breaking news
Nirmal District News
-
ఎస్ఐఆర్ను పరిశీలించిన డీపీవో
భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఇంటింటి సర్వే నిర్వహణ, ఓటరు వివరాల నమోదు, అర్హుల జాబితా తయారీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఓటరును జాబితాలో చేర్చడంతోపాటు, అనర్హుల పేర్ల తొలగింపులో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సర్వేలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎల్పీవో లక్ష్మణ్, ఎంపీవో ప్రదీప్, బీఎల్వోలు ఉన్నారు. -
మంచి సూచన.. అమలు చేసేనా?
కొయ్యబొమ్మలే ఇవ్వండి..ఇక జిల్లాకు పేరు తీసుకువచ్చిన కొయ్యబొమ్మలనూ కాపాడుకోవాలని సమావేశంలో ఇలంబర్తి సూచించారు. ప్రతీశాఖ వారు ఏ కార్యక్రమం జరిగినా కొయ్యబొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్నే జ్ఞాపికలుగా ఇవ్వడం ద్వారా కళాకారులకు, కళకు అండగా నిలిచినవారవుతారని తెలిపారు. ఇతర జిల్లాలు, ప్రాంతాలకు బొమ్మలు, పెయింటింగ్స్ వెళ్లడం వల్ల ప్రమోషన్ చేసిన వాళ్లమవుతామని వివరించారు. తొలి కలెక్టర్ చెప్పిన ఈ మంచి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రస్తుత కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మల్: ‘టీచర్స్ లేకపోతే మేము లేము. నేను కూడా ప్రభుత్వ బడిలోనే చదివాను. సర్కారు బడిలో ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వబడులను ప్రోత్సహించాలి. అందులో చదువుచెప్పే ఉపాధ్యాయుల అనుభవం విద్యార్థులకు భవిష్యత్తుకు ఉపయోగపడాలి. అలాగే ప్రతీ అధికారి ఓ ప్రభుత్వ బడిని బాధ్యతగా తీసుకోవాలి..’ అంటూ చదువు, ప్రభుత్వ బడి ప్రాధాన్యతను ప్రజాపాలన ప్రత్యేకాధికారి ఇలంబర్తి సూచించారు. ఈనెల 24న కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన చేసిన ఈ సూచనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా తొలి కలెక్టర్ ఇలంబర్తి ఈ సమావేశంలో చేసిన పలు సూచనలు ఆలోచింపజేయడమే కాకుండా ఆచరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సర్కారు స్కూళ్లలో చదివి.. ‘ఇక్కడ ఉన్నవాళ్లల్లో ఎంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివారో చెప్పండి..’అంటూ ప్రత్యేకాధికారి ఇలంబర్తి అడగగానే సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారుల్లో దాదా పు అందరూ చేతులెత్తారు. సర్కారు స్కూళ్లల్లో చది వి ఉన్నత అధికారులుగా ఎదిగిన తీరును ఆయన గర్వంగా చెప్పారు. అలాంటి స్కూళ్లను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. అధికారికో బడి అప్పగిస్తే.. ‘అందరం ప్రభుత్వ బడుల్లో చదువుకుని వచ్చినవాళ్లమే. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లమే. అందు కే ఒక్కో అధికారికి ఒక్కో బడి బాధ్యతను అప్పగిస్తే బాగుంటుంది. సదరు అధికారి నెలలో కనీసం రెండు మూడుసార్లు ఆ స్కూల్కు వెళ్లి, పిల్లలతో మాట్లాడాలి. వారిలో చదువుపై ఆసక్తిని పెంచడం, తాము ఏ శాఖలో, ఏఏ పనులు చేస్తామో చెప్పడం, సాధారణ కుటుంబాల నుంచి వచ్చినా, బాగా చదివితే తమలా ఉన్నత ఉద్యోగాలను సాధించవచ్చని మోటివేట్ చేయాలి’ అని ఇలంబర్తి సూచించారు. దీనిపై కలెక్టర్ భవేశ్మిశ్రాతోపాటు జిల్లా అధికారులూ సానుకూలంగా స్పందించారు. -
కాంగ్రెస్ ఓట్లు తొలగించే కుట్ర
నిర్మల్చైన్గేట్: ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మైనార్టీ, ఎస్టీ, ఎస్సీల ఓట్లు తొలగించే కుట్ర చేసిందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. పట్టణంలోని దివ్య గార్డెన్లో ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఎల్ఎలు, పార్టీ మండల అధ్యక్షులు, సూపర్ వైజర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నా, రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నా ఈ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నెల రోజులపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్స్ అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా చూడాలని కోరారు. ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలపై సమీక్ష.. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తామన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించడానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. సమష్టిగా కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి పని చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావు పటేల్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్, నియోజకవర్గంలోని బీఎల్ఎలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారమైనా సంక్షేమం ఆపం -
సర్లో భాగస్వాములు కావాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతీఓటరు జూలై 24లోగా తమ వివరాలు నమోదు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలోని 29వ వార్డులో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి రెండు ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారన్నారు. ప్రజలు ఫారాలను పూర్తిగా పూరించి, 2002 ఓటర్ల జాబితా లో తమ పేరు లేదా తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మ, నానమ్మ తదితర కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించి, సంబంధిత సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలన్నారు. అనంతరం సంతకం చేసి, ఒక పాస్పోర్ట్ సైజు ఫొటోను జతచేసి సంబంధిత బీఎల్వోకు అందజేయాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ప్రతీ ఓటరు ఓటు భద్రంగా ఉంటుందని, సమర్పించని వారి వివరాలు తదుపరి పరిశీలనకు లోబడే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బీఎల్వో సమక్షంలో కలెక్టర్ స్వయంగా తన ఓటు వివరాలను పరిశీలించారు. రీప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫారంలో 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఉన్న వివరాలను నమోదు చేసి, పాస్పోర్ట్ సైజు ఫోటోను జతచేసి బీఎల్ఓకు అందజేశారు. కార్యక్రమంలో పట్టణ తహసీల్దార్ రాజు, వార్డు సూపర్వైజర్లు, బీఎల్వోలు, కాలనీ వాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘సన్నా’లతో సాగేదెలా?
ప్రభుత్వం సూచించిన 7 రకాలు సాంబా మసూరి (బీపీటీ 5204) తెలంగాణసోనా (ఆర్ఎన్ఆర్ 15048) కూనారం వరి (కేఎన్ఎం 1638) జై శ్రీరామ్ హెచ్ఎంటీ (సోనా) సిద్ధి (డబ్ల్యూజీఎల్ 44 ) కేఎన్ఎం 7715 లక్ష్మణచాంద: తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పే పాలకులు ఆచరణలో మాత్రం వెనుకబడుతున్నా రు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు పంటల సా గు విషయంలో నిబంధనలు విధించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే మొదలైంది. జూన్ మొదటి వారంలోనే జిల్లా రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. వర్షాలు కురిసిన వెంటనే విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. నీటి వసతి ఉన్న రైతులు వరి నార్లు పోసుకున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కువకపోవడంతో మిగతా రైతులు విత్తనాలు వేసేందుకు వెనుకాడుతున్నారు. ఈ సమయంలో సన్న వ రి సాగు విషయంలో ప్రభుత్వం ఈసారి కఠిన నిబంధనలు విధించింది. తాము సూచించిన 7 రకాల సన్న వడ్లు మాత్రమే సాగు చేయాలని, ఆ రకాలకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఇతర రకాల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అవగాహన కల్పించడంలో విఫలం.. వానాకాలం సీజన్కు సూచించిన ఈ ఎనిమిది రకాలపై రైతులకు సకాలంలో అవగాహన కల్పించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి, నారు పోసిన తర్వాత ఇవే రకాలు సాగు చేయాలి అని చెప్పడం సరైనది కాదని రైతులు ప్రశ్నిస్తున్నారు. సూచించిన రకాల విత్తనాలు కూడా జిల్లాలో అందుబాటులో ఉంచలేదని మరికొందరు పేర్కొంటున్నారు. యూరియా యాప్పైనా..ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్(యూరియా కోసం)పై సగం కంటే ఎక్కువ మంది రైతుల కు అవగాహన లేదు. ఎక్కువ మంది రైతులు నిరక్షరాస్యులు కావడం, వ్యవసాయాధికారులు అవగా హన కల్పించడంలో అలసత్వంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాదనలు వినిపిస్తున్నాయి. -
బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
నిర్మల్ రూరల్: మండలంలోని తల్వేద గ్రామంలో నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని హైదరాబా ద్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్గా ఆదివారం ప్రారంభించారు. ప్రత్యక్షంగా జిల్లా అధ్యక్షుడు రితీశ్రాథోడ్ ప్రారంభించి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణగౌడ్, నారాయణరెడ్డి, సీనియర్ నాయకు లు అయ్యన్నగారి భూమయ్య, రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, నల్ల రవీందర్రెడ్డి, కరిపే విలాస్, ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, జిల్లా ఇన్చార్జి గోపిడి స్రవంతిరెడ్డి, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాద్రి, అంకం మౌనిక, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. -
మళ్లీ ముంపు ఆందోళన..
భైంసా/భైంసారూరల్: భైంసా మండలంలోని పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండేగాం వాసుల పునరావాస సమస్య మరోసారి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. జిల్లా పర్యటనకు వచ్చిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదివారం బాసరలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కలిసి గ్రామస్తుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుండేగాం ప్రజలు దశాబ్దాలుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారని, ముంపు సర్వే పూర్తయినా ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని వినతిపత్రం సమర్పించారు. స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గుండేగాం పునరావాస అంశంపై సమగ్రంగా చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తుల్లో మరోసారి ఆశలు మొలకెత్తాయి. మూడేళ్లగా తాత్కాలిక జీవనం.. మూడేళ్ల నుంచి గ్రామంలో నివసించడం సాధ్యం కాకపోవడంతో అనేక కుటుంబాలు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాత్కాలికంగా నివాసం ఉంటున్నాయి. స్వగ్రామాన్ని వదిలి జీవనం సాగిస్తున్నప్పటికీ తమ భూములు, వ్యవసా యం, పశుసంపద, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. తాత్కాలిక నివాసం సమస్యకు పరిష్కారం కాదని, శాశ్వత పునరావాసం కావాలని బాధితులు కోరుతున్నారు. ప్రాజెక్టు, పునరావాసం రెండూ అసంపూర్తి.. పునరావాసం పూర్తి కాకపోవడంతో ఒకవైపు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామస్తులు తమ గ్రామంలో ప్రశాంతంగా జీవించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరకపోగా, ప్రజలు కూడా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక పునరావాస అంశం ప్రతీ ఎన్నికల సమయంలో ప్రధాన చర్చగా మారినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అధికార, ప్రతిపక్ష నాయకులు పలుమార్లు హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అనేకసార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందించినా స్పందన రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు హామీతో ఈసారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుండేగాం గ్రామం ఏళ్ల నుంచి అదే సమస్య..గ్రామం : గుండేగాం కుటుంబాలు : 162 జనాభా : 694 రేషన్ కార్డులు : 236 సాగు భూములు: 364 ఎకరాలు ప్రధాన సమస్య : పల్లికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఊరిలోకి రావడం, ఏటా గుండేగాం నీటమునగడం. పరిష్కారం : బైంసా సమీపంలోని కమ లాపూర్ గుట్టవద్ద పునరావాస గ్రామం ఏర్పాటు చేయడం.వర్షాకాలం ప్రారంభమవడంతో గుండేగాం గ్రామస్తుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. భారీ వర్షాలు కురిస్తే గ్రామంలోకి నీరు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. శాశ్వత పునరావాసం కల్పించకపోతే ప్రతీ వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణంతో గుండేగాం గ్రామం ముంపు జాబితాలో చేరింది. ప్రభుత్వం ముంపు సర్వే పూర్తి చేసినప్పటికీ పునరావాస ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. వర్షాకాలం ప్రారంభమైతే గ్రామంలోకి నీరు చేరడం సాధారణమైంది. గతంలో అనేక సార్లు గ్రామ వీధులు, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోని వస్తువులు దెబ్బతినడం, రాకపోకలు నిలిచిపోవడం, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి సమస్యలు తరచూ ఎదురయ్యాయి. -
మాదకద్రవ్యాలను నిరోధించాలి
సారంగపూర్: మాదకద్రవ్యాలను నిరోధించే ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.రవీందర్ అన్నారు. మండలంలోని చించోలి(బి) ఎక్స్రోడ్డు సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గంజాయి, కొకై న్, హెరాయిన్తో కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఎన్డీపీఎస్ చట్టం గురించి తెలియజేశారు. మైనర్లకు వాహనాల అప్పగించడంతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే బాధ్యులవుతారన్నారు. అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ విజ్కుమార్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ కాలనీలు.. సమస్యల లోగిళ్లు
భైంసా: జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలు సమస్యలకు నిలయాలుగా మారాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవు. తాగునీరు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కానరావడం లేదు. దీంతో ఇళ్లలో ఉంటున్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. చిన్న వర్షానికే కాలనీల్లో మట్టిరోడ్లు బురదగా మారుతున్నాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దోమల బెడద కూడా పెరుగుతోంది. అందకూర్లో అధ్వానం.. కుంటాల మండలం అందకూర్లో 57 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారు. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షం పడగానే ఇళ్ల ముందు నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో కాలనీవాసులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు రోజూ ఇబ్బంది పడుతున్నారు. నిర్మల్ పట్టణంలో.. జిల్లా కేంద్రం నిర్మల్లో ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసినా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు పూర్తి స్థాయిలో లేవు. దీంతో కుటుంబాలు అనేక సమస్యల మధ్య జీవనం సాగిస్తున్నాయి. ఖానాపూర్లో పంపిణీ ఆలస్యం.. ఖానాపూర్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఇంకా లబ్ధిదారులకు అప్పగించలేదు. అర్హులైన కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ నిరాశకు గురవుతున్నాయి. నిలిచిన నిర్మాణాలు.. కుబీర్ మండలం మాలేగాం గ్రామంలో ఇళ్ల నిర్మాణం అర్ధంతరంగా నిలిచింది. భైంసా పట్టణంలోని ఇందిరమ్మ కాలనీల్లో కూడా పూర్తిస్థాయి వసతులు లేవు. ముధోల్ మండల కేంద్రం నుంచి విట్టోలి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఇళ్ల పనులు మధ్యలో ఆగిపోయాయి. ప్రజలు కోరుతున్న చర్యలు జిల్లాలో అర్ధంతరంగా నిలిచిన ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి. నిర్మించిన కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు అత్యవసరంగా కల్పించాలి. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నాణ్యమైన నివాస వాతావరణం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదివారం ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహాలపై సమగ్ర సమీక్ష జరిపి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థులను చేర్పిస్తే నెలకు రూ.వెయ్యి..
భైంసారూరల్: మండలంలోని లింగా–1 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాలుగేళ్లుగా మూతపడింది. విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో 2022 నుంచి 2026 వరకు పాఠశాల తలుపులు కూడా తెరవని పరిస్థితి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలను ఈఏడాది తిరిగి ప్రారంభించడంతో విద్యార్థులు లేక బడి కొనసాగించడం ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ నియమితులైన ఉపాధ్యాయుడు సాయినాథ్ తీసుకున్న నిర్ణయం గ్రామస్తులను కదిలించింది. పాఠశాలలో ఉచిత పుస్తకాలు, నాణ్యమైన భోజనం, యూనిఫాం, ఆంగ్ల బోధన అందించడంతోపాటు అదనంగా తనవంతుగా ఒక్కో విద్యార్థికి ప్రతినెలా రూ.వెయ్యి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు భవిష్యత్తులో ప్రాధాన్యతను వివరించారు. దీంతో ఆ ఉపాధ్యాయుడి తపన, మాటతీరుతో నమ్మిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించేందుకు ముందుకువస్తున్నారు. తనకు వచ్చే వేతనం నుంచి ఒక్క విద్యార్థికి ఇచ్చినమాట ప్రకారం ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నారు. ఈక్రమంలో ఒక్కొక్కరుగా లింగా బడిలో మళ్లీ పిల్లల సందడి పెరుగుతోంది. -
రూ.16.64 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలో రూ.16.64 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, ఎంపీ గొడెం నాగేష్తో కలిసి శనివారం రాత్రి శంకుస్థాపన చేశా రు. రూ.14 కోట్లతో కడెం మండలం నచ్చన్న ఎల్లాపూర్ రహదారి విస్తరణ, మరమ్మత్తు పనులు, ఖానాపూర్ పట్టణంలో రూ.1.21 కోట్లతో బొడ్డోనికుంట చెరువు పునరుద్ధరణ పనులు, రూ.1.43 కోట్లతో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం చేయనున్నారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో దేవిదాస్, మున్సిపల్ చైర్పర్సన్ అంక మౌనిక, మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్, తహసీల్దార్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగల భూషణ్, వైస్ చైర్మన్ మాజిద్, ఆత్మ చైర్మన్ గాడ్పు సత్యం, కౌన్సిలర్లు చిన్నం సత్యం, పోలంపల్లి రమేశ్, గుమ్ముల అశోక్, బొప్పారపు సత్యవతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగిల్ శంకర్, పట్టణ అధ్యక్షుడు గొర్రె గంగాధర్ పాల్గొన్నారు. నేడు జిల్లాలో ‘జూపల్లి’ పర్యటన నిర్మల్చైన్గేట్: పర్యాటక, సాంస్కృతిక, పురా వస్తు, ఎకై ్సజ్ శాఖ, ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నా రు. ఉదయం బాసర నుంచి భైంసా చేరుకుని భైంసాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభిస్తారు. రూ.2.14 కోట్లతో చేపట్టే మహదేవ్పూర్ చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్లో నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. -
చుక్కల మందుకు వేళాయె
నిర్మల్చైన్గేట్: జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కలు వేయనున్నారు. కార్యక్రమం కోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగిలిపోయిన చిన్నారులకు 29, 30 తేదీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తారు. డీఎంహెచ్వో రాజేందర్ ఈ కార్యక్రమానికి సంబంధించి సిబ్బందికి ముందుగానే మార్గనిర్దేశం చేశారు. జిల్లాలో నవజాత శిశువుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి. 625 కేంద్రాలు, 20 మొబైల్ టీమ్స్.. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రి, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 400 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. పోలియో చుక్కల పంపిణీ కోసం 625 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటితోపాటు 20 హైరిస్క్ కేంద్రాలు, 20 మొబైల్ టీమ్స్ కూడా సిద్ధం చేశారు. విధుల్లో 2,500 మంది సిబ్బంది.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. మొబైల్ టీమ్స్ ద్వారా బస్ స్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహిస్తారు. దీని కోసం 20 రూట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమ పర్యవేక్షణకు 70 మంది సూపర్వైజర్లను నియమించారు. జిల్లాలో సరిపడా డోసులు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో 2,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. నిర్లక్ష్యం వద్దు.. పిల్లలు భయంకరమైన పోలియో వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు వారికి టీకాలు వేయించడం తప్పనిసరి. పోలియో వ్యాధి రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తమ పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి పిల్లలకు చుక్కలు వేస్తారు. తప్పనిసరిగా వేయించాలి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పిల్లలు పోలియో బారిన పడకుండా, అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు దోహదం చేస్తాయి. మొదటి రోజు వేసుకోని వారికి వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి పోలియో చుక్కలు చేస్తారు. చిన్నారులు మిస్ కాకుండా చూసుకోవాలి. – డాక్టరరాజేందర్ డీఎంహెచ్వో జిల్లా వివరాలు.. 5 ఏళ్లలోపు చిన్నారులు 92,116 మొత్తం బూత్లు 625 మొబైల్ టీమ్లు 20 ట్రాన్సిట్ పాయింట్లు 20 వ్యాక్సిన్ మేనేజర్లు 20 సూపర్వైజర్లు 70 -
నిర్మల్
నిర్మల్ బస్టాండ్ ప్రాంతంలో ఆటోలు, బైక్లను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. బస్టాండ్ ఇన్, ఔట్ గేట్ల వద్ద అడ్డంగా 15 నుంచి 20 ఆటోలను నిలుపుతున్నారు. దీంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బస్టాండ్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా ప్రధాన ద్వారం ఎదుటే ఆటోలు నిలిపి ఉంచడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియంత్రించాల్సిన ట్రాఫిక్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆర్టీసీ గార్డ్స్ మచ్చుకై నా కనిపించడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్7పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు చేయూతనిస్తున్నారు. ఒకప్పుడు చదువుకున్న బడి అంటే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. బాల్యం జ్ఞాపకాలు, గురువుల బోధనలు, స్నేహితులతో గడిపిన క్షణాలు అన్నీ ప్రభుత్వ పాఠశాలలతో ముడిపడి ఉంటాయి. కాలం మారినా, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినా తమను తీర్చిదిద్దిన బడిని మరిచిపోని వారు ఎంతోమంది ఉన్నారు. పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు ముందుకొచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. అలాగే పలువురు ఉపాధ్యాయులు తమ బడిని కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. – నిర్మల్ -
అడ్మిషన్లు పెంచాలి
● డీఐఈవో పరశురాం సారంగపూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచేలా అధ్యాపకులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా మధ్యామిక విద్యాధికారి(డీఐఈవో)పరశురాం అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఇప్పటి వరకు కళాశాలలో చేరిన విద్యార్థుల వివరాలు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్ధుల వివరాలను ప్రిన్సిపాల్ శంకర్ను అడిగి తెలుసుకున్నారు. ఈయేడాది ప్రైవేటుకు దీటుగా పిల్లలకు విద్యాబోధన చేసేలా లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. గతేడాదికన్నా మెరుగైన ఫలితాల సాధనకు విద్యాబోధన తీరును మరింత మెరుగుపరచాలన్నారు. ప్రైవేటు కళాశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి ఇక్కడున్న ప్రభుత్వ కళాశాల సదుపాయాలు, విద్యాభోదన తీరును వివరిస్తూ ప్రభుత్వ కళాశాలకు రప్పించేలా చూడాలని సూచించారు. -
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
లక్ష్మణచాంద: రైతులు ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ నిర్మల్ డివిజన్ అధికారి మౌనిక తెలిపారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో మహిళా రైతు కొండ్ర నర్సవ్వ సాగు చేస్తున్న కూరగాయలను శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం రామకృష్ణారెడ్డి బెడ్ పద్ధతిని, మల్చింగ్ విధానంలో పంటలు సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. కూరగాయల సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.9,600 రాయితీ ఇస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు కూరగాయాల సాగుకు డ్రిప్, మల్చింగ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నో అడ్మిషన్స్
తానూరు మండల కేంద్రంలోని కేజీబీవీలో అడ్మిషన్లు పూర్తయ్యాయి. దీంతో సిబ్బంది పాఠశాల గేటుకు ‘అడ్మిషన్స్ క్లోజ్’ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో 6నుంచి 10వ తరగతి వరకు 262 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు ప్రవేశపెట్టారు. ఇందులో 25మంది విద్యార్థినులు ప్రవేశం పొందారు. దీంతో విద్యార్థినుల సంఖ్య 287కు చేరింది. ఇంతకంటే ఎక్కువగా అడ్మిషన్లు తీసుకుంటే సౌకర్యాలు సరిపోవనే కారణంతోనే ప్రవేశాలు లేవని బోర్డు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ అలేఖ్య తెలిపారు. – తానూరు -
భక్తిశ్రద్ధలతో మొహర్రం
పార్పల్లిలో అసైదూలా ఆడుతున్న యువకులు మునిపల్లిలో పీరీలను దర్శించుకుంటున్న భక్తులు పంజేషా గల్లీలో పీరీల ఊరేగింపు మత సామరస్యానికి ప్రతీక అయిన మొహర్రంను జిల్లావాసులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణాలు, పల్లెల్లో సవారీలను ఊరేగించారు. రెండో రుయ్యాడిగా ప్రసిద్ధి చెందిన మునిపల్లిలో ఉదయం గోదావరి జలాలను ఊరేగింపుగా తెచ్చి పీరీలకు అభిషేకం చేశారు. అనంతరం మలిదలు సమర్పించారు. అగ్నిగుండాల చుట్టూ భక్తులు అసైదులా ఆడారు. అగ్నిగుండం దాటే కార్యక్రమాల నిర్వహించారు. మునిపల్లిలో వేడుకలు తిలకిచేందుకు జిల్లా నలు మూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పీరీలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. – లక్ష్మణచాంద/సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
మేమేం పాపం చేశాం!
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయి ఏళ్లు గడుస్తున్నాయి. ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే పనులు పునఃప్రారంభించి త్వరగా పూర్తి చేయిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లయినా.. పనులు మళ్లీ ప్రారంభం కాలేదు. ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రధాన రహదారి కిలోమీటరుకుపైగా ఇరుకుగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎదురెదురుగా వచ్చే వాహనాలు సులభంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఖానాపూర్లో ట్రాఫిక్ సమస్య పద్మవ్యూహంలా మారింది. ‘సోషల్’ వార్.. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పట్టణ వాసులు సోషల్ మీడియా ద్వారా పాలకులు, అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై ‘‘మేమేం పాపం చేశాం? కట్టే పన్నులకు రోడ్డు సమస్యకు సంబంధం లేదా?’’ అని ముద్రించిన ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పట్టణంలో రోడ్లు ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో స్కూల్ బస్సులు, అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ప్రధాన రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ దిమ్మెలను కార్లు, డీసీఎంలు, ఇతర వాహనాలు ఢీకొన్నాయి. రోడ్డు విస్తరణ పనులు ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినా పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలకు సన్నద్ధం.. రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఒక రోజు బంద్తోపాటు పట్టణ దిగ్బంధం, ఐదు వేల మంది సంతకాల సేకరణ, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. -
రోడ్లు, కరెంటు లేని గ్రామాలు..
పెంబి మండలం గుమ్మెనఎంగ్లాపూర్, వస్పల్లి, ధొంధరి, రాయదారి, అంకెన, దయ్యాలమద్ది, అర్చన్తండా, కోరకంటి, యాపల్గూడ, రాంనగర్ గ్రామాలకు రోడ్లు లేవు. చాక్రేవు, రాగిదుబ్బ గ్రామాలకు రోడ్లు, కరెంటు కూడా లేదు కడెం మండలం అద్దాల తిమ్మాపూర్, అల్లంపల్లి, బాబానాయక్ తండా, పాలరేగడి, గంగన్నపేట్, మీసాల భూమన్నగూడెం, చింతగూడ, మిద్దెచింత, ఇస్లాంపూర్ గ్రామాలకు రోడ్లు లేవు. ఇక ఖానాపూర్ మండలం కుసుంపూర్, పంగిడి గూడెం, చామన్పల్లి, కొత్తగూడెం, మామడ మండలం రాంపూర్, పోచమ్మగూడ, తోటిగూడ, మల్కాపూర్, సారంగపూర్ మండలం ఇప్పచల్మ, పెండలదరి గ్రామాలకు కూడా రోడ్లు లేవు. -
● ఏళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు ● సొంతింటి కల నెరవేరుతున్న వేళ.. ● రేపు మంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవం
మహదేవ్ చెరువు సుందరీకరణ.. పట్టణంలోని సిద్దార్థనగర్లోని మహాదేవ్ చెరువు కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురవుతోంది. చెరువు సుందరీకరణకు నోచుకోకవడంతో క్రమేపీ కుచించుకుపోతోంది. అమృత్ 2.0 కింద రూ.2.14 కోట్లతో చెరువు సుందరీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ సైతం పూర్తయింది. మంత్రి జూపల్లి చేతులమీదుగా ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. సుందరీకరణలో భాగంగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, స్టోన్ పిచింగ్, పిచ్చి మొక్కల తొలగింపు, చిన్నపాటి పార్కు నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పట్టణ ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కోసం ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రానుంది. భైంసాటౌన్: పట్టణంలోని పార్డి(బి) బైపాస్ మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు మోక్షం కలగనుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా లబ్ధిదారులకు కేటా యించలేదు. దీంతో అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నామంటూ లబ్ధిదారులు పలుమార్లు ఆందోళన చే పట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తి రిగారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. మౌలిక వసతు ల కల్పనలో జాప్యం కారణంగా ఇళ్ల పంపిణీ చేపట్ట లేదని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ప నులు పూర్తికాగా, పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా సోమవారం ఇళ్ల పంపిణీ చేపట్టనున్నారు. మూడేళ్లకుపైగా నిరీక్షణ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ పరిధిలోని పేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. మొదటి విడతలో 160, రెండో విడతలో 441 ఇళ్లు మంజూరు కాగా, 2023లో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదే ఏడాది ఏప్రిల్లో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే అర్హుల ఎంపిక ప్రక్రియ, మౌలిక వసతుల కల్పనలో జాప్యం కారణంగా ఇళ్ల కేటాయింపు జరగలేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా తమకు కేటాయించకపోవడంతో పలుమార్లు లబ్ధిదారులు నిరసన చేపట్టారు. కొందరైతే తాళాలు పగులగొట్టి తాత్కాలికంగా నివాసముంటున్నారు. రెండు నెలల కిందట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీటిపై సమీక్ష జరిపారు. అసంపూర్తిగా ఉన్న విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు పనులు పూర్తి చేయించి, అర్హులైన వారికి వెంటనే ఇళ్లను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేశారు. ఎట్టకేలకు పనులు పూర్తికాగా, ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేశారు. -
నిర్మల్
అక్షర శ్రీకారం● ఇటీవల పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్ ● కమ్యూనికేషన్ వ్యవస్థల్లో కదలిక ● రోడ్లతోపాటు వివిధ పనులకు నిధులు7బుల్లెట్ బండెక్కి ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ భవేశ్మిశ్రా సరదాగా షికారుకు వెళ్లలేదు. కనీసం కారు కూడా వెళ్లడానికి ‘దారి’లేని ఊళ్ల దుస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు బయలుదేరారు. ఈనెల 11న వీరిద్దరు బైక్పై పెంబి, కడెం మండలాల్లోని అటవీ గ్రామాల్లో పర్యటించారు. మౌలిక సౌకర్యాలతోపాటు కనీసం కమ్యూనికేషన్ వ్యవస్థలూ లేవన్న విషయాన్ని గ్రహించారు. వాటి పరిష్కారానికి అక్కడి నుంచే చర్యలు మొదలుపెట్టారు. గుమ్మెన ఎంగ్లాపూర్లో సెల్టవర్, పెంబి మండలంలో రూ.2.43 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు, వివిధ పనులను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇలా.. ఎమ్మెల్యే, కలెక్టర్, పెద్దసార్లంతా తమ గూడేలకు రావడం, సమస్యలు తెలుసుకోవడంతోపాటు పరిష్కార చర్యలనూ ప్రారంభించడంతో గిరిజనులు తమ దశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఫిర్యాదుపై సత్వరం స్పందించాలి లక్ష్మణచాంద: ఠాణాకు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై చట్టప్రకారం సత్వరం స్పందించాలని ఎస్పీ జానకీషర్మిల పోలీసులకు సూచించారు. లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్ను శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్ కేసులు, బెయిల్ కేసుల నిర్వహణ, రిసెప్షన్, మాల్ఖానా, ఆయుధాగారం, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, పోలీస్ స్టేషన్ పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీసులతో సమావేశమై విధి నిర్వహణ, పని తీరుపై మాట్లాడారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి, లక్ష్మణచాంద ఎస్సై శ్రావణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్: ఓవైపు రాష్ట్రం ‘ఫ్యూచర్సిటీ’ల వైపు అభివృద్ధిబాటలో పరుగులు పెడుతుంటే.. అడవుల మధ్య ఉన్న ఆ ఊళ్లు ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా అటవీ గ్రామాల ప్రజల జీవన పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, రవాణా, చివరకు కమ్యూనికేషన్ వ్యవస్థల వంటి మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. అడవిబిడ్డల కష్టాలపై దృష్టిపెట్టామని, క్రమంగా అన్నీ పరిష్కరిస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నారు. రోడ్లే పెద్ద సమస్య.. ఏ ఊరు అభివృద్ధి చెందాలన్నా కనీసం ఆ ఊరికి మంచి రోడ్డు ఉండాలి. కానీ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అనేక గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారులు లేవు. ఏదైన కష్టం వచ్చినప్పుడు రాళ్లురప్పలు, ఎగుడుదిగుడు అటవీమార్గాల్లో రావడం ఇబ్బంది గా మారుతోంది. అలా.. మధ్యలోనే ఎంతోమంది ప్రాణాలూ పోయాయి. ఎంతోమంది తల్లులు నడి అడవిలోనే బిడ్డలకు జన్మనిచ్చిన రోజులున్నాయి. వర్షాకాలం మరింత కష్టమవుతోంది. రోడ్లు లేక వి ద్య, వైద్యం అందనిద్రాక్షగానే మారాయి. అంబు లెన్స్లు రాలేక అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రికి తరలించడం పెద్ద సవాల్గా మారుతోంది. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. రోడ్డు, కరెంటు లేవు.. ఇప్పటికీ మా ఊరికి రోడ్డు, కరెంటు లేవు. ఎటు వెళ్లాలన్నా కాలినడకనే. ఎన్నోసార్లు మా సమస్యను చెప్పినం. ఇప్పటికై నా రోడ్డు, కరెంటు వంటి కనీస సౌకర్యాలను మా అటవీ గ్రామాలకు కల్పించాలి. – ఆత్రం మాణిక్రావు, మిద్దెచింత, మం.కడెం కేజీబీవీలకు యూనిఫాం‘డబుల్’ గృహ ప్రవేశాలు బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 1,376 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల కానుకలు, అర్చనలు, ఇతర సేవల ద్వారా ఒక్కరోజే రూ.12,03,260 ఆదాయం సమకూరినట్లు ఈవో అంజనాదేవి తెలిపారు. చిగురిస్తున్న ఆశలు.. కలెక్టర్ అభిలాషఅభినవ్ ఉన్నప్పుడూ పెంబి మండల వాసులు కాలినడకన కలెక్టరేట్కు వచ్చి తమ గోడు వినిపించారు. వారంలో సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. కలెక్టర్ మారడంతో ప్రస్తుతం వచ్చిన భవేశ్మిశ్రా స్థానిక ఎమ్మెల్యే బొజ్జుపటేల్తో కలిసి ఆయా గ్రా మాలను స్వయంగా పరిశీలించారు. కమ్యూనికేషన్ కోసం ముందుగా టవర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వాగులపై వంతెనలు కట్టిస్తామన్నారు. దీంతో ఆ అటవీగ్రామాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికై నా మా జీవితాల్లో ‘వెలుగులు’ వస్తాయని ఆశిస్తున్నారు.ఫిర్యాదులు పరిష్కరించాలి నిర్మల్టౌన్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులతో గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై శుక్రవారం సమీక్ష చేశారు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న పిటిషన్లను ప్రత్యేకంగా సమీక్షించి విచారణ వేగవంతం చేయాలని సూచించారు. ప్రతీ పిటిషన్పై ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దశ మారుస్తారా..!నడుసుకుంటపోయి చెప్పినం... ఇప్పటిదాకా కనీసం కరెంటు, రోడ్డు కూడా లేని మాకష్టాలను తీర్చాలంటూ ఇక్కడి నుంచి నిర్మల్ దాకా నడుసుకుంటూ పోయి మా గోస చెప్పినం. పాలకులు, అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలి. – కనక నిర్మల, చాక్రేవు, మం.పెంబి -
జిల్లా కేజీబీవీల సమాచారం...
