూ అ ధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు.సోన్ మండలం పాక్పట్ల దగ్గర ఉన్న మొసళ్ల మడుగు అభివృద్ధిపై చర్చించారు. అక్కడ ఉన్న భూమి, చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది. నిర్మల్ ఉత్సవాల పేరిట మూడురోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ అప్పటి నుంచే టూరిజంపైనా దృష్టిపెట్టారు. ఇప్పటికే పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. పుష్కలంగా అవకాశాలు.. జిల్లాలో పర్యాటక అభివృద్ధి డిమాండ్ దశాబ్ద కా లంగా ఉంది. కానీ.. ఈ దిశగా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే పాలకులు, అధికారులు లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. ఇటు సోన్ వంతెన, గోదావరి మొదలుకుని మహబూబ్ఘాట్ వరకు, అటు బాస ర నుంచి కడెం దాకా ఎన్నో ఉన్నాయి. ‘సాక్షి’ కొంతకాలంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అవశ్యకతపై తరచూ కథనాలను ప్రచురిస్తోంది. ప్రస్తుతానికి ఈ రెండింటిపైనే.. నిర్మల్ కేంద్రంగా టూరిజం సర్క్యూట్ చేస్తామంటూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతలయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం నుంచి భారీగా నిధులు ఆశించే పరిస్థితి లేదు. ఈనేపథ్యంలోనే ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలోని బంగల్చెరువు, పాక్పట్ల వద్ద మొసళ్ల(క్రోకోడైల్) పార్కును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఓవైపు కలెక్టర్, మరోవైపు అధికార పార్టీకి చెందిన గ్రంథాలయసంస్థ చైర్మన్ పర్యాటకాభివృద్ధికి ప్రయత్నిస్తుండటంతో ఈసారి ఎంతోకొంత మార్పు వస్తుందని జిల్లావాసులు ఆశిస్తున్నారు. పర్యాటకాభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం.. జిల్లాలో పర్యాటకంగా చాలాప్రాంతాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం. పాక్పట్ల దగ్గర క్రోకోడైల్ పార్క్ కోసం అటవీశాఖ ద్వారా చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా ప్రతిపాదనలకు సంబంధించి టూరిజం శాఖ నుంచి అధికారులు జిల్లాకు రావాల్సి ఉంది. – అభిలాష అభినవ్, కలెక్టర్ -
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
● అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ కడెం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, తాగునీటి సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ ఆదేశించారు. మండలంలోని లింగాపూర్ కొనుగోలు కేంద్రాన్ని గురువా రం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని పీఎస్ఎస్ గోదాంలో గన్నీ సంచుల స్టాక్ను, కొనుగోళ్ల రికార్డులను పరిశీలించారు. గన్నీ సంచుల కొరత లేదని, తూకం చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పౌరసరాఫరాల సంస్థ మేనేజర్ సుధాకర్, డీఎస్వో పాపయ్య, తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ శారద ఉన్నారు. ధాన్యం ఎప్పటికప్పుడు తరలించాలిదస్తురాబాద్: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ ఆదేశించారు. మండలంలోని రేవోజీపేట కొనుగోలు కేంద్రాన్ని గురువా రం తనిఖీ చేశారు. అకాల వర్షాలు కురిసే ఆవకాశం ఉన్నందున కేంద్రాల్లో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు గన్నీ సంచులు ఇవ్వడం లేదని అదపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మాయిశ్చర్ వచ్చినా తూకం వే యడం లేదని పేర్కొన్నారు. దీంతో రైతులు కల్లాలో పోసిన ధాన్యం రిజిస్టర్ను, ధాన్యం మాయిశ్చర్ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ సీఈవో రాజేందర్కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని డీఎస్వోను ఆదేశించారు. మాయిశ్చర్ వచ్చిన ధాన్యం వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. -
20న బీడీ కార్మికుల సమ్మె
నిర్మల్చైన్గేట్: ఈనెల 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు పాల్గొంటారని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ బీడీ ఫ్యాక్టరీలో యాజమాన్యాలకు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రాజన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కనీస వేతనాలు అమలు, కనీస పెన్షన్ రూ.9 వేలు, నాలుగు లేబర్ కోడ్లు, పని గంటల పెంపు తదితర సమస్యలపై జాతీయ కా ర్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపుని చ్చాయన్నారు. ఈ సమ్మెలో బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, మున్సి పల్ కార్మికులు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొంటా రని తెలిపారు. నోటీసులు ఇచ్చినవారిలో కా ర్మిక సంఘ నాయకులు కిషన్, పోశెట్టి, రాజేందర్, లక్ష్మణ్, రవి, ఎల్లయ్య, గంగామణి, కమల, గంగాధర్, లక్ష్మి పాల్గొన్నారు. -
ఐస్.. అయితే రోగాలు ఫ్రీ!
● చల్లని, తీయని జ్యూస్లపై అప్రమత్తత తప్పనిసరి ● ఐస్ ముక్కలు, రసాయన రంగులతో అనారోగ్యం ● జాగ్రత్త వహించాలంటున్న వైద్య నిపుణులు..నిర్మల్ఖిల్లా: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ ఎండల నుంచి ఉపశమనం కోసం జ్యూస్ సెంటర్లలో పండ్ల రసాలు, శీతల పానీయాలు తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చినవారు కూడా చల్లని జ్యూస్లతో రిలాక్స్ అవుతున్నారు. అయితే, ఈ జ్యూస్ల తయారీలో కృత్రిమ రంగులు, మలిన ఐస్, పాడైన పండ్ల వినియోగం ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడుగడుగునా జ్యూస్ సెంటర్లు...జిల్లాలో పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా జ్యూస్ సెంటర్లు వెలిశాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో అనేకమంది జ్యూస్లు తా గుతూ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. వివిధ రకాల పండ్ల రసాలు తయారు చేస్తూ జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు ఉపాధి పొందుతున్నారు. కృత్రిమ రుచులు, రంగులు..జ్యూస్ సెంటర్లలో ఆకర్షణ కోసం బాదం, పిస్తా వంటి కృత్రిమ ఫ్లేవర్ పౌడర్లు, కెమికల్ రంగులు విని యోగిస్తున్నారు. మలిన నీటితో తయారైన ఐస్ హానికర బ్యాక్టీరియాను కలిగిస్తాయి. నిల్వ చేసిన పండ్లలో ఫంగస్, ఈకోలి బ్యాక్టీరియా ఏర్పడి వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్, హెపటైటిస్ వంటి సమస్యలకు దారితీస్తాయి. రోడ్డు పక్కన స్టాల్స్లో దుమ్ము, ధూళి కలిసే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కవర్లలో జ్యూస్ తీసుకెళ్లడం కూడా ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్య రక్షణకు సూచనలువైద్య నిపుణులు తాజా పండ్లతో ఇంట్లో జ్యూస్ తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. స్టాల్స్లో శుభ్రత, పండ్ల నాణ్యతను తనిఖీ చేయాలి. క్రిమిసంహారకాలతో పక్వానికి తెచ్చిన పండ్లు క్యాన్సర్ కారకాలను కలిగిస్తాయి. జీర్ణ సమస్యలు, గొంతు నొప్పి, దంత సమస్యలను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తత తప్పనిసరి... వేసవికాలంలో సహజంగానే చాలామంది శీతల పానీయాలు సేవించేందుకు ఆసక్తి చూపుతారు. అయితే పండ్ల రసాలు జ్యూస్ సెంటర్లలో తాగేముందు అక్కడ పరిశుభ్రమైన వాతావరణం ఉందా లేదా చూసుకోవాలి. జ్యూస్ తయారీలో ఎటువంటి పండ్లు వినియోగిస్తున్నారు, కెమికల్స్ వాడుతున్నారా.. అనేది గమనించాలి. తాజా పండ్లు మాత్రమే పోషకాలను ఇస్తాయి. చిన్న పిల్లలకు జ్యూస్లు బయట తాగించొద్దు. ఇంట్లో తయారు చేసుకుని సేవించడం మంచిది. – డాక్టర్ శశికాంత్, జనరల్ సర్జన్, నిర్మల్దుష్ప్రభావాలివీ.. పండ్ల రసాల తయారీలో కలుషిత పదార్థాలు చేరడం, మురిగిపోయిన పండ్లను వినియోగించడం వలన హెపటైటిస్ బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో పచ్చకామెర్లు వస్తాయి.. నిల్వ ఉంచిన పండ్లలో ఈకోలి బ్యాక్టీరి యా తయారవుతుంది. వాటిని సేవించిన వ్యక్తులు వాంతులు విరోచనాలతోపాటు టైఫాయిడ్ బారిన పడే ప్రమాదం ఉంది. నిల్వ ఉంచిన జ్యూస్ తాగడం వల్ల నులిపురుగుల సంక్రమణతోపాటు చిన్న పిల్లల్లో గొంతు నొప్పి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయి. దంత సమస్యలు తలెత్తుతాయి. కృత్రిమ రంగులు, అపరిశుభ్రమైన ఐస్తో తయారు చేసిన జ్యూస్తో జీర్ణవ్యవస్థకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. క్రిమిసంహారక మందులతో పక్వానికి తెచ్చిన పండ్లను వినియోగించడం ద్వారా కూడా క్యాన్సర్ కారకాలు శరీరానికి చేరుతాయి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అంబులెన్సు సే వలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందు కు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో రాజేందర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేశ్, ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు గోపాల్ సింగ్, వైద్యాధికారులు సౌమ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ మృతుని కుటుంబానికి అండగా ఉంటాం..సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్సాగర్ దుబాయ్లో ఇటీవల హత్యకు గురయ్యాడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసా ఇచ్చారు. గురువారం ప్రేమ్సాగర్ కుటుంబ సభ్యులు కలెక్టర్ను కలిసి తమ బాధను వ్యక్తం చేశారు. కలెక్టర్ బాధితులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో ప్రేమ్సాగర్ భార్య ప్రమీల, పిల్లలు, తల్లి లక్ష్మి ఉన్నారు. -
గ్రామీణాభివృద్ధి సంస్థకు అవార్డు
నిర్మల్చైన్గేట్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) రాష్ట్రస్థాయి అవార్డు కై వసం చేసుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడమేకాక, రికవరీలోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో హైదరాబాద్లోని మహాత్మాజ్యోతిబాపూలే ప్రజాభవన్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రా మీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ, పంచా యతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి లోకేశ్కుమార్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ అవార్డును ప్రదానం చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి, డీపీఎం జ్ఞాను, ఏపీఎం సుదర్శన్ అవార్డు స్వీకరించారు. -
రాయితీకి నో..
ఎల్ఆర్ ఎస్.. ● జిల్లాలో దరఖాస్తుదారుల స్పందన అంతంతే.. ● మూడుసార్లు పెంచినా నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ● 44,602 దరఖాస్తులు..ఫీజు చెల్లించింది 7,256 మాత్రమేనిర్మల్చైన్గేట్: జిల్లాలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) కింద అనధికార లేఔట్లలోని స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన 25 శాతం రాయితీ గడువు ముగిసినా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. మార్చి, 31, ఏప్రిల్ 30, మే 3 వరకు మూడుసార్లు గడువు పొడిగించినా, స్థల యజమానులు పెద్దగా ముందుకు రాలేదు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలు, 18 మండలాల్లో కలిపి కేవలం రూ.14.40 కోట్ల ఆదాయం సమకూరింది. 2020లో రూ.1,000 ఫీజుతో దరఖాస్తు చేసుకున్నవారి క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, తక్కువ స్పందనతో లక్ష్యాలు చేరలేదు. దరఖాస్తులు, ఫీజు చెల్లింపులు..జిల్లా వ్యాప్తంగా మొత్తం 44,602 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అందగా, 37,939 దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత పొందాయి. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో 26,537 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 21,850 అర్హత పొందగా, 4,026 మంది ఫీజు చెల్లించారు, రూ.8.27 కోట్ల ఆదాయం సమకూరింది. 18 మండలాల్లో 18,065 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 16,089 అర్హత పొందగా, 3,230 మంది ఫీజు చెల్లించారు. రూ.6.13 కోట్ల ఆదాయం జమ అయింది. నిర్మల్ మున్సిపాలిటీ రూ.7.02 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది, ఖానాపూర్లో కేవలం రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. పత్తాలేని ప్రొసీడింగ్స్.. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారు ప్రొసీడింగ్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారుల ఆమోదం సరిపోగా, ఇప్పుడు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అంగీకారం కూడా తప్పనిసరి. ఈ మూడు శాఖల ధ్రువీకరణ పూర్తయితేనే క్రమబద్ధీకరణ పత్రాలు జారీ అవుతాయి, దీనివల్ల ఆలస్యం, ఇబ్బందులు తప్పడం లేదు. రాయితీ గడువు ముగిసిన నేపథ్యంలో, మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. నెరవేరని లక్ష్యం.. ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా అనధికార లేఔట్లను క్రమబద్ధీకరించి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యం నెరవేరలేదు. అధిక ఫీజులు, సంక్లిష్ట పరిశీలన ప్రక్రియ, ప్రజల్లో అవగాహన లేమి స్పందన తగ్గడానికి కారణాలుగా అధికారులు గుర్తిస్తున్నారు. సరళమైన ప్రక్రియలు, అవగాహన కార్యక్రమాలతో ఈ పథకాన్ని మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు.వివరాలు..మున్సిపాలిటీలు, మండలాల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు 44,602ఫీజు చెల్లింపునకు అర్హులు 37,939ఫీజు చెల్లించిన వారు 7256ప్రొసీడింగ్ పొందినవారు 2,455సమకూరిన ఆదాయం రూ.14.40 కోట్లు -
సైనికులకు సంఘీభావం
నిర్మల్చైన్గేట్: పహల్గాంలో హిందువులపై ఉ గ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భార త సైన్యం ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి పలువురు ఉగ్రవాదులను మట్టుపెట్టి న త్రివిధ దళాల సైనికులకు జిల్లా వాసులు సంఘీభావం తెలుపుతున్నారు. పట్టణంలోని స్థానిక నాయిడివాడ వార్డ్ నంబర్ 2లో తాజా మాజీ కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్ , గల్లీ పెద్దల ఆధ్వర్యంలో స్థానిక సంజీవని హనుమా న్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. భారత సైనికులకు ధైర్య స్థైర్యం, శక్తి, యు క్తులను అందించి అండగా ఉండాలని హనుమాన్ను వేడుకున్నారు. కాలనీవాసులు కోర్టికంటి లింగన్న, గజ్జ పోశెట్టి, నాయిడి రమేశ్, రాంమహేశ్, దుబ్బ నారాయణ, లక్ష్మణ్, కూన రాములు, సుదర్శన్, రామ్మల్లేశ్, సాయినాథ్, పొలస భరత్, ఏపూరి ప్రమోద్ పాల్గొన్నారు. -
టెన్త్ టాపర్లకు కలెక్టర్ డిన్నర్
నిర్మల్చైన్గేట్: ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే వారితో కలిసి భోజనం చేస్తానని కలెక్టర్ గతంలోనే ప్రకటించారు. ఈమేరకు తన క్యాంపు కార్యాలయంలో 13 మందికి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. వారి అభిప్రాయాలు, లక్ష్యాలు తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ణయించుకుని కష్టపడి ఉన్నత శిఖ రాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా జడ్జి శ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు జీవితానుభవం ఎక్కువ ఉంటుందన్నారు. సమస్యల పరిష్కార నైపుణ్యం ఉంటుందని తెలిపారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ మీరు సాధించిన విజ యం జిల్లాకు గర్వకారణమన్నారు. అనంతరం కలెక్టర్, జిల్లా జడ్జి, ఎస్పీ, ఇతర అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. తర్వాత చిరు కానుకలు అందించారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, డీఈవో పి.రామారావు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ఆందోళన
