Nirmal District News
-
నేరాల తగ్గింపుపై దృష్టిపెట్టాలి
● ఎస్పీ జానకీ షర్మిల ● భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ భైంసారూరల్: నేరాలు తగ్గించేలా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. భైంసారూరల్ పోలీస్స్టేషన్ను శుక్రవారం తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంతాలను, వాహనాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసు వివరాలను, స్టేషన్ రికార్డులను తనిఖీచేశారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. నారీశక్తి కార్యక్రమంలో పాల్గొనే మహిళా కానిస్టేబుళ్ల విధుల గురించి ఆరాతీశారు. పోలీస్ అక్కలో పాల్గొన్న మహిళా సిబ్బందితో మాట్లాడి వారు వెళ్తున్న పాఠశాలల వివరాలు అడిగారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ డ్యూటీలో ఉన్నప్పుడు 100 కాల్స్కు తక్షణమే స్పందించి సంఘటన స్థలానికిచేరుకుని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. పెట్రోలింగ్ సమయాల్లో పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను తనిఖీ చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవా ణా పై ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి తాగే వారిని, వారికి సరఫరాచేసే వారిని గుర్తించి కేసులు నమోదుచేయాలన్నారు. పోలీస్స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలునాటారు. ఏఎస్పీ అవినాశ్కుమార్, సీఐ నైలు, కుభీర్, కుంటాల ఎస్సైలు రవీందర్, భాస్కరాచారి, పోలీసులు ఉన్నారు. -
ప్రజలకు అందుబాటులో కలెక్టరేట్
● కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి నిర్మల్చైన్గేట్: నిర్మల్ కలెక్టరేట్ పట్టణానికి దూరంగా ఉండడంతో పట్టణ ప్రజలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో శుక్రవారం మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కలెక్టరేట్తో పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమా లేక నూతన కలెక్టరేట్ భవనం నిర్మల్లో అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించాడమా అనే విషయమై సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడతానని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జీల సహకారంతో రానున్న మూడున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆదిలాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడే నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని స్పష్టం చేశారు. లేకపోతే అప్పటికి ఆదిలాబాద్ ఎంపీ స్థానం జనరల్ రిజర్వేషన్ అయితే ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. -
● నదీమాతల్లులే ‘నిర్మల్’కు అండ ● ‘సరస్వతీ’కటాక్షంతో పచ్చదనం ● తలాపునే గోదావరి ఉన్నా.. ఎండుతున్న భైంసా డివిజన్ ● ఓవైపు నిండుగా చెరువులు.. ● మరోవైపు వట్టిపోతున్న బోర్లు
ఇక్కడ పారుతున్న చెరువు ఒర్రెలో నుంచి నీటిని పైపుల ద్వారా తన పొలానికి మళ్లించుకునేందుకు తిప్పలు పడుతున్న రైతు పేరు నర్సారెడ్డి. లోకేశ్వరం మండలం ధర్మోరాకు చెందిన ఈయన రెండున్నరెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేస్తున్నాడు. బోరు ఎత్తిపోవడంతో దగ్గరలోని చెరువుకింద ఒర్రె నుంచి ఇలా పైపులు వేసుకుంటూ పంటకు నీరందించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. నిండువేసవిలోనూ నిండుకుండల్లా చెరువులు, మండిపోతున్న ఉష్ణోగ్రతల్లోనూ పచ్చగా పండుతున్న పంటలు.. ఎటుచూసినా కాలువలు, వరి ధాన్యపు సిరులు. లక్ష్మణచాంద మండలం జిల్లాలో కోనసీమను తలపిస్తోంది. సరస్వతీ కాలువ, కాకతీయుల నాటి చెరువుల పుణ్యాన ఈ ప్రాంతమంతా ఎప్పుడూ పచ్చగా ఉంటోంది. ఈ ఒక్క మండలంలోనే 40 వరకు చెరువులు ఉన్నాయి. సరస్వతీ కెనాల్తో నిండుతూ పంటలకు అండగా ఉంటున్నాయి. ఈ వేసవిలోనూ తమ పంటలకు ఏమాత్రం ఢోకా లేదని ఇక్కడి రైతులు అంటున్నారు. ఇక్కడ.. గొర్రెలు మేస్తున్న తన పొలంతో సెల్ఫీ తీసుకుంటున్న యువరైతు పేరు ప్రవీణ్. దిలావర్పూర్ మండలకేంద్రానికి చెందిన ఈయనకు రెండున్నర ఎకరాల సాగుభూమి ఉంది. బోరుబావును నమ్ముకుని వరిసాగు చేశాడు. కానీ.. వేసవి మొదట్లోనే పాతాళగంగ దెబ్బ కొట్టింది. వారం నుంచి బోరు ఎత్తిపోవడంతో నీరు లేక పొలం ఎండుతోంది. చివరకు చేసేది లేక ఇలా.. తన పొలాన్ని మూగజీవాలు మేపడానికి ఇచ్చేశాడు. ఈ సీజన్సాగులో నీరందక రూ.30 వేలు నష్టపోయినట్లు వాపోతున్నాడు. పంట ఎండిపోయింది.. కుంటాల మండలం దౌనెల్లికి చెందిన రైతు అలీమ్. యాసంగి పంటగా రెండెకరాల్లో జొన్న సాగు చేశాడు. భూగర్భజలాలు అడుగంటిపోయి, పంటకు బోరు నీళ్లు అందలేదు. దీంతో జొన్న పంట మొత్తం ఎండిపోయింది. నీరందితే 30–40 క్వింటాళ్ల పంటదిగుబడి వచ్చేదని బాధిత రైతు తెలిపాడు. ఇపుడు ఐదారు క్వింటాళ్లు కూడా వస్తాయో లేవోనని అలీమ్ వాపోతున్నాడు. బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతున్నాడు. అడుగంటిన బావి.. బీడువారిన భూమి కడెం మండలం సదర్మట్ ఆయకట్టు చివరి భూములకు పక్షం రోజులుగా నీరందడం లేదు. చివరి ఆయకట్టు వరకు నీరందకపోవడంతో వరిపొలాలు బీడువారాయి. వేసవి ప్రారంభంలోనే ఇక్కడ బావులు, బోరుబావులూ అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే ఈభూములను కలెక్టర్, జిల్లా అధికారులూ పరిశీలించారు.పొలం.. గొర్రెల పాలు..చెరువు.. ఆయకట్టు ఆదరువు -
సాక్షి చెంతకు జడ్జి
ఖానాపూర్: కోర్టు కేసుల్లో సాక్షులు కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.. ఖానాపూర్లో న్యాయస్థానమే సాక్షివద్దకు వెళ్లి సాక్ష్యాధారాలు తీసుకుంది. ఖానాపూర్ మండలం బావాపూర్(ఆర్) గ్రామంలో గతంలో జరిగిన గొడవతో కేసు నమోదైంది. కేసు చివరి దశలో ఉన్న సమయంలో కేసును వాదించే న్యాయవాది రమణరావు కాలి గాయంతో నడవలేని స్థితిలో ఉన్న సాక్షిని కోర్టు ఆదేశాల మేరకు ఆటోలో కోర్టు ఆవరణ వరకు తీసుకొచ్చాడు. కోర్టు లోపలికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవేందర్తోపాటు సదరు న్యాయవాది ఈ విషయం జడ్జి జితిన్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్జి నేరుగా కోర్టు ఆవరణలో ఆటోలో ఉన్న సాక్షి వద్దకు వచ్చి భయాన స్టేట్మెంట్ తీసుకున్నారు. -
క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటి కే పలువురు దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తున్నారని గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ రుసుములో 25 శాతం రా యితీ కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విని యోగించుకుని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలన్నారు. మార్చి 31తో రాయితీ గడువు ముగుస్తుందన్నారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజుల చెల్లించి రెగ్యులర్ చేసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, యాదవ్కృష్ణ, రాజేశ్కుమార్ పాల్గొన్నారు. అర్హులైన దివ్యాంగులకు యూడీఐడీ కార్డు అర్హులైన దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూడీఐడీ కార్డుల జారీ మార్గదర్శకాలు, దివ్యంగుల సమస్యలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు, దివ్యాంగులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికెట్కు బదులుగా అర్హులైన ప్రతీ దివ్యాంగుడికి యూనిక్ డిసెబిలిటీ ఐడీ (యూడీఐడీ) నంబర్ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 1 నుంచి దివ్యాంగుల పునరావాసం, సాధికారత కోసం డైనమిక్ వెబ్ ఎనేబుల్ సిస్టమ్ను రూపొందించిందన్నారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారు, నూతనంగా యూడీఐడీ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుని ఆసుపత్రిలో స్లాట్ బుకింగ్ చేసి, నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. తర్వాత కార్డులు జారీ అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్డులు 21 రకాల వైకల్యం ఉన్న దివ్యాంగులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ అర్హులైన దివ్యంగులకు ప్రభుత్వ పథకాల లబ్ధి, పునరావాసం, సాధికారతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం యూడీఐడీ కార్డుల జారీ మార్గదర్శకాలపై వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్సింగ్, దివ్యాంగులు, అధికారులు పాల్గొన్నారు. -
మహిళలే బ్రాండ్!
● అన్నిరంగాల్లో రాణించాలి ● కలెక్టర్ అభిలాష అభినవ్ ● కలెక్టరేట్లో మహిళా దినోత్సవం ● వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం నిర్మల్చైన్గేట్: మహిళాశక్తిని చాటుతూ, వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా ప్రత్యేకంగా నిలుస్తోందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మహిళలు మరింతగా రాణించాలని, అన్నిరంగాలలో పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్హాల్లో గురువారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్డీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలే బ్రాండ్గా రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా రూపొందించిన ‘వాక్ ఫర్ దేశీ సీడ్స్’, ‘మిట్టి దీదీ’ కార్యక్రమాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అందుకే జిల్లా మహిళలను అవార్డులు వరిస్తున్నాయని తెలిపారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టినందుకు మహిళలు జిల్లాకు బ్రాండ్ అన్నారు. భవిష్యత్తులో స్వయం సహాయక సంఘాలు మరిన్ని అవార్డులు, ప్రోత్సాహకాలు సాధించాలని ఆకాంక్షించారు. విత్తన చొరవ అభినందనీయం..మితిమీరిన ఎరువులు వాడిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడంతోనే వ్యాధుల బారిన పడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. సంప్రదాయ పంటలు, సంప్రదాయ ఆహారపు అలవాట్లవైపు మళ్లే విధంగా మహిళా సమాఖ్యలు చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రత్యేకంగా నాణ్యమైన దేశీ విత్తనాలను సేకరించి, మహిళా సంఘాలకు విత్తనాలను అందజేసి, సాగు చేయించడంతోపాటు సీడ్బ్యాంక్లు ఏర్పాటు చేస్తామన్నారు. భూసార పరీక్షలనూ మహిళా సంఘాల ద్వారానే చేయిస్తామన్నారు. ఈ రెండింటికీ సంబంధించిన ‘వాక్ ఫర్ దేశీ సీడ్’, ‘మిట్టిదీదీ’ పోస్టర్లను జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లామహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు గంగామణి, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.సేకరించిన దేశీ విత్తనాలు..చిరుధాన్యాలు: కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు మధ్యస్థ ధాన్యం: రాగులు, సజ్జలు, జొన్నలు ఉత్తమ ధాన్యం: గోధుమలు, ధాన్యం(వడ్లు) ధాన్యంలో రకాలు: చిట్టి ముత్యాలు, తులసిబసు, అంబేమొహర్, కోతంబరి, తులసి బాస్మతి, బహురూపి(బలానికి), మైసూర్మల్లిగ(చిన్న పిల్లల్లో ఎదుగుదలకు), రత్నచోడి(కండర పటుత్వానికి), ఇంద్రాణి(ఈ విటమిన్ కోసం), కుజుపఠాలియా, కాలాబట్టి(రోగనివారణకు), కర్పకౌని(శరీర సమతుల్యతకు), నవారా(మధుమేహ బాధితులకు), రక్తశాలి(రక్తహీనత నివారణకు) కులాకార్, పుంగర్, మా పిళ్ళై సాంబ తదితర రకాలు. కూరగాయలు:అన్నపూర్ణ రామ్ములక్కాయ, కాశీ రామ్ములక్కాయ, చిట్టీ రామ్ములక్కాయ, కేసరీ రామ్ములక్కాయ, దేశీ టమాట, వంకాయ, బెండ, సూర్యముఖి/త్రిశూల మిరప, మధ్యస్థ పొడవుకారం మిరపకాయ, బీరకాయ, గుత్తి బీరకాయ, ఆకుపచ్చ కాకరకాయ తదితర కూరగాయలతో పాటు చిలగడ, కర్రపెండలం దుంప విత్తనాలు. మట్టి పరీక్షలు.. దేశీ విత్తనాలు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ భూసార పరీక్షలు చేయడమే ‘మిట్టిదీదీ’ కార్యక్రమం. ఒకప్పటి దేశీవిత్తనాలను కాపాడుకుంటూ ముందుతరాలకు అందించేలా సాగు చేయించడమే ‘వాక్ ఫర్ దేశీ సీడ్స్’ కార్యక్రమం. ఈ రెండు కూడా మహిళా రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనుండటం, దేశీ విత్తనాలతో పండించిన పంటలనూ సంఘాలే కొనుగోలు చేయనుండటం విశేషం. ఇప్పటికే జిల్లాలో 200 మంది మహిళా రైతులతో దాదాపు 20 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయించేందుకు సిద్ధం చేసినట్లు డీఆర్డీవో విజయలక్ష్మి వివరించారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి దేశీవిత్తనాలను సేకరించినట్లు చెప్పారు. పథకాలు సద్వినియోగం చేసుకోవాలి..జిల్లాకు మహిళా సంఘాలే బ్రాండ్ అంబాసిడర్లని కలెక్టర్ కొనియాడారు. నిర్మల్ కొయ్యబొమ్మల కోసం పొనికికర్ర ఉత్పత్తికి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పొనికి వనాలు పెంచడం గొప్ప విషయమన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని, అందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారితకు ఎన్నో పథకాల ను ప్రవేశపెట్టాయని వివరించారు. మహిళలు సద్వినియోగం చేసుకోవా లని, వ్యాపారం, స్వయంఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లా స్వయం సంఘాలు బ్యాంకు లింకేజీ, రుణ వితరణ, తదితర అంశాలలో అగ్రగామిగా ఉందన్నారు. -
‘పది’ విద్యార్థులతో కలెక్టర్ జూమ్ మీటింగ్
నిర్మల్చైన్గేట్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ముందు రోజు కలెక్టర్ అభిలాషఅభినవ్ జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల విద్యార్థులతో జూమ్కాల్ మాట్లాడారు. ప్రశాంతంగా, ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలంటే భయం వీడి మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. పరీ క్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవా లని తెలిపారు. ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. పరీక్ష కేంద్రంలోనికి పెన్నులు, పెన్సిల్, పరీక్ష ప్యాడ్ మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు. సెల్ ఫోన్సహా. ఎలక్టాన్రిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ, దిగ్విజయంగా పరీక్షలు రాయాలని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏర్పాట్లపై సమీక్ష..అంతకు ముందు పరీక్షల నిర్వహణ, ఏర్పాట్ల పై విద్యాశాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బో ర్డు పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. పరీక్షలపై ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేసేత క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షలపై సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబరు 90599 87730ను సంప్రదించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, విద్యాశాఖ అధికారులు ఎం.పరమేశ్వర్, పద్మ, లింబాద్రి పాల్గొన్నారు. -
రైతుల చేతిలో నాలుగు ఎకరాల్లోపే..
ఉమ్మడి జిల్లాలో భూ కమతాల సగటు చూస్తే గతేడాది, తాజా సర్వే ప్రకారం యధావిధిగా ఉన్నాయి. అంటే భూమి చేతులు మారుతున్నప్పటికీ రైతుల వద్ద ఉన్న భూమి అలాగే కొనసాగుతోంది. గత ఆర్థిక సర్వేలోనూ ఉమ్మడి జిల్లాల్లో సగటు కమతం ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టం 3.78ఎకరాలు ఉండగా, కనిష్టంగా మంచిర్యాలలో 2.29ఎకరాలు ఉంది. ఈ జిల్లాలో జనాభా తక్కువ, భూ లభ్యత ఎక్కువ కావడంతో సగటులో ఎక్కువ వస్తోంది. జిల్లాలో సగటు భూ కమతాలు (ఎకరాల్లో)ఆదిలాబాద్ 3.78ఆసిఫాబాద్ 1.39నిర్మల్ 2.47మంచిర్యాల 2.29 -
‘టెన్’షన్ వద్దు
● నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ● జిల్లాలో 9,129 మంది విద్యార్థులు ● 5 నిమిషాలపాటు వెసులుబాటునిర్మల్ రూరల్: విద్యార్థి జీవితంలో ప్రథమ మెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలు శుక్రవా రం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు జిల్లా అధికారులు కూడా ఈసారి ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు. వరుసగా రెండేళ్లు ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 47 సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు ఐదు నిమిషాల వెసులుబాటు కల్పించారు. ఈసారి గ్రేడింగ్కు బదులుగా మార్కులను కేటాయిస్తారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లను అందజేశారు. పోలీసులు, ఆరోగ్యశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో విద్యాశాఖ 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 9,129 మంది విద్యార్థులు..ఈసారి జిల్లాలో 9,129 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 4,444, బాలికలు 4,685 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి మొత్తం 6,158 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఇందులో 2,765 బాలురు, 3,393 బాలి కలు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,971 మంది రాయనుండగా, 1,679 మంది బాలురు, 1,292 బాలికలు ఉన్నారు. నిర్మల్లో 22, భైంసాలో 19, ఖానాపూర్లో 06 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్కు ఒక ముఖ్య పర్యవేక్షణ అధికారి, డీవోను నియమించారు. ఏడుగురు కస్టోడియన్ ఆఫీసర్లు, 563 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఐదు నిమిషాల వరకు అనుమతి..పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు 5 నిమిషాల వరకు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తారు. కానీ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లను పంపిణీ చేశారు. ఇంకా పొందని వారు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చని సూచించారు. ‘హ్యాట్రిక్ ’ కొట్టాలి...‘పదవ తరగతి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.. మళ్లీ మన జిల్లా రాష్ట్రంలోనే ఫస్ట్ రావాలి.. హ్యా ట్రిక్ కొట్టాలి’ అంటూ జిల్లావాసులు చెబుతున్నా రు. రెండేళ్లుగా ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచింది. ఈసారి కూడా ఆ స్థానా న్ని నిలబెట్టుకోవాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ సైతం పలుమా ర్లు పదో తరగతి పరీక్షల నిర్వహణపై డీఈవో, ఇతర జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించా రు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈసారి కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లామని, మళ్లీ ఫస్ట్ వస్తామని డీఈవో రామారావు ధీమాగా ఉన్నారు. వివరాలు..పరీక్ష రాయనున్న విద్యార్థులు 9,129బాలురు 4,444బాలికలు 4,685పరీక్ష కేంద్రాలు 47నిర్మల్లో 22భైంసాలో 19ఖానాపూర్లో 06 -
పెద్దలసభలో ‘పెద్ద’గా నిర్మల్ బిడ్డ
నిర్మల్: రాజ్యసభలోకి అడుగుపెట్టి తొలి గుర్తింపు దక్కించుకున్న నిర్మల్బిడ్డ సిర్గాపూర్ నిరంజన్రెడ్డి. అదే పెద్దలసభకు ‘పెద్ద’గా వ్యవహరించి జిల్లాపేరు దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేశారు. దిలావర్పూర్ మండలం సిర్గాపూర్కు చెందిన నిరంజన్రెడ్డి దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరొందారు. వైస్సార్ కాంగ్రెస్ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్యసభలో ప్యానెల్ డిప్యూటీ చైర్మన్గా ఉన్న నిరంజన్రెడ్డి మంగళవారం జరిగిన సమావేశాల్లో తన బాధ్యతలను నిర్వర్తించారు. పెద్దల సభగా గుర్తింపు పొందిన రాజ్యసభకు ‘పెద్ద’గా తాను వ్యవహరించిన తీరును అందరూ ప్రశంసించారు. జిల్లావాసికి అరుదైన గుర్తింపు దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.నిరంజన్రెడ్డి -
కలెక్టరేట్ ఎదుట ఆశ కార్యకర్తల ధర్నా
నిర్మల్చైన్గేట్: సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎ దుట ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఉద యం 9గంటలకే గేటు ఎదుట బైఠాయించి సుమా రు 3గంటలపాటు అధికారులు, ఉద్యోగులు, సి బ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రూ.18వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ప్రమోషన్, పీఎఫ్, ఈపీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయిలు చెల్లించాలని డి మాండ్ చేశారు. డీఎంహెచ్వో, స్థానిక సీఐ పలు సార్లు సముదాయించినా వినలేదు. దీంతో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రోడ్డు పై, చెట్ల నీడన నిరీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. డీఎంహెచ్వోతో మాట్లాడి పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు రిలీజ్ చేయించారు. మూడేళ్లకు సంబంధించిన సర్వే డబ్బులు గురువారం అందజేస్తామని హామీ ఇచ్చారు. మిగతా సమస్యలు కూడా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగామణి, సుజాత, చంద్రకళ, రామలక్ష్మి, విజయలక్ష్మి, మంగమ్మ, అనురాధ, శారద, లావణ్య, స్రవంతి, సౌమ్య, సరిత, అనసూయ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అదనపు కలెక్టర్ హామీతో విరమణ -
నిర్మల్
అలరించిన వీడ్కోలు వేడుకలు జిల్లాలోని పలు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు హంగామా చేశారు. గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025IIIలోu ‘మధ్యాహ్న’ కార్మికుల నిరసన నిర్మల్చైన్గేట్: సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఏవో, డీఈవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మా ట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు గత డిసెంబర్ నుంచి పెరిగిన మెనూ చార్జీ రూ.74 పైసలు వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికు ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రాధ, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు రాజేశ్వర్, మంజుల, పద్మ, గోదావరి, మాయవ్వ, సరస్వతి, లక్ష్మీబాయి, హంస పాల్గొన్నారు. ప్రజలను వంచించే బడ్జెట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్తో ప్రజలను మరింత మోసం చేసింది. బడ్జెట్ నిండా బడాయి, అప్పులు మినహా ప్రజాసంక్షేమం ఎక్కడా లేదు. జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. అభివృద్ధికి నిధులూ ఇవ్వలేదు. – మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే, నిర్మల్ బడ్జెట్లో ఏమీ లేదు రాష్ట్రబడ్జెట్లో కోట్ల లో కేటాయింపులు మినహా.. చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లే దు. ప్రజలను వంచించే బడ్జెట్ ఇది. బాసర జ్ఞానసర్వసతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి సంబంధించిన రూ.42కోట్ల నిధులు వెనక్కి ఇవ్వలేదు. చెరువులనూ పట్టించుకోలేదు. – రామారావుపటేల్, ఎమ్మెల్యే, ముధోల్ ఆమోదయోగ్య బడ్జెట్ ప్రజల సంక్షేమం కోసం ఈసారి బడ్జెట్లో గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేపట్టాం. ఇది ప్రజామోదయోగ్యమైన పద్దు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుంది. – వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే, ఖానాపూర్ ఈసారి కూడా రాష్ట్రబడ్జెట్ ఉసూరుమనిపించింది. రాష్ట్ర ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రభుత్వ పథకాలు, రెగ్యులర్ కేటాయింపులు మినహా పెద్దగా ఎలాంటి ప్రత్యేకతలు కనిపించలేదు. యథావిధిగా ప్రాజెక్ట్లు, కాలువల మరమ్మతుకు ఎంతోకొంత ఇవ్వాలన్నట్లు ఈపద్దులో కేటాయింపులు మినహా పెద్దగా నిధులివ్వలేదు. బాసర ఆలయ అభివృద్ధికి కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో పాటు గతంలో తీసుకున్న రూ.42కోట్లపైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. బాసరలో గోదావరి హారతి చేపడతామని మాత్రం ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు ఇది ప్రజలను మోసగించే బడ్జెట్ అని, జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కల్పించలేదని ఆరోపణలు చేస్తుండగా, అధికారపక్షం మాత్రం ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని, గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశారని సమర్థిస్తున్నారు. – నిర్మల్● పథకాలకే ప్రథమ ప్రాధాన్యత ● జిల్లాకు దక్కని ప్రయోజనం ● బాసర గోదావరికి ‘హారతి’ ● మహిళలు, రైతులకు ఊరట ● బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు ఈసారి కూడా పాతలెక్కనే.. ఈసారి రాష్ట్ర పద్దులో పెద్దగా జిల్లాకు కేటాయింపులు లేవు. ఎప్పటిలాగే సాగునీటి ప్రాజెక్ట్ల మరమ్మ తు, నిర్వహణ కోసం అరకొరగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సారెస్పీ–1కింద పేర్కొ నే కడెం ప్రాజెక్ట్కు రూ.3కోట్ల లక్షాయాభైవేలు, సు ద్దవాగు ప్రాజెక్ట్కు రూ.3.42కోట్లు, స్వర్ణ ప్రాజెక్ట్కు రూ.70లక్షలు కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు నిధుల కేటాయింపులున్నా.. అందులో జిల్లాలోని 27, 28 ప్యాకేజీలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారనే లెక్క తేల్చలేదు. ఏళ్లు గడిచిపోతున్నా.. పక్కనే ఉన్న గోదావరి జలాలు మాత్రం జిల్లాలోని భూములకు అందని పరిస్థితి ఉండగా పెద్దగా పట్టించుకోలేదు. బాసరలో ‘హారతి’స్తారట.. జిల్లాలోనే కాదు.. దక్షిణ భారతంలోనే ప్రముఖ సరస్వతీక్షేత్రం బాసర. ఇక్కడి ఆలయ అభివృద్ధికి బడ్జె ట్లో నిధులు కేటాయించాలని దశాబ్దాలుగా డి మాండ్ చేస్తూ ఉంటే గత ప్రభుత్వం రూ.50కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.8కోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. ఇక ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిగతా రూ.42కోట్లు వెనక్కి తీసుకుంది. ఈ నిధులను తిరిగి ఆలయానికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్ అసెంబ్లీ సాక్షిగా అడిగినా కేటాయించలేదు. ప్రభుత్వం తరఫున గంగాహారతి తరహాలో బాసరలో గోదావరికి హారతినిచ్చే కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. మహిళలు, రైతులకు.. మెగామాస్టర్ప్లాన్ 2050 పేరిట అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని ఆర్థికశాఖమంత్రి ప్రకటించారు. ప్రతీ మండలంలో మహిళలతో రైస్మిల్లులు, మినీగోదాములు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళల రైస్మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామన్నారు. ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యతను మ హిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామ ని ప్రకటించారు. మండల మహిళా సమాఖ్య ద్వా రా ఆర్టీసీకి 600 బస్సులు అద్దెకిస్తామని పేర్కొ న్నా రు. వీటిద్వారా జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులూ లబ్ధి పొందనున్నారు. రైతుభరోసాకు నిధుల కేటాయింపులతో పాటు సాగుకు రూ.24,439కోట్లు కేటాయించారు. విద్యారంగానికి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయని, పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహం లేదని సంబంధిత రంగాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యూస్రీల్ -
‘పది’ ఫలితాల్లో హ్యాట్రిక్ కొడతాం
● మూడోసారి కూడా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తాం ● జిల్లా విద్యాధికారి రామారావునిర్మల్ రూరల్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూ డా రాష్ట్ర స్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతా మని జిల్లా విద్యాధికారి (డీఈవో) రామారావు ధీమా వ్యక్తంజేశారు. ఈనెల 21నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేయగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు? డీఈవో: జిల్లాలో మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో బాలికలు 4,685, బాలురు 4,444 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో నిర్మల్లో 22, భైంసాలో 19, ఖానాపూర్లో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతీ కేంద్రానికి ఒక ముఖ్య పర్యవేక్షణాధికారి, సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాం. అన్ని కేంద్రాల్లో 523 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. సాక్షి: ఉత్తమ ఫలితాల సాధనకు ఎలాంటి చర్యలు చేపట్టారు? డీఈవో: విద్యార్థులకు రెండు గ్రాండ్ టెస్టులు నిర్వహించాం. ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా పూర్తి చేశాం. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాం. వీరిని ఉపాధ్యాయులు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాం. ఉదయం, సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహించాం. మా కృషి ఫలితంగా ఈసారి కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధిస్తాం. సాక్షి: ఉష్ణోగ్రతలు పెరిగినందున కేంద్రాల వద్ద కల్పిస్తున్న వసతులేమిటి? డీఈవో: ఎండల తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద చల్లని తాగునీరు అందుబాటులో ఉంచేలా చూస్తాం. ప్రతీ కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని వసతులూ కల్పిస్తున్నాం. సాక్షి: ఈసారి పరీక్షా విధానంలో బోర్డు చేసిన మార్పుల గురించి తెలుపండి? డీఈవో: పరీక్షా ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి మునుపటిలా మార్కులు ప్రకటించనున్నారు. విద్యార్థులకు ఈసారి సింగిల్ రూల్స్గల 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. ఇందులోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అదనపు సమాధాన పత్రం ఇవ్వరు. గతంలో బయోలజీ, ఫిజికల్ సైన్స్ పరీక్షలు ఒకేరోజు నిర్వహించగా ఈసారి వేర్వేరుగా రెండు రోజులు నిర్వహిస్తారు. సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు? డీఈవో: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు వెసులుబాటు కల్పిస్తాం. హాల్టికెట్ అందనివారు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఎల్ఆర్ఎస్పై అనాసక్తి
● 25శాతం రిబేట్ కల్పించిన సర్కారు ● చెల్లింపునకు ఈ నెల 31వరకు గడువు ● ముందుకురాని దరఖాస్తుదారులు ● హెల్ప్డెస్క్లకు స్పందన కరువునిర్మల్చైన్గేట్: జిల్లాలో ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. అధికారులు దరఖాస్తుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినా మొహం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లోనే కాకుండా ము న్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మున్సి పాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి ఎస్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆరోపణలు ఉండటంతో ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మొబైల్ యాప్ ద్వారా మ్యాపింగ్ ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 44,436 దరఖాస్తులు రాగా.. వీటిని మూడు దశల్లో పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్న వాటికి అనుమతి ఇవ్వనున్నారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ కోసం 44,436 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఫీజు చెల్లింపునకు 24,576 దరఖాస్తులు సరైనవిగా అధికారులు గుర్తించారు. ఈ నెల 16వరకు 239 మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించగా ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.68.02 లక్షల ఆదాయం సమకూరింది. ఇంకా 24,337 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సి ఉంది. బల్దియాల వారీగా ఇలా.. ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో 1,928 దరఖాస్తులు రాగా, 1,348 దరఖాస్తులను ఫీజు చెల్లింపునకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 15మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా ఇంకా 1,333 మంది చెల్లించాల్సి ఉంది. నిర్మల్ బల్దియా పరిధిలో 15,515 దరఖాస్తులు రాగా, 10,264 దరఖాస్తులు సరైనవిగా గుర్తించారు. ఇందులో 115 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా ఇంకా 10,161 మంది దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంది. భైంసా మున్సిపల్ పరిధిలో 9,044 దరఖాస్తులు రాగా, 6,289 దరఖాస్తులను సరైనవిగా గుర్తించారు. ఇందులో 48 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా ఇంకా 6,241 మంది దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంది. వేటికి ఎల్ఆర్ఎస్ వర్తించదంటే.. మున్సిపల్ పరిధిలో బఫర్, ఎఫ్టీఎల్, కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితా లోని భూములకు ఎల్ఆర్ఎస్ వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వీటి పరిధిలో భూములుంటే గతంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నా క్రమబద్ధీకరణ చేయకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు పూర్తి ఫీజు చెల్లించినా క్షేత్రస్థాయి విచారణ అనంతరం తిరస్కరణకు గురైతే చెల్లించిన ఫీజులో 10శాతం మినహాయించుకుని 90 శాతం డబ్బులు తిరిగి దరఖాస్తుదారుకు చెల్లిస్తారు. మున్సిపాలిటీల్లో హెల్ప్డెస్క్లు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వ చ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు ప్రత్యేకంగా హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. బల్దియాల పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. దరఖాస్తుదారులు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు హెల్ప్డెస్క్ను సంప్రదించవచ్చు. క్షేత్రస్థాయి పరిశీలన ఇలా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు మొదటి దశలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ముందుగా సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు పరిశీలిస్తారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా పరిశీలన చేపడతారు. సర్వే నంబర్ల వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం లేదా మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, నీటి పారుదలశాఖ అసిస్టెంట్ ఇంజినీర్లతో కూడిన బృందం పరిశీలిస్తోంది. ఈ బృందం జీపీఎస్ ద్వారా సదరు భూమి హద్దులు, ఇతర సమాచారాన్ని మొబైల్ యాప్లో నమోదు చేస్తోంది. ఇదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, డిఫెన్స్ ల్యాండ్ పరిధి లోనివి కావని ధ్రువీకరించాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి గతంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయితీ వర్తిస్తుంది. ఒకవేళ 31వ తేదీ దాటితే ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ విలువకు అనుగుణంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు గడువులోపు చెల్లించి రాయితీ వినియోగించుకోవాలి. – జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
నిధులు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● మున్సిపల్ అధికారులతో సమీక్షనిర్మల్చైన్గేట్: మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులు సమర్ధవంతంగా వినియోగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ అధికా రులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ల వారీగా కేటాయించిన నిధులు, చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధులు, అందుబాటులో ఉన్న నిధులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు. సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలు పార్కులకు వచ్చేలా చూడాలని తెలిపారు. గేట్లు, గోడలకు రంగులు వేసి, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పట్టణ వాసులను భాగస్వాములను చేస్తూ పార్కులకు అసోసియేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ శాఖకు సంబంధించి వచ్చిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, జాదవ్కృష్ణ, రాజేశ్కుమార్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
ఏరియాస్పత్రిని సందర్శించిన కాయకల్ప బృందం
భైంసాటౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని కాయకల్ప బృందం బుధవారం సందర్శించింది. బృందం సభ్యుడు డాక్టర్ శ్రీధర్బాబు ఆధ్వర్యంలో రోగులకు అందుతున్న సేవలు, పారిశుధ్య నిర్వహణ, క్లినికల్ వేస్టేజ్, గడువు ముగిసిన మందుల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, నర్సింగ్ ఉద్యోగులతో సమావేశమై మాట్లాడారు. రోగులకు మెరుగైన సేవలందించడంలో పోటీ పడేందుకు కాయకల్ప ర్యాంక్లు ఇ స్తుందని పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి నివేదిక పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాయకల్ప బృందం సభ్యులు హెడ్నర్స్ సుజాత, ఫార్మసిస్ట్ శ్రీలత, మాణిక్యం, ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్లు చంద్ర సుజాత, రేఖ, హెడ్నర్స్ విజయశ్రీ, స్టాఫ్ నర్స్ మంజూష తదితరులున్నారు. -
లెక్కలోకి తీసుకుంటరా..!