లక్ష్మణచాంద:రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యలో చదువు మానేసిన పేద, మధ్యతరగతి బాలికలను మళ్లీ చదువుబాట పట్టించి, ఇంటిని మరచిపోయేలా ఆకర్షణీయమైన భోజనం, వసతితో కూడిన నాణ్యమైన విద్య అందించి ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కేజీబీవీలను ప్రారంభించింది. ఏకరూప దుస్తుల ఆలస్యం.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ఏకరూప దుస్తులు అందించాల్సి ఉంది. సకాలంలో వస్త్రం అందకపోవడంతో విద్యార్థినులు పాత దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది 6వ తరగతిలో చేరిన బాలికలు యూనిఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేజీబీవీ బాలికలకు ఏకరూప దుస్తులు అందించేందుకు వస్త్రం జిల్లా కేంద్రానికి చేరింది. అధికారులు ఈ వస్త్రాన్ని జిల్లాలోని ఎస్హెచ్జీలకు అందజేసి త్వరగా కుట్టాలని సూచించారు. జిల్లాలో విద్యార్థినుల వివరాలు.. జిల్లాలో మొత్తం 18 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6 నుంచి 10వ తరగతి వరకు 4,883 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే కేజీబీవీ ఇంటర్ కళాశాలలో మొదటి, రెండో సంవత్సరాల్లో 2,315 మంది విద్యార్థినులు చదువుతున్నారు. 18 కేజీబీవీలకు చెందిన బాలికల యూనిఫాం కోసం టా ప్లకు 15,400 మీటర్లు, బాటమ్కు 24,900 మీటర్లు, సూట్లకు 16,200 మీటర్ల వస్త్రం చేరిందని జీసీడీవో రమాదేవి తెలిపారు. ఇప్పటికే ఎస్హెచ్జీలకు అందజేసి కుట్టడం ప్రారంభమైంది. త్వరలో కుట్టడం పూర్తి చేసి బాలికలకు అందజేయడానికి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.జిల్లాకు చేరిన మొత్తం వస్త్రం 56,500 మీటర్లుమొత్తం పాఠశాలలు 18 త్వరలో అందిస్తాం.. కేజీబీవీలలోని బాలికలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఏకరూప దుస్తుల వస్త్రం ఎస్హెచ్జీలకు అందించాం. వారు కుట్టడం ప్రారంభించారు. వేగవంతంగా స్టిచ్చింగ్ చేయించి బాలికలకు వీలైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటాం. – రమాదేవి, జీసీడీవోపాఠశాల విద్యార్థులు 4,883 కళాశాలల విద్యార్థులు 2,315 -
నిర్మల్
‘బాసర’కు భద్రత కావాలి బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుస చోరీలు భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టాయి. నిర్మల్ఖిల్లా: ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకోవడంతో జిల్లా నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, డైట్ లెక్చరర్ల నియామకాల నోటిఫికేషన్లు వెలువడ్డాయి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక కేంద్రం బ్యాంకింగ్, రైల్వే, ఎస్సెస్సీ వంటి విభాగాల్లో ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి. పోటీ పరీక్షల సన్నాహాలు వేగవంతమవుతున్నాయి. స్టడీ సర్కిల్స్ లేక.. చదువులతల్లి జ్ఞాన సరస్వతీదేవి కొలువైన జిల్లా నిర్మల్. మొత్తం జనాభాలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ. మెజారిటీ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుదీర్ఘంగా నస్నద్ధం అవుతున్నారు. అయితే కోచింగ్ కోసం హైదరాబాద్, వరంగల్ వెళ్లే స్థోమత లేని వారు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా నిరుద్యోగులు దశాబ్దకాలంగా కోరుతున్నారు. ఇప్పటికీ దీనిపై స్పష్టత లేదు. ప్రైవేట్ కోచింగ్ భారం ప్రైవేట్ కోచింగ్ సెటర్లు ఒక్కో జాబ్ కోచింగ్కు రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. వసతి, భోజనం, ప్రయాణ ఖర్చులతో కలిపి లక్ష రూపాయలకుపైగా ఖర్చవుతోంది. రైతు, కూలీ, చిరు వ్యాపారుల కుటుంబాల యువతకు ఈ ఖర్చు భారంగా మారుతోంది. ఫలితంగా ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ లేక పోటీ పరీక్షల్లో వెనుకబడుతున్నారు. గ్రంథాలయాల్లో సౌకర్యాల కొరత జిల్లా కేంద్రం, మండలాల్లో ప్రభుత్వ గ్రంథాలయాలు ఉన్నప్పటికీ పోటీ పరీక్షలకు అవసరమైన సదుపాయాలు లేవు. స్టడీ మెటీరియల్ కూడా చాలా గ్రంథాలయాల్లో అందుబాటులో లేదు. సీటింగ్ సామర్థ్యం పరిమితంగా ఉంది. తాజా పుస్తకాలు తక్కువ, డిజిటల్ లెర్నింగ్, ఇంటర్నెట్ సౌకర్యం లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు చదవడానికి సమయం పొడిగించలేదు. ప్రజాప్రతినిధులు చొరవ చూపితే.. జిల్లాలో బీసీ,ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చొరవ చూపాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పోటీ పరీక్షల్లో గ్రామీ ణ యువత సత్తా చాటేందుకు, పేద విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగులు 26 వేలు(సుమారు) రెవెన్యూ గ్రామాలు 400 తక్షణమే ఏర్పాటు చేయాలి... విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు తక్షణమే జిల్లాలో ఏర్పాటు చేయాలి. స్థానిక డిమాండ్ మేరకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. పీడీఎస్యూ విద్యార్థి సంఘం తరఫున కూడా ఇదే అంశంపై సాధనదిశగా పోరాటం చేస్తాం. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని స్టడీ సర్కిల్ ఏర్పాటయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. – సింగరి వెంకటేశ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి.. జిల్లాలోని నిరుద్యోగులకు స్టడీ సర్కిల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి సుదూరప్రాంతాలకు వెళ్తున్నారు. నిరుపేద నిరుద్యోగులకు కోచింగ్ భారంగా మారుతోంది. ఉద్యోగాల సాధనలో వెనుకబడుతున్నారు. జిల్లా జనాభాలో 70 శాతం బీసీ జనాభా ఉంది. బీసీ స్టడీ సర్కిల్ లేకపోవడంతో బీసీ యువత నష్టపోతోంది. ప్రజాప్రతినిధులు బీసీ స్టడీ సర్కిల్తోపాటు, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి. – ఎంబడి చంద్రశేఖర్, బీసీ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు ‘వెండింగ్జోన్లు’ అవసరం.. పట్టణాల్లో చిరు వ్యాపారులనూ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. వారికంటూ ప్రత్యేకంగా విక్రయ ప్రాంతాలను స్థానిక సంస్థలు చూపాల్సి ఉంటుంది. జిల్లాలో అలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఉపాధి కోసం వారంతా రహదారులు, ఫుట్పాత్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారి జీవనోపాధి కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు పాదచారులకు ప్రాణసంకటంగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా స్థానిక సంస్థలు ప్రత్యేక వెండింగ్జోన్లను ఏర్పాటు చేయాలి. విధులు సమర్థవంతగా నిర్వహించాలి నిర్మల్చైన్గేట్:కలెక్టరేట్లో అన్నివిభాగాల అధి కారులు విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించా రు. కలెక్టరేట్ సమావేశమందిరంలో వివిధ శాఖ ల సూపరింటెండెంట్లు, అధికారులతో గురువా రం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన ప్రతీ సమస్యను అత్యంత ప్రాధాన్యమైనది గా పరిగణించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజావాణిలో స్వీకరించే ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలన్నారు. భూ భారతి కింద స్వీకరించిన దరఖాస్తులు 60 రోజు ల్లో పరిష్కరించాలన్నారు. ప్రతీ విభాగానికి సంబంధించిన రికార్డులను క్రమం తప్పకుండా పరి శీలించి, సక్రమంగా భద్రపరచాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని హెచ్చరించారు. ప్రతీ విభాగం పరిధిలో ని ఉద్యోగుల వివరాలు, పెండింగ్ అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలన్నా రు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, అధికారులు పాల్గొన్నారు. మండలాలు 19 ప్రత్యేక శిక్షణ అవసరం.. నేటి పోటీ పరీక్షల్లో పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోదు. సిలబస్పై లోతైన అవగాహన, రోజువారీ కరెంట్ అఫైర్స్, ఆన్లైన్ పరీక్షలు, మాక్ టెస్టులు, నెగెటివ్ మార్కింగ్, సమయ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అవసరం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందిస్తే గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా బ్యాచ్ల వారీగా కోచింగ్ ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నాణ్యమైన అధ్యయన సామగ్రి, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్ మాక్ టెస్టులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నిపుణులతో ఉచిత కెరీర్ గైడెన్స్, ఇంటర్వ్యూ శిక్షణ, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా వివరాలు.. -
భైంసా పీజీ హెచ్ఎం సస్పెన్షన్
● ఉత్తర్వులు జారీ చేసిన ఆర్జేడీ నిర్మల్: భైంసా పట్టణంలోని మదీనా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(పీజీహెచ్ఎం) ఎంఏ.అబ్దుల్ రషీద్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) పి.మదన్మోహన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో డీఈవో విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతోపాటు ప్రభుత్వ నిధుల వినియోగంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. దీని ఆధారంగా శాఖాపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావించిన సస్పెండ్ చేస్తున్నట్లు వివరించారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రైవేట్కు పంపితే పథకాలు కట్నిర్మల్ రూరల్: మండలంలోని న్యూ పోచంపాడు గ్రామస్తులు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకు పంపమని గురువారం తీర్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు పంపుతామని ప్రకటించారు. గ్రామస్తులంతా ఒక్కచోట చేరి ప్రైవేటు పాఠశాలల ఆగడాలపై చర్చించారు. గ్రామం నుంచి ఒక్క విద్యార్థిని కూడా ప్రైవేటు పాఠశాలకు పంపకూడదని నిర్ణయించారు. ఎవరైనా పంపితే వారికి రేషన్ బియ్యం, పెన్షన్తోపాటు ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని తీర్మానించారు. ఇందులో సర్పంచ్ కొండ పద్మ, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భూమేశ్, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. బొడ్డోనికుంట పరిశీలనఖానాపూర్: పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న బొడ్డోనికుంటను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు. అమృత్–2 పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. కుంట సుందరీకరణతోపాటు ప్రజలకు ఉపయోగపడేలా వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తర్వాత కుంట సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. బొడ్డోనికుంట అభివృద్ధితో శాంతినగర్ కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, మున్సిపల్ కమిషనర్ సుందర్సింగ్, తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు. తొలకరికే రోడ్డెక్కిన వరదఖానాపూర్:పట్టణంలో గురువారం కురిసిన చిన్నపాటి వర్షానికే వరద రోడ్డెక్కింది. డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలు బహిర్గతమయ్యాయి. జిప్అడ్డా ప్రాంతంలో ఇరుకు డ్రైనేజీ కారణంగా.. వర్షపునీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపైకి చేరింది. అటవీశాఖ కార్యాలయం ఎదుట డ్రైనేజీ లేకపోవడంతో ఆ ప్రాంతం చెరువును తలపించింది. తహసీల్దార్ కార్యాలయంలోకి వరద చేరింది. డ్రెయినేజీ మెరుగుపర్చకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని పట్టణవాసులు పేర్కొంటున్నారు. -
ఉపాధ్యాయులను కేటాయించాలి
లక్ష్మణచాంద: తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అదనంగా ఉపాధ్యాయులను కేటాయించాలని పార్పల్లి గ్రామస్తులు డీఈవో భోజన్నకు గురువారం వినతిపత్రం ఇచ్చారు. పాఠశాలలో గతేడాది 24 మంది విద్యార్థులు ఉండేవారని, ఈ ఏడాది కొత్తగా 28 మంది ప్రవేశం పొందారని తెలిపారు. మరో 70 మంది ప్రవేశాలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మొత్తంగా విద్యార్థుల సంఖ్య 100 దాటుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోరని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈవో త్వరలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఉప సర్పంచ్ విద్యాసాగర్రెడ్డి, వార్డు సభ్యులు పోషగౌడ్, శ్రీనివాస్, గణేశ్, వీడీసీ సభ్యులు గంగాధర్, నారాయణ, భీమేష్, సుంకరి గంగాధర్, చిన్నయ్య ఉన్నారు. -
‘డబుల్’ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
భైంసాటౌన్:పట్టణ శివారులోని పార్డి(బి) బైపాస్ మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, మున్సి పల్ చైర్మన్ తూముల దత్తాత్రితో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని గురువారం పరిశీలించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో జిల్లాలో పర్యటించనున్నారని, ఆయన చే తుల మీదుగా ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చే యాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతోపాటు ఇతర మౌలిక వసతులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కుభీర్ చౌరస్తా వద్ద డివైడర్ను పరిశీలించారు. డివైడర్ తొలగింపు, నూతన రోడ్డు నిర్మాణంపై మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి కలెక్టర్కు వివరించారు. దీంతో ఆయన నివేదిక పంపించాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ సంకేత్కుమార్, మున్సిపల్ కమిషనర్ లింగయ్య, ఆర్అండ్బీ ఈఈ సుభాష్, డీఈఈ సునీల్ ఉన్నారు. -
డీజీపీని కలిసిన శ్రీహరిరావు
నిర్మల్చైన్గేట్:రాష్ట్ర డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీవీ.ఆనంద్ను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్ర త్యేక ట్రాఫిక్ పోలీస్స్టేషన్తోపాటు, అదనపు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన డీజీపీ నిర్మల్ పట్టణ అవసరాలను పరిశీలించి త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తోపాటు మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని శ్రీహరిరావు తెలిపారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
నిర్మల్ రూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఐటీడీఏ పీవో మకరందు సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. రిజిస్టర్లు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించారు. వంటగది, భోజనశాల, టాయిలెట్స్ ఎలా ఉన్నాయో చూశారు. విద్యార్థుల ఆరోగ్యం శారీరక అభివృద్ధి దృష్ట్యా ఆహారంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల ఆవరణలో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంటగది ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. పీవో వెంట డిప్యూటీ డైరెక్టర్ అంబాజీ, ప్రధానోపాధ్యాయురాలు అనూష, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఆబ్కారీశాఖకు అంతా కొత్తవారే..
సాక్షి, ఆదిలాబాద్: ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ కమిషనర్ నుంచి డీపీఈవో (ఎకై ్సజ్ సూపరింటెండెంట్) వరకు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ శాఖలో రెండున్నర నెలల క్రితమే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. సీఐలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఈఎస్లు, ఏసీలతోపాటు డిప్యూటీ కమిషనర్ (డీసీ) వరకు ప్రమోషన్ లభించింది. అప్పుడు వారు పోస్టింగ్లో ఉన్న స్థానంలో కొనసాగించారు. తాజాగా బదిలీలు చేపట్టి ప్రమోషన్ పొందిన వారికి పోస్టింగ్ కల్పించా రు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కె.హరికిరణ్ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెగ్యులర్ డిప్యూటీ కమిషనర్గా జి.జనార్దన్రెడ్డి నియమితులయ్యారు. ఖమ్మంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ప్రమోషన్ పొందిన ఆయన తాజాగా ఆదిలాబాద్ డీసీగా రానున్నా రు. హైదరాబాద్ డీసీ కార్యాలయం రెగ్యులర్ అధికారిగా ఉండి ఆదిలాబాద్ ఇన్చార్జి డీసీగా వ్యవహరించిన రఘురాం స్థానంలో జనార్దన్రెడ్డిని నియమించారు. ఇదే కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ పోస్టును భర్తీ చేశారు. హన్మకొండ–1 టీజీబీసీఎల్లో ఏసీగా వ్యవహరిస్తున్న కె. రాజ్యలక్ష్మి ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా ని యమితులయ్యారు. గతంలో ఆమె ఆదిలాబాద్, కు మురంభీం ఆసిఫాబాద్ డీపీఈవోగా పని చేశారు. పర్యవేక్షణ పటిష్టమయ్యేనా? ఎకై ్సజ్ శాఖలో తాజాగా డిప్యూటీ కమిషనర్ను రె గ్యులర్ అధికారిని నియమించారు. కొంత కాలంగా ఇన్చార్జీలతో నెట్టుకొచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ ఏసీ పోస్టు ఖాళీగానే ఉండగా, తాజాగా ప్రమోషన్లతో భర్తీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్లోని ఏఈఎస్ పోస్టులు కూడా ఖాళీగా ఉండగా, త్వరలో భర్తీచేసే అవకాశముంది. సరైన పర్యవేక్షణ లేక జిల్లాలో గంజా యి, గుడుంబా కేసులు పెరిగాయి. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకపోయిందన్న విమర్శలున్నాయి. తాజా గా ప్రభుత్వం పోస్టుల భర్తీపై దృష్టి పెట్టడం, ఇప్పటికే కొందరిని నియమించడంతో ఎక్సైజ్ శాఖలో పర్యవేక్షణ పటిష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కొత్త డీపీఈవోలు వీరే.. ఉమ్మడి జిల్లాలోని నాలుగు డీపీఈవో పోస్టులకు కొత్త అధికారులు నియమితులయ్యారు. నల్గొండలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.కిష న్ను ఆదిలాబాద్కు, బి.చాణక్యను మంచిర్యాల కు, భూపాలపల్లి నుంచి వి.శ్రీనివాస్ను నిర్మల్ కు, సూర్యపేట నుంచి కుమురంభీం ఆసిఫా బాద్కు జిల్లాకు లక్ష్మనాయక్కు బదిలీలతో పా టు పోస్టింగ్ కల్పిస్తూ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు డీపీఈవోలు గా వ్యవహరించిన హిమశ్రీ ఆదిలాబాద్ నుంచి సిరిసిల్లకు, ఎంఏ రజాక్ నిర్మల్ నుంచి ఎల్బీనగర్కు, కేజీ నందగోపాల్ మంచిర్యాల నుంచి నిజామాబాద్కు, జ్యోతికిరణ్ కుమురంభీం ఆసిఫాబాద్ నుంచి ప్రమోషన్ కల్పిస్తూ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్కు ఏసీగా నియమించారు. -
గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన
నిర్మల్చైన్గేట్: దేశంలో బీజేపీ సర్కార్ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఛాత్రోన్ కీ గూంజ్కు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలిపారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. బొజ్జు పటేల్ మాట్లాడు తూ.. దేశంలో విద్యావ్యవస్థ బలోపేతం, యువత భవిష్యత్ రక్షణ రాహుల్ గాంధీ బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, అన్ని అనుబంధ సంఘాలు ప్రతీ గ్రామంలో ఛాత్రోన్కీ గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహించి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రీ ప్రైమరీకి స్పందన
● జిల్లాలో 1,052మంది విద్యార్థుల చేరికనాణ్యమైన బోధన అందిస్తాం జిల్లాలో నూతనంగా 74 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాం. 1,052 మంది విద్యార్థులు చేరారు. కొన్ని గ్రామాల్లో గ్రామస్తుల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ప్రీ ప్రైమరీ తరగతులు పాఠశాలల్లో ప్రారంభించారు. అనుమతుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందజేస్తాం. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణతో పాటు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేలా చర్యలు తీసుకుంటాం – భోజన్న, డీఈవో మామడ: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు లేక విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని విద్యాశాఖ గుర్తించింది. ఈ ఏడా ది నుంచి జిల్లాలో 74 ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించింది. దీంతో పోషకులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీలో చేర్పిస్తున్నారు. ప్రీ ప్రైమరీలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,052 మంది పిల్లలు చేరారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా ఏర్పాటు ఈ ఏడాది 74 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారు. గతేడాది 14 పాఠశాలలు ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో సొంత డబ్బులతో ప్రీ ప్రైమరీ తరగతిని షురూ చేశారు. మామడ మండలంలోని కమల్కోట్ ప్రాథమికోన్నత పాఠశాల, సారంగపూర్ మండలంలోని వైకుంఠపూర్ పాఠశాల, భైంసా మండలంలోని మంగ్రి పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించారు. వీడీసీ, సర్పంచుల ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్టర్, ఆయాలను నియమించి ప్రతినెలా గౌరవవేత నం అందించనున్నారు. ప్రీ ప్రైమరీ తరగతులను ఆయా గ్రామాల సర్పంచులు, మండల విద్యాధికారులు ప్రారంభించారు. దీంతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. -
సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమీక్ష ప్రత్యేకాధికారి ఇలంబర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా శాఖల వారీగా చేపట్టిన పనులపై ఏర్పా టు చేసిన ఫొటో గ్యాలరీని కలెక్టర్, అధికారులతో కలిసి తిలకించారు. శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు అధికారులు పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఇలంబర్తి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు 99రోజుల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. పోలీస్ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు. ముందుగా ఇలంబర్తికి కలెక్టర్ భవేశ్ మిశ్రా అటవీశాఖ వసతిగృహంలో పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమష్టి కృషితోనే విజయవంతం ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యం, అధికారుల కృషితోనే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళి క కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామ, వార్డు సభలు, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, అరైవ్ అలైవ్, రైతు, మహిళా శిశు సంక్షేమం, విద్య, ఆరోగ్య, సాంస్కృతిక, పర్యావరణ వారోత్సవాల పేరిట విస్తృత కార్యక్రమాలు చేపట్టామన్నా రు. గ్రామ, వార్డు సభలు నిర్వహించి అధికారులంతా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటల దిగుబడి అధికంగా వచ్చిందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, డీఎఫ్వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోరిన చోటకు బస్సులు
నిర్మల్టౌన్: ప్రయాణికులు కోరిన చోటకు ఆర్టీ సీ బస్సులు నడుపుతున్నామని నిర్మల్ డిపో మేనేజర్ పండరి పేర్కొన్నారు. బుధవారం ని ర్మల్ బస్టాండ్ నుంచి గోవాకు బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. నిర్మల్ నుంచి బయలుదేరిన బస్సు నాందేడ్లోని గురుద్వార్, తుల్జాపూర్, పండరిపూర్, కొల్హాపూర్ మీదుగా గోవాకు చేరుకుంటుందని తెలిపారు. ఈ టూర్ మొత్తం ఐదురోజులు ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని తె లిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, జూ లై 5న అరుణాచలం, శ్రీరంగం, పలని, మధు రై, రామేశ్వరం, కంచి, శ్రీకాళహస్తికి సూపర్ లగ్జరీ బస్సు వెళ్తుందని ఆయన తెలిపారు. -
నిర్మల్
బాసరకు పోటెత్తిన భక్తులు బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలి నిర్మల్టౌన్: నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. బుధవారం జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలోని పెండింగ్ కేసుల పురోగతిపై జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేసి, అవసరమైన ఆధారాలు సేకరించి త్వరగా విచారణ పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంగా పరిష్కరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం జరగకుండా ప్రతీ కేసు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. నిర్మల్చైన్గేట్: సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను పక్కాగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పెరిగిన వలసల నేపథ్యంలో ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లను తొలగించాలని భా విస్తోంది. ఇదే లక్ష్యంతో ఓటరు జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భా గంగా ఇప్పటికే 2002నాటి, ప్రస్తుత ఓటర్ల జాబి తాల ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఈనెల 25నుంచి సర్ను క్షేత్రస్థాయిలో ప్రారంభించనుంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరు నుంచి వివరాలు సేకరించనున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి సంతకాలతో తిరిగి స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియతో ఇప్పటివరకు గ్రామాలు, పట్టణాల్లో ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే అధికారులు ఒకచోట తొలగించనున్నారు. తప్పులతడకగా 1,45,819 ఓట్లు నిర్మల్, ఖానాపూర్, ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7,55,344 మంది ఓటర్లున్నారు. ఇందులో 6,09,525 (80.70 శాతం) మంది ఓట ర్ల మ్యాపింగ్ ప్రక్రి య పూర్తయింది. ఇంకా, నిర్మల్, ముధోల్, ఖానా పూర్ నియోజకవర్గాల్లో 1,45,819 మంది ఓట్లు తప్పులతడకగా ఉన్నాయి. తాజా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ నెల 25నుంచి ఓటర్ల ఎన్యూమరేషన్ నూతన ఫొటో ఓటరు జాబితాలు తయారు చేస్తారు. ఉద్దేశం ఏమిటంటే? ఇది ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులందరి భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమం. చనిపోయి న వారు, డూప్లికే ట్, శాశ్వతంగా తరలిపోయినవారు, అనర్హుల పేర్లను ఓట రు జాబితా నుంచి తొలగించి, అర్హుల పేర్లు మాత్ర మే చేర్చే ప్రత్యేక కార్యక్రమం. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పరిశీ లిస్తారు. ఓటర్లు భర్తీ చేసిన ఎన్యూమరేషన్ (గణన) ఫారాలను పాత ఓటరు డేటాతో పోల్చి చూస్తారు. 1951నుంచి 2004 మధ్య కాలంలో ఎనిమిది సార్లు ఇలాంటి కసరత్తు చేశారు. జిల్లాలో చివరిసారిగా 2001–2004 మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది. లింక్ తప్పనిసరి ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాలు అందించేందు కు ఓటరు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఎపిక్ (ఓటరు గుర్తింపు) ఐడీతో లింకై ఉండాలి. ఓటరు ఐడీ, ఆధార్కార్డులో ఉన్న వివరాలతో పూర్తిగా సరి పోవాలి. పేరులో స్పెల్లింగ్ తేడాలు ఉంటే డిజిటల్ ఈ–సైన్స్ ప్రక్రియ విఫలమయ్యే అవకాశముంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. షెడ్యూల్ ఇలా.. వలసల కారణంగా కొందరికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం లాంటి సమస్యలున్నాయి. వాటిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం సర్కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 25నుంచి ‘సర్’ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటరు వివరాలు సరిచూసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అ లాగే, ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకోవడం, మా ర్పులు–చేర్పులు చేయించుకోచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఇలా.. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సబ్ జూనియర్ జిల్లా స్థాయి ఆత్యపాత్య క్రీడా ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించారు. 100మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు జూలై 10, 11, 12 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి భూమన్న, సంజీవ్ తెలిపారు. వ్యా యామ ఉపాధ్యాయులు రమణారావు, అన్నపూర్ణగౌడ్, బుచ్చి రామారావు, నచ్చేందర్, కోచ్ సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం
● పార్టీల ప్రతినిధులతో సమావేశంనిర్మల్చైన్గేట్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడతామని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స మావేశమై మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వివరా లను సమగ్రంగా వివరించారు. ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలు ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వా రా ఆన్లైన్లోనూ నమోదు చేసుకోవచ్చని తెలిపా రు. వివరాల పరిశీలన తర్వాత ఎస్ఐఆర్కి సంబంధించి జూలై 31వ తేదీన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ జాబితాను ప్రచురిస్తామని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో ఓటరు పేరు లేకపోతే తగిన ఆధారాలతో సంబంధిత ఫారాలు నింపి, ధ్రువీకరణ (డిక్లరేషన్)తో ఈఆర్వోలను సంప్రదించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి ప్రతీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున బీఎల్వోలను నియమించాలని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా, పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు బీఎల్వోలు, బీఎల్ఏలతో సమావేశం నిర్వహించాలని, ఎస్ఐఆర్ నిర్వహణలో బీఎల్ఏలు తమవంతు సహకారం అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవోలు దేవీదాస్, మోహన్సింగ్, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోతుల పునరావాస కేంద్రం తనిఖీ సారంగపూర్: మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలోగల కోతుల పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం తనిఖీ చేశారు. ఇప్పటివరకు చేసిన, చేయాల్సిన కు టుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలు వై ద్యుడు శ్రీకర్రాజును అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్లు పూర్తయ్యాక కోతులను ఎక్కడ వదిలిపెడుతున్నారని ఎఫ్డీవో నాగినిభానును ప్రశ్నించగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదులుతున్నట్లు ఆమె బదులిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ బోబడే, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, డీఆర్వోలు సంతోష్, నజీర్ఖాన్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు అవగాహన కోసమే విత్తన మేళాలు
● ఎమ్మెల్యే, వెడ్మబొజ్జుపటేల్ కడెం: నకిలీ విత్తనాలు కొని మోసపోకుండా రైతుల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విత్తనమేళాలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాకు హాజరై మాట్లాడారు. రైతులు వ్యవసాయాధికారులు సూచించిన మేలురకం విత్తనాలనే ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఖాజామొయినుద్దీన్, ఏఎంసీ చైర్మన్ భూషణ్, ఏడీఏ సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరి సతీశ్రెడ్డి, సర్పంచులు దీకొండ విజయ్, ఈదుల తిరుపతి, రమేశ్, ఆర్టీఏ మెంబర్ మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు వాజీద్ఖాన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, యూత్కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మల్లేశ్యాదవ్, ఉద్యానవన క్లస్టర్ అధికారి స్పందన, ఏవో దినేశ్, ఏఈవోలు పాల్గొన్నారు. -
ధాన్యంలో కోతపై నిరసన
ఖానాపూర్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంలో నుంచి అక్రమంగా కోతలు విధింయడంతోపాటు ధాన్యం డబ్బులు చెల్లించడంలో జాప్యంపై రైతుల ఆందోళన చేపట్టారు. మండలంలోని మస్కాపూర్ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో దోపిడీని నిరసిస్తూ గ్రామంలోని రైతులు నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై ఉదయం నుంచి మద్యాహ్నం వరకు రాస్తారోకో చేశారు. కేంద్రం నిర్వాహకులతోపాటు ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం, డబ్బుల చెల్లింపులో రైతులు నష్టపోతున్నారన్నారు. హమాలీ, లారీల్లో లోడింగ్, అన్లోడింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా అదనపు వసూల్లు చేశారని తెలిపారు. దీంతో క్వింటాల్కు రూ.45 అదనపు నష్టం జరిగిందన్నారు. 40 కిలోల బస్తాకు 43 కిలోల 400 గ్రాముల చొప్పున తూకం వేసినప్పటికీ బిల్లులు ఇచ్చే క్రమంలో 38 కిలోల చొప్పున లెక్కిస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్కు 10 కిలోలు కోత విధిస్తున్నారని తెలిపారు. రైతులకు పూర్తిస్థాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తహసీల్దార్ సుజాత అక్కడి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం జిల్లా కేంద్రానికి వాహనాల్లో వెళ్లి కలెక్టర్ భవేశ్మిశ్రా, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్కు వినతి పత్రాలు ఇచ్చారు. -
రైతు వేదికల్లో విత్తన మేళాలు