నిర్మల్చైన్గేట్: పెంబి మండలం గుమ్మెన కోలంగూడ గ్రామ సమస్యలు పరిష్కరించాలని తెలంగా ణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు 50 ఏళ్లుగా 100 కుటుంబాలవారమంతా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి తాగడానికి నీళ్లు దొరికే పరిస్థితి లేదని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని కోరారు. సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. తమ భూములకు లావుని పట్టా, అటవీ హక్కులు కలిగి ఉన్నా ఫారెస్ట్ అధికారులు గ్రామాభివృద్ధికి అడ్డుపడుతూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గుమ్మెన కోలంగూడ గ్రామస్తులు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. -
‘చెయ్యని పనులకు బిల్లులివ్వొద్దు’
భైంసాటౌన్: చెయ్యని పనులకు బిల్లులివ్వొద్దని బీజే పీ నాయకులు కోరారు. బుధవారం మున్సిపల్ కా ర్యాలయానికి వచ్చిన ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాల మరమ్మతు పేరిట రూ.3.40లక్షలు, చలివేంద్రం పేరిట రూ.2లక్షలు, డ్రెయినేజీ పనుల పేరిట రూ.15లక్షలు బిల్లులు డ్రా చేశారని ఆరోపించారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పట్టణంలోని పలు వార్డులతోపాటు కమలాపూర్ గుట్ట సమీపంలో డంప్యార్డు వద్ద పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని చెప్పగా, తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాజేశ్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ అనీస్ను అదనపు కలెక్టర్ ఆదేశించారు. తైబజార్కు బహిరంగ వేలం నిర్వహించాలని కోరగా, త్వరలోనే వేలం నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు కపిల్ సింధే, రావుల రాము, రావుల పోశెట్టి, సాహెబ్రావు, అనిల్, రాజన్న తదితరులున్నారు. -
ఉద్యోగ వ్యతిరేక వైఖరి వీడాలి
నిర్మల్చైన్గేట్: సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగ వ్యతిరేక వైఖరి వీడాలని భారతీయ పెన్షనర్ల ఫెడరేషన్ జా తీయ కార్యదర్శి ఎంసీ లింగన్న కోరారు. బుధవా రం జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయలు, పెన్షనర్లపై వ్య తిరేక ధోరణితో సీఎం వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఇంటిముఖం పట్టాయని గుర్తు చేశారు. సంఘాలతో సత్వరమే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకుంటే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ హన్మంత్రెడ్డి, యూనిట్ అధ్యక్షుడు పీ విలాస్, జిల్లా ఆర్థిక కార్యదర్శి లోలం గంగన్న, యూనిట్ కార్యదరి జనార్దన్, విశ్రాంత ఉద్యోగుల జిల్లా కార్యవర్గం, యూనిట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి సహకరించాలి
నిర్మల్చైన్గేట్: జిల్లా పర్యాటక అభివృద్ధికి సహకరించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ బుధవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డిని కోరారు. జిల్లా కేంద్రంలో రమేశ్రెడ్డిని అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట చెరువు, వినాయకసాగర్, సోన్ మండలం పాక్పట్ల క్రొకోడైల్ పార్క్, శ్యామ్ఘడ్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రమేశ్రెడ్డి జూన్లో సంబంధిత అధికారులను పంపించి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు అలీ తెలిపారు. -
హైబ్రిడ్ వరి.. రైతుకు సిరి
నిర్మల్తలసేమియా చంపేస్తోంది! ఉమ్మడి జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం పరిమిత సా యం అందిస్తుండగా బాధితులు దాతల సా యం కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 202510లోu చట్టాలపై అవగాహన ఉండాలి లక్ష్మణచాంద: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక సూచించా రు. బుధవారం మండలంలోని వడ్యాల్ రైతువేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతులతో సమావేశమై రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. సమావే శంలో తహసీల్దార్ జానకి, ఎంపీడీవో రాధ, ఎస్సై సుప్రియ, న్యాయవాదులు లింగాగౌడ్, రమణగౌడ్, వీడీసీ సభ్యులు రాంరెడ్డి, నరేశ్రెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పొట్టపెల్లి (కే) నర్సరీ సందర్శన మండలంలోని పొట్టపెల్లి (కే) గ్రామ నర్సరీని సీనియర్ సివిల్ జడ్జి రాధిక సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న డ్రాగన్ ఫ్రూట్, వివిధ రకాల ఔషధ, పూల మొక్కలను చూసి సంతోషం వ్యక్తంజేశారు. నర్సరీ నిర్వాహకులను అభినందించారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఎంపీడీవో రాధ, పంచాయతీ కార్యదర్శి ప్రియాంకరెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్మణచాంద: సోన్ మండలం బొప్పారం గ్రామ యువ రైతులు సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. తక్కువ సమయంలో అధిక దిగుబడులు సాధించి స్ఫూర్తిదా యక విజయాన్ని నమోదు చేశారు. సంప్రదాయ వరి సాగుకు భిన్నంగా, హైబ్రిడ్ వరి సాగుతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. బొప్పారం గ్రామానికి చెందిన 17 మంది రైతులు యాసంగిలో సంప్రదాయ వరి సాగుకు బదులు ఆడ–మగ 826 హైబ్రిడ్ వరి రకాన్ని 40 ఎకరాల్లో సాగు చేశారు. బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ బై బ్యాక్ పద్ధతిలో ఈ విత్తనాలు రైతులకు సరఫరా చేస్తోంది. సాగుకు సహకారం రైతులకు ఎకరాకు రూ.20వేల పెట్టుబడి ఖర్చులు సదరు కంపెనీ ముందస్తుగా అందజేసింది. పంట సాగు నుంచి కోత దశ వరకు కంపెనీ ప్రతినిధులు రైతులకు సలహాలు, సూచనలు అందించారు. ఒకవేళ పంట దిగుబడి తగ్గినా ఎకరానికి రూ.70,000 చెల్లిస్తామని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ ఆడ విత్తనాలను కొనుగోలు చేస్తుండగా, మగ విత్తనాలను రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించారు. అధిక లాభాలతో విజయం ఈ హైబ్రిడ్ వరి సాగు చేసిన రైతులకు ఎకరానికి 10–11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్కు రూ.10వేల చొప్పున ఎకరానికి రూ.1.10లక్షల ఆ దాయం వచ్చింది. రూ.25వేలు సాగు ఖర్చులు పో ను రైతులకు రూ.85వేల లాభం లభించింది. సంప్రదాయ వరి సాగుతో ఎకరాకు రూ.20వేలు కూడా లాభం వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా అన్నదాతలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. కంపెనీ ప్రతినిధులు ఈ పద్ధతిని మిగతా రైతులు కూడా అనుసరించాలని కోరుతున్నారు. న్యూస్రీల్ ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రూ.10వేలు పలుకుతున్న ధర బొప్పారంలో 40 ఎకరాల్లో సాగు ఆదాయం ఆర్జిస్తున్న అన్నదాతలు -
సమస్యల పరిష్కారానికే భూభారతి
● కలెక్టర్ అభిలాష అభినవ్● కుంటాలలో రెవెన్యూ సదస్సు కుంటాల: భూ సమస్యల పరిష్కారానికే భూభారతి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం కుంటాల రైతువేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. కుంటాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి గ్రామాలవారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ స దస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. భూ రికార్డుల్లో పేరు, విస్తీర్ణం లోపాలు, వారసత్వ భూములు, సాదా బైనామాలు, హద్దుల తగా దాల తదితర సమస్యల పరిష్కారానికి సదస్సులు ఉపయోగపడతాయని తెలిపారు. మండలంలోని రాయపాడ్, కుంటాల, వెంకూర్ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 67 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు తహసీల్దార్ కమల్సింగ్ తె లిపారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్లు కమల్ సింగ్, ఎజాజ్అహ్మద్ఖాన్, ప్రవీణ్ కుమార్, డీటీ నరేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిల్వలు పేరుకుపోవడంపై ఆగ్రహం మండలంలోని అందాకూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోగా కలెక్టర్ అభిలాష అ భినవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాకూర్ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తంజేశారు. 40 కేజీల బస్తాకు మూడు కిలోలు కోత విధిస్తున్నారని రైతులు కలెక్టర్ కు తెలిపారు. కొనుగోళ్లలో సిబ్బంది నిర్లక్ష్యం చేసినందుకు కుంటాల పీఏసీఎస్కు రూ.2లక్షల జరి మానా విధించారు. వర్షాలు కురిసే అవకాశం ఉ న్నందున కొనుగోళ్లు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు కుంటాలలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆమెవెంట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
ఫిర్యాదులపై త్వరగా స్పందించాలి
భైంసాటౌన్: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్పీ డాక్టర్ జీ జానకీ షర్మి ల ఆదేశించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించా రు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత స్టేషన్ ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. కుటుంబ కలహాల కేసులకు సంబంధించి పలు జంటలకు షీ టీం సిబ్బందితో కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకున్న పట్టణ సీఐ జీ గోపీనాథ్ను అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్కుమార్, సీఐ మల్లేశ్, ఎస్సైలు శంకర్, గణేశ్, షీ టీం ఇన్చార్జి మహిళా ఎస్సై పెర్సిస్, సిబ్బంది, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
సమర ‘సిందూరం’
● ఉగ్రశిబిరాలపై భారత్ దాడులపై హర్షం ● దీటైన స్పందనకు జిల్లావాసుల మద్దతు ● జిల్లావ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు ● త్రివర్ణ పతాకాలతో ఊరూరా ర్యాలీలునిర్మల్: జిల్లాకేంద్రంలోని త్రివర్ణ పతాకాలతో నినదిస్తున్న జిల్లావాసులునిర్మల్: పచ్చని పహల్గాంలో 26మంది అమాయకుల నెత్తురు చవిచూసిన పాకిస్తాన్ ఉగ్రమూకలకు మంగళవారం కాళరాత్రిని చూపింది మన సైన్యం. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రవాదుల పీచమణిచేందుకు చేపట్టిన సైనికచర్యపై యావత్ జిల్లా హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తోంది. మన యుద్ధ విమానాలు శత్రుదేశంలో బాంబులమోత మోగించాయన్న వార్త తెలిసిన మరుక్షణం నుంచే ప్రతిఒక్కరూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. జిల్లాకేంద్రంతో పాటు పలుచోట్ల బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారు. ఒకవేళ పాకిస్థాన్తో పూర్తిస్థాయిలో యుద్ధమే చేయాల్సి వస్తే.. సేవలందించేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని మాజీ సైనికులు చెబుతుండటం విశేషం. ‘ఆపరేషన్ సిందూర్’తో జిల్లాలో ఎటుచూసినా దేశభక్తి భావన ఉప్పొంగుతోంది. ప్రతిఒక్కరూ ‘సైన్యానికి సెల్యూట్’ అంటూ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు ఆపరేషన్ సిందూర్పై తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఆర్మీది సాహసోపేత నిర్ణయం ఖానాపూర్: పాక్ తీవ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ చర్యలను ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. సహాసోపేతమైన నిర్ణయం తీసుకున్న భారత ఆర్మీకి సెల్యూట్. నేను ఆర్మీలో పని చేసిన. ఎప్పుడు పిలుపొచ్చినా మళ్లీ వెళ్తా. దేశ సేవకే నా జీవితం అంకింతం. – పాదం రాజన్న, రిటైర్డ్ కెప్టెన్, పఠాన్కోట్ (పంజాబ్) పిలుపు వస్తే మళ్లీ వెళ్తా నిర్మల్: పహల్గాం ఘటన కు ప్రతీకారంగా శత్రుదేశానికి సరైన బుద్ధి చెప్పేలా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టడం హర్షణీయం. నేను 1993నుంచి 2014వరకు సైన్యంలో బ్లాక్క్యాట్ కమాండోగా, బాంబ్టెక్నీషియన్గా పని చేసిన. సైన్యం నుంచి పిలు పువస్తే మళ్లీ వెళ్తా. – కొండాపురం ప్రభాకర్, రిటైర్డ్ హవల్దార్, కడెం ఇది భారతీయుల విజయం నిర్మల్ రూరల్: ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టడం భారతీయుల విజయం. ఆపరేషన్ సిందూర్ 100 కోట్ల భారతీయులకు ఆత్మస్థైర్యాన్నిచ్చింది. భారత్ శక్తి, సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలియజేసే సమయం ఆసన్నమైంది. – కూన ప్రదీప్, చార్టెడ్ అకౌంటెంట్, నిర్మల్ పాకిస్తాన్లో మూడునెలలున్న నిర్మల్: నేను 38ఏళ్లు ఆర్మీలో పనిచేశాను. గతంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినపుడు లాహోర్ ప్రాంతంలోనే ఉన్నాను. ఆనాటి యుద్ధంతో పాటు పలు దాడుల్లో పాల్గొనడం గర్వంగా ఉంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టడం హర్షణీయం. – కూన చిన్ననర్సయ్య, రిటైర్డ్ సుబేదార్, నిర్మల్ -
రియల్ హీరోస్కు గుర్తింపు
● ప్రతికూల వాతావరణంలో.. ● ముగ్గురి ప్రాణాల ు కాపాడిన ఖాకీలు ● ఏడాది తర్వాత సీఐ గోపీనాథ్, ఎస్సై శ్రీకాంత్కు అవార్డులు నిర్మల్: 21 జూలై 2024, అర్ధరాత్రి 2 గంటల సమయం. నిర్మల్ జిల్లాలో వర్షం ఆగకుండా కురుస్తోంది. నిర్మల్ బస్టాండ్ వద్ద నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న డీసీఆర్బీ సీఐ జి. గోపీనాథ్, సారంగపూర్ ఎస్సై సల్ల శ్రీకాంత్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అప్పుడే వచ్చిన ఫోన్ కాల్ వారిని అలర్ట్ చేసింది. మహబూబ్ఘాట్లో కారు లోయలో పడిపోయిందని, అందులోని వారు ప్రమాదంలో ఉన్నారని తెలిసింది. వెంటనే వాహనాన్ని ఘాట్ వైపు పరుగులు పెట్టించారు. లోయలో చిక్కుకున్న కుటుంబం హైదరాబాద్లోని సరూర్నగర్కు చెందిన దేవికా కల్యాణి, రాధాకృష్ణ దంపతులు తమ కుమారుడైన ప్రేమ్తో కలిసి తమ కారులో మహారాష్ట్రలోని నాగ్పూర్ వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎన్హెచ్ 44పై ప్రయాణిస్తున్నారు. రాత్రి ప్రయాణం కావడంతో గూగుల్ డైరెక్షన్స్తో ముందుకు సాగుతున్నా రు. సరిగ్గా కడ్తాల్ దగ్గరికి రాగానే వారు బైపాస్గుండా వెళ్లాల్సి ఉండగా, గూగుల్ మ్యాప్ను ఫాలో అవుతూ.. నిర్మల్ జిల్లాకేంద్రంలో నుంచి పాత ఎన్హెచ్ 44 రోడ్డు గుండా వెళ్లారు. సరిగ్గా.. సారంగపూర్ మండలంలో సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో ఉన్న మహబూబ్ఘాట్ వద్దకు వచ్చారు. అర్ధరాత్రి 1.30 గంటలకు రెండో ఘాట్ కు చేరుకోగానే దారి కనిపించలేదు. అంతే.. రెప్పపాటులో వారి వాహనం అదుపుతప్పింది. రాధాకృష్ణ తేరుకునేలోపే పల్టీలు కొడుతూ కారు లోయలోకి పడిపోయింది. ఒక టేకు చెట్టు అడ్డుకోవడంతో కారు 150–200 అడుగుల లోతులో ఆగింది, లేకుంటే 400 అడుగుల లోతు లోయలో పడిపోయేది. పురస్కారాలతో సత్కారం ఈ ధైర్యసాహసాలకు సీఐ గోపీనాథ్, ఎస్సై శ్రీకాంత్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ‘తెలంగాణ పోలీస్–రియల్ హీరోస్’ అవార్డులను అందుకున్నారు. ఎస్పీ జానకీషర్మిల సహా అందరూ వా రి సేవను ప్రశంసించారు. తాజాగా సోమవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా జీనెట్వర్క్ నుంచి సీఐ గోపీనాథ్(ప్రస్తు తం భైంసా సర్కిల్), ఎస్సై సల్ల శ్రీకాంత్(ఇప్పుడు కూడా సారంగపూర్ స్టేషన్) ‘తెలంగాణ పోలీస్–రియల్ హీరోస్’ అవార్డులను అందుకున్నారు. ప్రతికూల వాతావరణంలో... గాయాలతో బయటపడలేని స్థితిలో ఉన్న కుటుంబం, ఒక పాయింట్ సిగ్నల్తో 100 నంబర్కు కాల్ చేసి సహాయం కోరింది. పది నిమిషాల్లో ఘాట్కు చేరుకున్న సీఐ గోపీనాథ్, ఎస్సై శ్రీకాంత్లకు చీక టి, వర్షం, పొగమంచు ఇబ్బందులు సృష్టించాయి. కారు పార్కింగ్ లైట్ల సాయంతో స్థానాన్ని గుర్తించి, జారే బురదలో పాకుతూ లోయలోకి దిగారు. ముందుగా దంపతులను, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది సాయంతో ప్రేమ్ను సురక్షించారు. -
గుర్తుకొస్తున్నాయి..