నిర్మల్పిచ్చుకలతో జీవ వైవిధ్యం జీవ వైవిధ్యంలో పిచ్చుకలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. భూమిపై ప్రతీజీవి మనుగడకు పిచ్చుకలే కారణం. 20న పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ● బడ్జెట్లో జిల్లాకు నిధులిస్తారా..! ● ప్రతిసారీ ఆశనిరాశల పద్దులే.. ● ఈసారైనా జిల్లావైపు చూడాలి ● పనులు పూర్తిచేయాలి ● అభివృద్ధికి చేయూతనివ్వాలిబుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025చెరువుల మరమ్మతులకు నిధులివ్వండి భైంసాటౌన్/ బాసర/ ముధోల్: వానాకాలంలో భారీ వర్షాలకు ముధోల్ నియోజకవర్గంలో వంద వరకు చెరువులు ధ్వంసమయ్యాయని, మరమ్మతుల కోసం నిధులివ్వాలని ఎమ్మెల్యే పి.రామారావుపటేల్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో జీరో అవర్లో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హిప్నెల్లి చెరువు మరమ్మతులకు రూ.60 లక్షలు, దొడర్న చెరువుకు రూ.90 లక్షల నిధులు మంజూరైనా ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదని పేర్కొన్నారు. ముధోల్ మండలం ఎడ్బిడ్లో కాంగ్రెస్ నాయకులు పంచాయతీరాజ్ రోడ్డును వంద మీటర్లు తవ్వేశారని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. రోడ్డు నిర్మాణనానికి కలెక్టర్ రూ.17.70 లక్షల ఉపాధిహామీ నిధులు మంజూరు చేశారని తెలిపా రు. అయితే వర్షాకాలంలో రోడ్డుపై మొరం వేయించగా రోడ్డు ఎత్తుకు పెరిగిందన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు దీనిని తవ్వించార ని పేర్కొన్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లు వెనక్కి తీసుకుందని, తిరిగి మంజూరు చేయాలని కోరారు. త్వరలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.● రెండుమూడేళ్లుగా భారీ వర్షాలకు చాలావరకు చెరువులు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలి. ● జిల్లాలో ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థల్లోనే కొనసాగుతున్నాయి. వీటిపై ఈ బడ్జెట్లో దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.కావాల్సినవెన్నో.. ● కడెం ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.9 కోట్లకు పైగా నిధులిచ్చారు. సంబంధిత పనులు పూర్తయ్యాయి. ఇక పూడికతీతతోపాటు పూర్తిస్థాయిలో గేట్లను మార్చాల్సిన అంశంపైనా దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ప్రాజెక్టు కాలువలు కూడా చాలాచోట్ల దెబ్బతిన్నాయి. మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ● మామడ మండలంలోని కమల్కోట్ సబ్స్టేషన్కు భూమిపూజ చేసినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు.● జిలాకేంద్రంలో పీజీ కళాశాలను తిరిగి రెగ్యులర్గా క్లాసులు ఉండేలా ప్రారంభించాలి. బడ్జెట్.. అనగానే జిల్లాకు నిధులేమైనా వస్తాయా..!? అన్న ఆసక్తి జిల్లావాసుల్లో ఉంటుంది. కానీ ప్రతీ బడ్జెట్కు ముందు ఆశ, ఆ తర్వాత నిరాశ కంటిన్యూ అవుతోంది. ఏళ్లు గడిచిపోతున్నా.. జిల్లా అభివృద్ధికి సరిపడా నిధులు మాత్రం రావడం లేదు. మరోవైపు బాసర దేవస్థానానికి ఇచ్చిన రూ.42 కోట్లనూ సర్కారు వెనక్కి తీసుకుంది. జిల్లాలో రాజకీయ పరిస్థితుల పేరు చెప్పి, ప్రభుత్వాలు ప్రజల సమస్యలపై చిన్నచూపు చూడటం సరికాదన్న వాదనా ఉంది. ఈసారి బడ్జెట్లో జిల్లాను లెక్కలోకి తీసుకోవాలని, పెండింగ్ పనుల పూర్తితోపాటు కొత్తగా అభివృద్ధి పనులకు దండిగా నిధులు కేటాయించాలని జిల్లా డిమాండ్ చేస్తోంది. – నిర్మల్ ● బాసర ట్రిపుల్ఐటీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కొన్నేళ్లుగా ప్రతిపాదనలు వెళ్తున్నా.. నిధులు మాత్రం రావడం లేదు. ప్రభుత్వాలు పెద్దగా తమను పట్టించుకోవడం లేదన్న భావన విద్యార్థుల్లో ఉంది. ● కడెం, దస్తురాబాద్ మండలాలకు సాగునీటిని అందించేలా లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో సర్వేచేశారు. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చలనం లేదు. ● సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు మరమ్మతులకు గతంలో రూ.3 కోట్ల వరకు ప్రతిపాదించినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. స్వర్ణనదిలో మంజూరైన చెక్డ్యామ్లనూ నిర్మించడం లేదు. ● నిర్మల్, భైంసా పట్టణాల్లో ట్రాఫిక్ పెరిగింది. ఈనేపథ్యంలో ఆయా పట్టణాల్లోనూ ఫ్లైఓవర్, రింగ్రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ● బాసర జ్ఞానసరస్వతీ దేవస్థానానికి గత ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించగా, అందులో కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ.42 కోట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పటికీ ఆలయ అభివృద్ధికి ఎలాంటి నిధులు, చర్యలు చేపట్టడం లేదు. ● కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 27, 28 ప్యాకేజీల కింద లక్ష ఎకరాల సాగుకు చేపట్టిన పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రధానంగా ముధోల్ నియోజకవర్గానికి సంబంధించి 28 ప్యాకేజీ పనులను మధ్యలోనే నిలిపివేశారు. గత ప్రభుత్వం హడావుడిగా 27వ ప్యాకేజీని ప్రారంభించినా.. ఒక్కరోజుకే పరిమితమైంది. ఇప్పటికీ కాలువల పనులు కొనసాగుతూనే ఉన్నాయి.● నిర్మల్ జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ సహా అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలి. మెడికల్ కాలేజీ భవనాన్ని త్వరగా నిర్మించాలి. ● జిల్లాలో ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు. ఇథనాల్, ఆయిల్పామ్ మధ్యలోనే నిలిచిపోయాయి. బాసరలో ఏర్పాటు చేస్తామన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ముచ్చట అక్కడే ఆగిపోయింది. అక్కడ భూమి ఉన్నా.. పరిశ్రమలను ఏర్పాటు చేయడం లేదు. ● జిల్లాలో బాసర నుంచి కడెం వరకు జిల్లాకేంద్రం సహా ఎన్నో పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ ఆలయాలు ఉన్నాయి. కానీ..ఎక్కడా పర్యాటకపరంగా అభివృద్ధి చేయడం లేదు. కనీసం ఒక్క రూపాయి కూడా పర్యాటకాభివృద్ధి కోసం నిధులు కేటాయించడం లేదు. ● భైంసాలో ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చడంతోపాటు నూతన భవనాన్ని నిర్మించాలి. అలాగే దేవస్థానంతోపాటు, ట్రిపుల్ఐటీని బాసరలో వందపడకలతో ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాల్సిన అవసరం ఉంది. ● నిరుద్యోగ యువతకు సరైన శిక్షణ కేంద్రాలు లేవు. జిల్లాకేంద్రంలో మినహా భైంసా, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఆధునాతన లైబ్రరీలు అందుబాటులో లేవు. స్వయం ఉపాధి పొందేందుకూ కనీసం ప్రోత్సాహం లేదు.● జిల్లాలో క్రీడాప్రాంగణాలు ఉన్నట్లే కానీ.. ఎక్కడా కనీసం ఆడుకోవడానికి సరైన వసతులు లేవు. చాలా క్రీడలకు కోచ్లు లేక ఆసక్తి ఉన్న పిల ్లలు పక్కజిల్లాల్లో నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ● ఖానాపూర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.న్యూస్రీల్రెమ్యునరేషన్ చెల్లించాలి లక్ష్మణచాంద: గత నవంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వేను జిల్లాలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు విజయవంతం చేసి జిల్లాను మొదటి వరుసలో ఉంచారని, అయినా వారికి రెమ్యునరేషన్ చెల్లించలేదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్, అశోక్ పేర్కొన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే రెమ్యునరేషన్ విడుదల చేయాలని కోరారు. -
పీఎంశ్రీతో ఐసీడీఎస్ నిర్వీర్యం
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ ● రెండో రోజు కొనసాగిన అంగన్వాడీల ఆందోళననిర్మల్చైన్గేట్: ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తలపెట్టిన 48 గంటల మహాధర్నా రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి సామూహిక భోజనాలు చేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ప్రతీనెల ఒకటో తారీకు జీతాలు, ఎండాకాలంలో మే నెల మొత్తం సెలవులు ప్రకటించాలన్నారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రవర్తిస్తుందన్నారు. ఐసీడీఎస్కు వ్యతిరేకంగా కేంద్రం చేసిన నిర్ణయాలకు రాష్ట్రంలో అమలు చేయాలని చూడడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయంతో పేద ప్రజలకు, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు తీవ్రమైన నష్టం కలిగించాయన్నారు. ఎన్ఈపీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. మొబైల్ అంగన్వాడీ సెంటర్ రద్దుచేసి ఐసీడీ సేవలు పాత పద్ధతిలో కొనసాగించాలని కోరారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పర్మిట్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో పొందుపర్చిన హామీల ప్రకారం మినీ టీచర్ నుంచి మెయిన్ టీచర్గా పదోన్నతి పొందిన అంగన్వాడీ టీచర్లకు పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కార్యక్రమంలో అంగన్వాడీ యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లలిత, జిల్లా కోశాధికారి శైలజ, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి, రజియా విజయ, ప్రసాద, భాగ్య,వనజ, జిల్లా సహాయ కార్యదర్శి, భాగ్య, రేష్మ, విజయ, వందన, దేవిక లావణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్: పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరికోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల ప్రశ్న, జవాబు పత్రాల తరలింపు సమయంలో పోలీసు భద్రతను, స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించాలని, ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రహరీ లేని పరీక్ష కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా పరీక్షల సమయానికి తగ్గట్లుగా ఆయా మార్గాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలి.. అనంతరం పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షలను రాయబోవు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసే విధంగా వారిలో మానసికస్థైర్యం నింపాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో పి.రామారావు, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, డీఎంహెచ్వో రాజేందర్, విద్యుత్ శాఖ డీఈ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారులు పద్మ, లింబాద్రి, ప్రవీణ్ పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కూలీలకు ఉపాధి పనులు తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, షెడ్యూల్ ప్రకారం ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని సూచించారు. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. పశువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చేతి పంపులు, బోరు బావులకు మరమ్మతులు చేయించాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నమూనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపును వెంటనే పూర్తిచేయాలన్నారు. జాబ్కార్డు కలిగివున్న ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పించాలన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున, ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలలో టెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈజీఎస్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. అనంతరం పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల పరిధిల్లోని ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రజలు దరఖాస్తులు చేసుకున్న ఆదాయ, కుల, నివాస తదితర ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేయొద్దని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ -
భవన నిర్మాణ కార్మికులకు వర్క్షాప్
నిర్మల్ఖిల్లా: జిల్లాలో భవన నిర్మాణరంగం కార్మికులకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కల్పించాలని పలువురు కార్మిక సంఘ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జాతీయ భవన నిర్మాణం అకాడమీ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆరు రోజుల వర్క్షాప్ను మంగళవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవాసీమిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ.. భవన నిర్మాణరంగంలో స్థానిక మేసీ్త్రలు, కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అవకాశం కల్పించాలని సూచించారు. స్థానిక కార్మికులు, మేసీ్త్రలకు నైపుణ్య శిక్షణ అందిస్తూ తక్కువ ఖర్చుతో స్థానిక వనరులను వినియోగించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టవచ్చని సూచించారు. మరో అతిథి అసిస్టెంట్ ఇంజనీర్ హెచ్ఏ.షరీఫ్ మాట్లాడుతూ.. స్థానిక కార్మికులకు శిక్షణ ద్వారా నిర్మాణ కొలతలు, మౌలిక ఇంజనీరింగ్ సామర్థ్యాలను నేర్చుకుని న్యాక్ సంస్థ ద్వారా ధ్రువీకరణ పత్రం పొందితే భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు రమేశ్, మహేశ్, జిల్లాకు చెందిన పలువురు మేసీ్త్రలు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరికీ టీషర్టులు, బ్యాగులు, హెల్మెట్లు అందించారు. జాతీయ నిర్మాణ సంస్థ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు -
నూతన భవనం అందుబాటులోకి తేవాలి
●ఖానాపూర్ మండలం బాదన్కుర్తి గ్రామంలో ఎంపీ యూపీఎస్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. భవనం పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులు బడి మాన్పిస్తున్నారు. గతేడాది పాఠశాలలో 117 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది కేవలం 34 మందికి పరిమితమైంది. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల మరో భవనంలో బాత్రూంలు, కిచెన్, ప్రహరీ నిర్మాణాలు వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి. – బాదన్కుర్తి, గ్రామస్తులు -
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్
కుంటాల: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్సెర్చ్ నిర్వహించనున్నట్లు భైంసా ఏఎస్పీ అవినాష్కుమా ర్ తెలిపారు. మండలంలోని లింబా(కె)గ్రామంలో సోమవారం కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఇంటింటా సోదాలు చేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడారు. ఆన్లైన్ మోసాల నేపథ్యంలో ప్రజలు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరి చిత వ్యక్తులకు బ్యాంకు వివరాలు చెప్పవద్దని సూ చించారు. ప్రతీ వాహనదారుడు ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు పెడతామన్నారు. మహిళలకు భద్రత, భరోసా కల్పించేందుకు ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీసు అక్క’కు శ్రీకారం చుట్టారని తెలి పారు. తనిఖీల్లో 82 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకోగా మీసేవ ద్వారా చలాన్లు చెల్లించిన వాహనాలు అప్పగించారు. భైంసా రూరల్ సీఐ నైలు, ఎస్సైలు భాస్కరాచారి, రవీందర్, ఏఎస్సైలు జీవన్రావు, దేవన్న, పోలీసులు పాల్గొన్నారు. -
ఎండలతో జాగ్రత్త
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్చైన్గేట్: ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలను చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. వడదెబ్బతో అనారోగ్యానికి గురై ఆస్పత్రులకు వచ్చే రోగులకు మందులు, సైలెన్ బాటిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి వనాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న డీఆర్డీవో విజయలక్ష్మిని అభినందించారు. తర్వాత జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్టీల్ వాటర్ బాటిళ్లను కలెక్టర్ అధికారులకు అందజేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడంలో భాగంగా స్టీల్ బాటిళ్లు వాడకాన్ని ప్రోత్సహించిన అధికారులను అభినందించారు. విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. తానూరు మండలం బోరిగామ గ్రామంలో రెవెన్యూ ఉద్యోగిపై దాడి ఘటనను ఖండించారు. ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. -
నిర్మల్
ఊపందుకున్న ‘ఉపాధి’ ఉన్న ఊరిలోనే నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో కేంద్రం అమలు చేస్తున్న ఉపాధిహామీ సత్ఫలితాలిస్తోంది. మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 20259లోu ఎన్వోసీ ఇప్పించాలి.. మా కుమారుడు రామిళ్ల ఉదయకుమార్ నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ కోర్సును 2011 నుంచి 2013 వరకు చదివాడు. చదువు మధ్యలో నిలిపివేసి మళ్లీ కొనసాగించి కోర్సును పూర్తి చేశాడు. అనంతరం బీఎఫ్ఏ యానిమేషన్ కోర్సును జెఎన్ఎఫ్ఏవీఈఏస్, హైదరాబాద్లో పూర్తి చేశాడు. గతంలో చదివిన ఈఈఈ మొదటి సంవత్సరం ఫీజు బకాయి ఉన్నందున నేను డీడీవో కోడ్ 040–1240 2015 డబ్ల్యూ5ఏస్ చలాన నంబర్ రూ 3800 చలాన్ నం. 6403504732 మీద రూ 2600 గత డిసెంబర్ 31న చెల్లించాను. దీనికి సంబంధించిన చలాన్ పత్రాలు కార్యాలయంలో అందజేశాను. ఇప్పుడు వెళ్లి అడిగితే ఆ ఫైల్ పోయింది అంటున్నారు. మూడు నెలలుగా తిప్పించుకుంటున్నారు. ఎన్వోసీ సర్టిఫికెట్ అందిస్తేనే మా బాబు ఎంతో కష్టపడి చదివిన బీఎఫ్ఏ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంది. – రమేశ్, కడెం ఆన్లైన్ బెట్టింగుల జోలికి వెళ్లొద్దు ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్ టౌన్: ఆన్లైన్ బెట్టింగ్లు, గేమింగ్ల జోలికి వెళ్లొద్దని ఎస్పీ జానకీ షర్మిల జిల్లా ప్రజలకు సూచించారు. యువత, విద్యార్థులు బెట్టింగ్, గేమింగ్ యాప్లకు అలవాటుపడి సైబర్ ఉచ్చులో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్, గేమింగ్ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిర్మల్చైన్గేట్: గ్రామ, మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే న్యాయం జరుగుతుందని, త్వరగా పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వస్తున్నారు. ఆరోజు పనులు మానుకుని.. అర్జీలు చేత పట్టుకుని.. గంటల తరబడి క్యూలో నిలబడి కలెక్టర్కు దరఖాస్తులు అందిస్తున్నారు. ఇక సమస్య తీరినట్లే అని ఇళ్లకు వెళ్తున్నారు. కానీ, రోజులు గడుస్తున్నా.. దరఖాస్తుపై ఉలుకు పలుకు ఉండడం లేదు. దీంతో మళ్లీ కలెక్టరేట్కు మరో దరఖాస్తు పట్టుకుని వస్తున్నారు. అర్జీల పరిష్కారంలో అధికారుల అలసత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి తిరిగి విసిగిపోయిన బాధితుల గోడు వినడం.. ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవడమే తప్ప సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇచ్చిన వినతులు అధికారులు తీసుకుని ఆన్లైన్ చేసి సంబంధిత శాఖ అధికారులకు పంపించడంతో కలెక్టరేట్ అధికారుల పని పూర్తవుతోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు క్షేత్రస్థాయిలో పరిష్కారం అయిందా.. లేదా అన్న విషయంపై సమీక్ష లేకపోవడంతో గ్రీవెన్స్ మొక్కుబడిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో ఇచ్చిన అర్జీ పరిష్కారం కాక.. మళ్లీ మూడు నెలల తర్వాత బాధితుడు మళ్లీ ప్రజావాణికి రావడం చూస్తే సమస్యల పరిష్కారం ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతీ వారం కిటకిటే.. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇందులో కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. మండల స్థాయిలో తమ గోడు వెల్లబోసుకున్నా పరిష్కారం కాని సమస్యలపై బాధితులు కలెక్టరేట్కు వచ్చి గ్రీవెన్స్లో ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ సోమవారం ప్రజావాణి కిటకిటలాడుతోంది. వందల అర్జీలు వస్తున్నాయి. కొన్నింటిని వెంటనే పరిష్కరిస్తున్న ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన వాటిని ఆయా మండలాలకు పంపుతున్నారు. అయితే అక్కడికి వెళ్లే దరఖాస్తులు త్వరగా పరిష్కారం కావడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. చేసేదేమీలేక మళ్లీ ఉన్నతాధికారులకు సమస్యను నివేదించేందుకు వస్తున్నామని చెబుతున్నారు. పెండింగ్లో 251 అర్జీలు.. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సంబంధించి ఇప్పటి వరకు 70 శాఖల పరిధిలో 251 అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. వీటికి తోడు సోమవారం మరో 86 అర్జీలు అధికారులు స్వీకరించారు. ముఖ్యంగా విద్యాశాఖలో 14, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిర్మల్ శాఖలో 14, సూపరింటెండెంట్ ఈ సెక్షన్లో 10, సూపరింటెండెంట్ డి సెక్షన్లో 9, నిర్మల్ రూరల్ తహసీల్దార్ వద్ద 9, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో 8, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద 8, నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ 8, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 8, లోకేశ్వరం తహసీల్దార్ 8, ముధోల్ తహసీల్దార్ 8, తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 8, కుభీర్ తహసీల్దార్ 7, టీఎస్ ఎన్పీడీసీఎల్ 7, జిల్లా వ్యవసాయ అధికారి 6, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి 6, జిల్లా పంచాయతీ అధికారి 6, దేవాదాయ శాఖ 6, ఖానాపూర్ తహసీల్దార్ 6, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ 5, నిర్మల్ అర్బన్ తహసీల్దార్లో 5 అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ప్రజావాణిలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు దాడిపై కేసు నమోదు ఖానాపూర్: పట్టణంలోని మహాత్మాజ్యోతి బాపూలే జూనియర్ కళాశాల వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి తరుణ్పై దాడి చేసిన సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అజయ్, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. వాలీబాల్ విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని దాడిచేసిన సీనియర్ విద్యార్థి తనయ్తోపాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇఫ్తార్మంగళ : 6:22సహర్బుధ : 5:05న్యూస్రీల్త్వరగా పరిష్కరించాలి.. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించాలని 86 అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలన్నారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న బాధితులు బాధ్యులపై చర్య తీసుకోవాలి.. నా భార్య తొండకూరి స్వరూపను రెండో కాన్పు నిమిత్తం జనవరి 30న జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో అడ్మిట్ చేశాను. అదేరోజు వైద్యులు శస్త్రచికిత్స చేస్తే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 4న డిశ్చార్జ్ చేశారు. కుట్లు విడిపించిన తర్వాత చీము వచ్చి పొట్ట భాగం ఉబ్బింది. ఆస్పత్రికి పలుసార్లు తీసుకువచ్చి చూపించాను. సీటీ స్కాన్ తీసి ప్రాబ్లం లేదని చెప్పారు. తర్వాత నాభార్య తీవ్ర కడుపు నొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరీక్షలు చేసి డెలివరీ సమమంలో నిర్లక్ష్యం కారణంగా కడుపులో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ అందించారు. నిజాన్ని దాచి నా భార్యకు ప్రాబ్లం లేదని చెప్పిన బాధ్యులపై చర్య తీసుకోవాలి. – టి.శ్రీకాంత్, జఫ్రాపూర్ -
ఇల్లు కూల్చారని నిరవధిక దీక్ష
● కలెక్టరేట్ ఎదుట బాధిత కుటుంబం నిరసన నిర్మల్చైన్గేట్: భూ పోరాటం చేసి సాధించుకున్న భూమిలో నిర్మించుకున్న గుడిసెను అటవీ అధికారులు అక్రమంగా కూల్చారని ఓ కుటుంబం కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్షకు దిగింది. ఖానాపూర్ మండలం రంగపేట్ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెంలో గోనె స్వామి, ఆయన కూతురు గోనె మల్లీశ్వరి భూపోరాటం ద్వారా 20 ఏళ్ల క్రితం ఆటవీ స్థలం ఆక్రమించుకున్నారు. అక్కడే గుడిసె వేసుకున్నారు. గ్రామపంచాయతీ ఇంటి నంబర్ కూడా మంజూరు చేసింది. 2005 నుంచి 2009 వరకు గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను చెల్లించారు. ఇక 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో కొంతమేర నిర్మాణం చేశారు. పంచాయతీ రోడ్డు సౌకర్యం కూడా కల్పించింది. ఇన్నేళ్ల తర్వాత అటవీ శాఖ గోనె స్వామి, ఆయన కూతురు మల్లీశ్వరికి అటవీ స్థలంలో ఇల్లు కట్టుకున్నారని, తొలగించాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. రెండుసార్లు(జనవరి 16, ఫిబ్రవరి 12న)నోటీసులు ఇచ్చిన అటవీ అధికారులు, మార్చి 7న ఇంటిని కూల్చివేశారు. దీంతో తండ్రీ కూతురు నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి రోడ్డు పక్కన చెట్టు నీడన ఉంటున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గేటు ఎదుట సోమవారం దీక్ష చేపట్టారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కలెక్టరేట్ గేటు వదిలి వెళ్లబోమని తెలిపారు. ఈమేరకు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినట్లు వెల్లడించారు. స్పందించిన కలెక్టర్ డీఎఫ్వోతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వీరి దీక్షకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, జిల్లా నాయకులు సింగరి వెంకటేశ్, ఖానాపూర్ డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, గూట్ల ప్రసాద్, గోనె స్వామి, గోగు శేఖర్, రేగుల గంగన్న, మచ్చ కై లాస్, మాన్క శ్రీనివాస్, గోగు భూమక్క, గూట్ల రజిత, నైతం లింగు బాయి, సంఘీభావం తెలిపారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గాలిలో తేమశాతం తగ్గుతుంది. దీంతో మధ్యాహ్నం వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఉద్యోగం ఇప్పించండి నేను పుట్టుకతోనే దివ్యాంగుడిని. కాళ్లు పనిచేయవు. ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. ఇటీవల మెడికల్ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్లో వార్డు అటెండెంట్ పోస్ట్కు దరఖాస్తు చేసుకున్నాను. నా వైకల్యాన్ని గుర్తించి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పించి ఆదుకోండి. – సుంకే రాకేష్, నిర్మల్ రైతుబీమా రావడం లేదు.. మా నాన్న తడగొండ రాజన్న ఫిబ్రవరి 21న మరణించారు. ఆయనకు కొత్తపేట మండలంలో ఖాతా నంబర్ 532లో వ్యవసాయ భూమి ఉంది. మరణానంతరం రావాల్సిన రైతుబీమా మంజూరు కాలేదు. గతవారం కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకున్నాను. వారం రోజులు అయినా ఫలితం లేకపోయేసరికి మరోమారు వచ్చాను. ఇప్పుడు అధికారులు మా నాన్న పేరు మీద ఇన్సూరెన్స్ కవర్ కాలేదని.. బీమా రాదని చెబుతున్నారు. అధికారులు మా సమస్య పరిష్కరించి బీమా సొమ్ము అందజేయాలి. – భవాని, కొత్తపేట, ఖానాపూర్ -
అంగన్వాడీల పోరుబాట
● 48 గంటల మహా ధర్నా షురూ.. ● తొలిరోజు ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటావార్పు ● హామీలు నెరవేర్చాలని డిమాండ్ నిర్మల్చైన్గేట్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం రద్దు, ఐసీడీఎస్ పథకం ప్రారంభమై 50 ఏళ్లు అవుతున్నా.. సమస్యలు తీరడం లేదని అంగన్వాడీ టీచర్స్, మినీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలు పరిష్కరించి పర్మినెంట్ చేయాలని.. తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు పోరుబాట పట్టారు. నిర్మల్ ఆర్డీవో ఎదుట సోమవారం 48 గంటల ధర్నా ప్రారంభించారు. తమ సమస్యల పరిష్కారానికి 17, 18 తేదీల్లో అంగన్వాడీ సెంటర్ల బంద్ నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. రాత్రి అక్కడే నిద్రించారు. ఆశ వర్కర్ యూనియన్ అంగన్వాడీల ధర్నాకు మద్దతు తెలిపింది. ఆందోళనలో ఆశ వర్క ర్లు చంద్రకళ, భాగ్య, రామలక్ష్మి, అంగన్వాడీ యూ నియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లలిత, జిల్లా కోశాధికారి శైలజ, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి, రజియా విజయ, ప్రసాద, భాగ్య, వనజ, జిల్లా సహాయ కార్యదర్శి, భాగ్య, రేష్మ, విజయ, వందన, దేవిక లావణ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు. రాత్రి శిబిరంలోనే నిద్రిస్తున్న అంగన్వాడీ టీచర్లు -
అభివృద్ధి పనులకు రూ.1.12 కోట్లు
భైంసాటౌన్: నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.1.12 కోట్లు మంజూరైనట్లు భైంసా ఏఎంసీ చైర్మన్ సింధే ఆనంద్రావు పటేల్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి సీతక్కను గతంలో కోరినట్లు తెలిపారు. ఈ మేరకు రూ.1.12కోట్ల నిధులు మంజూరు చేస్తూ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 27 పనులకు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి సీతక్క, సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
సత్ఫలితాలిస్తున్న ‘పోలీస్ అక్క’
భైంసాటౌన్: మహిళా కానిస్టేబుళ్లకు పెట్రోకార్, ఎ మర్జెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. ఇందులో భాగంగా భైంసా పట్టణంలో శనివారం పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఓ మహిళ ప్రాణాన్ని కాపాడారు. వివరాలు.. పట్టణంలోని బోయిగల్లికి చెందిన తాండ్రోల్ల రుక్మాబాయి (55)ని ఆమె భర్త పోశెట్టి ఇంట్లో ఏ పని చేయడం లేదని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్ట్లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో అక్కడున్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు సంగీత, అనిత సకాలంలో చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. అనంతరం ఆమె కొడుకు భీమేశ్కు అప్పగించారు. అలాగే ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళను కాపాడిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
పద్యకవికి తెలుగుసాహితీ పురస్కారం
నిర్మల్ఖిల్లా: నిర్మల్కు చెందిన పద్యకవి, వ్యాఖ్యా త, ఉపన్యాసకులు, సంస్కతభాషా ప్రచార సమితి ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు బీ వెంకట్ డాక్టర్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అవార్డు–2025ను అందుకున్నారు. శనివారం ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ సంస్థ, ఇందిరా ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హిమాయత్నగర్లోగల సారెగ స్టూడియోలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ చైర్మన్, డాక్టర్ ఆలూరి విల్సన్, సినీ నటుడు పసునూరి శ్రీనివాస్, సిటీ సివిల్ కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీపీ అంజనీకుమారి, ఆర్ట్ ఫౌండేషన్ అధ్యక్షురాలు గాయని డాక్టర్ ఎన్ ఇందిరా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఇదే వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనంలో ‘నేటి సమాజానికి ఆదర్శ మహిళలు’ అంశపై వెంకట్ రాగయుక్తంగా తెలుగు పద్యాలను ఆలపించారు. వివిధ తెలుగు సాహిత్య సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ అవార్డు వచ్చినట్లు ఈ సందర్భంగా వెంకట్ తెలిపారు. వెంకట్ మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంస్కృత, తెలుగు భాషల్లో సాహితీసేవలందిస్తున్నారు. నిర్మల్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక, నిర్మలభారతి సభ్యులు, జిల్లాకు చెందిన సాహితీవేత్తలు వెంకట్ను అభినందించారు. -
వాతావరణం
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వా తావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం ప్రకా శవంతంగా కనిపిస్తుంది. చలి తగ్గుతుంది. నిమ్మనాయుడు చేతుల మీదుగా ఏర్పడి, ఎంతోమంది రాజుల పాలనలో మినీ ఓరుగల్లుగా పేరొందాను. వందలఏళ్లు రాజసాన్ని చాటాను. మరిప్పుడు.. ఆ రాజసమేది..!? ఘనమైన చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న ఆనాటి కోటలు, గఢ్లు, కందకాలు, బావులు, బగీచాలను ఏంచేస్తున్నారు..!? ఇష్టారీతిన కూలగొట్టేస్తూ.. మట్టితో కప్పేస్తూ.. కబ్జాలు పెట్టి ఇళ్లు, దుకా ణాలు కట్టేస్తున్నారు. అరె.. ఇవి రాజులకాలం నాటి గుర్తులు కదా.. వాటిని కాస్త అభివృద్ధి చేస్తే పర్యాటకంగా బాగుంటాయన్న కనీస సోయి కూడా లేదా..!? మీ ఇళ్లల్లో తాతముత్తాల ఫొటోలన్నీ వరుసగా ఉన్నాయి. మరి.. నిమ్మనాయుడు మొదలు నాటి రాజులు, ప్రాణ త్యాగం చేసిన రాంజీసహా వెయ్యిమంది వీరుల గుర్తులు, ఆనవాళ్లు కూడా మిగల్చరా..!? ‘రాజ’సం ఎక్కడుంది.. -
సత్ఫలితాలిస్తున్న ‘పోలీస్ అక్క’
భైంసాటౌన్: మహిళా కానిస్టేబుళ్లకు పెట్రోకార్, ఎ మర్జెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. ఇందులో భాగంగా భైంసా పట్టణంలో శనివారం పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఓ మహిళ ప్రాణాన్ని కాపాడారు. వివరాలు.. పట్టణంలోని బోయిగల్లికి చెందిన తాండ్రోల్ల రుక్మాబాయి (55)ని ఆమె భర్త పోశెట్టి ఇంట్లో ఏ పని చేయడం లేదని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్ట్లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో అక్కడున్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు సంగీత, అనిత సకాలంలో చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. అనంతరం ఆమె కొడుకు భీమేశ్కు అప్పగించారు. అలాగే ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళను కాపాడిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
ఘనంగా కాన్షీరాం జయంతి
నిర్మల్ టౌన్: బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆరాధ్య దైవం కాన్షీరామ్ అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు భూమేశ్ పేర్కొన్నారు. శనివారం కాన్షీరాం జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మా ట్లాడుతూ.. 15 శాతం ఉన్న అగ్రకులాలే దేశంలోని భూమి, సంపద, రాజకీయ అధికారాలను అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేడ్కర్ అడుగుజాడల్లో కాన్షీరాం ముందుకు సాగారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్లూరు సుధాకర్, రాజు, కుందూరు వినోద్, కత్తి శేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పిస్తున్న ధర్మసమాజ్ పార్టీ నాయకులు -
పద్యకవికి తెలుగుసాహితీ పురస్కారం
నిర్మల్ఖిల్లా: నిర్మల్కు చెందిన పద్యకవి, వ్యాఖ్యా త, ఉపన్యాసకులు, సంస్కతభాషా ప్రచార సమితి ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు బీ వెంకట్ డాక్టర్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అవార్డు–2025ను అందుకున్నారు. శనివారం ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ సంస్థ, ఇందిరా ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హిమాయత్నగర్లోగల సారెగ స్టూడియోలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ చైర్మన్, డాక్టర్ ఆలూరి విల్సన్, సినీ నటుడు పసునూరి శ్రీనివాస్, సిటీ సివిల్ కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీపీ అంజనీకుమారి, ఆర్ట్ ఫౌండేషన్ అధ్యక్షురాలు గాయని డాక్టర్ ఎన్ ఇందిరా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఇదే వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనంలో ‘నేటి సమాజానికి ఆదర్శ మహిళలు’ అంశపై వెంకట్ రాగయుక్తంగా తెలుగు పద్యాలను ఆలపించారు. వివిధ తెలుగు సాహిత్య సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ అవార్డు వచ్చినట్లు ఈ సందర్భంగా వెంకట్ తెలిపారు. వెంకట్ మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంస్కృత, తెలుగు భాషల్లో సాహితీసేవలందిస్తున్నారు. నిర్మల్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక, నిర్మలభారతి సభ్యులు, జిల్లాకు చెందిన సాహితీవేత్తలు వెంకట్ను అభినందించారు. -
నేను.. మీ నిర్మల్ను..