నిర్మల్చైన్గేట్: వ్యవసాయ సమాచారం, పథకాలు, సేవలను రైతులకు చేరువలో అందించేందుకు రైతు వేదికలు కీలకంగా మారనున్నాయి. ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్గా నిర్ణయించి, ప్రతీ క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని (ఏఈవో) నియమించారు. ప్రస్తుతం ప్రతీ మండలంలో మూడు నుంచి నాలుగు గ్రామాల్లో రైతు వేదికలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వేదికల్లో రైతుల సమావేశాలు నిర్వహించి, సబ్సిడీ పథకాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతు భరోసా స్థితి, బీమా పథకాలు, వాతావరణ సమాచారం, మార్కెట్ ధరల వివరాలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేటి నుంచి విత్తన మేళాలు.. మంగళవారం నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతగా ముధోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని 22 రైతు వేదికల్లో ఒక్కో వేదికకు ఒక స్టాల్ చొప్పున మొత్తం 22 స్టాళ్లు నెలకొల్పుతారు. ఈ స్టాళ్లు వారం రోజులపాటు కొనసాగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సహకార సంఘాలు, విత్తన కంపెనీలు, స్థానిక విత్తన డీలర్ల సహకారంతో ఈ స్టాళ్లను నిర్వహిస్తారు. దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, రవాణా భారం తగ్గుతుంది. స్టాళ్లలో అందుబాటులో ఉండే వస్తువులు.. ప్రతీ రైతు వేదికలో ఏర్పాటు చేసే స్టాళ్లలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. వీటిలో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరాం, కెఎన్ఎం 7715, డబ్ల్యూజీఎల్ 44 వంటి వరి విత్తనాలు, తణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పెసర, కంది, మినుము, వేరుశెనగ, నువ్వులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు ఉంటాయి. అలాగే నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉంచుతారు. రైతులు నేరుగా స్టాళ్లను సందర్శించి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. జిల్లాలో ఇలా.. జిల్లాలో మొత్తం 79 రైతు వేదికలు ఉన్నాయి. వీటిలో ఏఈవోలు రైతులకు అవసరమైన సేవలు అంది స్తున్నారు. జిల్లాలో సుమారు 1.98 లక్షల మంది రై తులు 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. రైతు భరోసా, రైతు బీమా, యంత్ర పరికరాలపై సబ్సిడీ పంపిణీ వంటి పథకాల అమలును రైతు వేదికల నుంచే నిర్వహిస్తారు. పంటల సాగులో మెలకువలు, వాతావరణ సూచనలపై సలహాలు కూడా ఇక్కడి సదస్సుల ద్వారా అందిస్తారు. స్టాళ్లను సద్వినియోగం చేసుకోండి జిల్లాలో ఈనెల 23న 22 రైతు వేదికల్లో ప్రత్యేక స్టాళ్లను వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేయనున్నాం. ఆయా స్టాళ్లలో రైతులకు అవసరమైన విత్తనాలతోపాటు ఎరువులు అందుబాటులో ఉంచుతాం. నేరుగా రైతులు సందర్శించి అవసరమైన వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 79 రైతు వేదికల్లో కూడా ఈ సేవలు వారంలో అందుబాటులోకి తెస్తాం. – అంజిప్రసాద్, ఏడీఏ, నిర్మల్ నేడు స్టాళ్లు ఏర్పాటు చేయనున్న రైతు వేదికలు ఇవే.. మండలం రైతు వేదిక భైంసా కామోల్ ఖానాపూర్ సత్తెనపల్లి కడెం కడెం పెంబి పెంబి దస్తురాబాద్ దస్తురాబాద్ కుంటాల కుంటాల ముధోల్ కారేగాం నర్సాపూర్(జి) నర్సాపూర్(జి) నిర్మల్ రూరల్ అక్కాపూర్ నిర్మల్ రూరల్ చిట్యాల్ తానూర్ తానూర్ మామడ మామడ కుభీర్ కుభీర్ లోకేశ్వరం లోకేశ్వరం నిర్మల్ అర్బన్ నిర్మల్ అర్బన్ సోన్ సోన్ లక్ష్మణచాంద లక్ష్మణచాంద లక్ష్మణచాంద కనకాపూర్ సారంగాపూర్ సారంగాపూర్ సారంగాపూర్ పొన్కూర్ దిలావర్పూర్ దిలావర్పూర్ బాసర బాసర -
భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి
లక్ష్మణచాంద:భూముల రీసర్వే, సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వే తీరును సోమవారం పరిశీలించారు. ముందుగా మల్లాపూర్ గ్రామంలో రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వేను పరిశీలించారు. సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాలకు రెవెన్యూ మ్యాపులు లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, రీసర్వేతో గ్రామాల రెవెన్యూ మ్యాపులు సిద్ధం చేయాలన్నారు. అధునాతన కొలతల యంత్రాల సామగ్రిని ఉపయోగించి సర్వే నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సర్వేతో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అనంతరం మాచాపూర్, చామన్పెల్లి గ్రామాల్లో సర్వే తీరును పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. సర్వే తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్ సరిత, డిప్యూటీ ఇన్స్పెక్టర్ విఠల్రావు ఉన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మల్చైన్గేట్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో దశలో మంజూరైన ఇళ్లు, దరఖాస్తుల పరిశీలన, అనుమతించిన ఇళ్లు, ఎంపీడీవో లాగిన్ నుంచి కలెక్టర్ లాగిన్కు పంపిన ఇళ్లు, ఇతర వివరాలను మండలాల వారీగా ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. గుడిసెల్లో నివసించే అర్హులైన పేదలందరికీ రెండో దశలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని తెలిపారు. అనుమతుల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
నమ్మకం ఎక్స్పైరీ
నిర్మల్: నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అని ఓ సినీకవి అప్పటి ఆస్పత్రుల పరిస్థితులను చూసి పాట రాశారు. అయితే ప్రస్తుతం ప్రైవేటులో ఖరీదైన వైద్యంతో మధ్య తరగతి వాళ్లు కూడా ప్రైవేటుకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం కూడా సర్కారు దవాఖానాల్లో సౌకర్యాలు కల్పిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలన నుంచి ప్రభుత్వాస్పత్రులు మెరుగవుతూ వస్తున్నాయి. అయితే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా నిర్మల్ జిల్లా పెద్దాస్పత్రిలోనే వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కలెక్టర్ స్వయంగా కంటి పరీక్షకు వెళ్లినప్పుడు కాలం చెల్లిన ఔషధం ఇవ్వబోయారు. జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు గతంలో అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాలం చెల్లిన సైలెన్లు, సిరంజీలు బయటపడ్డాయి. దీంతో సాధారణ రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోగుల నమ్మకం, అధికారుల బాధ్యత ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు వచ్చేవారిలో ఎక్కు వ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలవారే. వా రు ‘పెద్ద ఆస్పత్రి దిక్కు’ అని నమ్ముకుని వస్తారు. వైద్యులు, సిబ్బంది మందులు పంపిణీ చేసే ముందు వాటి తయారీ తేదీ, గడువు తేదీని తప్పక పరిశీలించాలి. ఉన్నతాధికారులు కూడా నిల్వ, పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలి. ఈ ప్రాథమిక జాగ్రత్తలు పాటించక.. సర్కారు ఆస్పత్రులపై నమ్మకమే ఎక్స్పైరీ అవుతోంది. ఎవరు బాధ్యులు.. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు కాలం చెల్లిన మందులు ఇస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆస్పత్రి లేదా అవుట్పేషెంట్ విభాగంలో ఉన్న మందుల జాబితా, వాటి గడువు వివరాలు క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఔషధాల నిల్వ, పంపిణీలో సరైన పర్యవేక్షణ లోపించ డం, వైద్యులు కూడా వాటిని పరిశీలించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పేషెంట్ల పరేషాన్.. ప్రభుత్వ దవాఖానాలను నమ్ముకుని వచ్చే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి ఘటనలతో ఆందోళన చెందుతున్నారు. ‘డాక్టర్ ఇచ్చిన మందు కాబట్టి వాడుతున్నాం. అది కాలం చెల్లినదైతే మా ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. రోగులను ఇలా ఇబ్బంది పెట్టొద్దని, ఇప్పటికై నా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దని వేడుకుంటున్నారు. నాణ్యమైన వైద్యం, మందులు అందేలా.. జిల్లా జనరల్ ఆస్పత్రిపై నమ్మకంతో వచ్చే పేషెంట్లకు నాణ్యమైన వైద్యసేవలు, మందులను అందిస్తున్నాం. ఇటీవల జరిగిన ఘటనకు కారణాలు తెలుసుకున్నాం. సదరు వైద్యుడిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించాం. –డాక్టర్ గోపాల్సింగ్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్కలెక్టర్ తనిఖీలు జిల్లా జనరల్ ఆస్పత్రిని శనివారం కలెక్టర్ భవేశ్ మిశ్రా వెళ్లారు. వైద్యుడు కాలం చెల్లిన కంటి మందు వేయబోయాడు. కలెక్టర్ ఒకసారి పరిశీలించి ఎక్స్పైరీ అయినట్లు గుర్తించారు. వెంటనే వివరణ ఇవ్వాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆస్పత్రిలోని అన్ని ఔషధాల కాలపరిమితి వివరాలను పూర్తిగా చెక్ చేయించారు. ఆ కాలం చెల్లిన మందు గతంలో పనిచేసిన ఓ వైద్యుడు తీసుకువచ్చినట్లు తేలింది. ప్రస్తుత వైద్యుడు దాని గడువు తేదీ చూసుకోలేదు. ఇది కూడా విధుల్లో నిర్లక్ష్యమేనని అధికారులు అభిప్రాయపడ్డారు. నాణ్యమైన వైద్యంతోపాటు మందులు అందిస్తేనే రోగుల్లో భరోసా పెరుగుతుందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. -
నిర్మల్
7సర్ పకడ్బందీగా చేపట్టాలి భైంసాటౌన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమార్ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఎల్వోలకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 25 నుంచి క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇంటికి వెళ్లి చేపట్టాల్సిన సర్ నిర్వహణ, విధి విధానాలు తదితర అంశాలను వివరించారు. ఎన్యుమరేషన్ ఫారాల అందజేత, వివరాల నమో దు, తిరిగి స్వీకరణ, ముసాయిదా జాబితా, తుదిజాబితా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శశిభూషణ్ పాల్గొన్నారు. బాసరలో నేడు 2కె రన్బాసర: ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు బాసరలో మంగళవారం ఉదయం 6 గంటలకు 2కె రన్ నిర్వహించనున్నారు. గోదావరి పుష్కర ఘాట్ నుంచి శ్రీజ్ఞా న సరస్వతి అమ్మవారి ఆలయం వరకు ఈ రన్ కొనసాగుతుంది. కార్యక్రమానికి కలెక్టర్ భవేశ్మిశ్రా హాజరవుతారు. కలెక్టర్ వెంట బాసర తహసీల్దార్ పవన్చంద్ర కోరారు. భైంసాటౌన్: లాభాలు ఆర్జించడానికి విద్య వ్యాపారం కాదని, అది ప్రజల ప్రాథమిక హక్కు అని విద్యాశాఖ నిబంధనలు చెబుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండాలని, వ్యాపార ధోరణి అవలంభించొద్దని పేర్కొంటున్నాయి. అయితే, ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో విద్య వ్యాపారంగా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే పాఠశాలల్లోనే పాఠ్య, నోటు పుస్తకాలు, విద్యార్థులకు యూనిఫాంలు, స్టేషనరీ, షూ, టై, బెల్టులు సైతం విక్రయిస్తున్నాయి. వీటికితోడు బస్ చార్జీలు, స్పెషల్ ఫీజులు సరేసరి. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన సందర్భాల్లో అధికారులు నామమాత్ర చర్యలతో సరిపెడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలపై పూర్తిస్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో అధిక ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ సైతం అధిక ధరలకు విక్రయంతో పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువు కొనాల్సి వస్తోంది. పాఠశాలల్లోనే దుకాణాలు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దీంతో జిల్లా కేంద్రం నిర్మల్తోపా టు భైంసా, ఖానాపూర్, దాదాపు అన్ని మండలకేంద్రాల్లో ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ‘దుకాణాలు’ ప్రారంభించాయి. విద్యార్థులకు అవసరమైన ప్రతీ వస్తువును ‘స్కూల్ స్టాండర్డ్’ పేరుతో విక్రయిస్తున్నాయి. బయట మార్కెట్లో తక్కువ ధరలకు లభించే వస్తువులు పాఠశాలల్లో అధిక ధరలకు అంటగడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఎన్ని విమర్శలున్నా యాజమాన్యాలు పెడచెవిన పెడుతూ తమ వ్యాపార ధోరణి వీడడం లేదు. కొందరు తాము చెప్పిన దుకాణం నుంచి మాత్రమే బుక్స్, యూనిఫాంలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఈ స్థాయిలో విద్యను వ్యాపారం చేయడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. వ్యాపారుల ఉపాధికి గండి.. పాఠశాలల్లో దందాతో కొన్నేళ్లుగా పుస్తకాలు, స్టేషనరీ దుకాణాలతోపాటు యూనిఫాంలు కుట్టే దర్జీలు, విద్యార్థులను స్కూళ్లకు తీసుకెళ్లే ఆటో వాలాలు, షూలు అమ్మే ఫుట్వేర్ షాపుల యజమానులు ఇలా విద్యార్థులకు సంబంధించి ప్రతీ వస్తువు అమ్మే దుకాణదారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. బుక్స్టోర్లు మూతపడినవి ఎన్నో ఉన్నాయి. పాఠశాలలే నేరుగా అమ్మకాలు చేపట్టడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ చర్యలేవి..? జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, స్టేషనరీ, యూనిఫాంల విక్రయం చేస్తున్న విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో మాత్రమే తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల భైంసాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు విక్రయిస్తుండడంతో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పుస్తకాలు ఉన్న గదులను సీజ్ చేశారు. జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో తనిఖీలు జరిపి పాఠశాలల్లో ‘దందా’పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
కుంటాల: ఆదర్శ పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆదర్శ పాఠశాలల రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. సోమవారం స్థానిక ఆదర్శ పాఠశాలను సందర్శించారు. వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలోని అన్ని పాఠశాలను టీపీఎస్ స్కూళ్లుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పేద విద్యార్థులకు కార్పొరేట్స్థాయి విద్య అందుతుందన్నారు. పాఠశాలలో హాజరు శాతం పెంచి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. ఆయన వెంట ఈడబ్ల్యూఐడీసీ పి.శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ రవీందర్, నిజామాబాద్ సర్కిల్ డీఈ గంగాధర్గౌడ్, ఏఈ మహేశ్కుమార్, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు ఉన్నారు. -
యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి
నిర్మల్టౌన్: ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ రాధిక సూచించారు. ఆదివారం అంతర్జాతీ య యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగా శారీరక వ్యా యామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతత, ఏకాగ్రతకు, ఒత్తిడి నియంత్రణకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులున్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో.. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల, అధికారులు, సిబ్బంది వివిధ యోగాసనాలు వేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో.. నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు కార్యక్రమానికి హాజరైన వారితో వివిధ ఆసనాలు వేయించారు. యోగాతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని తెలిపా రు. రోజూ కొద్దిసేపు యోగాకు కేటాయిస్తే అనారో గ్య సమస్యలు దరిచేరవని సూచించారు. డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, నోడల్ అధికారి సత్యనారాయణరావు, సిబ్బంది పాల్గొన్నారు. బాసర ఆర్జీయూకేటీలో.. బాసర: బాసర ఆర్జీయూకేటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎ డ్యుకేషన్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. కా ర్యక్రమాన్ని ఫ్యాకల్టీ ఇన్చార్జి ఎం.రామకృష్ణ, ఫిజి కల్ డైరెక్టర్ శ్యాంబాబు సమర్థవంతంగా పర్యవేక్షించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ కౌన్సిలర్ నాగలక్ష్మి ఆసనాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. -
ఉద్యాన సాగు.. రైతుకు మేలు
లక్ష్మణచాంద: ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం పోత్సహిస్తోంది. సబ్సిడీలు ఇస్తూ సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తోంది. ఇదివరకు పామాయిల్ సాగు చేసిన రైతులకు మాత్రమే డ్రిప్ పరికరాలపై రాయితీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం మరిన్ని పంటలకూ సబ్సిడీ ఇస్తోంది. దీంతో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ రాయితీలు పొందుతున్నారు. పండ్ల తోటల సాగుకు ఇలా.. మామిడి సాగు చేసే రైతులకు ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.19,200, రెండు, మూడో సంవత్సరాలకు రూ.1,200 చొప్పున ఒక్కో రైతుకు 10ఎకరాల వరకు అందిస్తోంది. అరటి సాగు చేసే రైతుల కు మొదటి ఏడాది రూ.16,800, రెండో సంవత్స రం రూ.4వేలు ఇస్తోంది. బొప్పాయి సాగు చేసే రై తులకు మొదటి ఏడాది రూ.7,200, రెండో ఏడాది రూ.3,200 అందజేస్తోంది. జామ సాగు చేసే రైతులకు మొదటి ఏడాది రూ.19,200, రెండు, మూడో సంవత్సరాలకు రూ.1,200 ఇస్తోంది. డ్రాగన్ ఫ్రూ ట్కు మొదటి ఏడాది రూ.64,800, రెండు, మూడో సంవత్సరాలకు రూ.12,800 చొప్పున చెల్లిస్తోంది. కూరగాయలు, పూల సాగు, ఇతరాలకూ.. హైబ్రిడ్ కూరగాయల నారుకు రూ.9,600, ఉల్లికి రూ.8వేలు, విడి పూల (బంతి, చామంతి, కనకాంబరం, మల్లె) సాగుకు ఎకరాకు రూ.8వేలు ఇస్తోంది. దుంప జాతి పూల సాగుకు (ట్యూబ్రోజ్, గ్లాడియోలస్, లిల్లీ) ఎకరాకు రూ.40వేల చొప్పున ఐదెకరాల వరకు అందజేస్తోంది. అల్లం, వెల్లుల్లి, పసుపు పంటలకు ఎకరానికి రూ.16వేల చొప్పున ఐదెకరాల వరకు రాయితీ ఇస్తోంది. వీటితో పాటు సుగంధ ద్రవ్యాలు, మల్చింగ్ సాగు విధానం, నీటి కుంటలకూ సబ్సిడీ అందజేస్తోంది. జిల్లాలో ఉద్యాన పంటల సాగు ఇలా.. సంవత్సరం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) 2021–22 1,283.88 2022–23 3,241.63 2023–24 1,875.88 2024–25 1,888.95 2025–26 3,904.88సద్వినియోగం చేసుకోవాలి గతంలో పామాయిల్ పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం మరిన్ని పంటలను రాయితీ జాబితాలోకి చేర్చి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తోంది. మామిడి, జామ, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పండ్ల తోటలతో పాటు కూరగాయలు సాగు చేసే రైతులకు రాయితీ ఇస్తోంది. ఆసక్తి గల రైతులు మండల వ్యవసాయధికారులను లేదా ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. – మౌనిక, నిర్మల్ డివిజన్ ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి -
వాహనదారులు నిబంధనలు పాటించాలి
నిర్మల్టౌన్: వాహన యజమానులు, డ్రైవర్లు మో టార్ వాహనాల చట్టంలోని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంవీఐలు తిరుపతి, దూప్సింగ్ సూచించారు. శనివారం రాత్రి గంజాల్ టోల్ ప్లాజా వద్ద, ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న ఓవర్ లోడ్, గూడ్స్ లారీ, ట్రావెల్ బస్సులను పట్టుకున్నారు. 11 బస్సులు, రెండు గూడ్స్ లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక లోడ్తో వాహనాలు వెళ్తుండడంతో రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని వెల్లడించారు. ఏఎంవీఐలు అక్షయ్, రజనీకాంత్, సిబ్బంది తేజరావు, వికాస్, లిఖిత్ తదితరులున్నారు. -
కొనసాగుతున్న మాధవ్ పాదయాత్ర
కుభీర్: మండల కేంద్రానికి చెందిన జాదవ్ మాధవ్ అనే యువకుడు 41రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారం ఛత్తీస్గఢ్లోని జగ్దాల్లో ఉన్న ట్లు ‘సాక్షి’తో తెలిపారు. ఆయన తన పాదయాత్ర ను మే 11న కుభీర్లోని విఠలేశ్వర మందిరం నుంచి ప్రారంభించారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగా ల సందర్శనకు పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తె లిపారు. ఇప్పటివరకు 550కిలోమీటర్లు పాదయా త్ర చేసినట్లు పేర్కొన్నారు. ఈయన గతంలో కుభీర్ నుంచి అయోధ్యకు, కుభీర్ నుంచి మహారాష్ట్రలోని తుల్జాభవానికి, కుభీర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ప్రారంభించినప్పుడు, పూర్తిచేస్తున్నప్పుడు గ్రామస్తులు, హిందు సంఘాలవారు ఆయన మద్దతు తెలిపి సన్మానించారు. -
గాలివాన బీభత్సం
ముధోల్: మండలంలోని విఠోలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామానికి చెందిన దండి చిన్నక్క ఇంటి రేకులు లేచిపోయాయి. ఇంట్లోని చిరుధాన్యాలు, బట్టలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది. వానాకాలం ప్రారంభమైన పక్షం రోజుల్లో భారీ వర్షం కురవడంతో రైతులు సోమవారం నుంచి సాగు పనుల్లో నిమగ్నం కానున్నారు. పిడుగు పాటుకు ఆవు మృతి లోకేశ్వరం: మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన సర్పంచ్ సంజీవరెడ్డికి చెందిన ఆవు ఆదివారం సాయంత్రం పిడుగు పాటుకు గురై మరణించినట్లు లోకేశ్వరం పశువైద్య సహాయకుడు శేఖర్ తెలిపారు. పంచగుడి గ్రామ శివారు ప్రాంతంలోని గోదావరి న ది ఒడ్డున ఆవులను మేతకు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటి వచ్చే క్రమంలో పిడుగు పాటు గురై సంజీవరెడ్డి ఆవు మరణించింది. ఆవు విలువ రూ.50వేలు ఉంటుందని యజమాని తెలిపాడు. -
‘బుల్డోజర్’కు బ్రేక్ ఎందుకో!
నిర్మల్: ‘ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు.. ఏళ్లుగా చెరపట్టిన అసైన్డ్ భూములను ఇప్పటికై నా స్వాధీనం చేసుకుంటున్నారు..’ అంటూ జిల్లావాసులు అధికారుల పని తీరుపై అభినందనలు కురిపించారు. కానీ.. రూ.కో ట్ల విలువ చేసే అసైన్డ్భూముల ఆక్రమణల లెక్కను మధ్యలోనే ఆపేశారు. దీంతో అప్పుడు మెచ్చుకున్న జిల్లావాసులు ఇప్పుడు ప్రజాప్రతినిధులు, అధికా రుల తీరుపై ప్రశ్నిస్తున్నారు. ‘అసైన్డ్’ పేరిట భూస్వాహా.. జిల్లాకేంద్రంలోని దివ్యనగర్, మల్లన్నగుట్ట ప్రాంతంలో అసైన్డ్ భూములను బడాబాబులు చెరబట్టా రు. ప్రభుత్వ స్థలాలను స్వాహా చేస్తున్నారు. 534 సర్వేనంబర్లో 29.03 ఎకరాల్లో అసైన్డ్ పోనూ మిగతా 2.20ఎకరాల ప్రభుత్వభూమిని ఓ పార్టీకి చెంది న బడా నేత కబ్జా పెట్టాడు. తమ భూమితోపాటు సర్కారు జాగాలోనూ అక్రమ నిర్మాణాలు, అడ్డుగ డలు కట్టేశాడు. అక్కడి కుంటనూ క్రమంగా మాయం చేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్నీ కబ్జా చేయడంపై కొ న్నేళ్లుగా ఫిర్యాదులు, మీడియా కథనాలు వచ్చా యి. అప్పట్లో ఆ ‘బడానేత’ అధికారపార్టీలో ఉండటంతో జిల్లా అధికారులూ ఏం చేయలేకపోయారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కదిలి.. గత అక్టోబర్లో ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి 534 సర్వేనంబర్లోనే స్వయంగా అప్పటి కలెక్టర్ అభిలాషఅభినవ్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సమక్షంలోనే ఫిర్యాదు చేయగా రెవెన్యూ, మున్సిప ల్ అధికారులు అదేరోజు బుల్డోజర్ తెప్పించి మల్ల న్నగుట్ట అయ్యప్ప గుడి ఎదురుగా ప్రభుత్వ భూమి లో చేపట్టిన అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టారు. బ్రేక్ ఎందుకు వేసినట్లు..! ప్రభుత్వ భూములను కబ్జా పెడుతూ ప్రజావసరా లకు కనీసం భూమిలేకుండా చేయడంపై ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సీరియస్ కావడం, అప్పటి కలెక్టర్ వెంటనే స్పందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కానీ.. ఆక్రమణల తొలగింపు చేపట్టిన బుల్డోజర్కు కొన్నిరోజులకే బ్రేక్ పడింది. కూల్చేసిన ఆక్రమణల చోట యథావిధిగా మళ్లీ అడ్డుగోడలు కట్టేశారు. ఈ కూల్చివేతలను ఆపిందెవరూ..! బుల్డోజర్ను అడ్డుకున్నదెవరూ..? అన్న ప్రశ్నలు అప్పట్లోనే వచ్చాయి. అప్పుడు మున్సిపల్ ఎన్నికల పనులు ఉండటంతో జిల్లా అధికారులతో పాటు సదరు ప్రజాప్రతినిధులూ అందులో బిజీగా మారారు. ఎన్నికల తర్వాతైనా రెవెన్యూ అధికారులు చర్యలు చేపడతారేమోనని అంతా ఎదురుచూశారు. కానీ.. అప్పటి కలెక్టర్ బదిలీకావడం, ప్రజాప్రతినిధులూ మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తకపోవడంతో కబ్జాల తొలగింపులో కదలిక లేకుండాపోయింది. రూ.కోట్ల భూములు కొల్లగొడుతూ.. జిల్లాకేంద్రమైన తర్వాత నిర్మల్లో భూముల విలు వ ఆకాశాన్నంటుతోంది. ఎకరం రూ.కోట్లలో పలు కుతోంది. ఇక ఏఎన్రెడ్డి కాలనీ, దత్తాత్రేయనగర్, దివ్యనగర్ లాంటి ప్రైమ్ లొకేషన్లలో ప్లాట్ ధర రూ.60లక్షల వరకు ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ విలువైన ఏరియాలోని 534 సర్వేనంబర్లోగల ప్రభుత్వ భూములను బడా నేతలు కబ్జాపెడుతున్నారు. అయ్యప్ప టెంపుల్ (మల్లన్నగుట్ట) ఏరియాలోని 534, 535 తదితర సర్వేనంబర్లలో అసైన్డ్ భూ ముల్లోనే ఇష్టారీతిన వెంచర్లు ఏర్పాటు చేశారు. ము న్సిపల్ టౌన్ప్లానింగ్లో ఉన్న రోడ్లనూ మాయంచే సి, ప్లాట్లు అమ్మేశారు. ఇక్కడ అసైన్డ్ భూములు బ డాబాబులకు ఎలా కేటాయించారు? వాటిల్లో నిర్మాణాలు, వెంచర్లకు అనుమతులు ఎలా ఇచ్చారు? అక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉంది? అన్న వివరా ల కోసం కొందరు ఆర్టీఐలు పెట్టినా అధికారులు స్పష్టమైన వివరాలు ఇవ్వకపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఇప్పటికై నా అసైన్డ్ పేరిట చేస్తున్న భూకబ్జాలపై ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. వేరే శాఖలకు కేటాయించాం జిల్లాకేంద్రంలోని 534 సర్వేనంబర్లో అసైన్డ్ పోనూ మిగతా ప్రభుత్వ భూమిని గుర్తించాం. గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఉన్నతాధికారుల సూచన మేరకు సదరు భూమిని ఇతర శాఖలకు కేటాయించనున్నారు. – రాజు, తహసీల్దార్, నిర్మల్ అర్బన్ -
నిర్మల్
గుడిసెవాసులకే ఇందిరమ్మ!సర్కారు బడికే జై.. ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. నాణ్యమైన బోధన అందుబాటులోకి రావడంతో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పిస్తున్నారు.ప్రొసీడింగ్ అందజేత కుంటాల:మండల కేంద్రంలో సీసీ రోడ్లు, ము రుగు కాలువల నిర్మాణానికి రూ.66లక్షలు మ ంజూరు చేయించిన ఎమ్మెల్యే రామారావు పటే ల్ ఆదివారం తన నివాసంలో సర్పంచ్ జక్కుల గజేందర్కు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్చైన్గేట్: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారుల ఎంపికలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి తొ లి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 500 ఇళ్లను గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకే కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇప్పటికే గ్రామాలు, ప ట్టణాల్లో గుడిసెలు, ప్లాస్టిక్ కవర్ల కింద నివాసముంటున్న నిరుపేదలను అధికారులు గుర్తిస్తున్నారు. గృహ నిర్మాణశాఖ అధికారులు స్వయంగా వెళ్లి అర్హులను గుర్తించి వారితో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆన్లై న్లో దరఖాస్తు చేయిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల ఇళ్ల చొప్పున వంద నియోజకవర్గాలకు రెండు లక్షల గృహాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. మరో 50వేల ఇళ్లు స్టేట్ రిజర్వ్ కోటాగా నిర్ణయించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.50 లక్షల గృహాలు మంజూరయ్యాయి. నియోజకవర్గానికి రెండు వేల చొప్పున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం రెండు వేల గృహాలను రెండో విడతలో మంజూరు చేసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన లబ్ధిదా రుల జాబితాలోని అర్హులైన వారిని ఇందిరమ్మ కమి టీల ద్వారా అధికారులు గుర్తిస్తారు. అయితే, ప్రతి పక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ హిస్తున్న నియోజకవర్గాల్లో గుడిసె వాసులకు కేటా యించే 500 ఇళ్లు పోగా, మిగతా 1,500 ఇళ్లలో 40శాతం ఇళ్లను కోటాగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ లెక్కన 1,500 గృహాల్లో సుమారు 600 గృహాలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల కోటాగా ఉంటుంది. జిల్లాల్లో ఒక కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట వీరికి 600 ఇళ్ల చొప్పున కేటాయించనున్నారు. ఆయా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లబ్ధిదారుల జాబితాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబితాలోని అర్హులైన వారికే ఇళ్లు కేటాయిస్తారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదాన్ని ఈసారి కూడా తప్పనిసరి చేశారు. అర్హుల గుర్తింపు పనిలో అధికారులు రాష్ట్రాన్ని గుడిసెలు లేని తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో గతంలోనే గుడిసె ఇళ్ల వివరాలు సేకరించారు. జిల్లాలో 3,686 గుడిసెలున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీటిని మరోసారి సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జిల్లాలో 2వేల ఇళ్ల వరకు సర్వే పూర్తి కాగా.. మరో వారం రోజుల్లో మిగతా ప్రక్రియ పూర్తి చేయనున్నారు. గుడిసెల వారితో పాటు మిగతావారి ఎంపిక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండడంతో దరఖాస్తు చేసుకున్న అర్హులు అయోమయానికి గురవుతున్నారు. మొదటి విడత నిర్మాణాలు ఇలా.. మంజూరైన ఇళ్లు 8,166 గ్రౌండింగ్ అయినవి 6,768 మార్కౌట్ దశలో.. 1,139 బేస్మెంట్ దశలో.. 1,140 గోడల దశలో.. 805 స్లాబ్ దశలో.. 1,676 పూర్తయిన ఇళ్లు 2,091 లబ్ధిదారులకు ఇప్పటివరకు అందజేసిన సొమ్ము రూ.142కోట్లు రెండో విడతకు ఎదురుచూపులేనా? ఇందిరమ్మ కమిటీలు ఆయా గ్రామాల్లో అర్హుల జాబితా ఇవ్వగా.. మొదటి విడతలో అందరికీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం దాదాపు ఆరు నెలలుగా రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామంటూ ప్రకటించుకుంటూ వస్తోంది. కాగా, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలిసిన నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులను కలుస్తూ తమకు రెండో విడతలో ఇల్లు ఇవ్వాలంటూ ప్రాధేయపడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రెండో విడతను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించగా.. అన్ని జిల్లాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, జాబితాలు వస్తాయని భావించారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రకటనలే గాని ఆదేశాలు రాకపోవడంతో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. -
లోక్అదాలత్కు విశేష స్పందన
నిర్మల్టౌన్/భైంసాటౌన్/ఖానాపూర్: నిర్మల్, భైంసా, ఖానాపూర్ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. నిర్మల్ కోర్టులో సివిల్ కేసులు 14, క్రిమినల్ కేసులు 1,599 పరిష్కారంకాగా, భైంసా కోర్టులో మొత్తం 610 కేసులు పరిష్కరించారు. వీటిలో 29 బ్యాంక్ సంబంధ కేసులకు సంబంధించి రూ.24,64,700 రికవరీకి ఆదేశించారు. ఇక ఖానాపూర్ కోర్టులో 439 కేసులు రాజీ కుదిర్చారు. జిల్లాలో ఒకే రోజు 2,636 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, భైంసా జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఆర్కె వెంకటరమణ, ఖానాపూర్లో జూనియర్ సివిల్ జడ్జి కమ్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ బీసీ నిఖిత ప్రారంభించారు. న్యాయవాదులు, పోలీసులు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
నాన్న మాటే.. విజయానికి బాట..
నిర్మల్ ఖిల్లా: జీవితంలో తండ్రి ఇచ్చే మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అమూల్యమని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గోమస జసింత్ జోయల్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి డేనియల్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన విజయ ప్రయాణాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మల్కు చెందిన ‘జసింత్ జోయల్‘ బీటెక్ 2020లో పూర్తిచేశారు. అనంతరం గ్రూప్–1 లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిర్మల్లోని సోఫీనగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తన తండ్రి డేనియల్ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బదిలీ కావడంతో ఆరేళ్లపాటు కొడుకుతోపాటు అక్కడే ఉన్నారు. గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ప్రతీ అంశాన్ని తండ్రితో చర్చించేవాడినని జసింత్ తెలిపారు. ఉపాధ్యాయుడైన తన తండ్రి చదువుకు సంబంధించిన అంశాలతోపాటు ఆర్థిక స్వేచ్ఛ, పొదుపు, కుటుంబ బంధాలు, జీవన విధానం వంటి విషయాలపై విలువైన సూచనలు, సలహాలు అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహమే గ్రూప్–1లో విజయానికి బాటలు వేశాయని తెలిపారు. ప్రస్తుతం తాను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘నాన్న... మీ ప్రేమ, ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే మా జీవితాలకు బలమైన పునాది. థాంక్యూ డాడీ... హ్యాపీ ఫాదర్స్ డే’ అని జసింత్ జోయల్ భావోద్వేగ సందేశాన్ని ‘సాక్షి’ తో పంచుకున్నారు.. -
అత్యున్నత వైద్యం అందించాలి
నిర్మల్చైన్గేట్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అత్యున్నత వైద్యం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆన్లైన్ విధానంలో ఓపీ సేవల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సగటున నమోదవుతున్న ఓపీ వివరాలతోపాటు, ఏ విభాగాలకు ఎక్కువ మంది రోగులు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రిలోని ప్రతీ విభాగాన్ని సందర్శించి, రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన వారికి తక్షణమే రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. రోగుల సౌకర్యార్థం వివిధ విభాగాలను సూచించే సైన్ బోర్డులు ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన కలెక్టర్, ప్రతీ రికార్డును పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. ఆస్పత్రి ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని పరిశీలించిన ఆయన, ఇంకా పూర్తి కావాల్సిన పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శారద, వైద్య శాఖ అధికారులు ఉన్నారు. రెవెన్యూ దరఖాస్తులు గడువులోపు పరిష్కరించాలిప్రజల నుంచి వచ్చే అన్నిరకాల రెవెన్యూ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. మండలాలవారీగా పెండింగ్లో ఉన్న భూభారతి, సాదా బైనామా, ప్రజావాణి అర్జీలు, పౌర సేవల ధ్రువీకరణ పత్రాల జారీ పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 60 రోజుల గడువు నిర్దేశించిందని, ఈలోపే ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. పౌర సేవల కింద జారీ చేసే కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలతోపాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల దరఖాస్తులను సత్వరమే పరిశీలించి అర్హులైన వాటికి ఆమోదం తెలుపాలని తహసీల్దార్లకు స్పష్టం చేశారు. దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాలు స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ, ఫిట్నెస్ పోలీసులకు కీలకం
నిర్మల్టౌన్: క్రమ శిక్షణ, ఫిట్నెస్ పోలీసులకు చాలా కీలకమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో జిల్లాలోని సివిల్ ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్డ్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. సిబ్బందికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి విధులను నిర్లక్ష్యం చేయొద్దని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించొద్దని హెచ్చరించారు. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ సమ్మయ్య, గోవర్ధన్, కృష్ణ, ఏఆర్ ఇన్స్పెక్టర్లు రామ్ నిరంజన్, శేఖర్, రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ క్షణం కళ్లల్లో ఆనందం చూశాను..