విద్యార్థి దశలో వేసవి సెలవులను ప్రశాంత వాతావరణంలో గడపడానికే ఎవరైనా ఇష్టపడతారు. అమ్మమ్మ–తాతయ్య ఇళ్లకు కుటుంబం, స్నేహితులతో వెళ్లి సరదాగా గడుపుతారు. ‘విద్యార్థి దశలో వేసవి సెలవులు ఎలా గడిపారు’ అనే అంశంపై ఉన్నత స్థానాల్లో స్థిరపడిన ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రముఖుల అనుభవాలతో సమ్మర్ స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం సాంకేతికత వినియోగంలో భాగంగా మొబైల్ ఫోన్ ప్రాధాన్యత కూడా పెరిగిపోయింది. మరోవైపు మొబైల్ ఫోన్ వినియోగించకుండా తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియ చేపట్టాలనుకుంటున్న పాఠశాల విద్యాశాఖ నిర్ణయంపట్ల జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్ వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గిస్తూనే అవసరమున్న చోట మాత్రమే వినియోగించేందుకు ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.ఇలా అమలుపరిస్తే ఎంతోబాగు..8లోu -
నిబద్ధతతోనే గుర్తింపు
భైంసాటౌన్: నిబద్ధతతో విధులు నిర్వహించినప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందని ఏఎస్పీ అవినాష్కుమార్ అన్నారు. పట్టణ సీఐ జి.గోపీనాథ్ సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. పట్టణ పోలీస్స్టేషన్లో ఆయనకు మంగళవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. ఆపద సమయంలో స్పందించి సేవలందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు కె.గణేశ్, శ్రీనివాస్యాదవ్, మహమ్మద్గౌస్, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్యం ఘనం ... నిర్వహణ శూన్యం
● జిల్లాలో నిరుపయోగంగా నీటి తొట్టెలు.. ● నాసిరకంగా నిర్మాణం ● కొన్నింటికి లీకేజీలు ,,మరికొన్నింటికి బీటలు ● పశువుల దాహార్తి తీర్చని వైనం..తానూరు: వేసవి కాలంలో నీటి ఎద్దడితో పశువులు అల్లాడుతున్న నిర్మల్ జిల్లాలో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.74.41 లక్షలతో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. చాలా తొట్టెల్లో నీరు లేక, పశువులు చెరువులు, కుంటలపై ఆధారపడుతున్నాయి. నీటి తొట్టెల నిర్మాణం.. 2010 నుంచి 2018 వరకు నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీల్లో 953 నీటి తొట్టెలు నిర్మించారు, ఒక్కో తొట్టికి రూ.22,190 ఖర్చు చేశారు. మొత్తం రూ.74,41,488 లక్షల వరకు ఖర్చు చేశారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు బోరుబావుల సమీపంలో నిర్మించిన ఈ తొట్టెలు, ప్రస్తుతం నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా ఉన్నాయి. సగానికి పైగా తొట్టెలు నాసిరక నిర్మాణం, నీటి వసతి లేని ప్రాంతాల్లో నిర్మాణం వల్ల వృథాగా మారాయి. నిర్వహణ లోపాలు చాలా తొట్టెలు బోరు మోటార్లు చెడిపోవడం, పైప్లైన్ మరమ్మతులు లేకపోవడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడం వంటి కారణాలతో పనిచేయడం లేదు. కొన్ని తొట్టెలు పగుళ్లు, లీకేజీలతో నిరుప యోగంగా ఉన్నాయి. తానూరు మండలంలోని మహాలింగి, తొండాల, నంద్గాం వంటి గ్రామాల్లో గ్రామానికి దూరంగా నిర్మించిన తొట్టిలకు నీటి సరఫరా లేక, ఉపయోగం లేదు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు కాంట్రాక్టర్లుగా మారి తూతూమంత్రగా నిర్మించడంతో తొట్టెలకు పగుళ్లు రావడం, కొన్ని చోట్ల పక్కకు పడిపోవడం, నీళ్లు లీకేజీ ఏర్పడటం లాంటివి ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అవసరం లేని ప్రాంతాల్లో కూడా నీటి తొట్టెలు నిర్మించడంతో వాటికి నీటి సౌకర్యం లేక వృథాగా పడి ఉన్నాయి. రైతుల ఆవేదన అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో, పశువులు దాహంతో అల్లాడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం వల్ల బోర్లు కూడా పనిచేయడం లేదు. డ్వామా, పశుసంవర్ధక, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు మరమ్మతులు చేపట్టి, బోరు మోటార్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మిషన్ భగీరథ నీటిని తొట్టెలకు సరఫరా చేస్తే, వేసవిలో పశువుల దాహార్తి తీరుతుందని రైతులు సూచిస్తున్నారు. సింగిల్ ఫేజ్ మోటార్ల ద్వారా గ్రామ చివరి తొట్టెలకు నీటిని అందించడం కూడా సాధ్యమే. వివరాలు... జిల్లాలోని గ్రామాలు 682 పంచాయతీలు 396 నీటితొట్టెలు 953 చేసిన ఖర్చు రూ.74,41,488 పనిదినాలు 17,362 రోజులు ఉపయోగంలోకి తేవాలి సరఫరా లేక పశువుల నీటి తొట్లెలు నిరుపయోగంగా మారుతున్నాయి. పశువుల దాహార్తి తీరడం లేదు. వేసవి నేపథ్యంలో చెరువులు ఎండిపోయాయి. పశువులకు నీరు దొరకడం లేదు. అధికారులు స్పందించి తొట్టెలకు నీటి సరఫరా చేసి వినియోగంలోకి తీసుకురావాలి. – గంగాధర్, బోరిగాం గ్రామం నీటి సౌకర్యం కల్పిస్తాం.. ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్మించిన తొట్టెల నిర్వహణను సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు చూసుకోవాలి. ఆయా గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టెల వివరాలను తెలుసుకుని సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించి మిషన భగీరథ నీటి సౌకర్యం కల్పించి ఉపయోగంలో తీసుకువస్తాం. – నాగవర్ధన్, డీఎల్పీవో -
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
నిర్మల్టౌన్: కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జిల్లా జడ్జి శ్రీవాణి సూచించారు. జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కేసుల సత్వర పరిష్కారంపై జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు ఉన్నతాధికారులతో మంగళవా రం సమావేశం నిర్వహించారు. జడ్జి మాట్లాడు తూ.. జిల్లాలో నేరాల అదుపునకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కేసులు పరిష్కారం కాని సందర్భంలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా చూడాలని తెలిపారు. చట్టాల ఆవశ్యకతను వివరించాలన్నారు. జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ కోర్టుల్లో రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో క్రిమినల్, సివిల్, భూతగాదాలు, రోడ్డు ప్రమాదం, వివాహ, కుటుంబ తగాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని వివరించారు. సమావేశంలో జడ్జీలు, భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్, నిర్మల్ పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్కుమార్, కృష్ణ, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్సైలు, పీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి శ్రీవాణి -
విభే దాలు వీడి ఐక్యంగా పనిచేయాలి
భైంసాటౌన్: పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం రసాభాసగా మారింది. పీసీసీ పరిశీలకుల ముందే నేతలు, వారి అనుచరులు బాహాబాహీకి దిగడంతో గందరగోళం నెలకొంది. పార్టీలో కొత్తగా చేరినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు ఉండడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ్రావు వర్గీయులు వేదికపై ఉన్న పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్గౌడ్, ఎండీ.అవేస్ దృష్టికి తెచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జి విఠల్రెడ్డి వర్గీయులు, పటేల్ వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దాదాపు అరగంటకుపైగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో గందరగోళం నెలకొంది. రాష్ట్ర నేతలు కలుగజేసుకుని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సభనుద్దేశించి పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నేతల మధ్య సఖ్యత లేకనే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాయితీపై వంటగ్యాస్ సిలిండర్, ఉచిత గృహ విద్యుత్, రైతులకు రుణమాఫీ, రేషన్కార్డుదారులకు సన్నబియ్యం వంటి హామీలు అమలు చేస్తున్నా.. గ్రూపు తగాదాలతో నియోజకవర్గంలో పార్టీ చతికిలపడి, మూడో పార్టీ బలం పుంజుకుంటోందన్నారు. ఇప్పటికై నా నేతలు విభేదాలు వీడి పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. పార్టీ విధానాల ప్రకారం.. నియోజకవర్గ ఇన్చార్జి బి.నారాయణ్రావు పటేల్ ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అందరు కలిసికట్టుగా పనిచేసి, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బి.నారాయణ్రావు పటేల్, జి.విఠల్రెడ్డి, ఎస్.వేణుగోపాలచారి, ఏఎంసీ చైర్మన్ సిందే ఆనంద్రావు పటేల్, వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్గౌడ్, అవేజ్ రసాభాసగా ముధోల్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం -
చెరువుమట్టి..చేనుకు బలం
వచ్చే నెలలో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పంటచేలను సారవంతం చేసుకునేందుకు అన్నదాతలు చెరువుమట్టి తరలిస్తున్నారు.9లోuఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ముఖద్వారంగా గోదావరిపై ఉన్న సోన్ మండల కేంద్రంలో గోదావరి నదిపై గల పాత వంతెన పర్యాటక ప్రదేశంగా ఉపయోగపడుతుంది. దీనిని 1932లో కేవలం రూ.9 లక్షల 50 వేలతో రాతి, డంగుసున్నంతో నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీనిపై నుంచి గోదావరి అందాలతో పాటు పచ్చని ప్రకృతిని వీక్షించవచ్చు. ఈ బ్రిడ్జినే పర్యాటకంగా ఉపయోగించుకునేందుకు యోచన చేశారు. వంతెనను శుభ్రం చేయడంతో పాటు రంగులు, లైటింగ్, సందర్శకులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలని ఆరేళ్ల క్రితమే అప్పటి కలెక్టర్ ప్రశాంతి ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. వంతెన దిగువన గోదావరిలో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు చెప్పారు. కానీ ఏ ఒక్క పని కూడా అమలు రాలేదు. ఎప్పటిలాగే ఆ రాతివంతెన అభివృద్ధి కోసం ఎదురుచూస్తూనే ఉంది.సోన్వద్ద గోదావరిపై పాత వంతెన -
వాతావరణం
ఆకాశం కొంతమేర మేఘావృతమై ఉంటుంది. పగటిపూట తీవ్రమైన వేడి, ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం వాతావరణం చల్లబడుతుంది. భూభారతితో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్చైన్గేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన భూభారతి చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ చట్టం అమలుతో ధరణి చట్టానికి ముందున్న సాదాబైనామా ప్రక్రియ తిరిగి వినియోగంలోకి రానుందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే తహసీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. నేటి నుంచి కుంటాల మండలంలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయని, ప్రజల నుంచి భూసంబంధిత దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సందీప్ కుమార్, తహసీల్దార్ రాజు, రైతులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి లోకేశ్వరం(కుంటాల): రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కుంటాల మండలంలోని ఓలలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. భూభారతి చట్టంపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమిపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తోందన్నారు. కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిందన్నారు. క్షేత్రస్థాయి విచారణకు వచ్చే రెవెన్యూ బృందాలకు రైతులు సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఏజాజ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
సామాన్యులకు అండగా పోలీసులు
● ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల నిర్మల్టౌన్: సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణా లో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలి జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో కేసులు సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులకు ఆన్లైన్లో దిశా నిర్దేశం చేశారు. -
అర్జీలు తక్షణమే పరిష్కరించాలి
నిర్మల్చైన్గేట్: ప్రజావాణికి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 86 వినతులు వచ్చాయి. అందులో ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్ల మంజూరు దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కరించలేని అంశాలు ఉంటే ఫిర్యాదుదారులకు అక్కడే అవగాహన కల్పించాలన్నారు. ఒక సమస్యపై ఫిర్యాదు దారుడు పలుమార్లు వచ్చే దుస్థితి ఉండవద్దన్నారు. అనుమతి తప్పనిసరి..ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, హాజరుకాలేని పక్షంలో తనకు ఫోన్ చేసి విషయం చెప్పి సెలవు తీసుకోవాలన్నారు. అధికారులంతా సమయపాలన పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవి దష్ట్యా ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణిలో 91005 77132 నంబరుకు కాల్ చేసి ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మరిన్ని రహదారులు నిర్మించాలి
తెలంగాణ రాష్ట్రానికి పక్కన ఉన్న మహారాష్ట్రతో అనుసంధానిస్తూ మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో 300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. అదే తరహాలో ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్, ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అల్లాపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలి. తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ -
నిర్మల్