పశుగ్రాసం కొరత జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాడి రైతులను పశుగ్రాసం కొరత వేధిస్తోంది. బోధన్, మహా రాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక ధర వెచ్చించి చొప్ప, వరిగడ్డి దిగుమతి చేసుకుంటున్నారు. ‘‘నేనంటే మీకిష్టమేనా..!? అసలు.. మీ ఊరిని మీరు ఇష్టపడుతున్నారా..!? ఏంటి.. ఇలా అడుగుతోంది..? అని అనుకోకండి. ఏళ్లుగా చూస్తున్నా మీలో ఏమైన మార్పువస్తుందేమోనని. ఊహూ..! ఎక్కడా మార్పు కనిపించడం లేదు సరికదా.. మరింతగా నన్ను మీరు ద్వేషిస్తున్నారేమో అనిపిస్తోంది. ద్వేషం.. అనే పదం పెద్దదే కావొచ్చు. కానీ.. మనకు ఇష్టం లేనప్పుడే కదా ద్వేషిస్తాం. ఇప్పుడు నాపై మీరు చూపుతున్న తీరు ఇలాగే ఉంది మరి. ఆదివారం పూట.. ఈ సోదంతా మాకెందుకు.. అనుకుంటున్నారు కదా. అందుకే నేరుగా విషయానికొస్తా. మీరు ఇష్టపడే ప్రతీదాన్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. అది ఇల్లు కావచ్చు, కారు కావచ్చు.. కుటుంబమూ కావచ్చు. అలాంటప్పుడు.. మీకు ఇష్టమైన, మీకు జన్మస్థానమైన నన్ను మాత్రం దారుణంగా చూస్తున్నారు. పైకి మాత్రం ‘మేం నిర్మలోళ్లంబై, మాది రాయల్ నిర్మల్, మా ఊరు మస్తుంటది, ఐ లవ్ నిర్మల్..’ అని బయట దోస్తులకు గొప్పలు చెబుతున్నరు. అసలు.. ఒక్కసారైనా మీరు ఉంటున్న ఊరిని సరిగ్గా చూశారా..!? కనీసం మీ గల్లీలు ఎలా ఉన్నాయో గమనించారా..!? ఎన్ని సమస్యల మధ్య సతమతమవుతున్నామో గుర్తించారా..!? ఇవన్నీ తెలిసి కూడా మీరంతా మౌనంగా ఉంటున్నారన్నదే నా బాధ. –నిర్మల్ సహర్సోమ : 5:07ఇఫ్తార్ఆది : 6:22 -
రైతు సంక్షేమానికి కృషి చేయాలి
కడెం: నూతనంగా నియమితులైన ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగెల భూషణ్ (భూమన్న), వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు శనివారం ఉట్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే బొజ్జు నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల అభివృద్ధికి పాటు పడాలని, రైతు లేనిదే దేశం లేదని, రైతులే దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీశ్రెడ్డి, బరుపటి రమేశ్వర్మ, మల్లేశ్యాదవ్, చంద్రశేఖర్, డైరెక్టర్లు యాదగిరి, జలజ, విఠల్, నారాయణ, నాయకులు వాజీద్ఖాన్, రాజు, రమేశ్, ఆకుల లచ్చన్న, దేవందర్గౌడ్, రాజన్న తదితరులున్నారు. -
ఔదార్యం చాటిన విద్యార్థులు
మామడ: ఆపదలో ఉన్న వారికి జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులు ఆర్థికసాయమందిస్తున్నారు. మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రేని భీమేశ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో మంచానికి పరిమతమయ్యాడు. విషయం తెలుసుకున్న జిల్లా కేంద్రంలోని శ్రీవిద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విరాళంగా కొంత నగదు సేకరించారు. పోతారం గ్రామానికి వెళ్లి బాధితుడికి నగదు, నిత్యావసరాలు అందించారు. ప్రతీనెల అనాథలు, ఆరోగ్యం బాగాలేని వారికి సాయం అందిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంప్రకాశ్ తెలిపారు. -
పేరులోనే నిర్మలం..
● నేనంటే మీకెందుకు ఇష్టం లేదు? ● సమస్యలెందుకు పట్టించుకోరు? ● నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ● నా పేరెందుకు చెడగొడుతున్నారు? ● పాలకులు, ప్రజలను ప్రశ్నిస్తున్న పట్టణం నిర్మల్.. ఆహా నిమ్మలంగా ఎంతబాగుంది. కానీ.. ఏం లాభం. ఆ పేరులో మినహా ఊరిలో నిర్మలత్వం ఎక్కడుంది చెప్పండి. ఎప్పుడో వందలఏళ్ల క్రితం ఏర్పడ్డ చరిత్ర. అప్పుడెప్పుడో 1952లో మున్సిపాలిటీగా గుర్తించారు. అప్పటి ఊరి జనాభా పదివేల మంది. ఇప్పుడు లక్ష దాటిపోయి, రెండులక్షలకు దగ్గరవుతున్నారు. పెరిగిన జనాభాకు తగ్గట్లు వసతులు కల్పించారా..!? కనీసం ఇంతమంది జనాభాకు తగ్గట్లు బల్దియాలో కార్మికులు, ఉద్యోగుల సంఖ్య పెంచారా..!? సర్కారు నుంచి పట్టణం కోసం నిధులు తెస్తున్నారా..!? ఇవన్నీ చేస్తే.. మరి గల్లీలన్నీ ఎందుకిట్ల గలీజుగా కనిపిస్తున్నాయో చెప్పండి. మీరు గాంధీచౌక్కే పోతారో.. బుధవార్పేట్కే వెళ్తారో.. ప్రియదర్శినినగర్లోనే తిరుగుతారో.. ఇంకే గల్లీలో తిరుగుతారో మీ ఇష్టం. ఎక్కడైనా కనీసం ఒక్క రోడ్డయినా సక్కగా ఉందా..! డ్రైనేజీ సిస్టం పక్కాగా ఉందా..! డ్రైనేజీల్లో నుంచి వెళ్లకుండా నల్లాపైపులైన్లు ఉన్నాయా..!? గల్లీల్లో మూలమలుపులు, సందు చివరలు చెత్తలేకుండా కనిపిస్తున్నాయా..! కనీసం దుమ్ముధూళీ లేకుండా ఏ ఒక్క రోడ్డయినా ఉందా..!? ఉట్టిగనే కాదు.. మీరే స్వయంగా చూసి చెప్పండి. -
ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన
లక్ష్మణచాంద మండలంలో.. లక్ష్మణచాంద: మండలంలోని బాబాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ, పార్పెల్లి మండల ప్రాథమిక పాఠశాలల్లో ఏఈ ఆధారిత విద్యాబోధనను ఎంఈవో అశోక్వర్మ శనివారం ప్రారంభించారు. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు బీ, సీ గ్రేడ్ల విద్యార్థులకు కృత్రిమ మేధా ద్వారా చేపడుతున్న బోధనను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీరోజు విద్యార్థులందరినీ గ్రూపులుగా విభజించి విషయాల వారీగా ఏఐ ఆధారిత విద్యాబోధన చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు ధర్మేంద్ర, కిష్టయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, నగేశ్, రాజన్న, నారాయణ, సీఆర్పీ సుధాకర్ పాల్గొన్నారు. నిర్మల్ రూరల్: ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ద్వారా ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణిత శాస్త్రంలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 16 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. మూ డు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఏఐ ఆధారిత విద్యా యాప్లు, ప్లాట్ఫామ్లు ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తించి మెరుగుపరిచేందుకు దో హదం చేస్తాయని తెలిపారు. ఏఐ ఆధారిత యాప్ లు కథలు, వీడియోలు, ఆటల ద్వారా పిల్లల్లో చదవడం, లెక్కించడం మీద ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సును వినియోగించుకుని ప్రతీ విద్యార్థి ప్రాథమిక విద్యలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ప్రతీ విద్యార్థి ఆరోగ్యం, విద్య, ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టా లని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె వెంట డీఈవో పీ రామారావు, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజేందర్, విద్యాశాఖ అధికారులు సలోని, ప్రవీణ్, లింబాద్రి, ఉపాధ్యాయుడు నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఏఈ ఆధారిత బోధన పరిశీలన -
అనభేరి ప్రభాకర్రావు సేవలు మరువలేనివి
ఖానాపూర్: పేదప్రజలు, పీడిత జనుల ఆర్తనాదాలను ఆపి బానిస బతుకులను రూపుమాపేందుకు అవతరించిన తెలంగాణ భగత్సింగ్ అనభేరి ప్రభాకర్రావు సేవలు మరువలేనివని సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి నంది రామయ్య కొనియాడారు. పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతిభవనం ఆవరణలో ఎల్లాపి సంఘం నిర్మల్ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల మురళి అధ్యక్షతన నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ జిల్లా పోలంపల్లికి చెందిన ప్రభాకర్రావు విద్యార్థి దశ నుంచే నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. పాలేర్ల పిల్లలకు చదువులు చెప్పించడంతోపాటు తన ఇంట్లో ఉండే పని మనుషులకు వివాహాలు చేసి వారి జీవితాల్లో స్వేచ్ఛ వెలుగులు నింపి సీ్త్ర జాతి గౌరవాన్ని కాపాడారని గుర్తు చేశారు. నేతన్నలను ఆకలిచావుల నుంచి తప్పించడంతో పాటు పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. నిజాంకు సింహస్వప్నంలా మారి తెలంగాణ ప్రజల విముక్తికి ఉద్యమించిన అనభేరి విగ్రహాన్ని ట్యాంక్బాండ్పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్, అంకం రాజేందర్, నిమ్మల రమేశ్, గంగనర్సయ్య, గణపతిరావు, పడాల మోహన్రావు, పెరిక గంగాధర్, లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాస్, కాంతారావు, భీంరావు, చందు, సతీశ్ తదితరులున్నారు. -
ముదురుతున్న ఎండలు
● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● భయాందోళనలో జిల్లా ప్రజలు ● అప్రమత్తతే మేలంటున్న డాక్టర్లు భైంసాటౌన్: మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనాలు పగటివేళ బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే జాగ్రత్తలు పాటించి బయటకు వస్తున్నారు. ఓవైపు ఇంటర్ పరీక్షలు కొనసాగుతుండగా, మరోవైపు పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. పెరుగుతున్న ఎండల కారణంగా ఈనెల 15నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 40 డిగ్రీలకు చేరువగా.. జిల్లాలో ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మొదలయ్యాయి. ఈనెల ప్రారంభంలో గరిష్ణ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు ఉండగా, శుక్రవారం అధికంగా 39.5 డిగ్రీలుగా నమోదైంది. దీంతో హోలీ పండుగ వేళ జనాలు ఎండకు భయపడి ఉదయమే వేడుక జరుపుకొని ఇళ్లకు చేరుకున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్తలే మేలు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో పనిచేసేవారు, ద్విచ క్ర వాహనాలపై దూర ప్రయాణాలు చేసేవారు వడదెబ్బ బారిన పడే ప్రమాదముందని పే ర్కొంటున్నారు. వడదెబ్బ బారిన పడితే కళ్లు తి రగడం, తీవ్రమైన తలనొప్పి, గుండెదడ, చెమటలు ఎక్కువగా పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉంటుందని పేర్కొన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ఎండలో పనిచేయరాదని తెలిపారు. ఉదయం వేళల్లోనే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరాలని పేర్కొన్నారు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాలి. ఎండలో వెళ్లినప్పు డు రక్షణగా గొడుగు వాడాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. ప్రతీరోజు ఎక్కువ మోతా దులో నీటిని తీసుకోవాలి. పండ్ల రసాలు, కొ బ్బరి నీరు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. – ఎస్.కాశీనాథ్, ఏరియాస్పత్రి సూపరింటెండెంట్, భైంసా జిల్లాలో ఐదురోజుల ఉష్ణోగ్రతలు తేదీ గరిష్టం కనిష్టం 10 37.5 21.5 11 37.6 22.5 12 38.4 23.3 13 39 24 14 39.5 24.4 -
అంత్యక్రియలు
పోలీస్ జాగిలానికి నిర్మల్ టౌన్: జిల్లాలో పోలీస్శాఖకు విశేష సేవ లందించిన హంటర్ అనే జాగిలం గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సందర్భంగా హంటర్కు పోలీస్ లాంఛనాలతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఎస్పీ జానకీ షర్మిల జాగిలానికి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖలో ఫిబ్రవరి 1, 2022 నుంచి నేర విభాగంలో విధులు నిర్వహిస్తూ పలు హత్యలు, చోరీ కేసులను ఛేదించడంలో హంటర్ సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, సీఐలు ప్రేమ్కుమార్, కృష్ణ, జాగిలం సంరక్షకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఖానాపూర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ మండలాధ్యక్షుడు టీ రాజగంగన్న, పట్టణాధ్యక్షుడు గౌరికార్ రాజు ఆధ్వర్యంలో శు క్రవారం స్థానిక జగన్నాథ్రావు చౌరస్తాలో ఆందోళన చేశారు. అంబేడ్కర్ చౌరస్తాలోని కూరగాయల మార్కెట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా, దిష్టిబొమ్మ ద హనానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. నా యకులు అబ్దుల్ ఖలీల్, సుమన్, ప్రదీప్, గ జేందర్, శ్రావణ్, నరేందర్రెడ్డి, సుమిత్, చంద్రహాస్, షోయబ్, దివాకర్, మహిపాల్, మ హేందర్, వెంకటేశ్వర్రావు, రమేశ్, శ్రీనివాస్, లాజర్, శ్రీకాంత్, నరేశ్ తదితరులున్నారు. -
అటవీశాఖ అనుమతులు తీసుకోవాలి
● డీఎఫ్వో నాగిని భాను ● హరితవనం పరిశీలన ● అభివృద్ధిని అడ్డుకోవద్దని గ్రామస్తుల వినతి దస్తురాబాద్: అటవీశాఖ అనుమతులు ఉన్నప్పుడే అటవీశాఖ పరిధిలో పనులు చేపట్టేందుకు అంగీకరిస్తామని డీఎఫ్వో నాగిని భాను తెలిపారు. మండలంలోని దేవునిగూడెం గ్రామస్తులు కేసీఆర్ హరిత వనంలో మరో 200 చెట్లు నరికి వేశారు. అటవీ అధికారులు డీఎఫ్వోకు సమాచారం అందించారు. గురువారం దేవునిగూడెం చేరుకుని నరికివేసిన చెట్లను పరిశీలించారు. అటవీశాఖ పరిధిలో పనులు చేయాలంటే అనుమతులు తప్పనిసరి అన్నారు. నల్ల పోచమ్మ ఆలయం, రహదారి నిర్మాణం చేపట్టాలంటే ఆయా శాఖలైన దేవాదాయ, పంచాయతీరాజ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతి ఇస్తామన్నారు. చెట్లు నరికివేసినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు ఇచ్చే వరకూ పోరాడుతాం.. గ్రామానికి కష్టపడి బీటీ రోడ్డు మంజూరు చేయించుకున్నామన్నారు. మంజూరైన రోడ్డును అడ్డుకోవడం సరికాదని గ్రామస్తులు అన్నారు. అనుమతులు, అంక్షల పేరుతో గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని కోరారు. అభివృద్ధికి అడ్డుగా ఉంటే ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హరితవనాన్ని ధ్వంసం చేశామన్నారు. అటవీ అనుమతులు వచ్చే వరకు పోరాడుతామని తెలిపారు. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. గ్రామస్తులతో మాట్లాడిన తహసీల్దార్...ఇదిలా ఉంటే దేవునిగూడెం గ్రామస్తులతో తహసీల్దార్ సర్ఫరాజ్ నవాజ్ మాట్లాడారు. హరిత వనంలో చెట్లు నరికివేయడం సరికాదని పేర్కొన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మండలం పరిధిలో 5,300 ఎకరాల్లో రెవెన్యూ, అటవీశాఖ పరిధిలో వివాదాస్పద భూమి ఉందని, రెండు శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తేనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గ్రామస్తుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీవో భవానీశంకర్, డిప్యూటీ తహసీల్దార్ యాదవరావ్, కడెం, ఖానాపూర్, పెంబి, మమాడ, నిర్మల్ అటవీ అధికారలు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. -
● జిల్లాలో ఎన్నో రంగులు.. ● ఇప్పటికీ ‘వెలుగులు’లేని ఊళ్లు ● దారులు చూడని పల్లెలు ● అభివృద్ధి పట్టని పాలకులు ● ఇలా.. ఇంకెన్ని హోలీలో..!?
నిర్మల్: రంగులు లేని జీవితం ఉండదు. మనసును బట్టి మనిషి రంగు మారుతుంది. కొన్నిసార్లు ఆ మనిషి ఎంచుకునే రంగులూ తనేంటో చెబుతాయట. గట్ల(ఘాట్)కింద, గంగ(గోదావరి) ఇవతల ఉన్న మన జిల్లాలోనూ ఎన్నో రంగులున్నయ్. కల్లాకపటం తెలియని పల్లె మనుషుల మనసంతా తెలుపైతే.. అలాంటి కొన్ని పల్లెలు ఇప్పటికీ వెలుగును చూడకపోవడం నలుపే. తాము ఎంతటి దుస్థితిలో ఉంటున్నా ప్రశ్నించలేని ప్రశాంతత నీలమైతే.. తట్టుకోలేక తన్నుకొచ్చిన చైతన్యం ఎరుపవుతుంది. ఇలా ఎన్నోరంగులను తనలో ఇముడ్చుకున్న జిల్లాలో ఎన్ని హోలీపండుగలు వెళ్లిపోతున్నా.. ఇప్పటికీ ‘రంగులలోకం’ చూడని అడవిబిడ్డలూ ఉండటం శోచనీయమే. హోలీ పండుగవేళ సప్తవర్ణాల్లో జిల్లా.. ఎలా ఉందంటే.. తెలుపు..నల్లరేగడి నేలలు పర్చుకున్న జిల్లాలో ‘తెల్ల’బంగారం పండుతోంది. ఇప్పటికీ సగానికిపైగా జిల్లాకు అదే పెద్ద దిక్కవుతోంది. ఇప్పుడంటే మైసా(భైంసా)లో మిల్లులు తగ్గిపోయాయి కానీ.. ఒకప్పుడు కనుచూపు మేరంతా ‘కాటన్’ సంచులు నిండిన ఎడ్లబండ్లే ఉండేవి. ‘బాపూ.. కాలేజీల ఫీజు కట్టాలటనే..’అని పట్నంలో చదువుతున్న కొడుకు అడిగితే.. ‘ఆగు బిడ్డా.. రేపు మైసాకు పోయచ్చినంక పైసల్ పంపిస్త..’ అనేవాళ్లు. ఇక ఇదే జిల్లాలో ఇంకోదిక్కు.. తెల్లటి మనసున్న అడవి బిడ్డలు ఉన్నారు. ఎన్నికష్టాలున్నా.. ఏ ‘రంగులు’ లేని స్వచ్ఛమైన నవ్వులతోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. నలుపు..జిల్లాలో ఇప్పటికీ ‘నల్లని ఊళ్లు’ ఉన్నాయి. నల్లని ఊళ్లా.. అవేంటి..!? అని ఆశ్చర్యపోవచ్చు. ఏ వెలుగూ లేకపోతే ఉండేది ‘నల్లటి’ చీకటే కదా..! ఇప్పటికీ జిల్లాలో కనీసం కరెంటు లేని ఊళ్లు, రోడ్లు లేని పల్లెలు ఉన్నాయి. ఎప్పుడో ఇచ్చిన సోలార్లైట్లు అప్పుడప్పుడు మిణుకుమిణుకు మంటుంటే.. ఆముదం పోసిన దీపాల వెలుగుల్లోనే జీవితాలు గడిపేస్తున్నారు. తరాలు గడిచిపోతున్నా.. చాకిరేవు, రాగిదుబ్బ, సోముగూడ, మిద్దెచింత ‘చీకట్లు’ తొలగడం లేదు. అంకెన, రాయదారి, కోరకంటి, వస్పెల్లి, ధోంధరి, గంగాపూర్, గండిగోపాల్పూర్, ఇస్లాంపూర్, అల్లంపెల్లి, బాబానాయక్తండా, కుసుంపూర్, చామన్పెల్లి, కొత్తగూడ, జిల్లెడుకుంట, పంగిడిచెరు, పెండల్దరిలకు ఇప్పటికీ సరైన దారీ లేదు. పసుపు..రంగుకే పేరు తెచ్చిన పసిడిపంట పసుపు. ఈ సీజన్లో నిర్మల్ డివిజన్లోని నీటి కాలువలు, చెరువులు ఉన్న పంట ఏరియాల వెంట వెళ్తూ ఉంటే.. ఉడకబెడుతున్న పసుపు వాసన ఆహా.. అనిపిస్తుంది. పక్కజిల్లాలో వచ్చిన పసుపుబోర్డు జిల్లా రైతులలో ఇంకా ఆశలు పెంచింది. కానీ ఇప్పటికిప్పుడు పసిడి లెక్క ధర పెరిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎరుపు..‘ఎర్రటి’బొట్టు పెట్టుకున్న అమ్మలే జిల్లాకు పట్టుగొమ్మలు. అవును.. జిల్లా మహిళల ఖిల్లా. సీ్త్ర, పురుష జనాభా నిష్పత్తిపరంగా చూస్తే రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా అధిక మహిళానిష్పత్తితో ప్రథమస్థానంలో ఉంది. ప్రతీ వెయ్యిమంది పురుషులకు 1,046 మంది మహిళలు ఉన్నారు. ‘ఎరుపంటే’.. చైతన్యానికి ప్రతీక. జిల్లాలోనూ ఇప్పుడంతా మహిళల రాజ్యమే. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, డీఆర్డీవో వంటి జిల్లా అధికారులే కాదు.. మండల, గ్రామస్థాయిలోనూ స్వయంశక్తితో సాధికారత సాధిస్తుందీ చైతన్యమూర్తులైన మహిళలే. ఆకుపచ్చ..జిల్లాలో ఓ దిక్కు తెల్లబంగారం మెరుస్తుంటే.. మరోవైపంతా.. ‘పచ్చదనమే’. నిర్మల్ జిల్లాకేంద్రం నుంచి అలా ఖానాపూర్, కడెంవైపు వెళ్తుంటే ఆకుపచ్చకోక కట్టిన అడవి అందాలు ఆకట్టుకుంటాయి. ఒక్కసారి గంగాపూర్ వాచ్టవర్ ఎక్కిచూస్తే ‘ఆహా..’ అనిపిస్తుంది. అలాంటి పచ్చదనం క్రమంగా తగ్గుతోంది. జిల్లాలో ఇప్పటికీ చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. కలప అక్రమ రవాణా అలాగే ఉంది. నీలం..‘నీలి’వర్ణాన్ని నిండా నింపుకుని గలగల పారేటి గోదారమ్మ జిల్లాపొడవునా ‘సాగు’తోంది. ‘సరస్వతమ్మ’తో జలసిరులు సాగనంపుతూ అన్నదాతకు అండగా ఉంటోంది. ఓ దిక్కు స్వర్ణమ్మ, మరోదిక్కు కడెం, ఇంకోదిక్కు సుద్ధవాగులూ జిల్లాకు జీవం పోస్తున్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న, పసుపు వంటి ఎన్నో పంటల సాగుతోపాటు జిల్లావాసులకు ‘భగీరథ’తో తాగునీటిని అందిస్తున్నాయి ఈ నీలివర్ణపు జలాలే. కాషాయం..జిల్లాలో ఇటీవల కాషాయవర్ణం మెరుస్తోంది. రాజకీయపరంగా బీజేపీని కాషాయంతో పోలుస్తుంటారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి బీజేపీ నిర్మల్, ముధోల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాషాయపార్టీకి జిల్లానే అధిక్యతనిచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అధిక ఓట్లను కట్టబెట్టింది. ఇద్దరు ఎమ్మెల్యేలను, ఎంపీని, ఎమ్మెల్సీలనూ గెలిపించినా కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయపార్టీది జిల్లాపై శీతకన్నే. జిల్లా మీదుగా రైల్వేలైన్, నవోదయ, యూనివర్సిటీ వంటి ఎన్నో పనులను చేయాల్సి ఉన్నా.. కేవలం ‘కాషాయ’వర్ణాన్ని చూపి, మాయచేస్తోందన్న ఆరోపణలూ ఉన్నాయి. -
17నుంచి కుష్ఠువ్యాధి సర్వే
నిర్మల్చైన్గేట్: ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో చేపట్టే లేప్రసీ కేస్ డిటెక్షన్ కార్యక్రమం కొనసాగుతుందని డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరో గ్య శాఖ అధికారి కార్యాలయంలో గురువా రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే కుష్ఠు వ్యాధిని గుర్తించి చి కిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా, వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి కుష్ఠు వ్యాధిని గుర్తించడానికి ప్రతి ఒక్కరినీ పరీక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి లెప్రసీ కేసులు గుర్తించి చికిత్సలు అందించాలన్నారు. కార్యక్రమంలో కార్యక్ర మ నిర్వహణ అధికారి రవీందర్రెడ్డి, డిప్యూ టీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారే రవీందర్ డిప్యూటీ పీఎంవో రాజేశ్వర్, ఫిజి యోథెరపిస్ట్ కిషనరావు, వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షక అధికారులు పాల్గొన్నారు. -
పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ నిర్మల్చైన్గేట్: ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ సూచించారు. కలెక్టర్లు, ఈఆర్వోలతో హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతోపాటు ఈఆర్వోలు తమతమ స్థాయిలలో పొలిటికల్ పార్టీ మీటింగ్లు ఏర్పాటు చేసి అప్డేట్స్ అందించాలన్నారు. సమావేశాల తేదీ, సమయాన్ని ఖరారు చేస్తూ ముందస్తుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. సమావేశాల వివరాలను సీఈవో కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు పంపించాలన్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కౌట్ల(బి) అటవీ ప్రాంతంలో సమగ్ర జాబితా సర్వే
సారంగపూర్: మండలంలోని కౌట్ల(బి) అట వీ ప్రాంతంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏడీ సంపత్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంత అభివృద్ధి, పెరుగుతున్న మొక్కలు, తదితర సమ గ్ర జాబితా సర్వేను నిర్వహించారు. ఈసందర్భంగా అడవుల్లో అటవీశాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు అడవుల్లో పెరుగుతున్న వృక్షసంపద, గడ్డిజాతుల పెరుగుదల తదితర అంశాలను గురించి సర్వే చేపట్టారు. అటవీ సంపద పరిరక్షణలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో నజీర్ఖాన్, కౌట్ల(బి) బీట్ అధికారి స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు. -
● భక్తిశ్రద్ధలతో కామ దహనం ● పలుగ్రామాల్లో హోలీ ప్రారంభం ● పాఠశాలల్లో ముందస్తు పండుగ
నిర్మల్: ఆనంద కేళి రంగుల హోళి రానే వచ్చింది. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రంగులు, సంతోషం, సామూహిక ఆనందం, మంచి చెడు మధ్య పోరాటాన్ని సూచిస్తుంది. ఈ పండుగ చలికాలానికి వీడ్కోలు చెప్పే వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. హోలీ బంధుత్వాలను, స్నేహాలను మరింత దగ్గర చేస్తుంది. వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచే పండుగ సందడి మొదలైంది. రాత్రి కామదహనం నిర్వహించారు. పలు గ్రామాల్లో కాముడు కాల్చగానే హోలీ పండుగను ప్రారంభించారు. రంగులు చల్లుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యాసంస్థల్లోనూ ముందస్తు హోలీ నిర్వహించారు. పండుగ విశేషాలను పిల్లలకు వివరించారు. ఇక జిల్లావ్యాప్తంగా శుక్రవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. కోలలు, కొప్పుల సందడి..హోలీ పండుగ వస్తుందంటే గ్రామాల్లో హనుమాన్ ఆలయాలు, కూడళ్లవద్ద పెద్దలు, యువకులు అంతా కలిసి రాత్రిపూట కోలాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. లయబద్ధంగా పాటలు పాడుతూ ఒకరికొకరు కోలలు వేసుకుంటూ అలా చుట్టూ తిరుగుతుండటం ఆకట్టుకుంటుంది. జిల్లా కేంద్రంలోనూ బాగులవాడ, నగరేశ్వరవాడ, వెంకటాద్రిపేట, ద్యాగవాడ తదితర గల్లీల్లో ఇప్పటికీ కోలాలు వేస్తున్నారు. గురువారం రాత్రి కోలలు వేశారు. తరాలు మారుతున్నా ఇప్పటికీ జిల్లాలోని చాలా గ్రామాల్లో కోలలు, జడకొప్పులనూ వేయడం ఆనవాయితీగా సాగుతోంది.తానూరు మండలంలో కామదహనం కార్యక్రమంలో భాగంగా నృత్యం చేస్తున్న గ్రామస్తులు -
అటవీ అధికారుల తీరుపై నిరసన
ఖానాపూర్: మండలంలోని రంగపేట పంచాయతీ పరిధి కొత్తగూడెంలో నివాసం ఉంటున్న గోనె స్వా మి–మల్లీశ్వరి దంపతుల ఇంటిని అటవీశాఖ అధి కారులు అక్రమంగా, కక్షపూరితంగా కూల్చివేయడంపై సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. బాధ్యులపై చర్య తీ సుకోవాలని పార్టీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. పట్టణంలోని అటవీ శాఖ డివిజన్ కార్యాలయం ముందు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబీకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ నిరుపేద గుడిసెను కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. గతంలో భూపోరాటం ద్వారా 40 కుటుంబాలు నివసిస్తుండగా అధికారులు బాధిత కుటుంబానికి అన్యాయం చేయడం సరికాదన్నారు. 2005 నుంచి 2009 వరకు ఇంటి పన్ను చెల్లించడంతోపా టు 2008లో ఇందిరమ్మ ఇంటిని సైతం నిర్మించార ని పేర్కొన్నారు. అనంతరం ఎఫ్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్, దుర్గం లింగన్న, ప్రసాద్, స్వామి, శేఖర్, గంగన్న, కై లాస్, శ్రీనివాస్, చంద్రకళ, సావిత్రి ఉన్నారు. -
ఘనంగా మొల్లమాంబ జయంతి
నిర్మల్ఖిల్లా: తొలి తెలుగు మహిళా కవయిత్రి, మొల్లమాంబ 585వ జయంతి ఉత్సవాల ను జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ కూ డలిలోని విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా, పట్టణ కుమ్మర సంఘం, కుమ్మర ఉద్యోగుల సంక్షేమ సంఘం (కేవ) ఆధ్వర్యంలో మొల్లమాంబ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కుమ్మరుల ఆరాధ్య దైవం మొల్లమాంబ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, కుమ్మరుల సంక్షేమం కొరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేపట్టాలని, కుమ్మరులను బీసీ–ఏలో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గంగాధర్, కేవా అధ్యక్షుడు తోడిశెట్టి పరమేశ్వర్, జిల్లా కోశాధికారి టి.శంకర్, కేవా ప్రధాన కార్యదర్శి పి.సాయన్న, తోడిశెట్టి రవి కాంత్, చంద్రయ్య, స్వామి, మధు సిలారి, నారాయణ, శ్యాంసుందర్, కృష్ణసాగర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రాయితీ పొందాలి
భైంసాటౌన్: ఈ నెలాఖరులోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చె ల్లించి 25శాతం రాయితీ పొందాలని మున్సిపల్ క మిషనర్ రాజేశ్కుమార్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో దరఖాస్తుదారులు, రియల్టర్ల కు ఎల్ఆర్ఎస్పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పట్టణంలో ఎల్ఆర్ఎస్ కోసం 6,288 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఎల్ఆర్ఎస్ రూపంలో రూ.2కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా యం రావాల్సి ఉందని వెల్లడించారు. బుధవారం 30మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగా, రూ.2.66 లక్షలు ఫీజు రూపంలో వచ్చినట్లు వివరించారు. -
పశుసంపదను పరిరక్షించాలి
నిర్మల్ టౌన్: దేశీయ పశుసంపదను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని క్లీమామ్ గోశాల వ్యవస్థాపకురాలు, సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్ అల్లోల దివ్యారెడ్డి కోరారు. బుధవారం తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. క్రాస్ బ్రీడింగ్తో దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు చేస్తున్న క్యాంపెయినింగ్కు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. దేశవాళీ ఆవుల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశవాళీ ఆవుల సంరక్షణకు చేస్తున్న మంచి కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని బీఆర్ నాయుడు పేర్కొన్నట్లు అల్లోల దివ్యారెడ్డి తెలిపారు. -
‘దేవాదాయ’ం.. గాల్లో దీపం!