నాన్న.. జీవితాన్ని సరైన దారిలో నడిపించే మార్గదర్శి. అపజయాలు ఎదురైనా ధైర్యం చెప్పి విజయాన్ని అందించే దిక్సూచి. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల విజయాలే తనవిగా భావించి సంతోషిస్తాడు. బిడ్డల ఎదుగుదలలో తన కష్టాలను మెట్లుగా మలిచి ఉన్నత స్థానాలకు చేర్చి ఆనందిస్తాడు. తన భుజాలపై ఎక్కించుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం. నేడు ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నతస్థానాలకు చేరిన వారిపై ప్రత్యేక కథనం.బెల్లంపల్లి: ‘నాన్న ప్రేమ ఎల్లలు లేనిది.. దేనితోనూ వెలకట్టలేనిది. చిన్నతనం నుంచి మొదలుకుని ఐఏఎస్ పాసయ్యే వరకు నాన్నతో నా జర్నీ ఫ్రెండ్స్లా సాగింది. నా చిన్నతనంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ నాన్న నా బెడ్ పక్కనే ఉండి సపర్యలు చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను..’ అంటూ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఐఈఎస్ఎస్డీ. మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రి ఇనుకొండ వెంకటేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. మా స్వస్థలం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం గ్రామం. నాన్న ఇనుకొండ వెంకటేశ్వరరావు(రిటైర్డు పోలీసు అధికారి), అమ్మ గంగభవానీ, అక్క లక్ష్మీమౌనిక. -
టీశాట్లో మస్కాపూర్ విద్యార్థుల కార్యక్రమం
ఖానాపూర్: విద్యారంగంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న పీఎంశ్రీ మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్కు మరో అరుదైన అవకాశం దక్కింది. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఈ ఏడాది పాఠశాలకు చెందిన 26 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రంలోనే పాఠశాల ప్రథమస్థానం సాధించింది. దీంతో హైదరాబాద్లో నిర్వహించిన టీసాట్ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానించారు. హెచ్ఎం జాడి శ్రీనివాస్ మాట్లాడుతూ 2018 నుంచి 2026 వరకు మొత్తం 145 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు ఎంపికయ్యారని తెలిపారు. టీశాట్ లైవ్ కార్యక్రమంలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రాముఖ్యతను వివరిస్తూ వివరించారు. విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, గణితం, సైన్స్, సామాజిక శాస్త్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికబద్ధంగా సిద్ధమైతే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోనగిరి నరేందర్, కుర్ర శేఖర్, వెన్నం అంజయ్య, షేక్ ఇమ్రాన్, రాపర్తి కిషన్ ప్రసాద్, సయ్యద్ ఫరాజ్, బడోల్ల రవి, జోగ్ధండ్ లక్ష్మణ్రావు, చట్ల విజయ్కుమార్ పాల్గొన్నారు. -
భూధార్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్టౌన్: భూధార్ సర్వేను పకడ్బందీగా నిర్వహించి, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో భూధార్ సర్వే చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సర్వేయర్లను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే భూభారతి దరఖాస్తులను 60 రోజుల గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. భూధార్ సర్వే నిర్వహణకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని, సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఏడీ ల్యాండ్ సర్వేయర్ నరసింహమూర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలినిర్మల్టౌన్: వర్షాకాలం ఆకస్మిక వరదలు సంభవిస్తే ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించి ప్రజలకు ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే వారికి ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయం చేస్తుందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అవసరమైన వసతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో రమేశ్రాథోడ్, ఆర్డీవో దేవీదాస్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ ముఖేశ్కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టాలినిర్మల్టౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించా రు. అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ, తిరిగి స్వీకరణ, తదితర అంశాలను పకడ్బందీగా చేపట్టా లన్నారు. బూత్ లెవెల్ అధికారులకు తప్పనిసరి గా అన్ని అంశాల పై అవగాహన ముఖ్యమన్నా రు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు చేపట్టిన చర్యలు, రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమావేశాల వివరాలు కలెక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. ప్రక్రియను మొత్తం కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించా లని తెలిపారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడు తూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ప్రక్రియకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వాతి పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
తానూరు: వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. తానూరు పీహెచ్సీ, కస్తూరిబా పాఠశాల, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీల నిర్వహణను శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిని సందర్శించి వైద్యుల వివరాలతోపాటు అందుబాటులో ఉన్న మందుల వివరాలను తెలుసుకున్నారు. ఓపీ సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి కుక్కకాటు, పాముకాటు వ్యాక్సిన్పై ఆరా తీశారు. కేజీబీవీని సందర్శించి వంట గదులతోపాటు విద్యార్థుల తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. పదో తరగతిలో 40 మంది విద్యార్థులకు 27 మంది హాజరయ్యారు. పూర్తిస్థాయిలో వచ్చేలా చూడాలని ప్రిన్సిపాల్ అలేఖ్యకు సూచించారు. నిత్యం మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు అన్ని స్కిల్స్ నేర్పించాలన్నారు. తర్వాత గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీధర్, ఎంఈవో నరేందర్, వైద్యులు అజిత్, సిబ్బంది ఉన్నారు. -
గ్రామం సుభిక్షంగా ఉండాలని..
బాసర: గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని బాసర గ్రామ పెద్దలు శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా దేవతలను ఆహ్వానించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. తీర్థప్రసాదాలు అందజేసి గ్రామస్తులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు నూకం లింగారావు మనోహర్రావు, గౌరవల్ల రాజులు, కొక్కుల గంగాధర్, దావు రాములు దేవేందర్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. -
పోలీసులకు సాంకేతిక బలం
నిర్మల్టౌన్: జిల్లా పోలీస్ శాఖను సాంకేతికంగా మరింత బలోపేతం చేయడం, ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు నూతన సాంకేతిక పరికరాలను అందజేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో కేసుల సంఖ్య పెరగడం, కంప్యూటర్లు, ట్యాబ్లలో వస్తున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ఈ పరికరాలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసుల వివరాలను వేగంగా నమోదు చేయడం, కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు సమన్వయ అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించడం ద్వారా న్యాయ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ పరికరాలు సహకరిస్తాయి. ఎస్పీ చేతులమీదుగా పంపిణీజిల్లాలోని పోలీస్ స్టేషన్లకు బార్కోడ్ స్కానర్లు, లే బుల్ ప్రింటర్లు, సింగిల్ డిజిట్ స్కానర్లు, ఫింగర్ ప్రింట్ బ్యూరో సిస్టమ్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, ప్రింటర్లను జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కా ర్యాలయంలో ఎస్పీ జానకీషర్మిల శుక్రవారం పంపి ణీ చేశారు. పోలీస్ శాఖను సాంకేతికంగా బలోపే తం చేసి, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పరికరాలను అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏవో యూనస్ అలీ, ఇన్స్పెక్టర్లు కృష్ణ, గోవర్ధన్రెడ్డి, స మ్మయ్య, ఆర్ఐ(అడ్మిన్) రామ్నిరంజన్రావు, ఎ స్సైలు జి.లింబాద్రి, శ్రీకాంత్, రవీందర్, గణేశ్, గోపి, శ్రావణి, హన్మాండ్లు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్లువ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడం, నేర చరిత్రను గుర్తించడం, అనుమానితుల వివరాలను తక్షణమే సేకరించడం, పెండింగ్ కేసుల ఛేదనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సింగిల్ డిజిట్ స్కానర్లు ఇవి వ్యక్తుల గుర్తింపును క్షణాల్లో ధ్రువీకరించడంతోపాటు, కేంద్రీకృత డేటాబేస్లతో సరిపోల్చి నేర చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. బార్కోడ్ స్కానర్లు..ముద్రించిన బార్కోడ్లను డిజిటల్ సమాచారంగా మార్చి రికార్డుల నిర్వహణ, సాక్ష్యాల ట్రాకింగ్ , ఇ తర పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేస్తాయి. లేబుల్ ప్రింటర్లుకేసు ఫైళ్లు, సాక్ష్యాధారాలు, ఇతర రికార్డులను కచ్చితంగా గుర్తించి నిర్వహించడంలో కీలకంగా ఉపయోగపడతాయి. -
ప్రతీరైతు కూరగాయలు సాగు చేయాలి
లోకేశ్వరం: ప్రతీ రైతు తనకున్న వ్యవసాయ భూమి లో కుటుంబానికి సరిపడా కూరగాయలు సాగు చేయాలని భైంసా డివిజన్ హార్టికల్చర్ అధికారి జావిద్ పాషా అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు ఐదు రకాల కూరగాయల విత్తనాల కిట్లను శుక్రవారం అందజేశారు. ఈసందర్భంగా జావిద్ పాషా మా ట్లాడుతూ రైతులు కూరగాయలు, పంట్ల తోటలు సాగు చేయాలన్నారు. రూ.500 విలువ చేసే టమాటా, మిర్చి, బెండ, పాలకూర, తోట కూరల విత్తనాలు 50 మంది రైతులకు ఉచితంగా అందజేశామన్నారు. ఏవో గిరిరాజ్, ఆత్మ చైర్మన్ గన్ను నర్సారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నకర్రావు, సర్పంచ్ దర్వా డి.కపిల్, మాజీ ఎంపీపీ లింగన్న, ఉద్యానశాఖ విస్తీర్ణ అధికారి మోహిన్, నాయకులు సుదర్శ న్రెడ్డి, కృష్ణారెడ్డి, సుధీర్రెడ్డి, భీంరావ్పటేల్, ఏఈ వోలు మౌనిక, సంగీత, రచన పాల్గొన్నారు. -
ప్రైవేటు వెంచర్కు సీసీరోడ్డు
సారంగపూర్: చించోలి(బి) గ్రామంలోని ఎక్స్రోడ్డు సమీపంలో ఉన్న ఆర్టీవో కార్యాలయం ప్రధాన రహదారి నుంచి సుమారు 400 మీటర్ల దూరంలో ఉంది. ఈ కార్యాలయానికి రహదారి సౌకర్యం క ల్పించేందుకు ఇటీవల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.25 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చేశా రు. అయితే ఆ రోడ్డు పనులను ఆర్టీవో కార్యాల యం వైపు చేయకుండా సమీపంలోని ఒక ప్రైవేటు వెంచర్వైపు మళ్లించి నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే సుమారు 15 మీటర్ల రహదారి పనులు పూర్తి చేశారు. ఈ అక్రమ మళ్లింపు విషయం తెలు సుకున్న గ్రామస్తులు వెంటనే గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. రాజకీయ అండదండలతోనే..ప్రైవేటు వెంచర్ ఒక రాజకీయ నాయకుడికి చెందిన ది కావడంతో, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వేయాల్సిన రోడ్డును తమ వెంచర్లోకి మళ్లించేందుకు అధికారులపై రాజకీయ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే రోడ్డు మంజూరు రావడం వల్ల గ్రామస్తులు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం విడుద ల చేసే నిధులను ఇలా పక్కదారి పట్టించడం సరి కాదని, దీనికి కారకులైన వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.ఆర్టీవో కార్యాలయానికి మళ్లించాం వాస్తవానికి సీసీరోడ్డు ఆర్టీవో కార్యాలయానికి మంజూరైంది. అయితే సదరు సీసీరోడ్డును ఆర్టీవో కార్యాలయం దారిలో వేయడానికి బదులు దానికి పక్కనే గల దారిలో వేశారని నా దృష్టికి వచ్చింది. వెంటనే పనులు నిలిపివేసి సదరు రోడ్డును ఆర్టీవో కార్యాలయానికి వెళ్లే దారిలో నిర్మించాలని కాంట్రాక్టర్కు సూచించాం. మెటీరియల్ మొత్తం ఆర్టీవో కార్యాలయం రహదారి వద్దకు మార్చి పనులు చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. – దేవీదాస్, పీఆర్ ఏఈ, సారంగాపూర్ -
రాజీతో కేసుల నుంచి విముక్తి
నిర్మల్టౌన్: తెలిసో తెలియకో చేసిన తప్పులకు కేసుల్లో ఇరుక్కుని.. ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాంటి వారికి సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తోంది. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులతోపాటు, వ్యాజ్యం ముందు దశలో ఉన్న సమస్యలను కూడా ఒక్క రోజులోనే పరిష్కరించుకునే అవకాశం ఈ వేదిక కల్పిస్తుంది. కోర్టుల్లో నిర్వహణ.. జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని తమ కేసులను రాజీ ద్వారా ముగించుకోవచ్చు. రాజీకి అనువైన కేసులులోక్ అదాలత్లో వివిధ రకాల కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. హాజరు కావడం ఎలా?లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకోవాలంటే ఫిర్యాదుదారు, నిందితుడు ఇద్దరూ సంబంధిత కోర్టులో హాజరు కావాలి. గుర్తింపు కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. కోర్టులో హాజరైన వెంటనే రాజీ ప్రక్రియ పూర్తి చేసి, ఒకే రోజులో కేసును ముగించుకోవచ్చు. సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి లభిస్తుంది. సాధారణ కోర్టు విచారణ అవసరం లేకుండా సులభంగా పరి ష్కారం సాధ్యమవుతుంది. న్యాయవాది ఫీజు లు, కోర్టు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. తక్కువ ఖర్చుతో శాంతియుతంగా వివాదా లను ముగించుకునే అవకాశం ఉంటుంది.కేసుల నుంచి విముక్తి.. కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అలదాత్ మంచి అవకాశం. వివాదాలు ఒక్కసారి ప్రారంభమైతే... జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. వాటిని త్వరగా పరిష్కరించుకోవాలి. రాజీపడదగిన కేసులను లోక్అదాలత్ లో పరిష్కరించుకోవా లి, కక్షిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. –జానకీషర్మిల, ఎస్పీ -
● దుక్కి నుంచి కోత వరకు ఖర్చులే ● వర్షం, దిగుబడి, ధరలపై అనిశ్చితి ● అప్పులు చేసి సిద్ధమవుతున్న రైతులు
భైంసా: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. జిల్లాలో రైతులు పత్తి, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటల సాగుకు రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి సాగు మొదలయ్యే ముందే రైతులపై పెట్టుబడి భారం గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ట్రాక్టర్ చార్జీలు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల వేతనాలు అన్నీ పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూమి సిద్ధం చేయడం నుంచే ‘అధ’నం..పొలాలను సిద్ధం చేసే దశ నుంచే రైతులకు భారం మొదలవుతోంది. మొదటి దుక్కి, రెండో దుక్కి, రోటావేటర్, గట్లు సరిచేయడం వంటి పనులన్నీ ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్నాయి. గతేడాది ఎకరాకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఉన్న ట్రాక్టర్ చార్జీలు ఈసారి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పెరిగాయి. రోటావేటర్ పనులకు కూడా అదనంగా రూ.500 నుంచి రూ.800 వరకు పెరిగింది. దీంతో భూమి సిద్ధం చేయడానికే రైతులు గతేడాదితో పోలిస్తే ఈసారి ఎకరాకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కూలీల కొరత, వేతనాల పెరుగుదల..వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. ఉపాధి హామీ పనులు, ఇతర ఉపాధి అవకాశాలు పెరగడంతో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం కష్టంగా మారింది. దీంతో వేతనాలు కూడా పెరిగాయి. గతేడాది మహిళా కూలీలకు రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు ఉన్న వేతనం ఇప్పుడు రూ.350 నుంచి రూ.450 వరకు చేరింది. పురుషులకు రూ.400 ఉన్న వేతనం ప్రస్తుతం రూ.500 నుంచి రూ.700 వరకు పెరిగింది. విత్తనాలు వేయడం నుంచి కోత వరకు అన్ని దశల్లో కూలీల ఖర్చు ఎక్కువైంది. పండిన పంట ఖర్చులకే.. ప్రతీ సంవత్సరం ఖర్చులు పెరుగుతున్నాయి. ట్రాక్టర్ నుంచి కూలీల వరకు అన్నింటికీ ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది. కానీ పంటకు ధర వస్తుందనే హామీ లేదు. వర్షం పడకపోతే మొత్తం పెట్టుబడి మట్టిలో కలిసిపోతుంది. రైతు జీవితమంతా అప్పులు, ఆశలు, ఆందోళనల మధ్యనే సాగుతోంది. – జంగం గణపతి, రైతుఅన్ని ధరలు పెరిగాయి.. మేము కూడా ఇష్టపడి చార్జీలు పెంచడం లేదు. డీజిల్, ఆయిల్, టైర్లు, విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగాయి. పాత రేట్లకు ట్రాక్టర్లు నడపడం గిట్టుబాటు కావడం లేదు. అందుకే ఈ ఖరీఫ్లో కొంత మేర చార్జీలు పెంచాల్సి వచ్చింది. – సాయినాథ్, ట్రాక్టర్ యజమాని 18ఎండీఎల్11,12. ట్రాక్టర్తో విత్తనాలు విత్తుతున్న రైతులుఇక పత్తి, సోయాబీన్ సాగుకు అవసరమైన విత్తనాలు, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు, సూక్ష్మపోషకాల ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది ఎకరాకు సగటున రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉన్న ఎరువుల ఖర్చు ఈసారి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు చేరింది. దీనితోపాటు పురుగుమందుల ఖర్చు కూడా పెరగడంతో మొత్తం పెట్టుబడి రైతులకు భారంగా మారింది. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు..చాలా మంది రైతులు బ్యాంకులు, సహకార సంఘాలు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి సాగుకు సిద్ధమవుతున్నారు. గత సీజన్లో ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో చాలామంది ఇంకా అప్పుల బాధలోనే ఉన్నారు. ఒకప్పుడు రూ.20 వూలలో పూర్తయ్యే ఎకరం పత్తి సాగు ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు చేరిందని రైతులు చెబుతున్నారు. సోయాబీన్ సాగులో కూడా ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. -
బాసర ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణ
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను గురువారం ఆర్కిటెక్చర్ అధికారులు మోతీలాల్, మాధవి పరిశీ లించారు. జూలై 5న నిర్వహించనున్న బాలాల యం ఏర్పాట్ల దృష్ట్యా రూ.150 అక్షరాభ్యాస మండపాన్ని సందర్శించి అవసరమైన సూచనలు చేశారు. ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్న రూ.150 అక్షరాభ్యాస మండపంలోనే బాలాలయం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ.వెయ్యి ప్రత్యేక అక్షరాభ్యాస కార్యక్రమాలూ ఇదే ప్రాంగణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.150 అక్షరాభ్యాస కార్యక్రమాలు ధ్యాన మందిరం లేదా పాత ఈవో కార్యాలయంలో కొనసాగనున్నాయని పేర్కొన్నారు. అమ్మవారి ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలు, సంప్రదాయ శిల్పకళా వై భవం ప్రతిబింబించేలా తీర్చిదిద్దేందుకు అన్ని వి ధాలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో అంజనాదేవి, నిర్మల్ ఏఈ శ్యామ్, ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి తదితరులున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం విస్తరించేలా..శృంగేరి పీఠాధిపతి శిష్యుల ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు బాలాలయం ఏర్పాటుకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తీసుకురానున్నాయి. మరోవైపు ఆల య నిర్మాణ పనులు చేపట్టిన డోనర్ 2027 జూన్ 1 నాటికి ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. ఆ లయ నిర్మాణంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక వాతావరణం మరింత విస్తరించేలా పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే బాసర క్షేత్రం దేశవ్యాప్తంగా మరింత ఆధ్యాత్మికంగా ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తెగని పోడు.. ఆగని పోరు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూముల సాగుదారులు, అధికారుల మధ్య పోడు రగడ రగులుతూనే ఉంది. ఏళ్లుగా ఏటా వానాకాలంలో విత్తనాలు వేసే వేళ అటవీ సిబ్బంది, ఆక్రమణదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇక వర్షాలు మొదలైతే గొడవలు మరింతగా జరిగే ఆస్కారం ఉంది. అటవీ ఆక్రమణలపై ఏళ్లుగా శాశ్వత పరిష్కారం లేక సమస్య జఠిలంగా మారుతోంది. ఆక్రమణ భూములు స్వాధీనంఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక లక్ష ఎకరాలకు పై నే అటవీ భూములు సాగులో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో గత మూడేళ్లుగా పోడు పట్టాలు ఇవ్వని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఘర్షణలు జరుగుతున్నాయి. మొదట గిరిజనేతరులకు ఐదు ఎకరాల కంటే అధికంగా సాగులో ఉన్నవారి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం, సాగుదారులను భూమి వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోనే 50వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. పులుల రాకపోకల కోసం తడోబా నుంచి కవ్వాల్ వచ్చేలా 1492చ.కి.మీ. కారిడార్గా గుర్తిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. అయితే అటవీ సమీప ప్రాంత వాసులపై మరింత ఆంక్షలు అమలు కావడంపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పత్తి సాగు ఆరంభంతో చెట్లు నరికి సాగు చేయడం పెరిగిపోయినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. పోడు రైతులు వెదురు, పండ్ల తోటలు, ఇతర ఆహార ధాన్యాల సాగే చేయాల్సి ఉంది. పూర్తి వాణిజ్య పంట పత్తిపైనే అధికంగా ఆధారపడుతున్నారు. పట్టాలిచ్చినా.. ఆగని పోరుగత సర్కారు జీవో 140 ప్రకారం పోడు చేస్తున్న గ్రామాలను గుర్తించింది. ఆ గ్రామాల్లోనే పోడు కమిటీలను ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరించి, గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పరిశీలన తర్వాత పట్టాలు జారీ చేసింది. ఇక గిరిజనుల్లోనూ అర్హులైన వారిని ఎంపిక చేసి 2023 జూన్లో పోడు పట్టాలు మంజూరు చేశారు. ఆ సమయంలో చాలామంది తమకు పట్టాలు రాలేదని మళ్లీ అర్జీలు ఇచ్చారు. ప్రధాన నిబంధనల్లో గిరిజనులను 2005 వరకు, గిరిజనేతరులను 1930కంటే ముందు సాగులో ఉన్నట్లుగా లేదా మూడు తరాల వారు ఆ భూమిని అనుభవిస్తున్నట్లుగా రుజువులు చూపించాల్సి రావడంతో అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 33వేల మంది గిరిజనుల చేతిలో 1.24లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు 32వేల మంది గిరిజనేతరుల చేతిలో 1.02లక్షల ఎకరాలు సాగులో ఉన్నట్లు అర్జీలు వచ్చాయి. అయితే గిరిజనేతరులు చట్టం ప్రకారం అనర్హలు కావడంతో వాటిని తిరస్కరించారు. అయినప్పటికీ తమకు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పట్టాలపై రాజకీయ కారణాలతో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. నిత్యం ఘర్షణలే..ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, కాగజ్నగర్, పెంచికల్పేట, చింతలమానేపల్లి, బెజ్జూరు, ఆదిలాబాద్, మావల, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, సోనాల, కడెం, ఉట్నూరు, జన్నారం, దండేపల్లి, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో అటవీ అక్రమాలపై నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఫారెస్టు సిబ్బంది, సాగుదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం దూషణ లు, ఎదురుదాడులు చోటు చేసుకుంటున్నా యి. కొన్ని సార్లు పోలీసు బందోబస్తుతో అటవీ అధికారులు సాగు ఆక్రమణలను తొలగిస్తున్నారు. దండేపల్లి మండలం కోయపోచగూడ, ఇటీవల చింతలమానేపల్లి మండలం దిందా, కడెం మండలం గొండుగూడ, కెరమె రి మండలం సుర్దాపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలం అల్లికోరి పరిధిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అటవీ అధికారులు సా గుదారులపై కేసులు సైతం నమోదు చేశారు. అయితే అర్హులైన వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. -
‘కోనో’ స్థానంలో కొత్తచెట్లు
జిల్లా కేంద్రంలోని రోడ్డు డివైడర్ల మధ్యనున్న కోనో కార్పస్ చెట్లు తొలగిస్తున్నారు. వీటి పుప్పొడితో శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పడమే దీనికి కారణం.అంతా గప్చుప్..! ట్రిపుల్ఐటీలో విద్యార్థిని ఆత్యహత్యాయత్నంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రిలో చికిత్స అందించిన అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. వర్షం కురిసే అవకాశముంది. -
ఆయిల్ పామ్ సాగుచేయాలి
లోకేశ్వరం: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి బీవీ రమణ సూ చించారు. గురువారం మండలంలోని పంచగుడి, వట్టోలి గ్రామాల్లో రైతులు సాగు చేసిన ఆయిల్ పామ్ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్కు ఎలాంటి తెగుళ్లు సోకినా వెంటనే ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు. పంట రాగానే జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లో విక్రయించాలని సూచించారు. ఉద్యానశాఖ భైంసా డివిజన్ అధికారి జావిద్ పాషా, ఆయిల్ పామ్ మేనేజర్ ఆశాష్, విస్తరణ అధికారి మోహిన్, క్లస్టర్ అధికారి సంతోష్ ఉన్నారు. -
చోటా.. చౌరాస్తా!
నిర్మల్: జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్నా నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంలేదు. ఆక్రమణల తొలగింపు అంతకన్నా లేదు. ఫ లితంగా ప్రధాన కూడళ్లూ పట్టణవాసులకు నిత్యం పరీక్ష పెడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎడమవైపు వెళ్లడానికి ఎక్కడా.. ‘ఫ్రీలెఫ్ట్’ రూట్ లేదు. ఎమర్జెన్సీలోనూ లెఫ్ట్వైపు వెళ్లాల్సిన వారూ గ్రీన్సిగ్నల్ వచ్చేదాకా వేచి చూస్తున్నారు. ఇక రెడ్సిగ్నల్ పడ్డా.. చాలామంది ఉల్లంఘిస్తూ వెళ్తున్నారు. ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లేకపోవడం, మున్సిపాలిటీలు పట్టణవాసులకు ఆటంకాలు లేని ప్రయాణానికి ఏర్పాట్లు చేయకపోవడం విడ్డూరమే. ఫ్రస్టేషన్లో పట్టణవాసి..!జిల్లాకేంద్రంలోని ప్రధాన చౌరాస్తాలు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి. రహదారులపై వ్యాపారులు, అక్రమ పార్కింగ్, తోపుడు బండ్లు, ఇతర ఆక్రమణల కారణంగా ఇరుకుగా మారాయి. దీంతో వాహనాలు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. నిత్యం ట్రాఫిక్ కష్టాలతో పట్టణవాసులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆఫీసులు, పాఠశాలలు, ఆస్పత్రులకు సమయానికి చేరుకోలేక పోతున్నారు. ట్రాఫిక్ జామ్లు, ఆక్రమణలు, రోడ్లపై అస్తవ్యస్త పార్కింగ్, సిగ్నల్ ఉల్లంఘనలు వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. సమస్యలు చాలా ఏళ్లుగా ఉన్నా శాశ్వత పరిష్కారం లేక తీవ్ర ఫ్రస్టేషన్కు గురవుతున్నారు. ఇటీవల సోషల్మీడియాలో అసహనా న్ని వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణపై మున్సిపాలిటీ, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. -
మొక్కకు చుక్క చేరేదెలా?
లక్ష్మణచాంద: ఈసారి ఎల్నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచి స్తుండగా రైతులు ఆందోళనకు గురవుతున్నా రు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు లాంటి ఆరుతడి పంటలు సాగు చే యాలని అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటివరకు భారీ వర్షాలు కురియలేదు. జూన్ సగం పూర్తైనా సరైన వ ర్షాలు లేక అన్నదాతలు పంటలు ఎలా సాగు చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నా రు. వరుణడి కరుణ కోసం నిత్యం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో త క్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సా గు చేయడానికి సూక్ష్మ సేద్యమే అనువైన పద్ధతి అని అధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో ప్రతీ నీటిబొట్టు మొక్కకు నేరుగా అందుతుంది. కాగా, బోరు బావులున్న రైతులు పసుపు, పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేశారు. వర్షాలు లేక డ్రిప్, రెయిన్ డ్రిప్ తదితర విధానాల్లో పంటలకు నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు. రాయితీ తగ్గించిన సర్కారుఈ ఏడాది రైతులకు ఇచ్చే సబ్సిడీని సర్కారు తగ్గించింది. గతేడాది వరకు ఎస్సీ, ఎస్టీలకు నూక్ష్మ సే ద్యం పరికరాలను 100శాతం రాయితీతో అందించింది. ప్రస్తుతం 10శాతం రాయితీని తగ్గించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం రాయితీ, బీసీలకు గతంతో 90 శాతం రాయితీ ఇవ్వగా ఈసా రి 80శాతం, జనరల్ రైతులకు గతంలో 80శాతం రాయితీ ఇవ్వగా ఈసారి 70శాతమే ఇస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులపై భారం పడనుంది.ఆయిల్ పామ్ వైపు మొగ్గుప్రస్తుతం సూక్ష్మ సేద్యం పరికాల కోసం వస్తున్న దరఖాస్తుల్లో రైతులు ఆయిల్ పా మ్ సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ట్లు తెలుస్తోంది. అయితే, పండ్ల తోటలు, కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నీటి ఎద్దడి సమయంలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో సూక్ష్మ సేద్యం పరికరాలను మంజూరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు డ్రిప్ పద్ధతిలో 23,498 ఎకరాలు, స్ప్రింక్లర్స్ విధానంలో 4,463 ఎకరాలు, సూక్ష్మ సేద్యం విధానంలో 27,961 ఎకరాలు సాగవుతున్నట్లు జిల్లా హార్టికల్చర్ అధికారులు తెలి పారు. అలాగే, 2026 సంవత్సరానికి డ్రి ప్ ఇరిగేషన్ లక్ష్యం 302 ఎకరాలు, స్ప్రింక్ల ర్స్ ద్వారా 452, ఆయిల్ పామ్ సాగు డ్రిప్ ద్వారా 2,632 ఎకరాలు ఉందని ఉద్యానవన అధికారులు పేర్కొన్నారు. -
పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు
నిర్మల్: వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నిశాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. బాసర వద్ద పాత పుష్కర ఘాట్లకు అ వసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు కొత్త ఘాట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్యాణకట్ట, పిండప్రదాన వేదికలు, దుస్తులు మార్చుకునే గదులను తక్షణమే నిర్మించా లని సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఘాట్ల సమీపంలో తాగునీటి సౌకర్యాన్ని సమృద్ధిగా కల్పించాలని దిశానిర్దే శం చేశారు. ఆయా శాఖల అధికారులు తమకు కే టాయించిన పనులకు సంబంధించిన సమగ్ర ప్రతి పాదనలను వెంటనే సిద్ధం చేయాలని సూచించా రు. ఈ సందర్భంగా బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ పై కూడా చర్చించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, బాసర ఆలయ ఈవో అంజనాదేవి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వొద్దుప్రభుత్వ వసతిగృహాల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్లో బాలికల ఆశ్రమాన్ని గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి తెలుసుకున్నారు. మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించాలని సూచించా రు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆయా సబ్జెక్టుల్లో వారి సామర్థ్యాలను పరీక్షించారు. డీఈవో భోజన్న, అధికారులున్నారు. -
ఊరిస్తున్న మబ్బులు
లోకేశ్వరం: పగలు ఎండలు భగభగ మండిపోతున్నా సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకుంటున్నాయి. కాసేపటికే మేఘాలు మాయమై రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. ఇది వారంరోజులుగా జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి. తొలకరి చినుకులకు గంపెడాశతో పత్తి, సోయా, మొక్కజొన్న, పసుపు విత్తిన రైతులకు నిరాశే మిగిలింది. చినుకు జాడ లేక పురుడు పోసుకున్న మొక్కలు వాడిపోతున్నాయి. రెండుమూడ్రోజుల్లో వర్షం కురవకపోతే ఎండిపోయే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. మరి కొన్నిచోట్ల భూమిలోనే గింజలు డొల్లబారుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వరుణుడు కరుణించేనా?
లక్ష్మణచాంద: వరుణుడి కరుణ కోసం అన్నదాతలు నిత్యం నిరీక్షిస్తున్నారు. జూన్ ప్రారంభమై పక్షం రో జులు గడిచినా ఇప్పటివరకు ఒక్క భారీ వర్షం కురువకపోవడంతో దిగులు చెందుతున్నారు. ఈ రోజైనా వర్షం పడకపోతుందా.. అని రోజూ ఆకాశానికేసి ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 80శాతం మంది వ్య వసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. విత్తనా లు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులు వానాకా లం సాగుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. బోర్లున్న రైతులు మాత్రం ఇప్పటికే మొక్కజొన్న, పత్తి, పసుపు విత్తనాలు వేశారు. ఎల్నినో ప్రభావంతో జూన్ ప్రారంభమై పక్షం రోజులు గడిచినా ఒక్క భారీ వర్షం పడకపోగా ఇంకా ఎండలు దంచి కొడుతూనే ఉన్నాయి. జిల్లాలో వర్షపాతం ఇలా.. జిల్లాలో గతేడాది జూన్లో సాధారణ వర్షపాతం 49.1 మి.మీటర్లుగా కాగా, జూన్ 15వరకు 7.4 మి.మీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈసారి జూన్లో సాధారణ వర్షపాతం 77.4 మి.మీ టర్లు కాగా, ఈ నెల 16వరకు 51.2 మి.మీటర్లుగా నమోదైందని పేర్కొన్నారు. దీంతో సాధారణ వర్షపాతం కంటే 34 మి.మీటర్లు తక్కువగా నమోదైనట్లు పేర్కొంటున్నారు. జిల్లాలో పంటల సాగు వివరాలు పత్తి 1.70 లక్షల ఎకరాలు వరి 1.40 లక్షల ఎకరాలు సోయా లక్ష ఎకరాలు మొక్కజొన్న 20వేల ఎకరాలు పసుపు 9వేల ఎకరాలు ఇతర పంటలు వెయ్యి ఎకరాలు మొత్తం సాగు విస్తీర్ణం 4.40లక్షల ఎకరాలు -
ఇంకెన్నాళ్లీ ట్రా‘ఫికర్’?