ట్రిపుల్ఐటీ విస్తరణ బాసర ట్రిపుల్ఐటీకి అనుబంధంగా మరో రెండు క్యాంపస్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎల్కతుర్తి, మహబూబ్నగర్లో భూములు పరిశీలించారు.మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025జిల్లాలో ఆకట్టుకునే పర్యాటక అందాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. దశాబ్దాలుగా పాలకులు, అధికారుల నుంచి సరైన పట్టింపు లేకపోవడంతో క్రమంగా కనుమరుగవుతున్నాయి. గత పాలకులు నిర్మల్ కేంద్రంగా టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. పదేళ్లలో ఆ దిశగా అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాకు వచ్చిన పలువురు కలెక్టర్లూ.. తమవంతు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. ఎన్ని ప్రతిపాదనలు పంపినా పైసా ఇవ్వలేదు. సదరు అధికారులు బదిలీ కావడంతోనే ఆ ఫైళ్లు కూడా అటకెక్కుతున్నాయి. దీంతో జిల్లాలో పర్యాటక అభివృద్ధి ప్రశ్నార్థకంగానే మిగిలింది. గత నెల 20న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్రెడ్డి సైతం జిల్లా కేంద్రంలో పర్యటించి వెళ్లారు. పలు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈక్రమంలో ఈసారైనా పర్యాటకాభివృద్ధికి అడుగు ముందుకు పడాలని జిల్లావాసులు కోరుతున్నారు. – నిర్మల్జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు ● పలు ప్రాంతాల్లో సెకన్లపాటు కంపించిన భూమి నిర్మల్ఖిల్లా/లక్ష్మణచాంద/దస్తురాబాద్/ఖానాపూర్: నిర్మల్ జిల్లాలోని పలుప్రాంతాల్లో సోమవారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్, పెంబి, లక్ష్మణచాంద, దస్తురాబాద్, కడెం, తదితర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల 50 నిమిషాల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. కడెం మండల కేంద్రంలో ఓ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సీసీకెమెరాల్లో భూమి కంపించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఖానాపూర్లో వ్యాపార సముదాయల్లోంచి యజమానులు, వ్యాపారులు భయంతో బయటకు వచ్చారు. జిల్లాలోని పలుప్రాంతాల్లో సైతం స్వల్ప భూకంపం వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వ్యాప్తి చెందడంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.శివాజీ విగ్రహం, పర్యాటకాభివృద్ధికి ప్రతిపాదించిన బంగల్చెరువు ఎన్నో ఉన్నా.. నిర్మల్లోనే బత్తీస్గఢ్, ఖిల్లాగుట్ట, సోన్గఢ్, వేంకటేశ్వరగఢ్, గజ్గఢ్, దసరా బురుజు, తదితర ప్రాంతాలన్నింటా పర్యాటకాభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం మధ్యలోనూ ఖిల్లా, ఇటుకలతో నిర్మించిన నాటి ఆయుధ కర్మాగారాలు, ఎప్పుడూ చల్లగా ఉండే సరద్మహల్.. ఇలా పాడుబడి పోతున్నవెన్నో ఉన్నాయి. వాటిని కాసింత బాగు చేయించినా చరిత్రతో పాటు పర్యాటకంగానూ ఆకట్టుకుంటాయి. చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎప్పుడూ జలకళతో ఉంటాయి. కనీసం వాటిల్లో బోటింగ్ పెట్టినా పిల్లాపాపలతో కుటుంబాలు ఆహ్లాదంగా గడిపే అవకాశం ఉంటుంది. బంగల్ చెరువులో శివాజీ విగ్రహం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్రెడ్డి గ తనెల 20న జిల్లా కేంద్రానికి వచ్చారు. జిల్లా గ్రంథా లయసంస్థ చైర్మన్ అర్జుమంద్అలీ కోరిక మేరకు వ చ్చిన ఆయన నిర్మల్, పాక్పట్లలో పర్యటించారు. జి ల్లాకేంద్రంలోని బంగల్చెరువు, బత్తీస్గఢ్, శ్యాంగఢ్లతో పాటు పాక్పట్లలోని మొసళ్ల మడుగును చూ పించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గణేశ్చక్రవర్తి, అర్జుమంద్అలీ తదితరులు ఆయనకు ఆయా ప్రాంతాల విశేషాలను వివరించారు. ఈమేరకు పలు ప్రతిపాదనలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ● బంగల్చెరువు మధ్యలో ఒకప్పుడు నాట్యశాలగా ఉన్న గద్దైపె ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలి. ● బంగల్పేట్ నుంచి విశ్వనాథ్పేట వైపు వెళ్లే బంగల్చెరువు కట్ట రోడ్డును వెడల్పు చేయాలి. ● చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు కట్టలపై హుస్సేన్సాగర్ తరహాలో బెంచీలు, రెయిలింగ్, లైటింగ్ పెట్టాలి. ● శ్యాంగఢ్కు పూర్వవైభవం తీసుకువచ్చేలా మరమ్మతులు చేసి, లైటింగ్, పిల్లల పార్కులను ఏర్పాటు చేయాలి. ● బత్తీస్గఢ్తో పాటు పాక్పట్ల మొసళ్ల పార్కులను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ఆయా ప్రతిపాదనలపై టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్రెడ్డి సుముఖత వ్యక్తంచేశారు. శ్యాంగఢ్ను పరిశీలిస్తున్న రమేశ్రెడ్డి ● ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్ న్యూస్రీల్లారీల అడ్డాగా శ్యాంగఢ్.. నిమ్మనాయుడు, వెంకట్రాయుడు, శ్రీనివాసరావు తదితర పాలకుల పాలనలో నిర్మల్లో ఎన్నో చారిత్రక గఢ్లు నిర్మీతమయ్యాయి. ఇందులో నిర్మల్లోకి ప్రవేశించే మార్గంలో ఉన్న శ్యాంగఢ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది గోల్కొండ కోట తరహాలో ఆకట్టుకుంటోంది. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ గఢ్ను బల్దియా నిధులతోనే అభివృద్ధి చేయాలని గత కలెక్టర్లు ఆదేశించారు. పిల్లలు ఆడుకునేలా పార్క్, పచ్చని చెట్లు, కూర్చుని సేద దీరేందుకు బెంచీలు, ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇక శ్యాంగఢ్ మరో గోల్కొండ అవుతుందని అంతా భావించారు. కానీ కేవలం రాత్రిపూట లైటింగ్కే పరిమితమైంది. అభివృద్ధి మాట దేవుడెరుగు శ్యాంగఢ్ ముందుభాగాన్ని లారీల అడ్డాగా మార్చేశారు. మరోవైపు గఢ్ చుట్టూ భూములను చదును చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు. ప్రతిపాదనలు, అంచనాలతో కలుస్తాం.. జిల్లా కేంద్రంతో పాటు పాక్పట్లలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్రెడ్డి పర్యటించారు. అప్పుడు తాము చేసిన ప్రతిపాదనలపై పూర్తి వ్యయ అంచనాలతో త్వరలోనే హైదరాబాద్ వెళ్లి ఆయనను కలుస్తాం. సంబంధిత పనులను త్వరలోనే చేపట్టాలని కోరుతాం. – అర్జుమంద్అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ -
డీ 1 పట్టాలు రద్దుచేయాలి
సోన్ మండలంలోని సిద్దిలకుంటలో అక్రమ డీ 1 పట్టాలు రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శ్రీరాంసాగర్ జలాశయం ముంపునకు గురైన గ్రామంలో భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం 23 ఎకరాల మిగులు భూమిని కేటాయించగా కొందరు అక్రమంగా పట్టాలు సృష్టించి కబ్జా చేస్తున్నారన్నారు. 2022లో డీ 1 పట్టాను అప్పటి కలెక్టర్ రద్దు చేసినప్పటికీ మళ్లీ సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్పందించిన కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడి పట్టాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. – కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన సిద్దలకుంట గ్రామస్తులు -
కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు
భైంసాటౌన్: పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. ఇటీవల బీజేపీ పట్టణ, మండల, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై న పలువురికి ఆదివారం పట్టణంలోని ఎస్ఎస్ ఇండస్ట్రీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే భైంసా మున్సి పల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు. పదవులు రానివారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు, నియోజకవర్గ, జిల్లా పార్టీ పదవులిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిర్మల్
బాసర చూసొద్దామా.. చదువుల తల్లి కొలువుదీరిన బాసర ఇప్పుడు చూసేవారికి ఒకే గ్రామం. అమ్మవారు కొలువైన ఊరని అందరికి సుపరిచితమే. బాసర క్షేత్రం ప్రత్యేకతపై స్టోరీ.భూ సమస్యల సత్ఫలితాలిస్తున్న గడ్డి మైదానాలువన్యప్రాణుల సంతతి వృద్ధికోసం జన్నారం డివిజన్లో పెంచుతున్న గడ్డి మైదానాలు సత్ఫ లితాలిస్తున్నాయి. విత్తనాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.10లోu సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025ఆలయాల అభివృద్ధికి కృషి కడెం: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దబెల్లాల్ ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహా విగ్రహ, ధ్వజ స్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఎలగడపలోని తాతమ్మ ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తుమ్మల మల్లేశ్, నాయకులు పొద్దుటూరి సతీశ్రెడ్డి, తక్కల్ల సత్తెన్న, చెన్ను మల్లేశ్, కటికనపెల్లి భూమేశ్, తదితరులు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: భూభారతి చట్టం పరిష్కారం చూపించనుంది. ధరణి పోర్టల్లో రైతులకు ఎదురైన సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం చేశాక కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. దీని అమలుకు గతంలో రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా.. ప్రస్తుతం జిల్లాలోని కుంటాల మండలానికి స్థానం దక్కింది. ఈ మేరకు సోమవారం ప్రక్రియను తహసీల్దార్ ప్రారంభించగా ఈనెల 5 నుంచి 20 వరకు గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఆపై జూన్ 2 నుంచి రాష్ట్రమంతా చట్టం అమల్లోకి రానున్నందున సమస్యలు ఉండవని రైతులు భావిస్తున్నారు. సాంకేతిక సమస్యలతో బేజారు.. ధరణి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తులకు పరిష్కారం లభించలేదు. ఇంకొన్ని సమస్యలు నమోదు చేసే వీలు లేకపోయేది. ప్రధానంగా పీబీ(ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్) సమస్యతో రైతులు సతమతమయ్యారు. పట్టా భూములను కూడా పీఓబీలో చేర్చడంతో భూముల భద్రతపై అనుమానం వ్యక్తమైంది. వీటితోపాటు ఇతర సమస్యలు కూడా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రతీరోజు రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1,489 దరఖాస్తులు పెండింగ్ జిల్లాలో ధరణి సైట్ ద్వారా పలు సమస్యలపై అందిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తూనే మిగతా సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ధరణిలో మొత్తం 1,489 దరఖాస్తులు రైతుల నుంచి అందాయి. వీటిలో 345 తహసీల్దార్ల వద్ద, 857 ఆర్డీవోల వద్ద, 287 దరఖాస్తులు అదనపు కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. జూన్ 2 నుంచి పూర్తిస్థాయిలో.. ఈ ఏడాది జూన్ నుంచి భూభారతి చట్టాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో మ్యూటేషన్లు, నాలా, మార్పులు, చేర్పులు, అప్పీల్ అండ్ రివిజన్, తదితర సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుంది. గ్రామాల్లో నిర్వహించే సదస్సుల్లో రైతుల సందేహాలను అధికారులు నివృత్తి చేస్తారు. ప్రస్తుతం కుంటాల మండలంలో భూభారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. ఇందులో భాగంగా ఈనెల 17 నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలకు గానూ 30 వేల ఎకరాల సాగు భూమి ఉంది. సాదాబైనామా కింద అందిన 341 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని రెవెన్యూ అధికారులు భూభారతి ద్వారా పరిష్కరించనున్నారు. పరిష్కారం ఇక సులువు.. భూభారతి చట్టంతో రైతులకు సంబంధించి సమస్యల పరిష్కారం సులువవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేశాక అందులో అవసరమైన వాటిని పొందుపరిచారు. రైతులు తహసీల్లో అభ్యంతరాలు తెలియజేసే వీలు కూడా కల్పించారు. అయినా న్యాయం జరగకపోతే ఆర్డీవో, ఆపై కలెక్టర్కు ఆప్పీల్ చేసే వెసులుబాటు ఉంటుంది. గతంలో ధరణిలో ఇలాంటి అవకాశం లేక కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. కాగా కొత్త చట్టం ద్వారా ప్రతీ డిసెంబర్లో గ్రామ రికార్డులను ముద్రిస్తారు. 2014 జూన్ 2 కన్నా ముందు గ్రామాల్లో వ్యవసాయ భూమిని సాదాబైనామాల ద్వారా కొని అనుభవంలో ఉంటూ 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు క్రమబద్ధీకరణకు అందిన దరఖాస్తులను ఆర్డీవో విచారించి ధ్రువీకరణ పత్రాలు చేసేలా భూభారతి చట్టం ద్వారా అవకాశం కల్పించారు. న్యూస్రీల్ అమలులోకి భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టుగా కుంటాల మండలం ఎంపిక రైతుల్లో చిగురిస్తున్న ఆశలు ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కుంటాల మండలంలోని విట్టపూర్కు చెందిన కట్ట భూమారెడ్డి. ఇతనికి 4.13 ఎకరాలకు సంబంధించిన పాత పాసు పుస్తకం ఉంది. అప్పట్లో పహాణి, వన్–బి మండల కార్యాలయం ద్వారా పొందాడు. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చాక కొత్త పాస్ బుక్ అందలేదు. దీంతో రైతు బీమా, రైతుబంధు పథకాలకు అర్హత కోల్పోయాడు. పలుమార్లు కలెక్టరేట్, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విన్నవించినా ధరణి పోర్టల్లో ఆప్షన్ లేని కారణంగా ఏంచేయలేమని అధికారులు చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ అందుబాటులోకి తేవడంతో ఇతని సమస్య తీరనుంది. టీం 1 అధికారులు ఏ.కమల్ సింగ్, తహసీల్దార్ (కుంటాల), మునీర్ అహ్మద్ నయాబ్ తహసీల్దార్ (బాసర), రాజేశ్వర్ గిరిదావర్ (కుంటాల), కిషన్, మండల సర్వేయర్ (తానూర్), వినోద్, రాహుల్ జూనియర్ అసిస్టెంట్, సాయన్న (కుంటాల), కార్తీక్, రికార్డ్ అసిస్టెంట్ (కుంటాల) తేదీ రెవెన్యూ గ్రామం ప్రదేశం 5 మేధన్పూర్ జీపీ కార్యాలయం 6 సూర్యాపూర్ రైతు వేదిక 7 రాజాపూర్ ఎంపీపీఎస్ 8 లింబాకే జీపీ కార్యాలయం 9 దౌనెల్లి జీపీ కార్యాలయం 12 అంభుగం జీపీ కార్యాలయం టీం 3 అధికారులు ఎజాజ్ హైమద్ఖాన్ తహసీల్దార్, దిలావర్పూర్, జే.గంగయ్య నయాబ్ తహసీల్దార్, తానూర్, ఖాదర్ఖాన్ సర్వేయర్, దిలావర్పూర్, సంతోష్ దీక్షిత్, జూనియర్ అసిస్టెంట్, దిలావర్పూర్, చిరంజీవి, రికార్డ్ అసిస్టెంట్, దిలావర్పూర్, పోశెట్టి, ఆపరేటర్, లోకేశ్వరం తేదీ రెవెన్యూ గ్రామం ప్రదేశం 5 ఓలా రైతు వేదిక 6 లింబా(బి) జీపీ కార్యాలయం 7 వెంకూర్ జీపీ కార్యాలయం 8 వైకుంఠాపూర్ జీపీ కార్యాలయం 9 పెంచికల్పహాడ్ జీపీ కార్యాలయం పైలట్ ప్రాజెక్టుగా కుంటాల.. భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలట్ ప్రాజెక్ట్ కింద కుంటాల మండలం ఎంపికై ంది. ఇందుకు మూడు టీమ్లను ఏర్పాటు చేశాం. నాతో పాటు భైంసా, దిలావర్పూర్ తహసీల్దార్లు సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 31లోపు పరిష్కరిస్తారు. – ఏ.కమల్ సింగ్, తహసీల్దార్, కుంటాల -
పెద్దమ్మతల్లికి బోనాలు
మామడలో బోనాలతో మహిళలు మామడ/ఖానాపూర్: మామడ మండలంలోని అనంతపేట్లో ఆదివారం పెద్దమ్మతల్లికి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో ఆలయం వరకు శోభాయాత్రగా తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరప్ప కమరాతి కల్యాణోత్సవంలో భాగంగా ఖానాపూర్ మండలంలోని బావాపూర్ బీరప్ప ఆలయంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజంతా బియ్యం సుంకు పట్టుట, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బావాపూర్(కె) కుర్మ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఖానాపూర్లో సుంకు పడుతున్న భక్తులు -
పచ్చని పల్లెలో నెత్తుటి మరకలు