నిర్మల్: ‘ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని చూస్తున్నారే గానీ.. దేవుడి చుట్టూ ఉన్న సమస్యలు పరిష్కరించడం లేదు..’ అంటూ దేవాదాయశాఖపై బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నా యి. జిల్లాలో పలు ఆలయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్నారు. నేరుగా ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారుల నుంచి పెద్దగా స్పందన రావ డం లేదని భక్తులు వాపోతున్నారు. అభివృద్ధి ప నులు, వసతుల కల్పన అటుంచి.. కనీసం కరెంట్, తాగునీరు, అర్చకులు, సిబ్బందికి సకాలంలో వేతనాల విషయం కూడా పట్టించుకోకపోవడంపై వెల్లువలా ఆరోపణలు వస్తున్నాయి. గండిరామన్నకు కరెంట్ కట్ జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఒక్కటిగా వె లుగొందుతున్న నిర్మల్లోని గండిరామన్న దత్తసాయి ఆలయ ప్రాంగణంలో చీకట్లు ముసురుకున్నాయి. కొన్నినెలలుగా ఆలయం నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఇటీవల కరెంట్ కట్ చేయడంతో అర్చకులు, సిబ్బంది నివాస గృహాల్లో అంధకారం నెలకొంది. ఊరికి శివారు న, అటవీప్రాంతానికి సమీపంలో ఉండటంతో సంబంధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గ డిపాయి. అధికారులు, పాలకవర్గం తీరుపై విమర్శలు రావడంతో విద్యుత్ అధికారులతో మాట్లా డి బిల్లులు చెల్లించకుండా, తాత్కాలికంగా కరెంట్ కనెక్షన్ను పునరుద్ధరింపజేశారు. బిల్లులు ఇవ్వకపోవడంతో.. ఆలయాల్లో అభివృద్ధి పనులకు దాతలు ముందు కు వచ్చి డబ్బు, వస్తు రూపంలో సహకరించడం సాధారణమే. వారిచ్చిన వాటితో అక్కడ పాలకవర్గం, అధికారుల సమన్వయంతో పనులు చేయిస్తుంటారు. ఆ పనులు చేసిన వారికి బిల్లుల రూ పంలో డబ్బులు చెల్లిస్తుంటారు. ఇది అంతటా జరిగేదే. కానీ.. గండిరామన్న ఆలయంలో చేసిన పనులకూ బిల్లులు ఇవ్వకపోవడంతో సంబంధిత వ్యక్తులు తాము చేసిన వస్తువులను తిరిగి తీసుకెళ్లడం గమనార్హం. సాయిబాబా ఆలయం పక్కన గల షెడ్డులో గల విగ్రహం వద్ద దాతల సహకా రంతో స్టీల్ రెయిలింగ్తో పనులు చేయించారు. ఈ పనులు చేసినవారికి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు వాటిని తిరిగి తీసుకెళ్లడం జిల్లాకేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. భక్తులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో రెయిలింగ్ పనులు మళ్లీ చేయించారు. ఇక్కట్లు దేవుడికెరుక ఏ కష్టం వచ్చినా అందరూ ‘దేవుడా.. నువ్వే ది క్కు..’ అంటుంటారు. అలాంటి ఆలయాల్లో ని త్యం దైవసేవలో ఉండే అర్చకులు, సిబ్బంది స మస్యలు మాత్రం దేవాదాయశాఖ పట్టించుకో వ డం లేదన్న ఆరోపణలున్నాయి. ఆలయాల్లో కాంట్రాక్ట్ సిబ్బంది, అర్చకులకు సకాలంలో వేతనా లు రావడం లేదు. అసలే అరకొరగా ఉన్న జీతా లు నెలలు గడిచినా రాక వారు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆలయాల్లో భక్తులు ఇచ్చే వస్తుకానుకలనూ అధికారులు వారికి దక్కనివ్వడం లే దన్న ఆరోపణలున్నాయి. ఆలయాల్లో చేసే అన్నదానాల్లోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్న ట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులకు అందించే భోజనానికి, పెట్టే బిల్లులకు పొంతన ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులూ రెగ్యులర్గా రావడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. వీటితో పాటు పలు ఆలయాలు శిథిలావస్థకు చేరుతున్నా కనీసం పట్టించుకునేవారు లేరని భక్తులు వాపోతున్నారు. గండిరామన్న గుడిలో పవర్ కట్ చేసిన పనులకూ చెల్లింపుల్లేవ్ అధికారుల పర్యవేక్షణ అంతంతే -
నీటి కొరత రానివ్వొద్దు
మామడ: అటవీ ప్రాంతంలో జంతువులకు నీ టి వనరుల కొరత లేకుండా చర్యలు చేపట్టా లని బాసర సర్కిల్ సీసీఎఫ్ శర్వానంద్ సూచించారు. బుధవారం మామడ అటవీ క్షేత్ర పరి ధి లోని భీమన్న గుట్ట, ఆరేపల్లి అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీ టికుంటల నిర్మాణం, సాసర్పిట్లు, నీటిచెల్మ లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి కుంటల సమీపంలో కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి వనరుల వద్దకు వచ్చే నీలుగాయి, సాంబర్, జింక తదితర అట వీ జంతువులు, పక్షులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎఫ్వో నాగినిభాను, ఎఫ్ ఆర్వో రాథోడ్ అవినాశ్, ఎఫ్ఎస్వో ప్రభాకర్, ఎఫ్బీవోలు రమేశ్, మౌనిక ఉన్నారు. -
నిధులు కేటాయించాలి
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి మేస్తిర సాయికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. గత బడ్జెట్లో 7శాతం నిధులే కేటాయించి ఆ మొత్తాన్ని కూ డా పూర్తిగా విడుదల చేయకపోవడంతో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక పేద విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశా రు. విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తేనే విద్యావ్యవస్థ గాడిలో పడుతుందని తెలి పారు. నాయకులు తేజ, శేఖర్, సాయిప్రసాద్, అజయ్, గణేశ్, సందీప్ పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్కుమార్, రూరల్ సీఐ నైలు, ఎస్సై అశోక్, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. కళ్లను కాపాడుకోవాలినిర్మల్: కళ్లను కాపాడుకుంటేనే జీవితాన్ని చూడగలుగుతామని ప్రముఖ కంటివైద్యుడు కృష్ణంరాజు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఆ దర్శనగర్ శిశుమందిర్లో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వి ద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. డాక్టర్ స తీశ్ చెవి, వినికిడి, మాట పరీక్షలు, డాక్టర్ ప్ర వీణ్ జనరల్ చెకప్ చేసి మందులు అందించా రు. విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువుపై దృష్టిపెట్టాలన్నారు. ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాల ను కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో శిశుమందిర్ జిల్లా కార్యదర్శి షోలాపూర్ రాజేశ్వర్, శైక్షణిక్ ప్ర ముఖ్ కలిమహంతి వేణుమాధవ్, సాదు జ నార్దన్రెడ్డి, పుష్పలత తదితరులున్నారు. -
● పసిడి పంటకు దక్కని ‘మద్దతు’ ● బోర్డు వచ్చినా అందని ఫలితం ● పెట్టుబడి ఖర్చులూ రాని వైనం ● భారీగా నష్టపోతున్న రైతాంగం
లక్ష్మణచాందలో సాగు చేసిన పసుపు పంటలక్ష్మణచాంద: ఆరుగాలం కష్టపడి పసుపు సాగు చేసిన జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన అన్నదాతలకు దిగుబడి బాగా తగ్గింది. వచ్చిన కాస్త పంట అమ్ముకుందామనుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ధర లేదు. పొరుగు జిల్లా నిజామాబాద్లో ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాకు చెందిన పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. బోర్డు ఏర్పాటుతో పసుపు పంటకు గిట్టుబాటు ధర వస్తుందని భావించారు. కానీ.. పసుపు బోర్డు ఏర్పాటైనా అక్కడ కూడా పంటకు సరైన ధర లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సాగు ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఈసారి సుమారు 5,500 ఎకరాల్లో పసుపు సాగు చేసినట్లు జిల్లా ఉద్యానవన అధికారి బీవీ రమణ తెలిపారు. గతేడాది 15వేల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి సాగు విస్తీర్ణం ఘననీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది సాగు ప్రారంభ దశలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పంటపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. తరువాత క్రమంలో పంటకు వివిధ తెగుళ్లు సోకాయి. ప్రధానంగా దుంప కుళ్లు, మర్రి ఆకు తెగుళ్లు సోకగా పంట దెబ్బతిని దిగుబడి ఘననీయంగా తగ్గింది. ఎకరాకు కనీసం 15 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులు ధీర్ఘకాలిక (9 నెలలు) పంట అయిన పసుపు సాగు కు పెట్టుబడి కూడా ఎక్కువేనని రైతులు చెబుతున్నారు. ఎకరం సాగుకు కనీసం రెండు లారీల పశువుల ఎరువు అవసరముంటుందని తెలిపారు. ఇందుకు రూ.60వేలు, కలుపు తీతకు కూలీలు, రసాయన ఎరువులకు కలిపి రూ.25 వేలు, పసుపు తవ్వకం, ఉడకబెట్టడం కోసం మరో రూ.30 వేలు.. ఇలా మొత్తంగా ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఖర్చయినట్లు రైతులు చెబుతున్నారు. గతేడాది పలికిన ధరే ఈసారి ఉంటుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పడిపోతున్న ధర గతేడాది క్వింటాల్ పసుపు పంటకు రూ.16వేల నుంచి రూ.17వేల వరకు ధర ఉంది. ఇది రైతులు ఆశించిన ధరే కావడంతో అప్పుడు గిట్టుబాటైంది. ప్రస్తుతం నిజామాబాద్లో క్వింటాల్ పసుపు పంటకు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు మాత్రమే ధర ఉంది. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో సాగు వివరాలుగతేడాది సాగు : 15వేల ఎకరాలు ఈ ఏడాది.. : 5,500 ఎకరాలు ఎకరాకు పెట్టుబడి : రూ.లక్ష–రూ.లక్షన్నర గతేడాది ధర : రూ.16వేలు–రూ.17వేలు ప్రస్తుత ధర : రూ.7వేలు–రూ.10వేలు -
ఉపాధి పనుల్లో నిబంధనలు పాటించాలి
భైంసారూరల్: నిబంధనల మేరకే ఉపాధిహామీ పనులు చేపట్టాలని, కొలతల్లో తేడాలుంటే ఉపేక్షించబోమని డీఆర్డీవో విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం భైంసా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధిహామీ పనులపై 15వ బహిరంగ విచారణ చేపట్టారు. మండలంలోని 30 గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టిన పనులపై చర్చించారు. సామాజిక తనిఖీ బృందాలతో చేయించిన పనులు వివరాలు తెలుసుకున్నారు. కూలీలతో కలిసి సామాజిక తనిఖీ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇంటింటికీ వెళ్లి కూలీలను కలిసి వివరాలు సేకరించారు. గ్రామాల వారీగా సేకరించిన వివరాలను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభ నిర్వహించి వెల్లడించారు. గ్రామపంచాయతీల్లో నాటిన మొక్కలు చనిపోవడం, పని ప్రదేశాల్లో నేమ్బోర్డులు పెట్టకపోవడం, మస్టర్లలో కూలీల సంతకాలు లేకున్నా వేతనాలు చెల్లించడం లాంటి అంశాలను ప్రజావేదికలో డీఆర్పీలు వెల్లడించారు. 2023–24 సంవత్సరంలో రూ.7.50కోట్లతో చేపట్టిన పనుల్లో కొన్ని లోపాలను గుర్తించారు. పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు విధులను నిర్లక్ష్యం చేస్తూ రికార్డులను సరిగా నిర్వహించకపోవడాన్ని బయటపెట్టారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన సిబ్బంది నుంచి రూ.35వేలు రికవరీ, రూ.4వేల జరిమానా విధించారు. రానున్న రోజుల్లో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సమష్టిగా పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్, జేక్యూసీ కృపాకర్, ఎస్సార్పీ రాజు, ఎంపీడీవోలు సుధాకర్రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, ఏపీవో శివలింగం, ఈసీ రాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఎఫ్ఏలున్నారు. -
వైద్యురాలు శృతికి సన్మానం
మంచిర్యాలటౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పు రస్కరించుకొని మంగళవారం పట్టణంలోని వైశ్యభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన మహిళలను మంచిర్యాల వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన బర్త్రూట్ ఆస్పత్రి వైద్యురాలు శృతి గోలిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవీ వనిత క్లబ్ అధ్యక్షురాలు మల్యాల సంగీత, సెక్రటరి కే.గాయత్రి, కోశాధికారి గుండా సునీత, పలువురు మహిళలు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతిభైంసారూరల్: మండలంలోని కోతల్గాం గ్రామానికి చెందిన రైతు పోలబోయిన భోజన్న(62) విద్యుత్ షాక్తో మంగళవారం మృతి చెందినట్లు సీఐ నైలు తెలిపారు. గ్రామానికి చెందిన భోజన్న అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చాడు. ఎప్పటిలాగే మంగళవారం రైతు తన పంటపొలంలోకి వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ఐదుగురు జూదరుల అరెస్టుఆదిలాబాద్టౌన్(జైనథ్): భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. గండ్రత్ సతీష్, అయిండ్ల కిరణ్ కుమార్, కందుల సాయికృష్ణ, జి సతీష్, ఎన్ రాకేష్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ. 43,290 నగదును సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ అనే మరో వ్యక్తి పరారయ్యాడన్నారు. భైంసాలో బైక్ చోరీ భైంసాటౌన్: పట్టణంలో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుస చోరీలు పట్టణ వాసులను కలవరపెడుతున్నాయి. తాజాగా పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో బైక్ చోరీకి గురైంది. సీఐ జీ. గోపినాథ్ కథనం ప్రకారం.. మండలంలోని హంపోలికి చెందిన ఊరే సుభాష్ పట్టణంలో ప్రైవే ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం దుకాణం ఎదుట బైక్ నిలిపి ఉంచాడు. సాయంత్రం కనిపించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఉట్నూర్రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4, 5వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వర్డ్ పవర్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూపీసీ)రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో స్పెల్లింగ్, రీడింగ్, అర్థం రౌండ్ల అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. 4వ తరగతి నుండి ఆడే విజయ్కుమార్ (నిర్మల్), యశ్వంత్ (ఆసిఫాబాద్), రాజేశ్ (ఆసిఫాబాద్), కోట్నాక్ కళ్యాణ్ (ఆసిఫాబాద్), కుర్సెంగ వినోద్ (ఆసిఫాబాద్) విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 5వ తరగతి నుండి కృష్ణ ధృవ (ఆసిఫాబాద్), తొడసం వైష్ణవి(ఆదిలాబాద్), మడావి వరలక్ష్మి (ఆదిలాబాద్), రాథోడ్ బాలాజీ(నిర్మల్), లక్ష్మణ్చౌదరి (నిర్మల్), కిరణ్ రాథోడ్ (ఆసిఫాబాద్) జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. విజేతలకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏసీఎంవో జగన్, విభా ఫౌండేషన్ సీనియర్ ప్రొగ్రాం మేనేజర్ వీరనారాయణ పాల్గొన్నారు. -
భారీగా టేకు చెట్లు నరికివేత
ఇచ్చోడ: సిరిచెల్మ అటవీ ప్రాంతంలోని ఫకీర్పేట్ బీట్లో టేకు చెట్లు స్మగ్లర్ల చేతిలో నరికివేతకు గురవుతున్నాయి. టేకుచెట్లను నరికి సైజులుగా మార్చి బైక్లపై తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మాన్కపూర్ వద్ద చెక్పోస్టు ఉన్నప్పటికీ కలప తరలించుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిరిచెల్మలో టైగర్జోన్ అటవీ అధికారి క్యాంపు కార్యాలయం, ఫకీర్పేట్ వద్ద బెస్ క్యాంపులు ఉన్నాయి. వీటికి సమీపంలోనే టేకుచెట్లు నరికివేతకు గురికావడం అటవీశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై టైగర్జోన్ ఎఫ్ఆర్వో నాగవత్ స్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా టేకు చెట్లు నరికినట్లు తమదృష్టికి వచ్చిందని, చెట్లు నరికిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
నిర్మల్
జోరుగా.. హుషారుగా..గ్యారంటీల అమలులో విఫలం ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం: 6:21గురువారం: 5:108లోu బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025సిక్స్ కొడుతున్న ఉద్యోగిని జిల్లా కేంద్రంలో గత శనివారం నుంచి నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు కొండాపూర్ సమీపంలోని స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ శాఖల మహిళా ఉద్యోగులు జోరుగా, హుషారుగా పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో సత్తా చాటారు. క్రికెట్, టెన్నిస్ మ్యూజికల్ చైర్తోపాటు వివిధ ఇండోర్ ఆటల్లోనూ తమ నైపుణ్యం ప్రదర్శించారు. సాయంత్రం నృత్యం చేశారు. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రత్న కళ్యాణి, డీఎస్డీవో శ్రీకాంత్రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. – నిర్మల్చైన్గేట్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్వాతావరణం ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. తెల్లవారుజాము చల్లగా ఉంటుంది. -
ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు
అంకితభావంతో విధులు నిర్వహించాలి ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: పోలీస్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకీషర్మిల సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నిర్మల్ సబ్ డివిజన్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. 5ఎస్ అమలు చేయాలని తెలిపారు. ఠాణా పరిధిలో ఏ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఉన్న సీడీ ఫైల్స్ను పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైం రేటు తగ్గించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఎస్పీ వెంట నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్సై లింబాద్రి ఉన్నారు. భైంసాటౌన్: నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. పట్టణంలోని జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉష కింద రూ.3.97 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పీఎం ఉష కింద డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు మంజూరయ్యాయని, వీటిలో రూ.3.97 కోట్లతో 12 అదనపు తరగతి గదులు, విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. త్వరలోనే కళాశాలలో పీజీ తరగతులు ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాధర్, తూమోల్ల దత్తాత్రి, సిరం సుష్మారెడ్డి, ఈడబ్ల్యూఐడీ ఈఈ అశోక్కుమార్, డీఈఈ గంగాధర్, కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కడెం: మండలంలో సదర్మాట్ ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు అందక ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఈనెల 5న ‘పంట తడికి..కంటతడి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం మండలంలోని కొత్తమద్దిపడగ శివారులో ఎండిన పొలాలను పరిశీలించారు. యాసంగిలో ఏయో పంటలు సాగు చేస్తున్నారో రైతులను అడిగి తెలుసుకున్నా రు. సాగునీరు అందక ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దని సూచించారు. ఏప్రిల్ చివరి వరకు సదర్మాట్ చివరి ఆయకట్టుకు వరకు సాగు నీరందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఏవో అంజిప్రసాద్, ఈఈ విఠల్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, ఎంపీవో కవిరాజు, రైతులు ఉన్నారు. నిర్మాణం నాణ్యతగా చేపట్టాలి ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఏప్రిల్ చివరి వరకు సాగు నీరందించాలని ఆదేశం -
గ్రూప్–2లో మెరిసిన మనోళ్లు
టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారుసైతం పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరంతా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు.250 ర్యాంక్ సాధించిన అశోక్కుమార్● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ర్యాంకులు191 ర్యాంకు సాయిరాం కౌటాల: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని తలోడి గ్రామానికి చెందిన మండల రాజేశంగౌడ్–తారక్క దంపతుల కుమారుడు సాయిరాంగౌడ్ గ్రూప్–2లో 383 మార్కులతో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించాడు. సాయిరాం ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–4లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ కావడంతో పాటు గ్రూప్–1 మెయిన్స్లో 436 మార్కులు సాధించాడు. 97వ ర్యాంక్ లెక్కల శ్రావణ్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన లెక్కల లింగయ్య, కళావతి దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. 2019లోనే జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్తో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన శ్రావణ్ సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గతేడాది గ్రూప్–4లో జిల్లాస్థాయిలో 11వ ర్యాంక్ సాధించి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో 394 మార్కులతో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–1లోనూ 404 మార్కులు సాధించాడు. మెరిసిన ‘బజార్హత్నూర్’ యువకులు బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బిట్లింగు లక్ష్మణ్, సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్కుమార్ 404 మార్కులతో రాష్ట్రస్థాయిలో 51వర్యాంకు సాధించాడు. ఉదయ్ ప్రస్తుతం ఆదిలాబాద్ ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మండలంలోని కొలారి గ్రామానికి చెందిన బుద్దేవార్ రాధ, నర్శింహులు దంపతుల కుమారుడు బుద్దేవార్ ముఖేష్ గ్రూప్–2 ఫలితాల్లో 418 మార్కులతో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శి, 2021లో నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ అశోక్ కుమార్ గ్రూప్–2లో ఫలితాల్లో 380 మార్కులతో రాష్ట్రస్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం జైనథ్ మండలం సుందరగిరి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 399 మార్కులు సాధించాడు. సోదరుడు శ్రీకాంత్ అందించిన సహకారంతో గ్రూప్–1, 2 పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించినట్లు అశోక్ కుమార్ పేర్కొటున్నాడు.337వ ర్యాంకు సాధించిన వెంకటేశ్ నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన పోలంపల్లి వెంకటేశ్ గ్రూప్–2 ఫలితాల్లో 375 మార్కులతో రాష్ట్రస్థాయిలో 337వ ర్యాంకు సాధించాడు. 2014లో నిర్వహించిన వీఆర్వో పరీక్షలలో ఉమ్మడి జిల్లా టాపర్గా నిలిచాడు. కొంతకాలం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం లక్సెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. సత్తా చాటిన యువకులు నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన యువకులు గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటారు. చీర్ల లక్ష్మయ్య–రమక్క దంపతుల కుమారుడు సురేష్రెడ్డి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించగా మండల మురళిగౌడ్, ఉష దంపతుల కుమారుడు సుమంత్ 172వ ర్యాంకు సాధించాడు. సురేష్రెడ్డి ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూనే గ్రూపు–2లో ర్యాంకు సాధించాడు. సుమంత్ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.19వ ర్యాంక్ శివకృష్ణ ఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: కుమురంభీం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ సత్యనారాయణ, వాణిశ్రీ దంపతుల కుమారుడు శివకృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు, జోన్స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. సత్యనారాయణ స్థానిక సరస్వతి శిశుమందిర్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా శివకృష్ణ అదే పాఠశాలలో చదివి ట్రిపుల్ఐటీలో సీటు సాధించాడు. గతేడాది ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆడిట్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 188వ ర్యాంకు సాయికృష్ణ సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన బట్టు నర్సన్న–సురేఖ దంపతుల కుమారుడు సాయికృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో 188వ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నాడు. నర్సన్న స్థానికంగా బిజినెస్ చేస్తుండగా సురేఖ దేగాం ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్విర్తిస్తున్నారు. చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి ఉన్న సాయికృష్ణ ఇంటర్ హైదరబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో, ఢిల్లీలో బీటెక్ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2లో విజయం సాధించాడు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతోనే విజయం సాధించానని పేర్కొన్నాడు. గ్రూప్–1 ఫలితాల్లో సత్తా నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎర్రవోతు శ్యామల, ముత్తన్న దంపతుల కుమారుడు సాయి ప్రణయ్ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 557 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాడు. సాయి ప్రణయ్ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో, 8 నుంచి 10 వరకు హైదరాబాద్లోని గురుకులంలో, ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజీలో, బీటెక్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేశాడు. గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యాడు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించాడు.గోలేటివాసికి 229వ ర్యాంకు రెబ్బెన: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని గుడ్లబోరికి చెందిన కామ్రే రావూజీ, లహనుబాయి దంపతుల కుమారుడు భాస్కర్ రాష్ట్ర స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా స్టోర్స్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు గ్రూప్–2 కోసం సంసిద్ధమయ్యాడు. ఆన్లైన్లో కోచింగ్, సొంత ప్రిపరేషన్తో గ్రూప్–2 ఫలితాల్లో 381.065 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 229 ర్యాంకు సాధించాడు. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని భాస్కర్ అంటున్నాడు. భాస్కర్శ్రావణ్కుమార్ -
● ‘భగీరథ’ నల్లాలకు ఆన్ఆఫ్లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా కాక.. బోరు నీరే దిక్కు ● నిర్మల్లో రంగుమారిన నీరు సరఫరా
ఈ చిత్రం నిర్మల్ జిల్లాకేంద్రంలోని గొల్లపేటలోనిది. మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇలా రంగు మారిన నీరు వస్తోంది. పట్టణంలో చాలా కాలనీలకు కలుషిత నీరే సరఫరా అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో దుర్వాసన కూడా వస్తోంది. ఈ నీటిని తాగడానికి పట్టణవాసులు భయపడుతున్నారు. ఇతర అవసరాలకు వినియోగించి.. తాగునీటిని కొనుక్కుంటున్నారు. ఈ చిత్రం భైంసా పట్టణంలోని రాహుల్నగర్లోనిది. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు నీరు రాలేదని కాలనీవాసులు తెలిపారు. దీంతో మున్సిపల్ బోరు మోటార్ నీటినే తాగునీటితోపాటు ఇంటి అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. వేసవికి ముందే తాగునీటికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. మరోవైపు పట్టణాల్లో లీకేజీలతో నీరు వృథా అవుతోంది. కొన్ని కాలనీల్లో ప్రజలు నీటిని వృథా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో తాగునీటి పరిస్థితి తెలుసుకునేందుకు ‘సాక్షి’ మంగళవారం విజిట్ చేసింది. ప్రస్తుతానికి పెద్దగా సమస్య లేకపోయినా.. నీటి వృథాతో రాబోయే రోజుల్లో వ్యథ తప్పేలా లేదు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినా, నల్లాలకు ఆన్/ఆఫ్ బిగించకపోవడంతో నీటి సరఫరా సమయంలో వృథాగా వదిలేస్తున్నారు. దీంతో 30 శాతం వరకు నీరు వృథా అవుతోంది. ఇంకా కొన్నిచోట్ల నల్లా కనెక్షన్ ఉన్నా ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. మున్సిపల్ బోర్ల సహాయంతో నీటిని అందిస్తున్నారు. పేదలు బోరు నీటినే తాగుతున్నారు.నిర్మల్లో కలుషిత నీరు.. నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపాలిటీలో నీటి సమస్య పెద్దగా లేకున్నా.. చాలాచోట్ల లీకేజీలు ఉన్నాయి. ఈ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. పలు కాలనీల్లో రంగు మారుతుండటంతో స్థానికులు నీటిని తాగడం లేదు. 42 వార్డులకుగాను 39 వార్డుల్లో ప్రతీరోజు మంచినీటి సరఫరా అవుతోంది. బుధవార్పేట్, గాజుల్పేట్, వైఎస్సార్ కాలనీలో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. మొత్తం 21,800 నల్లా కలెక్షన్లు ఉండగా, 174 మోటర్లు ఉన్నాయి. కార్మికులు 116 మంది అవసరం ఉండగా.. 70 మంది మాత్రమే ఉన్నారు. మాటేగావ్ నుంచి 1.5 మిలియన్ లీటర్లు తక్కువగా సరఫరా అవుతుండడంతో, మూడు వార్డుల్లో సమస్య వస్తోంది. భైంసాలో వృథా.. భైంసాటౌన్:భైంసా పట్టణంలో 26 వార్డులుండగా, 12,900 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు అన్నివార్డుల్లో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు పూర్తిచేశారు. కానీ, ౖపైపెన పైపులు వేయడంతో వాహనాల రాకపోకలతో అవి పగిలిపోయి లీకవుతున్నాయి. నల్లాలకు ఆన్/ఆఫ్ బిగించకపోవడంతో కొందరు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. చాలాచోట్ల ఆన్ఆఫ్ లేక నీరు వృథాగా పోతోంది. కొన్ని కాలనీలకు ఇప్పటికీ భగీరథ నీరు రావడం లేదు. భట్టిగల్లి, భాగ్యనగర్, రాహుల్నగర్, తదితర కాలనీల్లో మున్సిపల్ బోరు నీటినే వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల బోరు మోటార్లు కాలిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, భట్టిగల్లిలో బోరుమోటారు చెడిపోయి కొద్దిరోజులు కావస్తున్నా మరమ్మతు చేయడం లేదని కాలనీవాసులు తెలిపారు. పట్టణంలో 170 కి.మీ మేర నల్లా నీటి పైప్లైన్ ఉండగా, స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద గల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి రోజుకు 12 ఎంఎల్డీల నీటిని సరఫరా చేస్తున్నారు.బోరు నీరే దిక్కు.. మా కాలనీలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు వేశారు. కానీ, ఇప్పటివరకు నీరు సరఫరా చేయడం లేదు. మున్సిపల్ బోరు మోటారు ద్వారానే నీటిని అందిస్తున్నారు. బోరు నీటినే తాగుతున్నాం. – గోదావరి, రాహుల్నగర్, భైంసా భగీరథ రాలేదు.. మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు నీరు సరఫరా కావడం లేదు. కాలనీలోని బోరు మోటారు నీటినే వాడుతున్నాం. తాగడానికి బోరు నీటినే వినియోగిస్తున్నాం. – నేహ, రాహుల్నగర్, భైంసా నీటి కొరత లేకుండా చర్యలు.. పట్టణంలో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిరోజుల ముందు మిషన్ భగీరథ రంగు నీళ్లని టెస్టింగ్ చేయించాం. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా పరిష్కరించాం. కొన్ని చోట్ల విద్యుత్ శాఖ మరమ్మతుల వల్ల పైపులైన్లు పడిపోయాయి. వాటికి కూడా మరమ్మతులు చేయించి సమస్య లేకుండా చూస్తున్నాం. – జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ అందని ‘భగీరథ’.. ఖానాపూర్:ఖానాపూర్ పట్టణంలో ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతూనే ఉంది. ఈసారి మున్సిపల్ అధికారులు ముందస్తుగా ట్యాంకర్తో నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నా.. కొన్ని కాలనీలకు పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. కొన్నిచోట్ల లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతోంది. స్లమ్ ఏరియాలైన సుభాష్ నగర్తోపాటు డబుల్ బెడ్రూం కాలనీల్లో నీటి సమస్య ఉండడంతో ట్యాంకర్తో సరఫరా చేస్తున్నారు. పట్టణంలో 5,300 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అమృత్ పథకం కింద రూ.22 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. -
అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల ్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’ గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం. గురుజలో ఆరు నెలల పిండం కడుపులోనే చంపి.. వాగులో పడేసి.. విచారణ జరుపుతున్న పోలీసులు... -
‘ఎల్ఆర్ఎస్’లో 25 శాతం రాయితీ●
నిర్మల్చైన్గేట్:రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించిందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుల పరిష్కారంపై పంచాయతీ, మున్సిపల్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 31వ తేదీలోపు పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 46 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు, లోకల్ టీవీ ఛానెళ్లలో ప్రచారం చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టాం టాం వేయించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, రాజేశ్కుమార్, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. మాస్ కాపీయింగ్ దూరంగా ఉండాలిసోన్: పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు దూరంగా ఉండాలని, సొంతంగా పరీక్షలు రాయాలని డీఈవో రామారావు సూచించారు. మండలంలోని మాదాపూర్ ఉ న్నత పాఠశాలను మంగళవారం సందర్శించా రు. తొమ్మిది, పది తరగతి విద్యార్థుల గ్రేడ్లపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 9వ తరగతి విద్యార్థుల ఎల్ఈపీ ప్రగతి, నివేదికలను సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులను ఒక్కొక్కరిని పిలిచి వారి ప్రగతి అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎన్ని రోజులు, ఎన్ని గంటలు పాఠశాలకు వ చ్చారని, అందులో ఎన్ని గంటలు పరీక్షలు రా స్తున్నారు విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు. సబ్జెక్టుల వారీగా సిలబస్ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని సూ చించారు. 9, 10 తరగతి విద్యార్థులు సాధించిన మార్కులు గ్రేడ్లను డిస్ప్లే చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 471 మంది గైర్హాజర్ నిర్మల్ రూరల్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్షలకు 471 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 7,343 మంది విద్యార్థులకు 6,872 మంది హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 6,501 మందికి 6,139 మంది హాజరవగా, 362 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 842 మంది విద్యార్థులకు 733 మంది హాజరవగా, 109 మంది గైర్హాజర్ అయ్యారని డీఐఈవో పరశురాం తెలిపారు. -
‘సైబర్’ కుట్ర భగ్నం
ఆదిలాబాద్టౌన్: సైబర్ నేరాలకు పాల్పడాలనే భా రీ కుట్రను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భగ్నం చే శారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను టూటౌన్, సై బర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మొ బైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒకరు పరారీలో ఉండగా, ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మ హాజన్ మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హె డ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రంలోని కాతిహర్ జిల్లా హతియదిర గ్రామానికి చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా సై బర్ నేరాలకు పాల్పడడానికి కుట్ర పన్నినట్లు తెలి పారు. ఇందులో ఏ–1గా ఉన్న తబారక్ మిగతా ఐదు గురిని బైక్లపై తెలంగాణ రాష్ట్రానికి పంపించాడు. వారు పాత మొబైళ్లు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామంటూ పట్టణాలు, పల్లెల్లో తిరిగారు. పా త మొబైళ్లు సిమ్కార్డు, బ్యాటరీలను సేకరించారు. వాటిద్వారా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు బ్యాంక్ అధికారులంటూ ఫోన్ చేసి సైబర్ బారిన పడే వి ధంగా కుట్ర పన్నారు. వారి కుట్రను ఆదిలాబాద్ పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు మహ్మద్ మెరాజుల్, మహెబూబ్ ఆలం, మహ్మద్ జమాల్, ఎండీ ఉజీర్, అబ్దుల్లాను అరెస్టు చేయగా ఏ–1 నిందితుడు తబారక్ పరారీలో ఉన్న ట్లు తెలిపారు. అరెస్టయిన వారి వద్ద నుంచి 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలతో పాటు వారు వినియోగించే మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాఽ దీనం చేసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుట్ర భగ్నం చేసిన సై బర్ డీఎస్పీ హసీబుల్లా, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ కరుణాకర్రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ను ఎస్పీ అభినందించారు. ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై కేసు పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు 2,125 పాత మొబైళ్లు, 107 సిమ్ కార్డులు, 600 మొబైల్ బ్యాటరీలు, 5 వాహనాలు సీజ్ వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ -
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
● రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఈఈ ● బిల్లుల మంజూరు కోసం రూ.లక్ష డిమాండ్ ఆదిలాబాద్రూరల్: ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. ఆదిలాబాద్లోని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నాంవార్ శంకర్ కాంట్రాక్టర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. టీజీఐడీసీ డిప్యూటీ ఈఈ శంకర్ ఇటీవల కాంట్రాక్టర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కేఆర్కే కాలనీ సమీపంలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పనుల కాంట్రాక్ట్ను కరుణాకర్రావు దక్కించుకున్నాడు. రూ.14.36 కోట్లతో జిల్లా కేంద్రానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ నారాయణరెడ్డి తీసుకుని పనులు చేపడుతున్నాడు. విడతల వారీగా పూర్తయిన పనులకు సంబంధించి రూ.2 కోట్లు విడుదలయ్యాయి. మంజూరైన ఈ బిల్లులను డీఈఈ శంకర్ మరో భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్కు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. విష యం తెలుసుకున్న నారాయణరెడ్డి మంగళవారం డిప్యూటీ ఈఈని కార్యాలయంలో కలిశాడు. తాను చేసిన పనులకు గాను మంజూరైన డబ్బులు విడుదల చేయాలని కోరాడు. 0.5 శాతం ఇవ్వాలని సదరు అధికారి సూచించాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఆ సమయ ంలోనే అధికారి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. తాను నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రావాలని పేర్కొన్నాడు. మంగళవారం రూ.50వేలు, మిగతా రూ. 50వేలు బుధవారం ఇవ్వాలని కాంట్రాక్టర్తో సదరు అధికారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. బిల్లులు విడుదలైన ప్రతీసారి కమీషన్ ఇవ్వాలని పేర్కొన్నాడు. మధ్యాహ్నం సదరు అధికారి నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రాగా కాంట్రాక్టర్ ఆయనకు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ అధికారిని కరీంనగర్కు తరలించారు. బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్, సీఐలు కిరణ్రెడ్డి, స్వామి ఉన్నారు. -
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నిర్మల్చైన్గేట్: మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిబిరంలో మహిళల సాధారణ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్స అందించనున్నట్లు తెలిపారు. అనంతరం వైద్యులు కలెక్టర్కు బీపీ, రక్త పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి నిర్మల్చైన్గేట్: మహిళలు క్రీడా పోటీలలో పాల్గొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ మహిళ తన సామర్థ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించాలన్నారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు క్రీడలు మేలుచేస్తాయన్నారు. అనంతరం మహిళలతో కలిసి చెస్, క్యారం, టెన్నిస్ ఆడారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి రమణ, తదితరులు పాల్గొన్నారు. బాలశక్తితో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిర్మల్చైన్గేట్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బాలశక్తి కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన స్మార్ట్ విజన్ కంటి ఆస్పత్రి వైద్యులు హర్షవర్ధన్రెడ్డి అందించిన వాహనాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో పీ.రామారావు, డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, డీఆర్డీవో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ -
తులం బంగారం హామీ ఎక్కడ?
● బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డినిర్మల్చైన్గేట్/దిలావర్పూర్/నర్సాపూర్(జి)/సారంగాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెళ్లయిన ఆడబిడ్డలకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీ ఎక్కడా అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, నిర్మల్ రూరల్, దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సారంగాపూర్ మండల కేంద్రంలో ధని నుంచి ఆలూరు వరకు బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 420 హామీలను తుంగలో తొక్కారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకల్యాణి, మండల అధికారులు, జిల్లా బీజేపీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఆయిల్పామ్’ అడ్డుకుంటున్న ఎమ్మెల్యే
నిర్మల్టౌన్: ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభం కాకుండా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అడ్డుకుంటున్నాడని మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం ఆయిల్పామ్ రైతులతో కలిసి ‘రైతుధర్నా’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి పాక్పట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన ఆయిల్పామ్ పరిశ్రమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలోని 1600 మంది రైతులు 8,488 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ తోటలు సాగు చేశారని, పంటను విక్రయించేందుకు సోన్ మండలంలోని పాకుపట్లలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఈ ఏడాది ఆఖరి వరకు పంట చేతికి వస్తుందని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. అన్నిశాఖల నుంచి అనుమతులు వచ్చినా తనకున్న పలుకుబడితో నీటి పారుదల శాఖ క్లియరెన్స్ ఇవ్వకుండా అధికారిపై ఒత్తిడి తీసుకువచ్చి, ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా చేస్తున్నారన్నారు. నిర్మల్ ప్రాంత అభివృద్ధికి తాను నిధులు తీసుకువస్తే వాటితో చేపట్టే పనుల్లో పర్సంటేజీలు కావాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులు అడ్డుకుంటున్నారన్నారు. జిల్లాలో రూ.27 కోట్లతో నాలుగు చెక్డ్యామ్లు మంజూరయ్యాయని, టెండర్లు పూర్తయినా తనకు పర్సంటేజ్ ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలని ఒత్తిడి తేవడంతో ఆగిపోయాయన్నారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్కు, ఆర్డీవో కార్యాలయంలోనూ రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అరుగుమీది రామయ్య, నాయకులు పాకాల రాంచందర్, అనుముల భాస్కర్, మురళీధర్రెడ్డి, ముడుసు సత్యనారాయణ, శ్రీధర్, వొస రా జేశ్వర్, పూదరి సాయికృష్ణ, రైతులు పాల్గొన్నారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కేంద్రంలో రైతు ధర్నా -
ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, భూ సంబంధిత, అటవీ, వ్యవసాయం, డబుల్బెడ్ రూమ్, పెన్షన్, రేషన్ కార్డులు వంటి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విధుల్లోకి తీసుకోవాలి నేను 16 సంవత్సరాలపాటు ఎన్ఆర్ఈజీఎస్లో ఎఫ్ఏగా విధులు నిర్వర్తించా. ఏడాదిక్రితం నుంచి అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేక పోయా. ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుట పడింది. కావున నాయందు దయతలచి తిరిగి విధుల్లోకి అనుమతించి నా కుటుంబాన్ని ఆదుకోగలరు. – రాచర్ల రాజేశ్వర్, న్యూబొప్పారం రిజర్వేషన్ మార్చాలి మేము సారంగాపూర్ మండలం ఇప్పచెల్మ గ్రామస్తులం. మా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇట్టి పోస్ట్ కోసం గ్రామస్తులం అంతాకలిసి అధికారులను సంప్రదించగా ఇది ఎస్సీకి కేటాయించినట్టు తెలిసింది. కానీ మా గ్రామంలో ఎస్సీ కులస్తులు లేరు. కావున ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయించాలి. – గూడెం నాగోరావు, ఇప్పచెల్మ గ్రామస్తుడు -
‘టోల్ప్లాజా కార్మికులను కొనసాగించాలి’
సోన్: టోల్ప్లాజా కార్మికులందర్నీ కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. సోమవారం ఫెర్వేజ్ కంపెనీ టోల్ మేనేజర్ సంతోష్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిప్పర్వాడ, నేరడిగొండ, గంజాల్ టోల్ప్లాజా కార్మికులు 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారన్నారు. పాత కంపెనీ రిద్ది సిద్ది ఒక్కో కార్మికుడికి రూ.24వేల నుంచి రూ.29 వేల వేతనం చెల్లించేదన్నారు. పాత జీతాన్ని కొనసాగించాలని, కొత్తవారిని తీసుకోవద్దని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో ఎం.రమేశ్, సందుగారి నవీన్, గంగాధర్, రాజేశ్వర్, శ్రావణ్ రాజకుమార్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. -
మూడునెలల్లో పనులు ప్రారంభించాలి
● బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి నిర్మల్: ఆయిల్పామ్ ఫ్యాక్టరీ విషయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మతిభ్రమించి మాట్లాడటం సరికాదని, తాను ఏపార్టీలో ఉండి మాట్లాడుతున్నారో తెలుసా.. అని బీజేఎల్పీనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఇటీవల మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆదివారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో ఆయిల్పామ్ కంపెనీకి 40ఎకరాల ప్రభుత్వ భూమిని సొంత పార్టీకి చెందిన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కు ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఇచ్చినపుడు, నిర్మల్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఫ్యాక్టరీ కోసం సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దగ్గర ధర్నా చేయాలన్నారు. మూడునెలల్లో జిల్లాలో ఫ్యాక్టరీ పనులు ప్రారంభించకపోతే తామే భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మె రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, నాయకులు ముత్యంరెడ్డి, భూపాల్ రెడ్డి, సాదం అరవింద్, భూపతిరెడ్డి, వొడిసేల అర్జున్, తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల హామీతో ఆమరణ దీక్ష విరమణ
భైంసాటౌన్: పట్టణం నుంచి మండలంలోని ఖత్గాం–కామోల్ వరకు రోడ్డు నిర్మించాలంటూ గ్రామ మాజీ సర్పంచ్ దెగ్లూర్ రాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం సా యంత్రం విరమించారు. రెండోరోజు దీక్షకు మద్దతుగా భైంసా ఏఎంసీ మాజీ చైర్మన్ పిప్పె ర కృష్ణ, డైరెక్టర్ తోట రాముతో పాటు పలు వురు పాల్గొన్నారు. సాయంత్రం పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, భైంసా డీఈఈ రాజేందర్ దీక్ష విరమించాలని కోరారు. భైంసాలోని హైవే నుంచి ఖత్గాం వరకు రూ.99 లక్షలతో రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, నిధుల లేమితో పనులు నిలిచాయన్నారు. ఏప్రిల్ మొదటివారంలో పనులు చేపట్టేలా చూస్తానని ఈఈ హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు దీక్ష విరమించారు. -
సామర్థ్యాల సాధన ఎంత?