నిర్మల్: నిర్మల్ బస్టాండ్ ఏరియా దారుణంగా ఉంది. పాతబస్టాండ్ రోడ్డు నుంచి ప్రధాన రహదారికి వచ్చే సందు మొదలు అంబేడ్కర్చౌక్ దాకా రోడ్డు కు ఇరువైపులా గందరగోళంగా ఉంటుంది. రెండువైపులా దుకాణాలు, పండ్ల బండ్లు ఫుట్పాత్ దాటి రోడ్లపైకి వచ్చాయి. బస్టాండ్ గేట్లను ఆనుకునే దు కాణాలు పెట్టడమనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు. వి క్రయదారులతోపాటు కొనుగోలుదారుల వాహనా లూ ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు పై వెళ్లే వాహనాలకు, బస్టాండ్లో నుంచి వచ్చే బ స్సులకు చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. బస్టాండ్ ఇన్, అవుట్ గేట్ల వద్ద యూటర్న్ తీసుకోవడం కష్టంగా ఉందని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు. గందరగోళంగా వివేక్చౌక్ బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి బయటపడ్డామనుకునేంత లోపే వివేక్చౌక్–పాతబస్టాండ్ ప్రాంతం అంతకుమించి గందరగోళంగా ఉంటోంది. ప్రధాన రహదారిపైగల ఈ వై జంక్షన్లో బ స్టాండ్, శివాజీచౌక్, పాతబస్టాండ్, మయూరి హోట ల్ సందు.. ఇవన్నీ ఒకేచోట కలుస్తాయి. ఇక్కడ సి గ్నల్వ్యవస్థ కూడా లేదు. ఏ దిక్కు నుంచి ఏ వాహనమొస్తుందో, ఎటువైపు నుంచి ఎవరు ఢీకొడతారో నన్న ఆందోళన కలిగిస్తోంది. ఇవి చాలవన్నట్లు ఇ క్కడ పండ్ల బండ్లు, కూరగాయలు ప్రధాన రహదా రిపైనే విక్రయిస్తున్నారు. మయూరి హోటల్ పా ర్కింగ్ వాహనాలు, పాతబస్టాండ్ షాపింగ్ కోసం వచ్చినవారి వెహికిల్స్ రాకపోకలకు అటంకంగా మారుతున్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ మినీస్టేడియం వైపు నుంచి యూటర్న్ తీసుకునే చోటే రోడ్డుపై పండ్ల దుకాణాలు పెట్టారు. స్కూల్ బస్సులు, కార్లు యూటర్న్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతోంది. వెండింగ్జోన్ ఏర్పాటెప్పుడో! జిల్లాకేంద్రంలో ఇష్టానుసారం తోపుడుబండ్లు, దు కాణాలు ఏర్పాటు చేయడంతోనే ట్రాఫిక్ కష్టాలు ఏ ర్పడుతున్నట్లు గతంలోనూ పాలకులు, అధికారులు గుర్తించారు. ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు, తోపుడుబండ్ల కోసం ప్రత్యేకంగా వెండింగ్జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు. కానీ, ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. కూరగాయల మార్కెట్ వద్దా ప్రతీ ఉదయం వాహనాల రాకపోకలకు ఇబ్బందవుతోంది. కూరగాయ ల మార్కెట్తో పాటు పండ్ల మార్కెట్నూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. వీటితోపాటు రోడ్లపై ఆక్రమణలను తొలగిస్తేనే ట్రా‘ఫికర్’ తీరుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. ‘ఒకదిక్కు ఆటోలు రోడ్డుమీదనే.. ఇటు సగం పండ్ల దుకాణాలూ అట్లనే.. మిగతా సగం దారిలో పోదామంటే ఎదురుగా రాంగ్రూట్లో వస్తున్నారు.. వాళ్లను తప్పించుకుని యూటర్న్ తీసుకుందామంటే ఆవైపు దుకాణాలూ.. సగం రోడ్డుపైనే.. ఆ లొల్లిల బండి మలుపుదామంటే సుక్కలు కనిపించినయ్.. ఇదేం నిర్మల్రా బాబు..! పేరుకు ఊరుకు సంబంధమే లేదు’ అంటూ అడెల్లిలో పండుగ ఉందంటే నిర్మల్కు వచ్చిన నిజామాబాద్వాసి సందీప్ చిరాకు, చికాకు పడుతూ బంధువులను ప్రశ్నించాడు. ఇవి నిత్యం నిర్మల్ ప్రజలు పడుతున్న పాట్లు. పేరుకు జిల్లాకేంద్రమైనా కనీసం ట్రాఫిక్ నియంత్రణ, నిబంధనలు పాటించేవారు, పట్టించుకునేవారే లేరు. అన్ని చౌరస్తాలూ అంతే.. అంబేడ్కర్ చౌరస్తా, జయశంకర్సార్ సర్కి ల్, ఆర్డీవో ఆఫీస్, రాంజీగోండు జంక్షన్, శివాజీచౌక్, ఈద్గాంచౌరస్తా.. ఈ ఏరియాలన్నీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఈ చౌరస్తాలు విశాలంగా లేకపోవడం, దుకాణాలు రోడ్లపైనే ఉండటం ట్రాఫిక్ సమస్యకు కారణంగా చెప్పవచ్చు. శివాజీచౌక్, జయశంకర్సార్ సర్కిల్, ఈద్గాంలో సిగ్నల్ వ్యవస్థ ఉన్నప్పటికీ చాలామంది పాటించడం లేదు. రెడ్ సిగ్నల్ పడ్డా.. అలాగే వెళ్లిపోతున్నారు. ఇక ఈ చౌరస్తాల్లో ఎడమవైపు వెళ్లాల్సిన వారి కోసం ‘ఫ్రీ లెఫ్ట్’ ఏర్పాట్లూ లేవు. -
శాంతిఖని దశ తిరిగేనా?
బెల్లంపల్లి:బొగ్గు ఉత్తత్తిలో బెల్లంపల్లిలోని శాంతిఖని గనిది సుదీర్ఘ ప్రస్థానం. 72 ఏళ్లుగా తవ్వకాలు జరుపుతున్నా మరో రెండు దశాబ్దాలకు పైగా సరిపడా బొగ్గు నిల్వలు ఉండడం విశేషం. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తికి ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితులు సంకటంగా మారుతున్నాయి. ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతున్నా ముందుకు సాగుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ గనిలో ఉన్న నల్ల బంగారాన్ని పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు సింగరేణి యా జమాన్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకుంటూనే విదేశీ ప్రైవే ట్ సంస్థల సహకారం ఆశిస్తోంది. ఇందులో భాగంగా కొన్నాళ్ల క్రితం జా య్ మైనింగ్ సర్వీసెస్ (జేఎంఎస్) ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకుని బొగ్గు ఉత్పత్తి కోసం చేసిన యత్నాలు సత్ఫలితాలు ఇవ్వలేదనే అసంతృప్తి ఉంది. ఆ క్రమంలోనే సింగరేణి, జేఎంఎస్ మధ్య పొరపొచ్చాలు రావడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. సింగరేణితో చేసుకున్న ఒప్పందం రద్దుకు జేఎంఎస్ యత్నాలు సాగిస్తుండగా యా జమాన్యం కూడా అంతేస్థాయిలో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మరో ప్రైవేట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నా రు. ఆ సంస్థ ప్రతినిధి బృందం ఈ నెల 10న గనిలో దిగి పనిస్థలాలను, భూగర్భ భౌగోళిక పరిస్థితులను ప్రాథమికంగా పరిశీలించి ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం రెండు నెలల్లో వెల్లడిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పి వెళ్లగా ఏ నిర్ణయం తీసుకుంటారోనని గని అధికారులతో పాటు కార్మికులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. విఫలమైన ఆధునిక యంత్ర ప్రయోగాలు బొగ్గు అధికోత్పత్తి చేయాలనే ఉద్దేశంతో గనిలో ఆధునిక యంత్రాలను ప్రయోగాత్మకంగా దింపారు. కంటిన్యూయస్ మైనర్ (సీఎం) యంత్రాన్ని ప్రవేశ పెట్టినా ఏమాత్రం స త్ఫలితాలు ఇవ్వలేదు. ఆ యంత్రం కోసం భూగర్భంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎంతగా శ్రమించినా ఆ యంత్రం ఆశలు నెరవేర్చక పోగా తీవ్ర నిరాశకు గురి చేసింది. చివరకు ఆ యంత్రాన్ని ఆర్జీత్రీ ఏరియాకు తరలించారు. అదేక్రమంలో జేఎంఎస్ విదేశీ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని బోల్టర్ మైనర్ (బీఎం) యంత్రాన్ని తె చ్చారు. ఇదికూడా సరిగా పనిచేయకపోవడంతో ఆ శలపై నీళ్లు చల్లించింది. ప్రస్తుతం ఎస్డీఎల్ యంత్రాలతో అతికష్టంగా బొగ్గు వెలికితీత ప్రక్రియ కొనసాగిస్తున్నా లక్ష్యాన్నీ చేరుకోలేక చతికిల పడుతున్నట్లు తెలుస్తోంది. మిగిలి ఉన్న 43 మిలియన్ ట న్నుల్లో 13 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను కంటీ న్యూయస్ మైనర్ యంత్రం ద్వారా, 30 మిలి యన్ టన్నుల బొగ్గును లాంగ్ వాల్ ప్రాజెక్టు ద్వారా వెలికి తీయాలని చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. గనిని లాంగ్వాల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. కొ త్తగా షార్ట్వాల్ ప్రాజెక్టు తెరమీదకు తెచ్చినా అ దికూడా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలి యా కంపెనీపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. శాంతిఖని భూగర్భంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 43 మిలియన్ టన్నుల బొగ్గు సంపద ఉన్నట్లు సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం అధికారులు చేసిన సర్వేలో గుర్తించారు. గనిలో ప్రస్తుతం 450 మీటర్ల లోతులో పనిస్థలాలు ఉన్నాయి. అంతదూరం వెళ్లి బొగ్గు వెలికి తీయాల్సివస్తుండగా భూగర్భ భౌగోళిక పరిస్థితులు, గాలి సరఫరా, తదితర సమస్యలు అశాంతికి గురి చేస్తున్నాయి. భూగర్భంలో దిగి పని స్థలాలకు చేరుకునే లోపే కార్మికులు అలసి పోతున్నారనే ఉద్దేశంతో శాంతిఖనికి అనుబంధంగా రూ.22 కోట్లు వ్యయం చేసి షాప్ట్ వైండింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షాప్ట్ వైండింగ్ ద్వారా కార్మికులు గనిలో దిగి విధులు నిర్వహించడం ఊరట నిస్తోంది.ఆస్ట్రేలియా కంపెనీపైనే.. గనిలో దిగి పనిస్థలాలను పర్యవేక్షించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం గనిలో ఉన్న బొగ్గు నిల్వలను పూర్తిస్థాయిలో వెలికితీయడం సాధ్యమేనని సూచనప్రాయంగా తెలిపింది. సమగ్రంగా అధ్యయనం చేసి రెండు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ బృందం పరిశీలించిన అంశాలు, వ్యక్త పరిచిన అభిప్రాయాలు గని భవిష్యత్కు దోహదపడతాయనే ఆశాభావంతో ఉన్నాం. – సంజయ్కుమార్ సిన్హా, శాంతిఖని గని మేనేజర్ -
ఆర్జీయూకేటీ విద్యార్థినికి గాయాలు
బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ(ఐఐఐటీ)లో ఓ విద్యార్థిని బుధవారం హాస్టల్–1 భవనం పై నుంచి కిందపడిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బాగ్లీ హష్మతాబేగం పీ1 చదువుతోంది. బాలికల హాస్టల్ భవనంపై నుంచి కిందపడినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనకు గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను యాజమాన్యం అధికారికంగా వెల్లడించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కాసిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని లంబాడితండాకు చెందిన దిలావత్ బూర్యానాయక్ (51) బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఎల్లారం వైపు వెళ్తుండగా ఎదురుగా బైక్పై వచ్చిన పోడెటి సమ్మయ్య ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుమార్తె అజ్మీర సమీర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఆగిఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్నిర్మల్రూరల్: మండలంలోని ఎల్లాపల్లి ఎక్స్రోడ్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు రూర ల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు మేకల లోడుతో వస్తున్న వ్యాన్ ఎల్లపల్లి ఎక్స్రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో వ్యాన్లో విశ్రాంతి తీసుకుంటున్న మధ్యప్రదేశ్కు చెందిన డ్రైవర్ మున్నాఖాన్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న సతీష్ యాదవ్ గాయాల పాలయ్యాడు. వ్యాన్లో ఉన్న షేక్ అఖిల్, సోహెల్కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ కృష్ణ పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ‘బస్సు యాత్రను అడ్డుకుంటాం’ఇంద్రవెల్లి: ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఆదివాసీ గిరిజన బస్సుయాత్రను అడ్డుకుంటామని తుడుందెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుర్క బాపురావ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 79 ఏళ్ల స్వాతంత్య్ర పాలనలో పాలకవర్గ రాజకీయ పార్టీలు ఆదివాసీల అభివృద్ధికి పాటుపడకుండా వారిని అణగదొక్కే విధానాలకు పాల్పడుతున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన లంబాడీలు అక్రమంగా ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది రాజకీయ బలంతో ఉద్యోగాలు దక్కించుకున్నారన్నారు. టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శంకర్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించే బస్సు యాత్రను ఆదివాసీలందరు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. సమావేశంలో గోండ్వాన పంచాయతీ రాయిసెంటర్ రాష్ట్ర మేడి మెస్రం దుర్గు, ఆదివాసీ సంఘాల నాయకులు సెడ్మకి రామారావ్, కోరెంగ సీతారాం, మడావి శేకు, దుర్వ హన్ను, సోయం వినోద్, భీంరావ్, ఇంద్రు, తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
విద్యుత్తో జర భద్రం విద్యుత్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా విద్యుదాఘాతంతో ప్రాణాలు పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.ఫిర్యాదుల సత్వర పరిష్కారానికే ప్రజావాణి భైంసాటౌన్: ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. పట్టణంతోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 11 ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత ఎస్హెచ్వోలను ఆదేశించారు. అలాగే, భరోసా కేంద్రంలో కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు. నిర్మల్/భైంసా: తమ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మంచి భోజన వసతులూ ఉంటాయన్న ఉద్దేశంతోనే చాలామంది తల్లిదండ్రులు ట్రిపుల్ఐటీ, కే జీబీవీలు, గురుకులాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూ పుతున్నారు. వాటిలో చదువు, వసతి బాగానే ఉంటున్నా.. చాలా సందర్భాల్లో భోజనం విషయంలో నే ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో నాణ్యతలేని సరుకులు, పాడైన కూరగాయలు, కుళ్లిన గుడ్లను ఉపయోగించడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాత ఘటనలు మరిచిపోకముందే తాజాగా బాసర ట్రిపుల్ఐటీ మెస్ల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు తినే ఆహారంలో బొద్దింక రావడం విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులనూ కలవరపరుస్తోంది. నాణ్యత లోపంతో.. బాసర ట్రిపుల్ఐటీ మెస్లతో పాటు కేజీబీవీలు, గురుకులాలు, సంక్షేమశాఖల వసతిగృహాల్లో చాలా వరకు నాణ్యతలేని సరుకులు, నాసిరకమైన నూనెలు, తక్కువధరకు తీసుకువచ్చిన కూరగాయలు, కాలం చెల్లిన వస్తువులను వాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ట్రిపుల్ఐటీలో జరిగిన ఫుడ్పాయిజన్ ఘటన తర్వాత మెస్ లను పరిశీలిస్తే కుళ్లిన కోడిగుడ్లు, కాలం చెల్లిన గో ధుమ, శనగపిండి, ఉప్మారవ్వ, నాసిరకమైన నూనెలు వాడుతున్నట్లు తేలింది. అలాగే, చాలారోజుల పాటు స్టోరేజీ చేసిన వస్తువుల్లో పురుగులు, బూజుపట్టినా వాటిని అలాగే వంటల్లో వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా బుధవారం కుంటాలలోని ఆదర్శపాఠశాలను కలెక్టర్ భవేశ్మిశ్రా తనిఖీ చేయగా, సరుకులను భద్రపర్చే స్టోర్రూమ్ అపరిశుభ్రంగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. ఆందోళన చేసినా మార్చలేదు బాసర ట్రిపుల్ఐటీలో 2022లో జరిగిన ఫుడ్పాయిజన్ ఘటన, అంతకు కాస్తముందు కూరల్లో కప్పలు, అన్నంలో పురుగులు రావడంతో సదరు మెస్ నిర్వాహకులను మార్చాలంటూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. అప్పట్లో ఉన్న ప్రభుత్వం వారిని మారుస్తామంటూ ప్రకటించింది. ఇస్కాన్ వాళ్లకు లేదంటే ఐకేపీ మహిళలకు ఇవ్వాలన్న చర్చలు చేసింది. కానీ, రాజకీయ ప్రభావంతో కొన్నిరోజులకు మళ్లీ పాతవారినే కంటిన్యూ చేసింది. తాజాగా సదరు మెస్లోనే ఆలూకూర్మలో బొద్దింక రావడం గమనార్హం. రెండేళ్లక్రితం ఫుడ్పాయిజన్తో ఆస్పత్రి పాలైన నర్సాపూర్(జీ) కేజీబీవీ విద్యార్థినులు ఎస్ఐఆర్ కోసం హెల్ప్డెస్క్ భైంసాటౌన్: ఓటరు ప్రత్యేక జాబితా సవరణ ప్రక్రియపై సందేహాల నివృత్తికి పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ ఏర్పా టు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజల్లో నెలకొన్న అనుమానాల నివృత్తితోపాటు అవసరమైన సహాయం అందించేందుకు దీనిని ఏర్పా టు చేసినట్లు సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్కుమా ర్ తెలిపారు. కార్యాలయ పని వేళల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ–కేవైసీ పూర్తి చేయాలి నిర్మల్టౌన్: ఈ నెల 30లోపు ఈ–కేవైసీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అధికా రులు, ఎల్పీజీ డీలర్లతో సమావేశమై మాట్లాడారు. ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులను గుర్తించి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా వినియోగదారులకు తెలు పాలని పేర్కొన్నారు. గడువు ప్రక్రియ పూర్తి చేయని ఎల్పీజీ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు. భోజనం, వసతితో కూడిన విద్యాలయాలు, వసతిగృహాలను ఉన్నత, సంబంధిత అధికారులు తరచూ పర్యవేక్షించాలి. కానీ.. జిల్లాలో ఇలాంటి పర్యవేక్షణ కొరవడడం ఫుడ్పాయిజన్ లాంటి ఘటనలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సీరియస్ ఘటనలు, ఆందోళనలను ట్రిపుల్ఐటీ అధికారులు విస్మరిస్తుండటంతోనే మళ్లీ భోజనంలో బొద్దింకలు వచ్చే పరిస్థితి ఏర్పడినట్లు ఆరోపణలున్నాయి. అలాగే, జిల్లాలోని కస్తూరిబా పాఠశాలలు, గురుకులాలు, ఆదర్శపాఠశాల, వసతిగృహాలనూ తరచూ పర్యవేక్షించాల్సి న అవసరముంది. ఇక విద్యార్థులకు పెట్టే ముందు భోజనాన్ని సంబంధిత సిబ్బంది తిని, పరిశీలించాలి. కానీ.. చాలాచోట్ల ఇలా చేయడం లేదు. వీటితో పాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కూడా తరచూ పర్యవేక్షించాల్సిన అవసరముందన్న వాదన పెరుగుతోంది. నర్సాపూర్(జీ) కేజీబీవీలో 63 మందికి.. నర్సాపూర్(జీ) మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో 2024 ఏప్రిల్లో రాత్రిపూట ఫుడ్పాయిజన్ అయ్యింది. ఈ ఘటనలో దాదాపు 63మంది వరకు విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది, స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రులకు తరలించారు. నిర్మల్ ఆస్పత్రిలో 39, నర్సాపూర్లో 23 మందికి చికిత్స అందించారు. ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉండటంతో వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. కొరవడిన పర్యవేక్షణ -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
దండేపల్లి: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నెల్కివెంకటాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొమ్మెన సుమంత్ (23) డిగ్రీ మధ్యలోనే ఆపేసి, కూలీ పనులకు వెళ్తున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. సదరు యువతి అతని ప్రేమను నిరాకరించింది. దీంతో అతను కొద్దిరోజులుగా ఇంట్లో దిగాలుగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. ఇంతలో పక్కింటికి వెళ్లిన తల్లి సత్తవ్వ ఇంటికి వచ్చి గది తలుపులు తెరిచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కుంటాల: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. బుధవారం కుంటాల ఆదర్శ పాఠశాలను సందర్శించారు. 50 మంది విద్యార్థులే హాజరు కావడంతో ప్రిన్సిపాల్ రాజును ప్రశ్నించారు. తరగతులవారీగా ఉపాధ్యాయులను పిలిపించి పాఠశాలలు ప్రారంభమై మూ డురోజులైనా హాజరు శాతం తక్కువగా ఉండడంతో అసహనం వ్యక్తంజేశారు. తల్లిదండ్రులతో మా ట్లాడి హాజరు శాతం పెంచాలని సూచించారు. మ ధ్యాహ్న భోజన సరుకుల నిల్వ గది అపరిశుభ్రంగా ఉండడంతో ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీస్ జారీ చే యాలని డీఈవో భోజన్నను ఆదేశించారు. విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక అంశాలపై అవగా హన కల్పించాలని, నాణ్యమైన భోజనం అందించా లని సూచించారు. అనంతరం కుంటాల పీహెచ్సీ ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. కుంటాలలో జూనియర్ కళాశాలకు పక్కా భవనం నిర్మించాలని వెంకటేశ్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ప్రీప్రైమరీ స్కూల్లోనే తొలి అభ్యాసం ప్రీప్రైమరీ పాఠశాలల్లోనే పిల్లలకు తొలి అభ్యాసం అందుతుందని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. మండలంలోని అందకూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రీప్రైమరీ పాఠశాలను సర్పంచ్ అర్రోజు ప్రవళితో కలిసి ప్రారంభించారు. సామాజిక నైపుణ్యాలు, ఆటపాటలతో కూడిన విద్య, భాషా నైపుణ్యం, సృజనాత్మకత, శారీరక, మానసిక ఎదుగుదలకు ప్రీప్రైమరీ పాఠశాలలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. డీఎంహెచ్వో రాజేందర్, డీఈవో భోజన్న, తహసీల్దార్ కమల్సింగ్, ఎంపీడీవో వనజ, ఎంఈవో ముత్యం, సర్పంచులు జక్కుల గజేందర్, హెచ్ఎం సిద్ధిరాం తదితరులున్నారు. -
పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి
లక్ష్మణచాంద: పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ ఆదేశించారు. బుధవారం సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామాన్ని ఆకస్మీకంగా సందర్శించారు. సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించి తడి, పొడి చెత్త వేరు చేస్తున్న తీరును గమనించారు. సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు విక్రయించి గ్రామపంచా యతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరి శీలించారు. అనంతరం సోన్ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై పారిశుద్ధ్య పనులపై పలు సూచనలు చేశారు. వనమహోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటి సంరక్షించేలా అవగాహన క ల్పించాలని సూచించారు. డీపీవో శ్రీనివాస్, ఇన్చా ర్జి ఎంపీడీవో జ్యోతి, సోన్ సర్పంచ్ వనజ, పాక్పట్ల పంచాయతీ కార్యదర్శి విజయ్ తదితరులున్నారు. -
గంజాయి కేసులో నలుగురి అరెస్టు
చెన్నూర్: గంజాయి కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బుధవారం ఎస్సై శ్యాంపటేల్, సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన నితిన్, క్రాంతి, మైనర్ బాలుడు ఎదుల్లబంధంకు చెందిన దీపక్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నారన్నారు. 160 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, 1500 నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలి పారు. బాలుడు నెలరోజుల క్రితం గంజాయికి బా నిస కావడంతో 15 రోజుల పాటు మంచిర్యాలలోని డీఅడిక్షన్ సెంటర్కు పంపించామ ని, అతనిలో ఎలాంటి మార్పురాకపోవడంతో కేసు నమోదు చేసి జువైనల్ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. -
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణాలు, నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధా న రహదారులు, పట్టణాల్లో 25 ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చే శారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు 20 పోలీస్స్టేషన్ల పరిధిలో చేపట్టిన నాకాబందీలో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్య క్తుల వేలి ముద్రలు సేకరించారు. డ్రంకెన్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, సరైన పత్రాలు లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. మోసగించిన కేసులో మహిళ అరెస్ట్ఆదిలాబాద్టౌన్: డబ్బులు తీసుకుని ఇవ్వకుండా మోసగించిన కేసులో పట్టణంలోని బృందావన్కాలనీకి చెందిన దాసరి జ్యోతిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. గతేడాది శాంతినగర్కు చెందిన కొత్తపల్లి సంతోష్ అనే వ్యక్తికి బొజ్జ లసుంబాయి భూమిని విక్రయించింది. ఇందులో దాసరి జ్యోతి మధ్యవర్తిగా ఉంది. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని బాధితురాలికి ఇవ్వకుండా రేపు..మాపంటూ ఇబ్బందులకు గురిచేస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇది వరకే కేసు నమోదు కాగా బుధవారం అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
పునరావాస సమస్యల పరిష్కారానికి చర్యలు
ఉట్నూర్రూరల్: గిరిజనుల పునరావాస సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. కడెం మండలానికి చెందిన గోండు గిరిజనులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం మాజీ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో పీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లా అటవీ అధికారి, కలెక్టర్, ఆర్డీవో, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గిరిజనుల సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల, హక్కుల పరిరక్షణకు ఐటీడీఏ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కార మార్గాలు వేగవంతం అవుతాయన్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నివేదికలను సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు వెల్లడించారు. -
టీజీపల్లెలో రేబీస్ కలకలం!