తేదీ 12 మార్చి 2021.. ప్రశాంతంగా ఉన్న పల్లెలో దారుణం చోటు చేసుకుంది. కేశం శ్రీకాంత్(20) అనే యువకుడు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఎంత చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో కన్నతల్లి కేశం ఇందిర రోకలితో శ్రీకాంత్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. క్షణికావేశంలోనే.. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబంలో ఎక్కువ మంది ఉండటంతో తప్పు చేస్తే ఎవరు చూస్తారో అనే భయం ఉండేది. నేడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో భయపడే పరిస్థితి లేదు. దీనికి తోడు మద్యం, మత్తు పదార్థాలకు బానిసవడం, వివిధ సామాజిక మాధ్యమాలలో వస్తున్న నేరాలు చూడటం.. హత్యలు, అత్యాచారాలకు కారణమవుతున్నాయి. పోలీసులు, న్యాయ వాదులు, మానసిక వైద్యులతో అవగాహన సద్సులు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా మార్పు వస్తుంది. – డాక్టర్ అల్లాడి సురేశ్, మానసిక నిపుణుడు కుటుంబ కలహాలతోనే.. గ్రామాలలో కుటుంబ కలహాలు, చిన్నచిన్న గొడవల కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేయడం జరుగుతుంది. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను పట్టుకుని వెంటనే కోర్డులకు హాజరు పరచడం జరుగుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమను సంప్రదిస్తే తగిన సహాయం చేయడంతోపాటు భరోసా కేంద్రం ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు వచ్చేలా చూ స్తాం. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుంగా తగిన చర్యలు చేపడుతాం. చట్టా లపై అవగాహన కల్పించి నేరాలు జరగకుంగా చూస్తాం. – గోవర్ధన్రెడ్డి, సీఐ, సోన్ తేదీ 25 ఏప్రిల్ 2025.. ౖబైనం అశోక్, అతని తండ్రి ఎర్రన్న ఇద్దరూ కొద్దిరోజులుగా డబ్బుల విషయంలో గొడవ పడుతున్నారు. నిత్యం ఇరువురు మద్యం సేవించి ఇంటికి వచ్చి నిన్ను చంపుతా.. అంటే నిన్ను చంపుతా అంటూ కొన్ని రోజులుగా బెదిరించుకుంటున్నారు. చివరకు తండ్రి ఎర్రన్న అన్నంత పని చేశాడు. నిద్రిస్తున్న అశోక్పై గొడ్డలితో దాడిచేసి చంపేశాడు.తేదీ 29 సెప్టెంబర్ 2023.. గ్రామానికి చెందిన సిలారి పెద్దమల్లు భూ తగాదాల విషయంలో తమ్ముడు సిలారి చిన్న మల్లయ్యపై గ్రామం నడిబొడ్డున అందరూ చూస్తుండగానే కర్రలు, కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన చిన్న మల్లయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. లక్ష్మణచాంద: ఒకప్పుడు పల్లెలు అంటే పచ్చని పంటపొలాలు, ప్రశాంత వాతావరణం, కల్మషం లేని మనుషులు, వ్యవసాయంలో నిమగ్నమైన రైతుల సమాజం. కానీ కాలం మారింది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, సామాజిక మాధ్యమాల ప్రభా వం, మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువతతో గ్రామీణ జీవన స్వరూపం మారుతోంది. ఈ మార్పుల నేపథ్యంలో లక్ష్మణచాంద మండలంలోని మల్లాపూర్లో జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అనూహ్య హింస మల్లాపూర్ 1,729 జనాభాతో ఉన్న ఒక చిన్న వ్యవసాయ గ్రామం. ఇక్కడి ప్రజలు ప్రధానంగా వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడ్డారు. అక్షరాస్యత రేటు 44.4%గా ఉంది. గతంలో ఈ గ్రామం ప్రశాంతంగా, అల్లర్లు లేకుండా ఉండేదని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. కానీ ఇటీవల జరిగిన మూడు హత్యలు గ్రామాన్ని కలవరపెడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. చిన్న విషయాలు.. పెద్ద పరిణామాలు మల్లాపూర్లో హత్యలకు ప్రధాన కారణాలుగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు నిలుస్తున్నాయి. పక్కపక్కనే ఉన్న భూముల యజమానుల మధ్య వైరం, కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు క్షణికావేశంలో హత్యలకు దారితీస్తున్నాయి. ఈ సమస్యలను గ్రామ పెద్దలు లేదా అధికారుల సహాయంతో పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, మద్యం, మత్తు పదార్థాల ప్రభావంలో ఆవేశానికిలోనై హత్యలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలు చిన్న కారణాలతో ప్రారంభమై, పెద్ద విషాదాలకు దారితీస్తున్నాయి. మానవత్వం కనుమరుగు.. మల్లాపూర్లో జరిగిన కొన్ని హత్యలు మానవత్వం లేని క్రూరత్వాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఒక తల్లి తన కుమారుడిని రోకలితో కొట్టి చంపిన ఘటన, తండ్రి తన కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన సంఘటన, అన్న తమ్ముడిని కర్రలు, కత్తులతో క్రూరంగా హత్య చేసిన ఘటనలు సమాజంలో మానవత్వం ఎక్కడికి పోయిందనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనలు బంధుత్వాలు, ప్రేమ, మరియు సహనం వంటి విలువలు క్షీణిస్తున్నాయనే ఆందోళనను కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు.. మద్యం సామాజిక మాధ్యమాల ప్రభావం, మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడటం గ్రామీణ సమాజంలో హింసను పెంచుతున్నాయి. యువత సామాజిక మాధ్యమాల ద్వారా హింసాత్మక కంటెంట్కు గురవుతూ, వాస్తవ జీవితంలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిష్కార మార్గాలు.. ఈ హత్యలను నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మల్లాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. సమస్యలు తలెత్తినప్పుడు గ్రామ పెద్దలు లేదా అధికారుల సహాయంతో పరిష్కరించుకోవాలని, ఆవేశానికి లోనై ప్రాణాలు తీయడం సరికాదని వారు సూచిస్తున్నారు. స్థానిక పోలీసులు, జిల్లా అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, మద్యం, మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అలాగే, భూమి వివాదాలను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరుతున్నారు. మల్లాపూర్లో హత్యల కలకలం క్షణికావేశంలోనే బంధాలు తెంచుకుంటున్న వైనం.. గ్రామీణ జీవనం.. ప్రశాంతత నుంచి భయాందోళన వైపు.. నాలుగేళ్లలో మూడు మర్డర్లు.. -
ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి
నిర్మల్టౌన్ : ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7 నుంచి చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని నిర్మల్ డిపో జేఏసీ చైర్మన్ పోశెట్టి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఆవరణంలో సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ రాజేశ్వర్, కన్వీనర్లు నారాయణ, శేఖర్, హనుమంతు, రాజేశ్వర్, వేణు, మహిళా కండక్టర్లు ప్రతిభా, సవిత, శ్రీదేవి, సురేఖ, శ్రీలత, సజన, తదితరులు పాల్గొన్నారు. -
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆసిఫాబాద్, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్ ఏర్పాట్లు చేపట్టారు. ఎస్సై శ్రీకాంత్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం ఎదుట మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత తగ్గుతుంది. సాయంత్రం ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.నేటి నుంచి రెవెన్యూ సదస్సులునిర్మల్చైన్గేట్: భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని 16 గ్రామాల్లో ఈ నెల 5నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, భూములకు సంబంధించిన సమస్యలు, పాత రికార్డుల సమస్యలు, పేరుమార్పులు వంటి అంశాలను స్థానిక ప్రజలు ఈ సదస్సుల్లో దరఖాస్తుల రూపంలో ఇవ్వవచ్చన్నారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. జూన్ 2వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద అందిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని, అవసరమైన కార్యాచరణను వేగంగా పూర్తి చేయాలన్నారు. భూభారతి అమలుతో ప్రజలకు తక్షణ సత్వర సేవలు అందేలా చర్యలు చేపడతామన్నారు. -
విధి ఫౌండేషన్ సేవలు అభినందనీయం
సారంగపూర్: విధి ఫౌండేషన్ హైదాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సీసీఎఫ్ శరవణన్ అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చించోలి(బి) గ్రామ సమీపంలోని గండిరామన్న హరితవనంలో పనిచేసే ప్రొటెక్షన్ వాచర్లకు శనివారం బ్యాగులు, యూనిఫాం, షూస్, లాఠీలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి ఎన్జీవో ద్వారా నిర్మల్ జిల్లాలోని బుర్ఖాలెగిడి అనే ఆదివాసీ గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడి పాఠశాలలో కావాల్సిన ప్రాథమిక వసతులు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, డ్రాపవుట్ విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. పర్యావరణం, విద్య, ఉపాధి, ఆరోగ్యం అంశాలపై సంస్థ పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వణ్యప్రాణుల దాహార్తి తీర్చడానికి రూ.50 వేలతో నీటి చెలిమలను తవ్వించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విధి ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ ధీరజ్ కావేరి, డాక్టర్ విజయ కావేరి, టాస్క్ఫోర్స్ ఎఫ్ఆర్వో వేణుగోపాల్, మామడ రేంజ్ ఎఫ్ఆర్వో అవినాష్, సారంగాపూర్ డీఆర్వో నజీర్ఖాన్, ఎఫ్ఎస్వో వేణుగోపాల్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్లైన్ పనులు పరిశీలన మండలంలో కౌట్ల(బి) అటవీ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ నంబరు 1024 మీదుగా వెళ్తున్న పవర్గ్రిడ్ 765 కేవీ విద్యుత్ లైన్ నిర్మాణ పనులను సీసీఎఫ్ శరవణన్, డీఎఫ్వో నాగినిభాను సిబ్బందితో కలిసి శనివారం పరిశీలించారు. వార్దా నుంచి హైదరబాద్ వెళ్లే ఈవిద్యుత్లైన్ పనులు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయా.. లేదా అనే విషయాలను పవర్గ్రిడ్ సిబ్బంది, స్థానిక అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీప్రాంతంలో నిబంధనలకు లోబడి పనులు చేయించాలని ఆదేశించారు. అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగానే పనులు ఉండాలని తెలిపారు. అటవీ ప్రదేశాలు చెడిపోకుండా జాగ్రత్తగా పనులు జరిగేలా నిత్యం పరిశీలించాలని అటవీ సిబ్బందికి సూచించారు. అనంతరం అటవీ ప్రాంతాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట డీఆర్వో నజీర్ఖాన్, ఎఫ్బీవో వెన్నెల తదితరులు ఉన్నారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్ పార్కు సిబ్బందికి యూనిఫాం,బ్యాగులు, లాఠీ పంపిణీ -
బంధాలకు బీటలు..
నిర్మల్దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన ఓ పెద్దమనిషి.. అమ్మానాన్నలు సంపాదించిన ఆస్తులను తీసుకున్నాడు. న్యాయపరంగా సోదరులకు ఇవ్వాల్సిందీ తన పేరిటే రాయించుకున్నాడు. పోనీ.. తల్లిదండ్రులకై నా పట్టెడన్నం పెడతాడా అంటే.. అదీ లేదు. అటు తల్లిదండ్రులను, తోడబుట్టిన సోదరులనూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు. వృద్ధాప్యంలో ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు ఎస్పీని కలిసి తమగోడు వెల్ల బోసుకున్నారు.ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025పోలీసుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్టౌన్: పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణ ఎంత ముఖ్యమో.. ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయిధ దళ ముఖ్య కార్యాలయంలో పోలీసు సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ అనేది సిబ్బందికి క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా విధి నిర్వహణలో అనారోగ్యానికి గురికాకుండా ఉంటారన్నారు. ఇందులో ఏఎస్పీ రాజేశ్ మీనా, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్రెడ్డి, ప్రేమ్కుమార్, ప్రవీణ్కుమార్, కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ● మంటగలుస్తున్న మానవత్వం ● కన్నవాళ్లకూ.. అన్నంపెట్టని కాఠిన్యం ● అనుబంధాలకన్నా.. ఆస్తులకే ప్రాధాన్యం ● హత్యలకూ వెనుకాడని అక్రమ బంధాలు ● కలవర పెడుతున్న వరుస ఘటనలుఆయన ఓ సంక్షేమశాఖలో పెద్దసారు. జిల్లాలో పేరున్న అధికారి. ఆస్తులే తప్ప.. అనుబంధాలకు విలువ ఇవ్వడం లేదన్నది ఆయనపై ఆరోపణ. కన్నతల్లి సంక్షేమాన్నే చూడని ఆ అధికారి ఇక తన శాఖకు ఏం న్యాయం చేస్తాడన్నది ప్రశ్న. తనను కన్న మాతృమూర్తికి పట్టెడన్నం పెట్టని తీరు ఆయనపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తోంది. ఓ హోదాలో, జిల్లాస్థాయి బాధ్యతలో ఉన్న తానే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు. ఈ విషయం కలెక్టర్, డీఎల్ఎస్ఏ జడ్జి, ఆర్డీవోల వరకు చేరింది. తనను ఎంత బాధపెడుతున్నా.. ‘నా కొడుకు కుటుంబం బాగుండాలె. నాకింత అన్నం పెడితే చాలు..’ అంటోంది సదరు అధికారి తల్లి.రైలు ఎక్కేద్దాం.. భారత్ చుట్టేద్దాం వేసవి సెలవులు వచ్చేశాయి. సెలవుల్లో సరదాగా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్తుంటారు. వీరికోసం రైల్వేశాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందిస్తోంది.IIలోu న్యూస్రీల్ -
ఎట్టకేలకు రెవెన్యూ పట్టాలు
● ఫలించిన రాంపూర్, మైసంపేట్ వాసుల పోరాటం ● జీవో జారీ చేసిన ప్రభుత్వంకడెం: కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణ కో సం అటవీ గ్రామాలను తరలించే ప్రక్రియలో భా గంగా కడెం మండలం రాంపూర్, మైసంపేట గ్రా మాలను పునరావాస గ్రామాలకు తరలించారు. గ తేడాది ఏప్రిల్ 15 నుంచి ఈ గ్రామస్తులు కడెం మండలం పాత మద్దిపడగ సమీపంలో కొత్త జీవ నం ప్రారంభించారు. అయితే, పునరావాసంలో భా గంగా వాగ్దానం చేసిన రెవెన్యూ పట్టాలు, పరి హారం కోసం వారు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. వారి నిరంతర పోరాటం ఫలించి, రెవెన్యూ పట్టాలు అందుకునేందుకు రంగం సిద్ధమైంది. వాగ్దానాలు, ఆటంకాలు రాంపూర్, మైసంపేట గ్రామాల నుంచి మొత్తం 142 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ కుటుంబాలకు రెండు రకాల పరిహార ప్యాకేజీలను అటవీశాఖ ప్రకటించింది.. ప్యాకేజీ–1: 94 కుటుంబాలకు ఇళ్లు, 2.32 ఎకరాల సాగు భూమి కేటాయించారు. ప్యాకేజీ–2: 48 కుటుంబాలకు రూ.15 లక్షల నగదు పరిహారం అందజేయాలని నిర్ణయించారు. అయితే, పునరావాస కేంద్రంలో నచ్చన్ఎల్లాపూర్ జీపీ సమీపంలో కేటాయించిన భూములకు అటవీ పట్టాలు ఇస్తామని అధికారులు ప్రకటించడంతో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటవీ పట్టాలు తమకు సాగు భూములపై శాశ్వత హక్కులను ఇవ్వవని, రెవెన్యూ పట్టాలు మాత్రమే స్వీకరిస్తామని వారు గట్టిగా పట్టుబట్టారు. సాగుయోగ్యంగా మార్చాలి... మా గ్రామాలను తరలించి ఏడాది గడిచినా సాగు భూములకు పట్టాలివ్వలేదు. ఎట్టకేలకు రెవెన్యూ పట్టాలివ్వడంతో అందరికీ మేలు జరుగుతుంది. పునరావాసం కింద అందించిన భూములను సాగు యోగ్యంగా మార్చాలి. నీటి సౌకర్యం కల్పించాలి. – దేవురావు, పునరావాస గ్రామస్తుడు..రెవెన్యూ పట్టాల కోసం పోరాటం రెవెన్యూ పట్టాల కోసం గ్రామస్తులు ఏడాది కాలంగా అలుపెరగని పోరాటం సాగించారు. కలెక్టర్, మ ంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర అధికారులను కలిసి తమ డిమాండ్ను విన్నవించారు. మంత్రి సీత క్క, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసై టీ (హైటికాస్) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ సిద్దిఖీ మ ద్దతుతో వారు తమ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేశారు. ఈ పోరాటం ఫలితంగా, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మే 3న రె వెన్యూ పట్టాలు జారీ చేస్తూ జీవో విడుదల చేశారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. అయితే వేడి తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయి. వేడిగాలులు వీస్తాయి. విద్యార్థినుల కుటుంబానికి కేటీఆర్ భరోసా● ‘సాక్షి’ కథనంపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన కేటీఆర్ ● మలేషియాలో ఉన్న తండ్రిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు..పెంబి: పెంబి మండలం లోతర్య తండాకు చెందిన అక్కాచెల్లెళ్లు బానావత్ అశ్విని, మంజుల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందా రు. ఈఏపీ సెట్ రాసేందుకు హైదరాబాద్ వెళ్లి, స్వగ్రామం తిరిగి వస్తుండగా నిజామాబాద్ జక్రాన్పల్లి సమీపంలో కారు కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఈ బంజారా బిడ్డల జీవితం చిన్నవయసులో ముగియడం అందరినీ కలచివేసింది. వారి తండ్రి బానావత్ రెడ్డి మలేషియాలో ఉపాధి నిమిత్తం ఉండగా, కన్న బిడ్డల మరణవార్త తెలిసి రోదిస్తున్నాడు. ఈ విషాద ఘటనపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రెడ్డినిస్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. మరోవైపు నిజా మాబాద్ నుంచి మృతదేహాలను ఇంటికి చేర్చేందుకు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు పూర్తిచేసేవరకూ పర్యవేక్షించి, ఆర్థిక సాయం అందించారు. నివాళులర్పిస్తున్న జాన్సన్ నాయక్ -
వైన్స్.. న్యూసెన్స్!