నిర్మల్ఖిల్లా: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యార్థులు సైతం చదువులో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ కార్యక్రమాలు అమలు పరుస్తోంది. ఇందులో భాగంగానే రెండేళ్లుగా ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో నిర్వహించిన మదింపు పరీక్షల్లో జిల్లాలోని ప్రాథమిక స్థాయి విద్యార్థులు సామర్థ్యాలలో వెనుకంజలో ఉన్నట్లు ఫలితాల నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో తాజాగా ఆ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు ఏ మేరకు చేరువయ్యారనే అంశంపై అంచనా వేసేందుకు విద్యాశాఖ నేటి నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతీ పాఠశాలలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు స్వీయ పఠనం, రాయడం, గణితంలోని చతుర్విధ ప్రక్రియలు సాధించేలా రెండేళ్లుగా వివిధ కార్యక్రమాల ద్వారా కృత్యాధార బోధన చేపడుతూ బోధన కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ అంశాల్లో విద్యార్థుల అభ్యసనం కొనసాగుతున్న విధానాన్ని గుర్తించేందుకు ఆయా పాఠశాలల్లో రెండోతరగతి చదువుతున్న విద్యార్థులను పరీక్షించేందుకు సామర్ధ్య ఆధారిత సర్వే చేపట్టనుంది. నేటి నుంచి సర్వే... జిల్లాలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ పాఠశాలల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గణించేందుకు సర్వే చేపడుతోంది. జిల్లాలోని మొత్తం 19 మండలాల పరిధిలోని 50 వివిధ ప్రాథమిక పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ సర్వే కోసం ఇప్పటికే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను ఎంపిక చేసి శిక్షణ అందించింది. వీరు ఆయా పాఠశాలల్లో రెండోతరగతి చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు సర్వే పరీక్షలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో రెండో తరగతి విద్యార్థులంతా వందశాతం హాజరయ్యేలా, సర్వే సజావుగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల జిల్లాస్థాయి విద్యాశాఖ అధికారులు సమన్వయం చేయనున్నారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో సర్వే పూర్తి చేయనున్నారు. సర్వే సమయంలో ఆయా పాఠశాలలను సందర్శించి భాషా సామర్థ్యాలు, చతుర్విధ ప్రక్రియలపై సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ అంశాలపై ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లకు జిల్లా స్థాయిలో శిక్షణ పూర్తి చేశారు. తెలుగు, ఆంగ్లంలో చదవడం రాయడంతో పాటు గణితంలోని చతుర్విధ ప్రక్రియలపై ఈ సర్వేలో ప్రశ్నలుంటాయి. ఈ సర్వే ద్వారా సేకరించిన అంశాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. సజావుగా సర్వే నిర్వహణకు ఆదేశాలు ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండోతరగతి విద్యార్థులు పూర్తిస్థాయిలో సర్వే పరీక్షలకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల హెచ్ఎంలపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సర్వే నిర్వాహణకు సంబంధించి ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలకు డీఈవో పి.రామారావు ఆదేశాలు జారీ చేశారు. కాంప్లెక్స్ హెచ్ఎంలు తమ పరిధిలోని పరీక్షలు నిర్వహించే పాఠశాలలను సందర్శించి సర్వే సజావుగా కొనసాగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్ఎల్ఎన్పై శాంపిల్ సర్వే రెండోతరగతి విద్యార్థుల సామర్థ్యాల మదింపు నేటి నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక పరీక్షలు వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు -
కంచె.. కాటేస్తోంది..!
విద్యుత్ కంచెలతో జరిగిన కొన్ని ప్రమాదాలు..2024లో.. మృతి చెందిన రైతులు 21 మృతి చెందిన మూగజీవాలు 652025లో.. మృతి చెందిన రైతులు 13 మృతి చెందిన మూగజీవాలు 76● ఇటీవల ఉమ్రి(కే) గ్రామానికి చెందిన కదం దత్తురాం సమీపంలోని వ్యవసాయ మోటారు నుంచి నీరు తెచ్చే క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ● సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన రైతు బోర నర్సయ్య ఇటీవల ఎర్త్వైర్కు ఏర్పాటు చేసిన బల్పు తీసే క్రమంలో షాక్కు గురై మృతి చెందాడు. ● రెండేళ్ల క్రితం బాసర మండలం కిర్గుల్(కె) గ్రామానికి చెందిన రాజలింగం, నర్సాపూర్(జి) మండలం గొల్లామాడ గ్రామానికి చెందిన నిమ్మన్న అనే రైతులు పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. ● ముధోల్ మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు లక్ష్మణ్ రెండేళ్ల క్రితం మొక్కజొన్న పంటకు నీరుపెట్టేందుకు వెళ్లి విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. ● మూడేళ్ల క్రితం తానూరు మండలం భోసి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు కర్జల రాములు, మురళి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి పొలంలోనే మృతి చెందారు. ● మూడేళ్ల క్రితం తానూరు మండలం హిప్నెల్లి తండాకు చెందిన జాదవ్ రాము, హిప్నెల్లి గ్రామానికి చెందిన విఠల్ పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందారు. ● సారంగాపూర్ మండలం ధని గ్రామంలో నిర్మల్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ అంగ నరేశ్ పేకాడుతుండగా పోలీసులు దాడిచేశారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో పంటకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తాకడంతో షాక్తో మృతిచెందాడు. ● తానూర్ మండలంలోని మహలింగికి చెందిన రైతు తురాఠి గంగాధర్ ఈనెల 9న పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తీగలకు తగిలి మృతి చెందాడు. ● పంటల రక్షణకు అక్రమంగా ఏర్పాటు ● ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు ● చోద్యం చూస్తున్న అధికారులుతానూరు : జిల్లాలో ఎక్కువ మంది వ్యసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వరి, సోయా, కంది, మొక్కజొన్న, కూరగాయలు, తదితర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలోని చాలా గ్రామాలు అడవిని ఆనుకుని ఉన్నాయి. దీంతో వన్యప్రాణులు రైతుల వ్యవసాయ క్షేత్రాలపై తరచూ దాడిచేస్తున్నాయి. పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అడవి పందుల బెడద అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు పంటల రక్షణకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే విద్యుత్ కంచెల ఏర్పాటు చట్ట విరుద్ధం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం నేరం. దీంతో కంచెలు ఏర్పాటు చేసిన రైతులు ఈ విషయం ఎవరికీ చెప్పడం లేదు. దీంతో ఈ కంచెలే వన్యప్రాణులతోపాటు, రైతుల ప్రాణాలను బలి గొంటున్నాయి. వ్యవసాయానికి 24 గంటల విద్యు త్ సరఫరా చేస్తుండడంతో పొలాలకు వెళ్లిన వారు కంచెను గమనించకుండా దానికి తాకుతున్నారు. షాక్కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్డు పక్కనే ఉన్న పంటలకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తుండడంతో వాహనదారులు, రోడ్డు వెంట వెళ్లేవారు గమనించకుండా ప్రమాదాలబారిన పడుతున్నారు. విద్యుత్ చౌర్యంతో కంచెలు ఏర్పాటు చేయడం, వన్యప్రాణాల మృతికి విద్యుత్ కంచెలు కారణమవుతున్నా.. ఇటు విద్యుత్ అధికారులు, అటు అటవీశాఖ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు, రైతు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. వన్యప్రాణుల మృత్యువాత.. విద్యుత్ కంచెలకు తగిలి వన్యప్రాణులు సైతం మృత్యువాత పడుతున్నాయి. జింకలు, దుప్పులు, అడవి పందులు విద్యుత్ షాక్తో చనిపోతున్నాయి. అయినా వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఏడాదిన్నర వ్యవధిలోనే ... విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం.. 2024లో మొత్తం 21 మంది రైతులు, 65 మూగ జీవాలు విద్యుత్ షాక్తో మృతి చెందాయి. 2025 మార్చి వరకు 13 మంది రైతులు, 76 మూగజీవాలు మృతి చెందాయి. ఇందులో అధికంగా పంటలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెల కారణంగా మరణించినట్లు తెలిపారు. రైతులకు అవగాహన కల్పించాలి కొంతమంది రైతులు పంట రక్షణ కోసం అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడంతో రైతులు, మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. తరచూ విద్యుత్ సమస్య కూడా తలెత్తుతోంది. సోలార్ కంచె ఏర్పాటు చేసుకుంటే ప్రమాదాలు జరగవు. అధికారులు గ్రామాల్లో రైతులకు విద్యుత్ కంచెతో కలిగే అనర్థాలు, సోలార్ కంచె ఏర్పాటుపై అవగాహన కల్పించాలి. – మహేశ్, యువరైతు, ఎల్వి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం రైతులు పంటల రక్షణకు అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. పంట రక్షణ కోసం సోలార్ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై గ్రామాల్లో విద్యుత్ అధికారులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. సోలార్ కంచెలతో వన్య ప్రాణులతోపాటు, రైతులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగదు. – సుదర్శన్, విద్యుత్ ఎస్ఈ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు .. విద్యుత్ మోటర్ ఆన్ఆఫ్ చేసే క్రమంలో రైతులు బోర్డు వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో విద్యుత్ బల్బులు వెలిగించేందుకు ఏర్పాటు చేసిన ఎర్త్ వైర్కు దూరంగా ఉండాలి . పంటల రక్షణ కోసం రైతులు వేసిన కంచెకు ఉదయం విద్యుత్ సరఫరా కాకుండా చూడాలి. -
‘చాంపియన్స్’ గెలుపుతో సంబురాలు
నిర్మల్: తీవ్ర ఉత్కంఠతో కూడిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై గెలిచి, చాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని కై వసం చేసుకుంది. దీంతో జిల్లావాసుల సంబురాలు అంబరాన్నంటాయి. క్రికెట్ అభిమానులు టీవీల ముందే కూర్చుని మ్యాచ్ ఆద్యంతం వీక్షించారు. విజయానికి మరో రెండు పరుగుల అవసరం కాగా రవీంద్ర జడేజా ఫోర్ కొట్టగానే జిల్లాలో దీపావళిని తలపించేలా పటాకులు కాల్చారు. క్రికెట్ అభిమానులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో మ్యాచ్ చూస్తున్న అభిమానులు -
‘బాలింత కుటుంబాన్ని ఆదుకోవాలి’
కడెం: రక్తహీనతతో ఈ నెల 8న మృతి చెందిన మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన బాలింత శ్రీవిద్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు అన్నారు. ఆదివారం వేదిక నిజ నిర్ధారణ కమిటీ బృందంతో కలిసి ఇస్లాంపూర్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతురాలిని 7, 8, 9 నెలల్లో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించలేదని, చివరిగా ప్రసూతి కోసం ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా రక్తహీనత ఉందని నాలుగు బాటిళ్ల రక్తం ఎక్కించి ప్రసవం చేశారన్నారు. అనంతరం గుండె సంబంధిత వ్యాధి ఉందని, హైదరాబాద్కు తీసుకెళ్లాలని చెప్పగా తమవద్ద ఆర్థిక స్థోమతలేదని, ఆమె ఆరోగ్యంగా ఉండడంతో ఇంటివద్దే ఉంచామని ఆమె భర్త భగవంతరావు తెలిపారు. మృతురాలి కూతురు ఆలనపాలన కోసం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి, ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వేదిక ప్రధాన కార్యదర్శి రఘోత్తమ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమృతరావు, కమిటీ సభ్యులు మేడ మురళీధర్, ప్రకాష్, తదితరులు ఉన్నారు. -
‘అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదు’
ఖానాపూర్: నిరుపేదల గుడిసెను అటవీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడం సరికాదని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని రంగపేట పంచాయతీ పరిధి కొత్తగూడెంలో అధికారులు కూల్చివేసిన గుడిసెను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 2004 నుంచి భూపోరాటం ద్వారా సాధించుకున్న 70 ఇళ్లలో గ్రామపంచాయతీలో పన్నులు చెల్లించి జీవనం సాగిస్తున్న కుటుంబ సభ్యులకు నిలువ నీడ లేకుండా అధికారులు వ్యవహరించిన తీరును తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఇదే ఇల్లుపై ఇందిరమ్మ ఇల్లు సైతం నిర్మించుకొని సగానికిపైగా బిల్లుసైతం పొందారన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం లింగన్న, గోనె స్వామి, గోగు శేఖర్, వేగుల గంగన్న, రాములు, భీంరావు, శంకరయ్య, భూమక్క, చంద్రకళ, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్
ఎమ్మెల్సీ దక్కేనా..! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఆసక్తిగా మారింది. ఒకటి ఎస్టీకి కేటాయిస్తామని ప్రచారం జరుగుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటారు. చెట్లను పెంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏటా వానాకాలం ప్రారంభంలో భారీగా మొక్కలు నాటుతున్నారు. ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో భారీగా పెరిగిన వృక్షాలను కొందరు నరికివేస్తున్నారు. చెట్లను కోతకు అమ్ముకుంటున్నారు. దీంతో చెట్లు నరికే దందా చేసేవారు అనుమతి లేకుండానే భారీ వృక్షాలను రంపాలతో కోసి.. కలపను తరలించుకుపోతున్నారు. దీంతో పచ్చని చెట్టే... కట్టై.. ఇటుక బట్టీల్లో కాలి బూడిదవుతోంది. న్యూస్రీల్ -
రోడ్డు కోసం నిరాహార దీక్ష
భైంసాటౌన్: తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని మండలంలోని ఖత్గాం గ్రామస్తులు శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని ఖత్గాం ప్రవేశమార్గం వద్ద నిరాహార దీక్ష శిబిరం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణం నుంచి తమ గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేదని తెలిపారు. రాకపోకలకు గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. భైంసా నుంచి ఖత్గాంకు, కామోల్కు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. దీక్షలో మాజీ సర్పంచ్ దెగ్లూర్ రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎదగని బాల్యం!
● వయసుకు తగిన బరువు, ఎత్తు లేని చిన్నారులు.. ● జిల్లా వ్యాప్తంగా 791 మంది గుర్తింపు ● 176 మంది పిల్లల్లో పోషకాహార లోపంలోకేశ్వరం: ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరం. ఎదిగే పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే సమతుల ఆహారం అందించాలి. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం, మ ధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. అయినా పిల్లలు ఇంకా బలహీనంగానే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 791 మంది ఎత్తుకు దగ్గ బరువు, వయసుకు తగిన ఎత్తు లేరని, 176 మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. జిల్లా వివరాలు.. జిల్లా వ్యాప్తంగా 926 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 27,473 మంది, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 25,187 మంది ఉన్నారు. వీరిలో 967 మంది చిన్నారులు ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, మరికొందరు వయసుకు తగిన ఎత్తు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 4,765 మంది గర్భిణులు ఉండగా, బాలింతలు 5,051 మంది ఉన్నారు. వీరి ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవడంతోపాటు పుట్టిన శిశువు ఆరేళ్ల వయసు వచ్చే వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాయి. అయినా వందల మంది చిన్నారులు పోషకాహారం లోపంతో బాధపడుతుండడం ఆందోళన కలిగించే అంశం. వేధిస్తున్న సిబ్బంది కొరత .. పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య కల్పతరువు అంగన్వాడీ కేంద్రాలు. అయితే ఈ కేంద్రాల్లోనే అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కో సెంటర్కు ఒక టీచర్, ఒక ఆయా తప్పనిసరిగా ఉండాలి. జిల్లావ్యాప్తంగా 926 కేంద్రాలకు 833 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయాలు 541 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 385 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముధోల్, భైంసా సీడీపీవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. చిన్నపిల్లలు కేంద్రాలకు రాకుంటే ఆయా ఇళ్లకు వెళ్లి కేంద్రానికి తీసుకురావాలి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం వంట చేసి పెట్టాలి. టీచర్ ఆట వస్తువులతో పిల్లలను ఆడిస్తూ పూర్వ ప్రాథమిక విద్యను బోధించాల్సి ఉంటుంది. సిబ్బంది కొరతతో లబ్ధిదారులకు పోషకాలతో కూడిన ఆహారం అందడం లేదు. అక్షరాలకు శ్రీకారం చుట్టే అంగన్వాడీ కేంద్రాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకు గదులు, గాలి, వెలుతురు సరిగా లేకుండా, రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో కొనసాగుతున్నాయి. జిల్లా 926 కేంద్రాలకు ఉండగా వీటిలో పక్కగా భవనాలు కేవలం 194 ఉన్నాయి. 363 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 369 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక దృష్టి సారించాం పోషకాహార లోపం, ఇతర సమస్యలతో ఎదగని చి న్నారుల కోసం ప్రత్యేక మెనూ కొనసాగిస్తున్నాం. నిబంధనల ప్రకారం 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలకు నెలకు 16 గుడ్లు మాత్రమే ఇస్తాం. కానీ ఎత్తుకు తగిన బరువు, వయసుకు తగిన ఎత్తు పెరగని చిన్నారుల కోసం ప్రతీరోజు గుడ్డు, బాలామృతం ప్లస్తోపాటు భోజనం అందిస్తాం. పది రోజుల కోసారి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయిస్తున్నాం. ఆందోళనకరంగా ఉన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. – ఫైజాన్ అహ్మద్, అదనపు కలెక్టర్ నిర్మల్ప్రాజెక్టుల వారీగా పిల్లలు, అంగన్వాడీ ఖాళీల వివరాలు... ప్రాజెక్టులు 6 నెలల నుంచి బరువు తక్కువ పోషకాహార లోపం అంగన్వాడీ ఆయా 6 ఏళ్ల పిల్లలు ఉన్న పిల్లలు ఉన్న పిల్లలు టీచర్ ఖాళీలు ఖాళీలు నిర్మల్ 21,152 318 46 36 140 భైంసా 11,764 152 34 27 67 ఖానాపూర్ 11,350 221 75 14 104 ముధోల్ 9,361 100 21 16 74 మొత్తం 53,627 791 176 93 385 -
విద్యాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
నిర్మల్రూరల్: విద్యాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని డీఈవో రామారావు అన్నారు. అంతర్జాతీ య మహిళా దినోత్సవం సందర్భంగా స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా శాఖ భవనంలో శనివారం వేడుకలు నిర్వహించారు. డీఈవో హాజరై మాట్లాడారు. తల్లిగా, చెల్లిగా, ఆలిగా, చైతన్య వంతురాలైన ఉపాధ్యాయురాలుగా మహిళలు ఎన్నో పాత్రలు పోషిస్తూ సమాజాభివృద్ధిలో, విద్యాభివృద్ధిలో కీలకంగా మారారన్నారు. మహిళలు సహనంతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంలో ముందుంటారని తెలిపారు. పదో తరగతి పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా రాసే విధంగా సూచనలు ఇవ్వాలన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు డీ ఈవో జ్ఞాపికలు అందించి సత్కరించారు. వేడుకల్లో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్, ప్ర ధాన కార్యదర్శి జె.లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్, వెంకటేశ్వరరావు, లక్ష్మీనారా యణ, తాళ్ల రవి, శ్రీదేవి, మీనాకుమారి, సుజాత, హేమలత, సౌజన్య, నీరజరాణి పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి హాజరైన మహిళా ఉపాధ్యాయులు -
లోక్ అదాలత్లతో సత్వర న్యాయం
నిర్మల్టౌన్: లోక్ అదాలత్లతో కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని, సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో జాతీయ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణకుమార్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. లోక్ అదాలత్లో సివిల్ కేసులు 06, ఫ్రీ లిటిగేషన్, బ్యాంకు సంబంధించిన కేసులు 96, క్రిమినల్ కేసులు 1,085, సైబర్ క్రైమ్ 1,220 కేసులు పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్జీలు రాధిక, శ్రీనివాస్, భవిష్య, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
బట్టీల్లో కాలుతున్న చెట్లు
● జిల్లాలో జోరుగా కలప దందా ● ఇష్టారీతిన వృక్షాల నరికివేత ● ఇటుక బట్టీలు, ఇతర జిల్లాలకు తరలింపు భైంసాటౌన్: భైంసా అటవీ రేంజ్ పరిధిలో కలప దందా జోరుగా సాగుతోంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతుల పేరిట నామమాత్ర అనుమతులతో ఇష్టారీతిన చెట్లు నరికి తరలిస్తున్నారు. ఒకటి, రెండు వాహనాలకు మాత్రమే అనుమతి పొంది, ప్రతీరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో నాన్టేక్ కలపను స్థానిక ఇటుక బట్టీలతోపాటు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు సైతం తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సామిల్లులకు కూడా తరలించుకుపోతున్నారు. ఫలితంగా రేంజ్ పరిధిలో ఇష్టారీతిన చెట్లు నరికివేస్తున్నారు. పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. భైంసా కేంద్రంగా... కొందరు నాన్టేక్ దందా నిర్వహకులు భైంసాతోపాటు నియోజకవర్గంలోని కుభీర్, తానూరు, ముధోల్ తదితర మండలాల్లోని గ్రామాల్లో చెట్లను నరికి ట్రాక్టర్లలో పట్టణ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇలా తరలించిన కలపను ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. కొన్నింటిని ఇటుక బట్టీలకు, సామిల్లులకు తరలిస్తునానరు. పెద్ద మొత్తంలో పోగు చేసిన కలపను ఇతర ప్రాంతాలకూ తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారుల వద్ద నామమాత్ర అనుమతులు తీసుకుంటూ, పెద్ద సంఖ్యలో చెట్లను నరికి తరలిస్తున్నారు. భైంసా–నిర్మల్, కుభీర్, భోకర్, బాసర మార్గాల్లో నిత్యం రాత్రివేళల్లో ట్రాక్టర్లలో జోరుగా నాన్టేక్ కలప తరలుతోంది. అధికారులు పట్టుకున్న సందర్భాల్లో ట్రాక్టర్ ఇంజిన్ చెడిపోయిందని, ట్రాలీ వేరేది అమర్చినట్లు చెబుతూ తప్పించుకుంటున్నారు. అటవీశాఖలోని కొందరు కిందిస్థాయి సిబ్బంది సహకారంతోనే అక్రమదందా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటున్నాం.. అనుమతి లేకుండా చెట్లు నరికితే చర్యలు తీసుకుంటాం. ఇటుక బట్టీల్లో కట్టెలు వినియోగించినట్లు దృష్టికి వస్తే జరిమానా విధిస్తున్నాం. నాన్టీక్, టీక్ అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. – వేణుగోపాల్, ఎఫ్ఆర్వో, భైంసాఇటుక బట్టీల్లో వినియోగం.. డివిజన్ పరిధిలోని పలు ఇటుక బట్టీల్లో కట్టెలు వినియోగిస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు దాడి చేసి కట్టెలు వినియోగిస్తున్న ఇటుక బట్టీల నిర్వహకులకు జరిమానా విధించారు. అయినా, మళ్లీ కొందరు యథేచ్ఛగా కట్టెలు వినియోగిస్తున్నారు. ఫలితంగా బట్టీల్లో నుంచి వచ్చే పొగతో రోడ్లపై వాహనదారులు, బట్టీల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
ఈఎస్ఐ ధీమా!
● ఆదిలాబాద్, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబాటులోకి వస్తే వైద్యం ● కార్మిక కుటుంబాలకు ఉచితంగా సేవలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు వైద్యం చేరువ చేసేందుకు ఈఎస్ఐ(కార్మిక రాజ్య బీమా సంస్థ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో రెండు డిస్పెన్సరీల ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తుండగా ఇందులో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మల్ పట్టణం శాంతినగర్లో, మంచిర్యాల పట్టణం ఏసీసీ కాలనీలో ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఉంది. నిర్మల్లో బీడీ కార్మికులకు ప్రత్యేకంగా మరొకటి ఉంది. ఉమ్మడి జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు, మట్టి, స్పిన్నింగ్, పేపర్ మిల్లు తదితర కార్మిక వర్గాలు ఎక్కువగా ఉన్న చోట్ల ఈఎస్ఐ ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటయ్యాయి. ఈ డిస్పెన్సరీ, ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలతో అరకొర వైద్యమే అందుతోంది. అంతేగాక సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే అసౌకర్యాల మధ్య సేవలందిస్తున్నాయి. ఇటీవల మంచిర్యాల కలెక్టరేట్ సమీపంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్మాణం కోసం భూమి కేటాయించారు. కొత్తగా ఆదిలాబాద్ పట్టణం, మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఆవరణలో కొత్త డిస్పెన్సరీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో సేవలు మెరుగవుతాయనే ఆశలు నెలకొన్నాయి. ఈఎస్ఐ కార్డు ఉంటే.. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు చాలీచాలని జీతాలతో తమ కుటుంబాల వైద్య ఖర్చులకే రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. నెలకు రూ.21వేల లోపు వేతనం పొందుతున్న ప్రతీ కార్మికుడు లేదా ఉద్యోగి ఈఎస్ఐకి అర్హులు. దివ్యాంగ ఉద్యోగులైతే రూ.25వేల వరకు అవకాశం ఉంది. ఈఎస్ఐ కార్డుతో ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుని సిఫారసుతో హైదరాబాద్తోపాటు దేశంలో ఎక్కడైనా ఈఎస్ఐ పెద్ద ఆసుపత్రిల్లో ఖరీదైన వైద్యం సైతం ఉచితంగా పొందవచ్చు. అలాగే ఈఎస్ఐ చెల్లిస్తున్న కార్మికులకు పని ప్రదేశాల్లో గాయపడిన, ఇతర ప్రమాదం ఏదైనా జరిగితే వేతనంతో కూడిన సెలవు, వైద్య ఖర్చులు పొందే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది ఈఎస్ఐని ఉపయోగించుకోవడం లేదు. ఇక కొన్ని సంస్థలు తమ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు కనీసం ఈఎస్ఐ కూడా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతీ నెలా ఈఎస్ఐ చెల్లించేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన లేక సేవలకు దూరం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఆయా రంగాల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు విద్య, వైద్యారోగ్య సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ సిబ్బంది, రవాణా, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, హోటల్స్, రెస్ట్రారెంట్స్, సినిమా థియేటర్లు, తదితర చోట్ల కనీసం పది మంది పని చేసే చోట ఆయా యాజమాన్యాలు ఈఎస్ఐ పరిధిలోకి రావాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ఇవేమీ అమలు కావడం లేదు. దీంతో అనేక మంది కార్మికులు తమ కష్టార్జీతం వైద్యారోగ్య సేవలకే వెచ్చించాల్సి వస్తోంది. అయితే చాలామంది ఈ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో కార్మికులకు విస్తృతంగా ప్రచారం కల్పించి అర్హులు సేవలు పొందేలా చూడాల్సిన అవసరం ఉంది. -
పిచ్చుకల కోసం వరికుచ్చులు
కనుమరుగైపోతున్న పిచ్చుకలను మళ్లీ మన ఇంటికి రప్పించే ఓ మంచి ప్రయత్నాన్ని నిర్మల్ మండల మహిళా సమాఖ్య చేపట్టింది. వాటి పొట్ట నింపేలా, ఇంటికి లక్ష్మీకళ తెచ్చేలా వరికుచ్చుల తయారీని చేపట్టింది. నిర్మల్రూరల్ మండలం కొండాపూర్లో గణపతి స్వయంసహాయక సంఘం మహిళలు చేస్తున్న సమీకృతసాగులో భాగంగా పండిస్తున్న వరితోనే ఈ కుచ్చులను చేస్తుండటం విశేషం. డీఆర్డీవో విజయలక్ష్మి ఆలోచనతో ప్రారంభమైన ఈ వరికుచ్చులకు డిమాండ్ పెరుగుతోంది. నిర్మల్నుంచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ తదితర జిల్లాలకూ తీసుకెళ్తున్నారు. సేవ్బర్డ్స్ నినాదంతోనే.. పిచ్చుకలను రక్షించాలన్న నేపథ్యంలో వరికుచ్చుల తయారీ ఆలోచన వచ్చింది. రెగ్యులర్గా కావాలంటూ హైదరాబాద్ నుంచి ఇటీవల చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఒక్కో వరికుచ్చును రూ.300కు విక్రయిస్తున్నాం. సభ్యులకు పనితోపాటు లాభం, పిచ్చుకలకూ ఆహారం అందుతోంది. – విజయలక్ష్మి, డీఆర్డీవో -
ఓ మహిళా.. చట్టం తెలుసుకో..