జన్నారం: మండలంలోని టీజీపల్లెలో రేబీస్ వ్యాధి కలకలం రేపుతోంది. వార ం రోజుల క్రితం వ్యాధి సోకిన కుక్క మృతి చెందడంతో పంచాయతీ సిబ్బంది కళేబరాన్ని పూడ్చిపెట్ట కుండా వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుక్క కళేబరాన్ని పాతిపె ట్టకపోవడంతో ఇతర శునకాలు దానిని తిన్నాయని, అనంతరం అవి గేదెలను నాకడంతో వ్యాధి వ్యాప్తిచెంది ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేబీస్ లక్షణాలతో బుధవారం రెండు గేదెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రవి అనే రైతుకు చెందిన ఆవుదూడ మృతి చెందగా అనుమానంతో పాతిపెట్టినట్లు చెబుతున్నాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, గ్రామ పాలకులు స్పందించి తగు చ ర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై పశువైద్యాధికారి శ్రీకాంత్ను సంప్రదించగా రేబీస్ సోకినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఇతర శునకాలకుగానీ గేదెలకు గానీ రేబీస్ సోకితే 15 రోజుల్లో లక్షణాలు బయటకు కనిపిస్తాయన్నారు. గంజాయి విక్రేతలపై కేసుఆదిలాబాద్టౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిపై వేర్వేరుగా కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్గూడకు చెందిన షేక్ షాబీర్ మహారాష్ట్రలోని యావత్మాల్ నుంచి గంజాయి తీసుకువచ్చి ఆదిలాబాద్లో విక్రయిస్తున్నాడు. బుధవారం తనిఖీ చేయగా అతని వద్ద 70 గ్రాముల గంజాయి లభించింది. కేసు నమోదు చేసి డిఅడిక్షన్ సెంటర్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మహాలక్ష్మివాడకు చెందిన షేక్ మసూద్పై ఫిబ్రవరిలో గంజాయి కేసు నమోదైంది. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఖానాపూర్ చెరువు వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద 2 గ్రాముల గంజాయి లభించింది. నిందితుడిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. -
నకిలీ పత్తి విత్తన వ్యాపారిపై పీడీయాక్టు
బెల్లంపల్లి: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్న ఓ వ్యాపారిపై పోలీసులు పీడీయాక్టు చట్టాన్ని ప్రయోగించారు. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా బుధవారం వివరాలు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వూస సుబ్బారావు కమిషనరేట్ పరిధిలోని తాండూర్, భీమిని, భీమారం, బెల్లంపల్లి, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో ఏజెంట్లను నియమించుకుని నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నాడు. ఈ ఏడాది అతనిపై రెండు పీడీయాక్టు కేసులు నమోదయ్యాయి. తాండూర్, భీమారం పోలీస్స్టేషన్ల పరిధిలోని రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసినట్లు రూఢీ కావడంతో నిందితుడిపై పీడీయాక్టు అమలు చేస్తూ సీపీ అంబర్ కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. తాండూర్ సీఐ ఎన్.దేవయ్య, ఎస్సై ప్రసాద్ ఉత్తర్వుల ప్రతిని అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. 2021 నుంచి 2025 వరకు నకిలీ పత్తి విత్తనాల రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన అనేక క్రిమినల్ కేసుల్లో పాలు పంచుకున్నట్లు సీపీ ప్రకటించారు. 2021 జూన్ 10న సుబ్బారావుపై పీడీయాక్టు అమలు చేయగా ప్రభుత్వం ధృవీకరించిందని తెలిపారు. అయినప్పటికీ తన వైఖరి మార్చుకోలేదన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల పరిధిలో 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. నిందితుడిపై పీడీయాక్టు అమలుకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై ప్రసాద్ను సీపీ అభినందించారు. -
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం
బాసర: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకే హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. మండల కేంద్రంలో రూ.20 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన ప్రాథమిక ఆరో గ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవో దేవేందర్రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, సర్పంచ్ వెంకటేశ్గౌడ్, బీజేపీ మండలాధ్యక్షుడు సాయినాథ్ పటేల్, నాయకులు రాజేశ్వర్, సాయిబాబా, సాయిలు తదితరులున్నారు. తానూరు: మండల కేంద్రంలో రూ.20లక్షలతో చేపట్టిన ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణ పనులు, బెంబర గ్రామంలో రూ.50లక్షలతో చేపట్టిన చెక్డ్యాం నిర్మాణ పనులను ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావ్ పటేల్, ఎంపీడీవో శ్రీధర్, మాజీ సర్పంచ్ మాధవ్రావ్ పటేల్, బీజేపీ మండలాధ్యక్షుడు లక్ష్మ ణ్రెడ్డి, నాయకులు చిన్నరెడ్డి, శివాజీ పటేల్, సోమ్నాథ్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్తో జర భద్రం
చెన్నూర్రూరల్: వర్షాకాలంలో ప్రజలు, రైతులు విద్యుత్తో చాలా అప్రమత్తంగా ఉండాలి.. ఇంటివద్ద, పంట పొలాల్లో విద్యుత్ వినియోగంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో విద్యుత్తో బోరుబావులు, వాగుల వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి పంటలు సాగు చేస్తున్నారు. విద్యుత్ వినియోగంపై రైతులు కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలని కొమ్మెర ట్రాన్స్కో ఏఈ కేశెట్టి శ్రీనివాస్ సూచిస్తున్నారు. ఇంటివద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు పంట పొలాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు -
నిర్మల్
జిల్లా మీదుగా వెళ్తున్న ఎన్హెచ్.44స్కూల్ బస్సుల తనిఖీ నిర్మల్టౌన్: ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం కూడా ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీలు కొనసాగించారు. జిల్లా కేంద్రంలోని బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల లైసెన్సులు, వాహన బీమా, అత్యవసరద్వారాలు తదితర భద్రత ప్రమాణాలను పరిశీలించారు. మొత్తం 10 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంవీఐ తిరుపతి హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రయాణించే బస్సుల భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తనిఖీల్లో ఆర్టీఏ సిబ్బంది తేజ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్: దేశంలో అతిపెద్ద హైవే ఎన్హెచ్–44. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 3,745 కి.మీలతో దేశంలోనే అతి పొడవైన రహదారిగా పేరొందింది. ఈ రహదారి ఎక్స్ప్రెస్వేగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఆరులైన్లుగా విస్తరణ జరుగుతోంది దీంతో నాగపూర్–హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీంతో జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణలోనూ ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టు పూర్తయితే మధ్యలో ఉన్న జిల్లావాసులకు అటు నాగపూర్, ఇటు హైదరాబాద్కు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ మార్పు జిల్లా అభివృద్ధికి కూడా కొత్త‘దారులు’ తెరుస్తుంది. పెరిగిన వాహనాల రద్దీ.. ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే ఎన్హెచ్ 44 మొత్తం 11 రాష్ట్రాల గుండా వెళ్తుంది. నిర్మల్ జిల్లాలో ఇదే ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ఈ మధ్యకాలంలో విపరీతమైన వాహన రద్దీతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాలను కలిపే ఏకై క రోడ్డుమార్గం కావడంతో భారీ లారీలు, వాహనాలు వెళ్తున్నాయి. వీటి కారణంగా ప్రయాణికులకు ఎక్కువ సమయం తీసుకుంటోంది. తరచూ ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఆరు లేదా ఎనిమిది లైన్లు.. మామూలు హైవేకు ఎక్స్ప్రెస్వేకు తేడా ఉంటుంది. హైవే రోడ్డులో నాలుగులైన్లు ఉంటాయి. దీనిపైకి ఎక్కడి నుంచైనా రావడానికి వీలుంటుంది. వీటిపై వేగం గరిష్టంగా గంటకు 80 నుంచి 100 కి.మీలు మాత్రమే ఉంటుంది. ఎక్స్ప్రెస్వేలో చాలా మార్పులు ఉంటాయి. ఇందులో ఆరు నుంచి ఎనిమిది లైన్లు ఉంటాయి. ప్రస్తుతం నిర్మించిన ఎక్స్ప్రెస్వేలలో చాలా కిలోమీటర్ల వరకు మధ్యలో రావడానికి, వెళ్లడానికి అవకాశం ఉండదు. గరిష్ట వేగం గంటకు 120 కి.మీ ఉంటుంది. ఈకారణంగా దూరం, సమయం రెండూ తగ్గుతాయి. ఇటీవల నిర్మల్ సమీపంలోని కడ్తాల్, కామారెడ్డి సమీపంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ఈ ఎక్స్ప్రెస్వేలకు అనుగుణంగానే ఆరులైన్లతో నిర్మించారు. అవకాశం ఉంది.. సులభమైన, వేగవంతమైన ప్రయాణానికి 44వ జాతీయ రహదారిని ఎక్స్ప్రెస్వేగా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం ఈమేరకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో కూడా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అధికారికంగా సమాచారం అందలేదు. – నాగేశ్వర్రావు, ఎన్హెచ్–44 పీడీఎన్నో లాభాలు..జిల్లా మీదుగా వెళ్తున్న 44 హైవే కేవలం నాలుగులైన్లు మాత్రమే ఉంది. దీనిని ఆరు లైన్లుగా విస్తరిస్తే తప్ప ప్రమాదాలు, ప్రయాణభారం తగ్గదని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఈక్రమంలో తాజాగా కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో ఈ హైవే కూడా ఎక్స్ప్రెస్వేగా మారనుందని స్పష్టమైంది. దీంతో ప్రయాణం వేగవంతం అవుతుంది. ఎక్స్ప్రెస్వే పొడవునా పరిశ్రమలు, లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటు, వాణిజ్య కార్యకలాపాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిర్మల్ వంటి ప్రాంతాలూ పెట్టుబడిదారులను ఆకర్షించే కేంద్రంగా మారుతాయి. పర్యాటకరంగానికీ ఊతం లభిస్తుంది. దూరప్రాంతాల వారికి జిల్లాలోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు చేరుకోవడం సులభమవుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు వాణిజ్య సముదాయాలు వంటి సేవా, ఉపాధిరంగం అభివృద్ధికి ఊతమిస్తుంది. హైదరాబాద్, నాగపూర్ మార్కెట్లతో జిల్లా అనుసంధానం మరింత బలపడే అవకాశం ఉంటుంది. కొత్త పరిశ్రమలు, సేవా కేంద్రాలు, వాణిజ్య సంస్థలు ఏర్పడితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయి. -
అంగన్వాడీల భర్తీకి గ్రీన్సిగ్నల్
నిర్మల్చైన్గేట్: సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లాలోని 81 టీచర్, 430 ఆయా పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పక్షం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఖాళీలు.. జిల్లా వ్యాప్తంగా నిర్మల్, ఖానాపూర్, ముధోల్, భైంసా ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 931 సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో 850 మంది టీచర్లు, 501 ఆయాలు పనిచేస్తున్నారు. ఇందులో 81 టీచర్లు, 430 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 65 ఏళ్లు నిండిన టీచర్లు, ఆయాలతో ఉద్యోగ విరమణ చేయించారు. దీంతో 511 ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి. భర్తీ ప్రక్రియ ఇలా.. గతంలో పదో తరగతి చదివిన వారికి అంగన్వాడీ పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు విద్యార్హత ఇంటర్మీడియెట్కు పెంచారు. గతంలో మాదిరిగానే కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ కమిటీకి కలెక్టర్ ౖచైర్మన్గా ఉంటారు. ఆర్డీవో, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్(ఏజెన్సీ), డీఎంహెచ్వో, డీడబ్ల్యూవో సభ్యులుగా ఉంటారు. స్థానికులకే ప్రాధాన్యం ఇస్తారు. మార్కుల కేటాయింపు.. మొత్తం 100 మార్కులతో భర్తీ ప్రక్రియ నిబంధనలు ప్రకటించారు. ఇందులో ఇంటర్మీడియెట్లో సాధించిన మార్కులకు మెరిట్ ఆధారంగా అత్యధికంగా 70 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, తల్లిదండ్రులు లేని వారికి 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు అదనంగా కలుపుతారు. కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులు కలిపి మెరిట్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. మొదలైన పైరవీలు.. చాలాకాలం తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో ఆశావహులు అధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. అదే విధంగా తమకు పోస్టు ఇప్పించాలని రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మరోవైపు టీచర్ పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు, ఆయా పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తే పోస్టు ఇప్పిస్తామని దళారులు రంగప్రవేశం చేశారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు ప్రాజెక్టు టీచర్లు ఖాళీలు ఆయాలు ఖాళీలు భైంసా 205 18 205 76 ఖానాపూర్ 249 20 249 110 ముధోల్ 180 12 180 88 నిర్మల్ 297 31 297 156మండలాలు 18 క్లస్టర్లు 4 సెక్టార్లు 37అంగన్వాడీ కేంద్రాలు 931 -
నిరంతరాయంగా.. నాణ్యమైన విద్యుత్
నిర్మల్చైన్గేట్/భైంసాటౌన్/కడెం/ఖానాపూర్: వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన హెచ్టీ, ఎల్టీ లైన్ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం భైంసా, కడెం విద్యుత్ సబ్స్టేషన్లను సందర్శించారు. నిర్మల్, ఖానాపూర్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరఫరా మెరుగుదలకు సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. 11 కేవీ, 33 కేవీ ఫీడర్లలో ట్రిప్పింగ్లు తగ్గించేందుకు ప్రస్తుత విద్యుత్ నెట్వర్క్ను బలోపేతం చేయాలన్నారు. అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు లైన్లలోని లోపాలు సరిదిద్దాలని సూచించారు. డిస్టిబ్య్రూషన్ ట్రాన్స్ఫార్మర్ల(డీటీఆర్) వైఫల్యాలను తగ్గించేందుకు అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయడం, అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో స్పేసర్లు అమర్చడం, ఓవర్లోడ్ అయిన డీటీఆర్లను మార్చడం, ప్రమాదకర ప్రాంతాల్లోని 11 కేవీ ఫీడర్లపై లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో అటవీ ప్రాంతాల్లో ఈదులుగాలులకు విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, సమస్య పరిష్కరించేందుకు ఆటవీ ప్రాంతా గుండా కవర్డ్ కండక్టర్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గంగాపూర్లో సబ్స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఖానాపూర్ 133 కేవీ అంతరాయం కల్గినపుడు, కడెం, దస్తురాబాద్ మండలాలకు తాళ్లపేట్ వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన 133 కేవీ సబ్స్టేషన్ నుంచి ప్రత్యామ్నాయంగా సరాఫరాకు చేయవచ్చని తెలిపారు. సత్తన్పల్లి, బీర్నంది మధ్యలో 33 కేవీ లైన్ ఏర్పాటు, కడెం నుంచి దస్తురాబాద్ వైపు డబుల్ సర్య్కూట్ లైన్ నిర్మాణం పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఎక్కడైనా డీటీఆర్లు దెబ్బతింటే ఒకే రోజులో వాటిని మార్చేలా నిల్వలు సిద్దంగా ఉంచాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సిబ్బంది భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. విద్యుత్ కనెక్షన్లు నిబంధనల ప్రకారం రెండు నెలల్లో ఇవ్వాలన్నారు. కుభీర్ సబ్ స్టేషన్ పరిధిలో తరచూ విద్యుత్ సమస్యలు ఎదురవుతుండడంతో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎస్ఈ జాదవ్ సుభాష్, భైంసా డీఈఈ తిలక్, ఎస్ఈ రాథోడ్ సుభాష్, డీఈఈలు భాస్కర్, నాగరాజు, ఏడీఈ శ్రీనివాస్, ఏఈఈ రాంసింగ్, సబ్ ఇంజనీర్ స్వాతి, డీఈ ఎంఆర్టీ తిలక్, ఏడీ శ్రీనివాస్, కడెం సర్పంచ్ దీకొండ విజయ్కుమార్, నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్ ఉప విభాగాల ఆపరేషన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు -
నానోతో సాగు.. దిగుబడి బాగు
లక్ష్మణచాంద: జిల్లాలో వానాకాలం పంటల సాగు మొదలైంది. వానాకాలం పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారులు అంటున్నారు. జిల్లాకు వానాకాలం పంటకు 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం జిల్లాలో 11 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అయితే యూరియా యాప్ బుకింగ్పై ఇప్పటికీ చాలా మంది రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఇతర రైతులపై లేదా వ్యవసాయాధికారులపై యూరియా బుకింగ్ కోసం ఆధారపడాల్సి వస్తుంది. యూరియా బుకింగ్తో రైతులకు కొంత మేరకు తిప్పలు తప్పడం లేదు. సాధారణ యూరియాకు బదులుగా నానో యూరియా ద్రావణం మార్కెట్లోకి వచ్చింది. నానో యూరియా వినియోగిస్తున్న రైతుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. 2025–26 సంవత్సరంలో జిల్లా మొత్తం నానో యూరియా ద్రావణం 28 వేల లీటర్లు రైతులు వినియోగించారని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ తెలిపారు. ఈసారి సుమారు 35 వేల లీటర్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న సాగు వ్యయాలు.. అధిక దిగుబడుల కోసం అవగాహన లేని రైతులు అధిక ఎరువులు వినియోగిస్తున్నారు. వ్యవసాయాధికారులు యూరియాను మోతాదుకు మించి వినియోగించవద్దని సూచించినా, రైతులు మాత్రం వినకుండా అధిక దిగుబడులు సాధించాలని ఎక్కువ యూరియాను వినియోగించడంతో సాగు ఖర్చులు అధికమవుతున్నాయి. యూరియా అధిక వినియోగంతో పంట మొక్కల ఆకులు ఎక్కువగా పెరిగి పంట బలహీనపడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. మొక్కలు ఏపుగా పెరిగినా దిగుబడులు తగ్గుతుందని అంటున్నారు. తెగుళ్లు, పురుగుల దాడితో పంటకు నష్టం వాటిల్లి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అధికంగా యూరియాను వినియోగించడం వల్ల నేల సారం కోల్పోయి ఎరువు వృధా అవుతుందని, పంటలు విషతుల్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నానో వైపు అన్నదాతలు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. జిల్లా సమాచారం.... మొత్తం సాగు విస్తీర్ణం 4.40 లక్షల ఎకరాలు యూరియా అవసరం 30 వేల మెట్రిక్ టన్నులు 2025–26 నానో యూరియా వినియోగం 28 వేల లీటర్లు ఈసారి నానో యూరియా వినియోగం అంచనా 35 వేల లీటర్లుఅవగాహన కార్యక్రమాలు... జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియాను మితంగా వినియోగించాలని కోరుతూ అన్ని రైతు వేదికల్లో, గ్రామాల్లో, రైతుల పంట పొలాల వద్ద డీఏవో అంజిప్రసాద్తోపాటు అన్ని మండలాల ఏవోలు, ఏఈవోలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రైతులు నానోవైపు మళ్లుతున్నారు. అమెరికా – ఇరాన్ యుద్ధం కారణంగా యూరియా దిగుమతి తగ్గింది. ఈ నేపథ్యంలోనూ రైతులు నానో యూరియా వాడడం మంచిదని సూచిస్తున్నారు. గత ఏడాది వానాకాలంలో వినియోగించే యూరియా కంటే జిల్లాలో 300 మెట్రిక్ టన్నుల వినియోగం తగ్గిందని, అలాగే ఇటీవల ముగిసిన యాసంగిలో 1,800 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం తగ్గిందని తెలిపారు. ఇంకా సాధారణ యూరియా వినియోగం తగ్గి రైతులు నానో వినియోగం పెంచాలని డీఏవో అంజిప్రసాద్ అంటున్నారు. జిల్లాలో 2025–26లో నానో యూరియా 28 వేల లీటర్లు, నానో డీఏపీ 6 వేల లీటర్లు రైతులు వినియోగించారు. ఈ సారి జిల్లా అంతటా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి మరింత నానో యూరియా వినియోగించేలా చర్యలు చేపడుతామని అధికారులు చెబుతున్నారు. -
తరుగు పేరిట ఎమ్మెల్యే దోపిడీ
● అభివృద్ధికీ ‘ఏలేటి’ అడ్డు ● మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్: జిల్లాలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న, జొన్న చివరి గింజ వరకూ కొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఇందుకు కలెక్టర్, అధికారులూ శ్రమించారని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోసం తాము కష్టపడుతుంటే, తరుగు పేరిట ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి రూ.కోట్లు దోపిడీ చేశారని సంచలన ఆరోపణ చేశారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో మంగళవారం మాట్లాడారు. జిల్లాలో ఈసారి ధాన్యంతో సమానంగా మక్కలు కూడా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. రెండు పంటలకు ఒకేసారి రావడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి తరు గు పేరిట ప్రతీ సంచికి నాలుగైదు కిలోల చొప్పున దోచుకున్నారని మండిపడ్డారు. మొత్తం 18,92,926 ధాన్యం సంచుల నుంచి రూ.17.41 కోట్లు మింగేశారని ఆరోపించారు. రైతుల గోస ఎమ్మెల్యేకు తగులుతుందన్నారు. జిల్లాలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ నిర్మాణాలకు అడ్డుపడుతున్నారని విమర్శించా రు. ప్రజలందరూ ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలని, ఇష్టానుసారంగా ఓట్ల తొలగింపును అడ్డుకోవాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ జిల్లా మీదుగా రైలు తీసుకురావడానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. డీసీసీబీ మాజీ వైస్చైర్మన్ రఘునందన్రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి పాల్గొన్నారు. -
గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలి
నర్సాపూర్ (జి): గ్రామీణులందరికీ మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని 30 పడగల సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు. ఓపీ విభాగం, మందుల గది, ల్యాబ్, ఇన్, ఔట్ పేషెంట్ విభాగాలు, పలు వార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి సంబంధించిన మందులు, ఓపీ, తదితర రిజిస్టర్లు తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీరోజు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కేజీబీవీ పాఠశాల, వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలో సౌకర్యాలు తెలుసుకున్నారు. ప్రతీరోజు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లను పంపిణీ చేశారు. తర్వాత చాక్పల్లి పరిధిలోని మోతక్పల్లి గ్రామం సుద్దవాగు ఇసుక రీచ్ను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణా జరగకూడదన్నారు. అక్రమ రవాణా చేసే వాహనాలు జప్తు చేయాలని ఆదేశించారు. కేవలం మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మకాలు జరగాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఈవో భోజన్న, డీసీహెచ్ఎస్ కాశీనాథ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో పుష్పలత, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రమోద్చంద్రారెడ్డి, ఏపీవో తిరుపతిరెడ్డి, కేజీబీవీ ఎస్వో వీణ, సర్పంచ్ గడ్డం ఇంద్రకరణ్రెడ్డి ఉన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్సెర్చ్
నర్సాపూర్ (జి): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు 24/7 పనిచేస్తున్నారని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. నర్సాపూర్(జి) మండలం కుస్లీ గ్రామంలో మంగళవారం ఉదయం కార్డన్సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివి, పెండింగ్ చలాన్లు ఉన్న 43 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్ చలనాలు చెల్లించిన వారి వాహనాలు యజమానులకు తిరిగి ఇచ్చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెస్సేజ్లు, సోషల్ మీడియా లింకులు, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గుడుంబా, కల్లు వంటి మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. మాదక ద్రవ్యాలు కుటుంబాలు, సమాజాన్ని నాశనం చేస్తాయని తెలిపారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నార్వాడి ప్రవీణ్ పాటిల్, ఉప సర్పంచ్ అల్లూరి రాజు, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్సైలు గణేశ్, శ్రీకాంత్, రవీందర్, లింబాద్రి, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో పెండింగ్ కేసుల పరిష్కారం
● జిల్లా జడ్జి శ్రీవాణి నిర్మల్టౌన్: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ఈనెల 20న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. జిల్లా ప్రధాన కోర్టులో జడ్జీలతో కలిసి, లోక్ అదాలత్పై న్యాయవాదులతో సోమవారం సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుతాయని పేర్కొన్నారు. ఈనెల 20న జిల్లాలోని కోర్టులలో లోక్అదాలత్ జరుగుతుందని తెలిపారు. రాజీ పద్ధతిలో క్రిమినల్, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ రాధిక, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరణ్ , కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్టౌన్: అర్జిదారుని నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు త్వరగా పరిష్కరించాలని, సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. -
మూత‘బడి’ తెరుచుకుంది
సారంగపూర్: మండలంలోని గొడిసెర ప్రాథమిక పాఠశాల గతేడాది విద్యార్థులు లేక మూతబడింది. సోమవారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది సర్పంచ్ గోదావరి చొరవతో తిరిగి సోమవారం పునఃప్రారంభించారు. సర్పంచ్, ఎంఈవో మహేందర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థిని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. ఊరిబడిని సంరక్షించుకుంటేనే అందరికీ మేలని పేర్కొన్నారు. గ్రామ ప్రజల బలమైన కోరిక, నాయకుల కృషితో పాఠశాల తిరిగి ప్రారంభమైందన్నారు. ఇందుకు కృషి చేసిన నాయకులు, గ్రామస్తులను అభినంధించారు. కార్యక్రమంలో గ్రామస్తులు సూర్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాస్, వార్డు సభ్యురాలు యార లత, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. రేపు కార్గో వస్తువులు వేలం నిర్మల్టౌన్: ఆర్టీసీ నిర్మల్ డిపో కార్గోలో తీసుకెళ్లని వస్తువులను ఈ నెల 17న వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ కె.పండరి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11 గంటలకు వేలంలో పాల్గొనాలని సూచించారు. -
అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
దిలావర్పూర్: ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నానని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. దిలావర్పూర్తోపాటు, మాయాపూర్, న్యూలోలం గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేశారు. దిలావర్పూర్ రూ.50 లక్షలతో ఎస్హెచ్జీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.36 లక్షలతో మూడు అంగన్వాడీ భనాల నిర్మాణానికి, రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, రూ.10 లక్షల వ్యయంతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కేజీబీవీ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వడ్డపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే న్యూలోలంలో రూ.40 లక్షల వ్యయంతో ప్లాస్టిక్వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దిలావర్పూర్లో రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో రైతులకు రాయితీపై జీలుగ అందజేశారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు నోట్ పుస్తకాలు అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు డి.ముత్యంరెడ్డి, దిలావర్పూర్ సర్పంచ్ అక్షర అనిల్, మాయాపూర్ సర్పంచ్ యార రమ్య, న్యూలోలం సర్పంచ్ సూర శ్రీలత, నాయకులు నిరంజన్రెడ్డి, ధనె నర్సయ, గంగారెడ్డి, మల్లేశ్, అధికారులు పాల్గొన్నారు. -
జొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయాలి
కుభీర్: కుభీర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోళ్లను కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన అధికారులు, రైతులతో మాట్లాడారు. టోకెన్లు సెప్టెంబర్ వరకు ఇచ్చారని, అప్పటి వరకు ఎందు కు వారం రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతీరోజు 30 లారీలు వచ్చేలా చూస్తానన్నారు. తమ వెలిముద్రలు పడడం లేదన వృద్ధ రైతులు తెలుపగా డీఎంతో మాట్లాడతానని చెప్పారు. అంత కు ముందు ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. ఇరుకుగా ఉన్న మురికి కాల్వను పరిశీలించి మురికి కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. అస్పత్రిలో వైద్యులతో మాట్లాడారు. ప్రహ రీ కావాలని వైద్యులు కలెక్టర్ను కోరారు. తర్వాత కస్తూరిబాగాంధీ పాఠశాలను సందర్శించారు. వి ద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. కలెక్ట ర్ వెంట భైంసా మార్కెట్ చైర్మన్ ఆనంద్రావుపటేల్, కుభీర్ చైర్మన్ కళ్యాణ్, ఆత్మా చైర్మన్ వివేక్, సర్పంచ్ కందుర్ సాయినాథ్, డీఈవో భోజన్న, ఐకేపీ డీఎం భోజరాం, వైద్యుడు ఆర్.విజేష్, ఏపీఎం దత్తాత్రి, సీసీ భూమన్న, ప్రిన్సిపాల్ వాణి ఉన్నారు. ఉద్యానవన పంటల సాగు పెంచాలి నిర్మల్చైన్గేట్: జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యానికి మించి ఉద్యానవన పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులు లాభాలు పొందుతారని తెలిపారు. ఈమేరకు వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఏవో అంజిప్రసాద్, ఉద్యానవన పంటల అధికారి రమణ, అధికారులు, పాల్గొన్నారు. -
బడి బాట కొత్త పుంతలు!
ప్రస్తుత తరానికి అనుగుణంగా...మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లోనూ ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యా బోధన, డిజిటల్ అభ్యసనం ఆకట్టుకునే రీతిలో ఉంటోంది. పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడమే లక్ష్యంగా ప్రస్తుత తరానికి అనుగుణమైన రీతిలో స్థానిక కళాకారుల తోడ్పాటుతో పాఠశాల గురించి మా ఉపాధ్యాయ బృందం, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు పాల్గొని నటించిన పాటను రూపొందించాం. యూట్యూబ్లో విడుదల చేయడంతోపాటు స్థానిక గ్రామ వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశాం. మంచి స్పందన వస్తోంది. అడ్మిషన్లు పెరుగుతున్నాయి. – శారద, హెచ్ఎం, ఎంపీపీఎస్, పొన్కల్నిర్మల్ఖిల్లా: పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నడుస్తున్న బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. గతంలో గ్రామసభలు, మైకులు, కరపత్రాలకు మాత్రమే పరిమితమైన ప్రచారం.. ఇప్పుడు ఏఐ ఆధారిత పోస్టర్లు, వీడియోలు, డిజిటల్ ఫ్లెక్సీలు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా సాగుతోంది. నాణ్యమైన విద్యను హైలెట్ చేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, పౌష్టికాహార మధ్యాహ్న భోజనాలు, విశాలమైన ఆటస్థలాలు, క్రీడా ప్రోత్సాహం, డిజిటల్ బోధ న, విలువల ఆధారిత అభ్యసనం, స్వేచ్ఛాయు త వాతావరణం వంటి అంశాలను ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి ఇ ంటింటికి బడిబాట కార్యక్రమం ప్రారంభించిన ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరుగుతూ తల్లిదండ్రులను కలుస్తున్నారు. గ్రామ పెద్దలు, సర్పంచులు, వార్డు సభ్యులు, విద్యా కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేసుకుంటూ విద్యార్థుల నమోదును పెంచేందుకు కృషి చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులతో అనుసంధానం.. ప్రతీ గ్రామంలో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్య ంలో తరగతివారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పా టు చేశారు. ఈ గ్రూపుల ద్వారా పాఠశాల కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభ, బోధన విధానా లు, విజయాలు, ప్రభుత్వ పథకాల వివరాలను తల్లిదండ్రులకు నిరంతరం చేరవేస్తున్నారు. విద్యార్థుల విజయాలు, అవార్డులను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక గీతాలు, బ్యానర్లు.. మామడ మండలం పొన్కల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక కళాకారుల సహకారంతో ప్రభుత్వ బడి ప్రాధాన్యతను తెలియజేసే ప్రత్యేక గీతాన్ని రూపొందించి విడుదల చేశారు. ఈ పాట సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణ పొందుతోంది. పరిమండల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలోని ప్రధాన కూడళ్లు, పరిసర గ్రా మాల్లో భారీ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పా టు చేశారు. వాటిలో డిజిటల్ విద్య, క్రీడలు, పౌష్టికాహారం, వి ద్యార్థుల విజయాలను ఆకర్షణీయంగా చూపుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇదే తరహాలో వాట్సా ప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. మారిన ప్రచార ధోరణులు ఇటీవలి కాలంలో సాంకేతికత వినియోగం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ప్రచారం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ ఆధారిత పోస్టర్లు, వీడియోలు, విద్యార్థుల ఫొటోలతో రూపొందించిన సృజనాత్మక కంటెంట్ తల్లిదండ్రులను ఆకర్షిస్తోంది. ప్రభుత్వ బడులపై ఉన్న అపోహలను తొలగించి, కొత్త నమ్మకాన్ని పెంపొందించడంలో ఈ విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయడంతో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
స్కూల్ బస్సుల తనిఖీ
నిర్మల్టౌన్: ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం నిర్మల, భైంసా పట్టణాల్లో ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల లైసెన్సులు, వాహన బీమా, అత్యవసర ద్వారాలు తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. నిర్మల్లో 2 బస్సులు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో కేసు బుక్ చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రయాణించే బస్సుల భద్రతపై అవగాహన ఉండాలని సూచించారు. ఏఎంవీఐ అసిఫ్, ఆర్టీఏ సిబ్బంది కై లాష్, నరేశ్ ఉన్నారు. భైంసాలో రెండు బస్సులు .. భైంసాటౌన్: పట్టణంలో ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సుల ఫిట్నెస్, ధ్రువపత్రాలు, తదితర అంశాలు పరిశీలించారు. మొత్తం 12 బస్సులు తనిఖీ చేయగా, రెండు బస్సులకు సంబంధించి సరైన ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ధ్రువపత్రాలు లేకపోవడంతో కేసులు నమోదు చేసినట్లు ఏఎంవీఐ రజనీకాంత్ తెలిపారు. ఆయన వెంట సిబ్బంది కార్తీక్, లిఖిత్ ఉన్నారు. -
తొలిరోజు తడబడి
నిర్మల్ రూరల్: బడిగంట మోగింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు అమావాస్య కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు బడులకు రాలేదు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అందజేశారు. అమావాస్య కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మామిడి తోరణాలు కట్టి, విద్యార్థులక పూల బొకేలు అందించి ఆహ్వానించారు. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు హాజరయ్యారు. అమావాస్య సెంటిమెంట్... సోమవారం అమావాస్య కావడంతో పలు ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలల్లో హాజరు శాతం బాగా తగ్గింది. జిల్లావ్యాప్తంగా కేవలం 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు విద్యాశాఖ అధి కారులు వెల్లడించారు. మంగళవారం కూడా అంతంత మాత్రంగానే విద్యార్థులు వస్తారని, బుధవా రం నుంచి హాజరు పెరుగుతుందని అధికారులు తెలిపారు. తొలిరోజు డీఈవో భోజన్న, అధికారులు నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల కు పువ్వులు అందించి ఆహ్వానించారు. అనంతరం వారికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు అందజేసి బాగా చదువుకోవాలని సూచించారు. పాఠశాలకు, జిల్లాకు పేరు తేవాలన్నారు. బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. సర్కార్ బడుల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లోనే తమ పిల్లలను చేర్పించాలని కోరారు. -
నిర్మల్
అడెల్లిలో భక్తుల సందడి సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరబాద్, తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో భక్తులు భారీగా వచ్చారని అధికారులు తెలిపారు. ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సమయంలో భారీగా గాలివాన రావడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. ఆదివారం ఆటవిడుపు పాఠశాలల వేసవి సెలవులు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు నిర్మల్ పట్టణంలో చిన్నారులు ఆట పాటలతో ఎంజాయ్ చేశారు. ఏఎన్.రెడ్డి కాలనీలో గ్రామీణ ఆటలు ఆడుతూ కనిపించారు. సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
హోర్డింగ్స్.. డేంజర్ బెల్స్!
వాతావరణం ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపనాల ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. టమాట ధర ౖపైపెకి.. టమాటా ధరలు పెరుగుతుండటంతో సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టమాటా 25 కిలోల బాక్సు రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది. వ్యాపార సంస్థలు ప్రచారం కోసం భారీగా ఖర్చు చేస్తుంటాయి. ఇవి పట్టణాల్లో మున్సిపాలిటీలకు ఆదాయంగా మారాయి. ఇందుకోసం పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశాయి. నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కొన్ని హోర్డింగ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. విద్యుత్ తీగలు, స్తంభాలకు సమీపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్తో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రోజూ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణవాసుల్లో టెన్షన్ పెరుగుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ఖానాపూర్ రోడ్డు పక్కన -
హెల్త్ కార్డులు మంజూరు చేయాలి
నిర్మల్ రూరల్: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. మే నెల వేతనం నుంచి1.5 శాతం ఈహెచ్ఎస్ చందా వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు మార్గదర్శకాలు రూపొందించలేదన్నారు. వెంటనే అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ వార్తలపై ఆందోళన.. ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 30 లోపు రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని వస్తున్న వార్తలతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 9 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, 60 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలని, ఆపైన ప్రతీ 20 మందికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. జీవో 317 బాధిత ఉపాధ్యాయులను వెంటనే సొంత జిల్లాల బదిలీలు చేయాలన్నారు. మిగిలిన స్పౌజ్ బదిలీలు పూర్తి చేయాలని కోరారు. జూలై 31 కట్ఆఫ్తో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, ప్రతీ మండలాన్ని రెండు క్లస్టర్లుగా విభజిస్తూ ఒక ఎంఈవో పోస్టును ప్రభుత్వ యాజమాన్యంలోని జీహెచ్ఎం– గ్రేడ్ 2 ద్వారా, మరొక ఎంఈవో పోస్టును లోకల్ బాడీ జీహెచ్ఎం–గ్రేడ్ 2 భర్తీ చేయాలని సూచించారు. పీఆర్సీ ప్రకటించాలి.. జూన్ 30వ తేదీలోపు పీఆర్సీ ప్రకటించాలని లచ్చిరాం డిమాండ్ చేశారు. పాఠశాలల కుదింపు ఆలోచనను విరమించుకోవాలని, సీపీఎస్ను రద్దుచేసి, ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఇందులో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్, వహీద్ ఖాన్, ఎ.లక్ష్మీప్రసాద్రెడ్డి, నోముల శరత్చందర్రెడ్డి, వట్టోలి ముత్తన్న, మేడారపు శ్రీనివాస్, ఎస్.పాండురంగాచారి, పోల ధర్మరాజ్ పాల్గొన్నారు. -
అడెల్లిలో పిడుగుపాటు
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహా పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జి ల్లా బోథ్ మండలం, అందూర్ గ్రామానికి చెందిన గోడం గంగాధర్, గోడం స్రవంతి త మ సమీప బందువుల ఖుషీ పండుగకు హా జరయ్యారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వా తావరణం మారింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. వీరి ద్దరూ వర్షంపడే సమయంలో తలదాచుకునేందుకు చెట్టునీడకు వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థాని కులు హుటాహుటిన 108 కు సమాచారం అందించారు. అంబులెన్స్లో క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని డీఎంఅండ్హెచ్వో డాక్టర్ రాజేందర్ తెలిపారు. గాయపడ్డ గోడం స్రవంతి, గంగాధర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ భైంసా కమిటీ భైంసాటౌన్: పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్ సాధారణ సభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బండారి సాయన్న, ఆదిలాబాద్ రీజినల్ అధ్యక్షుడు మామిడిపల్లి శ్రీనివాస్, కార్యదర్శి అబిద్ పాషా ఆధ్వర్యంలో భైంసా డిపో కమిటీని ఎన్నుకున్నారు. భైంసా డిపో అధ్యక్షుడిగా కె.మల్లికార్జున్, సెక్రెటరీగా ఎ.గంగయ్య, చైర్మన్గా ఓ.రాజన్న, డిపో మహిళా అసిస్టెంట్ సెక్రెటరీగా సరోజన, జాయింట్ సెక్రెటరీగా నిరోష, గ్యారేజ్ సెక్రెటరీగా రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎ.మోహన్, గంగాధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 18 మంది (గ్యారేజ్ సిబ్బంది)ఎంప్లాయీస్ యూనియన్లో చేరారు.హక్కుల కోసం మరో పోరాటం నిర్మల్టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాదిగలకు రావాల్సిన న్యాయమైన హక్కుల సాధనకు మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ పిలుపునిచ్చారు. నిర్మల్ ప్రెస్క్లబ్లో ఆదివారం మాట్లాడారు. మాదిగలకి విద్య, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాల్లో దక్కాల్సిన వాటా కోసం మాదిగ హక్కుల దండోరా పోరాడుతుందని తెలిపారు. చేవెళ్ల డిక్లరేషన్, దళిత డిక్లరేషన్ ప్రకారం మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని లెదర్ పార్కులన్నీ పునరుద్ధరించి అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాదిగలకు అధిక స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ సమన్వయకర్త అందెల భవానీరెడ్డి, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు అడ్డుగా లక్ష్మణ్, సీనియర్ నాయకులు నల్లూరి ఆనంద్, బండారి అశోక్, శివకుమార్, మల్లెల కరుణాకర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మక్కల పైసలెప్పుడొస్తయ్..!
భైంసాటౌన్: ఖరీఫ్ ప్రారంభమైంది. ఇప్పటికే రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సకాలంలో వర్షాలు పడితే విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా, రబీ సీజన్లో జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న సాగుచేశారు. దిగుబడి సైతం బాగానే వచ్చింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ఎక్కువ మొత్తంలో విక్రయించారు. అయితే, విక్రయించిన మక్కలకు సంబంధించి డబ్బులు సకాలంలో ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో సాగు ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు. 1.58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు.. జిల్లాలో ఈసారి 1.12 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్నలు సాగుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఎకరాకు 26.5 క్వింటాళ్ల చొప్పున రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించింది. దిగుబడి అధికంగా రావడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు గోదాముల కొరత అధికారులను వేధించింది. దీంతో అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, పంట విక్రయించిన రైతులకు వారం రోజుల్లో మార్క్ఫెడ్ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. కానీ, కొందరికి నెల రోజులు కావస్తున్నా డబ్బులు జమ కావడం లేదని రైతులు వాపోతున్నారు. త్వరగా డబ్బులు జమ చేస్తే సాగు ఖర్చులకు అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. వారం రోజుల్లో జమ.. మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశాం. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకు రూ.107 కోట్ల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మరో రూ.26 కోట్లు సోమవారం జమ చేస్తాం. మిగిలిన డబ్బులు సైతం వారంరోజుల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఆందోళన చెందవద్దు. – మహేశ్ కుమార్, మార్క్ఫెడ్ డీఎంమార్క్ఫెడ్ కొనుగోళ్లు ఇలా.. సేకరించిన మక్కలు 1.58 లక్షల మెట్రిక్ టన్నులు పంట విక్రయించిన రైతులు : 20,977సేకరించిన మొక్కజొన్న విలువ : రూ.380.80 కోట్లు ఇప్పటివరకు జమ చేసిన డబ్బులు : రూ.107 కోట్లు ఇంకా చెల్లించాల్సిన మొత్తం : రూ.273.80 కోట్లు -
ప్రభుత్వ బడిలోనే చదివా...
ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం నాది మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది. మా ఉపాధ్యాయులు నిరంతరం చదువుతూనే సమాజంలో గుర్తింపు పొందవచ్చని చెబుతూ ఉండేవారు. బడికి వెళ్లడం ద్వారా చదువుతోపాటు క్రమశిక్షణ సంస్కారం అరవడి ఎంతోమంది స్నేహితులవుతారు. పాఠశాల స్థాయిలో నేర్చుకునేది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. నా ఉన్నతికి ప్రధాన కారణం మా మంజులాపూర్ పాఠశాల. ఇప్పుడున్న సౌకర్యాలు అప్పట్లో లేవు. కొత్త విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం బోధన జరుగుతుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను త్వరలో సర్దుబాటు చేస్తాం. – భోజన్న, డీఈవో -
బడి పిలుస్తోంది..!