● బహిరంగ ప్రదేశాల్లో సిట్టింగ్లు ● ఇబ్బంది పడుతున్న మహిళలుభెంసాటౌన్: జిల్లాలో బహిరంగ మద్యపానంతో మహిళలు, సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రమైతే చాలు వైన్షాపుల ముందు మందుబాబులు సిట్టింగ్ వేస్తున్నారు. వైన్స్లకు అనుబంధంగా పర్మిట్ రూంలు ఉన్నా.. కొందరు మందుబాబులు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. చాలాచోట్ల ప్రధాన రోడ్ల వెంబడి, మహిళలు, పిల్లలు తిరిగే ప్రాంతాల్లోనే వైన్షాపులు ఉండడం, మందుబాబులు ఆరుబయటే మద్యం సేవిస్తుండడంతో ఆ మార్గంలో వెళ్లే మహిళలు, యువతులు భయాందోళన చెందుతున్నారు. పర్మిట్రూములు అనధికారిక వైన్షాపులుగా చెలామణి అవుతున్నాయి. ఉదయం వైన్షాపులు తెరుచుకోక ముందే, 6 గంటల నుంచే పర్మిట్రూముల్లో మద్యం అమ్మకాలు మొదలవుతున్నాయి. అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకుగాను సదరు వైన్షాపు నిర్వహకులే రాత్రి వేళల్లో పర్మిట్రూముల్లో మద్యం నిల్వలు ఉంచుతున్నారు. ఇలా, అధిక ధరలకు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. సంబంఽధిత ఎకై ్సజ్, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో బహిరంగ మద్యపానంపై శనివారం సాయంత్రం ‘సాక్షి’ విజిట్ చేసింది. జిల్లాకేంద్రంలో... జిల్లాకేంద్రమైన నిర్మల్లో ఈద్గాం చౌరస్తాలో హైవే పక్కనే రెండు వైన్షాపులున్నాయి. అంతేగాక, చైన్గేట్ సమీపంలోని కూరగాయల మార్కెట్, శివాజీ చౌక్లో రెండు, న్యూ బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్, డాక్టర్స్ లేన్, శాంతినగర్ ఎక్స్రోడ్డులో మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. మందుబాబుల బహిరంగ సిట్టింగ్తో మహిళలు, జనం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లోనే వైన్షాపు ఉండడంతో కూరగాయల కొనుగోలు కోసం వచ్చే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే, మంచిర్యాల చౌరస్తాలో, ఈద్గాం, బస్టాండ్ ప్రాంతాల్లో బహిరంగ మద్యపానం చేస్తున్నారు. భైంసాలో... పట్టణంలో గాంధీగంజ్ ముందు, కోర్టు ఎదుట, ని ర్మల్ చౌరస్తా, పిప్రికాలనీ (నిర్మల్–భైంసా హైవే ప క్కన), కుభీర్ చౌరస్తాలో వైన్షాపులు కొనసాగుతున్నాయి. గాంధీగంజ్, కోర్టు ఎదుట, పిప్రికాలనీ వైన్షాపుల వద్ద మందుబాబులు బహిరంగ మ ద్యపానం చేస్తున్నారు. దీంతో ఆ దారిన పోయే మ హిళలు, పిల్లలు, ఇతరులు ఇబ్బంది పడుతున్నా రు. అలాగే, దాబాల్లోనూ మద్యం సిట్టింగ్లు నిర్వహిస్తున్నారు. కొన్ని వైన్షాపులకు చెందిన పర్మిట్రూముల్లో ఉదయం అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. పలు కాలనీల్లో బెల్ట్షాపుల్లో, కొన్ని కిరాణ దుకాణాల్లో మద్యం విక్రయిస్తుండడంతో రాత్రివేళల్లో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లోనూ.. పట్టణ కేంద్రాల్లోనే కాకుండా మండల కేంద్రాలు, మేజర్ గ్రామాల్లోనూ బహిరంగ మద్యపానం సమస్య వేధిస్తోంది. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన రోడ్ల వెంబడి ఉండడం, సాయంత్రం, రాత్రి వేళల్లో మందుబాబులు ఆరు బయట మద్యం సేవిస్తుండడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని, బహిరంగ మద్యపానం నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. -
కొత్త వార్డెన్లొచ్చారు..
● షెడ్యూలు కులాల వసతి గృహాల్లో నియామకం ● జిల్లాలోని 8 ఖాళీలకు ఏడు పోస్టులు భర్తీ నిర్మల్చైన్గేట్:షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సంక్షేమ అధికారుల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 2022, డిసెంబర్ 25 నోటిఫికేషన్ ద్వారా 2024 జూన్లో జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ వసతిగృహాల సంక్షేమ అధికారుల ఉద్యోగాలు ఎంచుకున్న వారికి బాసర జోన్కు సంబంధించి నిజామాబాదులో కౌన్సెలింగ్ జరగగా నిర్మల్ జిల్లాకు ఏడుగురిని కేటాయించారు. జిల్లాలో 8 సంక్షేమ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండగా.. ఏడుగురు నియామకంతో పర్యవేక్షణ మరింత మెరుగవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, జిల్లాకు కేటాయించిన హెచ్డబ్ల్యూవోలకు బుధవారం నియామకపత్రాలు అందజేశారు. ఏడుగురిలో ఆరు పోస్టులను బాలుర వసతిగృహాలకు, ఒకరిని బాలికల వసతిగృహాల్లో నియమిస్తూ జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో 20 వసతి గృహాలు.. జిల్లాలో షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖకు సంబంధించి ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ కలిపి 20 వసతి గృహాలు ఉండగా.. 12 మంది మాత్రమే రెగ్యులర్ హెచ్డబ్ల్యూవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. హెచ్డబ్ల్యూవోలు లేని చోట ఇన్చార్జీలను నియమించారు. దీంతో వసతిగృహాల పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తేవి. ఫలితంగా జిల్లా అధికారులే నిరంతరం పర్యవేక్షించాల్సి వస్తోంది. ఇప్పుడు వసతి గృహాల్లో వార్డెన్ల నియామకం ద్వారా, అక్కడ విద్యార్థుల కోసం వసతి సౌకర్యాలు, విద్య, ఇతర సహాయం సమర్థవంతంగా అందించబడుతుంది. హెచ్డబ్ల్యూవోలు వీరే.. వసతిగృహం హెచ్డబ్ల్యూవో నర్సాపూర్(జి) టి.శ్రీనివాస్ దిలావర్పూర్ మురళి లోకేశ్వరం పి.సుర్జిత్రెడ్డి కుభీర్ ఆకాశ్రాథోడ్ బాసర సిరాజ్ఖాన్ కడెం ప్రకాశ్ నిర్మల్ బాలికల సౌమ్య -
ధాన్యం తూకంలో తేడావస్తే చర్యలు
● ఇన్చార్జి డీసీఎస్వో కోమల్రెడ్డి దస్తురాబాద్:వరి ధాన్యం తూకంలో తేడాలు వస్తే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి డీసీఎస్వో కోమల్రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులు, ఐకేపీ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో గురువా రం సమీక్ష నిర్వహించారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో బస్తాకు 41.5 కిలోల ధాన్యం మాత్రమే తూకం వేయాలన్నారు. మూడు రోజుల క్రితం రైతులను రైస్మిల్ యజమానులు వేధిస్తున్నారని వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. రైతులను అయోమయానికి గురిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో తాగునీరు, గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో తహసీల్దార్ సర్పరాజ్ నవాజ్, డీటీ యాదవరావ్, ఏపీఎం గంగన్న, ఏఈవో తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జొన్న కొనుగోళ్లు పరిశీలన.. కుంటాల: ప్రభుత్వం దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి డీసీఎస్ వో సూచించారు. కుంటాలలోని జొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు కుంటాల శివారు ప్రాంతంలోని దౌనెల్లి మార్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీటీ నరేశ్గౌడ్,ీ పఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆర్ఐలు అడెల్లు, రాజేశ్వర్, డైరెక్టర్ ప్రణయ్రావు, సిబ్బంది మహేశ్, కృష్ణ, రైతులు పాల్గొన్నారు. -
కార్మికులు హక్కుల కోసం పోరాడాలి
● జిల్లా జడ్జి రాధికనిర్మల్చైన్గేట్:కార్మికులు న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని జిల్లా జడ్జి రాధిక సూచించారు. 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు హక్కులు, బాధ్యతలు తెలుసుకుని పనిచేయాలని సూచించారు. ఇందు కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రాజన్న మాట్లాడుతూ కేంద్రంలో మోదీ సర్కార్ కార్మిక ప్రజావ్యతిరేక విధాలు అనుసరిస్తూ కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. 12 గంటల పని పెంపుదలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్య పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, జిల్లా కార్యదర్శి రామ లక్ష్మణ్, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి జిల్లా నాయకులు గంగామణి, రేష్మ, భీమవ్వ, ముత్తక్క, భూషణ్, గంగాధర్, పోశెట్టి, రాజేందర్, ఎల్లయ్య పాల్గొన్నారు. -
సీఎంఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్:జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో గురువారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్లకు నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు సరఫరా చేసిన సీఎంఆర్, మిగిలిన ధాన్యం, రోజువారీగా తరలిస్తున్న లారీల వివరాలను రైస్ మిల్లుల వారీగా సమీక్షించారు. ప్రతీ మిల్లర్ గడువులోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ధాన్యాన్ని ప్రభుత్వానికి అందజేస్తామన్న ఒప్పందం చేసుకుంటేనే ధాన్యం కేటాయించడం జరుగుతుందన్నారు. యాక్షన్ ప్యాడికి సంబంధించిన మిగిలిన మొత్తం వెంటనే డిపాజిట్ చేయాలన్నారు. రైస్ మిల్లుల్లో హమాలీల సంఖ్యను పెంచి మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు మిల్లుల్లో ధాన్యం నిల్వ, సామర్థ్యం, అన్లోడింగ్ పరిస్థితులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, రోజువారీ నివేదికలు అందజేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, డీఎం సివిల్ సప్లయిస్ సుధాకర్, ఎల్డీఎం రామ్గోపాల్, పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ -
వంతెనలకు మోక్షమెప్పుడో?
