ప్రజలతో మమేకమయ్యాం..
నిర్మల్టౌన్: అప్పట్లో ఎన్నికల ప్రచారం అంటే ఇంటింటికీ తిరిగేవారమని, ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి. అప్పట్లో ఇంటింటికి తిరుగుతూ.. ప్రచారం చేసేవాళ్లం. అప్పట్లో పరిమిత వ్యయంతోనే ప్రజల మద్దతు సంపాధించే వాళ్లం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేసేవాళ్లం. వార్డుల అభివృద్ధి మాకు రాజకీయ గుర్తింపుగా మారేది. ప్రస్తుతం పదవి కంటే ప్రజల అవసరాలే ముఖ్యం .నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటేనే రాజకీయాల్లో నిలదొక్కుకుంటాడు. కొత్తగా రాజకీయాల్లో వచ్చేవారు స్నేహభావంతో ముందుకు వెళ్లాలి.