నిర్మల్: ‘డియర్ స్టూడెంట్.. కమ్ టు మి..’ అంటూ స్కూల్ పిలుస్తోంది. ‘మీ బంగారు భవిష్యత్తుకు బడే పునాది..’ అని తరగతి గదిని చూపుతోంది. ‘చదువుంటే.. అన్నీ నీ వెంటే..’ అంటూ పుస్తకాలను చేతికిస్తోంది. నాలుగు గోడల మధ్య నవభారతాన్ని నిర్మించే గురువులను పరిచయం చేస్తోంది. ‘విద్యే విజయానికి చిరునామా..’ అంటూ చదువుతో పైకెదిగిన వాళ్లను చూపిస్తోంది. భావితరం బాగుండాలంటే వాళ్లు బడిబాట పట్టేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజమూ బాధ్యత తీసుకోవాలని చెబుతోంది. కొత్త విద్యాసంవత్సరంలోకి సరికొత్త ఉత్సాహంతో అడుగు పెడదాం.. చదువులతల్లి కొలువైన జిల్లాను ఉన్నతంగా నిలుపుదాం రండి.. అంటూ బడి పిలుస్తోంది. చదువే బంగారు బాట.. ‘చదువుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం‘ అనే మాటకు నేటి సమాజమే ప్రత్యక్ష నిదర్శనం. సమాజానికి సేవ చేసే డాక్టర్లు, దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇలా ప్రతీరంగంలో రాణించేవారి ప్రయాణం తరగతి గది నుంచే మొదలైంది. చదువు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు. మంచి వ్యక్తిత్వాన్ని, విలువలను, బాధ్యతలనూ నేర్పిస్తుంది. తల్లిదండ్రులదే తొలి బాధ్యత ప్రతీ చిన్నారి బడికి వెళ్లేలా చూడటం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, క్రమశిక్షణను అలవాటు చేయడం, పాఠశాలకు క్రమం తప్పకుండా పంపించడం ద్వా రా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసినవాళ్లవుతారు. పిల్లలకు మొబైల్, టెలివిజన్ వినియోగా న్ని పరిమితం చేసి, చదువుకు అనుకూలమైన వా తావరణాన్ని కల్పించాలి. చదివే వయసులో పిల్లలు వేసే ప్రతీ అడుగు వారి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే మెట్టుగా మారుతుంది. తీర్చిదిద్దేది గురువులే.. పిల్లలను రేపటి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపైనే ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాఠ్యాంశాలతోపాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత, దేశభక్తి, క్రమశిక్షణ వంటి అంశాలను చెప్పాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను చెడుమార్గాల వైపు వెళ్లకుండా చూడటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. గురువు చూపే దారి విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పగలదు. సామాజిక బాధ్యత.. లక్ష్మణచాంద మండలానికి చెందిన ఓ చిన్నారి(మైనర్)కి తొమ్మిదో తరగతిలోనే కుటుంబసభ్యులు బా ల్యవివాహం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపారు. వెంటనే పెళ్లి ఆపేశారు. ఆ తర్వాత సదరు విద్యార్థిని ఉన్నతవిద్య చదువుకోవడమే కాకుండా జీవితంలోనూ గౌరవప్రదమైన స్థానంలో నిలిచింది. తన జీవితం బాగుండటానికి ఆరోజు బాల్యవివాహాన్ని ఆపిన సమాజమే కారణం. ప్రతీచిన్నారి పాఠశాల బాట పడితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, నిరక్షరాస్యత వంటి సామాజిక సమస్యలకు విద్యే శాశ్వత పరిష్కారం. అందుకే ‘ప్రతి పిల్లవాడు బడిలో ఉండాలి.. ప్రతి కలకు చదువే బాట కావాలి‘ అనే సంకల్పంతో సమాజమూ స్పందించాల్సిన అవసరం ఉంది. జిల్లా పాఠశాలల వివరాలు.. ప్రాథమిక 548 ప్రాథమికోన్నత 137 ఉన్నత 117 మొత్తం విద్యార్థులు 65,606 ఉపాధ్యాయులు 3,700 ప్రహరీ లేని పాఠశాలలు 181 మరుగుదొడ్లు లేనివి 216 కిచెన్ షెడ్లు లేనివి 230 తీర్చిదిద్దాల్సింది గురువులే.. చదువుతోనే ఉన్నతస్థానం.. జీవితంలో ఉన్నతస్థానంలో ఉండాలన్నా, ఉత్తమంగా జీవించాలన్నా అది చదువుతోనే సాధ్యం. ప్రతీ విద్యార్థి విద్య ప్రాముఖ్యతను గుర్తించాలి. ప్రభుత్వం కల్పించే విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. – భవేశ్మిశ్రా, కలెక్టర్ విద్యతోనే గుర్తింపు.. సమాజంలో ఉత్తమ గుర్తింపు రావాలంటే ఉన్నత విద్యను అభ్యసించాలి. చదువుకున్న ప్రాముఖ్యతను గుర్తించి విద్యార్థులు ఇష్టంతో చదువుకోవాలి. తల్లిదండ్రులూ పాజిటివ్గా పిల్లలను ప్రోత్సహించాలి. – డాక్టర్ జానకీషర్మిల, ఎస్పీ -
లైబ్రరీకి పుస్తకాలు
జ్ఞాన వికాసానికి పుస్తకాలే పునాది. ఈ భావనతో ఓ ఉపాధ్యాయుడు తన వద్ద ఉన్న విలువైన పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందించి స్ఫూర్తిని కలిగించారు. పట్టణంలోని బాలాజీవాడకు చెందిన పూసల చంద్రశేఖర్. వీరు మచ్కల్గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. తాను వ్యక్తిగతంగా సేకరించిన కథా పుస్తకాలు, స్ఫూర్తిదాయక జీవిత గాధలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, నవలలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే గ్రంథాలను ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి విజయకు అందజేశారు. – నిర్మల్ఖిల్లా -
పూర్వ విద్యార్థుల మానవత్వం
భైంసాటౌన్: తమతో చదువుకున్న విద్యార్థిని కుటుంబానికి పెద్ద ఆపద రావడంతో ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు పూర్వ విద్యార్థులు. భైంసా పట్టణంలోని సంతోషిమాత నగర్కు చెందిన విజయకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అటిజంతో బాధపడుతున్నారు. మూడేళ్లు చికిత్స అందించాల్సి ఉంటుందని, దీనికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో, విషయం తెలుసుకున్న తోటి పూర్వ(2004–05 సరస్వతి శిశుమందిర్ పదో తరగతి) విద్యార్థులు 30 మంది ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. ఆదివారం విజయ నివాసానికి చేరుకుని మొదటి ఏడాది చికిత్స కోసం రూ.1.40 లక్షలు అందజేశారు. దాతల ద్వారా మరింత ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. -
చదువునే నమ్ముకుని..
దిలావర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన డాక్టర్ వెల్మల మధు ప్రస్తుతం ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. డీఎల్ పరీక్షలో ఎందర్నో వెనక్కినెట్టి ఉద్యోగం సంపాదించుకున్నారు. చదువును నమ్ముకునే ఇవ్వాళ జీవితంలో ఉన్నతస్థానంలో ఉన్నారు. ఒకప్పుడు ఇంటర్లో పరీక్ష తప్పారు. డిగ్రీలోనూ ముందుకెళ్లలేకపోయారు. ప్రైవేటుగా చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూనే చదువును కొనసాగించారు. వృక్షశాస్త్రంలో పీహెచ్డీతోపాటు ఎంఈడీ కూడా పూర్తిచేశారు. పాఠ్యపుస్తకాల రచనల్లో, అనేక పరిశోధన పత్రాల సమర్పణలో నిత్యవిద్యార్థిగా ఉంటూ తన విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
● తపస్ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ నిర్మల్ రూరల్: ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ డిమాండ్ చేశారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ఎన్సీటీఈ నిబంధనలకు అనుగుణంగా 2025లో సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించిందని, దీంతో ఆందోళన చెందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 65 రివ్యూ పిటిషన్లు వేశారన్నారు. నిబంధనల ఆధారంగానే సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్లు కొట్టివేసిందని తెలిపారు. 2028 ఆగస్టు 31 వరకు గడువు పెంచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వాన్ని ఒప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో సుదర్శన్, జిల్లా బాధ్యులు కీర్తి సాయన్న, వాసుదేవరెడ్డి, అనుముల అరుణ్, అశ్విన్కుమార్ పాల్గొన్నారు. -
జాతి గర్వించే నాయకుడు మోదీ
కడెం: పన్నెండేళ్ల సుదీర్ఘ పాలనలో ఎక్కడా చిన్న మచ్చ లేకుండా, యావత్ భారత జాతి గర్వంతో తలెత్తుకునేలా చేసిన నాయకుడు నరేంద్ర మోదీ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామరావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్రాథోడ్ అన్నారు. మండలంలోని కొండూకూర్ గ్రామంలో మోదీ 12 ఏళ్ల పాలనపై జిల్లా ప్రతినిధుల సమ్మేళనం శనివారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల విశ్వాసాలను సగర్వంగా చాటిచెప్పిన నాయకుడు మోదీ అన్నారు. చాయ్ వాలా నుంచి దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగి 12 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవ పూర్తిచేసుకున్న కర్మయోగి 2029లో నాలుగోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, ఆకుల శ్రీనివాస్, రాజు యాదవ్, యాతాళం చిన్నారెడ్డి, రవీందర్రెడ్డి, సత్యం చంద్రకాంత్, కాశవేని శ్రీనివాస్యాదవ్, బుర్ర రమేశ్, శారద, అంకం మహేందర్, నల్లా రమేశ్, తాడేవర్ సాయినాథ్, జిల్లాలోని మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం మరింత భద్రం
లక్ష్మణచాంద/మామడ:మరో రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. డ్రాపౌట్స్ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోంది. అయితే ఈ మధ్యాహ్న భోజనం ఈసారి మరింత భద్రంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాధికారులకు సూచించింది. వేసవి సెలవులు ఈనెల 14న ముగియడంతో ఈనెల 15 నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మధ్యాహ్న భోజనం అమలులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా... సురక్షితమైన వంట శాల, నాణ్యమైన ఆహారం, శుభ్రమైన పరిసరాలు, స్వఛ్చమైన తాగు నీరు ఈ నాలుగు అంశాలను తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ జిల్లా విద్యాధికారులకు, ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు, ప్రత్యేకాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకరోజు శిక్షణ.. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు మండల విద్యాధికారులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. సమాజ భాగస్వామ్యంతో పుట్టినరోజు కార్యక్రమాలు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు వంటి సందర్భాలలో విద్యార్థులకు ప్రత్యేక భోజనం అందించాలి. దాతల సహకారం తీసుకుని వివరాలు నమోదు చేయాలి. నాణ్యమైన ఆహారంను విద్యార్థులకు అందించాలి. ప్రతీ పాఠశాలలో స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్లు అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ, ఉద్యాన, అటవీశాఖ సహకారం తీసుకోవాలి. పాఠశాలలో అందుబాటులో ఉన్న స్థలం వినియోగించి ఆకుకూరలు, కూరగాయలు పండించి వాటిని మధ్యాహ్న భోజనానికి వినియోగించాలి. విద్యార్థుల భాగస్వామ్యంను పెంపొందించాలి. విద్యార్థులకు సబ్బు అందుబాటులో ఉంచి చేతులు కడుక్కునే సౌకర్యంను కల్పించాలి. చేయాల్సిన పనులు ఇవే... జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, పీఎం పోషణ్ నియమాలను అనుసరించి పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషక విలువలు గల ఆహారం అందించాలి. జిల్లా సమాచారం... ప్రాథమిక పాఠశాలలు 577 విద్యార్థుల సంఖ్య 23,398 ప్రాథమికోన్నత పాఠశాలలు 89 విద్యార్థుల సంఖ్య 6,373 ఉన్నత పాఠశాలలు 165 విద్యార్థులు 37,019సోమవారం : కిచిడి, కోడిగుడ్డు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మంగళవారం : అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటేబ్ కర్రీ, రాగిజావ బుధవారం : అన్నం, పప్పు, ఆకుకూర, కోడిగుడ్డు వెజిటేబుల్ కర్రీ గురువారం : వెజ్ బిర్యానీ, మిక్స్డ్వెజిటేబుల్ కర్రీ, రాగిజావ శుక్రవారం : అన్నం, సాంబార్, మిక్స్డ్వెజిటేబుల్ కర్రీ, కోడిగుడ్డు శనివారం : అన్నం, పప్పు, ఆకుకూర, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, రాగిజావ పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూ... -
విద్యార్థులకు ఉచిత వాహన సౌకర్యం
ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం సర్పంచ్ ఏలేటి ప్రశాంత్రెడ్డి తన సొంత నిధులతో వాహన సౌకర్యం కల్పించారు. టాటా ఏస్ వాహనం కొనుగోలు చేశాడు. దూర ప్రాంత విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాత ఎల్లాపూర్తోపాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. సర్పంచ్ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు. -
జోరుగా జీరో దందా..!
భైంసాటౌన్: జిల్లాలో హార్డ్వేర్ జీరో దందా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం భవన నిర్మాణ రంగం పనులు జోరుగా సాగుతుండడంతో ఐరన్, సిమెంట్కు గిరాకీ పెరిగింది. అయితే, కొందరు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా రూ.కోట్లాది విలువైన సరుకును జీరోలో కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర జిల్లాకు సరిహద్దుగా ఉండడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి జీరోలో సరుకులు సరఫరా అవుతున్నాయి. స్థానిక వ్యాపారులు సైతం పన్నులు తప్పించుకునేందుకు జీరోలో సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే సరి.. లేదంటే అంతే సంగతి అన్నచందంగా మారింది. ముఖ్యంగా నిర్మాణ రంగ సామగ్రి జీరోలో భారీగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు.. జీఎస్టీ ఏర్పాటు తరువాత కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు పనిలేకుండా పోయింది. జిల్లాలో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి, నిబంధనలు ఏ మేరకు అమలవుతున్నాయి.. ప్రభుత్వానికి సక్రమంగా ట్యాక్స్ చెల్లింపులు జరుగుతున్నాయా.. అనే విషయాలపై సరిగా దృష్టి పెట్టడం లేదు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు వ్యాపారులు జీరో దందాకు తెరలేపుతున్నారు. రూ.కోట్లలో అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఐరన్ వ్యాపారం.. నిర్మాణ రంగానికి సంబంధించి జిల్లాలో ఐరన్ దందా జీరోలో సాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో ఓ ఐరన్ లోడ్ లారీ పట్టుబడడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా భైంసా పట్టణ కేంద్రంలో పలువురు హార్డ్వేర్ వ్యాపారులు ఎలాంటి బిల్లులు లేకుండా మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జీరోలో స్టీల్ రాడ్ దిగుమతి చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని జాల్నా నుంచి ఎక్కువ మొత్తంలో ఐరన్ అక్రమంగా తీసుకొచ్చి, స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇలా జీరో దందా నిర్వహిస్తున్న వ్యాపారులు ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. హార్డ్వేర్ దుకాణాలే కాకుండా ఇతరత్రా వ్యాపారులు సైతం ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో జీరోలో సరుకులు తెప్పించుకుంటూ పన్నులు ఎగ్గొడుతున్నారు. అక్రమ దందా నిర్వహిస్తే చర్యలు.. బిల్లులు లేకుండా సరుకులు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి పన్ను ఎగవేయడం చట్టరీత్యా నేరం. వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తాం. అక్రమంగా సరుకులు దిగుమతి చేసుకుంటే పన్నుతోపాటు వందశాతం జరిమానా విధిస్తాం. – ఈశ్వర్, కమర్షియల్ ట్యాక్స్ అధికారి, నిర్మల్ -
రెండుగా చీలి.. కుప్ప కూలి
లక్ష్మణచాంద మండలంలో శుక్రవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు మండలంలోని ధర్మారం గ్రామంలో మహా పోచమ్మ ఆలయ సమీపంలోని భారీ రావి వృక్షం రెండుగా చీలి ఇలా కూలిపోయింది. ఉదయం కూలిన చెట్టును చూసి గ్రామస్తులు ఆందోళన చెందారు. సుమారు 50 ఏళ్ల మహావృక్షం కూలిపోయిందన్నారు. కొంతకాలంగా వృక్షం కాండానికి పురుగు సోకిందని, ఈ క్రమంలో బలహీనపడి గాలికి విరిగిందని తెలిపారు. పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ఈ చెట్టుకింద సేద తీరేవారని తెలిపారు. – లక్ష్మణచాంద -
ఆరుతడి పంటలు వేసుకోవాలి
● డీఏవో అంజిప్రసాద్ కుంటాల: ఈ వానా కాలంలో రైతులు తక్కువ నీటి వినియోగం ఉన్న ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని డీఏవో అంజిప్రసాద్ పేరొన్నారు. మండలంలోని కల్లూరు గ్రామపంచాయతీ ఆవరణలో రైతులకు శనివారం ఫార్మర్ రిజిస్ట్రీ చేయించారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు పొందవచ్చన్నారు. దీని ద్వారా రుణాలు, రాయితీలు రైతులకు సకాలంలో అందుతాయని తెలిపారు. రైతులు కందులు, మినుములు పెసర్లు, నువ్వులు, ఆవాలు వేసుకోవడం మంచిదని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పెంటవార్ దశరథ్, ఏఈవో లక్ష్మి, రైతులు పాల్గొన్నారు. -
ఉల్లంఘనులపై కొరడా
భైంసాటౌన్: వాహనదారులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఏఎస్పీ సాయికిరణ్ హెచ్చరించారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పట్టణంలో శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్డ్రైవ్, రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడపడంవంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 16 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై మైనర్ డ్రైవింగ్ కేసు, ఇద్దరిపై ట్రిపుల్ రైడింగ్ కేసు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ లేని తొమ్మిది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై డ్రంకెన్డ్రైవ్, 26 మందికి రూ.18,500 స్పాట్ చలాన్ కేసులు నమోదు చేశారు. కెమెరా చలాన్ కేసులు, ఇతర కేసులకు సంబంధించి మొత్తం 54 కేసులు నమోదు చేయగా, రూ.21,355 జరిమానా వసూలు చేసినట్లు సీఐ సాయికుమార్ తెలిపారు. -
సెలవులకు టాటా..
నిర్మల్: వేసవి సెలవులు ముగిశాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో కొత్త విద్యా సంవత్సరంపై ఉత్సాహం నెలకొంది. కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త లక్ష్యాలతో విద్యార్థులు స్కూల్ డేస్కు స్వాగతం పలకనున్నా రు. మరోవైపు సెలవుల్లో ఎంజాయ్ చేసిన తమ పిల్లలను క్రమంగా చదువుల వైపు మళ్లించేందుకు తల్లిదండ్రులు మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. తమ మదిలో దాచుకున్న సెలవుల జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకోవడానికి, కొత్త స్నేహితులు ఎవరవుతారోనని విద్యార్థులూ ఆతృతగా ఉన్నారు. జాలీగా హాలీడేస్.. విద్యార్థి జీవితంలో అత్యంత ఇష్టమైనవి వేసవి సెలవులు. ఈ సెలవులు ఆటలు, అమ్మమ్మ, నాన్నమ్మల ఇళ్లకు ప్రయాణాలు, శుభకార్యాలు, బంధువుల ఇళ్ల సందర్శనలు, విహారయాత్రలు ఇలా జాలీగా గడిచిపోయాయి. చాలామంది చిన్నారులు ఈ వే సవిని వృథా చేయకుండా డ్రాయింగ్, కరాటే, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, భరతనాట్యం తదితర ఆటపాటలను నేర్చుకున్నారు. సిద్ధమవుతున్న స్కూళ్లు.. ఉపాధ్యాయులు కూడా కొత్త విద్యాసంవత్సరానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పాఠశాలల్లో తరగతి గదుల పరిశుభ్రత, బెంచీలు, బ్లాక్బోర్డులు, తాగునీటి సౌకర్యం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు నమోదు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటికే బడిబాట పూర్తిచేసుకున్నారు. విద్యా సంవత్సరం మొదటి రోజు విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. కొత్తగా ఒకటో తరగతిలో చేరే చిన్నారులకు ఇది జీవితంలో తొలి విద్యాప్రయాణం. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. ఉన్నత తరగతులకు వెళ్లే విద్యార్థులు కూడా కొత్త సిలబస్, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఉత్సాహంగా.. ప్రశాంతంగా.. రెండు నెలల సెలవుల తర్వాత ఒక్కసారిగా చదువుల ఒత్తిడిలోకి వెళ్లకుండా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం ఉత్సాహంగా, ప్రశాంతంగా మొదలుపెట్టేలా చేయాలని సూచిస్తున్నారు. సమయపాలన, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.కొత్త బ్యాగులు, పుస్తకాలు..సెలవుల్లో హాయిగా గడిపిన చిన్నారులు ఇప్పుడు మళ్లీ చదువుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం కొత్త బ్యాగులు, యూనిఫాంలు, షూస్, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాల సందడి నెలకొంది. విద్యాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లూ కిటకిటలాడుతున్నాయి. హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలకు అవసరమైన సామగ్రిని సమకూర్చడంలో తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. చాలావరకు ప్రైవేటుస్కూళ్లు పుస్తకాలు విక్రయిస్తున్నాయి. -
ఎరువుల కోసం బారులు
ముధోల్: జిల్లాలో అడపా దడపా వర్షాలు కురస్తుండడంతో రైతులు పత్తి, సోయా, మొక్కజొన్న విత్తుకుంటున్నారు. దీంతో ఎరువుల కోసం పీఏసీఎస్ కార్యాలయాలకు వెళ్తున్నారు. శనివారం ముధోల్ పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు వేకువజామునే ఇలా బారులు తీరారు. డీఏపీ కోసం మండలంలోని విఠోలి, బ్రహ్మణ్గావ్, ఆష్ట తదితర గ్రామాల రైతులు వచ్చారు. ఉదయం 4 గంటల నుంచే క్యూలో బారులు తీరారు. 400 బస్తాలు రావడంతో అధికారులు 7 గంటలకు రైతులకు టోకెన్లు అందించి ఎరువులు విక్రయించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎరువులు వస్తాయని సీఈవో భూమయ్య తెలిపారు. -
నిర్మల్లో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్
నిర్మల్చైన్గేట్: నిర్మల్ పట్టణంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, కూచాడి సత్యమ్మ ప్రకాశ్రావు కంటి పరీక్ష కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్యం అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రారంభ దశలోనే కంటి సంబంధిత సమస్యలను గుర్తించి తగిన వైద్యం పొందవచ్చన్నారు. క్లిష్టతరమైన నేత్ర సమస్యలు ఉన్నవారు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిపుణుల సేవలను పొందేలా ఈ కేంద్రం వారధిగా పనిచేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో ఇటువంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో కూచాడి శ్రీహరిరావు, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నర్సారెడ్డి చిరస్మరణీయుడు ప్రజాసేవను జీవిత ధ్యేయంగా చేసుకుని నిస్వార్థంగా పనిచేసిన మహానేత పొద్దుటూరి నర్సారెడ్డి అని, ఆయన చిరస్మరణీయుడని, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఇటీవల ఏర్పాటు చేసిన పి.నర్సారెడ్డి విగ్రహానికి శనివారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా నర్సారెడ్డి అందించిన సేవలు ఆదర్శప్రాయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా జీవించిన ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. -
గిరి‘జన’గోడు పట్టేదెవరికి?
ఖానాపూర్/పెంబి: ఆధునిక సాంకేతికత దూసుకుపోతున్నా.. జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజల జీవనం మాత్రం ఇంకా దశాబ్దాలు వెనుకబడి ఉంది. రవాణా సౌకర్యాలు లేక ఆదివాసీలు రోజురోజుకూ ప్రాణాలు పణంగా పెట్టుకుని జీవితం సాగిస్తున్నారు. ఐటీడీఏ కార్యాలయం ఉన్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించే నాథుడు లేడని గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగి వెళ్తారని, తర్వాత కన్నెత్తి చూడరని వాపోతున్నారు. ఎడ్లబండిలోనే ప్రసవం.. మే 29న పెంబి మండలం దోందరి గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ తోడం సునీతకు తెల్లవారు జామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా, రోడ్డు సౌకర్యం లేక గ్రామానికి 10 కి.మీ. దూరంలోనే నిలిచిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో తీసుకుని బయల్దేరారు. అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే సునీత ప్రసవించింది. ఈ సంఘటన గిరిజన గ్రామాల్లోని రవాణా దుస్థితిని బయటపెట్టింది. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి.. పెంబి మండలం పస్పుల, తులసిపేట, యాపల్గూడ, వస్పల్లి, దోందరి, గుమ్మేన, వెంకంపోచంపాడ్, రామ్నగర్, సత్తుగూడ, అర్చనతండా గ్రామాలు, ఖానాపూర్ మండలం ఎర్వచింతల, కోలాంగూడ, రాజురా తదితర గ్రామాల్లో ఇదే సమస్య తీవ్రంగా కొనసాగుతోంది. ఈ గ్రామాలకు చేరుకోవాలంటే కడెం, దోత్తి వాగులు, వంకలు దాటాల్సి ఉంటుంది. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే రోజుల తరబడి గ్రామాలు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నాయి. కలగానే వంతెనలు.. 2021లో వచ్చిన భారీ వరదల్లో పస్పుల–అర్చనతండా మధ్య కడెం వాగుపైని వంతెన కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు పునర్నిర్మాణం జరగలేదు. యాపల్గూడ–కోసగుట్ట మధ్య దోత్తి వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా అటవీ అనుమతుల పేరుతో పనులు నిలిచిపోయాయి. పెంబి మండలంలోని అంకెన, రాయదారి, పోచంపల్లి, గోదుమలపైన, గోదుమల క్రింద, కర్ణంలోద్ది గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే కడెం వాగు దాటాల్సి ఉంటుంది. లేదంటే ఖానాపూర్ మీదుగా 80 కిలోమీటర్ల చుట్టుప్రయాణం చేయాల్సి వస్తోంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని.. రేషన్, పెన్షన్, వైద్యం, విద్య కోసం కూడా వాగులు, వంకలు దాటి సుదూర ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. సరైన రహదారులు, వంతెనలు, విద్యుత్, వైద్య సౌకర్యాలు లేక గిరిజనులు ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేకుండా జీవితం సాగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గిరిజన గ్రామాలకు రహదారులు, వంతెనలు, వైద్యం, విద్యుత్ సౌకర్యాలు కల్పించి దశాబ్దాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
జిల్లాలో ఇళ్ల లెక్క తేలింది
నిర్మల్చైన్గేట్: జిల్లాలో జనగణన–2027కు స ంబంధించిన మొదటి దశ ప్రక్రియ పూర్తయింది. గృహాల గుర్తింపు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,14,686 గృహాలు ఉన్నట్లు ఎన్యూమరేటర్లు గుర్తించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కింపు జరగనుంది. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం జనగణన–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 1,405 ఎన్యూమరేటర్లు, 253 సూపర్వైజర్లును నియమించారు. స్వీయ గణనకు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అవకాశం కల్పించారు. తర్వాత మే 11 నుంచి గృహాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమై జూన్ 9వ తేదీతో ముగిసింది. గృహాలు, జనాభా వివరాలు.. జనగణనలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 49,968 గృహాలు ఉన్నట్లు గుర్తించగా, ఇక్కడి జనాభా 1,88,369గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 1,64,718 గృహాలు ఉన్నట్లు తేలగా, జనాభా 6,06,718గా ఉంది. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో 28,917 గృహాలు, భైంసాలో 12,172 గృహాలు, ఖానాపూర్లో 8,879 గృహాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా జనగణన డిజిటల్ పద్ధతిలో జరగనుంది. ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. అన్ని వివరాలను యాప్లోనే నిక్షిప్తం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట్ల ఆఫ్లైన్ నమోదుకు కూడా అవకాశం కల్పించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణనపెరిగిన గృహాలు.. 2011 జనగణనతో పోలిస్తే జిల్లాలో గృహాల సంఖ్య 48,923 పెరిగింది. 2011లో 1,65,768 గృహాలు ఉండగా, ప్రస్తుతం 2,14,68కి చేరాయి. జనాభా 12 శాతం పెరిగింది. 2011లో జిల్లా జనాభా 7,09,418 ఉండగా, ప్రస్తుతం 7,94,696కి చేరింది. పట్టణాల్లో గృహాల సంఖ్య దాదాపు మూడింతలు పెరిగింది. 2011లో పట్టణాల్లో 18,274 గృహాలు ఉండగా, ప్రస్తుతం 49,968కి చేరాయి. ఆయా పట్టణాల జనాభా 2011లో 1,50,457 ఉండగా, ప్రస్తుతం 1,88,364కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 2011లో 1,47,489 గృహాలు, 5,52,961 జనాభా ఉండగా, ప్రస్తుతం 1,64,718 గృహాలు, 6,06,300 జనాభాగా నమోదైంది. జనగణన ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. -
కేవీ.. మరోసారీ..
భైంసా: బాసరలో కేంద్రీయ విద్యాలయం(కేవీ) ఏ ర్పాటు.. దేవుడు వరమిచ్చినా పూజారి కరునించని చందంగా మారింది. ఈ విద్యా సంవత్సరం కచ్చి తంగా ప్రారంభమవుతుందని జిల్లావాసులు, తల్లి దండ్రులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ‘సారీ’ నిరాశే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని బాసరకు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన స్థలం ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. అయినా ఇప్పటివరకు పాఠశాల ప్రారంభానికి అవసరమైన చర్యలు కనిపించడం లేదు. ఈ విద్యా సంవత్సరం కూడా కేవీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రముఖ పుణ్యక్షేత్రం.. బాసరలో ఇప్పటికే దేశ ప్రఖ్యాతి గాంచిన సరస్వతి ఆలయం, రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) వంటి విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి వస్తే స్థానిక విద్యార్థులతోపాటు ఆర్జీయూకేటీ సిబ్బంది, కేంద్ర సంస్థల ఉద్యోగుల పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. దస్త్రాల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్.. మరోవైపు గతంలో బాసరలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రతిపాదన కూడా ఫైళ్లకే పరిమితమైంది. కేంద్రీయ విద్యాలయం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ రెండింటి విషయంలోనూ స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కేంద్రీయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇంగ్లిష్ మాధ్యమంతోపాటు జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు, పోటీ పరీక్షలకు అనుకూలమైన బోధన అందుబాటులో ఉంటుంది. అలాంటి అవకాశం బాసర విద్యార్థులకు దక్కకుండా పోతుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కేవీ ఏర్పాటు ప్రస్తుతం ఏ దశలో ప్రక్రియ ఉందో అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్ర మంత్రి పరిశీలనలో ప్రతిపాదనలు.. కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలనలో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 47 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని విద్యాలయాలకు సంబంధించి స్థల సేకరణ, అక్కడి భౌగోళిక పరిస్థితులు, కమ్యూనికేషన్ వ్యవస్థ వంటి అన్ని వివరాలను పలు రాష్ట్రాలు పంపించాయి. ఇప్పటికే సంబంధిత అధికారులు పరిశీలన కోసం క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చారు. కేంద్రం అనుమతి వస్తే తరగతులు ప్రారంభం అవుతాయి. ఏళ్లుగా డిమాండ్.. బాసరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రజలు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కేవీకి ఆమోదం తెలిపింది. అనంతరం పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. శాశ్వత భవనాల నిర్మాణానికి సమయం పట్టే నేపథ్యంలో మొదట్లో అద్దె భవనాల్లోనే తరగతులు ప్రారంభించడం ఆనవాయితీ. కానీ బాసర విషయంలో అలాంటి చర్యలు కూడా కనిపించకపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాత్కాలిక భవనంలో అయినా తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్థలం పరిశీలన.. కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి బాసరలో రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాసరలోని సర్వే నంబర్ 4లో కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఉందని తెలిపారు. ఈ సర్వే నంబర్లో 28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అప్పటి భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి అధికారులకు నివేదిక ఇచ్చారు. ఆ స్థలంలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. ఈ స్థలంలోనే శాశ్వత భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బాసరలో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే బాసరలో ఈ ఏడు తరగతులు ప్రారంభమవుతాయి. -
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
కుంటాల: గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని డీపీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. కుంటాలలో స్టీల్ బ్యాంకును శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. చెత్తను సంపదగా మార్చి పంచాయతీకి ఆదాయం సమకూర్చుతున్న కార్యదర్శి రాజబాపును ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కల్లూర్ కేజీబీవీ ని సందర్శించారు. పాఠశాల పరిసరాలను శు భ్రంగా చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ కమల్సింగ్, డీఎల్పీవో లక్ష్మణ్, ఎంపీడీవో అల్లాడి వనజ, సర్పంచ్ జక్కుల గజేందర్, ఎంఈవో ముత్యం, కార్యదర్శులు రాజబాపు, సతీశ్, రాజు, గంగప్రసాద్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు పూర్తి
● కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్చైన్గేట్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. జిల్లాలో 1.58 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి, గోదాములకు తరలించినట్లు తెలిపారు. 1.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించామని వివరించారు. 30 వేల మెట్రిక్ టన్నుల జొన్న పంట దిగుబడి రాగా, ఇప్పటికే 20 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. మిగిలిన ధాన్యాన్ని మరో మూడు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. అధికారుల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి చేయగలిగామన్నారు. వానా కాలానికి సంబంధించి రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 10,734 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు వారి అవసరాన్ని బట్టి యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలన్నారు. ప్రతీ ఎరువుల దుకాణం వద్ద ప్రత్యేకంగా ఒక పోస్టరు ఏర్పాటు చేయాలని తెలిపారు. అందులో ఎరువుల ధరలు, తదితర వివరాలు ప్రదర్శించబడతాయన్నారు. రైతుల వద్ద ఎరువుల కోసం అధిక ధరలు వసూలు చేస్తే, 8977751754 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈనెల 26 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతున్నందున, ప్రజలకు ఈ ప్రక్రియపై మీడియా మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, మార్క్ ఫెడ్ డీఎం మహేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, హార్టికల్చర్ అధికారి రమణ పాల్గొన్నారు. -
ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటాలి
నిర్మల్టౌన్: భవిష్యత్ మనుగడ కోసం ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటాలని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 4న జిల్లా అటవీశాఖ కార్యాలయంలో వ్యర్థాలను తగ్గించండి– ప్రకతిని రక్షించండి అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుక్రవారం మెమొంటోలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఎఫ్వో మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ పర్యావరణ పరిరక్షణపై ఉన్న అవగాహన, మక్కువతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రకృతిని కాపాడడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని సూచించారు. విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు నాగినిభాను, రామకృష్ణారావు, నజీర్ఖాన్, సంతోష్, వెన్నెల, సుజాత పాల్గొన్నారు. -
అధికమాసం సందడి
అధికమాసంలో అల్లుళ్లను అత్తగారింటికి ఆహ్వానించి, కొత్త బట్టలు, పిండి వంటలు లేదా తీపి పదార్థాలను రాగి పాత్రలో పెట్టి దానం చేయడం తెలుగువారి సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. వాయినాలు పెట్టి మర్యాదలు చేయడం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయని భావిస్తారు. అధిక జేష్ట మాసం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని నారాయణరెడ్డి మార్కెట్లో శుక్రవారం అధికమాసం సందడి కనిపించింది. ఇత్తడి, రాగి, స్టీల్ పాత్రలను కొనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో దుకాణాలు కిటకిటలాడాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్గా కిరణ్
ఖానాపూర్: ఖానాపూర్ నూతన సబ్ రిజిస్ట్రార్గా కిరణ్ తేజావత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు విధులు నిర్వహించిన స్వామిదాస్ బదిలీపై నిర్మల్కు వెళ్లారు. ఆయన స్థానంలో ప్రభుత్వం కిరణ్ తేజావత్ను నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిరణ్ తేజావత్ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తానని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన సబ్ రిజిస్ట్రార్కు శుభాకాంక్షలు తెలిపారు. -
మురుగు శుద్ధికి మ్యాజిక్ డ్రైన్!