కడెం: జిల్లాలో మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. వరద ఉధృతికి జిల్లాలో వంతెనలు కొట్టుకుపోయాయి. ధ్వంసమయ్యాయి. కొన్ని శిథిలావస్థకు చేరాయి. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదు.దీంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో ఆయితే వీరి కష్టాలు వర్ణణాతీతం. అత్యవసర సమయాల్లో వాగులు దాటుతు ప్రమాదాలు బారిన పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరమ్మతులకు ప్రస్తుతం అనుకూల సమయం. ఇప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధలు చొరవ చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ● పెంబి మండలం పస్పుల గ్రామం సమీపంలో కడెం నదిపై ఉన్న వంతెన మూడేళ్ల క్రితం భారీ వరదలకు కొట్టుకుపోయింది. ఈ వంతెన ద్వారా కర్ణం, అంకెన, రాయదారి, తులసీపేట్, దయ్యలమద్ది గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకుంటారు. వంతెన శిథిలమవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో ప్రమాదకరంగా వాగులు దాటాల్సి వస్తోంది. ‘‘మా కష్టాలు వర్ణనాతీతం,’’ అని రాయదారి గ్రామస్తుడు చవన్ నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుంటాల, సోన్లోనూ అదే పరిస్థితి.. కుంటాల మండలంలో కల్లూర్–బూరుగుపల్లి మధ్య జోడు వాగుపై వంతెన ఏడాదిన్నర క్రితం కూలిపోయింది. రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ‘‘అధికారులు స్పందించడం లేదు,’’ అని బూరుగుపల్లి రైతు కె. వెంకటరావు వాపోయారు. సోన్ మండలంలో మాదాపూర్, పాక్పట్ల దారిలో రూ. 3.5 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పూర్తికాక, గ్రామస్తులు నిరాశలో ఉన్నారు. ఖానాపూర్లో రెంకొని వాగుపై రెండు వంతెనల నిర్మాణం కూడా ఆలస్యమవుతోంది. టెండర్లు, నివేదికలే పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య మాట్లాడుతూ, ‘‘వంతెనల మరమ్మత్తుకు నివేదికలు పంపాము. పస్పుల వంతెన టెండర్ అప్రూవల్ దశలో ఉంది. త్వరలో పనులు ప్రారంభిస్తాం,’’ అని చెప్పారు. అయితే, గ్రామస్తులు వర్షాకాలం లోగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. -
ఉమెన్స్ హ్యాండ్బాల్ విజేత ఉమ్మడి ఆదిలాబాద్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో మూడు రోజులు జరిగిన రాష్ట్రస్థాయి 54వ సీనియర్ మహిళల తెలంగాణ హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజేతగా, రంగారెడ్డి జట్టు రన్నరప్గా నిలిచింది. బుధవారం ఫైనల్మ్యాచ్లో ఈ జట్లు తలపడగా ఆదిలాబాద్ జట్టు 13, రంగారెడ్డి జిల్లా జట్టు 11 గోల్స్ వేసింది. మూడో స్థానంలో వరంగల్, నాలుగో స్థానంలో ఖమ్మం జట్లు నిలిచాయని, గెలిచిన జట్లకు నిర్వాహకులు షీల్డ్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి జట్టు కోసం 20 మందిని ఎంపిక చేసి వరంగల్లో కోచింగ్ ఇస్తామన్నారు. గుజరాత్లోని బూజ్లో ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టు పాల్గొంటుందన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ ఉమ్మడి 10 రాష్టాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పవన్కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కాంపెల్లి సమ్మయ్య, కోశాధికారి రమేశ్రెడ్డి, గ్రౌండ్ ఇన్చార్జి నస్పూరి తిరుపతి పాల్గొన్నారు. ● రన్నరప్గా రంగారెడ్డి జట్టు -
క్రీడలు లేని ప్రాంగణాలు
జిల్లా వివరాలు మండలాలు :18 మున్సిపాలిటీలు : 3 మండలాల పరిధిలో క్రీడా ప్రాంగణాలు :582 మున్సిపాలిటీల పరిధిలో క్రీడా ప్రాంగణాలు : 23 2023లో జిల్లాకు చేరిన స్పోర్ట్స్ కిట్లు : 656 నిర్మల్చైన్గేట్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కానీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో మూడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కో ప్రాంగణానికి క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. కానీ వాటిని బయటకు తీసి ఆటలు ఆడిన దాఖలాలు ఎక్కడా లేవు. 2022, జూన్ 2న ప్రారంభం జిల్లాలోని అన్ని మండలాల్లో రెండు చొప్పున క్రీడా ప్రాంగణాలను 2022 జూన్ 2న అధికారులు ప్రారంభించారు. ఆ తర్వాత మిగతా గ్రామాల్లో దశల వారీగా ఆరంభించారు. తొలుత వాలీబాల్, ఖోఖోలకు తప్ప మిగతా క్రీడలకు అవసరమయ్యే క్రీడా పరికరాలు పంపిణీ చేయలేదు. దీంతో జిల్లాలోని 582 క్రీడా ప్రాంగణాలు నామమాత్రంగా మారాయి. ప్రాంగణాలు చిన్నగా ఉండడం, క్రీడా సామగ్రి లేకపోవడంతో యువత, విద్యార్థులు ఆటలు ఆడేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా సుమారు మూడేళ్లుగా వినియోగం లో లేక క్రీడా ప్రాంగణాలు పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి. వీటిని వినియోగంలోకి తెచ్చి క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో 2023లో గ్రామ పంచాయతీలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. అలంకారప్రాయంగానే.. గ్రామాల పరిధిలో అరెకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. చాలా గ్రామాల్లో స్థలాల కొరత ఉండడంతో స్మశాన వాటికల పక్కన, పాఠశాలల ప్రాంగణాలు, ఖాళీగా ఉన్న కొద్ది పాటి స్థలాల్లో తెలంగాణ ప్రాంగణం పేరిట బోర్డు, వాలీబాల్ కోర్టు, వ్యాయామం చేసేందుకు రెండు పరికరాలు ఏర్పాటు చేసి నామ్కే వాస్తేగా వదిలేశారు. కొన్నిచోట్ల కేవలం క్రీడా ప్రాంగణం పేరుతో బోర్డులు పెట్టి ఇతరత్రా వసతులను మరిచారు. ఇక పట్టణాల్లోనూ వార్డుకో క్రీడా ప్రాంగణం ఉండాల్సి ఉండగా స్థలం కొరత వల్ల మూడు మున్సిపాలిటీల పరిధిలో 23 ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి ఆధ్వానంగా మారాయి. మరోవైపు నిధుల కొరత వల్ల పంచాయతీలు వీటి నిర్వహణ చేపట్టలేక పూర్తిగా గాలికొదిలేశాయని పలువురు పేర్కొంటున్నారు. గతంలో పంపిణీ చేసిన స్పోర్ట్స్ కిట్స్లోనిసామగ్రిస్పోర్ట్స్ కిట్లలో మేజరింగ్ టేపు 1, డిస్కస్ త్రో 1, 2 కిలోలు, టెన్నికాయిట్ రింగులు 6, స్కిప్పింగ్ రోప్లు 4, ప్లాస్టిక్ విజిల్స్ 3, స్టాప్ అండ్ గో వాడెస్ 1, సింథటిక్ వాలీబాల్ 1, నెట్ 1, సైకిల్ పంపు, బిగ్ సైజ్ (ఫుట్ పంపు)1 ఉంటాయి. డంబెల్స్ మూడు సెట్లు, టీషర్లు 75, క్రికెట్ బ్యాట్ నెం.5, కశ్నీర్ విల్లో 1, ఫుల్సైజ్ బ్యాట్ 1, బ్యాటింగ్ గ్లౌజులు ఒకజత, లెగ్ ప్యాడ్లు రెండు జతలు, వికెట్ కీపింగ్ లెగ్ గార్డు ప్యాడ్ ఒక జత, స్టంప్స్ సెట్ 2 జతలు, లబ్డామినల్ గార్డ్స్ 2 జతలు, ప్రాక్టీస్ బాల్స్ 6, ఆర్మ్ గార్డ్స్ 2, దైప్యాడ్లు 4, క్రికెట్ కిట్ బ్యాగ్ 1 ఉన్నాయి. లక్ష్యానికి దూరంగా క్రీడా మైదానాలు పంచాయతీలకే పరిమితమైన స్పోర్ట్స్ కిట్లు వేసవి దష్ట్యా వినియోగంలోకి తెస్తే మేలుఅటకెక్కిన క్రీడా సామగ్రి జిల్లాలోని పలు క్రీడా ప్రాంగణాలకు 2023 అక్టోబర్లో 605 కిట్లను పంపిణీ చేశారు. ఒక్కో క్రీడా యూనిట్ విలువ రూ.68 వేలు ఉంటుంది. ఇందులో జిమ్ పరికరాలతో పాటు క్రికెట్, వాలీబాల్ ఆటలకు సంబంధించిన సామగ్రి ఉంది. కానీ చాలా చోట్ల వినియోగంలో లేక గ్రామ పంచాయతీ గదుల్లో మూలన పడేశారు. ఇప్పటికై నా క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.వినియోగంలోకి తేవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. వాటిలో సరైన వసతులు లేకపోవడంతో ఆదరణకు నోచుకోవడం లేదు. వీటిపై పర్యవేక్షణ కొరవడటంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. వేసవి సెలవుల దష్ట్యా అధికారులు చొరవ తీసుకొని ప్రాంగణాలను వినియోగంలోకి తేస్తే యువతకు మేలు జరుగుతుంది. – కుందారం శివకుమార్, న్యూ వెల్మల్ -
అక్షయ తృతీయ.. కొనుగోళ్లు అంతంతే
● పర్వదినాన ఆసక్తి చూపని ప్రజలు ● జిల్లాలో తగ్గిన పసిడి కొనుగోళ్లు.. ● ధర పెరుగుదలతో సంప్రదాయం పక్కన పెట్టిన వినియోగదారులునిర్మల్ఖిల్లా: అక్షయ తృతీయ పర్వదినం అనగానే ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని సంప్రదాయంగా భావిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రంలోని బంగారం మార్కెట్లో బుధవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.98,800 ఉండడంతో కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత బంగారం ఉంటే చాలు.. తర్వాత చూద్దాంలే అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. ఈసారి అంతంతే... ఏటా అక్షయ తృతీయను పురస్కరించుకొని జిల్లాలోని దుకాణాలు కిటకిటలాడేవి. ఈసారి మాత్రం బంగారం ధర ఏకంగా లక్షకు చేరువ కావడంతో విక్రయాలు అమాంతం పడిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు స్వర్ణకారులకు కూడా ఉపాధి లేకుండా పోయింది. బంగారం కొనుగోలు లేక నగలు ఆభరణాలు తయారీ కూడా అంతంత మాత్రంగానే సాగుతోందని అంటున్నారు. వ్యాపారం సన్నగిల్లింది.. గతంతో పోల్చితే ఈ ఏడు జనవరి నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఏప్రిల్ నాటికి 24 క్యారెట్ బంగారం ధర ఏకంగా లక్షకు చేరింది. దీంతో గతంతో పోల్చితే వ్యాపారం, నగల తయారీదారులకు ఉపాధి భారీగా సన్నగిల్లింది. వివాహాది శుభకార్యాలను కూడా అతికొద్ది బంగారం కొనుగోళ్లతోనే కానిచ్చేస్తున్నారు. భైంసాటౌన్: అక్షయ తృతీయ సందర్భంగా విత్తనాలతో పాటు బంగారం కొనుగోళ్లతో మార్కెట్ సందడిగా కనిపించింది. అక్షయ తృతీయకు ఇక్కడి రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ధర ఎక్కువగా ఉండడంతో, బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. కుంటాల: మండలంలోని రైతులు విత్తనాలు, బంగారం కొనుగోలు చేశారు. అందాకూర్, పెంచికల్ పాడ్ గ్రామాల్లో స్వాధ్యాయ పరివార్ సభ్యులు పంట చేలలో భూమిపూజ చేశారు. 24 క్యారెట్ మేలిమి బంగారం ధరలు (10 గ్రాములకు ) సంవత్సరం ధర రూ.లలో 2010 22,800 2015 32,500 2020 50,250 2025 98,800 -
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి
దస్తురాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని ఏఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన ఏఎస్సై లక్ష్మీనారాయణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ముఖ్యంగా డయల్ 100 కాల్స్పై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని వాస్తవ పరిస్థితులను అంచనావేసి తగుచర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఏఎస్సై లక్ష్మీనారాయణ సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ అజయ్, కడెం ఎస్సై కృష్ణ సాగర్రెడ్డి, ట్రెయినీ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
మూడు కిలోమీటర్లు వెళ్తేనే నీరు
ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలో నీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామశివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి, ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బోరుబావులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామానికి 3 కి.మీ దూరంలో సిరికొండ మండలం రాంపూర్కు బైక్లు, ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి -
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా కాలికి దెబ్బతగలంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో గతనెల 26న స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి బుధవారం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ ఒక హోటల్ వద్ద కూర్చున్న సాగర్ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే గమనించి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాగర్ మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం
బజార్హత్నూర్: మండలంలోని దేగామ గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు దాదాపు 10 ఎకరాల జొన్న పంట దగ్ధమైంది. ఎంఆర్ఐ నూర్సింగ్ కథనం ప్రకారం.. గ్రామంలో మధ్యాహ్నం కొత్తకొండ లక్ష్మీ పంటచేనులో జొన్నపంటకు మంటలు అంటుకున్నాయి. కొన్ని క్షణాల్లో చుట్టుపక్కల చేలకు మంటలు విస్తరించి దాదాపు 10 ఎకరాల జొన్న పంటతోపాటు 100 పైపులు, స్పింక్లర్లు కాలి బూడిదయ్యాయి. ఘటన స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్రావు, ఆడె గజేందర్, జల్కే పాండురంగ్, నారాయణ పరిశీలించారు.ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తాంసిలో రెండెకరాలు.. తాంసి: మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం నిప్పంటుకుని రెండెకరాల్లో జొన్న పంట దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి..సోమ గంగారెడ్డి పంటచేను పక్కన ట్రాన్స్ఫార్మర్ వద్ద చెలరేగిన నిప్పురవ్వలతో మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో రెండెకరాల్లో జొన్న పంట దగ్ధమైంది. స్థానికులు నీళ్లను చల్లి మంటలార్పివేశారు. అగ్ని ప్రమాదంలో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన మరో రైతు సతీశ్ చేనులో అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి చెంది పదికి పైగా స్పింక్లర్ల పైపులు దగ్ధమయ్యాయి. -
ఆనాటి చరిత్ర కాలగర్భంలోకి..
కడెం:మండలంలోని బెల్లాల్ సమీపంలో గోదావరి, కడెం నది కలిసే ప్రాంతంలో 1200 ఏళ్ల క్రితం నాటి మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర కాలగర్భంలోకి కలిసిపోతుంది. ఆలయ గర్భంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయని వందల ఏళ్ల క్రితం ఆలయాన్ని, దేవతమూర్తుల విగ్రహాలను నాడు కొందరు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో స్తంభాలు పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు పెద్దలు చెబుతున్నా రు. పురాతన ఆలయాన్ని పరిరక్షించకపోవడంతో అనాటి చరిత్రాక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. విగ్రహాల తలభాగాలు లేకుండా పోగా, రాతిస్తంభాలు గోదావరి ఒడ్డున కుప్పలుగా ఉన్నా యి. ప్రస్తుతం పురాతన ఆలయం ఉన్నచోట గ్రా మానికి చెందిన వారు నూతన ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. 1200 ఏళ్ల క్రితం నాటి చరిత్రని, శివ సాహిత్యం పొందడానికి ఆత్మహుతి చేసుకున్న వీరగల్లు విగ్రహంగా భావిస్తున్నట్లు తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ హరగోపాల్, రాజ్కుమార్ తెలిపారు. -
విత్తనపూజకు వేళాయె
● జంగుబాయి సన్నిధిలో ఆదివాసీల పూజలు ● ఆలయంలో రేపటి నుంచి నెలరోజులు ఉత్సవాలుకెరమెరి(ఆసిఫాబాద్): ఆనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. జూన్ 8న మృగశిరకార్తె ప్రవేశించనుండడంతో ఆదివాసీలు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మహరాజ్గూడ అడవుల్లో కొలువైన జంగుబాయికి పుణ్యక్షేత్రంలో విత్తన పూజకు శ్రీకారం చుట్టారు. అక్కడి గుహలోకి వెళ్లి దీపం వద్ద పూజలు చేస్తారు. రావుడ్, పోచమ్మ, మైసమ్మకు విత్తనాలు చూపించి మొక్కి అమ్మవార్లకు నైవేద్యం చూపిస్తారు. విత్తన పూజల అనంతరం తమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దీన్ని గోండి భాషలో ‘మొహతుక్’అంటారు. అదేవిధంగా గిరి గ్రామాల్లో ఏటా జరిగే విత్తన పూజల ముందుగా జంగుబాయి అమ్మవారికి విత్తనాలు చూపెట్టాక పొలాల్లో నాటడంతో అధిక దిగుబడి వస్తాయని భక్తుల నమ్మకం. నేడు దీపోత్సవం జంగుబాయి సన్నిధిలో గురువారం దీపోత్సవం, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. వివిధ గ్రామాలకు చెందిన మోళంలు తరలివచ్చి పూజలు చేస్తాయి. దుక్కిలతో దున్ని విత్తనాలు వేసేందుకు తమ పొలాలను రైతులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాలోనే ఆదివాసీలు అధికంగా ఉన్నారు. దేవతలకు విత్తనాలు చూపిస్తారు మే మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకిపేన్, అమ్మోరు, పోచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అదే రోజు రాత్రి 2.5 కిలోల జొన్నలతో గట్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ కార్యక్రమంతా మృగశిర మాసానికి కొద్ది రోజుల ముందుగా నిర్వహిస్తారు. విత్తన పూజలు(మొహతుక్) విత్తన పూజ చేయాలన్న రోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడుతారు. ఉదయం ఇంటిని శుభ్రం చేసి పేడతో అలుకు చల్లుతారు. పొలానికి వెళ్లాక జొన్నతో గట్కా తయారు చేసి కులదైవంతోపాటు నేల తల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామ పటేల్ ఇంటి ఎదుట మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. తర్వాత సహపంక్తి భోజనం చేస్తారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్, మే మాసంలో విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆరోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో అన్ని విత్తనాలను కలిపి భీమల్ దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడ్తారు. ఆరోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో ఆ విత్తనాలను తమ పొలాల్లో చల్లుతారని పలువురు చెబుతున్నారు. దేవతలకు చూపించాకే.. పొలాల్లో విత్తనాలు నాటే కొన్నిరోజుల ముందు కుల దేవతలకు వాటిని చూపిస్తాం. ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను వండి ఆరగిస్తాం. నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం. – సలాం శ్యాంరావు, జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆచారాలు పాటిస్తున్నాం ఆదివాసీలు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమైన విత్తన(మొహతుక్) పూజలు ఇప్పుడు కూడా చేస్తున్నాం. పూజలు చేయందే విత్తనాలు నాటం.– పుర్క బాపూరావు, జంగు బాయి ఉత్సవ కమిటీ, ప్రచార కార్యదర్శి -
తాత్విక ధోరణితో సమున్నత జీవితం
● ’జీవితమే ఒకపుస్తకం’ గ్రంథ పరిచయ కార్యక్రమంలో సాహితీవేత్తలు ● జిడ్డు కృష్ణమూర్తి ఆంగ్ల పుస్తకాన్ని అనువదించిన జిల్లా కవి నిర్మల్ఖిల్లా: తాత్విక ధోరణి ద్వారానే సమున్నత జీవితం సిద్ధిస్తుందని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని కావేరి ఫౌండేషన్ గ్రంథాలయంలో మంగళవారం రాత్రి ‘జీవితమే ఒక పుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనువాదకర్త కె.మచ్చేందర్..ప్రపంచ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల సమాహార గ్రంథం ‘ది బుక్ ఆఫ్ లైఫ్’అనే ఆంగ్ల పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాటు కష్టపడి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం ప్రశంసనీయమని కొనియాడారు. కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి, సాహితీవేత్తలు టి.సంపత్ కుమార్, నరసయ్య, రవీంద్రబాబు, తుమ్మల దేవరావు, కృష్ణంరాజు, మునిమడుగుల రాజారావు, ఆకుల సుదర్శన్, అంబటి నారాయణ, అనిత, నాగరంజని, నూకల విజయ్కుమార్, దీపక్, పోలీస్ భీమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్ను అభినందించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 96 శాతం ఫలితాలు సాధించినట్లు ఏసీఎంవో జగన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 108 పాఠశాలలు, అందులో 65 పాఠశాలలు వంద శాతం వచ్చాయని పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదిలో ఉత్తమ ఫలితాలు సాధనకు ఐటీడీఏ పీవో సారథ్యంలో చేపట్టిన మిషన్ లక్ష్యం ఎంతో మేలు చేసిందన్నారు. వచ్చే ఏడాదిలో పదిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఐటీడీఏ పీవో పేర్కొన్నారు. -
పనులు చేయకున్నా కూలి కాజేశారు!