● సీ్త్రల కోసం ఎన్నో చట్టాలు ● అవగాహన లేక ఇబ్బందులునిర్మల్: పరసీ్త్రని కూడా తల్లితో సమానంగా చూడాలని మన ధర్మం చెబుతోంది. కానీ.. చాలామంది భార్యాపిల్లలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యనే శరణ్యమనుకుంటున్నారు. కానీ.. మన దేశంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు అనేక చట్టాలున్నాయి. మహిళా దినోత్సవం నేపథ్యంలో నిర్మల్కు చెందిన న్యాయవాది సీహెచ్ అర్చన మహిళలకు సంబంధించిన చట్టాలు, హక్కుల గురించి వివరించారు. నిర్భయ చట్టం 2013: ఈ చట్టాన్ని 2013లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఢిల్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో తీసుకువచ్చింది. జస్టిస్ వర్మ కమిటీ సూచనల మేర కు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారిని కఠి నంగా శిక్షించాలని నిర్ణయించింది. అత్యాచారం, మహిళలకు సంబంధించిన ఇతర నేరా ల్లో నిందితులకు మరణ శిక్ష కూడా పడేలా కఠినతరం చేసింది. సమాన వేతన హక్కు చట్టం: ఏ యజ మాని కూడా వేతనాలు లేదా నియామకాల్లో లింగ వివక్ష చూపరాదు. వేతన వివక్ష ఎదుర్కొంటే మహిళలు లేబర్ కోర్టును సంప్రదించవచ్చు. ఆస్తి హక్కు: హిందూ వారసత్వ చట్టం–1956 ద్వా రా ఈ హక్కు కల్పించారు. 2005లో సవరించారు. కుమార్తెలకు వారి పూర్వీకుల ఆస్తిలో కొడుకులతో సమాన హక్కులున్నాయి. తండ్రి వీలు నామా లేకుండా మరణించినప్పటికీ కుమార్తె కు ఆమె సోదరులతో సమాన వాటా ఉంటుంది. ఇది వివాహిత కుమార్తెలకూ వర్తిస్తుంది. గృహ హింస నిరోధక చట్టం 2005: జీవిత భాగస్వామి, అత్తమామలు లేదా కుటుంబ స భ్యుల నుంచి శారీరక, మానసిక, లైంగిక లేదా ఆర్థి క వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలు ఈ చ ట్టం కింద రక్షణ పొందవచ్చు. ఇది భర్త లేదా అత్తమామల యాజమాన్యంలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కును మంజూరు చేస్తుంది. జీవన భృతి, కస్టడీ ఉత్తర్వులు, రక్షణ అందిస్తుంది. లింగ ఎంపిక నిషేధ చట్టం 1994: భారతదేశంలో సీ్త్ర భ్రూణ హత్యలను ఆపడానికి, క్షీణిస్తున్న లింగ నిష్పత్తిని అరికట్టడానికి భారత పార్లమెంట్ రూపొందించిన చట్టమిది. ఈ చట్టం ప్రకారం సీ్త్రల పట్ల వివక్షత నివారించడం, లింగ ఎంపిక, గర్భస్రావం ద్వారా స్రీ్త్రభూణ హత్యలను నిషేధించారు. తల్లి/బిడ్డ ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగే పరిస్థితుల్లో, జన్యుసంబంధిత వ్యాధులకు మాత్రమే తల్లి అంగీకారంతోనే గర్భస్రావం చేయించుకునే అవకాశముంది. అక్రమంగా స్కానింగ్ చేసి లింగనిర్ధారణ పరీక్ష ఫలితాలు వెల్లడి చేస్తే చట్టరీత్యా నేరంగా పరిగణించి కఠినశిక్షలు విధిస్తారు. పని ప్రదేశంలో వేధింపులు: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి, లైంగిక వేధింపుల ఫిర్యాదులు, పరిష్కారం కోసం పని ప్రదేశాల్లో వేధింపులు, నివారణ, నిషే ధం, పరిహారం చట్టం–2013 రూపొందించారు. ఒక కీలకమైన కేసుపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు 1997లో ‘విశాఖ’ మార్గదర్శకాలను వెలువరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. వరకట్న నిషేధ చట్టం–1961: ఈ చట్టం వరకట్నం ఇవ్వడం, తీసుకోవడాన్ని నిషేధించింది. ఈ చట్టా న్ని అతిక్రమిస్తే ఐదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, రూ.15వేలదాకా జరిమానా విధించడానికి ఆస్కా రం ఉంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కట్నం అడిగితే ఆరునెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.10వేలవరకు జరిమానా విధించవచ్చు. -
ఈవీఎం గోదాం తనిఖీ
నిర్మల్చైన్గేట్: నిర్మల్ రూరల్ మండలం ఎల్లాపల్లి వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో శుక్రవారం తనిఖీ చేశారు. తాళానికి వేసిన సీల్, సీసీ కెమెరాలో రికార్డవుతున్న విధానాన్ని పరిశీలించా రు. తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. గోదాం తనిఖీ నివేదికను ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని పర్యవేక్షకులకు సూచించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ ప్రతినిధులు గాజుల రవికుమార్, కొరిపెల్లి శ్రావణ్రెడ్డి, మహ్మద్ నయీ మ్, నరేశ్, భద్రత సిబ్బంది, అధికారులున్నారు. -
నిర్మల్
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులే ● తెలియని వారితోనే సమస్యలు ● మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వేచెప్పలేను 59మీ కాలేజీ, పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..లేదు 204 -
No Headline
అన్నింటికీ ఆమే ఆధారం. అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా అన్ని బాధ్యతల్లోనూ మెప్పిస్తోంది. ఇంటిల్లిపాదిని చూసుకుంటూనే ఇంటి బాధ్యతల్లోనూ భర్తకు బాసటగా నిలుస్తోంది. తనకాళ్లపై తాను నిలవడమే కాకుండా తనతోపాటు పదిమందికి ఆసరా అవుతోంది. నారీశక్తి తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదని చాటుతోంది. తన పరిధిలోనే స్వయంశక్తితో, సమష్టితత్వంతో, సంఘటితంగా ఆర్థిక స్వావలంబనను సాధిస్తోంది. అన్నీ ఉండి సోమరితనంతో నిద్రపోతున్న ఎంతోమందికి ఆదర్శమూర్తిగా నిలుస్తోంది. జిల్లాలో ఒక్కో మండలంలో ఒక్కో వినూత్న ఉపాఽధితో సత్తా చాటుతున్నారు స్వయంసహాయక సంఘాల మహిళలు. తాము ఉపాధిని పొందడంతో పాటు పదిమందికి ఆదర్శంగానూ నిలుస్తున్నారు. కలెక్టర్ అభిలాషఅభినవ్, డీఆర్డీవో విజయలక్ష్మి, సంబంధిత అధికారుల ప్రోత్సాహంతో ముందడుగేస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరిపై ప్రత్యేక కథనం. – నిర్మల్ -
నాట్యగురువు సౌమ్య
● చిన్నారులకు కూచిపూడిలో శిక్షణ ● రికార్డ్ ప్రదర్శనల్లో భాగస్వామ్యం భైంసాటౌన్: చిన్ననాటి నుంచే నృత్యంపై ఉన్న మక్కువతో తాను నేర్చుకుని ఎంతోమంది చిన్నారులకు నేర్పుతూ దానినే ఉపాధిగా మలుచుకున్నారు భైంసాకు చెందిన రంగు సౌమ్య. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల్లోనూ తన శిష్యబృందంతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఫలితంగా నృత్యరంగంలో భైంసాకు ప్రత్యేక గుర్తింపు తెస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నారు. సౌమ్యకు చిన్నప్పటి నుంచే నృత్యంపై మక్కువ ఉన్నా పెళ్లయిన తరువాత భర్త ప్రోత్సాహంతో నిజామాబాద్లో నృత్య గురువులు భీమన్, దేవులపల్లి ప్రశాంత్ వద్ద నాలుగేళ్లపాటు కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం భైంసాలో తానే సొంతంగా శ్రీనయనం నృత్యా కళానిలయం పేరిట చిన్నారులకు ప్రధానంగా కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. మొద ట ఐదుగురు చిన్నారులతో మొదలై, నేడు వందమందికి పైగా శిక్షణ తీసుకుంటున్నారు. తన వద్ద శిక్షణ పొందిన చిన్నారులతో పలు పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇప్పిస్తూ ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు అందుకున్నారు. తన భర్త, కుటుంబీకుల ప్రోత్సాహంతోనే తాను నృత్య రంగంలో రాణిస్తున్నట్లు ఈ సందర్భంగా రంగు సౌమ్య తెలిపారు. శిష్యబృందంతో ఇచ్చిన ప్రదర్శనలు ● అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తన శిష్యబృందంతో నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ● ఇటీవల అరుణాచలంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు 15 మంది చిన్నారులతో కలిసి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ● హైదరాబాద్లో నిర్వహించిన గిన్నిస్బుక్ రికార్డ్ నృత్య ప్రదర్శనలోనూ పాల్గొని పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు. ● గతనెలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రంలో సమతాకుంభ్–2025 పేరిట తృతీయ బ్రహ్మోత్సవాలు నిర్వహించగా 3వేల మంది చిన్నారులతో నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ఇండియన్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు నమోదయ్యాయి. ఇందులో భైంసా నుంచి శ్రీనయనం నృత్య కళానిలయానికి చెందిన 21 మంది చిన్నారులు పాల్గొని ప్రశంసాపత్రాలు అందుకున్నారు. -
● తమ కాళ్లపై తాము నిలుస్తూ..● మరికొందరికి ఉపాధినిస్తూ.. ● కుటుంబానికి తోడ్పాటునిస్తూ.. ● సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్న పలు మహిళా సంఘాల సభ్యులు ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
చేప పచ్చళ్లను తయారు చేస్తున్న మహిళలు వావ్.. అనిపించే ఫిష్పికిల్చేపలంటే నాన్వెజ్ ప్రియులకు చాలా ఇష్టం. కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు తినలేం. అలాంటివాళ్లకు ఇంట్లోనే పికిల్ (పచ్చడి) రూపంలో చేపలను అందించే ఆలోచనతో వాళ్లు ముందుకువచ్చారు. కడెం మండల కేంద్రానికి చెందిన 50 మంది మహిళలు ఇందిరా మహిళాశక్తి పథకం, ఈడీఐఐ యాక్సెంచర్ ఎన్జీవో సహకారంతో చేపలు, రొయ్యలతో పాటు చికెన్ పచ్చళ్లు తయా రు చేస్తున్నారు. స్థానికంగా లభించే రొయ్యలను ఎండబెట్టి విక్రయిస్తున్నారు. వీరు చేసే పచ్చళ్లు నాణ్యతతో ఉండటంతో స్థానికంగానే కాకుండా మలేషియా, దుబాయి నుంచీ డిమాండ్ పెరుగుతోంది. వారికి ఆదాయమూ కలిసి వస్తోంది. నాణ్యత పాటిస్తున్నాం స్థానికంగా చేపలు ఎక్కువగా లభిస్తాయి. మాకు అవగాహన ఉన్న పచ్చళ్ల తయారీనే ఉపాధిగా మార్చుకుని నాణ్యతతో అందిస్తున్నాం. పచ్చళ్లకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ మాకు ఆదాయం లభిస్తోంది. – రేణుక, కడెం -
బస్టాప్ల్లో ఇబ్బందే..!
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలటౌన్/చెన్నూర్/నిర్మల్/వాంకిడి/బోథ్/ఆసిఫాబాద్రూరల్: మహిళలు, యువతులు, విద్యార్థినులు అవకాశాల ను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో రాణిస్తున్నా రు. పురుషులకు దీటుగా పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ స మాజంలో అక్కడక్కడ మహిళలపై చిన్నచూపు ఉండడంతో అనేక అవకాశాలకు దూరమవుతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు, ఆధిపత్య ధోరణులు మహిళలకు ప్రతిబంధకంగా మారుతున్నా యి. ఎక్కడ.. ఎవరితో వివక్షకు గురవుతున్నారనే అంశాలపై ‘సాక్షి’ మంచిర్యాలలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థినులు, యువతులు, మ హిళలు 350మంది నుంచి సర్వే ద్వారా వివరాలు సేకరించింది. తెలియని వారు, ఆకతాయిలతో ఇక్కట్లు పడుతున్నట్లు తేల్చిచెప్పారు. బస్టాప్ల్లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వె ల్లడైంది. ఇళ్లలో ఆడ, మగ అనే వివక్ష లేదని, అభిప్రాయాలకు గౌరవం లభిస్తోందని స్పష్టమైంది.సెల్ఫోన్లో వచ్చే మెస్సేజ్లతో 72ఉంది 87మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశంతెలిసిన వారే.. 146తెలియని వారు 204బస్టాప్లో 204కాలేజీ లేదా ఆఫీసులో 74 -
శానిటరీ ప్యాడ్స్ తయారీ
రేలా.. పేరిట శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తూ జిల్లాకు పేరు తీసుకురావడమే కాదు.. వారూ ఉపాధి పొందుతున్నారు. కుంటాల మండలకేంద్రంలో డీఆర్డీవో విజయలక్ష్మి సూచనలు, రూర్బ న్ కింద వచ్చిన రూ.20లక్షల నిధులను అక్కడి మహిళలు ఇలా సద్వినియోగం చేసుకుంటున్నా రు. నిధులతో యంత్రాలు, సామగ్రి కొనుగోలు చేసి నాణ్యతతో శానిటరీ న్యాప్కీన్స్ తయారు చేస్తున్నారు. ఇతర జిల్లాలకూ పంపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచీ ఓ కంపెనీవాళ్లు వచ్చి చూసివెళ్లారు. మండలం, జిల్లా స్వయంసహాయక సంఘాల సభ్యులు ఇక్కడ ఉపాధితో పాటు తయారీలో శిక్షణ పొందుతున్నారు. ఉపాధి లభిస్తోంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా ఆసరా అందించేందుకు రేలా పేరిట బయోడిగ్రేడెబుల్ న్యాప్కీన్స్ తయారు చేస్తున్నాం. దీంతో మాకు పనితో పాటు ఉపాధి లభిస్తోంది. ఎస్హెచ్జీ సభ్యులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. – శారద, కుంటాల -
అమెరికాకు పిండివంటలు..
ఎక్కడో ఉన్న అమెరికాకు ఇక్కడి ఓ పల్లెటూరి మహిళలు పిండివంటలు చేసి పంపిస్తున్నారు. ఆస్ట్రేలియా, దుబాయి వాసులకూ తమ చేతివంటల రుచి చూపిస్తున్నారు. లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సరస్వతీ గ్రామైక్య సంఘం సభ్యులైన గొల్లమాడ ప్రణిత, శైలజ, వనజ, మాధురి, లక్ష్మి తమకు వచ్చిన వంటనే తమకు ఆసరాగా మార్చుకున్నారు. వారంతా కలిసి అన్నపూర్ణ క్యాటరింగ్ పెట్టుకున్నారు. చకినాలు, గారెలు, మురుకులు, అరిసెలు, లడ్డూలు తదితర పిండివంటలు చేస్తున్నారు. శుభకార్యాల కోసం కూడా వంటలు చేసిస్తున్నారు. వీరు చేస్తున్న పిండివంటలు రుచిగా ఉండటంతో అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి తదితర దేశాలకూ తీసుకెళ్తున్నారు. ఒక్కసారి తిన్నవారు మళ్లీమళ్లీ పంపించాలని కోరుతుండటం గమనార్హం. వచ్చిన పనితోనే ఉపాధి మేము ఏదైనా ఉపాధి పొందాలనుకున్నాం. మా కు వచ్చిన వంటలనే ఉపాధిగా మలుచుకున్నాం. ఇందుకు రూ.2లక్షల రుణం తీసుకుని నెలకు రూ.8వేల చొప్పున చెల్లిస్తున్నాం. మిగిలిన లాభాన్ని అందరం పంచుకుంటున్నాం. – గొల్లమాడ ప్రణిత, కిష్టాపూర్ -
న్యూస్రీల్
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం నిర్మల్ రూరల్: ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 6,102 మంది విద్యార్థులకు 5,806 మంది హాజరయ్యారు. 296 మంది గైర్హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 5,438 మంది విద్యార్థులకు 5,172 మంది హాజరవగా, 2,66 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో మొత్తం 664 మంది విద్యార్థులకు 634 మంది హాజరవగా, 30 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి పరుశురాం తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన డీఐఈవో సారంగపూర్: మండల కేంద్రంలోని ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా మాధ్యమిక విద్యాఽధికారి పరశురాం గురువారం సందర్శించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 290 మంది విద్యార్థులు హాజరు కావాల్సి, ఉండగా 281 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారని సీఎస్ శంకర్ జిల్లా మాధ్యమిక విద్యాఽధికారికి తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఐఈవో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కాపీయింగ్కు పాల్పడవద్దని తెలిపారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయన వెంట సీఎస్ శంకర్, అధ్యాపకులు ఉన్నారు. -
లేడీ సింగంలు..!
● ఠాణా గడప దాటి.. శాంతి భద్రతలకు కదిలి.. ● పెట్రో కారెక్కిన మహిళా పోలీసులు ● డ్యూటీలో సగమై.. గస్తీలో భాగమై.. ● మహిళా దినోత్సవం సందర్భంగా.. లేడీ పోలీసులకు కొత్త విధులు ● ఇకపై వారానికో రోజు బాధ్యతలు.. ● వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ నిర్మల్: పోలీసుశాఖకు ఫోన్లు కామనే కదా..!? ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా..!? ఈ ఫోన్లు చేసింది మహిళా కానిస్టేబుళ్లు. ఎప్పుడూ స్టేషన్ విధుల్లో.. లేదంటే ఎక్కడైనా కార్యక్రమాల వద్ద బందోబస్తులో మాత్రమే కనిపించే ఈ లేడీ కానిస్టేబుళ్లు తొలిసారి ఠాణా గడపదాటి.. శాంతిభద్రతల పరిరక్షణకు కదిలారు. తొలిసారి లేడీ సింగంలా బాధ్యతలు నిర్వర్తించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ జానకీషర్మిల గురువారం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళ కానిస్టేబుళ్లు సైతం పురుషులతో సమానంగా శాంతిభద్రతల్లో భాగం అవుతారని నిరూపించుకునేందుకు.. వారానికోసారి మహిళా కానిస్టేబుళ్లు సైతం పెట్రోకార్ డ్యూటీ చేసే అవకాశం కల్పించారు. తొలిరోజు లేడీ కానిస్టేబుళ్లు అదరగొట్టారు. ఈ తరహా ప్రయోగంపై ఏకంగా డీజీపీ జితేందర్ నుంచి ఎస్పీతోపాటు నిర్మల్ జిల్లా పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. స్టేషన్కే పరిమితమై..మహిళా కానిస్టేబుళ్లు(డబ్ల్యూపీసీ) అంటే స్టేషన్ లోపల పనులకే పరిమితం.. అన్నట్లుగా పోలీసు వ్యవస్థ స్థిరపడిపోయింది. మహా అంటే.. ఎక్కడైనా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, ర్యాలీల్లో మహిళలు ఉంటే అక్కడికి వీరిని పంపిస్తుంటారు. ఖాకీ డ్రెస్ వేసుకున్నట్లే.. పేరుకు పోలీసన్నట్లే కానీ.. వీరికి పోలీసింగ్ బాధ్యతలు అప్పగించేవారు కాదు. ఇదిగో.. ఇలాంటి వ్యవస్థలో తొలిసారి ఎస్పీ జానకీషర్మిల ఓ కదలిక తీసుకొచ్చారు. తాను మహిళనే కదా.. ఓ జిల్లా బాధ్యతలు చూడటం లేదా.. అన్న ఆలోచనల్లో నుంచి తమ మహిళా కానిస్టేబుళ్లకూ ఓ అవకాశాన్ని కల్పించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని డబ్ల్యూపీసీలు వారానికోరోజు పెట్రోకార్ అంటే గస్తీ, డయల్ 100, చెకింగ్ పాయింట్లు తదితర పోలీసింగ్ విధులను చేపట్టాలని ఆదేశించారు. భేష్ అనిపించారు..తమపై భరోసా ఉంచి తమ పైఅధికారి కల్పించిన అరుదైన అవకాశాన్ని మహిళా కానిస్టేబుళ్లు సద్వినియోగం చేసుకున్నారు. తొలిరోజే తామేంటో నిరూపించుకునేలా పనిచేసి ఉన్నతాధికారుల మెప్పు పొందారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులను అందుకుని ఘటన స్థలాలకు వెళ్లారు. అక్కడి పరిస్థితిని ఉన్నతాధికారికి వివరించి చర్యలు చేప ట్టారు. రోడ్డుభద్రత చర్యలతోపాటు రోజువారీగా పెట్రోకార్ సిబ్బంది చేయాల్సిన విధులన్నీ విజయవంతంగా పూర్తిచేశారు. చాలామంది పోలీసయ్యాక ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందన్నారు. -
తరగతిలోకి ఏఐ!
● ప్రాథమికస్థాయి నుంచే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై విద్యాశాఖ దృష్టి ● విద్యా ప్రమాణాల పెంపునకు దోహదం ● ఇటీవల సమీక్షలో రాష్ట్ర మంత్రి, ఉన్నతాధికారుల సూత్రప్రాయ నిర్ణయం.. ● అమలైతే మరింత ప్రయోజనంనిర్మల్ఖిల్లా: ప్రస్తుతం కృత్రిమ మేధా ప్రపంచాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లే సాధనంగా మారుతోంది. అయితే దీనిని రాష్ట్ర ఐటీ, పాఠశాల విద్యాశాఖ వి ద్యాబోధనలోనూ అమలుపరిచేందుకు కసరత్తు చే స్తోంది. ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బా బు, విద్యాశాఖ కార్యదర్శి యోగితరాణాతో కలిసి విద్యాసంస్కరణలపై చర్చలో భాగంగా ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నా ప్రైవేటు విద్యాసంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కుంటోంది. అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడుల్లో విద్య నాణ్యత మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశా రు. జిల్లాలోనూ దాదాపు 850 పైగా ప్రభుత్వ విద్యా సంస్థలు కొనసాగుతుండగా 70 వేలకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రతీ పాఠశాలలో కృత్రిమ మేధ వినియోగాన్ని అమలుపరిస్తే జిల్లా విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. క్షేత్రస్థాయి అనుభవాలు..ఆర్టిఫిఫీయల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధనలో చెప్పాలనుకున్న పాఠ్యాంశాన్ని పూర్తిస్థాయిలో క్షేత్ర పర్యటనలో మాదిరిగా విద్యార్థికి అర్థవంతంగా బోధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రతీసారి పాఠశాల నుంచి బయటకు వెళ్లి చూపించలేని అంశాలన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించవచ్చు. రోబోటి క్ లెర్నింగ్ కృత్రిమ మేధ వినియోగాన్ని బోధన అభ్యసన ప్రక్రియలో చేపట్టడం ద్వారా అభ్యసనం ఫలవంతమవుతుంది. విద్యార్థికి శాశ్వత జ్ఞానం ఏర్పడే అవకాశం ఉంటుంది. నేర్చుకునే అంశాలపై కుతూహలం పెరుగుతుంది. ఉపాధ్యాయుడికి విద్యార్థికి ప్రేరణాత్మకంగా ఉంటుంది.. ఇప్పటికే పెరిగిన సాంకేతికత...జిల్లాలో బోధన అభ్యసన ప్రక్రియ పరిపుష్టం చేసేందుకు ఇప్పటికే ప్రతీ పాఠశాలకు ట్యాబ్లు, ఐఎఫ్బీ పానెల్ బోర్డులు ఏర్పాటు చేశారు. వీటికి తోడు పీఎంశ్రీ పాఠశాలల ఎంపికై న 17 విద్యాసంస్థల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లు కూడా పూర్తికానున్నా యి.. ఆడియో విజువల్ లర్నింగ్ ద్వారా పాఠ్యాంశాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయుల కు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో సృజనాత్మక శైలులు జొప్పించేందు కు అధికారులు అంతర్గత శిక్షణలు కూడా అందిస్తున్నారు. తద్వారా ఉపాధ్యాయుడు సైతం మారుతు న్న కాలానికి అనుగుణంగా బోధన అభ్యసన ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించేందుకు వీలుంటుంది..ప్రభుత్వ బడులు మరింత బలోపేతం.. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ బడుల్లో అన్నిరకాల వసతులు సమకూరుతున్నాయి. ప్రైవేటులో చదివించలేని పేద విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం వరం లాంటిది. విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేయడంతో వారికి పూర్తిస్థాయిలో అర్థవంతంగా ఉంటుంది. తద్వారా ప్రభుత్వం పాఠశాలలు కూడా మరింత బలోపేతం అవుతాయి.. – ఒడ్నాల రాజేశ్వర్, విద్యార్థి తండ్రి, పరిమండల్సాంకేతికత వినియోగం అవసరమే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తేవడం ద్వారా అభ్యసనం పూర్తిస్థాయిలో సఫలం అవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత వినియోగం అవసర మే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో బోధన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి
నిర్మల్ టౌన్: ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి సూచించారు. ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 5 వరకు ఉద్యోగులు డ్యూటీలో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు, నిబంధనలపై ప్రొజెక్టర్ ద్వారా తరగతులు నిర్వహించారు. గురువారం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యం, సృజనాత్మకతను పెంచడానికి ఈ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు ఈ సంస్థను సొంత సంస్థగా భావించి పనిచేయాలని సూచించారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, ఏఈ నవీన్కుమార్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి జిజ్ఞాస ప్రదర్శనలో భైంసా విద్యార్థులు
భైంసాటౌన్: హైదరాబాద్లోని ఇందిర ప్రియదర్శిని కళాశాలలో బుధవారం రాష్ట్రస్థాయి జిజ్ఞాస(డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయన ప్రాజెక్టులు)–2025 పోటీలు జరిగాయి. ఇందులో భైంసాలోని జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళా శాల విద్యార్థులు యోగిత, కీర్తి, అంకిత, నితి న్, వంశీ పాల్గొని ‘ఆంగ్ల భాషా పదాల అసమగ్ర అనువాదం కన్నా అనులేఖనం అనువైనది‘ అనే అంశంపై ప్రదర్శన ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు రూపొందించిన ట్లు ప్రిన్సిపాల్ బుచ్చయ్య తెలిపారు. విద్యార్థులు, పర్యవేక్షక ప్రొఫెసర్లను ప్రిన్సిపాల్, అధ్యాపకులు గురువారం అభినందించారు. -
బాసర ఆలయానికి రూ.2.50 లక్షల విరాళం
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలోని ఉచిత అన్నదాన సత్రంలో నూతన బాయిలర్ ఏర్పాటుకు ఓ భక్తుడు రూ.2.50 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. హైదరాబాద్ కు చెందిన వంగూరి గౌతమ్–కుసుమశ్రీ కుమారుడు రుద్రవిహాన్ కుటుంబ సభ్యులు గురువారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మొదటి విడతగా బాయిలర్ మెషీన్ కోసం ఎస్ఎస్ ఫ్యాబ్రికేషన్ హైదరాబాద్ వారికి రూ.50 వేలు ఆలయ అధికారికి అందించారు. బాయిలర్ పనులు పూర్తయ్యాక పది రోజుల్లో మిగతా రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు. -
బాధ్యతాయుతంగా విధులు..
మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎస్పీ జానకీషర్మిల తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. అంతేకాకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తాం. మొదటిరోజు విధుల్లో.. బస్టాండు వద్ద పెట్రోలింగ్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేశాం. రోడ్లపై ఉన్న బండ్లను తొలగింపజేశాం. మొదటి రోజు డ్యూటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. –వజ్రమ్మ, నిర్మల్ పురుషులతో సమానంగా.. మొదటిసారిగా బ్లూకోల్ట్స్, పెట్రోకార్ విధులు నిర్వహించడం సంతోషంగా ఉంది. పురుషులతో సమానంగా విధులు నిర్వహించాం. నిబద్ధతతో పనిచేశాం. మాకు ఈ అవకాశం కల్పించిన ఎస్పీ జానకీషర్మిళ మేడం, ఏఎస్పీ రాజేశ్మీనా, ఎస్సై సుమలతకు కృతజ్ఞతలు. – శ్రీలత, లక్ష్మణచాంద ‘నారీశక్తి’లో భాగంగా.. మహిళలు ఏరంగంలో అయినా రాణించగలరు. మా మహిళ సిబ్బందిపై పూర్తి నమ్మకంతోనే వారికి పెట్రోకార్ బాధ్యతలు అప్పగించాం. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న ‘నారీశక్తి’ కార్యక్రమాల్లో భాగంగా వారానికోసారి మహిళా కానిస్టేబుళ్లకు పెట్రోకార్ బాధ్యతలను అప్పగిస్తాం. తొలిరోజే డబ్ల్యూపీసీలు అద్భుతంగా పనిచేశారు. –జానకీషర్మిల, ఎస్పీ -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: పదో తరగతి పరీక్షల్లో ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో పదో తరగతి పరీక్షల పై గురువారం సమీక్ష నిర్వహించారు. పరీక్షల్లో జి ల్లాలోని ప్రతీ పాఠశాలలో విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలన్నారు. రెండేళ్లుగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఈసారి కూడా మొదటిస్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. పరీక్షల సన్నద్ధత కోసం ప్రత్యేక టైంటేబుల్ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయం తొలగించాలని సూచించారు. పాఠ్యాంశాలను సులభంగా గుర్తుంచుకునేలా మెలకువలు నేర్పించాలని తెలిపారు. ఉపాధ్యాయులు అధికారులు, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రత్యే క అధికారులు పాల్గొన్నారు. -
బేటీ బచావో–బేటీ పడావో జిల్లాస్థాయి పోటీలు
నిర్మల్ రూరల్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో– బేటి పడావో’ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 8, 9 తరగతి బాలికలకు గురువారం జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మండలాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన 100 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. 25 మంది విద్యార్థినులను విజేతలుగా ప్రకటించారు. వీరికి మహిళా దినోత్సవం రోజున కలెక్టర్ అభిలాష అభినవ్ బహుమతులు ప్రదానం చేస్తారని డీఎస్వో వినోద్కుమార్ తెలిపారు. విజేతలను డీఈవో రామారావు అభినందించారు. -
పన్ను చెల్లించని ఇల్లు సీజ్
ఖానాపూర్: పట్టణంలోని అంబేద్కర్నగర్ కాలనీకి చెందిన రాములు రూ.15,880 ఇంటి పన్ను చెల్లించకపోవడంతో ఆ ఇంటిని సీజ్ చేశామని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. వార్డు అధికారులు ధీరజ్, రాహు ల్, లతీఫ్, రాజశేఖర్, బిల్ కలెక్టర్ అభినయ్ సిబ్బందితో కలిసి గురువారం ఇంటికి తాళం వేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పన్నులు చెల్లించి మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరా రు. నూతన మున్సిపాలిటీలో నిధుల కొరతను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది వేతనాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు సహాకారం అందించాలన్నారు. -
కేజీబీవీల్లో ‘పోలీస్ అక్క’
నిర్మల్టౌన్/కడెం/లక్ష్మణచాంద/లోకేశ్వరం/ కుంటాల: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు, బాలికల భద్రతకు ‘పోలీస్ అక్క’ పేరిట ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. ప్రతీ నెలలో ఒకరోజు మహిళా కాని స్టేబుళ్లు ప్రభుత్వ బాలికల విద్యాసంస్థలను సందర్శించి హాస్టళ్లలో బస చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 18 పాఠశాలల్లో దీనిని అమలు చేసేందు కు నిర్ణయించారు. ఒక్కో మహిళా కానిస్టేబుల్ ఒ క్కో పాఠశాలను దత్తత తీసుకుని ప్రతీ వారం పాఠశాలను సందర్శించేందుకు ప్లాన్ చేశారు. విద్యార్థిను ల మంచీచెడు తెలుసుకుని సైబర్ క్రైమ్, బ్యాడ్.. గుడ్ టచ్పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయంపై బుధవారం సంబంధిత పోలీస్ అధికారులు, మహిళా కానిస్టేబుళ్లతో ఎస్పీ జూమ్ మీటింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కేజీబీవీల్లోని విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాలని, నెలకోసారైన పాఠశాలను సందర్శించాలని ఆదేశించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, వారిలో మనోధైర్యం నింపాలని సూచించారు. మ హిళా దినోత్సవం సందర్భంగా కేజీబీవీల్లోని విద్యార్థినుల భద్రతకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలి పారు. 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ నిర్వహించి విద్యార్థినులు సమస్యలు ఎలా అధిగ మించాలో వివరిస్తామని చెప్పారు. వారి సమస్యలు అర్థం చేసుకుని కౌన్సిలింగ్ ఇస్తామని వివరించారు. జూమ్ మీటింగ్లో అదనపు ఎస్పీలు పాల్గొన్నారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలో.. లక్ష్మణచాంద మండల కేంద్రంలోని కేజేబీవీలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై సుమలత హాజరై మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు ‘బాలికల భద్రత–మా బాధ్యత’ నినా దంతో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కడెం మండల కేంద్రంలో.. మహిళలు, బాలికల సంరక్షణకు ఎస్పీ జానకీ షర్మి ల మహిళా దినోత్సవం రోజున ప్రారంభించనున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమంపై కడెం మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో మహిళా సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. లోకేశ్వరం మండల కేంద్రంలో.. లోకేశ్వరం మండల కేంద్రంలోని కేజీబీవీలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు బాలికల భద్రతపై మహిళా కానిస్టేబుల్ వినిత అవగాహన కల్పించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబాల్లో ఎలాంటి సమస్యలున్నా పోలీసులకు తెలుపాలని సూచించారు. కుంటాల మండలం కల్లూరులో.. కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని కేజీబీవీ లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్సై భాస్కరాచారి బుధవారం రాత్రి బస చేశారు. మహిళల హక్కులపై విద్యార్థినులకు అవగాహన క ల్పించారు. ఇన్చార్జి ఎస్వో సంధ్యారాణి, కానిస్టేబు ల్ అశ్విని తదితరులు పాల్గొన్నారు. వినూత్న సేవలకు ఎస్పీ శ్రీకారం విద్యార్థినుల భద్రతకు భరోసా -
వందశాతం పూర్తి చేయాలి
నిర్మల్చైన్గేట్: ఇంటిపన్ను వసూళ్లను వందశాతం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ, వాణిజ్య పన్నుల వసూలు, శానిటేషన్ తదిత ర అంశాలపై మున్సిపల్ అధికారులతో ఆయన స మావేశం నిర్వహించారు. ఇప్పటివరకు వసూలు చే సిన పన్నులు, బకాయిలకు సంబంధించి మున్సిపాలిటీల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో పన్నులు చెల్లించనివారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్షం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు తప్పనిసరిగా వాణిజ్య లైసెన్స్లను పునరుద్ధరించుకునేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ భవన సముదాయాల్లో వ్యా పారం నిర్వహించుకుంటున్న వ్యాపారుల నుంచి వెంటనే అద్దె వసూలు చేయాలని సూచించారు. బ కాయిలు పేరుకుపోయిన దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. సమావేశంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, రాజేశ్కుమార్, జాదవ్ కృష్ణ, మెప్మా పీడీ సుభాష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
● గ్రాడ్యుయేట్లోనూ బీజేపీ హవా ● అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి ● మూడు రోజులు సాగిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ● ముగ్గురికే 92.52శాతం ఓట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి: కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్లతో బీజేపీ గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరి పడా కోటా ఓట్లు రాకపోయినా అంజిరెడ్డికి అత్యధి క ఓట్లు రావడంతో ఆయననే విజేతగా ప్రకటించా రు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించడంతో శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా మూడు షిఫ్టుల్లో 800మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు పక్రియ చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, కట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేపట్టి బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్లను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్లలో బరిలో ఉన్న 54మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ పక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52శాతం ఓట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటైన ఓట్లలో 92.52శాతం (2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురు అభ్యర్థులకే వచ్చాయి. మిగతా 53మంది స్వతంత్ర అభ్యర్థులు 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సంబురాల్లో విక్టరీ సింబల్ చూపుతున్న కేంద్ర మంత్రి సంజయ్, ఎమ్మెల్సీ విజేత అంజిరెడ్డిరెండో ప్రాధాన్యత ఓట్లలోనూ బీజేపీదే హవా నిర్ధారిత కోటా ఓట్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ పక్రియ చేపట్టగా అందులోనూ బీజేపీ అభ్యర్థి ఆధిక్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్కు 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,404 ఓట్లు వచ్చాయి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లను ఎవరూ సాధించకపోవడంతో మూడో స్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును అంజిరెడ్డికే వేయడంతో అతడినే విజయం వరించింది. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలిస్తున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ -
చట్టాలపై అవగాహన
నిర్మల్చైన్గేట్: బేటీ బచావో.. బీటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అ హ్మద్ బుధవారం పలువురు డిగ్రీ కళాశాల వి ద్యార్థినులతో సమావేశమై చట్టాలపై అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బేటీ బచావో.. బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలను జనవరి 22నుంచి మార్చి 8వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ హెల్ప్లైన్ నంబర్లు 100, 1098,181, 1930, బాల్య వివాహ నిర్మూలన చట్టం–2006, బాలికలు, మహిళల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏసీడీపీవో నాగలక్ష్మి, మిషన్ శక్తి సమన్వయకర్త సవిత, మిషన్ శక్తి బృందం సభ్యులు, విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన కల్పిస్తున్న ఫైజాన్ అహ్మద్ -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నిర్మల్ రూరల్: జిల్లాలో బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఈసారి విద్యార్థులకు ఐదు నిమిషాలు వెసులుబాటు కల్పించినా దాదాపు గంట ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,944 మంది విద్యార్థులకు గాను 6,510 మంది హాజరయ్యారు. 434మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 621మంది విద్యార్థులకు 539 మంది హాజరయ్యారు. 82మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 6,323 మంది విద్యార్థులకు గాను 5,971 మంది హాజరయ్యారు. 352 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో పరశురాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికలు, బాలుర పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్, ఏఎస్పీ ఉపేందర్రెడ్డి వేర్వేరుగా పరిశీలించారు. గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థిని సెంటర్కు చేర్చిన ఎస్సై ముధోల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రంలో ఇంటర్ పరీక్షలకు హాజరు కావాల్సిన ఓ విద్యార్థి పొరపాటున గురుకుల పాఠశాలకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక పొరపాటు తెలుసుకుని జూనియర్ కళాశాలకు వెళ్లేందుకు పరుగులు పెట్టాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న స్థానిక ఎస్సై సంజీవ్ గమనించి ఆ విద్యార్థిని తన వాహనంలో సకాలంలో సెంటర్కు చేర్చాడు. దీంతో ఎస్సైని పలువురు అభినందించారు. 6,944 మంది విద్యార్థులకు 6,510 మంది హాజరు పరీక్షాకేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్ -
ఇంటిపన్ను వసూలు చేయాలి
లోకేశ్వరం: వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. బుధవారం మండలంలోని మన్మద్, రాజూర గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, డ్రైనేజీ లు, రోడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డీ పీవో మాట్లాడుతూ.. నర్సరీలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని తెలిపారు. సెగ్రిగేషన్ షెడ్లో సేంద్రియ ఎరువు తయారు చేయాలని సూచించారు. గ్రా మాల్లో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాల ని తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయ న వెంట ఎంపీడీవో వెంకటరమేశ్, ఈవోపీఆర్డీ సోలమాన్రాజ్, సెక్రటరీ మహేశ్ ఉన్నారు. -
నిర్మల్