కుంటాల:కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య పరిష్కరించేందుకు, భూగర్భ జలాల వృద్ధి కోసం ఉపాధి నిధులను వెచ్చించి ‘కమ్యూనిటీ మ్యాజిక్ డ్రైన్’ నిర్మాణాలు చేపడుతోంది. కుంటాల మండలం సూర్యపూర్ గ్రామంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా చేపట్టారు. మురుగునీరు, వర్షపు నీరు తక్కువ ఖర్చుతో నేలలో ఇంకేలా ఈ నిర్మాణం రూపొందించారు. భవిష్యత్తులో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉద్దేశం ఇదీ.. మురుగునీరు నిల్వ కాకుండా, రోడ్లపై చేరకుండా, ప్రజారోగ్య సమస్యలను నివారించేందుకు ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఈ వ్యవస్థతో తక్కువ నీటితోనే మురుగునీటి నిర్వహణ సాధ్యమవుతుంది. నిర్మాణ పద్ధతి.. గ్రామంలో వీధుల నుంచి వచ్చే మురుగునీరు ఒకే చోట చేరే స్థలంలో ఈ గుంతను నిర్మిస్తారు. మొదట 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 5 నుంచి 6 అడుగుల లోతు గల గుంతను తవ్వుతారు. నీరు క్రమంగా ఇంకేలా గుంతలో వివిధ రకాల పదార్థాలను పొరలు పొరలుగా వేయాలి. మొదట పెద్ద రాళ్లు, షాబాద్ బండలను అమర్చాలి. దాని పైన చిన్న కంకర సైజు చిప్స్ (10 ఎంఎం రాళ్లు), ఆ తర్వాత ఇసుకను వేయాలి. మురుగునీరు నేరుగా గుంతలోకి వెళ్లేలా మధ్యలో రంధ్రాలు ఉన్న సిమెంట్ పైపును అమర్చుతారు. ఈ పైపు నీటిలోని మట్టి, చెత్త వంటి సిల్ట్ను ఆపి, కేవలం నీటిని మాత్రమే చుట్టూ ఉన్న రాళ్ల పొరల్లోకి పంపుతుంది. గుంత పైభాగాన మట్టి లేదా కాంక్రీట్ మూతతో కప్పి ఉంచుతారు. దీంతో మురికి వాసన రాకుండా, గుంత ఉన్నట్లు బయటికి కనిపించకుండా ఉంటుంది. ప్రయోజనాలు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాయి. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచేందుకు అనుకూలంగా ఉంటాయి. ప్రతీ 100 మీటర్ల నిర్మాణానికి తప్పనిసరిగా మూడు ఇంకుడు గుంతలు నిర్మించాలి. ఇందుకు సుమారు రూ. 90 వేలు మాత్రమే ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. మురుగునీరు శుద్ధి అయి నేరుగా భూగర్భంలోకి ఇంకడం వల్ల భూగర్భ జలాల స్థాయి పెరుగుతుంది. గ్రామ పంచాయతీకి మురుగు కాలువలను శుభ్రపరిచే భారం తగ్గుతుంది. దోమలు పెరగవు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా అరికట్టవచ్చు. -
అడవులను రక్షిస్తేనే మనుగడ
సారంగపూర్: అడవులను రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని అటవీ శాఖ నిర్మల్ మండల అధికారి షేక్ ఆదం నాగినీభాను అన్నారు. చించోలి(బి)అర్బన్ పార్కులో గురువారం ప్రజాపాలన పల్లె ప్రగతిలో భాగంగా వన మహోత్సవం నిర్వహించా రు. మొక్కలు నాటారు. అనంతరం స్థానికులతో కలిసి పార్కును సందర్శించారు. ఈసందర్భంగా అటవీ అధికారి మాట్లాడుతూ ప్రకృతిలో అన్నింటికన్నా ప్రధానమైనది జీవవైవిధ్యమన్నారు. దానిని సక్రమంగా ఉంచాలంటే అడవులను సంరక్షించుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి రక్షించాలని తెలిపారు. ఎఫ్ఆర్వో రామకృష్ణారావు, డీఆర్వో నజీర్ఖాన్, అటవీశాఖ సిబ్బంది, పార్కు సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
లక్ష్యం దాటని తునికాకు చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం దాటలేదు. అటవీశాఖ నిర్దేశించిన లక్ష్యంలో 50 శాతం మాత్రమే సేకరించారు. భూసేకరణ ప్రాంతం పరిశీలనబాసర: మండల కేంద్రం రైల్వే స్టేషన్, నవేగావ్ రోడ్ వద్ద ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ ప్రాంతాన్ని భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత సర్వే నంబర్లు, భూ విస్తీర్ణం, ప్రస్తుత భూ పరిస్థితులు, ప్రాజెక్టుకు అవసరమైన భూమి వివరాలను అధికారులు పరిశీలించారు. అనంతరం తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో బాసర తహసీల్దార్ పవన్చంద్ర, ఆర్ఐ అభిమన్ తదితరులు పాల్గొన్నారు. ఇది జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా మిగిలిన మరుగుదొడ్లు. ఇదే పాఠశాలలో ప్రస్తుత డీఈవో భోజన్న చదువుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఈ పాఠశాలలో 265 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంది. నిర్మల్ రూరల్: మూడు రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే జిల్లాలోని అనేక బడుల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, మధ్యాహ్న భోజనషెడ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. కొన్ని పాఠశాలల్లో నిర్మాణ పనులు మూడేళ్ల క్రితమే ప్రారంభమైనా ఇంకా ముగింపు దశకు చేరలేదు. ఫలితంగా విద్యార్థులు చెట్ల నీడలో చదువుకోవాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనం వంట కూడా చెట్ల కిందే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిచెన్ షెడ్లు ఇలా.. 235 పాఠశాలలకు కిచెన్ షెడ్లు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 5 చోట్ల మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఒక్క చోట కూడా నిర్మాణం పూర్తి కాలేదు. మిగిలిన 230 పాఠశాలల్లో పనులు ఇంకా మొదలు కాలేదు. ప్రభుత్వం రూ.2 లక్షలు మంజూరు చేసినా ఆ నిధులు సరిపోవడం లేదని అధికారులు నివేదించారు. కనీసం రూ.3.50 లక్షలు మంజూరు చేయాలని కోరినా ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. అసంపూర్తిగా ‘మన ఊరు – మన బడి’ పనులు ‘మన ఊరు – మన బడి’ పథకం కింద 260 పాఠశాలలకు వివిధ నిర్మాణాల కోసం నిధులు మంజూ రు అయ్యాయి. అయితే ఈ పనులన్నీ ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. నిర్మించిన వాటికి కూడా నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఫిట్‘లెస్’ బస్సులు!జిల్లా వివరాలు... పనులు మంజూరైనవి పూర్తయినవి పనులు మరుగుదొడ్లు 272 16 40 కిచెన్ షెడ్లు 235 0 05 ప్రహరీలు 261 10 70బుల్లెట్టు బండెక్కి.. వాగులు వంకలు దాటి.. -
ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం
నిర్మల్ రూరల్:ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. సింగిల్ యూస్ ప్లాస్టిక్తో పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టాలను వివరించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా బట్ట సంచులు, స్టీల్ వాటర్ బాటిల్స్, స్టీల్ లంచ్ బాక్సులు వాడాలని, భోజనం కోసం మోదుగ లేదా అరటి విస్తర్లను ఉపయోగించడం ఉత్తమమని సూచించారు. జిల్లా పర్యావరణ విద్య అంబాసిడర్, నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ డి.మోహన్రావు మాట్లాడుతూ, విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పర్యావరణ హిత వస్తువులపై ప్రచారోద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. పర్యావరణ హిత వస్తువులతో సెల్ఫీ దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, తడి–పొడి చెత్తను శాసీ్త్రయంగా వేరుచేయడంపై అవగాహన కల్పించారు. చెత్త ఉత్పత్తి అయ్యే చోటనే నాలుగు రకాలుగా విభజించడం ద్వారా కాలుష్యాన్ని అదుపు చేయవచ్చని తెలిపారు. అనంతరం ’ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరుతో ఒక మొక్క) నినాదంతో కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, కళాశాల ఎకో క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ పవన్కుమార్, దోస్త్ కోఆర్డినేటర్ కుంటా శ్రీహరి, పీజీ.రెడ్డి, రమేశ్రెడ్డి, రజిత, ఉమేశ్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
వర్షాధారంగా.. సాగుదాం!
నాగలితో దుక్కి దున్నుతున్న రైతు వీటిని సాగుచేస్తే మేలు.. రైతులు 50 నుంచి 60 శాతం వర్షపాతం నమోదైతే మాత్రమే పంటల సాగుకు శ్రీకారం చుట్టాలని అధికారులు సూచిస్తున్నారు. పప్పు ధాన్యాలు: కందులు, పెసర్లు, మినుములు, బొబ్బర్లు చిరుధాన్యాలు: జొన్నలు, సజ్జలు, రాగులు నూనె గింజలు: నువ్వులు, వేరుశనగ, ఆముదాలు, పొద్దు తిరుగుడు ఆరబెట్టే పంటలు: పత్తి, మిరప(నీటి వసతిని బట్టి) -
వెల్కమ్ పోలీస్ బాస్
సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పోలీస్బాస్ మంగళవారం రాత్రి విచ్చేశారు. డీజీపీ సీవీ ఆనంద్కు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ స్వాగతం పలికారు. వారి వెంట ఉమెన్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా ఉన్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బెల్లంపల్లిలో ఏడాది అదనపు ఎస్పీగా.. డీజీపీ సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(అడిషనల్ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. నేటి పర్యటన ఇలా.. ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైం రివ్యూ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు. వీటితోపాటుపలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. -
అన్నదాత.. సాగుబాట
రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో వాతావరణం చల్లబడింది. సోమవారం మృగశిరకార్తె రోజే తొలకరి పలకరించింది. జిల్లా అంతటా జల్లులు కురిశాయి. మంగళవారం వేకువజామున కుంటాల, కుభీర్, నర్సాపూర్(జి), దిలావర్పూర్, సారంగాపూర్ మండలాల్లో మోస్తరు వాన కురిసింది. దీంతో ఉదయం రైతులు సాగుబాట పట్టారు. కుంటాల, నాగళ్లతో దుక్కులు దున్నుతూ, విత్తనాలు వేస్తూ, ఎరువులు చల్లుతూ బిజీ అయ్యారు. కొందరు రైతులు చేలను సిద్ధం చేసే పనులు మొదలు పెట్టారు. మరికొందరు ఎరువులు, విత్తనాల కోసం దుకాణాల బాటపట్టారు. కుభీర్ మండలంలో 20–20, డీఏపీ ఎరువులు దొరకకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. కొన్ని షాపుల్లో అధిక ధరకు విక్రయించారని రైతులు తెలిపారు. కొందరు రైతులు ఎరువుల కోసం పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లారు. – సాక్షి ఫోటోగ్రాఫర్ నిర్మల్/కుంటాల/కుభీర్ -
ప్రమాదాల నివారణకు చర్యలు
లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు నిర్మల్ అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి పేర్కొన్నారు. సోన్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిని మంగళవారం ఆర్అండ్బీ డీఈ బీమ్ సింగ్తో కలిసి పరిశీలించారు. సోన్ బస్టాండ్ వద్ద సోన్ వాసులు, లక్ష్మణచాంద మండల వాసులు నిజామాబాద్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇక్కడే దిగుతారు. అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో రోడ్డును దాటేక్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాల నివారణ చర్యలపై ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. సోన్ మండలం మాదాపూర్ ఐబీ వద్ద సెంట్రల్ లైటింగ్ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో ఆర్అండ్బీ డీఈ భీమ్సింగ్, ఎస్సై గోపి, ఉప సర్పంచ్ దాసరి రాజేశ్వర్ పాల్గొన్నారు. -
ఫోన్ పోతే ఆందోళన వద్దు
నిర్మల్ టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, పోలీస్ స్టేషన్లో లేదా మీ సే వ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. https://www.ceir.gov.in/ వెబ్ పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమని తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు పోగొట్టుకున్న రూ.12.96 లక్షల విలువైన 108 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. వాటిని జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో మంగళవారం బాధితులకు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ చెక్ చేసుకోవాలని సూచించారు. చోరీ అయిన ఫోన్లు గుర్తించేందుకు పోలీస్ శాఖ ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తుందని తెలిపారు. టెలికాం మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) అప్లికేషన్ పోయిన ఫోన్ను వెతికి పెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ అప్లికేష న్ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 2,250 ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
లక్ష్మణచాంద: రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని కలెక్టర్ భవేశ్మిశ్రా వ్యాపారులను ఆదేశించారు. సోన్ మండల కేంద్రంలోని బాలకిషన్ ఫర్టిలైజర్ షాపును కలెక్టర్ తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల స్టాక్, విక్రయాల రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్టర్లలోని వివరాలను ఆన్లైన్ వివరాలతో పోల్చి చూశారు. పలు కంపెనీ ల విత్తనాల లేబుళ్లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలన్నారు. నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ వసూలు చేయొద్దని సూచించారు. రైతులు కొనుగోలు చేసినవాటికి తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, నకిలీవి అమ్మినా, అధిక ధరలు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు డీసీఎంఎస్ రైతు సేవాకేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఏవో అంజి ప్రసాద్, తహసీల్దార్ సంతోష్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు. -
గాల్లో కలుస్తున్న ప్రాణాలు
● ఈ నెల 5న నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన పశువుల కాపరి న్యాకపు సుధాకర్(74) వెంకూరు శివారులో పశువులు మేపుతుండగా, వర్షం రావడంతో మామిడి చెట్టు కిందకు వెళ్లాడు. చెట్టుపై పిడుగుపడి మృత్యువాత పడ్డాడు. ● గత నెల 31న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం చెలిమల కొలంగూడకు చెందిన టేకంభీం(50) భార్య రాజుబాయి(45) రెబ్బెన మండలం కై రిగూడ సమీపంలో వ్యవసాయ పనుల్లో ఉండగా పిడుగు పడి చనిపోయారు. అదే రోజు ఆసిఫాబాద్ మండలం కౌటగూడకు చెందిన పెందూరు లింగు(50) పత్తి కట్టెలు ఏరుతుండగా వర్షానికి చెట్టు కిందకు వెళ్లగా పిడుగుపాటుకు మరణించాడు. ● గతేడాది జూన్12న ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిప్రిలో నలుగురు, బేల మండలం సాంగిడిలో ఇద్దరు వ్యవసాయ పనుల్లో ఉండగా, ఆరుగురిపై పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు. ● గతేడాది సెప్టెంబర్ 9న మంచిర్యాల జిల్లా పా త బెల్లంపల్లికి చెందిన గెల్లె పద్మ(43) పత్తి చేనులో కలుపు తీస్తుండగా మృత్యువాత పడింది. ● గతేడాది సెప్టెంబర్ 10న నిర్మల్ జిల్లా పెంబి మండలం నాగాపూర్కు చెందిన బండారి వెంకటి(50), భార్యాభర్తలు ఆలకుంట ఎల్ల య్య(37), లక్ష్మి(32) గుమ్మెనఎంగ్లాపూర్ శివారులో పత్తి చేనులో ఉండగా వర్షం పడింది. మంచె వద్దకు వెళ్లగా, ఉరుములు మెరుపులతో పిడుగుపడి ముగ్గురూ మృత్యువాత పడ్డారు. -
పిడుగుల దడ!
జాగ్రత్తలే రక్ష ● చాలా సార్లు చెట్ల కిందకు వెళ్లి పిడుగుపాటుకు గురవుతున్నారు. ఉరుములు మెరుపులు కనిపిస్తే చెట్ల కింది నుంచి వచ్చేయాలి. ● ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్లు, ఎత్తయిన కొండలు, విద్యుత్ స్తంభాలు, నీటి ప్రవాహాలు ఉన్నచోట్ల ఉండకూడదు. ఒకేచోట ఎక్కువ మంది గూమిగూడకూడదు. ● వర్షం పడే సమయంలో వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. కిటికీలు, తలుపులు మూసేయాలి. ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలి. ● పిడుగుపాటుకు గురైన బాధితుడికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. బాధితులు ప్రాణపాయం నుంచి బయట పడడం అరుదు. అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలి. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/కౌటాల: తొలకరి వానలతో ఉమ్మడి జిల్లా ప్రజలకు పిడుగుల దడ మొదలైంది. ఉరుములు, మెరుపులు, శబ్దాలతో భయం వెంటాడుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో వానాకాలం ఆరంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిడుగుల వానలు కురుస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు పదుల సంఖ్యలో పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. మూగజీవాలు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. చనిపోతున్న వారిలో గిరిజనులు, పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నారు. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రమాదం బారిన పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో జిల్లా కలెక్టర్ ద్వారా బాధిత కుటుంబాలు రూ.6లక్షలు పొందవచ్చు. రైతుబీమా ఉంటే మరో రూ.5లక్షల సాయం అందుతుంది. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది. వానాకాలంలో తీవ్రత ఎక్కువ ప్రధానంగా వానాకాలం సీజన్ ప్రారంభంలో పిడుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మేఘాలు రెండు ఒకదానిని మరొకటి తాకినప్పుడు విద్యుత్ శక్తి వెలువడుతుంది. ఇది భూమి వైపు ప్రయాణించే సమయంలో లోహాలు, చెట్లు, ఎత్తయిన కట్టడాలు ఆకర్షిస్తాయి. తొలకరి వర్షాల సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నారు. ప్రాణహానితోపాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. మూగజీవాలు సైతం ఊపిరి విడుస్తున్నాయి. మరికొన్ని సమయాల్లో సెల్టవర్లు, విద్యుత్ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి. ‘దామిని’తో తప్పును ముప్పు ఐఎండీ(భారత వాతావరణ శాఖ) 88శాతం కచ్చితత్వంతో జిల్లాల వారీగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికశాతం నిరక్షరాస్యులే కావడంతో గుర్తించలేకపోతున్నారు. దామిని యాప్ సమాచారాన్ని లోకల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులు, కూలీలకు చేరవేయాల్సి ఉంది. యాప్ వాడే వ్యక్తికి 20నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘దామిని’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7, 14, 21 నిమిషాల ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. రిజిష్టర్ చేసుకుంటే చదువురాని వారు సైతం సులువుగా అప్రమత్తం అయ్యేలా ఆలారం మోగుతుంది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ముందు రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలోనూ అప్రమత్తం చేస్తుంది. ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపుతుంది. జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, దినపత్రికల్లో వచ్చే వాతావరణ సూచనలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. -
వీడని అన్నబంధం
ముగ్గురు తోడబుట్టిన అన్నదమ్ములు.. హైదరాబాద్లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇద్దరికి వివాహాలు అయ్యాయి. రెండో కొడుకు రాంచందర్ తన పిల్లలకు బాసర జ్ఞానసరస్వతీదేవి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించాలనుకున్నాడు. తండ్రి నాగభూషణ్ అన్న చంద్రశేఖర్, తమ్ముడు మల్లేశ్కుమార్ను తీసుకుని మంగళవారం మధ్యాహ్నం బాసరకు వచ్చాడు. అయితే వీరి ఐక్యతను చూసి విధికి కన్నుకుట్టింది. అమ్మవారి దర్శనానికి ముందు గోదావరిలో పుణ్యస్నానానికి వెళ్లారు. అదే వారికి చివరి స్నానంగా మారింది. ముగ్గురు అన్నదమ్ములనూ మృత్యువు కబళించింది. ఉదయం సంతోషంగా బాసరకు వచ్చిన కుటుంబం గోదావరంత దుఃఖంతో అన్నదములను విగత జీవులుగా తీసుకుని హైదరాబాద్ వెళ్లింది. – భైంసా/బాసర -
పన్ను నొప్పికి ప్రైవేటుకే!
● తాజాగా డెంటిస్టు బదిలీ..నిర్మల్చైన్గేట్: దంత సమస్యలు త్వరగా నయం కావు. సకాలంలో సరైన చికిత్స చేయించుకోకపోతే ఇతర ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతారు. అయితే జిల్లాలో దంత సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దాస్పత్రి మెరుగైన వైద్యం అందడం లేదు. డెంటల్ విభాగం పరికరాలు లేక, నిపుణులైన డాక్టర్లు లేక ఆస్పత్రికి వచ్చినవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. నొప్పి అధికంగా ఉన్నవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఓపీ సేవలకే పరిమితం.. జిల్లా పెద్దాస్పత్రి దంత విభాగంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డీప్ క్లీనింగ్, దంతాల ఫిల్లింగ్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ వంటి అన్ని ముఖ్యమైన చికిత్సలు అందించాల్సి ఉన్నా, ప్రస్తుతం ఔట్పేషెంట్(ఓపీ) సేవలతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఒక్క డాక్టర్ మాత్రమే డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కూడా ఇటీవల ఖానాపూర్కు బదిలీ అయ్యారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. పరికరాలు లేక సేవలు అందక.. దంత చికిత్సకు అత్యవసరమైన డెంటల్ చైర్, డిజిటల్ ఎక్స్–రే, ఓరల్ కెమెరా, అల్ట్రాసోనిక్ స్కేలర్, పాలిషింగ్ బ్రష్ వంటి పరికరాలు కూడా పెద్దాస్పత్రిలో లేవు. ఉన్న డెంటల్ చైర్ కూడా పాడైపోయింది. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు నొప్పి నివారణ మాత్రలు రాసి పంపిస్తున్నారు. సదుపాయాలు లేక రోజుకు 10 నుంచి 15 మంది రోగులు మాత్రమే సాధారణ చికిత్స పొందుతున్నారు. పరికరాలు సమకూర్చి, ఎండీ స్థాయి నిపుణులను నియమించి దంత విభాగాన్ని బలోపేతం చేయాలని రోగులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బదిలీపై రావచ్చు.. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు టీవీవీపీకి చెందిన వైద్యురాలితో డెంటల్ ట్రీట్మెంట్ అందించాం. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె ట్రాన్స్ఫర్ అయ్యారు. జనరల్ ఆస్పత్రికి కూడా సాధారణ బదిలీల్లో డాక్టర్ వచ్చే అవకాశం ఉంది. – సీవీ.శారద, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ఐదు నెలలగా జీజీహెచ్లో నమోదైన డెంటల్ ఓపీ.. జనవరి 215 ఫిబ్రవరి 164 మార్చి 158 ఏప్రిల్ 181 మే 150 -
నిజాయతీ చాటుకున్న పార్పల్లి వాసి..
లక్ష్మణచాంద: తన ద్విచక్ర వాహనంలో ఇతరుల డబ్బులు రావడంతో ఇంటికి వెళ్లిన తరువాత గమనించి తనవి కావని తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు మండలంలోని పార్పల్లి వాసి. మండల కేంద్రానికి చెందిన గంట శంకర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి పంట డబ్బులను అవసరం నిమిత్తం రూ.30 వేలు విత్డ్రా చేసుకుని తన బైకులో పెట్టుకున్నా అనుకుని పార్పల్లికి చెందిన ఒడిషెల భీమేష్ బైక్లో పెట్టాడు. ఇంటికి వెళ్లిన శంకర్ తన బైకు కవర్లో డబ్బులు లేకపోవడంతో ఆందోళన చెంది మళ్లీ బ్యాంకు వచ్చాడు. ఇదే భీమేష్ బ్యాంకుకు పని నిమిత్తం వచ్చి అనంతరం ఇంటికి వెళ్లాడు. తన ద్విచక్ర వాహనం ట్యాంకు కవర్లో డబ్బులు చూసి షాక్ అయ్యాడు. తేరుకుని తనవి కావని వెంటనే లక్ష్మణచాంద బ్యాంకుకు చేరుకున్నాడు. తన బైకులో ఎవరివో రూ.30 వేలు వచ్చాయని మేనేజర్ రాజశేఖర్కు తెలిపాడు. ఆందోళనతో వచ్చిన శంకర్ డబ్బులుగా గుర్తించి భీమేష్ చేతుల మీదుగా శంకర్ తల్లి ముత్తవ్వకు అందచేశారు. వారు భీమేష్ను అభినందించారు. కృతజ్ఞతలు తెలిపారు. నిజాయతీ చాటుకున్న హోంగార్డు బాసర: బాసర ఆలయ సిబ్బంది మరోమారు నిజాయతీ చాటుకున్నారు. ఇటీవలే హైదరా బాద్కు చెందిన ఓ భక్తురాలి బంగారు చెవిపో గు ఆలయ ఆవరణలో పడిపోగా, వెతికి అప్పగించారు. తాజాగా కుంటాల మండలం లింబ (కే)గ్రామానికి చెందిన సునీత అనే భక్తురాలు సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవా రి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం కో సం క్యూలైన్లో పర్సు పోగొట్టుకుంది. అందులో ఆధార్, ఏటీఎం కార్డు, సెల్ ఫోన్, రూ.2 వే ల నగదు ఉన్నాయి. ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విధులు నిర్వహిస్తున్న ఆల య హోంగార్డులు ఇందాల్ నారాయణ పర్సు ను వెతికి భక్తురాలికి తిరిగి అప్పగించాడు. హోం కార్డును భక్తులు అభినందించారు. -
సర్పంచులకు తీపి కబురు
లక్ష్మణచాంద: నూతనంగా ఎన్నికై న సర్పంచులు గత కొన్ని నెలలుగా గౌరవ వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచుల గౌరవ వేతనాలు విడుదల చేసింది. 2025 డిసెంబర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికై న సర్పంచులు అదే నెల 20వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత డిసెంబర్ 10 రోజులు, 2026 జనవరి నుంచి మే నెల వరకు (5 నెలలు) మొత్తం ఆరు నెలల గౌరవ వేతనాలను ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది. జిల్లాకు ఇలా.. జిల్లాలో మొత్తం 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పెర్కపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకపోవడంతో 399 మంది సర్పంచులు ఉన్నారు. ఇందులో 10 మంది సర్పంచుల గౌరవ వేతనాలకు కొన్ని కారణాలతో అప్రూవల్ కాలేదు. మిగిలిన 389 మంది సర్పంచుల వేతనాలు ప్రభుత్వం విడుదల చేసింది. 10 మంది సర్పంచుల వేతనాలు కూడా త్వరలోనే అనుమతి పొంది విడుదల అవుతాయని అధికారులు తెలిపారు. వేతనాల మొత్తాన్ని సర్పంచ్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ట్రేజరీకి పంపినట్లు జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. వేతనాలు విడుదలైన విషయం తెలిసి జిల్లా సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సర్పంచ్లు ఇక ముందు మరింత ఉత్సాహంతో గ్రామాభివృద్ధి పనుల్లో పాల్గొంటారని అంటున్నారు. 389 మంది సర్పంచులకు నెలవారీ విడుదలైన మొత్తాలు.. డిసెంబర్ (10 రోజులు) రూ.8,13,010 జనవరి రూ.25,28,500 ఫిబ్రవరి రూ.25,28,500 మార్చి రూ.25,22,000 ఏప్రిల్ రూ.25,15,500 మే రూ.25,15,500 మొత్తం 1,34,27,838సర్పంచ్ల ఖాతాల్లో జమ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ ప్రథమ పౌరుల డిసెంబర్ నెలలో 10 రోజులతోపాటు, జనవరి నుంచి మే నెల వరకు ఐదు నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలు విడుదల చేసింది. జిల్లాకు రూ.1,34,27,838 విడుదల అయ్యాయి. వేతనాలను సర్పంచుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నాం. – శ్రీనివాస్, డీపీవో -
ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు
బాసర: నిజామాబాద్–భైంసా ప్రధాన రహదారిపై బాసర పరిసర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్అండ్బీ శాఖల అధికారులు సంయుక్తంగా ప్రధాన రహదారిని పరిశీలించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 26 యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించినట్లు డీఎస్పీ ఉపేంద్రారెడ్డి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. -
అవినీతి శాఖలు
నిర్మల్అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి నిర్మల్ టౌన్: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యపై పోలీసులు తక్షణం స్పందించి పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించా రు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజ లకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలంటే నేరుగా ఠాణాలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్ప ద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.నిర్మల్: జిల్లాలో ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేస్తున్నా.. ఎంతమందిపై కేసులు పెడుతున్నా.. కలెక్టర్ వర కూ ఫిర్యాదులు వెళ్తున్నా.. అవినీతి మాత్రం తగ్గడం లేదు. గ్రామ పంచాయతీ మొదలుకుని కలెక్టరేట్ వరకూ ప్రతీ పనికో రేటు.. అన్నట్లుగా వసూళ్లరాజ్యం కొనసాగుతోంది. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, రిజి స్ట్రేషన్స్ ఇలా ఆ శాఖ, ఈ శాఖ అని కాదు.. దాదాపు అన్నిచోట్లా పని కంటే.. సంపాదనపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఎక్కడికక్కడ ఓ రేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలామంది మండలస్థాయి అధికారులూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులూ ఉన్నాయి. ఫీల్డ్ విజిట్ లేకున్నా.. జిల్లాలో ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు, పేమెంట్లు చేసే ఓ శాఖలో వాహనాల పేరిట డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత శాఖ అధికారికి ఫీల్డ్వర్క్ ఉండదు. కేవలం ఆఫీస్ పని మాత్రమే ఉంటుంది. అయినా ఓ ప్రైవేటు టాక్సీ కారు ను అద్దెకు తీసుకున్నట్లు అగ్రిమెంట్ చేసుకుని, నెలకు రూ.30 వేలకుపైగా బిల్లులు పెట్టుకున్నట్లు కలెక్టర్తోపాటు ఏసీబీ అధికారులకూ ఫిర్యాదు వెళ్లింది. ‘ఇండస్ట్రియల్’లో ఉందంటూ.. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ప్లానింగ్పైనా ఆ రోపణలు ఉన్నాయి. ఇంటి నిర్మాణ అనుమతి కో సం వెళ్తే ఇందులో పనిచేసే కొంతమంది డబ్బులిస్తే కానీ రాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్పై పెద్దగా అవగాహన లేని ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటే ‘నీది ఇండస్ట్రియల్ ఏరియా’లో ఉంది. పర్మిషన్ రావాలంటే ఖర్చు అవుతుందని డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం. అలాగే.. రెవెన్యూ విభాగంలో పనిచేసే సిబ్బంది గతంలో డబ్బులు తీసుకుని ఆస్తిపన్నులనూ తగ్గించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పని గోరంత.. బిల్లు కొండంత.. ‘ఏం అన్నా.. గింత తక్కువ బిల్లు రాసినవ్.. గిట్లయితే మేమెట్ల బతకాలె. నేను చెప్పింది రాసియన్నా..’ అంటూ జిల్లాకేంద్రంలోని ఓ షాపు నుంచి వస్తువులు తీసుకెళ్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి అన్న మాటలివి. చేసే పనులకు, వారు రాసిచ్చే బిల్లులకు పొంతన ఉండటం లేదు. జిల్లాలోని చాలామంది పంచాయతీ కార్యదర్శులపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అయినా చాలామందిలో మార్పు కనిపించడం లేదు. ప్రతినిధులదీ అదే దారి..! సారంగపూర్ మండలంలో ఓ చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేసుకునే యువకుడు ఇటీవల మృతిచెందాడు. సామాన్య కుటుంబం కావడంతో అదే పనిని తన తమ్ముడికి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధిత ప్రతినిధి డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం. రూ.2 లక్షలు ఇచ్చుకోలేని ఆ కుటుంబం కన్నీళ్లతో వెనుదిరిగింది. జిల్లాకేంద్రంలోని మెడికల్కాలేజీలో అవుట్సోర్సింగ్ నియమాకాల్లోనూ డబ్బులివ్వనిదే పోస్టులు ఇవ్వలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. కానీ.. వాటిని అధికారులు కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటీవల బాసర ట్రిపుల్ఐటీలోనూ సెక్యూరిటీ గార్డుల నియమాకాల్లో ఇదేతంతు కొనసాగింది. చాలాచోట్ల కొంతమంది ప్రజాప్రతినిధులు, నేతలు మధ్యవర్తిత్వం పేరిట సదరు అధికారులతో కుమ్మకై ్క ఆశావహుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దాఖలాలు వెలుగులోకి వస్తున్నాయి.ఫిర్యాదులు చేస్తున్నా.. పైసావసూళ్లు, శాఖల్లో అవినీతిపై చాలాసార్లు ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నా.. జిల్లా అధికారులు పెద్దగా స్పందించడం లేదు. ఓ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వాహనం పేరిట బిల్లులు లేపిన విషయంపై గత కలెక్టర్తో పాటు ఏసీబీ అధికారుల వరకూ ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చేయి తడిపితేనే సర్టిఫికెట్..మిగతా శాఖలతో పోలిస్తే రెవెన్యూశాఖలో అవినీతి అధికంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా.. ఎంతోకొంత చేతిలో పెట్టాల్సిందేనని సామాన్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీలు, పైచదువులకు వెళ్లే పిల్లలకు కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్ తదితర సర్టిఫికెట్లు అవసరం. వీటిని ఇవ్వడానికీ.. డబ్బులు ఆశిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.నెలనెలా వసూలు.. ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే ఎకై ్సజ్శాఖలో కొంతమంది సొంత ఆదాయాన్నీ సమకూర్చుకుంటున్నా రు. ప్రతీ వైన్స్ నుంచి నెలకు ఇంత చొప్పున సంబంధిత అధికారులకు మాముళ్లు వెళ్తున్నాయి. ఇందుకు వైన్సుల పరిధిలో కొనసాగే బెల్ట్షాపులను, మద్యం అమ్మకాలను చూసీచూడనట్లుగా వదిలేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం దుకాణాలతోపాటు సిట్టింగ్ నడిపించే హోటళ్లు, దాబాల నుంచీ రెండుమూడు నెలలకోసారి మాముళ్లు అందుతాయని, అందుకే సదరు సిట్టింగ్ల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.