సారంగపూర్: మండల కేంద్రంలో మంగళవారం ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధిహా మీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. జనవరి 1, 2024నుంచి మార్చి 3, 2025వరకు మండలవ్యాప్తంగా అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వ నాల్లో నాటిన మొక్కలు చనిపోయిన వి షయం, న ష్టాన్ని తనిఖీ బృందం సభ్యులు వెల్లడించారు. మ హవీర్తండాలో అధిక మస్టర్లు వేసి దాదాపు రూ.4 లక్షలు కూలీలు, మేట్ పంచుకున్నట్లు తెలిపారు. దీ నిని కూలీలు రాతపూర్వకంగా అంగీకరించగా, అధి కారులు మళ్లీ విచారణకు ఆదేశించారు. తనిఖీ బృందం సభ్యులు నిరాకరించి ఇద్దరు మేట్లను తొలగి స్తున్నట్లు ప్రకటించారు. దుర్గానగర్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. మహవీర్తండాకు చెందిన ఒకే కుటుంబానికి మూడు జాబ్కార్డులు జారీ చేసి 236రోజుల పని కల్పించిన విషయమై ఇన్చార్జి డీఆర్డీవో మేట్, ఫీల్డ్ అసిస్టెంట్లను వివరణ కోరగా, గమనించలేదని బదులిచ్చారు. మహవీర్తండా, దుర్గానగర్లో తల్లిదండ్రుల పేరిట మైనర్లతో పనులు చేయించినట్లు బృందం సభ్యులు వెల్ల డించగా, మేట్పై అధికారులు ఆగ్రహం వ్యక్తంజేశా రు. ఏపీడీ నాగవర్ధన్, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావు, ఫిర్యాదుల పరిష్కార అధికారి నవీన్, ఎంపీవో అ జీజ్ఖాన్, ఏపీవో లక్ష్మారెడ్డి, ఎస్టీఎం దత్తు, ఎస్ఆర్పీలు సాంబశివాచారి, కార్యదర్శులు పాల్గొన్నారు. -
నిర్మల్
విహారం.. వినోదం ఉమ్మడి ఆదిలాబాద్ ప్రకృతి సంపదకు నిలయం. ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలెన్నో ఉండగా.. సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025IIలోu పనుల పురోగతిపై సమీక్ష లక్ష్మణచాంద: మండలంలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిపై డీఈవో రామారావు మంగళవారం మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయా పాఠశాలల హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. ముందుగా పాఠశాలల్లో ఇప్పటివరకు చేపట్టిన, చేపట్టాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని ఒడ్డెపెల్లి, బోరిగాం పాఠశాలల్లో సంబంధిత హెచ్ఎంలు, చైర్మన్లు పెండింగ్ పనులను రెండురోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంఈవో అశోక్వర్మ, పీఆర్ ఏఈ సంజయ్, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు రాజేశ్వర్, లింబాద్రి, చైర్మన్లు, సీఆర్పీ సుధాకర్ పాల్గొన్నారు. కడెం: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలని డీఈవో రామారావు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ఆయా పాఠశాల ల హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈవో షేక్ హుస్సేన్, పీఆర్ ఏఈ సూర్యతేజ తదితరులున్నారు.‘ఏం సార్.. మొన్న మీబాబు మెయిన్రోడ్డుపై బైక్ నడుపుతున్నాడు. ఇప్పుడింకా టెన్త్ క్లాసే కదా సార్.. ఇప్పటి నుంచే అలా బండి నడపడం అవసరమంటారా..!?’ అని ప్రవీణ్ అంటుండగానే.. ‘అరె ఏం సార్.. మీరింకా ఏ జమానాలో ఉన్నారు. ఇప్పుడంతా స్మార్ట్ఫోన్ల జమానా నడుస్తుంది. పిల్లలు అన్నిట్లో ఫాస్ట్ ఉండాలి. అన్ని నేర్చుకోవాలి. ఏజ్ది ఏముంది సార్..!? వాడికి బైక్ బాగానే వస్తుంది. ఈమధ్య ఏ పని ఉన్నా.. వాడికే చెబుతున్నాం కూడా..’ అంటూ శ్రీనివాస్ చెబుతూ ఉండటంతో ప్రవీణ్ సైలెంట్ అయిపోయాడు. సరిగ్గా వారం తర్వాత.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర శ్రీనివాస్ కనిపించడంతో ప్రవీణ్ ‘ఏమైందంటూ..’ పలకరించాడు. తన బాబు బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టాడని, దీంతో తన కొడుకు ఎడమకాలు విరగడంతో పాటు వెనుక కూర్చున్న పిల్లాడికీ తీవ్రగాయాలయ్యాయని చెబుతూ, వాడికి బైక్ ఇచ్చినందుకు తనపైనా పోలీసు కేసు నమోదైందని తలదించుకున్నాడు. –నిర్మల్●● గాలిలో కలుస్తున్న చిరు ప్రాణాలు ● పోలీసుల హెచ్చరికలు బేఖాతరు ● జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ ● మైనర్లు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ప్రాణాలు పోయిన ఘటనలెన్నో.. ఇదొక్కటే కాదు.. ఇలాంటివెన్నో ఈమధ్య చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలూ పోయాయి. శ్రీనివాస్లాంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ నేర్పాలన్న అత్యాశలో వయసుకు మించిన సాహసాలు, తప్పిదాలనూ చేయిస్తున్నా రు. తమ కొడుకు/బిడ్డ చిన్నవయసులోనే డ్రైవింగ్ చేస్తుండటం చూసి మురిసిపోతున్నారు. కానీ.. వారి వయసురీత్యా ఉండే మానసికస్థాయికి అది సరికాదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈక్రమంలోనే తమ చేతులారా.. తమ పిల్లల ప్రాణాలు, ఎదుటివారి జీవితాలతోనూ ఆడుకుంటున్నారు. దీనిపైనే ఇటీవల పోలీస్శాఖ సీరియస్గా దృష్టిపెట్టింది. జిల్లాలో ఒకేరోజు వందకేసులు నమోదు చేసింది. చిన్నవయసులో డ్రైవింగ్ సరికాదని మానసిక వైద్యనిపుణులూ హెచ్చరిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇలా.. రెండేళ్లక్రితం జిల్లాకేంద్రంలోనే ఓ పేరున్న బిల్డర్ బిడ్డ (మైనర్) కారు నడుపుతూ మంచిర్యాలరోడ్డులో బైక్పై వెళ్తున్నవారిని ఢీకొట్టింది. ఇద్దరికి గాయాలయ్యాయి. అక్కడున్న వారందరూ ‘ఏంటమ్మా.. ఇంత చిన్నవయసులో కారు నడుపుతున్నావ్.. అది కూడా ఇంత స్పీడ్గా..’ అని ప్రశ్నిస్తే.. ‘మా నాన్నే నాకు నేర్పించారు. కారు కూడా ఆయనే ఇచ్చారు. మీరెవరు నన్ను అడగడానికి..’ అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో అక్కడున్నవారు సదరు బిల్డ ర్కు ఫోన్ చేసి మందలించారు. పిల్లల డ్రైవింగ్.. పెద్దలపై కేసులు 18 ఏళ్లున్నవారే డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అర్హులు. లేనిపక్షంలో పిల్లలు వాహనాలు నడిపిస్తే.. సంబంధిత వాహన యజమానిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 199ఏ ప్రకారం బాలల డ్రైవింగ్పై కేసుల నమోదు ఉంటుంది. ఇటీవల జిల్లాలో పోలీసులు మైనర్ డ్రైవింగ్పై సీరియస్గా వ్యవహరిస్తున్నారు. సదరు పిల్లలతో పాటు తల్లిదండ్రులనూ స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కేసుల నమోదు, జరి మానాలు వసూలు చేస్తున్నారు. ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని అన్ని పోలీ స్స్టేషన్ల పరిధిలో మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సుమారు 296 మంది మైనర్లు పోలీ సులకు పట్టుబడగా 100 మందిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం మైనర్ల తల్లిదండ్రులకు మో టార్ వాహన చట్టాలపై అవగాహన కల్పించారు.స్పెషల్ డ్రైవ్లో పట్టుకున్న వాహనాలుడ్రగ్స్ రవాణా చేస్తే చర్యలు నర్సాపూర్ (జి): మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా కఠినచర్యలు తప్పవని నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా హెచ్చరించారు. సోమవారం రాత్రి నర్సాపూర్ (జి), చాక్పల్లి, తిమ్మాపూర్ (జి) గ్రామాల్లోని అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించా రు. మాదకద్రవ్యాల వినియోగిస్తే కలిగే నష్టా ల గురించి అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, నర్సాపూర్ (జి), దిలావర్పూర్, సారంగపూర్, నిర్మల్ రూరల్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. మానసిక సామర్థ్యం తక్కువ మైనర్లకు మానసిక సామర్థ్యం తక్కువ. వాహనాల ను నడిపేటప్పుడు క్షణాల్లో నిర్ణయాలు తీసుకోలేక ప్రమాదాల బారిన పడుతుంటారు. మైనర్లకు వాహనాలిస్తే వారిని ప్రమాదంలోకి నెట్టినట్లే తల్లిదండ్రులు భావించాలి. – సురేశ్ అల్లాడి, సైకియాట్రిస్ట్ అవగాహన కల్పిస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టిపెట్టాం. వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తిస్తున్నాం. పిల్లలతోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుంది. – జానకీషర్మిల, ఎస్పీ 18 ఏళ్లు నిండితేనే డ్రైవింగ్ మనకున్న నిబంధనల ప్రకారం 18ఏళ్లు ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనాన్ని నడిపించాలి. లేనిపక్షంలో వాహనాలు నడిపితే చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలివ్వొద్దు. – పీ దుర్గాప్రసాద్, జిల్లా రవాణాశాఖ అధికారి న్యూస్రీల్రేపు భైంసాలో ప్రజావాణి భైంసాటౌన్: పట్టణంలోని పాత రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోగల ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎస్పీ జానకీ షర్మిల పోలీ స్ ప్రజావాణి నిర్వహించనున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కా ర్యాలయంలో అందుబాటులో ఉండి సబ్ డివి జన్పరిధిలోని బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. భరోసా కేంద్రంలో కూడా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఠాణా వాహనాలు ఠాణా వాహనాలు నిర్మల్ టౌన్ 10 భైంసా టౌన్ 10 నిర్మల్ రూరల్ 5 భైంసా రూరల్ 4 ఖానాపూర్ 6 కుభీర్ 3 కుంటాల 6 బాసర 5 లోకేశ్వరం 7 ముధోల్ 4 తానూరు 6 దస్తురాబాద్ 4 కడెం 4 పెంబి 1 దిలావర్పూర్ 3 నర్సాపూర్ 3 సారంగపూర్ 7 లక్ష్మణచాంద 6 మామడ 2 సోన్ 4 పిల్లలకు వాహనాలిస్తే కేసులు నిర్మల్టౌన్: మైనర్లకు వాహనాలిచ్చే ఓనర్లపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ జానకీ షర్మిల హెచ్చరించారు. ఆదివారం జిల్లాలోని అన్ని ఠాణాల పరిధిలో మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టుబడిన మైనర్ల తల్లి దండ్రులకు రెండో విడతగా మంగళవారం జి ల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ప్రొజెక్టర్ ద్వారా షార్ట్ ఫిలింస్, మైనర్ డ్రైవింగ్ కారణంగా జరిగిన ప్రమాదాల వీడియోలు చూపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే మైనర్లపై కేసులు నమోదు చేస్తే వారు భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఎట్టి పరిస్థితుల్లోనే వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి, ఆర్ఐలు రాంనిరంజన్, శేఖర్, రమేశ్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
భైంసాటౌన్: అమెచ్యూర్ వుషూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఇటీవల నిర్వహించిన మూడో సబ్ జూనియర్, జూనియర్, రెండో సీనియర్ రాష్ట్రస్థాయి వుషూ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. జిల్లాతోపాటు ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం నుంచి 26 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 11 బంగారు, ఆరు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించినట్లు ఖేలో ఇండియా కోచ్ జ్ఞానతేజ తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో నర్వాడే రుద్ర, అబ్దుల్ రెహమాన్, ఎం.శ్రేయాన్ కార్తికేయ, వాగ్మారే కరణ్, రాథోడ్ కృష్ణ, రూప భాదూర్, తోకల్వాడ్ అరవింద్, జాదవ్ ఆర్యన్ బంగారు పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. జూనియర్ విభాగంలో రాంచరణ్, హర్షవర్ధన్ శర్మ, సీనియర్ విభాగంలో కొట్టె స్వరూప బంగారు పతకాలు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. వీరు మే, జూన్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. -
‘భూభారతి రైతులకు వరం’
కుంటాల: భూభారతి పథకం రైతులకు వరం లాంటిదని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అందాకూర్ గ్రామంలో రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఆధార్ లాగే భూధార్ ద్వారా నంబర్ ఇచ్చి భూమి, హద్దులు గుర్తించేందుకు వీలుంటుందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్ మాట్లాడుతూ.. మే 1నుంచి గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమల్సింగ్, ఎంపీడీవో లింబాద్రి, డీటీ నరేశ్గౌడ్, ఏవో విక్రమ్, ఎంపీవో రహీంఖాన్, ఆర్ఐలు అడెల్లు, రాజేశ్వర్, రైతులు పాల్గొన్నారు. సోన్: మండల కేంద్రంలోని రైతువేదికలో భూభా రతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి చట్టం, గ్రామ రెవెన్యూ అధికారుల నియామకంతో భూసమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని తెలిపారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, మండల ప్రత్యేకాధికారి గోవింద్, తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో కలీం, ఏవో వినోద్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. కుభీర్: భూభారతి చట్టం కింద భూసమస్యలన్నీ తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కారమవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. కుభీర్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. గతంలో సాదాభైనామా కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, స్పెషలాఫీసర్ శంకర్, తహసీల్దార్ శివరాజ్, ఏవో సారిక, ఎంపీడీవో నవనీత్కుమార్ తదితరులున్నారు.