పక్షుల లెక్క తేలింది జన్నారం అటవీ డివిజన్లో నిర్వహించిన సర్వేలో అధికారులు 201 రకాల పక్షులను గుర్తించారు. 11 రకాల పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025ఎండిన పొలాల పరిశీలన కడెం: ఈనెల 5న ‘పంట తడికి.. కంటతడి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యవసాయాధి కారి అంజిప్రసాద్ మండలంలోని కొత్త మద్దిపడగ, ఎలగడప గ్రామాల్లో సాగునీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలించారు. కలెక్టర్కు నివేదిక అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఏవో దినేశ్, ఏఈవోలున్నారు.నిర్మల్చైన్గేట్: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సేవలు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలతో పాటు ప్రతీ పనికి సాంకేతికత ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ–పాలన, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో టీ–ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, రైతువేదికలు, ఇతర ప్రజాసేవల సంస్థలకు అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మిషన్ భగీరథ పథకం పైపులైన్లు నిర్మించే సమయంలో టీ–ఫైబర్ కేబుల్ వేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ టీ–ఫైబర్ పరికరాలనూ అమర్చారు. అయితే ఇప్పటివరకు టీ–ఫైబర్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఎన్నికల్లోపు అందుబాటులోకి వచ్చేనా? ప్రస్తుతం గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్లు, ఎన్నికల నిర్వహణ, వి జేతల వివరాలు ఇలా ప్రక్రియ అంతా ఇంటర్నెట్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామాల్లో సేవలు అందుబాటులో లేక మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, గ్రామపంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించకముందే విద్యుత్ సౌకర్యం కోసం మీటర్లు బిగించారు. దీంతో పంచాయతీల్లో రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. సేవల మాటేమో గాని బిల్లుల మోత తప్పడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ సేవలు అందుబాటులోకి తేవాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో టీ–ఫైబర్కు సంబంధించిన పరికరాలు బిగించి విద్యుత్ కనెక్షన్లూ ఇచ్చారు. వాటి నుంచి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు డిజిటల్ సేవలు అందడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరమవుతాయి. – శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి న్యూస్రీల్కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాలి నిర్మల్చైన్గేట్: ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం) కార్డుల జారీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ ప్రక్రియపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశమై కార్డులు జారీ చేసే క్రమంలో వైద్య బృందానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది తది తర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా దివ్యాంగులకు అవగాహన కల్పించాలని సూచించారు. 21 రకాల వైకల్యం కలిగినవారు యూడీఐడీ కార్డు పొందవచ్చని తెలిపారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కలిగినవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వైద్యారోగ్యశాఖ అధికారులు గోపాల్, సునీల్, సురేశ్, డీపీఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు. జాడలేని ఈ–పాలన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయం, వ్యయాలు, జీతభత్యాలు, జనన, మరణ ధ్రువపత్రాల జారీ, ఇంటి పన్ను తదితర సేవలను గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలకు డిజిటల్ రూపంలో అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. జిల్లావ్యాప్తంగా 396 గ్రామపంచాయతీలుండగా.. సుమారు 36మంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ కేబుల్, పరికరాలు బిగించారు. విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్లేట్లు, ఇన్వర్టర్ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్ కూడా నిర్వహించారు. క్లస్టర్ల వారీగా ఈ–పంచాయతీ ఆపరేటర్లను నియమించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు అందించారు. అయితే పంచాయతీల్లో ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రాక ఈ–పాలన అమలులోకి రాలేదు. దీంతో చాలామంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు మండల పరిషత్ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ పరికరాలు నిరుపయోగమయ్యాయి. పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు ప్రజలకు డిజిటల్ సేవలు అందించాలన్న సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాల్లో ఏమైనా అవాంతరాలుంటే లబ్ధిదారులు మండల పరిషత్ కార్యాలయాలకు వచ్చి వాకబు చేయాల్సి వస్తోంది. పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి పంచాయతీ కార్యదర్శులు చేతి రాత రశీదులే ఇస్తున్నారు ఇంటర్నెట్ లేక సౌకర్యం లేక మరుగున పడిన ఈ–పాలన నిరుపయోగమైన పరికరాలు ఏ పనికై నా మండల కేంద్రానికే.. డిజిటల్ సేవలు అందేదెన్నడో! సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో టీ–ఫైబర్ నెట్ పరికరాలు ఇలా వృథాగా పడి ఉన్నాయి. గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కేబుల్ వైర్ వేసి ఫైబర్ నెట్ పరికరాలు బిగించినా కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో కొన్నేళ్లుగా పరికరాలు ఇలా నిరుపయోగమయ్యాయి. జిల్లాలో ఫైబర్ పథకం పనుల అమలు తీరుకు ఇదొక నిదర్శనం. -
ఆర్జీయూకేటీ అధ్యాపకురాలికి డాక్టరేట్
బాసర: ఆర్జీయూకేటీ బాసరలో ఈసీఈ విభాగంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకురాలు డాక్టర్ ఆర్.పద్మశ్రీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుంది. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ డాక్టరేట్ పొందిన పద్మశ్రీకి అభినందనలు తెలిపారు. వర్సిటీలో ఇప్పటికే చాలామంది డాక్టరేట్ పొందారని తెలిపారు. దీంతో పరిశోధనా రంగంలోనూ నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పద్మశ్రీ ‘సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఎంఐఎంఓ డిటెక్టర్ల పనితీరు విశ్లేషణ 6 జీహెచ్జెడ్/ఎంఎం వేవ్ నెట్వర్క్లలో అప్లింక్ డౌన్లింక్ను డీకప్లింగ్ చేయడం‘ అనే అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ అందుకున్నారు. ఈసీఈ విభాగం ప్రొఫెసర్ బి.రాజేందర్నాయక్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పలు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
● డీఈవో రామారావు సోన్: పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తామని డీఈవో రామారావు తెలిపారు. మండలంలోని కడ్తాల్ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. పదో తరగతికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఇంగ్లిష్ పీరియడ్ను పరిశీలించారు. గ్రాండ్ టెస్టు మార్కుల ఆధారంగా విద్యార్థులను పిలిచి అన్ని విషయాల్లో వారి ప్రగతిని పరిశీలించారు. గణితం, ఆంగ్లంలో మంచి మార్కులు పొందాలంటే ఇంకా కష్టపడాలని సూచించారు. పరీక్షల వరకు విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా రావాలని సూచించారు. పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఉండదని, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. డీఈవో వెంట హెచ్ఎం వెంకటేశ్వర్, పరీక్షల సహాయ కార్యదర్శి భానుమూర్తి, ఆంగ్ల ఉపాధ్యాయురాలు శైలజ ఉన్నారు. -
పకడ్బందీగా ‘బాలశక్తి’
నిర్మల్టౌన్: బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బాలశక్తి నిర్వహణపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపునకు అమలుపరుస్తున్న బాలశక్తి కార్యక్రమాన్ని మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిరంతరం కొనసాగించాలని వైద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహించిన విద్యార్థులందరికీ హెల్త్ కార్డులు అందించాలని సూచించారు. అనారోగ్య సమస్యలను గుర్తిస్తే ప్రత్యేక పోషక ఆహారం, మందులను అందించాలని తెలిపారు. పోషకులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతుల వివరాలను తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. పరీక్షలపై భయాన్ని తొలగించేలా, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా మానసిక వైద్య నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా పాఠశాలల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, డీఎంహెచ్వో రాజేందర్, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ -
వీడని ఉత్కంఠ
తేలని ఫలితంసాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్– ఆదిలాబాద్– మెదక్– నిజా మాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలి తం ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఎవ రూ నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆసక్తి నెల కొంది. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలి తం తేలనుంది. దీంతో ట్రయాంగిల్గా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. త్రిముఖ పోటీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా 56 మంది అభ్యర్థులు పోటీపడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వ చ్చాయి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు సుమారు లక్ష ఓట్లు, బరిలో నిలిచిన 53 మంది కలిపి కేవలం 10వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ దక్కని విన్నింగ్ కోటా ఓట్లు పోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,100 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లనిఓట్లు పోగా మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే.. 1,12,001 (సుమారు) ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ప్రతీ రౌండ్లో బీజేపీకే ఆధిక్యం మొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 45,401 ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్రెడ్డి సెకండ్ ప్లేస్లో, 3,1481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూడోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్కూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ‘గ్రాడ్యుయేట్’ పోటీ త్రిముఖం కోటా ఓట్ల మార్కును చేరుకోని అభ్యర్థులు ఎలిమినేషన్తో తేలనున్న ఫలితం ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కౌంటింగ్ వివరాలు: మొత్తం ఓట్లు(పోస్టల్ ఓట్లతో కలిపి) 2,52,100 చెల్లని ఓట్లు : 28,000(11.01శాతం) చెల్లుబాటైనవి : 2,24,000 విన్నింగ్ కోటా ఓట్లు 1,12,001(సుమారు) బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 -
బీజేపీలో జోష్
మరో సీటుపై ఉత్కంఠ మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గత రెండు రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణ మధ్య పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు, ఓట్లు ఎక్కువగా ఉండడంతో లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి మంగళవారం సాయంత్రం వరకు ముందంజలో ఉన్నారు. ఏ అభ్యర్థి గెలుస్తారనేది బుధవారం స్పష్టత రానుంది. ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల తొలగింపు ప్రక్రియ మొదలైతే తుది విజేత ఎవరనేది తేలాల్సి ఉంది. బీజేపీ శ్రేణులు తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాలో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కమలనాథుల్లో జోష్ నింపింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని కై వసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ పోరులో నువ్వా నేనా అన్నట్లు తలపడగా.. బీజేపీ బలపర్చిన అభ్యర్థి మల్క కొమురయ్యకే టీచర్లు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నాలుగు ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని మరోసారి సత్తా చాటింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల మద్దతుతో ఓ సీటులో విజయం సాధించింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ సైతం ఆ పార్టీ ఖాతాలో చేరింది. ఉమ్మడి జిల్లాలో గత రెండేళ్లుగా బీజేపీ అనుకూల పవనాలే వీస్తున్నాయి. దీంతో భవిష్యత్లో తమ పార్టీ బలపడుతుందనే సంకేతాలు వస్తున్నాయని కేడర్లో ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంపై ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలనుకున్న పార్టీ సీనియర్లకు ఊరట కలుగుతోంది. మరోవైపు తాజా ఎన్నికలతో యువత, టీచర్లు, విద్యావంతులు బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. కలిసొచ్చిన ఆత్మీయ సమ్మేళనాలు శాసనమండలి ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదటి నుంచి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టభద్రులు, టీచర్ల స్థానానికి బరిలో దింపి స్థానిక నాయకులపైనే భారం వేసింది. కార్పొరేట్ వ్యక్తులుగా ప్రచారం జరిగినా మల్క కొమురయ్య, పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డికి సానుకూలత పెరిగింది. పట్టణాలు, నియోజకవర్గాల్లో ఓటర్లను అధిక సంఖ్యలో రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం గెలుపునకు దోహదం చేశాయి. ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేపట్టారు. వచ్చే స్థానిక సంస్థల్లోనూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామాలు, బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకే పరిమితమైన ఓటు బ్యాంకును గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాషాయ పార్టీ బలపడేందుకు సరైన సమయం వచ్చిందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన పార్టీ ఇక గ్రామ స్థాయిలోనూ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో నాయకులకు ఊరట పట్టభద్రుల స్థానంలోనూ గెలుస్తామనే ధీమా ఉమ్మడి జిల్లా పార్టీ కేడర్లో ఉత్సాహం -
నిర్మల్
ఆర్జీయుకేటీలో ‘కథక్’ శిబిరం ఆర్జీయుకేటీలో ఐదు రోజుల కథక్ నృత్య శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ఆర్తి శంకర్, రచన శిక్షణ ఇవ్వనున్నారు. బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 20258లోu సైబర్ క్రైమ్పై అవగాహన ఉండాలి ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: సైబర్ నేరాలపై మహిళలు కూడా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. సైబర్ మోసగాళ్లు వర్క్ఫ్రం హోం అని, ఆకట్టుకునే వేతనాలని, పార్ట్ టైం జాబులు అని, మహిళలు, గృహిణులను ఆకర్షిస్తున్నారని తెలిపారు. యాప్లు డౌన్లోడ్ చేయించి, ఫోన్లను హ్యాక్ చేస్తారని పేర్కొన్నారు. మహిళల వ్యక్తిగత వివరాలు సేకరించి, వాటిని చూపించి, భయపెట్టి సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని వివరించారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, గూగుల్ అకౌంట్ల వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని సూచించారు. మీ అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలని తెలిపారు. సైబర్ మోసం బారిన పడితే వెంటనే 1930 నంబర్కు కాల్చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈనెల 8న మహిళా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఇందులో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రమణారావు, ఆర్ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. కడెం: అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి.. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. సదర్మట్ చివరి ఆయకట్టు వరకు సాగునీరందక కడెం మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం కనీసం స్పందించడం లేదు. దీంతో నెర్రెలు బారిన పంటను చూసి రైతులు యాసంగిపై ఆశలు వదులుకుంటున్నారు. వారబందీ పద్ధతిలో.. సదర్మట్ కాలువ ద్వారా కడెం మండలం లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెత్తర్పు, ధర్మాజీపేట్, కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, పె ద్దూర్ తండా, వకీల్నగర్, చిట్యాల్, తదితర గ్రా మల్లోని 5 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. లక్ష్మ ణాచాంద మండలం వడ్యాల్ వద్ద సరస్వతి కెనాల్ నుంచి సదర్మట్కు వారబందీ పద్దతిన 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఖానాపూర్, క డెం మండలాల ఆయకట్టుకు ఈ నీరే అందాలి. అ యితే చివరి వరకు నీరు అందకపోవడంతో పొలా లు ఎండిపోతున్నాయి. కాలువ నీరు రాకపోవడం, వ్యవసాయ బావుల్లో నీళ్లు అడుగంటడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. బావుల్లో నీరు పది నిమి షాలు కూడా మోటార్ నుంచి రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. సదర్మట్ కాలువ ద్వారా వ స్తున్న నీటితో కడెం ప్రాజెక్ట్కు ఫీడింగ్ చేయడం, నీ టి పారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. న్యూస్రీల్ సదర్మట్ ఆయకట్టుకు అందని సాగునీరు నెర్రెలు బారుతున్న పొలాలు పట్టించుకోని ఇరిగేషన్ అధికారులుఈచిత్రంలో కనిపిస్తున్న రైతు కడెం మండలం కొత్తమద్దిపడగ గ్రామానికి చెందిన అంకంపేట భూమన్న. సదర్మట్ కాలువ ద్వారా సాగు నీరిస్తామని అధికారులు చెప్పడంతో యాసంగిలో ఎకరంనరలో వరి సాగు చేశాడు. నెల రోజులుగా సాగునీరు అందకపోవడంతో వ్యవసాయ బావి నుంచి కొంతమేర నీరు అందించాడు. ఇప్పుడు బావిలో నీళ్లు కూడా అడుగంటాయి. కాలువ నీళ్లు రాక, బావిలో నీళ్లు లేక పంటపై ఆశలు వదులుకున్నాడు. ఇటీవలే గొర్రెలను మేపాడు. -
‘పది’ పరీక్షల్లో నూతన విధానం
లక్ష్మణచాంద: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం సమూల మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగానే మొదట ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని జీపీఏ(గ్రేడింగ్) విధానాన్ని రద్దుచేసి పూర్వ పద్ధతిలో మార్కులు విధానం అమల్లోకి తెచ్చింది. మరోవైపు పరీక్షల జవాబు పత్రాలను బుక్లెట్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో బుక్లెట్లో 24 పేజీలు ఉంటాయి. విద్యార్థులకు సరిపడా బుక్లెట్లు జిల్లాకు చేరుకుంటున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 9,127 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 24 పేజీల బుక్ లెట్.. ● గతంలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రం ఓఎంఆర్ షీట్తోపాటు జవాబులు రాసేందుకు నాలుగు పేజీల బుక్లెట్ ఇచ్చేవారు. అందులో రాయడం పూర్తి అయిన తర్వాత విద్యార్థుల అవసరం మేరకు అడిషనల్ షీట్లు ఇ చ్చేవారు. ఈసారి అడిషనల్ షీట్స్కు బదులు గా 24 పేజీలతో కూడిన బుక్ లేట్ను విద్యార్థులకు అందజేయనున్నారు. సమాధానాలన్నీ ఆ బుక్లెట్లోనే రాయాల్సి ఉంటుంది. జిల్లాలో మూడు చోట్ల... పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సందర్భంగా అందజేసే 24 పేజీలు కలిగిన బుక్లెట్లు జిల్లా కేంద్రాలకు చేరుకుంటున్నాయి. వీటిని భద్రపరిచేందుకు జిల్లాలో మూడు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. నిర్మల్, ఖానాపూర్, భైంసాలో మూడు రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ రిసీవింగ్ సెంటర్ల నుంచి ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్ బుక్లెట్లను పరీక్ష కేంద్రాలకు తరలించనున్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో సంస్కరణలు చేసింది. ఇందులో భాగంగానే గ్రేడింగ్ విధానాన్ని రద్దుచేసింది. అడిషనల్ షీట్స్కు బదులుగా 24 పేజీలతో కూడిన బుక్లెట్ అందజేస్తుంది. ప్రభుత్వ సూచనల మేరకు పరీక్షల నిర్వహణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. – రామారావు, డీఈవో అడిషనల్ పేపర్లకు బదులుగా 24 పేజీల బుక్లెట్ జిల్లాలో మూడు రిసీవింగ్ కేంద్రాల ఏర్పాటు జిల్లా సమాచారం... మొత్తం ఉన్నత పాఠశాలలు 235 మొత్తం పరీక్ష కేంద్రాలు 47 మొత్తం పది విద్యార్థులు 9127 -
ఆయిల్పామ్ రైతులు ఆందోళన చెందొద్దు
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయిల్పామ్ విస్తీర్ణ పథకంలో భాగంగా జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్పామ్ సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఆయిల్పామ్ రైతులను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. 2022–23లో 1,322 రైతులు 3,567 ఎకరాల్లో, 2023–24 లో 1,548 మంది రైతులు 3,498 ఏకరాల్లో, 2024–25లో 423 రైతులు 1,073 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేశారని వివరించారు. పంట వేసిన 36 నెలల తర్వాత గెలలు కోతకు వస్తాయని తెలిపారు. జూన్ నాటికి దాదాపు 3,500 ఎకరాల ఆయిల్పామ్ దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. మొదటి ఏడాది ఎకరాకు సరాసరి 2 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాకు అధికారికంగా ప్రీ యూనిక్ కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. పరిశ్రమ ఏర్పాటు ఆలస్యమైనా ఆయిల్ పామ్ పంటలోని ప్రతీ గెలను ప్రీ యూనిక్ కంపెనీ కొంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాలను జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మండలాల వారీగా ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ప్రీ యూనిక్ పరిశ్రమ పనులు సైతం వేగవంతం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
బాలాజీకి డాక్టరేట్
భైంసారూరల్: మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన కవి, రచయిత రెడ్ల బాలాజీకి ప్రముఖ కవి, రచయిత డాక్టర్ దూడపాక శ్రీధర్ డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాద్, రవీంద్ర భారతిలో శ్రీఆర్యాణి సకల కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఉగాది పురస్కారం, జాతీయ విశ్వశాంతి పురస్కారం, బంగారు పతాకం వంటి పురస్కారాలతోపాటు, డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ తరఫున బాలాజీకి ప్రతిష్టాత్మక పురస్కారాలు, డాక్టరేట్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీ ప్రియులు బాలాజీనిఅభినందించారు. -
సాగునీటి సమస్య తలెత్తొద్దు
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ● జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్మల్ఖిల్లా: యాసంగిలో పంటలకు సాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని సచివాలయం నుంచి యాసంగి పంటల సాగు, సాగునీటి వసతి, వసతి గృహాల తనిఖీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై సోమవారం సాయంత్రం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. యాసంగిలో సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్ష చేసి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాల వారీగా సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామ, మండలస్థాయి కార్యాలయాలలో మొదలుకొని, జిల్లాస్థాయి కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. యాసంగి పంటలకు సాగు నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బోరు బావుల ఆధారిత పంటలకు ఇబ్బంది కలుగకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 57 ప్రభుత్వ వసతి గృహాల్లో ఇప్పటికే అదనపు కలెక్టర్తో కలిసి తనిఖీ చేసినట్లు వెల్లడించారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించామన్నారు. వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించి వారానికి రెండుసార్లు విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. బాలశక్తి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవిలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 6305646600 ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు
8, 9 తరగతుల బాలికలకు నిర్మల్ రూరల్: బేటీ బచావో – బేటీ పడావో దశాబ్ది వేడుకల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతుల బాలికలకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో రామారా వు తెలిపారు. ఈనెల 4న పాఠశాలస్థాయిలో పోటీలు నిర్వహించి, ప్రథమ, ద్వితీయ స్థానంలో గెలు పొందిన బాలికలు 5న మండల స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనాలని సూచించారు. మండ ల స్థాయిలో ప్రథమ, ద్వితీయస్థానాలు పొందిన బాలికలు 6న ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గల గవర్నమెంట్ హైస్కూల్లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలన్నారు. విజేతలకు ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. వివరాలకు 9440069830 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
పెళ్లిబరాత్లో గొడవ..
● యువకుడి కణతలో కత్తిపోటునిర్మల్రూరల్: పెళ్లిబరాత్లో డ్యాన్స్ చేస్తుండగా జరిగిన గొడవ కత్తిపోటుకు దారితీసింది. ఈ ఘటన నిర్మల్రూరల్ మండలం రత్నాపూర్ కాలనీ తండాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఏఎస్పీ రాజేశ్మీనా సోమవారం రాత్రి వివరాలు వెల్లడించారు. మండలంలోని రత్నాపూర్ కాలనీ తండాలో ఆదివారం ఓ పెళ్లి జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బరాత్ జరుగుతుండగా, గ్రామానికి చెందిన మలావత్ రాజు, పక్క గ్రామం రత్నాపూర్కాండ్లీ నుంచి సులిగెల శ్రీకర్కూడా బరాత్కు వచ్చాడు. రాజు, శ్రీకర్ కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో మద్యం తాగి ఉన్న రాజు డ్యాన్స్ చేస్తూ శ్రీకర్పై పడ్డాడు. దీంతో ‘మద్యం తాగి ఎందుకు డాన్స్ చేస్తున్నావ్....? ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని గట్టిగా అరిచాడు. దీనిని అవమానంగా భావించిన రాజు అక్కడి నుండి వెళ్లిపోయాడు. బరాత్ పూర్తి అయిన తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో శ్రీకర్ తన స్నేహితులు కలిసి మోటార్ బైక్పై ఇంటికి వెళ్తుండగా.. మలావత్ రాజు అడ్డుకున్నాడు. జేబులో ఉన్న కత్తితో కణత భాగంలో పొడిచాడు. ఈ ఘటనలో శ్రీకర్ కన్ను, కుడిచెవి మధ్యభాగంలో ఇరుక్కుపోయింది. అతని స్నేహితులు వెంటనే బైక్పై జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజును సోమవారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్సై లింబాద్రి ఉన్నారు. -
కరీంనగర్ తరలిన ఉపాధ్యాయ సంఘాల నేతలు
నిర్మల్ఖిల్లా: కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్మల్ జిల్లాలో హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్ రోజునే ఉపాధ్యాయుల నిర్ణయం నిక్షిప్తమై ఉండగా, కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం కౌంటింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఆయా అభ్యర్థుల మద్దతుదారులు పలువురు కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. మరికొందరు టీవీల్లో అప్డేట్ తెలుసుకుంటున్నారు. బీజేపీ మద్దతుతో మల్క కొమరయ్య బరిలో ఉండగా, తపస్ మద్దతు ప్రకటించింది. మరోవైపు ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూటీఎస్ తరఫున బరిలో ఉన్న వంగా మహేందర్రెడ్డి సైతం గట్టి పోటీ ఇచ్చారు. జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు యాటకారి సాయన్న వీఆర్ఎస్ ప్రకటించి బీఎస్పీ మద్దతుతో పోటీలో నిలిచారు. జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు కరీంనగర్లోని కౌటింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో అప్డేట్ సమాచారం చేరవేస్తున్నారు. -
నిర్మల్
‘టీచర్’లో కమలం పాగా వ్యవసాయంలో ఆదర్శం తానూరు మండలం బోంద్రట్కు చెందిన సాయినాథ్ గోఆధారిత, సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. ఉత్తమ రైతు పురస్కారం కూడా అందుకున్నాడు.మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి ● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ నిర్మల్ఖిల్లా: బాలికలు అన్నిరంగాలలో రాణించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని స్థానికల సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ అన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమ ఆవశ్యకత తెలియజేసేందుకు జిల్లాలోని పలువురు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులతో సోమవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పరిపాలన విధానం, భవిష్యత్ ప్రణాళిక, మహిళా సాధికారత, బేటీ బచావో బేటీ పడావో ప్రాముఖ్యత తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు నాగలక్ష్మి, సవిత, మిషన్ శక్తిబృందం సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు. నిర్మల్/నిర్మల్రూరల్: కొన్ని నెలలుగా జిల్లా విద్యాశాఖ ఏదో ఒకరకంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. అక్రమ డిప్యూటేషన్లు, బదిలీల్లో చేతివాటం, యూబిట్ కాయిన్దందాలో టీచర్ల అరెస్టులు, విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఇలా వరుస ఘటనలతో ఆ శాఖ పేరు మసకబారుతోంది. పలు ఆరోపణల నేపథ్యంలో గతంలో పనిచేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులు మారారు. ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చినా జిల్లాలో జాయిన్ కాలేదు. తాజాగా విద్యాశాఖపై బయట నుంచి ఆరోపణలు కాకుండా అంతర్గతంగానే ఉన్నతాధికారికి, కార్యాలయ ఉద్యోగుల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. చివరకు తమ ఉన్నతాధికారిపై కలెక్టర్కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. వరుసగా రెండుసార్లు రాష్ట్రంలోనే టెన్త్ ఫలితాల్లో ప్రథమస్థానంలో నిలిచిన జిల్లాలో పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిణామం కలవరపెడుతోంది. అధికారి తీరుపై నిరసన.. విద్యాశాఖలో కొన్నినెలలుగా కోల్డ్వార్ కొనసాగుతోంది. రోజురోజుకూ ఉన్నతాధికారి తీరు మారుతోందని, తమపై అనవసర ఒత్తిడి పెంచుతున్నారన్నది ఉద్యోగుల ఆరోపణ. ఇదేక్రమంలో జిల్లా కా ర్యాలయంలో ఒత్తిడి భరించలేకనే ఓ అధికారి వేరే జిల్లాకు బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. మరో అధికారి కూడా రెండు మూడు నెలల్లోనే జిల్లా నుంచి బదిలీ చేయించుకుంటానని చెబుతుండటం గమనార్హం. తమ పనితీరు బాగా లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా వేధించడం సరికాదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. డీఈవో తీరుతో విసిగి వేసారిన విద్యాశాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగులంతా ఏకమై ఇటీవల కలెక్టర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రథమం.. ‘పది’లమేనా..! చదువులతల్లి సరస్వతీమాత కొలువైన జిల్లా విద్యారంగంలోనూ ఇప్పుడిప్పుడే ముందడుగేస్తోంది. రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ ఏడాది కూడా ఫస్ట్ రావాలని, హ్యాట్రిక్ సాధించాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా కలెక్టర్ సహా సంబంధిత అధికారులు విద్యాశాఖపై దృష్టిపెడుతున్నారు. వరుసగా తనిఖీలు చేస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. మరో 17 రోజుల్లోనే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి తరుణంలో జిల్లా విద్యాశాఖలో ముసలం మొదలవడం కలవరపెడుతోంది. ఈ ప్రభావం పదోతరగతి పరీక్షలపై పడితే స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూస్రీల్వరుసగా మరకలు..జిల్లా విద్యాశాఖపై వరుసగా మరకలు పడుతూనే ఉన్నాయి. జిల్లా ఏర్పడిన మొదట్లో డీఈవోను ఖాతరు చేయకుండా కొంతమంది అధికారులు, ఉద్యోగులు వ్యవహరించిన తీరు అప్పట్లో ఫిర్యాదుల వరకూ వెళ్లింది. చివరకు డీఈవో బదిలీ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన డీఈవో హయాంలోనే జిల్లా వరుసగా రెండుసార్లు పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కానీ సదరు విద్యాశాఖ అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 317 జీవో, టీచర్ల బదిలీలు, డిప్యూటేషన్లు, పదోన్నతులు, డీఎస్సీ పోస్టింగుల్లో ఆరోపణలు వచ్చాయి. ఆయన హయాంలోనే యూబిట్కాయిన్ దందాలో వందలమంది ఉపాధ్యాయులు కూరుకుపోయారు. ఏకంగా పలువురు జైలుకు వెళ్లడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఈ దందాలో పలువురు ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లడంలో డీఈవో తీరూ వివాదాస్పదమైంది. చివరకు ఆయన కూడా బదిలీ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరికీ పోస్టింగ్ ఇచ్చినా జిల్లాలో జాయిన్ కాలేదు. ఇటీవల జిల్లాలో విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపుల ఘటనలు, సంబంధిత అధికారులు స్పందించిన తీరు విద్యాశాఖకు మాయనిమచ్చను తెచ్చాయి. తాజాగా విద్యాశాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగులే తమ పైఅధికారిపై ఆరోపణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా వేధింపులు ఒత్తిడి భరించలేక ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వేధింపులు మరింత పెరిగినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. డీఈవో వర్సెస్ ఉద్యోగులు ఉన్నతాధికారి తీరుపై నిరసన లిఖితపూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు పరీక్షలవేళ ఇదేం పరేషాన్..!? -
● తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓట్ల వడబోత ● నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు ● మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు ● మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ● ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం కమలం వశమైంది. ముందు నుంచీ అనుకున్నట్లుగా మల్క కొమురయ్య ఆ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. తొలిప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. ఓట్ల లెక్కింపు సోమవారం సాయంత్రానికి ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే ఫలితం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చనీయాంశంగా మారింది. ‘బండి’ అభినందనలు రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు..’ అని అన్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ వడబోత.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వ డపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంట లకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చె ల్లిన ఓట్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎ లాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్ర చారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.50 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్న ం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యతలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఆర్వో, సిబ్బందిపై మండిపాటు గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధిస్తాం
● ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచుతాం ● పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ● ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఐఈవో నిర్మల్ రూరల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని డీఐఈవో పరశురాం పేర్కొన్నారు. ఈ నెల 5నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సాక్షి: ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? డీఐఈవో: ఉత్తీర్ణత శాతం పెరుగుదలకు 90రోజుల ప్రణాళికను ఫిబ్రవరి 20 వరకు అమలు చేశాం. అధ్యాపకులు ప్రతీరోజు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు బోధించారు. వెనుకబడిన, గైర్హాజరైన విద్యార్థులపై దృష్టి సారించారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రతీరోజు హాజరయ్యేలా చూశారు. దసరా సెలవుల తర్వాత సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు ప్రత్యేక అధ్యయన తరగతులు, పునఃశ్చరణ, స్లిప్ టెస్ట్లు కూడా నిర్వహించారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నాం. సాక్షి: జిల్లాలో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య ఎంత? డీఐఈవో: జిల్లాలో మొత్తం 23 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశాం. 13,133 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,571 మంది ఫస్టియర్ విద్యార్థులు కాగా, 6,562 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ఫస్టియర్ ఒకేషనల్లో 1,088, సెకండియర్లో 945 మంది విద్యార్థులున్నారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలుంటాయి. సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు? డీఐఈవో: పరీక్షల నిర్వహణకు 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 23 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ప్రతీ 40 మంది వి ద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్తోపాటు ఫ్ల యింగ్ స్క్వాడ్ టీంను నియమించాం. ఈ టీంలో ఒక డిప్యూటీ తహసీల్దార్, ఎస్సై, ఏఎస్సై, సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉంటారు. సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టారు? డీఐఈవో: పరీక్షలు సజావుగా నిర్వహించేందు కు ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శా ఖల అధికారులతో సమీక్ష నిర్వహించాం. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అ ధ్యాపకులతో పరీక్షలకు విద్యార్థులను స న్నద్ధం చేయడంపై సమీక్ష నిర్వహించాం. పరీక్షల కమిటీని నియమించాం. ప్రతీ పరీక్షాకేంద్రంలో మూడు నుంచి నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. విద్య, పోలీస్, ఆరోగ్యశాఖల అధికారుల సహకారం తీసుకుంటున్నాం. సాక్షి: విద్యార్థుల ప్రగతిని ఎలా అంచనా వేస్తున్నారు? డీఐఈవో: ఈ విద్యా సంవత్సరంలో నాలుగు యూనిట్, అర్ధ వార్షిక, రెండు ప్రీఫైనల్ ప రీక్షలు నిర్వహించాం. ఇటీవల ప్రాక్టికల్ ప రీక్షలు కూడా పూర్తయ్యాయి. పరీక్షలకు విద్యార్థులంతా హాజరయ్యేలా చూశాం. స మాధాన పత్రాలను ఎప్పటికప్పుడు మూ ల్యాంకనం చేశాం. పరీక్షా ఫలితాలను సమీక్షించి విద్యార్థులకు తగిన సూచనలు చేశాం. ఈ విధానంతో జిల్లాలో ఈసారి ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మరింత మెరుగవుతుందని ఆశిస్తున్నాం. -
● ‘ప్రాధాన్యత’ దక్కేదెవరికో? ● నేడు ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు ● కరీంనగర్లో కౌంటింగ్ ● ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ ● విజయంపై ప్రధాన పార్టీల ధీమా
కై లాస్నగర్: శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో షురూ కానుంది. కరీంనగ ర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సోమ వారం నిర్వహించే మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలుపెవరిదో అనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బరిలో నిలిచినా ప్రధాన పోటీ మా త్రం బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే ఉంటుందని తెలుస్తోంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితం తొలుత వెల్లడి కానుండగా పట్టభద్రుల కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశముంది. తొలి ఫలితం టీచర్స్ ఎమ్మెల్సీదే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ తరఫున మల్క కొ మురయ్య బరిలో నిలువగా, ఉపాధ్యాయ సంఘాల్లో ప్రధానమైన పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, టీఎస్యూటీఎఫ్ పక్షాన అశోక్కుమార్ బరిలో నిలిచారు. ఇతర అభ్యర్థులు వివిధ సంఘాల మద్దతుతో బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే పీఆర్టీయూ మద్దతుదారులే విజయం సాధించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం అవుతుందా.. లేక రాజకీయంగా ఉత్సాహంగా ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తాడా.. లేదంటే అశోక్ కుమార్ గెలుస్తాడా? అనే దానిపైనా ప్రధాన చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే ఈ ఎన్నికను ఆయా ఉపాధ్యాయ సంఘాలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఉపాధ్యాయ ఓటర్లను కలుస్తూ మద్దతు కోరడంతో పాటు విందులు కూడా ఏర్పాటు చేశాయి. పోలింగ్ సరళి సాగిన తీరుపై ఆయా సంఘాలు తమ అభ్యర్థి గెలుపుపై పక్కా లెక్కలు వేసుకుంటున్నాయి. పట్టభద్రులతో పోల్చితే ఓటర్లు తక్కువగా ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితమే ముందుగా వచ్చే అవకాశముంది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెల్లడవుతుందా? లేదా రెండో ప్రాధాన్యత ఓట్లు అనివార్యం కానున్నాయా? అనేది మరికాసేపట్లో తేలనుంది. మొత్తానికి అటు పట్టభద్రులు, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై అన్నివర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం ఆసక్తి రేపుతోంది. లెక్కింపు గణాంకాలు పట్టభద్రుల నియోజకవర్గంలో.. బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 మొత్తం ఓట్లు : 3,55,109 పోలైన ఓట్లు : 2,50,328పోలింగ్ శాతం : 70.48 టీచర్స్ నియోజకవర్గంలో.. బరిలో నిలిచిన అభ్యర్థులు : 15మొత్తం ఓట్లు : 27,088 పోలైన ఓట్లు : 24,968పోలింగ్శాతం : 92.17 మాక్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్– మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. వేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్ మొత్తం టేబుళ్లు: 35 పట్టభద్రుల టేబుళ్లు : 21 టీచర్ల టేబుళ్లు : 14 లెక్కింపు సిబ్బంది: 800రిజర్వ్ స్టాఫ్: 20 శాతం -
ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది పోటీ పడ్డారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వూట్కూరి నరేందర్రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రుల్లో గట్టి పోటీనిచ్చే వారు లేకపోవడంతో పట్టభద్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే మద్దతునిచ్చినట్లుగా పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తమదే ఆధిక్యత ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బరిలో లేకున్నా బీఎస్పీ నుంచి పోటీ చేసిన హరికృష్ణకు అంతర్గతంగా మద్దతునిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో తొలి ప్రాధాన్యత ఎవరికి దక్కనుందో అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయా పార్టీలతో పాటు ఓటర్లు కూడా తమ మద్దతుదారుల గెలుపునకున్న అవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలుతుందా? లేదా రెండో ప్రాధాన్యత అవసరం ఉంటుందా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
డీటీఎఫ్ నూతన కార్యవర్గం
నిర్మల్ రూరల్: డీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా చంద్ర నాగకాంత్, ఉపాధ్యక్షులుగా రమేశ్, శకుంత ల, ప్రధాన కార్యదర్శులుగా మహేంద్రాచారి, గొలుసుల నర్సయ్య, శ్రీనివాస్, దుర్గం సుగుణాకర్, రాష్ట్ర కౌన్సిలర్గా దేశ్పాండే మధుసూదన్, ఆడిట్ కమిటీ కన్వీనర్గా దళితానంద్, సభ్యులుగా దత్తాద్రి, లాలు ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని వారంతా హామీ ఇచ్చారు. -
నిర్మల్
ఔట్ సోర్సింగ్ గందరగోళం ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ల నియామకంపై గందరగోళం నెలకొంది. అధికారిక ప్రకటన జా రీ కాకున్నా ఔట్ సోర్సింగ్ సంస్థలు పోస్టుల భర్తీకి అత్యుత్సాహం చూపాయి.సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 20258లోఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించా రు. పోలీస్ అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాంనిరంజన్రావు, శేఖర్, రమేశ్, రామకృష్ణ, ఆర్ఎస్సైలు వినోద్, రవి, సిబ్బంది పాల్గొన్నారు. భైంసాటౌన్: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని వేలం వేసిన అధికారులు దక్కించుకున్న వ్యక్తి నుంచి గడువులోపు డబ్బులు రాబట్టడంలో విఫలమయ్యారు. సదరు వ్యక్తి పన్నాగాన్ని పసిగట్టలేక పోతున్న అధికారుల తీరుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి లారీలో పీడీఎస్ బియ్యం తరలిస్తూ భైంసా పట్టణంలో కారును ఢీకొన్న ప్రమాదంలో పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక దృష్టి సారించి అక్రమదందా గుట్టురట్టు చేశారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన ఓ వ్యాపారి జిల్లా నుంచి పీడీఎస్ బియ్యం సేకరించి తిరిగి జిల్లాకే తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ధర్మాబాద్లోని అతడి స్థావరంపై దాడి చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు కూడా నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న 360 క్వింటాళ్ల బియ్యానికి రెవెన్యూ అధికారులు ఇటీవల బహిరంగ వేలం నిర్వహించారు. ధర్మాబాద్కే చెందిన ఓ వ్యక్తి క్వింటాల్కు రూ.3,100 చొప్పున బియ్యం దక్కించుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వేలంలో దక్కి ంచుకున్న బియ్యానికి సంబంధించి ఈనెల 24లోపు రూ.11.16లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ, సదరు వ్యక్తి ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా తాత్సా రం చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులు అడిగితే రేపు, మాపంటూ జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. ఆంతర్యమేమిటంటే..? మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా పీడీఎస్ బి య్యం అక్రమదందా యథేచ్ఛగా సాగిస్తున్నాడు. జిల్లా నుంచి ఏజెంట్ల ద్వారా బియ్యం సేకరించి తిరి గి లారీల్లో జిల్లాలోని రైస్మిల్లులు, ఇతరులకు పంపుతున్నాడు. ఈ దందాలో ఆరితేరిన సదరు వ్యక్తి రూ.కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. గతంలో భైంసా మండలంలోని దేగాంలోనూ ఇతనికి చెందిన పీడీఎస్ బియ్యం దాదాపు 270 క్వింటాళ్లు పట్టుబడగా, అప్పుడు కూడా పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్లో భద్రపరిచారు. కానీ, కొద్దిరోజులకే బియ్యం రిలీజ్ చేయించుకున్నాడు. ఈసారి కూడా ఆ పద్ధతిలోనే బియ్యం రిలీజ్ చేయించుకునేందుకు యత్నించినట్లు తెలిసింది. కాగా, రెవెన్యూ అధికారులు బహిరంగ వేలం నిర్వహించడంతో అ తడి పన్నాగం ఫలించలేదు. అయినా, బియ్యం ద క్కించుకునేందుకు ధర్మాబాద్కు చెందిన అతని వ్యక్తినే వేలంలోకి దింపినట్లు తెలిసింది. కాగా, వే లానికి ఒకరోజు ముందు ప్రభుత్వ ధరను క్వింటాల్ కు రూ.2,100కు నిర్ణయించేలా సదరు వ్యాపారి ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఇందుకుగాను పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులతోనూ రెవె న్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. వా రు ససేమిరా అనడంతో కిలోకు రూ.25 నుంచి వేల ం ప్రారంభించారు. పోటీగా మరో ఇద్దరు పాల్గొనడంతో రూ.31కి కిలో చొప్పున దక్కించుకున్నాడు. కానీ, గడువులోపు డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగిన చర్యలు తీసుకుంటాం అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఫిబ్రవరి 22న వేలం నిర్వహించాం. ధర్మాబాద్కు చెందిన వ్యక్తి కిలోకు రూ.31 చొప్పున రూ.11.16లక్షలకు దక్కించుకున్నాడు. అదే నెల 24లోపు చెల్లించాలని గడువు విధించినా ఇప్పటివరకు చెల్లించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్కుమార్, తహసీల్దార్, భైంసా న్యూస్రీల్ పట్టుకున్న పీడీఎస్ రైస్కు వేలం 360 క్వింటాళ్లకు రూ.11.16 లక్షలు దక్కించుకున్న మహారాష్ట్ర వ్యక్తి పైకం చెల్లించడంలో తాత్సారం అధికారుల తీరుపై అనుమానం! తక్కువ ధరకు కొట్టేసే యత్నం వేలంలో బియ్యం దక్కించుకున్న వ్యాపారి ఏజెంట్ల ద్వారా కిలోకు రూ.25 నుంచి రూ.27వరకు సేకరిస్తుంటాడు. కానీ, గిట్టుబాటు కాకున్నా వేలంలో రూ.31కి దక్కించుకోవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో మాదిరి బియ్యం రిలీజ్ చేయించుకునేందుకు తెరవెనుక యత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవున్నాయి. జాప్యం చేయడం ద్వారా ఎలాగైనా బియ్యాన్ని తక్కువ ధరకు దక్కించుకోవడం లేదా రిలీజ్ చేయించుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సంబంధిత అధికారులు ప్రస్తుత వేలానికి సంబంధించిన డబ్బులు త్వరగా వసూలు చేయాలి. లేదా మరోసారి వేలం నిర్వహించి వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో సదరు వ్యాపారి ఎత్తుగడ ఫలించి బియ్యం గతంలోలాగా చేజిక్కుంచుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
గల్ఫ్ మృతుల కుటుంబాలకు బాసట
● రూ.5లక్షల చొప్పున పరిహారం ● మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు నిర్మల్ఖిల్లా: రెక్కాడితే గాని డొక్కాడని దిగువ మధ్యతరగతి కార్మికులు ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. అనుకోని ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో పలువురు అక్కడ మృతి చెందితే వారి మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు నెలల తరబడి వేచి చూస్తున్న ఘటనలనేకం. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి మత్యువాత పడుతున్న వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో గల్ఫ్ మృతుడి కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారం ఇచ్చేందుకు గతంలోనే ఉత్తర్వులిచ్చింది. ఇటీవల నిధులు విడుదల చేసింది. నిర్మల్ జిల్లాకు రూ.25లక్షలు, మంచిర్యాల జిల్లాకు రూ.15లక్షల నిధులు మంజూరు చేసింది. జిల్లాలో గల్ఫ్ గాయాలెన్నో.. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వివిధ కారణాలతో పలువురు మృతి చెందగా బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాయి. వారి కష్టాల గురించి ‘సాక్షి’లో ఎన్నో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక జీవో 205 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్–2003 నుంచి ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన వారి కుటుంబానికి రూ.5లక్షలు అందించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో దాదాపు 60 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నట్లు గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. కాగా, ఏటా పదుల సంఖ్యలో వివిధ కారణాలతో మృత్యువాత పడుతున్నారు. ‘ప్రవాసీ ప్రజావాణి’లో వినతులు హైదరాబాద్లోని ప్రజాభవన్లో గల్ఫ్తో పాటు ఇతర దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దీనిని నిర్వహిస్తున్నారు. దీనిని ప్రారంభించిన మొదటిరోజే జిల్లా నుంచి మృతుల కుటుంబసభ్యులు పలువురు వినతిపత్రాలు అందించారు. గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో 205కు కొనసాగింపుగా, సాధారణ పరిపాలన శాఖలోని ప్రవాస భారతీయుల (జీఏడీ–ఎన్నారై) విభాగం పక్షాన ప్రవాసీ ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఎక్స్గ్రేషియా నిధుల విడుదల 2023 డిసెంబర్ 7నుంచి ఇప్పటివరకు గల్ఫ్దేశాల్లో 200 మందికి పైగా తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రే వంత్రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం ఈనెల 1న 113 కుటుంబాలకు రూ.5.65కోట్లు వివిధ జి ల్లాలకు విడుదల చేసింది. ఇందులో నిర్మల్ జిల్లాకు రూ.25లక్షలు, మంచిర్యాల జిల్లాకు రూ.15లక్షలు కేటాయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక ఆదేశాల ద్వారా త్వరగా పరిహారాన్ని బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. గల్ఫ్ మృతుల సంఖ్య ప్రకారం అన్ని జిల్లాలకు విడతలవారీగా మరిన్ని నిధులు కేటాయించనున్నారు. బాధిత కుటుంబాలకు భరోసా ఉపాధి కోసం ఎడారి దేశాల బాట పడుతున్న కార్మికులెందరో విగత జీవులుగా స్వస్థలాలకు వస్తున్న దయనీయ దృశ్యాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తరచూ కనిపిస్తాయి. కొన్నిసార్లు మృతదేహాల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న ఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసానిస్తోంది. విడతల వారీగా జిల్లాలోని బాధిత కు టుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తోంది. – స్వదేశ్ పరికిపండ్ల, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర కార్మికసంఘం -
పునరావాస కల్పనలో విఫలం
కడెం: పులుల సంరక్షణ పేరిట అమాయక గిరిజన కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు ఆరోపించారు. మండలంలోని కొత్త మద్దిపడగ సమీపంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాన్ని ఆదివారం మా నవ హక్కుల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో సందర్శించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతీ కుటుంబానికి ఐదెకరాలిస్తామని రెండెకరాల అటవీ భూమి ఇచ్చారని, డబుల్ బెడ్రూంలు నిర్మించినా నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. గ్రా మస్తులు ఇక్కడికి వచ్చిన నుంచి ఎలాంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అటవీ హక్కుల రక్షణ చట్టం ప్రకారం అడవిలో నివసిస్తు న్న మానవులను మనుషులుగా గుర్తించాలని కోరా రు. అటవీ హక్కుల చట్టం 2006లో ఉన్న అంశాలనూ అధికారులు ధిక్కరించారని ఆరోపించారు. చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వేదిక కా ర్యవర్గ సభ్యులు రఘోత్తమ్రెడ్డి, ప్రజ్ఞశీల్, అతిశ్కుమార్, గోపీనాథ్, సోన్ కాంబ్లే తదితరులున్నారు. -
బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి
● పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ నిర్మల్ రూరల్: రాష్ట్రంలో వెంటిలేషన్పై ఉన్న విద్యారంగాన్ని కాపాడేందుకు రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగం నిధుల కొరతతో మౌలిక వసతులు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయాలంటే 15 శాతం నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం హామీలు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రతీ విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట రాజ్, నరేశ్, నవీన్, లోకేశ్ తదితరులు ఉన్నారు. మాట్లాడుతున్న వెంకటేశ్ -
నిర్మల్ లయన్స్ క్లబ్కు పురస్కారాలు
నిర్మల్ఖిల్లా: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ కాన్ఫరెన్స్లో నిర్మల్ లయన్స్ క్లబ్కు పలు పురస్కారాలు దక్కాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రాంతీయస్థాయి కాన్ఫరెన్స్లో లయన్స్ క్లబ్ వివిధ రంగాల్లో చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా పురస్కారాలు ప్రదానం చేసినట్లు నిర్మల్ అధ్యక్షుడు కె.చంద్రమోహన్రెడ్డి తెలిపారు. ఉత్తమ సామాజిక సేవా కార్యక్రమాల విభాగంలో క్లబ్ కేటగిరీలో ఎక్సెలెంట్ క్లబ్ అవార్డుతోపాటు మూడు పురస్కారాలు.. వ్యక్తిగత విభాగంలో ఐదు పురస్కారాలు అందించారు.. పురస్కారాలు స్వీకరించిన వారిలో కె.చంద్రమోహన్రెడ్డి(ఉత్తమ అధ్యక్షుడు), శ్రీనివాస్యాదవ్(ఉత్తమ కార్యదర్శి), లక్ష్మీనారాయణగౌడ్(ఉత్తమ కోశాధికారి), వట్టిమల్ల నరసయ్య(రీజియన్ సెక్రెటరీ), లక్కడి రాజేశ్వర్రెడ్డి(జోన్ చైర్మన్) తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ డీకే.రాజేశ్ శాలువా, మెమొంటోలతో సత్కరించారు. నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలోని పలు గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
బీపీ : 79,199 మంది షుగర్ : 37, 902 మంది
జిల్లాలో..వయస్సులవారీగా బీపీ వ్యాధిగ్రస్తులు: 30 నుంచి 40 15,729 40 నుంచి 50 36,750 50 ఏళ్లు దాటినవారు 26,716 వయస్సులవారీగా షుగర్ వ్యాధిగ్రస్తులు.. 30 నుంచి 40 ఏళ్లు 10,450 40 నుంచి 50 ఏళ్లు 17,550 50 ఏళ్లు దాటినవారు 9,902పట్టణ ప్రాంతాల్లోనే అధికం.. గత ఐదేళ్లలో బీపీ, షుగర్ బారిన పడిన వారిలో 40 శాతం వరకు యువతే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా మధుమేహం, రక్తపోటు బారినపడుతున్నట్లుగా గుర్తించారు. నిర్మల్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 8,386 మంది బీపీ, 4,575 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. -
‘సదరం’.. సరళతరం
వాతావరణం ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం కూడా తగ్గుతుంది. ● దివ్యాంగులకు ప్రత్యేకంగా యూడీఐడీ పోర్టల్ ● సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్.. ● కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్మల్ఖిల్లా: ప్రత్యేక వైకల్యగుర్తింపు (సదరం)కార్డు కోసం యూడీఐడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, వీఎల్ఈ కేంద్రాలను ఆశ్రయించేవారని, ఇప్పుడు వీటితోపాటు యూడీఐడీ పోర్టల్, సొంత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. క్యాంపుల వివరాలు కూడా మెసేజ్ల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియను ఈనెల నుంచే అమల్లోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. 21 రకాల వైకల్యం కలిగిన వారు యూడీఐడీ(యూనిక్ డిజేబిలిటీ ఐడీ) కార్డును పొందవచ్చని తెలిపారు. ఇదివరకే సదరం ధ్రువీకరణ పత్రం ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా అందుతున్న పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ప్లాంట్ల ఏర్పాటు.. పీఎం కుసుం ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు గ్రామీణ మహిళా సంఘాలను ప్రోత్సహించాలని దివ్య దేవరాజన్ సూచించారు. ఆసక్తి, అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అనువైన స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో విజయలక్ష్మి, ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షల్లో పొరపాట్లు జరగొద్దు
● డీఈవో రామారావునిర్మల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో పొరపాట్లు జరగకుండా చూడాలని డీఈవో రామారావు సూచించారు. కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సీఎస్, డీవోలతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈ వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ప్రకారం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రంలో వసతులు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని తెలిపా రు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు నిషేధమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రశ్న పత్రాలు తీసుకురావడం, జవాబు పత్రాలు తరలింపు జాగ్రత్తగా పోలీస్ సమక్షంలో జరగాలని సూచించారు. మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ జరగకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పద్మ మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి కొత్తగా 24 పేజీల జవాబు పత్రాల బుక్లెట్ ఇస్తామన్నారు. వెంకటరమణ, సమన్వయకర్త ప్రవీణ్కుమార్, డీసీఈబీ సహాయ కార్యదర్శి భానుమూర్తి, అధికారులు పాల్గొన్నారు. -
ఎరువు.. కరువు!
లింకులతో ఇక్కట్లు.. యూరియ కోసం గ్రోమోర్ ఫర్టిలైజర్తోపాటు, ప్రైౖవేట్ డీలర్ల వద్దకు వెళ్తే వారుగంట గుళికలు, పొటాషియం కొనుగోలు చేయాలని లింకు పెడుతున్నారు. ఫిబ్రవరి 18న ఖానాపూర్ పట్టణంలోని గోమ్రోర్ సెంటర్కు వెళ్లిన రైతులకు బలవంతంగా ఇతర ఎరువులు అంటగట్టే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఖానాపూర్: జిల్లాలో యాసంగి పంటలకు యూరియా దొరకడం లేదు. ప్రస్తుతం జిల్లాలో వరి, మొక్కజొన్న పంటల్లో కలుపుతీత పనులు చేపడుతున్నారు. కలుపు తీసిన వెంటనే పంటలకు యూరియా వేయాలి. దీంతో రైతులు యూరియా కోసం సొసైటీలకు పరుగులు పెడుతున్నారు. జిల్లా అంతా ఒకేసారి యూరియా కోసం వస్తుండడంతో సొసైటీలకు వస్తున్న ఎరువు చాలడం లేదు. అదనుకు యూరియా వేయకుంటే పంట ఎదగక నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్, లోకేశ్వరం తదితర మండలాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. రైతులు పీఏసీఎస్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో పంటల సాగు వివరాలు.. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 1.10 లక్షల ఎకరాల్లో వరి, 1,02 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో జొన్న, 55 వేల ఎకరాల్లో శనగ పంటలు సాగు చేశారు. యాసంగి పంటలకు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. అయినా రైతుల ఇంకా యూరియా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు మరో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు సరఫరా అవుతోంది. రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయడంతోపాటు సాగు చేసిన పంటలకు సైతం ఎక్కువగా వినియోగించడంతోనే కొరత ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మూడు రోజులుగా తిప్పలు.. ఖానాపూర్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం ఖానాపూర్, పెంబి మండలాలకు చెందిన రైతులు మూడు రోజులుగా వేకువ జామునే పీఏసీఎస్ల ఎదుట బారుతులు తీరుతున్నారు. కొద్ది రోజులుగా కార్యాలయాలు, దుకాణాల చుట్టూ తిరిగినా యూరియా దొరకకపోవడంతో వెనుదిరుగుతున్నారు. తప్పని అగచాట్లు.. వారం రోజులుగా ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. శుక్ర, శనివారాల్లో వేకువ జామున 4 నుంచి 5 గంటల ప్రాంతంలో కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద వరుసలో చెప్పులు పెట్టి కాలకృత్యాలు, టీ, టిఫిన్ లేకుండా పడిగాపులు కాస్తే తప్ప యూరియా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంటలకు యూరియా అవసరమని, అదనుకు అందకుంటే పంటలు ఎదగక నష్టపోతామని పేర్కొంటున్నారు. ఖానాపూర్ పీఏసీఎస్ ఎదుట వరుసలో చెప్పులతో పడిగాపులు కాస్తున్న రైతులు జిల్లాలో యూరియా కొరత అదనుకు అందక రైతుల ఆందోళన సొసైటీల వద్ద అన్నదాతల బారులుకొరత లేకుండా చూస్తున్నాం జిల్లాకు ఈ యాసంగిలో గత ఏడాదికంటే ఎక్కువగా యూరియా తెప్పించాం. జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదు. రైతులు ఆందోళన చెందవద్దు. మరో 4 రోజుల్లో 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. రైతులు యూరియా వినియోగంపై స్థానిక వ్యవసాయ అధికారులు సలహాలు తీసుకుంటే పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అవసరానికి మించి వాడిడం అనర్థమే. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి -
నిర్మల్
లెక్కింపు పెద్ద కథే..! పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 3న కరీంనగర్లో జరగనుంది. ఫలితం తేలేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20258లోu బాలుర వసతి గృహం తనిఖీ నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ బాలుర వసతి గృహాన్ని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జాదవ్ అంబాజీ శనివారం తనిఖీ చేశారు. హాస్టల్లో సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల విద్యార్థులకు చికున్ పాక్స్ సోకడంతో వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రమోద్చంద్రారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ రాజశేఖర్రెడ్డి, సూపరింటెండెంట్ హేమ, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ దుర్గాభవాని, హెచ్ఎం ముత్యం పాల్గొన్నారు. సైవేని(40) అనే మహిళ కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పి, మైకం, వికారం వంటి లక్షణాలతో బాధపడుతుంది. ఎన్సీడీ సర్వేలో ఈమెకు పరీక్షలు నిర్వహించగా అధిక రక్తపోటు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ముందస్తుగా వ్యాధిని గుర్తించడంతో ఆమె మందులు వాడి ప్రస్తుతం రక్తపోటును అదుపులో ఉంచుకుంది. జీవన శైలిలో మార్పు రావాలి.. ప్రస్తుతం 30 ఏళ్లకే బీపీ, షుగర్ వస్తోంది. జీవన శైలిలో స్వల్ప మార్పులతోనే వీటిని అరికట్టవచ్చు. యువత జంక్ ఫుడ్కు అలవాటు పడడం, వాకింగ్ చేయకపోవడంతో ఈ వ్యాధులు వస్తున్నాయి. ఆహారంలో ఉప్పు చాలా మేరకు తగ్గించి ఒత్తిడి లేకుండా జీవించాలి. నిర్ణీత సమయంలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. – డాక్టర్ శ్రీనివాస్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి వ్యాయామం లేకనే.. ఒత్తిడి కారణంగా ఈ జబ్బులొస్తున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారం తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే వారిని క్రీడలవైపు మళ్లించాలి. పెద్దవారు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – డాక్టర్ రత్నాకర్, ఫిజీషియన్ జిల్లా కేంద్రానికి చెందిన జమున(35) అనే మహిళకు కొద్ది రోజులుగా అధిక దాహం, అధిక మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ద్వారా చేపట్టిన ఎన్సీడీ సర్వేలో వైద్య సిబ్బంది ఆమెకు పరీక్షలు చేశారు. ఇందులో జమునకు షుగర్ నిర్ధారణ అయింది. దీంతో వైద్య సిబ్బంది ఆమెకు మందులు అందజేసి వ్యాధి అదుపులో ఉండేందుకు సూచనలు చేశారు. ఈ రోజుల్లో ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పోషకాలున్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇక ఉరకలేస్తున్న యువత ఉడుకు నెత్తురులోకి బీపీ, షుగర్ ప్రవేశిస్తున్నాయి. గుట్టుగా ఒంట్లోకి జొరబడి.. మెల్లగా ఆరోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. వృద్ధాప్యంలో రావాల్సిన ఈ జబ్బులు.. 30 ఏళ్లు దాటగానే బయటపడడం కలవరపెడుతోంది నిర్మల్చైన్గేట్: జిల్లాలో 30 ఏళ్లు దాటిన వారు వ్యాధులబారిన పడుతున్నారు. రక్తపోటు, మధుమేహం సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ రెండు వ్యాధులు వారిని ఆస్పత్రులపాలు చేస్తున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీస్(ఎన్సీడీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలుచేస్తూ బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వైద్యంతోపాటు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్లో 79,199 మందికి బీపీ, 37, 902 మంది షుగర్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్సీడీ కార్నర్లు, క్లినిక్ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. అదేస్థాయిలో చికిత్స కూడా అందుతోంది. వంశపారపర్యంగానూ.. డయాబెటిస్ ఎక్కువగా వంశపార్యపరంగా, వయస్సు పెరిగే కొద్దీ వస్తోంది. దీంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉండటం వల్ల పాంక్రియాటిక్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి ఈ వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. చిన్నారులు నిత్యం టీవీ ఎదుట కూర్చొని చిరుతిండి తినడం, ఎలాంటి వ్యాయామం లేకుండా ఉండటం వల్ల ఊబకాయం పెరిగి అది డయాబెటిస్కు దారి తీస్తోంది. దీంతో శరీరం అధికంగా లావు పెరుగుతుంది. చిన్న వయసులో ఎత్తు కంటే అధికంగా బరువు పెరగడం వల్ల రాత్రి నిద్రించే సమయంలో కొన నాలుక అడ్డుపడి నిద్ర పట్టక మానసిక ఒత్తిడికి గురవుతారు. నిర్లక్ష్యంతో పెరుగుతున్న నష్టం.. చాలా మంది బీపీ, షుగర్ బాధితులు తాము వాటి బారిన పడిన సంగతే గుర్తించడం లేదు. నిర్లక్ష్య ధోరణి కారణంగా రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, తగిన వ్యాయామం లేకపోవడం, సమయానికి తినకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన జనాభాలో 79,199 మంది బీపీ, 37,902 మంది షుగర్తో బాధపడుతున్నట్లు తేలింది. చిన్నారులూ.. బాధితులే ఇటీవల కాలంలో పిల్లల్లోనూ డయాబెటిస్ బయట పడటం ఆందోళన కలిగిస్తోంది. జన్యుపరమైన లో పంతో పుట్టిన సమయంలోనే ఎక్కువగా పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. ఇటీవల పదేళ్లలోపు పిల్లలూ ఈ వ్యాధి బారినపడుతున్నా రు. త్వరగా అలసిపోవడంతోపాటు వెనువెంటనే ఆకలిగా అనిపించడంతో బాధిత పిల్లలు చదువుతో పాటు ఇతర ఆటలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. న్యూస్రీల్ 30 ఏళ్లు దాటగానే ముసురుకుంటున్న వ్యాధులు ఎన్సీడీ స్కీన్రింగ్తో గుర్తింపు.. మారుతున్న జీవనశైలే కారణమంటున్న వైద్యులు ఒత్తిడి, తీరిక లేని శ్రమతో మానసిక స్థితిపై ప్రభావంనియంత్రణే మార్గం రక్తపోటు, మధుమేహం ఒక్కసారి సోకితే నియంత్రణ తప్ప నివారణకు అవకాశం ఉండదు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద నాన్ కమ్యూనికేబుల్ డీసీస్ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించింది. 30 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం గురయ్యే వారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్యసేవలు అందించడం.. తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలో పలు విడతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్ బాధితులను గుర్తించగా, సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. -
కులాంతరం.. అందని ప్రోత్సాహం
● నర్సాపూర్(జి) మండలానికి చెందిన ఓ వ్యక్తి 2022, మార్చి 23న కులాంతర వివాహం చేసుకున్నారు. అదే ఏడాది మే 24న ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. మూడేళ్లు దాటినా ప్రోత్సాహం అందలేదు. అధికారులను అడిగితే త్వరలోనే ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని చెబుతున్నారు. ● మామడ మండలానికి చెందిన రవి 2024లో కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోత్సాహం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. తెల్లవారుజామున చలి ప్రభావం ఉంటుంది. రంజాన్కు ఏర్పాట్లు చేయాలినిర్మల్చైన్గేట్: రంజాన్ మాసం నేపథ్యంలో జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ముస్లింలు ఉపవాసం ఉండే సమయాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ జానకీషర్మిలతో కలిసి అధికారులు, ముస్లిం మత పెద్దలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మార్చి 2 నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మసీదుల దగ్గర నిరంతరం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముస్లింల సహాయార్థం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. రంజాన్ పండుగ రోజు ఈద్గాలలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలు అదనపు సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, జాదవ్ కృష్ణ, రాజేశ్కుమార్, ముస్లిం మత పెద్దలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● సీఎస్ శాంతికుమారినిర్మల్ చైన్గేట్: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో బీఆర్.అంబేద్కర్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య, పరీక్ష కేంద్రాల సంఖ్య, పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష విధులు నిర్వహించే అధికారులందరికీ శిక్షణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించా రు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ రుసుంలో 25 శాతం రాయితీని కల్పించినందున మార్చి 31లోగా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్ష చేశారు. మార్చి 5 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. -
● 2021–22 నుంచి పెండింగ్లోనే దరఖాస్తులు ● ఏళ్లుగా సాయం కోసం ఎదురుచూస్తున్న జంటలు
నిర్మల్చైన్గేట్:కుల రహిత సమాజాన్ని నిర్మించి అంతరాలను చెరిపి వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు కొన్నేళ్లుగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే, జంటలో ఒకరు ఎస్సీ అయి ఉండాలనేది నిబంధన. ప్రస్తుత సమాజంలో పలువురు తల్లిదండ్రులు కులాంతర వివాహాలకు అడ్డుచెప్పడం లేదు. అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే పెద్దలను ఒప్పించి కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకున్నా పోలీసులను ఆశ్రయించి ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్న కులాంతర వివాహం చేసుకున్న వారిని ప్రోత్సహించేలా ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం ఏళ్లుగా పెండింగ్ ఉంది. రూ.2.50 లక్షలకు పెంపు... కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ఇస్తు న్న ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో రూ.50 వేలు ఉండగా 2019లో దానిని రూ.2.50 లక్షలకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సమాజంలో కులాంతర వివాహలపై అవగాహన పెరిగింది. పెళ్లిళ్లు చేసుకున్న జంటలను కొన్ని కుటుంబాలు తమతో కలుపుకుపోతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకం సకాలంలో అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అవసరమైన ధ్రువపత్రాలు.. వేర్వేరు కులాలకు చెందిన సీ్త్ర, పురుషులు వివాహం చేసుకుంటే.. పెళ్లికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారుల విచారణలో అర్హులుగా గుర్తిస్తే ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. తర్వాత సర్కారు నిధులు మంజూరు చేస్తుంది. వివాహం చేసుకున్న జంట మూడు ఫొటోలు, కుల ధ్రువపత్రాలు, వయసు ధ్రువీకరణకు విద్యాసంస్థలు ఇచ్చిన టీసీలు, మార్కుల మెమో, వివాహం చేయించిన అధికారి ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన మ్యారేజ్ సర్టిఫికెట్, వివాహం చేసుకున్న జంట కలిసి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు, ఆదాయ ధ్రువపత్రం, ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెండింగ్లో 37 దరఖాస్తులు.. ఈ పథకం కింద ప్రభుత్వాలు ఎస్సీలకు రూ.2.50 లక్షలు అందిస్తున్నాయి. 2011 వరకు రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా.. 2012లో రూ.50 వేలకు పెంచారు. ప్రస్తుతం రూ.2.50 లక్షలు అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కులాంతర వివాహం చేసుకున్న దంపతుల సంయుక్త ఖాతాలో మూడేళ్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత వడ్డీతో కలిపి రూ.3 లక్షలు అవుతుంది. జిల్లాలో 2019 నుంచి 37 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.15 లక్షలను విడుదల చేయగా ఆరుగురు దరఖాస్తుదారులకు అందించారు. ఇంకా 37 అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ‘కల్యాణలక్ష్మి’ వైపు మొగ్గు.. జిల్లాలో కులాంతర వివాహాలు సాధారణమయ్యాయి. గతంలో ఒకే కులం అయితేనే పెళ్లి జరిపించేవారు. సంబంధాలు కలుపుకునే వారు. ఆ పట్టింపులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అనేక కులాలు ఉన్నప్పటికీ.. అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే చాలు చాలా మంది పెద్దలను ఒప్పించి.. కులాంతర వివాహం చేసుకుంటున్నారు. సకాలంలో ప్రోత్సాహకం అందించకపోవడంతో కులాంతర వివాహం చేసుకున్న జంటలు(పెద్దలు ఒప్పుకున్న వారు) కల్యాణలక్ష్మి పథకం వైపు మొగ్గు చూపుతున్నారు. దరఖాస్తుల వివరాలు ఐదేళ్లలో వచ్చిన దరఖాస్తులు 93 హార్డ్ కాపీ అందజేసిన వారు 82 ఇప్పటివరకు లబ్ధి పొందినవారు 56 పొందిన నగదు రూ.140 కోట్లు ఇంకా లబ్ధిపొందని వారు 37 జమ చేయాల్సిన నగదు రూ.92 లక్షలు పెండింగ్లో ఉన్న సహాయం వివరాలు: ఏడాది దరఖాస్తులు నగదు 2021–22 5 రూ.12.50 లక్షలు 2022–23 7 రూ.17.50 లక్షలు 2023–24 7 రూ.17.50 లక్షలు 2024–25 18 రూ.45 లక్షలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.. కులాంతర వివాహం చేసుకున్న జంటలు ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు ఇస్తే స్వీకరిస్తున్నాం. వీటిని పరిశీలించి సాయం మంజూరుపై సమాచారం కూడా చేరవేస్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పెండింగ్లో ఉన్నజంటల ఖాతాల్లో జమ చేస్తాం. – రాజేశ్వర్గౌడ్, ఎస్సీ సంక్షేమ అధికారి -
కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ
● మూడు దశల్లో నిర్వహణ ● సద్వినియోగం చేసుకుంటే మేలునిర్మల్ రూరల్: డీఎస్సీ–2024లో నియమితులైన ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 3 దశల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు శిక్షణ అందించనున్నారు. నూతనంగా నియమితులైన ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలకు శిక్షణ అందించనున్నారు. మూడు రోజులు తరగతులు.. ఎస్టీటీ ఉపాధ్యాయులకు ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు మార్చి 4, 5, 6 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, పీఈటీలకు మార్చి 10, 11, 12 తేదీల్లో హైదరాబాదులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు శిక్షణ ఇచ్చేందుకు డీఆర్పీలను విద్యాశాఖ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. శిక్షణ అంశాలు ఇవీ.. ఉపాధ్యాయులకు వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాల సద్వినియోగం, తరగతిగది నిర్వహణ, విద్య అభ్యసన ప్రమాణాల పెంపు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, విధానాలు, ఐసీటీ, ఐఎఫ్ఎస్సీ, బోధన, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను పగడ్బందీగా అమలు తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి వచ్చిన శిక్షకులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ప్రతీరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. మధ్యాహ్న భోజనం అందజేస్తారు. నిధులు విడుదల.. జిల్లాలో 2024 డీఎస్సీ ద్వారా మొత్తం 288 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఇందులో అత్యధికంగా ఎస్జీటీలు 204 మంది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు 57, భాషా పండితులు 03, పీఈటీలు 04 మంది నియామకమయ్యారు. అయితే శుక్రవారం నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయునికి రూ.775 చొప్పున మొత్తం జిల్లాకు రూ.2.23 లక్షలు కేటాయించారు. అదేవిధంగా ఒక్కో కేంద్రానికి అదనంగా రూ.వెయ్యి విడుదలయ్యాయి. ఒక్కో శిక్షణ కేంద్రంలో గరిష్టంగా 40 నుంచి 45 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు అందించే శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి. తరగతుల్లో విద్యార్థులకు బోధించే విధానాన్ని విద్యార్థులతో అవలంబించాల్సిన పద్ధతులను శిక్షకులు నేర్పిస్తారు. డిజిటల్ బోధన, అభ్యసన ప్రమాణాల పెంపు, ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, అవలంబించాల్సిన విధానాలపై వివరిస్తారు. కొత్త ఉపాధ్యాయులకు ఈ శిక్షణ తరగతులు ఎంతో వరం లాంటివి. విద్యార్థుల్లో విద్య ప్రమాణాల పెంపునకు దోహదం చేస్తాయి. – రామారావు, డీఈవోశిక్షణ పొందే ఉపాధ్యాయుల వివరాలు భాషా పండితులు 03 పీఈటీలు 04 ఎస్జీటీలు 204 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 20 స్కూల్ అసిస్టెంట్లు 57 మొత్తం 288